Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Social media Reaction For Putin Reactions At Alaska Talks Viral1
ఇవే ప్రశ్నలు వీళ్లిద్దరినీ కాకుండా.. ఆయన్ని అడిగే దమ్ముందా?

ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగింది. శాంతి చర్చల్లో ముందడుగు పడకపోతే కఠినంగా వ్యవహరిస్తానంటూ రష్యాపై రంకెలు వేసిన ట్రంప్‌.. అలస్కా చర్చల తర్వాత కాస్త మెత్తబడ్డాడు. ఉక్రెయిన్‌ శాంతి చర్చలు అర్ధరహితంగా ముగిసినట్లు వాళ్ల ప్రకటనలను బట్టి స్పష్టమవుతోంది. ఈ క్రమంలో.. ట్రంప్‌ ఇంకా అలస్కాలో ఉండగానే పుతిన్‌ అక్కడి నుంచి నిష్క్రమించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే..అలస్కాలో జర్నలిస్టులు సంధించిన ప్రశ్నలను ఇరు దేశాల అధినేతలు స్వీకరించలేదు. తాము చెప్పాలనుకున్నది చెప్పి.. తలోదారి వెళ్లిపోయారు. యాంకరేజ్‌ విమానాశ్రయంలో, అలాగే చర్చలు ప్రారంభం కావడానికి ముందు పీస్‌ రూమ్‌లోనూ ఇరు దేశాధినేతలు మీడియా ముందు ఆసీనులయ్యారు. ఆ సమయంలో ఉక్రెయిన్‌ కాల్పుల విరమణ, యుద్ధంలో సాధారణ పౌరులు మరణించడం లాంటి ప్రశ్నలు పుతిన్‌కు ఎదురయ్యాయి. ‘‘సాధారణ పౌరుల్ని చంపడం ఇంకెప్పుడు ఆపుతారు?’’ అంటూ ఓ జర్నలిస్ట్‌ ప్రశ్నించగా.. దానికి పుతిన్‌ తనకేమీ వినబడడం లేదన్నట్లు సైగ చేసి చూపించారు. అదే సమయంలో ‘‘ట్రంప్‌ మిమ్మల్ని మాత్రమే ఎందుకు నమ్ముతున్నారు?’’ అని మరో విలేఖరి ప్రశ్నించగా.. జర్నలిస్టుల గోలతో పుతిన్‌ ఇచ్చిన వివరణ వినిపించనట్లే కనిపించింది. పుతిన్‌పై అంతర్జాతీయ నేరస్థుల కోర్టు కేసు ఉన్నప్పటికీ.. అమెరికా భూభాగంలోకి ఎందుకు ఆహ్వానించారు?. ఉక్రెయిన్‌ను నేరుగా భాగం కానీయకుండా కాల్పులవిరమణ డీల్‌ కుదర్చాలని ట్రంప్‌ భావిస్తున్నారా?. పుతిన్ ఎలాంటి రాయితీలు ఇవ్వవచ్చు? ట్రంప్ ఏమి అంగీకరించవచ్చు? ఇది యుద్ధ విరామానికి దారి తీస్తుందా? లేదంటే రాజకీయ నాటకం మాత్రమేనా? అని ప్రశ్నలు గుప్పించారు. అయితే వీటిలో వేటికి సమాధానాలు రాలేదు. దీంతో.. సోషల్‌ మీడియా సదరు జర్నలిస్టుల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది. ఇవే ప్రశ్నలను గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహును అడిగే దమ్ముందా? అని నిలదీస్తోంది. ‘‘2023 అక్టోబర్‌ 7వ తేదీన గాజా యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్‌ దాడులతో ఇప్పటిదాకా 60 వేలమందికిపైనే మరణించారు. అందులో 70 శాతం మహిళలు, చిన్నారులే ఉన్నారని నివేదికలు గణాంకాలతో సహా చెబుతున్నాయి. అయితే ఈ మరణాలపై నెతన్యాహు ఏనాడూ స్పందించగా పోగా.. కనీసం విచారం కూడా ‍వ్యక్తం చేసింది లేదు. పైగా ఎంతసేపు హమాస్‌ అంతమే శాంతికి మార్గం అంటూ చెబుతూ వస్తున్నారు. దీనికి తోడు మానవతా సాయం అందకుండా చేశారనే ఆరోపణలు ఆయపై ఉన్నాయి. ఈ క్రమంలో యుద్ధ నేరాల కింద అంతర్జాతీయ న్యాయస్థానం నెతన్యాహుపై వారెంట్‌ సైతం జారీ చేసింది.ఈ పరిణామాలపై ఇటు ఇజ్రాయెల్‌.. అటు అమెరికా జర్నలిస్టులెవరూ ఆయన్ని ప్రశ్నించే సాహసం చేయలేకపోయారు. మరోవైపు.. రెండుసార్లు నెతన్యాహు అమెరికా పర్యటనకు వచ్చారు. ఆ సమయంలోనూ జర్నలిస్టులెవరూ.. గాజా పౌరుల మరణాల గురించి ఎందుకు నిలదీయలేదు?’’ అని సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. ఇదిలా ఉంటే.. 2022 ఫిబ్రవరిలో మొదలైన ఉక్రెయిన్‌ రష్యా యుద్ధంలో లక్షల మంది మరణించారు. మూడున్నరేళ్ల యుద్ధానికి పుల్‌స్టాప్‌ పెట్టే ఉద్దేశంలో పర్సూయింగ్‌ పీస్‌ పేరిట అలస్కా చర్చల్లో పాల్గొన్నారు. ట్రంప్‌-పుతిన్‌లు ఐదారుగంటలు అలస్కాలోనే గడపగా.. రెండున్నర గంటలపాటు చర్చలు జరిగాయి. అయితే.. ఉక్రెయిన్‌ కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు పట్టుబట్టగా.. అందుకు రష్యా అధినేత ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది. Vladimir Putin’s reaction was nothing short of remarkable—reporters shouted, but his expression told its own story. pic.twitter.com/07vkASuJIc— Tarique Hussain (@Tarique18386095) August 15, 2025భేటీకి ముందు జర్నలిస్టుల ప్రశ్నలకు స్పందించని ఇరువురు నేతలు.. సంయుక్తంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లోనూ మీడియా ప్రతినిధులను ప్రశ్నలకు అనుమతించలేదు. మరోవైపు.. అలస్కా చర్చల సారాంశం కోసం రష్యా అధికారుల బృందాన్ని పలువురు జర్నలిస్టులు కలిసే ప్రయత్నమూ విఫలమైంది. అదే సమయంలో.. ట్రంప్‌ తన అనుకూల రిపోర్టర్లతో పుతిన్‌పై ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేశారని, దాని నుంచి పుతిన్‌ భలేగా తప్పించుకున్నారనే వాదన నెట్టింట నడుస్తోంది... అలస్కాలో ట్రంప్‌ దౌత్యం విఫలమేనని కొన్ని అమెరికన్‌ మీడియా చానెల్స్‌ ప్రముఖంగా చర్చిస్తున్నాయి. కానీ, ట్రంప్‌ మాత్రం ఎంతో కొంత పురోగతి సాధించాం అని చెబుతుండడం గమనార్హం. ‘‘పుతిన్‌ చాలా టఫ్‌, స్ట్రాంగ్‌ ఫెల్లో. ఇక దారికి రావాల్సింది జెలెన్‌స్కీనే’ అన్నట్లు ఫ్యాక్స్‌ ఇంటర్వ్యూలో ట్రంప్‌ మాట్లాడారు. ఇంకోవైపు.. అలస్కాలో ట్రంప్‌-పుతిన్‌ భేటీలో రష్యా అనుకూల ఏకపక్ష డీల్‌ కుదరనందుకు సంతోషమంటూ ఉక్రెయిన్‌​ ఎద్దేవా ప్రకటన విడుదల చేసింది.

Kommineni Srinivasa Rao Comments On Vontimitta ZPTC ByElection 2
మైమరచిన పచ్చమీడియా!

1983లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలలో విజయం సాధించినప్పుడు ఆ పార్టీ అభిమానులు కొంతమంది కనిపించిన ఈనాడు జర్నలిస్టులందరికీ పూలదండలు వేసి సత్కరించారు. ఈనాడు పత్రిక ఆఫీస్ గేటుకు కూడా పూలమాలలు కట్టి వెళ్లేవారు. ఇదెక్కడి గొడవ! ఎంత టీడీపీకి సపోర్టు చేసినా, ఇలా మెడలో బొమికలు వేసుకున్నట్లుగా పరిస్థితి ఏర్పడిందేమిటా అని కొందరు సీనియర్ జర్నలిస్టులు బాధపడేవారు. సరిగ్గా 42 ఏళ్ల తర్వాత అంతకన్నా ఘోరమైన పరిస్థితి ఏపీలో ఏర్పడడం అత్యంత విచారకరం. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నకలలో టీడీపీకి చాలా కష్టపడి గెలిపించిన కొంతమంది పోలీసు అధికారులకు, జిల్లా ఎన్నికల యంత్రాంగ ముఖ్యులకు టీడీపీ నేతలు సన్మానం చేసి ఉండాలి. అలాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ మద్దతు మీడియా యజమానులకు, జర్నలిస్టులకు కూడా సత్కారాలు జరిగి ఉండాలి. ఆ టీడీపీ మీడియా కార్యాలయాలలో స్వీట్స్ కూడా పంచుకుని ఉంటారు. ఇవి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలైతే అదో రకం. కాని రెండు జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో రిగ్గింగ్ ద్వారా గెలవడంపై కూడా ఇంత సంబరపడాలా అని టీడీపీ క్యాడరే విస్తుపోతోంది. ఎందుకంటే గెలిచింది టీడీపీ కాదని, కొంతమంది పచ్చ చొక్కా వేసుకున్న పోలీస్ అధికారులన్నది ప్రజలందరికి తెలిసిన సత్యం. టీడీపీ అధినాయకత్వం, పోలీస్ యంత్రాంగం, ఎన్నికల నిర్వహణ అధికారులు, ఎన్నికల కమిషన్, టీడీపీకి మద్దతిచ్చే మీడియా .. ఇలా అందరికి తెలుసు వాస్తవం ఏమిటో! అయినా వారు జనాన్ని మోసం చేయడానికి తమ వంతు కృషి చేశారనిపిస్తుంది. ఎల్లో మీడియా నిస్సిగ్గుగా వైఎస్సార్‌సీపీ ఓడినట్లు భ్రమ కలిగించడానికి నానా పాట్లు పడ్డారు. వైకాపాకు ఘోర పరాభవం అంటూ ఈనాడు మీడియా శీర్షిక పెట్టింది. నిజానికి పరాభవం జరిగింది ప్రజాస్వామ్యానికి. అయినా ఆత్మవంచన చేసుకుని వార్తలు ఇచ్చారు. అందులో పులివెందులను, వైఎస్ కుటుంబాన్ని ఒక భూతంగా చూపించడానికి ఆ మీడియా చేసిన ప్రయత్నం గమనిస్తే సంబంధిత జర్నలిస్టులపై అసహ్యం కలుగుతుంది. మరో విధగా చూస్తే ఇంత కట్టుబానిసలుగా మారారా అని జాలి కలుగుతుంది. ముప్పై ఏళ్లలో తొలిసారి ఓటు వేశానని ఎవరో ఒకరు స్లిప్ వేశారట. అది అసత్యమే అయినా దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు అందరూ ప్రచారం చేశారు. ఈ ముప్పై ఏళ్లలో సగం కాలం ఆయనే పాలన చేశారు. దానిని బట్టి ఆయన సమర్థంగా పరిపాలన చేయలేదని ఒప్పుకుంటున్నారా? ఏ నియోజకవర్గంలో అయినా కొన్ని సమస్యలు ఉంటే ఉండవచ్చు. కాని పులివెందులలో రాక్షసులు ఉంటారన్నట్లుగా ప్రచారం చేసి ఒక ప్రాంత ప్రజలను అవమానించడానికి టీడీపీతోపాటు ఈ మీడియా వెనుకాడడం లేదనిపిస్తుంది. ఆ మాటకు వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటకలకు చెందిన వేలాది మందిని ఓటర్లుగా చేర్పించి దొంగ ఓట్లు వేయిస్తుంటారని చెబుతారు. గతంలో అక్కడ ఆయనకు ప్రత్యర్ధిగా పోటీచేసిన చంద్రమౌళి అనే దివంగత రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి ఆ బోగస్ ఓట్లను తొలగించడానికి ఎంత ప్రయత్నించినా, సాధ్యపడలేదని అనేవారు. దాని గురించి ఎన్నడైనా ఈ మీడియా ఒక్క వార్త రాసిందా? కొన్ని దశాబ్దాలుగా పులివెందుల ప్రశాంతంగా ఉంటోందని, చాలావరకు ఎవరి ఓటు వారు వేసుకునే పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు. అలాంటిది మళ్లీ ఆ ప్రాంతంలో ఫ్యాక్షనిజం వేళ్లూనుకునేలా ప్రభుత్వం, పోలీసులే ప్రయత్నించడం ఎంత దారుణం? స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకోండి అని ఒకప్పుడు పోలీసులు ప్రజలకు చెప్పేవారు. ర్యాలీలు తీయించేవారు. అలాంటిది ఓటు వేయడానికి వచ్చిన వారిని ఓటు వేయనివ్వకుండా చేసిన గొప్ప పోలీస్ యంత్రాంగాన్ని ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలోనే చూస్తున్నాం. చివరికి ప్రజలు తమ ఓటు తమను వేసుకోనివ్వండి అని పోలీసుల కాళ్లు పట్టుకున్న ఘటన కూడా దేశంలో ఎక్కడా జరిగి ఉండదు. ఇది కూడా గొప్ప విషయమే అని పచ్చ మీడియా ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది. అందుకే ఈ మీడియా మురికి మీడియాగా మారిందన్న విమర్శలకు గురి అవుతోంది. పోలింగ్ బూత్ లను మార్చేయడం, వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను తరిమేయడం, పొరుగున ఉన్న జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల నుంచి టీడీపీ, బీజేపీ నేతలు తమ కార్యకర్తలను తరలించి దొంగ ఓట్లు వేయించడం, వైఎస్సార్‌సీపీ వారిపై దాడులకు తెగపడడం వంటివి చూస్తే ప్రభుత్వమే ప్రజాస్వామ్యానికి పాతర వేసినట్లనిపిస్తుంది. అలాంటి వారికి అండగా నిలబడ్డ పోలీస్ అధికారులకు టీడీపీ నాయకత్వం ఎంతగా సన్మానించినా తప్పు ఉండకపోవచ్చు.స్వయంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ బూత్ పరిశీలన సమయంలోనే జమ్మలమడుగు నుంచి వచ్చిన దొంగ ఓటర్లు దర్జాగా ఓటు వేసుకుంటున్నారంటే అధికార యంత్రాంగం ఎంత బాగా పని చేసింది తెలిసిపోతుంది. దీనిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్ ఫోటోలతోసహా చూపించడంతో కలెక్టర్ తన సోషల్ మీడియా అక్కౌంట్ నుంచి ఆ పోస్టును తొలగించుకున్నారే కాని, అలా దొంగ ఓట్లు వేసిన వారిపై చర్య తీసుకుంటున్నట్లు ప్రకటించలేదే. ఇలాంటి అధికార యంత్రాంగానికి కూడా టీడీపీ నేతలు రుణపడి ఉండవచ్చు. వైఎస్సార్‌సీపీ వారి ఎన్నికల ప్రచారాన్ని పత్తాపారం అంటూ పోల్చి, టీడీపీ వారి దౌర్జన్యాలకు అండగా నిలబడ్డ పోలీస్ అధికారులను బహుశా టీడీపీ అధినాయకత్వం శహభాష్ అని మెచ్చుకుని ఉండాలి.ఇలాంటి వారందరికి డబుల్ ప్రమోషన్ లు కూడా వస్తాయోమే చూడాలని టీడీపీ నేతలే కొందరు చమత్కరించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ దొంగ ఓట్లు వేయించిన నేతలు తెలివితక్కువగా వ్యవహరించారని టీడీపీ నాయకత్వ ఫీల్ అవుతోందట. వైఎస్సార్‌సీపీకి, వైఎస్ జగన్ కు బలమైన పులివెందుల మండలంలో మరీ ఆ పార్టీకి డిపాజిట్ రాకుండా ఓట్లు రిగ్ చేయడం వల్ల ఫలితాలను ప్రజలు ఎవరూ నమ్మని పరిస్థితి ఏర్పడిందని టీడీపీ అధినాయత్వం అసహనం వ్యక్తం చేసిందట. మంచి మెజార్టీతో గెలిచేలా రిగ్గింగ్ చేయండని చెబితే వీరు మితిమీరిన ఉత్సాహంతో చేసిన ఈ పని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి అప్రతిష్ట వచ్చిందని భావించి ఉండాలి. రిగ్గింగ్ చేసేటప్పుడు వైఎస్సార్‌సీపీకి కూడా గణనీయంగా ఓట్లు వేసి ఉంటే ప్రజలు నిజంగానే వైఎస్సార్‌సీపీ ఓడిపోయిందేమోలే అనుకునేవారని, అలా చేయకపోవడంతో టీడీపీ అసలు రంగు బయట పడిపోయిందని ఆ పార్టీ నేతలు కొంతమంది వాపోతున్నారు. వైఎస్సార్‌సీపీకి దిమ్మతిరిగే ఫలితం అని మరో టీడీపీ మీడియా రాసింది. అవును..అధికార యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుని,అరాచకం చేస్తే వైఎస్సార్‌సీపీకి కాదు దిమ్మతిరిగేది.. రాష్ట్ర ప్రజలకు.ఇంత అధ్వాన్నంగా పాలన సాగుతోందా అన్న విషయం ప్రజలందరికి అర్థమైపోయింది. టీడీపీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివాటికి జగన్‌పై ద్వేషం ఉంటే ఉండవచ్చు. కాని ఆయనపై కోపంతో ఈ మీడియా సంస్థల అధినేతలు తమ దుస్తులు తామే ఊడదీసుకుని నగ్నంగా బజారులో నిలబడి నవ్వులపాలవుతున్న సంగతిని విస్మరిస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని విషయాలు ప్రస్తావించుకోవాలి. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు వాటి పని అవి చేయకపోతే ఎంత అనర్ధం జరుగుతుందో, ప్రజలలో ఎంత అపనమ్మకం ఏర్పడుతుందో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు చాటి చెప్పాయి.ప్రభుత్వ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ, రాష్ట్ర ఎన్నికల కమిషన్, పోలీస్ వ్యవస్థ, ఒక వర్గం మీడియా వ్యవస్థ అన్ని కుమ్మక్కై ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి. ఈ పరిస్థితి నుంచి కాపాడుతుందని భావించిన న్యాయ వ్యవస్థ కూడా అలా చేయలేకపోయిందన్న బాధ చాలా మందిలో ఉంది.ప్రభుత్వం నిజాయితీగా ఎన్నికలు జరిపించి ఉంటే ప్రజలలో తమ ప్రభుత్వం పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకునే అవకాశం వచ్చేది.అయినా బుల్‌ డోజ్ చేసి తమ ఎల్లో మీడియా మద్దతుతో ఏమి చేసినా జనం నమ్ముతారులే అనుకుంటే అది భ్రమే అవుతుంది. గతంలో నంద్యాల ఉప ఎన్నికలో సైతం ఇలాగే చంద్రబాబు అరాచాకాలు చేయించి గెలిచారు. కాని సాధారణ ఎన్నికలలో టీడీపీ అంతకు రెట్టింపు ఓట్ల తేడాతో ఓడిపోయింది. చంద్రబాబు పాత్రతో పాటు ఆయన కుమారుడు మంత్రి లోకేశ్‌ ప్రమేయం ఈ ఎన్నికలలో ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రజాస్వామ్యం గెలిచిందని ఆయన సంబరపడిపోతే అది ఆయన అమాయకత్వమే అవుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దీనికి వంతపాడి ఆయన ఎంత దీన పరిస్థితిలో ఉంది తెలియచేసినట్లయింది. ఎన్నికల కమిషన్ ప్రభుత్వం కోరిన వెంటనే కేవలం ఈ రెండిటికే ఎన్నికలు పెట్టడం, అక్కడ ఎన్ని అక్రమాలు జరుగుతున్నా కళ్లుమూసుకుని కూర్చోవడం, కనీసం అధికార యంత్రాంగాన్ని మందలిచే ధైర్యం చేయకపోవడం వల్ల, ప్రభుత్వంలోని వారెవరైనా ఎన్నికల కమిషనర్‌ను బెదిరించారా అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. పోలీస్, ఇతర ఎన్నికల యంత్రాంగం అసలు ఓటర్లకు కాకుండా నకిలీ ఓటర్లకు ఓట్లు వేసే అవకాశం కల్పించడం ద్వారా తమ హోదాకు తామే అవమానం చేసుకున్నారు. వైఎస్సార్‌సీపీ వారిని రకరకాలుగా కట్టడి చేయడం, టీడీపీ వారిని ఇష్టారాజ్యంగా తిరిగేలా స్వేచ్చనివ్వడం ద్వారా, పోలీస్ యంత్రాంగం ఏపీలో ఎంత దారుణంగా పనిచేస్తున్నది లోకానికి చాటి చెప్పినట్లయింది. గౌరవ హైకోర్టు ఈ అక్రమాలు కొన్నిటిని గుర్తించినట్లు వ్యాఖ్యలు చేసినట్లు అనిపించినా, అంతిమంగా సాంకేతిక కారణాలతో జోక్యం చేసుకోలేమని చెప్పడం బాధాకరమే అనిపిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి హైకోర్టు మరింత చొరవ తీసుకుని ఉంటే దేశానికే ఒక సందేశం ఇచ్చినట్లయ్యేదేమో! ఏమైతేనేమి అన్ని వ్యవస్థలు కలిసి ప్రజాస్వామ్యాన్ని ఓటమికి కారణం అయ్యాయనుకోవాలి.ఇది దేశానికి మంచిదా?కాదా?అన్నది ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Sri Sathya Sai District Dharmavaram Man Arrest By NIA Amid Terror Links3
ఉగ్ర లింకులతో ఉలిక్కిపడ్డ ధర్మవరం

సాక్షి, అనంతపురం: సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్ర కదలికలు ఒక్కసారిగా కలకలం రేపాయి. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) స్థానికంగా ఓ ఇంట్లో సోదాలు నిర్వహించడంతో పట్టణం ఉలిక్కిపడింది. ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారణ జరుపుతున్నారు. ధర్మవరంలోని కోట ప్రాంతంలో నివాసం ఉంటున్న నూర్‌(40).. స్థానికంగా ఓ హోటల్‌లో వంట మనిషిగా పని చేస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా అతని కదలికలు అనుమానంగా ఉండ సాగాయి. ఉగ్రవాదులతో అతను వాట్సాప్‌ కాల్‌ మాట్లాడినట్లు ఎన్‌ఐఏ అధికారులు ఓ అంచనాకి వచ్చారు. ఈ క్రమంలో అతని సోషల్‌ మీడియా అకౌంట్లనూ తనిఖీ చేశారు. వీటి ఆధారంగా.. ఉగ్రవాదులతో సంబంధాలు ఉండొచ్చనే అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతేకాదు.. నూర్‌ నివాసంలోనూ సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ అధికారులు.. 16 సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అతన్ని రహస్య ప్రదేశంలో అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

Today Gold and Silver 16th August 20254
తగ్గుతున్న బంగారం ధరలు: వరుసగా ఎనిమిదో రోజు ఇలా

బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ రోజు (శనివారం) కూడా గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 60 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలలో మార్పులు జరిగాయి. పసిడి ధరలు తగ్గుతుంటే.. వెండి మాత్రం పెరుగుతూనే ఉంది. ఈ కథనంలో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Sanju Samson Hits 50 In Friendly Match Good Signs Before Asia Cup 20255
సంజూ శాంసన్‌ మెరుపు ఇన్నింగ్స్‌.. టీమిండియా సెలక్టర్లకు వార్నింగ్‌!

ఆసియా కప్‌-2025 (Asia Cup) టోర్నమెంట్‌కు ముందు టీమిండియా స్టార్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. మెరుపు హాఫ్‌ సెంచరీతో రాణించి.. సెలక్టర్లకు తానూ రేసులో ఉన్నానంటూ బ్యాట్‌ ద్వారానే సందేశం ఇచ్చాడు. కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఆసియా కప్‌ టోర్నీకి భారత్‌ ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుతో ఒప్పందం దృష్ట్యా తటస్థ వేదికైన యూఏఈలో మ్యాచ్‌లు జరుగనున్నాయి.సెలక్టర్లకు సవాల్‌అయితే, ఈ మెగా ఈవెంట్‌కు ఎంపిక చేసే భారత జట్టుకు సంజూ శాంసన్‌ను ఎంపిక చేస్తారా? లేదంటే.. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, శుబ్‌మన్‌ గిల్‌లను పిలిపించి.. ఈ కేరళ బ్యాటర్‌పై వేటు వేస్తారా? అన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి సందేహాల నడుమ సంజూ శాంసన్‌ తనదైన శైలిలో సెలక్టర్లకు సవాల్‌ విసిరాడు.ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ vs సెక్రటరీ ఎలెవన్‌కాగా కేరళ క్రికెట్‌ లీగ్‌ సీజన్‌-2 సెప్టెంబరులో ప్రారంభం కానుంది. అయితే, ఈ టోర్నీకి ముందు గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో కేరళ క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌- కేరళ క్రికెట్‌ అసోసియేషన్‌ సెక్రెటరీ ఎలెవన్‌ మధ్య శుక్రవారం ఫ్రెండ్లీ మ్యాచ్‌ జరిగింది.గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరిగిన ఈ మ్యాచ్‌లో సంజూ సెక్రటరీ ఎలెవన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇక ఈ పోరులో సచిన్‌ బేబీ కెప్టెన్సీలోని ప్రెసిడెంట్‌ ఎలెవన్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది.రోహన్‌ కన్నుమ్మల్‌ (29 బంతుల్లో 60), అభిజిత్‌ ప్రవీణ్‌ (18 బంతుల్లో 47) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడగా.. ప్రెసిడెంట్‌ ఎలెవన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.విష్ణు విధ్వంసం.. సంజూ మెరుపు హాఫ్‌ సెంచరీఇక లక్ష్య ఛేదనలో విష్ణు వినోద్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ (29 బంతుల్లో 69)తో విరుచుకుపడగా.. సంజూ శాంసన్‌ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మెరుపు హాఫ్‌ సెంచరీ సాధించాడు. 36 బంతుల్లో 54 పరుగులతో ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అలరించాడు. ఈ క్రమంలో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే సెక్రటరీ ఎలెవన్‌ లక్ష్యాన్ని ఛేదించి జయభేరి మోగించింది.ఆసియా కప్‌-2025 టోర్నీకి భారత జట్టు ప్రకటనకు సమయం ఆసన్నమైన వేళ సంజూ ఈ మేరకు బ్యాట్‌తో రాణించడం పట్ల అతడి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా సెప్టెంబరు 9- 28 మధ్య యూఏఈ వేదికగా ఆసియా కప్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైన విషయం తెలిసిందే.అత్యధికంగా మూడు శతకాలుకాగా సంజూ అంతర్జాతీయ టీ20లలో ఇప్పటికే మూడు శతకాలు బాదాడు. తద్వారా రోహిత్‌ శర్మ (5), సూర్యకుమార్‌ యాదవ్‌ (4) తర్వాత టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో మొత్తంగా 152కు పైగా స్ట్రైక్‌రేటుతో 861 పరుగులు సాధించాడు.చదవండి: ENG vs SA: వన్డే, టీ20లకు ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన.. ఆ సిరీస్‌కు కెప్టెన్‌గా జేకబ్‌

Trump And Putin Meeting End with No Results6
ట్రంప్‌, పుతిన్‌ మధ్య ముగిసిన భేటీ.. యుద్ధంపై ట్విస్ట్‌!

అలాస్కా: అమెరికాలోని అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మధ్య జరిగిన కీలక భేటీ ముగిసింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీ.. ఉక్రెయిన్‌ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసింది. వీరి భేటీపై ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూసినప్పటికీ అనుకున్న ఫలితం మాత్రం దక్కలేదు. అయితే, వీరి మధ్య మరో సమావేశం రష్యాలో జరగనుందని పుతిన్‌ చివరలో ట్విస్ట్‌ ఇచ్చారు. కీలక సమావేశం అనంతరం ఇద్దరు నేతలు భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. సమావేశంలో అనేక విషయాలు చర్చకు వచ్చాయి. కానీ, యుద్ధానికి సంబంధించిన తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించాం. అయితే, కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్‌పై సంతకం చేసే వరకు ఒప్పందం కుదరనట్టే అవుతుంది. త్వరలో తాను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, యురోపియన్‌ యూనియన్‌ నేతలతో మాట్లాడతానని ట్రంప్‌ తెలిపారు. తాను మళ్లీ పుతిన్‌ను కలుస్తానని చెప్పుకొచ్చారు.#WATCH | Alaska, USA | US President Donald Trump says, "We had a very productive meeting, there were many points that we agreed on. Couple of big ones that we haven't quite gotten there but we made some headway. There's no deal until there's a deal so I will call up NATO in a… pic.twitter.com/mY5t9zkoCT— ANI (@ANI) August 15, 2025ఇదే సమయంలో డీల్‌ పూర్తికావడంపై నిర్ణయం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేతుల్లోనే ఉంది. ఒప్పందం చేసుకోవాలని జెలెన్‌స్కీకి సూచిస్తా. కానీ, వాళ్లు అందుకు నిరాకరించే అవకాశం ఉంది. రష్యా చాలా శక్తిమంతమైన దేశం. పుతిన్‌-జెలెన్‌స్కీల సమావేశం జరుగుతుందని ఆశిస్తున్నా. అందులో నేను కూడా చేరే అవకాశం ఉందన్నారు. పుతిన్‌తో ఏయే విషయాలు చర్చించారు..? ఇంకా మిగిలి ఉన్న అంశాలు ఏంటనే విషయంపై వివరించేందుకు ట్రంప్‌ నిరాకరించారు. #WATCH | Alaska, USA | Russian President Vladimir Putin says, "... We see the strive of the administration and President Trump personally to help facilitate the resolution of the Ukrainian conflict and his strive to get to the crux of the matter to understand this history is… pic.twitter.com/kiOKgw2JBf— ANI (@ANI) August 15, 2025అనంతరం, పుతిన్‌ మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్‌నకు ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయితీగా ఉన్నట్లు తెలిపారు. గతంలో ట్రంప్‌ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్‌తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదని పుతిన్‌ మరో మారు పేర్కొన్నారు. ఈ సమావేశం వివాదానికి ముగింపు పలకడానికి ప్రారంభ స్థానంగా అభివర్ణించారు. ట్రంప్‌తో తనకున్న సంబంధం వ్యాపారం లాంటిదని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాల విషయాలలో క్లిష్టకాలంలో అధ్యక్షుడు ట్రంప్‌తో మాస్కో మంత్రి సంబంధాలు ఏర్పరచుకుందని పుతిన్‌ వెల్లడించారు. కాగా, తదుపరి సమావేశం మాస్కోలో అని పుతిన్‌ పేర్కొన్నారు.#WATCH | Alaska, USA | "Next time in Moscow," says Russian President Vladimir Putin as US President Trump thanks his counterpart for today's meeting."... I could see it happening," replies President Trump.Source: The White House/ YouTube pic.twitter.com/N3U6Rygllj— ANI (@ANI) August 15, 2025 పుతిన్‌కు ఘన స్వాగతం..ఇదిలా ఉండగా.. అమెరికాలోని అలస్కా ఈ సమావేశానికి వేదికైంది. అమెరికా తరఫున అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, విదేశాంగ శాఖ మంత్రి మైక్రో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కాఫ్‌, రష్యా తరఫున విదేశాంగ శాఖ మంత్రి సర్గెయ్‌ లావ్రోవ్‌, విదేశాంగ విధాన సలహాదారు యురి యుషకోవ్‌ పాల్గొన్నారు. ఇరు దేశాల నుంచి ముగ్గురు చొప్పున పాల్గొన్నారు. తొలుత ట్రంప్‌, పుతిన్‌ మధ్యే చర్చలు జరుగుతాయని వార్తలు వచ్చినప్పటికీ ఇరుదేశాల ప్రతినిధుల బృందం ఈ భేటీలో పాల్గొంది. వీరి భేటీ ముగిసినట్లు వైట్‌హౌస్‌, క్రెమ్లిన్‌లు ప్రకటించాయి.#WATCH | Alaska, USA | US President Donald Trump and Russian President Vladimir Putin exchange greetings in Anchorage, ahead of their talks.Source: Reuters pic.twitter.com/mdGoQe6qqx— ANI (@ANI) August 15, 2025 అంతకు ముందు తొలుత ఇద్దరు నేతలు అలాస్కాలోని యాంకరేజ్‌కు చేరుకున్నారు. అక్కడ పుతిన్‌కు ట్రంప్‌ స్వాగతం పలికారు. ఇరువురు నేతలు ట్రంప్‌కు చెందిన వాహనంలో సమావేశాని భవనానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఇరువురు నేతలను మీడియా పలు ప్రశ్నలు అడిగినప్పటికీ సమాధానం చెప్పకుండానే వెళ్లారు. ప్రపంచ దేశాలన్నీ ఈ భేటీని అత్యంత ఆసక్తిగా గమనించాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో కథ మళ్లీ ముందుకే వచ్చింది. #WATCH | Alaska, USA | US President Donald Trump and Russian President Vladimir Putin share the same car to reach the venue for their talks. Source: Reuters pic.twitter.com/X9YkJvqb6g— ANI (@ANI) August 15, 2025

Major Repair Effort at Tungabhadra Dam involved crest gate No. 197
తుంగభద్ర.. భయపెడుతున్న గేట్‌ నం. 19.. ఏ క్షణాన ఏమవునో?

బళ్లారి: ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకల ఉమ్మడి నీటి ప్రాజెక్టు అయిన తుంగభద్ర డ్యాంనకు మరో ముప్పు ముంచుకొచ్చింది. తుంగభద్ర ఆనకట్టలోని 19 నంబరు గేటుకు ఇటీవల మరమ్మతులు నిర్వహించారు. అయితే ఈ గేట్ గత ఏడాది ఆగస్టు 10 న కొట్టుకుపోయింది. దీంతో అప్పటి నుండి తాత్కాలిక స్టాప్-లాగ్ గేట్‌ను ఏర్పాటు చేసి, పనులు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడిది లీక్ కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.గడగ్ సమీపంలోని అడవి సోమాపుర వద్ద గల ఈ 19వ నంబరు గేటు స్థానంలో 49 టన్నుల కొత్త స్టీల్ గేట్‌ను తయారు చేసి, 2025 జూన్ 2025 చివరిలో ఆ ప్రదేశానికి తీసుకువచ్చారు. అయితే ప్రస్తుత వర్షాకాలంలో నీటి మట్టాలు ఎక్కువగా ఉండటం వల్ల, ఈ గేట్‌ను ఇన్‌స్టలేషన్ చేసే ప్రక్రియ ఈ ఏడాది నవంబర్‌కు వాయిదా పడింది. ఇంతలో మరో ఆరు క్రెస్ట్ గేట్లు వాటి నిర్మాణ బలాన్ని 90 శాతం వరకు కోల్పోయాయి. ఈ 33 గేట్లలో 18 గేట్లను అత్యవసరంగా భర్తీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. అధికారులు వచ్చే ఏడాది జూన్ నాటికి అన్ని గేట్ల నిర్మాణ, మరమ్మతు పనులను పూర్తి చేయాలని నిర్ణయించారు.వరదనీటి కారణంగా డ్యాంకి అమర్చిన 4, 6, 11, 18, 20, 24, 27 నంబర్ల క్రస్ట్‌ గేట్లు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఈ గేట్లు నాలుగు అడుగులు మేర తెరిచి ఉంచారు. డ్యాంకు వరద పెరుగుతున్నందున ఎక్కువ నీటిని వదిలేందుకు ఈ క్రస్ట్‌ గేట్లు మరింత ఎత్తు పెంచేందుకు వీలు కావడం లేదు. మరోవైపు ఈ గేట్లు వరద ఉధృతికి కిందిభాగంలో వంగిపోయాయి. దీనిపై డ్యాం సేఫ్టీ కమిటీ నివేదిక ఇచ్చిందని కర్ణాటక మంత్రి శివరాజ్‌ తంగడిగి తెలిపారు.ప్రభుత్వం కొత్త గేట్ల తయారీకి రూ. 60 కోట్లతో టెండర్‌ పిలిచింది. భద్రతను దృష్టిలో ఉంచుకుని 80 టీఎంసీలకి మించి డ్యాంలో నీటిని నిల్వ ఉంచకూడదని అధికారులు నిర్ఘయించారు. ఈ సీజన్‌లో ఇప్పటికే ప్రాజెక్టు నుంచి 135 టీఎంసీల నీరు కిందకు వదిలారు. అలాగే 24 టీఎంసీల నీటిని వినియోగించారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 23,295 క్యూసెక్కు లు వస్తోంది. ఔట్‌ ఫ్లో 23,193 క్యూసెక్కులుగా ఉంది. ఈ గేట్లు దెబ్బతినడంతో పరివాహక ప్రాంతంలోని రైతుల్లో ఆందోళన నెలకొంది.

Janmashtami 2025 celebrations  at Hare Krishna golden temple in Hyderabad 8
జన్మాష్టమి ఎలా ఆచరించాలి? శ్రీకృష్ణుని అవతార లక్ష్యం

శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన దివ్య ధామం నుండి భూమిపై అవతరించిన పవిత్రమైన రోజు. ఈ పండుగను శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి నాడు జరుపుకుంటారు. భగవంతుని అలౌకికమైన ఆవిర్భావం, దివ్య లీలలను అర్థం చేసుకోవడం ద్వారా జీవులు ముక్తిని పొంది, భగవద్దామాన్ని చేరగలరని భగవద్గీత బోధిస్తోంది. శ్రీ కృష్ణుడి జననం మానవ జీవిత సార్థకతకు అవసరమైన అనేక వరాలను లోకానికి అందించింది. మధురలోని కంసుని కారాగారంలో దేవకీ వసుదేవులకు చతుర్భుజ విష్ణువుగా అవతరించటం, ఆపై సామాన్య బాలకుడిగా రూపాంతరం చెందటం, పసిపిల్లాడిగానే అనేక అసురులను మట్టుపెట్టడం, చిటికెన వ్రేలుతో గోవర్ధన గిరిని ఎత్తి పట్టడం తదితర అసాధారణమైన లీలలన్నీ శ్రీకృష్ణుని దివ్యత్వాన్ని చాటిచెబుతున్నవే.శ్రీకృష్ణుని అవతార లక్ష్యంశ్రీకృష్ణుని జననం సాధారణ శిశువుల వలె సంభవించినది కాదు. వాస్తవానికి ఆయన పుట్టుక లేనివాడైనప్పటికీ, తన అంతరంగిక శక్తిచేతనే ఈ లోకాన అవతరించి మన మధ్య జన్మించడం ఆయన దివ్య లీలల్లో ఒకటి. దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించి, ధర్మాన్ని పునఃస్థాపించడం వారి అవతార ప్రయోజనాలలో మరొకటి. మనమంతా ఈ భౌతిక దేహాలు కాదని, శాశ్వత ఆత్మ స్వరూపులమని, నిరంతర ఆనందం మన సహజ స్థితి అని తెలుపుతూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అందించిన సందేశం మన సనాతన సంస్కృతికి మూల స్థంభం. మానవ జన్మకు అంతిమ లక్ష్యం భగవంతునితో మన ప్రేమపూర్వక సంబంధాన్ని పునరుద్ధరించుకోవడమే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మానవాళికి అందించిన పరమ సందేశం "సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ" (సమస్త ధర్మాలను త్యజించి నన్నే శరణు పొందుము). ఇది మోక్షాన్ని పొందే అత్యంత సరళమైన మార్గం.జన్మాష్టమిని ఎలా ఆచరించాలి?కృష్ణాష్టమి నాడు భక్తులు అర్ధరాత్రి వరకు ఉపవాసం ఉంటారు. ఆరోగ్యం సహకరించనివారు పండ్లు, పాలు వంటి అనుకల్ప ప్రసాదం తీసుకోవచ్చు. మీకు సమీపంలోని శ్రీకృష్ణుని దేవాలయాన్ని సందర్శించి శ్రీకృష్ణుని సేవల్లో పాల్గొనండి. ముఖ్యంగా, ఆ రోజు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం (కనీసం 108 సార్లు) చాలా శ్రేష్ఠం. పలు కారణాల రీత్యా దేవాలయానికి వెళ్లలేని భక్తులు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా శ్రీకృష్ణుని కృపను పొందగలరు. ఈ కలియుగంలో శ్రీకృష్ణుడు తన నామ రూపంలో అవతరించి వున్నారు. హరే కృష్ణ మహామంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించి శ్రద్ధగా వినడం ద్వారా హృదయంలోని కల్మషాలు తొలగి, భగవత్ప్రేమ పెంపొంది, ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించగలము. ఈ రోజు భగవద్గీత, శ్రీమద్భాగవతం వంటి గ్రంథాల నుండి శ్రీకృష్ణుని లీలలు, ఉపదేశాలను పఠించడం పుణ్యప్రదం.విశ్వవ్యాప్తమైన శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీ కృష్ణ జన్మాష్టమిని విశ్వవ్యాప్త పండుగగా నిలపడంలో ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదుల కృషి అపారం. 70 ఏళ్ల వయసులో తమ గురువు ఆదేశంతో పాశాత్య దేశాలకు వెళ్లి భగవద్గీత బోధనలను, పవిత్ర కృష్ణ నామాన్ని వ్యాప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా 108 దేవాలయాలను స్థాపించి, జగన్నాథ రథయాత్రలను ప్రారంభించారు. 70కి పైగా గ్రంథాలను రచించి, వాటిని 25కు పైగా భాషల్లోకి అనువదించి పంపిణీ చేశారు. సామాన్య జీవన శైలితో అత్యున్నత తాత్త్విక చింతనను గలిగి జీవించే విధానాన్ని బోధించి ఎందరో శిష్యులకు మార్గనిర్దేశం చేశారు. యుగధర్మమైన హరినామ సంకీర్తనను ప్రపంచంలోని నగర గ్రామాలకూ వ్యాప్తి గావించి శ్రీచైతన్య మహాప్రభువుల భవిష్యవాణిని సార్థకం చేసిన మహనీయులు భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద.హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరేహరే రామ హరే రామ రామ రామ హరే హరేహరే కృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో కృష్ణాష్టమి వేడుకలుహరే కృష్ణ గోల్డెన్ టెంపుల్, బంజారా హిల్స్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతాయి. భక్తులు రాధా గోవిందుల దర్శనం చేసుకోవచ్చు, చిన్ని కృష్ణుడిని ఉయ్యాలలో ఊపవచ్చు (ఊంజల సేవ). భగవన్నామ జపం చేయటం, నామ సంకీర్తనల్లో పాల్గొనడం, సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ద్వారా దివ్య అనుభూతిని పొందవచ్చు. ఈ రోజు దేవాలయంలో వేలాది మందికి ఉచిత అన్నదానం కూడా నిర్వహిస్తారు. అంతేగాక ఈ ఏడాది నార్సింగిలో నిర్మితమవుతున్న హరే కృష్ణ హెరిటేజ్ టవర్, మరియు కందిలోని హరే కృష్ణ కల్చరల్ సెంటర్ వద్ద కూడా ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించబడతాయి.భక్తులందరూ కుటుంబంతో సహా వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి, స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఆలయం ఆహ్వానిస్తోంది. పాఠకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు! హరే కృష్ణ.-శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ ఎం.టెక్ (ఐఐటి మద్రాస్) అధ్యక్షులు, హరే కృష్ణ మూవ్‌మెంట్ – హైదరాబాద్

Kannada Actress Rachita Ram About Her Details9
చిరు మాజీ అల్లుడితో నటించిన బ్యూటీ.. 'కూలీ'తో వైరల్‌

రజనీకాంత్‌, లోకేష్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో విడుదలైన కూలీ సినిమాకు అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే, ఈ మూవీలో కన్నడ నటి రచితా రామ్ 'కల్యాణి' అనే పాత్రలో కనిపించి అందరినీ మెప్పించింది. వాస్తవంగా ఆమె కన్నడ సినిమాలో హీరోయిన్‌.. అయితే, రజనీకాంత్‌ సినిమాలో ఛాన్స్‌ రావడంతో కూలీలో విలన్‌ పాత్ర చేసింది. ఇందులో ఆమె పాత్రను విక్రమ్‌ సినిమాలో కనిపించిన ఏజెంట్‌ 'టీనా' పాత్రకు 'రివర్స్ వెర్షన్'గా ఉంటుందని చెప్పవచ్చు.కూలీ సినిమాలో కల్యాణిగా నటించిన రచితా రామ్‌ ఎవరంటూ టాలీవుడ్‌ షోషల్‌మీడియాలో పలు పోస్ట్‌లు కనిపిస్తున్నాయి. ఇందులో ఆమె నటనకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు వచ్చాయి. “సర్ప్రైజ్ ప్యాకేజ్” అని అభిమానులు అభివర్ణించారు. ఆమె పాత్రతో కథలో ఊహించని విధంగా మలుపు తిరుగుతుంది. కూలీలో రచితా రామ్ పాత్ర ఉపేంద్ర కన్నా ఎక్కువ స్క్రీన్ స్పేస్ పొందిందంటూ కామెంట్లు వచ్చాయి. ముఖ్యంగా కన్నడలో ఆమె పేరు భారీగా వైరల్ అవుతుంది.రచితా రామ్‌ 2013లో మొదటిసారి దర్శన్‌తో 'బుల్ బుల్' చిత్రం ద్వారా వెండితెరపై మెరిసింది. ఈ మూవీ భారీ విజయం కావడంతో ఆమెకు ఆఫర్లు క్యూ కట్టేశాయి. ఈ మూవీ తర్వాత 'డింపుల్ క్వీన్‌'గా కన్నడలో గుర్తింపు పొందింది. ఆపై తన నటనకు గాను ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో పాటు మూడు సైమా అవార్డులను సొంతం చేసుకుంది. అయితే, ఆమె పాఠశాల విద్య వరకు మాత్రమే చదువుకుంది. ఆమె ఇప్పటి వరకు పునీత్ రాజ్‌కుమార్, శివరాజ్‌ కుమార్‌, ఉపేంద్ర, దునియా విజయ్‌ వివేక్‌ ఒబేరాయ్‌ వంటి స్టార్స్‌తో నటించింది.తెలుగులో చిరు మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్‌తో సినిమా2022లో తెలుగులో చిరంజీవి మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్ సరసన హీరోయిన్‌గా నటించింది. 'సూపర్ మచ్చి' చిత్రంతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. ఈ సినిమాపై ఆమె భారీ అంచనాలు పెట్టుకుంది. హిట్‌ అయితే తెలుగులో వరుస అవకాశాలు వస్తాయని ఆమె ఆశించింది. కానీ, ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఆమె కెరీర్‌లోనే అతి తక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీంతో తెలుగులో ఆమెకు మరో సినిమా ఛాన్స్‌ దక్కలేదు.రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌కు మద్ధతుగా ‌రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌కు మద్ధతుగా రచితా రామ్‌ గతంలో పలు వ్యాఖ్యలు చేసింది. ' నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది దర్శన్‌.. ఆయన నాకు గురువులాంటివారు. నేనేదైనా తప్పు చేస్తే సరిదిద్దుతూ సలహాలు ఇచ్చే వ్యక్తి ఇలాంటి కేసులో భాగమయ్యారంటే నమ్మలేకపోతున్నాను. పోలీసులు నిజాన్ని వెలికితీస్తారని ఆశిస్తున్నాను. మీడియా కూడా పక్షపాతం లేకుండా వ్యవహరిస్తుందని భావిస్తున్నాను. ఈ కేసులో న్యాయమే గెలుస్తుందని నమ్ముతున్నాను అని రాసుకొచ్చింది. కాగా రచితా రామ్‌ తొలి సినిమా బుల్‌బుల్‌. ఈ మూవీలో దర్శన్‌ హీరోగా, రచిత హీరోయిన్‌గా నటించింది. వీరిద్దరూ అంబరీష, జగ్గు దాదా, అమర్‌, క్రాంతి చిత్రాల్లో కలిసి యాక్ట్‌ చేశారు.ప్రెస్‌మీట్‌లో బోల్డ్‌ కామెంట్‌కన్నడ సినిమా ప్రెస్‌మీట్‌లో ఆమె ఒకసారి నోరు జారి వివాదాల్లో చిక్కుకుంది. ఆమె నటించిన కన్నడ సినిమా ‘లవ్‌ యూ రచ్చు’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమెను చిక్కుల్లో పడేసింది 'బోల్డ్‌ కంటెంట్‌తో ఉన్న ఇలాంటి సినిమాలో మీరు నటించడానికి గల కారణం ఏమిటి..?' అనే ప్రశ్నకు ‘‘ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న వారందరూ పెళ్లైన వారే అనుకుంటున్నాను. భార్యాభర్తల మధ్య ఉండే రొమాన్స్‌నే మేము ఈ సినిమాలో చూపించాం. బోల్డ్‌ సీన్స్‌కీ ఓ కారణం ఉంది. అదేంటో తెలియాలంటే సినిమా చూడండి..’’ అంటూ ఆమె చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి.

India may have Pushed Delhi Further into Beijing Moscow Axis Bolton10
ట్రంప్‌కు జాన్ బోల్టన్ హెచ్చరిక.. ‘మాస్కో, బీజింగ్‌, ఢిల్లీ ఒక్కటైతే..’

వాషింగ్టన్‌: అమెరికా- భారత్‌ మధ్య వాణిజ్య సుంకాల యుద్ధం నడుస్తోంది. ఈ నేపధ్యంలో ట్రంప్‌ వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ మండిపడ్డారు. ట్రంప్‌ చర్యతో భారత్‌.. చైనా-రష్యా కూటమికి దగ్గరవుతుందని, ఇది అమెరికా అధ్యక్షుని వ్యూహాత్మక తప్పిదంగా పరిణమిస్తుందని జాన్ బోల్టన్ పేర్కొన్నారు.రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారతదేశంపై అమెరికా అదనపు సుంకాలు విధించడాన్ని జాన్ బోల్టన్ తప్పుబట్టారు. అలాస్కాలోని యాంకరేజ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- రష్యా కౌంటర్ వ్లాదిమిర్ పుతిన్‌ల సమావేశ సమయంలో జాన్ బోల్టన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంపై సుంకాలు విధించారని అయితే ఇదేవిధంగా రష్యా నుండి అత్యధిక మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై అదనపు సుంకాలను విధించలేదన్నారు. ఈ చర్య భారతదేశాన్ని చైనా-రష్యా కూటమి వైపు ఆకర్షితమయ్యేలా చేయవచ్చని బోల్టన్ ‘ఎక్స్‌​’లో పేర్కొన్నారు.‘Unforced error’: John Bolton calls Trump’s anti-India pitch lack of strategic thinking https://t.co/CVDLrD07ll— Financial Express (@FinancialXpress) August 15, 2025సీఎన్‌ఎన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోల్టన్ మాట్లాడుతూ, రష్యా నుండి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న భారతదేశం లాంటి దేశాలపై వైట్ హౌస్ ద్వితీయ సుంకాలను విధించిందని అన్నారు. భారతదేశంపై 25 శాతం సుంకం విధించిందని. అయితే ఇది ఇంకా అమలు కాలేదన్నారు. దీనిపై భారత్‌ చాలా ఆగ్రహంతో ఉన్నదని, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై అలాంటి సుంకం విధించకుండా భారత్‌పైననే విధించడమేమిటని బోల్టన్ ప్రశ్నించారు. మాస్కో, బీజింగ్‌, ఢిల్లీ(మూడు దేశాల రాజధానులు) ఒక్కటైతే అమెరికాపై ప్రతికూల పరిణామాలు తలెత్తవచ్చని హెచ్చరించారు. 2018 తర్వాత పుతిన్ భారత్‌ పర్యటన, భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటనలు అమెరికాపై ప్రతికూల పరిణామాలకు ఉదాహరణలు కావచ్చని బోల్టన్ అన్నారు. ట్రంప్‌ ఎటువంటి సంప్రదింపులు లేకుండా సుంకాల విషయంలో నిర్ణయం తీసుకున్నారని బోల్టన్ ఆరోపించారు. ఇటీవల ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ ఏడాది చివర్లో భారతదేశాన్ని సందర్శించాలని ఆహ్వానించారు. ఈ పర్యటన 23వ ఇండియా-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా జరుగనుంది. మరోవైపు ఈ నెల చివరిలో ప్రధాని మోదీ చైనాను సందర్శించే అవకాశం ఉంది. ఆగస్టు 31- సెప్టెంబర్ ఒకటి మధ్య టియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement