శుభలేఖలు పంచి వస్తూ.. అనంతలోకాలకు | - | Sakshi
Sakshi News home page

శుభలేఖలు పంచి వస్తూ.. అనంతలోకాలకు

Published Fri, Apr 11 2025 12:40 AM | Last Updated on Fri, Apr 11 2025 12:40 AM

శుభలేఖలు పంచి వస్తూ.. అనంతలోకాలకు

శుభలేఖలు పంచి వస్తూ.. అనంతలోకాలకు

రోడ్డు ప్రమాదంలో బావ, బావమరిది మృతి

దెందులూరు: మండలంలోని కొమిరేపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ సంఘటనకు సంబంధించి దెందులూరు ఎస్సై ఆర్‌.శివాజీ తెలిపిన వివరాల ప్రకారం అనంతపల్లి గ్రామానికి చెందిన గురుమిల్లి అప్పారావు, నిడమర్రు గ్రామానికి చెందిన పతివాడ బాపన్న వరుసకు బావ, బావమరిదిలు. వీరు బాపన్న కుమారుడు వివాహ శుభలేఖలు ఇవ్వడానికి బైక్‌పై దెందులూరు వచ్చారు. శుభలేఖలు ఇచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా కొమిరేపల్లి సమీపంలో వెనుక నుంచి వస్తున్న ఓ కారు వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గురుమిల్లి అప్పారావు(47) అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడ్డ పతివాడ బాపన్న(50) ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శివాజీ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement