సమష్టిగా కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

సమష్టిగా కృషి చేయాలి

Apr 16 2025 12:55 AM | Updated on Apr 16 2025 12:55 AM

సమష్టిగా కృషి చేయాలి

సమష్టిగా కృషి చేయాలి

ఏలూరు టౌన్‌: ఏలూరు జిల్లాలో నవోదయం 2.0 కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేసే దిశగా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ శాఖ అధికారులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ బీ.శ్రీలత అన్నారు. మంగళవారం ఏలూరులోని ఎకై ్సజ్‌ శాఖ కార్యాలయంలో జిల్లాలోని ఎకై ్సజ్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్‌ శ్రీలత మాట్లాడుతూ జిల్లాలో సంపూర్ణంగా నాటుసారాను నిరోధిస్తూ నాటుసారా రహిత జిల్లాగా మార్చివేసేలా చర్యలు చేపట్టాలన్నారు. తొలుత పెండింగ్‌లోని కేసులపై విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్‌ దాఖలు చేయాలని ఆదేశించారు. ఏలూరు జిల్లాలో అక్రమ మద్యం, నాటుసారా తయారీ, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు చేపడతామని చెప్పారు. కేసులు పెట్టినా తీరు మార్చుకోకుండా ఇష్టారాజ్యంగా నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్‌ ప్రయోగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ కేవీఎం ప్రభుకుమార్‌, ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ ఏ.అవులయ్య, ఏఈ ఎస్‌.అజయ్‌కుమార్‌ సింగ్‌, పాండురంగారావు, ఏలూరు జిల్లాలోని 7 ఎకై ్సజ్‌ సర్కిళ్ళ సీఐలు, ఎస్సైలు ఉన్నారు.

సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ శ్రీలత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement