ప్రధాన వార్తలు

ఇవే ప్రశ్నలు వీళ్లిద్దరినీ కాకుండా.. ఆయన్ని అడిగే దమ్ముందా?
ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగింది. శాంతి చర్చల్లో ముందడుగు పడకపోతే కఠినంగా వ్యవహరిస్తానంటూ రష్యాపై రంకెలు వేసిన ట్రంప్.. అలస్కా చర్చల తర్వాత కాస్త మెత్తబడ్డాడు. ఉక్రెయిన్ శాంతి చర్చలు అర్ధరహితంగా ముగిసినట్లు వాళ్ల ప్రకటనలను బట్టి స్పష్టమవుతోంది. ఈ క్రమంలో.. ట్రంప్ ఇంకా అలస్కాలో ఉండగానే పుతిన్ అక్కడి నుంచి నిష్క్రమించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే..అలస్కాలో జర్నలిస్టులు సంధించిన ప్రశ్నలను ఇరు దేశాల అధినేతలు స్వీకరించలేదు. తాము చెప్పాలనుకున్నది చెప్పి.. తలోదారి వెళ్లిపోయారు. యాంకరేజ్ విమానాశ్రయంలో, అలాగే చర్చలు ప్రారంభం కావడానికి ముందు పీస్ రూమ్లోనూ ఇరు దేశాధినేతలు మీడియా ముందు ఆసీనులయ్యారు. ఆ సమయంలో ఉక్రెయిన్ కాల్పుల విరమణ, యుద్ధంలో సాధారణ పౌరులు మరణించడం లాంటి ప్రశ్నలు పుతిన్కు ఎదురయ్యాయి. ‘‘సాధారణ పౌరుల్ని చంపడం ఇంకెప్పుడు ఆపుతారు?’’ అంటూ ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా.. దానికి పుతిన్ తనకేమీ వినబడడం లేదన్నట్లు సైగ చేసి చూపించారు. అదే సమయంలో ‘‘ట్రంప్ మిమ్మల్ని మాత్రమే ఎందుకు నమ్ముతున్నారు?’’ అని మరో విలేఖరి ప్రశ్నించగా.. జర్నలిస్టుల గోలతో పుతిన్ ఇచ్చిన వివరణ వినిపించనట్లే కనిపించింది. పుతిన్పై అంతర్జాతీయ నేరస్థుల కోర్టు కేసు ఉన్నప్పటికీ.. అమెరికా భూభాగంలోకి ఎందుకు ఆహ్వానించారు?. ఉక్రెయిన్ను నేరుగా భాగం కానీయకుండా కాల్పులవిరమణ డీల్ కుదర్చాలని ట్రంప్ భావిస్తున్నారా?. పుతిన్ ఎలాంటి రాయితీలు ఇవ్వవచ్చు? ట్రంప్ ఏమి అంగీకరించవచ్చు? ఇది యుద్ధ విరామానికి దారి తీస్తుందా? లేదంటే రాజకీయ నాటకం మాత్రమేనా? అని ప్రశ్నలు గుప్పించారు. అయితే వీటిలో వేటికి సమాధానాలు రాలేదు. దీంతో.. సోషల్ మీడియా సదరు జర్నలిస్టుల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది. ఇవే ప్రశ్నలను గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహును అడిగే దమ్ముందా? అని నిలదీస్తోంది. ‘‘2023 అక్టోబర్ 7వ తేదీన గాజా యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటిదాకా 60 వేలమందికిపైనే మరణించారు. అందులో 70 శాతం మహిళలు, చిన్నారులే ఉన్నారని నివేదికలు గణాంకాలతో సహా చెబుతున్నాయి. అయితే ఈ మరణాలపై నెతన్యాహు ఏనాడూ స్పందించగా పోగా.. కనీసం విచారం కూడా వ్యక్తం చేసింది లేదు. పైగా ఎంతసేపు హమాస్ అంతమే శాంతికి మార్గం అంటూ చెబుతూ వస్తున్నారు. దీనికి తోడు మానవతా సాయం అందకుండా చేశారనే ఆరోపణలు ఆయపై ఉన్నాయి. ఈ క్రమంలో యుద్ధ నేరాల కింద అంతర్జాతీయ న్యాయస్థానం నెతన్యాహుపై వారెంట్ సైతం జారీ చేసింది.ఈ పరిణామాలపై ఇటు ఇజ్రాయెల్.. అటు అమెరికా జర్నలిస్టులెవరూ ఆయన్ని ప్రశ్నించే సాహసం చేయలేకపోయారు. మరోవైపు.. రెండుసార్లు నెతన్యాహు అమెరికా పర్యటనకు వచ్చారు. ఆ సమయంలోనూ జర్నలిస్టులెవరూ.. గాజా పౌరుల మరణాల గురించి ఎందుకు నిలదీయలేదు?’’ అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇదిలా ఉంటే.. 2022 ఫిబ్రవరిలో మొదలైన ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో లక్షల మంది మరణించారు. మూడున్నరేళ్ల యుద్ధానికి పుల్స్టాప్ పెట్టే ఉద్దేశంలో పర్సూయింగ్ పీస్ పేరిట అలస్కా చర్చల్లో పాల్గొన్నారు. ట్రంప్-పుతిన్లు ఐదారుగంటలు అలస్కాలోనే గడపగా.. రెండున్నర గంటలపాటు చర్చలు జరిగాయి. అయితే.. ఉక్రెయిన్ కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు పట్టుబట్టగా.. అందుకు రష్యా అధినేత ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది. Vladimir Putin’s reaction was nothing short of remarkable—reporters shouted, but his expression told its own story. pic.twitter.com/07vkASuJIc— Tarique Hussain (@Tarique18386095) August 15, 2025భేటీకి ముందు జర్నలిస్టుల ప్రశ్నలకు స్పందించని ఇరువురు నేతలు.. సంయుక్తంగా నిర్వహించిన ప్రెస్మీట్లోనూ మీడియా ప్రతినిధులను ప్రశ్నలకు అనుమతించలేదు. మరోవైపు.. అలస్కా చర్చల సారాంశం కోసం రష్యా అధికారుల బృందాన్ని పలువురు జర్నలిస్టులు కలిసే ప్రయత్నమూ విఫలమైంది. అదే సమయంలో.. ట్రంప్ తన అనుకూల రిపోర్టర్లతో పుతిన్పై ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేశారని, దాని నుంచి పుతిన్ భలేగా తప్పించుకున్నారనే వాదన నెట్టింట నడుస్తోంది... అలస్కాలో ట్రంప్ దౌత్యం విఫలమేనని కొన్ని అమెరికన్ మీడియా చానెల్స్ ప్రముఖంగా చర్చిస్తున్నాయి. కానీ, ట్రంప్ మాత్రం ఎంతో కొంత పురోగతి సాధించాం అని చెబుతుండడం గమనార్హం. ‘‘పుతిన్ చాలా టఫ్, స్ట్రాంగ్ ఫెల్లో. ఇక దారికి రావాల్సింది జెలెన్స్కీనే’ అన్నట్లు ఫ్యాక్స్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. ఇంకోవైపు.. అలస్కాలో ట్రంప్-పుతిన్ భేటీలో రష్యా అనుకూల ఏకపక్ష డీల్ కుదరనందుకు సంతోషమంటూ ఉక్రెయిన్ ఎద్దేవా ప్రకటన విడుదల చేసింది.

మైమరచిన పచ్చమీడియా!
1983లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో విజయం సాధించినప్పుడు ఆ పార్టీ అభిమానులు కొంతమంది కనిపించిన ఈనాడు జర్నలిస్టులందరికీ పూలదండలు వేసి సత్కరించారు. ఈనాడు పత్రిక ఆఫీస్ గేటుకు కూడా పూలమాలలు కట్టి వెళ్లేవారు. ఇదెక్కడి గొడవ! ఎంత టీడీపీకి సపోర్టు చేసినా, ఇలా మెడలో బొమికలు వేసుకున్నట్లుగా పరిస్థితి ఏర్పడిందేమిటా అని కొందరు సీనియర్ జర్నలిస్టులు బాధపడేవారు. సరిగ్గా 42 ఏళ్ల తర్వాత అంతకన్నా ఘోరమైన పరిస్థితి ఏపీలో ఏర్పడడం అత్యంత విచారకరం. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నకలలో టీడీపీకి చాలా కష్టపడి గెలిపించిన కొంతమంది పోలీసు అధికారులకు, జిల్లా ఎన్నికల యంత్రాంగ ముఖ్యులకు టీడీపీ నేతలు సన్మానం చేసి ఉండాలి. అలాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ మద్దతు మీడియా యజమానులకు, జర్నలిస్టులకు కూడా సత్కారాలు జరిగి ఉండాలి. ఆ టీడీపీ మీడియా కార్యాలయాలలో స్వీట్స్ కూడా పంచుకుని ఉంటారు. ఇవి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలైతే అదో రకం. కాని రెండు జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో రిగ్గింగ్ ద్వారా గెలవడంపై కూడా ఇంత సంబరపడాలా అని టీడీపీ క్యాడరే విస్తుపోతోంది. ఎందుకంటే గెలిచింది టీడీపీ కాదని, కొంతమంది పచ్చ చొక్కా వేసుకున్న పోలీస్ అధికారులన్నది ప్రజలందరికి తెలిసిన సత్యం. టీడీపీ అధినాయకత్వం, పోలీస్ యంత్రాంగం, ఎన్నికల నిర్వహణ అధికారులు, ఎన్నికల కమిషన్, టీడీపీకి మద్దతిచ్చే మీడియా .. ఇలా అందరికి తెలుసు వాస్తవం ఏమిటో! అయినా వారు జనాన్ని మోసం చేయడానికి తమ వంతు కృషి చేశారనిపిస్తుంది. ఎల్లో మీడియా నిస్సిగ్గుగా వైఎస్సార్సీపీ ఓడినట్లు భ్రమ కలిగించడానికి నానా పాట్లు పడ్డారు. వైకాపాకు ఘోర పరాభవం అంటూ ఈనాడు మీడియా శీర్షిక పెట్టింది. నిజానికి పరాభవం జరిగింది ప్రజాస్వామ్యానికి. అయినా ఆత్మవంచన చేసుకుని వార్తలు ఇచ్చారు. అందులో పులివెందులను, వైఎస్ కుటుంబాన్ని ఒక భూతంగా చూపించడానికి ఆ మీడియా చేసిన ప్రయత్నం గమనిస్తే సంబంధిత జర్నలిస్టులపై అసహ్యం కలుగుతుంది. మరో విధగా చూస్తే ఇంత కట్టుబానిసలుగా మారారా అని జాలి కలుగుతుంది. ముప్పై ఏళ్లలో తొలిసారి ఓటు వేశానని ఎవరో ఒకరు స్లిప్ వేశారట. అది అసత్యమే అయినా దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు అందరూ ప్రచారం చేశారు. ఈ ముప్పై ఏళ్లలో సగం కాలం ఆయనే పాలన చేశారు. దానిని బట్టి ఆయన సమర్థంగా పరిపాలన చేయలేదని ఒప్పుకుంటున్నారా? ఏ నియోజకవర్గంలో అయినా కొన్ని సమస్యలు ఉంటే ఉండవచ్చు. కాని పులివెందులలో రాక్షసులు ఉంటారన్నట్లుగా ప్రచారం చేసి ఒక ప్రాంత ప్రజలను అవమానించడానికి టీడీపీతోపాటు ఈ మీడియా వెనుకాడడం లేదనిపిస్తుంది. ఆ మాటకు వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటకలకు చెందిన వేలాది మందిని ఓటర్లుగా చేర్పించి దొంగ ఓట్లు వేయిస్తుంటారని చెబుతారు. గతంలో అక్కడ ఆయనకు ప్రత్యర్ధిగా పోటీచేసిన చంద్రమౌళి అనే దివంగత రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆ బోగస్ ఓట్లను తొలగించడానికి ఎంత ప్రయత్నించినా, సాధ్యపడలేదని అనేవారు. దాని గురించి ఎన్నడైనా ఈ మీడియా ఒక్క వార్త రాసిందా? కొన్ని దశాబ్దాలుగా పులివెందుల ప్రశాంతంగా ఉంటోందని, చాలావరకు ఎవరి ఓటు వారు వేసుకునే పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు. అలాంటిది మళ్లీ ఆ ప్రాంతంలో ఫ్యాక్షనిజం వేళ్లూనుకునేలా ప్రభుత్వం, పోలీసులే ప్రయత్నించడం ఎంత దారుణం? స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకోండి అని ఒకప్పుడు పోలీసులు ప్రజలకు చెప్పేవారు. ర్యాలీలు తీయించేవారు. అలాంటిది ఓటు వేయడానికి వచ్చిన వారిని ఓటు వేయనివ్వకుండా చేసిన గొప్ప పోలీస్ యంత్రాంగాన్ని ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలోనే చూస్తున్నాం. చివరికి ప్రజలు తమ ఓటు తమను వేసుకోనివ్వండి అని పోలీసుల కాళ్లు పట్టుకున్న ఘటన కూడా దేశంలో ఎక్కడా జరిగి ఉండదు. ఇది కూడా గొప్ప విషయమే అని పచ్చ మీడియా ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది. అందుకే ఈ మీడియా మురికి మీడియాగా మారిందన్న విమర్శలకు గురి అవుతోంది. పోలింగ్ బూత్ లను మార్చేయడం, వైఎస్సార్సీపీ ఏజెంట్లను తరిమేయడం, పొరుగున ఉన్న జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల నుంచి టీడీపీ, బీజేపీ నేతలు తమ కార్యకర్తలను తరలించి దొంగ ఓట్లు వేయించడం, వైఎస్సార్సీపీ వారిపై దాడులకు తెగపడడం వంటివి చూస్తే ప్రభుత్వమే ప్రజాస్వామ్యానికి పాతర వేసినట్లనిపిస్తుంది. అలాంటి వారికి అండగా నిలబడ్డ పోలీస్ అధికారులకు టీడీపీ నాయకత్వం ఎంతగా సన్మానించినా తప్పు ఉండకపోవచ్చు.స్వయంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ బూత్ పరిశీలన సమయంలోనే జమ్మలమడుగు నుంచి వచ్చిన దొంగ ఓటర్లు దర్జాగా ఓటు వేసుకుంటున్నారంటే అధికార యంత్రాంగం ఎంత బాగా పని చేసింది తెలిసిపోతుంది. దీనిని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఫోటోలతోసహా చూపించడంతో కలెక్టర్ తన సోషల్ మీడియా అక్కౌంట్ నుంచి ఆ పోస్టును తొలగించుకున్నారే కాని, అలా దొంగ ఓట్లు వేసిన వారిపై చర్య తీసుకుంటున్నట్లు ప్రకటించలేదే. ఇలాంటి అధికార యంత్రాంగానికి కూడా టీడీపీ నేతలు రుణపడి ఉండవచ్చు. వైఎస్సార్సీపీ వారి ఎన్నికల ప్రచారాన్ని పత్తాపారం అంటూ పోల్చి, టీడీపీ వారి దౌర్జన్యాలకు అండగా నిలబడ్డ పోలీస్ అధికారులను బహుశా టీడీపీ అధినాయకత్వం శహభాష్ అని మెచ్చుకుని ఉండాలి.ఇలాంటి వారందరికి డబుల్ ప్రమోషన్ లు కూడా వస్తాయోమే చూడాలని టీడీపీ నేతలే కొందరు చమత్కరించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ దొంగ ఓట్లు వేయించిన నేతలు తెలివితక్కువగా వ్యవహరించారని టీడీపీ నాయకత్వ ఫీల్ అవుతోందట. వైఎస్సార్సీపీకి, వైఎస్ జగన్ కు బలమైన పులివెందుల మండలంలో మరీ ఆ పార్టీకి డిపాజిట్ రాకుండా ఓట్లు రిగ్ చేయడం వల్ల ఫలితాలను ప్రజలు ఎవరూ నమ్మని పరిస్థితి ఏర్పడిందని టీడీపీ అధినాయత్వం అసహనం వ్యక్తం చేసిందట. మంచి మెజార్టీతో గెలిచేలా రిగ్గింగ్ చేయండని చెబితే వీరు మితిమీరిన ఉత్సాహంతో చేసిన ఈ పని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి అప్రతిష్ట వచ్చిందని భావించి ఉండాలి. రిగ్గింగ్ చేసేటప్పుడు వైఎస్సార్సీపీకి కూడా గణనీయంగా ఓట్లు వేసి ఉంటే ప్రజలు నిజంగానే వైఎస్సార్సీపీ ఓడిపోయిందేమోలే అనుకునేవారని, అలా చేయకపోవడంతో టీడీపీ అసలు రంగు బయట పడిపోయిందని ఆ పార్టీ నేతలు కొంతమంది వాపోతున్నారు. వైఎస్సార్సీపీకి దిమ్మతిరిగే ఫలితం అని మరో టీడీపీ మీడియా రాసింది. అవును..అధికార యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుని,అరాచకం చేస్తే వైఎస్సార్సీపీకి కాదు దిమ్మతిరిగేది.. రాష్ట్ర ప్రజలకు.ఇంత అధ్వాన్నంగా పాలన సాగుతోందా అన్న విషయం ప్రజలందరికి అర్థమైపోయింది. టీడీపీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివాటికి జగన్పై ద్వేషం ఉంటే ఉండవచ్చు. కాని ఆయనపై కోపంతో ఈ మీడియా సంస్థల అధినేతలు తమ దుస్తులు తామే ఊడదీసుకుని నగ్నంగా బజారులో నిలబడి నవ్వులపాలవుతున్న సంగతిని విస్మరిస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని విషయాలు ప్రస్తావించుకోవాలి. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు వాటి పని అవి చేయకపోతే ఎంత అనర్ధం జరుగుతుందో, ప్రజలలో ఎంత అపనమ్మకం ఏర్పడుతుందో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు చాటి చెప్పాయి.ప్రభుత్వ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ, రాష్ట్ర ఎన్నికల కమిషన్, పోలీస్ వ్యవస్థ, ఒక వర్గం మీడియా వ్యవస్థ అన్ని కుమ్మక్కై ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి. ఈ పరిస్థితి నుంచి కాపాడుతుందని భావించిన న్యాయ వ్యవస్థ కూడా అలా చేయలేకపోయిందన్న బాధ చాలా మందిలో ఉంది.ప్రభుత్వం నిజాయితీగా ఎన్నికలు జరిపించి ఉంటే ప్రజలలో తమ ప్రభుత్వం పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకునే అవకాశం వచ్చేది.అయినా బుల్ డోజ్ చేసి తమ ఎల్లో మీడియా మద్దతుతో ఏమి చేసినా జనం నమ్ముతారులే అనుకుంటే అది భ్రమే అవుతుంది. గతంలో నంద్యాల ఉప ఎన్నికలో సైతం ఇలాగే చంద్రబాబు అరాచాకాలు చేయించి గెలిచారు. కాని సాధారణ ఎన్నికలలో టీడీపీ అంతకు రెట్టింపు ఓట్ల తేడాతో ఓడిపోయింది. చంద్రబాబు పాత్రతో పాటు ఆయన కుమారుడు మంత్రి లోకేశ్ ప్రమేయం ఈ ఎన్నికలలో ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రజాస్వామ్యం గెలిచిందని ఆయన సంబరపడిపోతే అది ఆయన అమాయకత్వమే అవుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దీనికి వంతపాడి ఆయన ఎంత దీన పరిస్థితిలో ఉంది తెలియచేసినట్లయింది. ఎన్నికల కమిషన్ ప్రభుత్వం కోరిన వెంటనే కేవలం ఈ రెండిటికే ఎన్నికలు పెట్టడం, అక్కడ ఎన్ని అక్రమాలు జరుగుతున్నా కళ్లుమూసుకుని కూర్చోవడం, కనీసం అధికార యంత్రాంగాన్ని మందలిచే ధైర్యం చేయకపోవడం వల్ల, ప్రభుత్వంలోని వారెవరైనా ఎన్నికల కమిషనర్ను బెదిరించారా అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. పోలీస్, ఇతర ఎన్నికల యంత్రాంగం అసలు ఓటర్లకు కాకుండా నకిలీ ఓటర్లకు ఓట్లు వేసే అవకాశం కల్పించడం ద్వారా తమ హోదాకు తామే అవమానం చేసుకున్నారు. వైఎస్సార్సీపీ వారిని రకరకాలుగా కట్టడి చేయడం, టీడీపీ వారిని ఇష్టారాజ్యంగా తిరిగేలా స్వేచ్చనివ్వడం ద్వారా, పోలీస్ యంత్రాంగం ఏపీలో ఎంత దారుణంగా పనిచేస్తున్నది లోకానికి చాటి చెప్పినట్లయింది. గౌరవ హైకోర్టు ఈ అక్రమాలు కొన్నిటిని గుర్తించినట్లు వ్యాఖ్యలు చేసినట్లు అనిపించినా, అంతిమంగా సాంకేతిక కారణాలతో జోక్యం చేసుకోలేమని చెప్పడం బాధాకరమే అనిపిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి హైకోర్టు మరింత చొరవ తీసుకుని ఉంటే దేశానికే ఒక సందేశం ఇచ్చినట్లయ్యేదేమో! ఏమైతేనేమి అన్ని వ్యవస్థలు కలిసి ప్రజాస్వామ్యాన్ని ఓటమికి కారణం అయ్యాయనుకోవాలి.ఇది దేశానికి మంచిదా?కాదా?అన్నది ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

ఉగ్ర లింకులతో ఉలిక్కిపడ్డ ధర్మవరం
సాక్షి, అనంతపురం: సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్ర కదలికలు ఒక్కసారిగా కలకలం రేపాయి. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) స్థానికంగా ఓ ఇంట్లో సోదాలు నిర్వహించడంతో పట్టణం ఉలిక్కిపడింది. ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారణ జరుపుతున్నారు. ధర్మవరంలోని కోట ప్రాంతంలో నివాసం ఉంటున్న నూర్(40).. స్థానికంగా ఓ హోటల్లో వంట మనిషిగా పని చేస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా అతని కదలికలు అనుమానంగా ఉండ సాగాయి. ఉగ్రవాదులతో అతను వాట్సాప్ కాల్ మాట్లాడినట్లు ఎన్ఐఏ అధికారులు ఓ అంచనాకి వచ్చారు. ఈ క్రమంలో అతని సోషల్ మీడియా అకౌంట్లనూ తనిఖీ చేశారు. వీటి ఆధారంగా.. ఉగ్రవాదులతో సంబంధాలు ఉండొచ్చనే అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతేకాదు.. నూర్ నివాసంలోనూ సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు.. 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అతన్ని రహస్య ప్రదేశంలో అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

తగ్గుతున్న బంగారం ధరలు: వరుసగా ఎనిమిదో రోజు ఇలా
బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ రోజు (శనివారం) కూడా గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 60 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలలో మార్పులు జరిగాయి. పసిడి ధరలు తగ్గుతుంటే.. వెండి మాత్రం పెరుగుతూనే ఉంది. ఈ కథనంలో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్.. టీమిండియా సెలక్టర్లకు వార్నింగ్!
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్కు ముందు టీమిండియా స్టార్ సంజూ శాంసన్ (Sanju Samson) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మెరుపు హాఫ్ సెంచరీతో రాణించి.. సెలక్టర్లకు తానూ రేసులో ఉన్నానంటూ బ్యాట్ ద్వారానే సందేశం ఇచ్చాడు. కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఆసియా కప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం దృష్ట్యా తటస్థ వేదికైన యూఏఈలో మ్యాచ్లు జరుగనున్నాయి.సెలక్టర్లకు సవాల్అయితే, ఈ మెగా ఈవెంట్కు ఎంపిక చేసే భారత జట్టుకు సంజూ శాంసన్ను ఎంపిక చేస్తారా? లేదంటే.. ఓపెనర్ యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్లను పిలిపించి.. ఈ కేరళ బ్యాటర్పై వేటు వేస్తారా? అన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి సందేహాల నడుమ సంజూ శాంసన్ తనదైన శైలిలో సెలక్టర్లకు సవాల్ విసిరాడు.ప్రెసిడెంట్స్ ఎలెవన్ vs సెక్రటరీ ఎలెవన్కాగా కేరళ క్రికెట్ లీగ్ సీజన్-2 సెప్టెంబరులో ప్రారంభం కానుంది. అయితే, ఈ టోర్నీకి ముందు గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ ఎలెవన్- కేరళ క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీ ఎలెవన్ మధ్య శుక్రవారం ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది.గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లడ్లైట్ల వెలుతురులో జరిగిన ఈ మ్యాచ్లో సంజూ సెక్రటరీ ఎలెవన్కు ప్రాతినిథ్యం వహించాడు. ఇక ఈ పోరులో సచిన్ బేబీ కెప్టెన్సీలోని ప్రెసిడెంట్ ఎలెవన్ తొలుత బ్యాటింగ్ చేసింది.రోహన్ కన్నుమ్మల్ (29 బంతుల్లో 60), అభిజిత్ ప్రవీణ్ (18 బంతుల్లో 47) విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడగా.. ప్రెసిడెంట్ ఎలెవన్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.విష్ణు విధ్వంసం.. సంజూ మెరుపు హాఫ్ సెంచరీఇక లక్ష్య ఛేదనలో విష్ణు వినోద్ విధ్వంసకర ఇన్నింగ్స్ (29 బంతుల్లో 69)తో విరుచుకుపడగా.. సంజూ శాంసన్ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. 36 బంతుల్లో 54 పరుగులతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ అలరించాడు. ఈ క్రమంలో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే సెక్రటరీ ఎలెవన్ లక్ష్యాన్ని ఛేదించి జయభేరి మోగించింది.ఆసియా కప్-2025 టోర్నీకి భారత జట్టు ప్రకటనకు సమయం ఆసన్నమైన వేళ సంజూ ఈ మేరకు బ్యాట్తో రాణించడం పట్ల అతడి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా సెప్టెంబరు 9- 28 మధ్య యూఏఈ వేదికగా ఆసియా కప్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే.అత్యధికంగా మూడు శతకాలుకాగా సంజూ అంతర్జాతీయ టీ20లలో ఇప్పటికే మూడు శతకాలు బాదాడు. తద్వారా రోహిత్ శర్మ (5), సూర్యకుమార్ యాదవ్ (4) తర్వాత టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో మొత్తంగా 152కు పైగా స్ట్రైక్రేటుతో 861 పరుగులు సాధించాడు.చదవండి: ENG vs SA: వన్డే, టీ20లకు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. ఆ సిరీస్కు కెప్టెన్గా జేకబ్

ట్రంప్, పుతిన్ మధ్య ముగిసిన భేటీ.. యుద్ధంపై ట్విస్ట్!
అలాస్కా: అమెరికాలోని అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన కీలక భేటీ ముగిసింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీ.. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసింది. వీరి భేటీపై ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూసినప్పటికీ అనుకున్న ఫలితం మాత్రం దక్కలేదు. అయితే, వీరి మధ్య మరో సమావేశం రష్యాలో జరగనుందని పుతిన్ చివరలో ట్విస్ట్ ఇచ్చారు. కీలక సమావేశం అనంతరం ఇద్దరు నేతలు భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. సమావేశంలో అనేక విషయాలు చర్చకు వచ్చాయి. కానీ, యుద్ధానికి సంబంధించిన తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించాం. అయితే, కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్పై సంతకం చేసే వరకు ఒప్పందం కుదరనట్టే అవుతుంది. త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యురోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు. తాను మళ్లీ పుతిన్ను కలుస్తానని చెప్పుకొచ్చారు.#WATCH | Alaska, USA | US President Donald Trump says, "We had a very productive meeting, there were many points that we agreed on. Couple of big ones that we haven't quite gotten there but we made some headway. There's no deal until there's a deal so I will call up NATO in a… pic.twitter.com/mY5t9zkoCT— ANI (@ANI) August 15, 2025ఇదే సమయంలో డీల్ పూర్తికావడంపై నిర్ణయం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేతుల్లోనే ఉంది. ఒప్పందం చేసుకోవాలని జెలెన్స్కీకి సూచిస్తా. కానీ, వాళ్లు అందుకు నిరాకరించే అవకాశం ఉంది. రష్యా చాలా శక్తిమంతమైన దేశం. పుతిన్-జెలెన్స్కీల సమావేశం జరుగుతుందని ఆశిస్తున్నా. అందులో నేను కూడా చేరే అవకాశం ఉందన్నారు. పుతిన్తో ఏయే విషయాలు చర్చించారు..? ఇంకా మిగిలి ఉన్న అంశాలు ఏంటనే విషయంపై వివరించేందుకు ట్రంప్ నిరాకరించారు. #WATCH | Alaska, USA | Russian President Vladimir Putin says, "... We see the strive of the administration and President Trump personally to help facilitate the resolution of the Ukrainian conflict and his strive to get to the crux of the matter to understand this history is… pic.twitter.com/kiOKgw2JBf— ANI (@ANI) August 15, 2025అనంతరం, పుతిన్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్తో సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్నకు ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయితీగా ఉన్నట్లు తెలిపారు. గతంలో ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదని పుతిన్ మరో మారు పేర్కొన్నారు. ఈ సమావేశం వివాదానికి ముగింపు పలకడానికి ప్రారంభ స్థానంగా అభివర్ణించారు. ట్రంప్తో తనకున్న సంబంధం వ్యాపారం లాంటిదని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాల విషయాలలో క్లిష్టకాలంలో అధ్యక్షుడు ట్రంప్తో మాస్కో మంత్రి సంబంధాలు ఏర్పరచుకుందని పుతిన్ వెల్లడించారు. కాగా, తదుపరి సమావేశం మాస్కోలో అని పుతిన్ పేర్కొన్నారు.#WATCH | Alaska, USA | "Next time in Moscow," says Russian President Vladimir Putin as US President Trump thanks his counterpart for today's meeting."... I could see it happening," replies President Trump.Source: The White House/ YouTube pic.twitter.com/N3U6Rygllj— ANI (@ANI) August 15, 2025 పుతిన్కు ఘన స్వాగతం..ఇదిలా ఉండగా.. అమెరికాలోని అలస్కా ఈ సమావేశానికి వేదికైంది. అమెరికా తరఫున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ శాఖ మంత్రి మైక్రో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, రష్యా తరఫున విదేశాంగ శాఖ మంత్రి సర్గెయ్ లావ్రోవ్, విదేశాంగ విధాన సలహాదారు యురి యుషకోవ్ పాల్గొన్నారు. ఇరు దేశాల నుంచి ముగ్గురు చొప్పున పాల్గొన్నారు. తొలుత ట్రంప్, పుతిన్ మధ్యే చర్చలు జరుగుతాయని వార్తలు వచ్చినప్పటికీ ఇరుదేశాల ప్రతినిధుల బృందం ఈ భేటీలో పాల్గొంది. వీరి భేటీ ముగిసినట్లు వైట్హౌస్, క్రెమ్లిన్లు ప్రకటించాయి.#WATCH | Alaska, USA | US President Donald Trump and Russian President Vladimir Putin exchange greetings in Anchorage, ahead of their talks.Source: Reuters pic.twitter.com/mdGoQe6qqx— ANI (@ANI) August 15, 2025 అంతకు ముందు తొలుత ఇద్దరు నేతలు అలాస్కాలోని యాంకరేజ్కు చేరుకున్నారు. అక్కడ పుతిన్కు ట్రంప్ స్వాగతం పలికారు. ఇరువురు నేతలు ట్రంప్కు చెందిన వాహనంలో సమావేశాని భవనానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఇరువురు నేతలను మీడియా పలు ప్రశ్నలు అడిగినప్పటికీ సమాధానం చెప్పకుండానే వెళ్లారు. ప్రపంచ దేశాలన్నీ ఈ భేటీని అత్యంత ఆసక్తిగా గమనించాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో కథ మళ్లీ ముందుకే వచ్చింది. #WATCH | Alaska, USA | US President Donald Trump and Russian President Vladimir Putin share the same car to reach the venue for their talks. Source: Reuters pic.twitter.com/X9YkJvqb6g— ANI (@ANI) August 15, 2025

తుంగభద్ర.. భయపెడుతున్న గేట్ నం. 19.. ఏ క్షణాన ఏమవునో?
బళ్లారి: ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల ఉమ్మడి నీటి ప్రాజెక్టు అయిన తుంగభద్ర డ్యాంనకు మరో ముప్పు ముంచుకొచ్చింది. తుంగభద్ర ఆనకట్టలోని 19 నంబరు గేటుకు ఇటీవల మరమ్మతులు నిర్వహించారు. అయితే ఈ గేట్ గత ఏడాది ఆగస్టు 10 న కొట్టుకుపోయింది. దీంతో అప్పటి నుండి తాత్కాలిక స్టాప్-లాగ్ గేట్ను ఏర్పాటు చేసి, పనులు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడిది లీక్ కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.గడగ్ సమీపంలోని అడవి సోమాపుర వద్ద గల ఈ 19వ నంబరు గేటు స్థానంలో 49 టన్నుల కొత్త స్టీల్ గేట్ను తయారు చేసి, 2025 జూన్ 2025 చివరిలో ఆ ప్రదేశానికి తీసుకువచ్చారు. అయితే ప్రస్తుత వర్షాకాలంలో నీటి మట్టాలు ఎక్కువగా ఉండటం వల్ల, ఈ గేట్ను ఇన్స్టలేషన్ చేసే ప్రక్రియ ఈ ఏడాది నవంబర్కు వాయిదా పడింది. ఇంతలో మరో ఆరు క్రెస్ట్ గేట్లు వాటి నిర్మాణ బలాన్ని 90 శాతం వరకు కోల్పోయాయి. ఈ 33 గేట్లలో 18 గేట్లను అత్యవసరంగా భర్తీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. అధికారులు వచ్చే ఏడాది జూన్ నాటికి అన్ని గేట్ల నిర్మాణ, మరమ్మతు పనులను పూర్తి చేయాలని నిర్ణయించారు.వరదనీటి కారణంగా డ్యాంకి అమర్చిన 4, 6, 11, 18, 20, 24, 27 నంబర్ల క్రస్ట్ గేట్లు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఈ గేట్లు నాలుగు అడుగులు మేర తెరిచి ఉంచారు. డ్యాంకు వరద పెరుగుతున్నందున ఎక్కువ నీటిని వదిలేందుకు ఈ క్రస్ట్ గేట్లు మరింత ఎత్తు పెంచేందుకు వీలు కావడం లేదు. మరోవైపు ఈ గేట్లు వరద ఉధృతికి కిందిభాగంలో వంగిపోయాయి. దీనిపై డ్యాం సేఫ్టీ కమిటీ నివేదిక ఇచ్చిందని కర్ణాటక మంత్రి శివరాజ్ తంగడిగి తెలిపారు.ప్రభుత్వం కొత్త గేట్ల తయారీకి రూ. 60 కోట్లతో టెండర్ పిలిచింది. భద్రతను దృష్టిలో ఉంచుకుని 80 టీఎంసీలకి మించి డ్యాంలో నీటిని నిల్వ ఉంచకూడదని అధికారులు నిర్ఘయించారు. ఈ సీజన్లో ఇప్పటికే ప్రాజెక్టు నుంచి 135 టీఎంసీల నీరు కిందకు వదిలారు. అలాగే 24 టీఎంసీల నీటిని వినియోగించారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 23,295 క్యూసెక్కు లు వస్తోంది. ఔట్ ఫ్లో 23,193 క్యూసెక్కులుగా ఉంది. ఈ గేట్లు దెబ్బతినడంతో పరివాహక ప్రాంతంలోని రైతుల్లో ఆందోళన నెలకొంది.

జన్మాష్టమి ఎలా ఆచరించాలి? శ్రీకృష్ణుని అవతార లక్ష్యం
శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన దివ్య ధామం నుండి భూమిపై అవతరించిన పవిత్రమైన రోజు. ఈ పండుగను శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి నాడు జరుపుకుంటారు. భగవంతుని అలౌకికమైన ఆవిర్భావం, దివ్య లీలలను అర్థం చేసుకోవడం ద్వారా జీవులు ముక్తిని పొంది, భగవద్దామాన్ని చేరగలరని భగవద్గీత బోధిస్తోంది. శ్రీ కృష్ణుడి జననం మానవ జీవిత సార్థకతకు అవసరమైన అనేక వరాలను లోకానికి అందించింది. మధురలోని కంసుని కారాగారంలో దేవకీ వసుదేవులకు చతుర్భుజ విష్ణువుగా అవతరించటం, ఆపై సామాన్య బాలకుడిగా రూపాంతరం చెందటం, పసిపిల్లాడిగానే అనేక అసురులను మట్టుపెట్టడం, చిటికెన వ్రేలుతో గోవర్ధన గిరిని ఎత్తి పట్టడం తదితర అసాధారణమైన లీలలన్నీ శ్రీకృష్ణుని దివ్యత్వాన్ని చాటిచెబుతున్నవే.శ్రీకృష్ణుని అవతార లక్ష్యంశ్రీకృష్ణుని జననం సాధారణ శిశువుల వలె సంభవించినది కాదు. వాస్తవానికి ఆయన పుట్టుక లేనివాడైనప్పటికీ, తన అంతరంగిక శక్తిచేతనే ఈ లోకాన అవతరించి మన మధ్య జన్మించడం ఆయన దివ్య లీలల్లో ఒకటి. దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించి, ధర్మాన్ని పునఃస్థాపించడం వారి అవతార ప్రయోజనాలలో మరొకటి. మనమంతా ఈ భౌతిక దేహాలు కాదని, శాశ్వత ఆత్మ స్వరూపులమని, నిరంతర ఆనందం మన సహజ స్థితి అని తెలుపుతూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అందించిన సందేశం మన సనాతన సంస్కృతికి మూల స్థంభం. మానవ జన్మకు అంతిమ లక్ష్యం భగవంతునితో మన ప్రేమపూర్వక సంబంధాన్ని పునరుద్ధరించుకోవడమే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మానవాళికి అందించిన పరమ సందేశం "సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ" (సమస్త ధర్మాలను త్యజించి నన్నే శరణు పొందుము). ఇది మోక్షాన్ని పొందే అత్యంత సరళమైన మార్గం.జన్మాష్టమిని ఎలా ఆచరించాలి?కృష్ణాష్టమి నాడు భక్తులు అర్ధరాత్రి వరకు ఉపవాసం ఉంటారు. ఆరోగ్యం సహకరించనివారు పండ్లు, పాలు వంటి అనుకల్ప ప్రసాదం తీసుకోవచ్చు. మీకు సమీపంలోని శ్రీకృష్ణుని దేవాలయాన్ని సందర్శించి శ్రీకృష్ణుని సేవల్లో పాల్గొనండి. ముఖ్యంగా, ఆ రోజు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం (కనీసం 108 సార్లు) చాలా శ్రేష్ఠం. పలు కారణాల రీత్యా దేవాలయానికి వెళ్లలేని భక్తులు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా శ్రీకృష్ణుని కృపను పొందగలరు. ఈ కలియుగంలో శ్రీకృష్ణుడు తన నామ రూపంలో అవతరించి వున్నారు. హరే కృష్ణ మహామంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించి శ్రద్ధగా వినడం ద్వారా హృదయంలోని కల్మషాలు తొలగి, భగవత్ప్రేమ పెంపొంది, ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించగలము. ఈ రోజు భగవద్గీత, శ్రీమద్భాగవతం వంటి గ్రంథాల నుండి శ్రీకృష్ణుని లీలలు, ఉపదేశాలను పఠించడం పుణ్యప్రదం.విశ్వవ్యాప్తమైన శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీ కృష్ణ జన్మాష్టమిని విశ్వవ్యాప్త పండుగగా నిలపడంలో ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదుల కృషి అపారం. 70 ఏళ్ల వయసులో తమ గురువు ఆదేశంతో పాశాత్య దేశాలకు వెళ్లి భగవద్గీత బోధనలను, పవిత్ర కృష్ణ నామాన్ని వ్యాప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా 108 దేవాలయాలను స్థాపించి, జగన్నాథ రథయాత్రలను ప్రారంభించారు. 70కి పైగా గ్రంథాలను రచించి, వాటిని 25కు పైగా భాషల్లోకి అనువదించి పంపిణీ చేశారు. సామాన్య జీవన శైలితో అత్యున్నత తాత్త్విక చింతనను గలిగి జీవించే విధానాన్ని బోధించి ఎందరో శిష్యులకు మార్గనిర్దేశం చేశారు. యుగధర్మమైన హరినామ సంకీర్తనను ప్రపంచంలోని నగర గ్రామాలకూ వ్యాప్తి గావించి శ్రీచైతన్య మహాప్రభువుల భవిష్యవాణిని సార్థకం చేసిన మహనీయులు భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద.హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరేహరే రామ హరే రామ రామ రామ హరే హరేహరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో కృష్ణాష్టమి వేడుకలుహరే కృష్ణ గోల్డెన్ టెంపుల్, బంజారా హిల్స్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతాయి. భక్తులు రాధా గోవిందుల దర్శనం చేసుకోవచ్చు, చిన్ని కృష్ణుడిని ఉయ్యాలలో ఊపవచ్చు (ఊంజల సేవ). భగవన్నామ జపం చేయటం, నామ సంకీర్తనల్లో పాల్గొనడం, సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ద్వారా దివ్య అనుభూతిని పొందవచ్చు. ఈ రోజు దేవాలయంలో వేలాది మందికి ఉచిత అన్నదానం కూడా నిర్వహిస్తారు. అంతేగాక ఈ ఏడాది నార్సింగిలో నిర్మితమవుతున్న హరే కృష్ణ హెరిటేజ్ టవర్, మరియు కందిలోని హరే కృష్ణ కల్చరల్ సెంటర్ వద్ద కూడా ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించబడతాయి.భక్తులందరూ కుటుంబంతో సహా వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి, స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఆలయం ఆహ్వానిస్తోంది. పాఠకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు! హరే కృష్ణ.-శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ ఎం.టెక్ (ఐఐటి మద్రాస్) అధ్యక్షులు, హరే కృష్ణ మూవ్మెంట్ – హైదరాబాద్

చిరు మాజీ అల్లుడితో నటించిన బ్యూటీ.. 'కూలీ'తో వైరల్
రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో విడుదలైన కూలీ సినిమాకు అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే, ఈ మూవీలో కన్నడ నటి రచితా రామ్ 'కల్యాణి' అనే పాత్రలో కనిపించి అందరినీ మెప్పించింది. వాస్తవంగా ఆమె కన్నడ సినిమాలో హీరోయిన్.. అయితే, రజనీకాంత్ సినిమాలో ఛాన్స్ రావడంతో కూలీలో విలన్ పాత్ర చేసింది. ఇందులో ఆమె పాత్రను విక్రమ్ సినిమాలో కనిపించిన ఏజెంట్ 'టీనా' పాత్రకు 'రివర్స్ వెర్షన్'గా ఉంటుందని చెప్పవచ్చు.కూలీ సినిమాలో కల్యాణిగా నటించిన రచితా రామ్ ఎవరంటూ టాలీవుడ్ షోషల్మీడియాలో పలు పోస్ట్లు కనిపిస్తున్నాయి. ఇందులో ఆమె నటనకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు వచ్చాయి. “సర్ప్రైజ్ ప్యాకేజ్” అని అభిమానులు అభివర్ణించారు. ఆమె పాత్రతో కథలో ఊహించని విధంగా మలుపు తిరుగుతుంది. కూలీలో రచితా రామ్ పాత్ర ఉపేంద్ర కన్నా ఎక్కువ స్క్రీన్ స్పేస్ పొందిందంటూ కామెంట్లు వచ్చాయి. ముఖ్యంగా కన్నడలో ఆమె పేరు భారీగా వైరల్ అవుతుంది.రచితా రామ్ 2013లో మొదటిసారి దర్శన్తో 'బుల్ బుల్' చిత్రం ద్వారా వెండితెరపై మెరిసింది. ఈ మూవీ భారీ విజయం కావడంతో ఆమెకు ఆఫర్లు క్యూ కట్టేశాయి. ఈ మూవీ తర్వాత 'డింపుల్ క్వీన్'గా కన్నడలో గుర్తింపు పొందింది. ఆపై తన నటనకు గాను ఒక ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు మూడు సైమా అవార్డులను సొంతం చేసుకుంది. అయితే, ఆమె పాఠశాల విద్య వరకు మాత్రమే చదువుకుంది. ఆమె ఇప్పటి వరకు పునీత్ రాజ్కుమార్, శివరాజ్ కుమార్, ఉపేంద్ర, దునియా విజయ్ వివేక్ ఒబేరాయ్ వంటి స్టార్స్తో నటించింది.తెలుగులో చిరు మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్తో సినిమా2022లో తెలుగులో చిరంజీవి మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్ సరసన హీరోయిన్గా నటించింది. 'సూపర్ మచ్చి' చిత్రంతో టాలీవుడ్లో అరంగేట్రం చేసింది. ఈ సినిమాపై ఆమె భారీ అంచనాలు పెట్టుకుంది. హిట్ అయితే తెలుగులో వరుస అవకాశాలు వస్తాయని ఆమె ఆశించింది. కానీ, ఈ మూవీ డిజాస్టర్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఆమె కెరీర్లోనే అతి తక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీంతో తెలుగులో ఆమెకు మరో సినిమా ఛాన్స్ దక్కలేదు.రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్కు మద్ధతుగా రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్కు మద్ధతుగా రచితా రామ్ గతంలో పలు వ్యాఖ్యలు చేసింది. ' నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది దర్శన్.. ఆయన నాకు గురువులాంటివారు. నేనేదైనా తప్పు చేస్తే సరిదిద్దుతూ సలహాలు ఇచ్చే వ్యక్తి ఇలాంటి కేసులో భాగమయ్యారంటే నమ్మలేకపోతున్నాను. పోలీసులు నిజాన్ని వెలికితీస్తారని ఆశిస్తున్నాను. మీడియా కూడా పక్షపాతం లేకుండా వ్యవహరిస్తుందని భావిస్తున్నాను. ఈ కేసులో న్యాయమే గెలుస్తుందని నమ్ముతున్నాను అని రాసుకొచ్చింది. కాగా రచితా రామ్ తొలి సినిమా బుల్బుల్. ఈ మూవీలో దర్శన్ హీరోగా, రచిత హీరోయిన్గా నటించింది. వీరిద్దరూ అంబరీష, జగ్గు దాదా, అమర్, క్రాంతి చిత్రాల్లో కలిసి యాక్ట్ చేశారు.ప్రెస్మీట్లో బోల్డ్ కామెంట్కన్నడ సినిమా ప్రెస్మీట్లో ఆమె ఒకసారి నోరు జారి వివాదాల్లో చిక్కుకుంది. ఆమె నటించిన కన్నడ సినిమా ‘లవ్ యూ రచ్చు’ ప్రమోషన్స్లో భాగంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమెను చిక్కుల్లో పడేసింది 'బోల్డ్ కంటెంట్తో ఉన్న ఇలాంటి సినిమాలో మీరు నటించడానికి గల కారణం ఏమిటి..?' అనే ప్రశ్నకు ‘‘ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న వారందరూ పెళ్లైన వారే అనుకుంటున్నాను. భార్యాభర్తల మధ్య ఉండే రొమాన్స్నే మేము ఈ సినిమాలో చూపించాం. బోల్డ్ సీన్స్కీ ఓ కారణం ఉంది. అదేంటో తెలియాలంటే సినిమా చూడండి..’’ అంటూ ఆమె చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి.

ట్రంప్కు జాన్ బోల్టన్ హెచ్చరిక.. ‘మాస్కో, బీజింగ్, ఢిల్లీ ఒక్కటైతే..’
వాషింగ్టన్: అమెరికా- భారత్ మధ్య వాణిజ్య సుంకాల యుద్ధం నడుస్తోంది. ఈ నేపధ్యంలో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ మండిపడ్డారు. ట్రంప్ చర్యతో భారత్.. చైనా-రష్యా కూటమికి దగ్గరవుతుందని, ఇది అమెరికా అధ్యక్షుని వ్యూహాత్మక తప్పిదంగా పరిణమిస్తుందని జాన్ బోల్టన్ పేర్కొన్నారు.రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారతదేశంపై అమెరికా అదనపు సుంకాలు విధించడాన్ని జాన్ బోల్టన్ తప్పుబట్టారు. అలాస్కాలోని యాంకరేజ్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- రష్యా కౌంటర్ వ్లాదిమిర్ పుతిన్ల సమావేశ సమయంలో జాన్ బోల్టన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంపై సుంకాలు విధించారని అయితే ఇదేవిధంగా రష్యా నుండి అత్యధిక మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై అదనపు సుంకాలను విధించలేదన్నారు. ఈ చర్య భారతదేశాన్ని చైనా-రష్యా కూటమి వైపు ఆకర్షితమయ్యేలా చేయవచ్చని బోల్టన్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.‘Unforced error’: John Bolton calls Trump’s anti-India pitch lack of strategic thinking https://t.co/CVDLrD07ll— Financial Express (@FinancialXpress) August 15, 2025సీఎన్ఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోల్టన్ మాట్లాడుతూ, రష్యా నుండి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న భారతదేశం లాంటి దేశాలపై వైట్ హౌస్ ద్వితీయ సుంకాలను విధించిందని అన్నారు. భారతదేశంపై 25 శాతం సుంకం విధించిందని. అయితే ఇది ఇంకా అమలు కాలేదన్నారు. దీనిపై భారత్ చాలా ఆగ్రహంతో ఉన్నదని, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై అలాంటి సుంకం విధించకుండా భారత్పైననే విధించడమేమిటని బోల్టన్ ప్రశ్నించారు. మాస్కో, బీజింగ్, ఢిల్లీ(మూడు దేశాల రాజధానులు) ఒక్కటైతే అమెరికాపై ప్రతికూల పరిణామాలు తలెత్తవచ్చని హెచ్చరించారు. 2018 తర్వాత పుతిన్ భారత్ పర్యటన, భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటనలు అమెరికాపై ప్రతికూల పరిణామాలకు ఉదాహరణలు కావచ్చని బోల్టన్ అన్నారు. ట్రంప్ ఎటువంటి సంప్రదింపులు లేకుండా సుంకాల విషయంలో నిర్ణయం తీసుకున్నారని బోల్టన్ ఆరోపించారు. ఇటీవల ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. ఈ ఏడాది చివర్లో భారతదేశాన్ని సందర్శించాలని ఆహ్వానించారు. ఈ పర్యటన 23వ ఇండియా-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా జరుగనుంది. మరోవైపు ఈ నెల చివరిలో ప్రధాని మోదీ చైనాను సందర్శించే అవకాశం ఉంది. ఆగస్టు 31- సెప్టెంబర్ ఒకటి మధ్య టియాంజిన్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు.
మైమరచిన పచ్చమీడియా!
గట్ హెల్త్ కోసం..టాక్సిక్ ఫ్రీ, బయోడీగ్రేడబుల్ పాత్రలు
యాషెస్ ట్రిపుల్ సెంచరీ వీరుడు, ఆసీస్ దిగ్గజం కన్నుమూత
మరో అక్రమ ‘సృష్టి’
బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య ఫ్లెక్సీ వార్.. రప్పా.. రప్పా అంటూ..
పంద్రాగస్టుకి పదిహేను చిత్రాలకు శ్రీకారం
జన్మాష్టమి ఎలా ఆచరించాలి? శ్రీకృష్ణుని అవతార లక్ష్యం
అందం ఒక్కటే కాదు.. కలర్ ఉంటేనే షోలకు పిలుస్తారు: కీర్తి భట్
ఉగ్ర లింకులతో ఉలిక్కిపడ్డ ధర్మవరం
ఫ్యాటీ లివర్కు బొప్పాయితో చెక్
జియో కొత్త ప్లాన్ వచ్చింది.. చవగ్గా 28 రోజులు వ్యాలిడిటీ
ఉచిత బస్సు పథకం.. అసలు రంగు ఇదే!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
కాల్చిపడేస్తా ఖబడ్దార్!
వెండి నగలు కొంటున్నారా?: సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్!
సచిన్కు కాబోయే కోడలు సానియా ఆస్తి ఎంతో తెలుసా?
మీరేమైనా యుద్ధానికి వెళ్తున్నారా?.. వాహనాలకు ఆ రంగులేంటి?
మళ్లీ సెలవులొచ్చాయ్.. ఈ శుక్రవారం ఓటీటీల్లో 26 సినిమాలు!
ఈ రాశి వారికి రాబడి పెరుగుతుంది.. సంఘంలో విశేష గౌరవం
విరిగిపడిన కొండ చరియలు.. హైదరాబాద్లో భారీ ట్రాఫిక్ జాం
జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రం.. తొలి రోజే వార్-2కు షాకింగ్ కలెక్షన్స్!
‘వార్ 2 ’మూవీ రివ్యూ
మామూలు సమయంలోనే కనపడరు.. ఇక ఇప్పుడొచ్చి ఎలా ఆదుకుంటారనుకుంటున్నావ్!
దేశ ప్రజలకు శుభవార్త.. ట్యాక్స్పై ప్రధాని మోదీ కీలక ప్రకటన
కెప్టెన్గా రుతురాజ్పై వేటు.. జట్టులో పృథ్వీషాకు చోటు
రాత్రుళ్లు నిద్రపోడు, 60ఏళ్ల హీరో సూపర్ ఫిట్
రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ
శారీలో హీరోయిన్ వైష్ణవి చైతన్య క్యూట్ లుక్స్ (ఫొటోలు)
బంగారం కొనడానికి ఇది మంచి తరుణం: ఎందుకంటే?
టాలీవుడ్ యాంకర్ లాస్య వరలక్ష్మీ వ్రతం.. ఫోటోలు
మైమరచిన పచ్చమీడియా!
గట్ హెల్త్ కోసం..టాక్సిక్ ఫ్రీ, బయోడీగ్రేడబుల్ పాత్రలు
యాషెస్ ట్రిపుల్ సెంచరీ వీరుడు, ఆసీస్ దిగ్గజం కన్నుమూత
మరో అక్రమ ‘సృష్టి’
బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య ఫ్లెక్సీ వార్.. రప్పా.. రప్పా అంటూ..
పంద్రాగస్టుకి పదిహేను చిత్రాలకు శ్రీకారం
జన్మాష్టమి ఎలా ఆచరించాలి? శ్రీకృష్ణుని అవతార లక్ష్యం
అందం ఒక్కటే కాదు.. కలర్ ఉంటేనే షోలకు పిలుస్తారు: కీర్తి భట్
ఉగ్ర లింకులతో ఉలిక్కిపడ్డ ధర్మవరం
ఫ్యాటీ లివర్కు బొప్పాయితో చెక్
జియో కొత్త ప్లాన్ వచ్చింది.. చవగ్గా 28 రోజులు వ్యాలిడిటీ
ఉచిత బస్సు పథకం.. అసలు రంగు ఇదే!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
కాల్చిపడేస్తా ఖబడ్దార్!
వెండి నగలు కొంటున్నారా?: సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్!
సచిన్కు కాబోయే కోడలు సానియా ఆస్తి ఎంతో తెలుసా?
మీరేమైనా యుద్ధానికి వెళ్తున్నారా?.. వాహనాలకు ఆ రంగులేంటి?
మళ్లీ సెలవులొచ్చాయ్.. ఈ శుక్రవారం ఓటీటీల్లో 26 సినిమాలు!
ఈ రాశి వారికి రాబడి పెరుగుతుంది.. సంఘంలో విశేష గౌరవం
విరిగిపడిన కొండ చరియలు.. హైదరాబాద్లో భారీ ట్రాఫిక్ జాం
జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రం.. తొలి రోజే వార్-2కు షాకింగ్ కలెక్షన్స్!
‘వార్ 2 ’మూవీ రివ్యూ
మామూలు సమయంలోనే కనపడరు.. ఇక ఇప్పుడొచ్చి ఎలా ఆదుకుంటారనుకుంటున్నావ్!
దేశ ప్రజలకు శుభవార్త.. ట్యాక్స్పై ప్రధాని మోదీ కీలక ప్రకటన
కెప్టెన్గా రుతురాజ్పై వేటు.. జట్టులో పృథ్వీషాకు చోటు
రాత్రుళ్లు నిద్రపోడు, 60ఏళ్ల హీరో సూపర్ ఫిట్
రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ
బంగారం కొనడానికి ఇది మంచి తరుణం: ఎందుకంటే?
అనిల్ అంబానీకి భారీ విజయం
బుడమేరులో బోగస్ ఆపరేషన్!
సినిమా

శ్రీకృష్ణుడి యుద్ధం
చిత్ర పరిశ్రమలో తొలిసారిగా శ్రీ కృష్ణుడిని ఒక యుద్ధవీరుడి పాత్రలో చూపించనున్నట్లు ‘శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా’ చిత్రబృందం ప్రకటించింది. ముకుంద్ పాండే కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వంలో అభయ్ చరణ్ ఫౌండేషన్–శ్రీజీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై రూపొందనున్న ఈ చిత్రానికి ‘శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా’ టైటిల్ను ప్రకటించారు. ‘‘ఇస్కాన్–ఢిల్లీకి చెందిన సీనియర్ ప్రీచర్ ‘జితామిత్ర ప్రభు శ్రీ’ ఆశీస్సులతో ఈ చిత్రం రూపొందుతోంది.11–12వ శతాబ్దాల నాటి ‘మహోబా’ సాంస్కృతిక వైభవాన్ని, అలాగే భగవాన్ శ్రీ కృష్ణుడి దివ్యత్వాన్ని, ధీరత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపించేలా ఈ సినిమా ఉంటుంది. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ప్రపంచస్థాయి సాంకేతిక నిపుణులతో తెరకెక్కుతున్న ఈ చిత్రం చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మికతను కలగలుపుతుంది. నటీనటులు, సాంకేతిక బృందంతో పాటు పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి నిర్మాణ నిర్వహణ: అనిల్ వ్యాస్.

ఇద్దరు దేవదాసులు!
కాలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరీతో రూపొందిన చిత్రం ‘ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు’. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మీనన్, దిలీప్ హీరోలుగా, రాశీ సింగ్ హీరోయిన్గా నటించారు. తోట రామకృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతంపోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుగుతోంది.‘‘పార్వతి దేవదాసుల ప్రేమకథకు ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఇప్పుడు ‘ఒక పార్వతి... ఇద్దరు దేవదాసులు’ టైటిల్తో ఓ విభిన్నమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించనున్నాం. ముఖ్యంగా యువతీ యువకులను అలరించేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. రఘుబాబు, కశి రెడ్డి రాజ్కుమార్, వీరశంకర్, గౌతం రాజు తదితరులు నటించిన ఈ సినిమాకు సంగీతం: మోహిత్ రహమానియాక్, కెమెరా: శ్రీనివాసరాజు.

అడవుల్లో సాహసం
సాహసం చేయడానికి సై అంటూ కథానాయిక సంయుక్త అడవి బాట పట్టారు. దట్టమైన అడవుల్లో ఆమె ట్రెక్కింగ్కి వెళ్లారు. అందులోనూ వర్షం కురుస్తుండగా ధైర్యంగా ఈ సాహస యాత్ర చేశారు సంయుక్త. ఈ సాహస యాత్రకి సంబంధించిన ఫొటోలను అభిమానుల కోసం తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారామె. ‘‘దట్టమైన పచ్చని అడవిలో ప్రకృతి ఒడిలో ట్రెక్కింగ్ అంటే సాహసమే.పైగా వర్షం కురుస్తుండగా ట్రెక్కింగ్కి వెళ్లడం ఎంతో మధురానుభూతి. ఈ ట్రెక్కింగ్లో ఎన్నో చెప్పలేనన్ని సంతోషాలు, థ్రిల్కి గురిచేసే అంశాలున్నాయి. ఇలాంటి గొప్ప అనుభవాలు మీకు ఎదురయ్యాయా?’’ అంటూ రాసుకొచ్చారు సంయుక్త. ఇక ఆమె నటిస్తున్న తాజా సినిమాల విషయానికొస్తే... తెలుగులో ‘అఖండ 2, స్వయంభు, నారీ నారీ నడుమ మురారి, విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. అలాగే హిందీ, తమిళ, మలయాళ సినిమాలు చేస్తున్నారు.

హిందుస్తాన్... హిందుస్తాన్...
మేజర్ కుల్దీప్ సింగ్గా బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్ వెండితెరపైకి మళ్లీ వస్తున్నారు. సన్నీ డియోల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బోర్డర్ 2’. వరుణ్ ధావన్, దిల్జీత్ సింగ్, అహన్ శెట్టి, మేధా రాణా, మోనా సింగ్, సోనమ్ బజ్వా ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో మేజర్ కుల్దీప్ సింగ్ పాత్రలో కనిపిస్తారు సన్నీ డియోల్. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘బోర్డర్ 2’ సినిమాలోని సన్నీ డియోల్ పాత్ర తాలూకు మోషన్పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్.‘హిందుస్తాన్... హిందుస్తాన్... మేరీ జాన్ హిందుస్తాన్’ అనే పాటతో ఈ మోషన్పోస్టర్ సాగుతుంది. అనురాగ్ సింగ్ దర్శకత్వంలో భూషణ్ కుమార్, క్రిషణ్కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 22న విడుదల కానుంది. అయితే ఈ సినిమాను తొలుత జనవరి 23న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఒకరోజు ముందుగా... జనవరి 22న విడుదల చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.ఇక 1971లో జరిగిన ఇండియా–పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో సన్నీ డియోల్ హీరోగా నటించిన ‘బోర్డర్’ (1997) సినిమాకు సీక్వెల్గా ‘బోర్డర్ 2’ రూపొందింది. ‘‘27 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఓ వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ఓ సైనికుడు తిరిగి వస్తున్నాడు’’ అంటూ ఈ సినిమాను ప్రకటించిన సమయంలో ఈ చిత్రబృందం పేర్కొంది.
క్రీడలు

‘మహిళలు ఓపెన్ టోర్నీల్లో పాల్గొనాలి’
చెన్నై: మహిళల చెస్లో భారత క్రీడాకారిణులు ముందంజ వేయాలంటే ఎక్కువ సంఖ్యలో ఓపెన్ టోర్నీల్లో పాల్గొనాలని సీనియర్ ప్లేయర్, ఉమెన్ గ్రాండ్మాస్టర్ (డబ్ల్యూజీఎం) తానియా సచ్దేవ్ అభిప్రాయపడింది. మహిళల టోర్నీలకు పూర్తిగా దూరం కావద్దని... అయితే పురుషులతో ఓపెన్ కేటగిరీలో పోటీ పడితే ఆట ఎంతో మెరుగవుతుందని ఆమె వ్యాఖ్యానించింది. గత ఏడాది చెస్ ఒలింపియాడ్ నెగ్గిన భారత జట్టులో సభ్యురాలైన తానియా... ప్రస్తుతం చెన్నై గ్రాండ్మాస్టర్స్ టోర్నీలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ‘చెస్ కెరీర్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అమ్మాయిలు సాధ్యమైనన్ని ఎక్కువ ఓపెన్ టోర్నమెంట్లలో ఆడాలి. కేవలం మహిళల టోర్నీలకే పరిమితం కాకుండా పురుషులతో కలిసి శిక్షణ పొందడంతో పాటు వారితో పోటీ పడాలి. అప్పుడే వారి ఆట మరింత పదునెక్కుతుంది’ అని తానియా పేర్కొంది. అయితే పెద్ద స్థాయికి చేరే ముందు మహిళా టోర్నీల్లో విజయాలు సాధించడం కూడా ముఖ్యమని, అవి కెరీర్లో ముందుకు వెళ్లేందుకు కావాల్సిన ప్రేరణను అందిస్తాయని తానియా చెప్పింది. ‘మహిళల విభాగంలో సాధించే విజయాలను కూడా తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఇవి కొత్త తరం అమ్మాయిలు చెస్ను ఎంచుకునేందుకు కావాల్సిన స్ఫూర్తిని ఇస్తాయి. ఓపెన్ టోర్నీల్లో పాల్గొనడం, మహిళల టోర్నీల్లో టైటిల్స్ గెలవడం రెండూ కూడా ముఖ్యమే. ఏదీ తక్కువ కాదు. సరిగ్గా చెప్పాలంటే కెరీర్లో ఎదిగే సమయంలో ఇది మధ్యేమార్గంలాంటిది. అయితే కేవలం మహిళల టోర్నీల్లోనే పాల్గొంటే వారు తమ స్థాయిని తగ్గించుకున్నట్లే. పూర్తి స్థాయిలో తమ సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశాన్ని వారు కోల్పోతారు’ అని 38 ఏళ్ల తానియా విశ్లేషించింది. అంతర్జాతీయ స్థాయిలో మన మహిళా చెస్ క్రీడాకారిణుల తాజా ప్రదర్శన పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ‘ఫిడే’ వరల్డ్ కప్ ఫైనల్లో తలపడిన కోనేరు హంపి, దివ్య దేశ్ముఖ్లపై ఆమె ప్రశంసలు కురిపించింది. ‘మన దేశానికి సంబంధించి ఇప్పుడు చెస్లో స్వర్ణ యుగం నడుస్తున్నట్లుగా ఉంది. ఇలాంటి సమయంలో మేమేం తక్కువ కాదన్నట్లుగా మహిళలు నిరూపించుకుంటున్నారు. ఒక మెగా టోర్నీ ఫైనల్లో రెండు వేర్వేరు తరాలకు చెందిన భారత ప్లేయర్లు పోటీ పడటం మామూలు విషయం కాదు. చెస్ను చూసి ఈ ఆటను ఎంచుకోవాలనుకునే అమ్మాయిలకు ఇది కావాల్సినంత స్ఫూర్తిని అందిస్తుంది’ అని తానియా అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం కెరీర్ చివరి దశలో ఉన్నా తనలో ఇంకా సత్తా ఉందన్న తానియా... ఏడాదికి ఒకటి లేదా రెండు చొప్పున టోర్నీలు ఆడుతూ చెస్ వ్యాఖ్యానంపైనే ఎక్కువగా దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించింది.

భారత్లో రొనాల్డో ఆట!
చెన్నై: అంతా అనుకున్నట్లు జరిగితే... పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఆటను భారత అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభిస్తుంది. ఆసియా ఫుట్బాల్ కాన్ఫడరేషన్ (ఏఎఫ్సీ) చాంపియన్స్ లీగ్–2లో భాగంగా రొనాల్డో ప్రాతినిధ్యం వహిస్తున్న అల్ నాసర్ జట్టుతో గోవా ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) తలపడాల్సి ఉంది. దీంతో ఆ మ్యాచ్లో పాల్గొనేందుకు పోర్చుగల్ స్టార్ భారత్కు వచ్చే అవకాశం ఉంది. అయితే అల్ నాసర్ క్లబ్తో కాంట్రాక్ట్ ప్రకారం విదేశీ వేదికలపై జరిగే మ్యాచ్ల్లో రొనాల్డో పాల్గొనే అంశంలో కొన్ని సడలింపులు ఉన్నాయి. మరి రొనాల్డో గోవా ఎఫ్సీతో మ్యాచ్ కోసం భారత్కు వస్తాడా లేదా అనేది త్వరలోనే తేలనుంది. ఏఎఫ్సీ చాంపియన్స్ లీగ్2కు సంబంధించిన ‘డ్రా’ శుక్రవారం విడుదలైంది. ఈ టోర్నమెంట్లో భారత్ నుంచి గోవా ఎఫ్సీతో పాటు మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టు పాల్గొననుంది. వచ్చే నెల 16 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్లో మొత్తం 32 జట్లు పాల్గొననుండగా... వాటిని ఎనిమిది గ్రూప్లుగా విభజించారు. ఒక్కో గ్రూప్లో నాలుగు జట్లు ఉన్నాయి. గ్రూప్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన రెండు జట్లు నాకౌట్ దశకు అర్హత సాధించనున్నాయి. గత సీజన్లో లీగ్ షీల్డ్ దక్కించుకోవడం ద్వారా మోహన్ బగాన్ జట్టు నేరుగా ఈ టోర్నీకి అర్హత సాధించగా... ‘సూపర్ కప్’ గెలవడం ద్వారా గోవా ఎఫ్సీ ముందంజ వేసింది. ఏఎఫ్సీ చాంపియన్స్ లీగ్లో గోవా జట్టు పాల్గొనడం ఇది రెండోసారి. 2021లోనూ గోవా జట్టు ఈ టోర్నీలో ఆడింది. సెపె్టంబర్ 16న ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్... వచ్చే ఏడాది మే 16న జరగనున్న ఫైనల్తో ముగియనుంది. లీగ్లో భాగంగా... ఇంటాబయట మ్యాచ్లు జరగడం పరిపాటి కావడంతో గోవా ఎఫ్సీతో తలపడేందుకు అల్ నాసర్ తరఫున రొనాల్డో భారత్కు వస్తాడనే వార్తలు వ్యాపించాయి. గ్రూప్ ‘సి’లో ఫూలద్ మొబారకేశ్ సెపాహన్ ఎస్సీ (ఇరాన్), అల్ హుసేన్ (జోర్డాన్), అహల్ ఎఫ్సీ (తుర్క్మెనిస్తాన్)తో కలిసి మోహన్ బగాన్ పోటీ పడనుంది. గ్రూప్ ‘డి’లో గోవా ఎఫ్సీతో పాటు అల్ నాసర్ క్లబ్ (సౌదీ అరేబియా), అల్ జవ్రా ఎస్సీ (ఇరాక్), ఇస్తిక్లోల్ ఎఫ్సీ (తజకిస్తాన్) ఉన్నాయి.

డిసెంబర్లో మోదీతో మెస్సీ భేటీ
కోల్కతా: అర్జెంటీనా సూపర్స్టార్ ఫుట్బాలర్ లయోనల్ మెస్సీ భారత పర్యటన ఖరారైంది. చాలా రోజులుగా భారత టూర్ ఉంటుందని వార్తలు వస్తుండగా... తాజాగా షెడ్యూల్ను ప్రకటించారు. మెస్సీ పర్యటనను ‘గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్) టూర్ ఆఫ్ ఇండియా’గా నిర్వహిస్తున్నట్లు ప్రముఖ ఈవెంట్ ప్రమోటర్ శతద్రు దత్తా శుక్రవారం వెల్లడించారు. ఈ మధ్య సెలబ్రిటీలు టెన్నిస్ తరహా రాకెట్తో ఆడే ఆటే ‘ప్యాడెల్’. అయితే ఇది పూర్తిగా టెన్నిస్ ఆడే రాకెట్ కాదు. కాస్త భిన్నంగా ఉంటుంది. డిసెంబర్ 12 నుంచి 15 వరకు భారత్లోని ప్రముఖ నగరాలైన కోల్కతా, ముంబై, ఢిల్లీ అహ్మదాబాద్లలో మెస్సీ భారత అభిమానులను అలరిస్తారు. ప్రతీ నగరంలోనూ చిన్నారులు, యువ ఫుట్బాలర్లతో కలుస్తారు. మన ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. నాలుగు రోజుల బిజీ పర్యటనలో ముందుగా అతను కోల్కతాలో అడుగు పెడతాడు. ఫుట్బాల్ అంటేనే శివాలుగే కోల్కతాలో డిసెంబర్ 12న మెస్సీ గడుపుతారు. ఈడెన్ గార్డెన్స్ లేదంటే సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు గోట్ ఆట ఆడతారు. దీంతో పాటు భారత మాజీ కెపె్టన్ గంగూలీ, బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం, ఫుట్బాల్ కెపె్టన్ బైచుంగ్ భూటియాలతో కలిసి సెవెన్–ఎ–సైడ్ సాఫ్ట్టచ్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడతారు. సాధారణ ప్రేక్షకులను కూడా ఈ సెలబ్రిటీ మ్యాచ్ చూసేందుకు అనుమతిస్తారు. రూ. 3500 నుంచి మొదలయ్యే టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందని నిర్వాహకుడు శతద్రు దత్తా తెలిపారు. మెస్సీ పర్యటనపై బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీకి వెల్లడించినట్లు ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఈ సందర్భంగా ఆమె పోలీసు శాఖను ఆదేశించినట్లు పేర్కొన్నారు. కోల్కతా పోలీస్ కమిషనర్ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పక్కా ప్లాన్ చేస్తామని హామీ ఇచ్చినట్లు దత్తా చెప్పారు. 14న ముంబైలో హేమాహేమీలతో... మరుసటి రోజు డిసెంబర్ 13న మెస్సీ అహ్మదాబాద్కు పయనమవుతాడు. అక్కడ అదానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ప్రైవేట్ కార్యక్రమంలో అతను పాల్గొంటాడు. అటునుంచి 14న నేరుగా ముంబై చేరుకుంటాడు. సీసీఐ బ్రాబౌర్న్ ఏర్పాటు చేసే కార్యక్రమంలో హేమాహేమీలతో భేటీ అవుతాడు. వాంఖెడే స్టేడియంలో ముంబై ప్యాడెల్ కప్లో పాల్గొంటాడు. అధికారికంగా వెల్లడించనప్పటికీ బాలీవుడ్, స్పోర్ట్స్ దిగ్గజాలు షారుక్ ఖాన్, రణ్వీర్ సింగ్, ఆమిర్ ఖాన్, టైగర్ ష్రాఫ్, లియాండర్ పేస్, సచిన్ టెండూల్కర్, ధోని, రోహిత్ శర్మలతో టెన్నిస్ తరహా రాకెట్తో ఆడే ప్యాడెల్ ఈవెంట్లో మెస్సీ కాసేపు ఆడనున్నాడు. మరుసటి రోజు డిసెంబర్ 15న ఢిల్లీకి పయనమవుతాడు. అక్కడ మొదట భారత ప్రధాని నరేంద్ర మోదీతో మర్యాద పూర్వకంగా కలిశాక... ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జరిగే ఢిల్లీ అంచె గోట్ కప్లో కింగ్ కోహ్లి, శుబ్మన్ గిల్లతో కలిసి ఆడతాడు. సరిగ్గా ధర్మశాలలో డిసెంబర్ 14న దక్షిణాఫ్రికాతో జరిగే టి20 అనంతరం ఢిల్లీలో ఈ ఈవెంట్ జరుగుతుందని ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) వర్గాలు తెలిపాయి.

చివరి ఓవర్లో ఛేదించి...
బ్రిస్బేన్: ఆ్రస్టేలియా పర్యటనలో టి20 సిరీస్ కోల్పోయిన భారత మహిళల ‘ఎ’ జట్టు... వన్డే సిరీస్లో సత్తా చాటింది. మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో కైవసం చేసుకుంది. శుక్రవారం హోరాహోరీగా సాగిన రెండో వన్డేలో భారత ‘ఎ’ జట్టు 2 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియా మహిళల ‘ఎ’ జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ అలీసా హీలీ (87 బంతుల్లో 91; 8 ఫోర్లు, 3 సిక్స్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... కిమ్ గార్త్ (41 నాటౌట్; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడింది. భారత బౌలర్లలో మిన్ను మణి 46 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా ... సైమా ఠాకూర్ 30 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. టిటాస్ సాధు, రాధా యాదవ్, ప్రేమ రావత్, తనూజ కన్వర్లకు ఒక్కో వికెట్ లభించింది. అనంతరం లక్ష్యఛేదనలో భారత మహిళల ‘ఎ’ జట్టు 49.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ రాధ యాదవ్ (78 బంతుల్లో 60; 5 ఫోర్లు, 1 సిక్స్), యస్తిక భాటియా (71 బంతుల్లో 66; 9 ఫోర్లు), తనూజ కన్వర్ (57 బంతుల్లో 50; 3 ఫోర్లు) హాఫ్సెంచరీలతో కదంతొక్కారు. షఫాలీ వర్మ (4), ధారా గుజ్జర్ (0), తేజల్ హసబ్నిస్ (19), రాఘ్వీ బిస్త్ (14) విఫలమయ్యారు. సహచరుల నుంచి పెద్దగా సహకారం లభించకపోయినా... ఆరంభంలో యస్తిక ఇన్నింగ్స్ను నడిపించింది. ఆ తర్వాత ఆ బాధ్యతను రాధ యాదవ్ సక్రమంగా నిర్వర్తించగా... ఆఖర్లో తనూజ అదరగొట్టింది. అర్ధశతకం అనంతరం రాధా యాదవ్ అవుట్ కావడంతో భారత జట్టు 193/7తో నిలిచింది. ఇక ఛేదన కష్టమే అనుకుంటున్న తరుణంలో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ తనూజ కన్వర్ చక్కటి ఆటతీరుతో చెలరేగింది. ప్రేమ రావత్ (33 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు)తో కలిసి ఎనిమిదో వికెట్కు 68 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించింది. చివరి ఓవర్ తొలి బంతికి తనూజ అవుట్ కావడంతో ఉత్కంఠ నెలకొన్నా... ప్రేమ రావత్ విజయానికి కావాల్సిన 5 పరుగులు చేసి మరో బంతి మిగిలుండగానే జట్టును గెలిపించింది. ఇదే వేదికపై బుధవారం జరిగిన తొలి వన్డేలో భారత ‘ఎ’ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే ఆదివారం ఇక్కడే జరగనుంది.
బిజినెస్

ఐపీవోకి ఆర్ఎస్ బ్రదర్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దుస్తుల రిటైలింగ్ సంస్థ ఆర్ఎస్బీ రిటైల్ ఇండియా (ఆర్ఎస్ బ్రదర్స్) పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీని ప్రకారం రూ. 500 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, 2.98 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద ప్రమోటర్లు విక్రయించనున్నారు. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 275 కోట్లను నిర్దిష్ట రుణాల చెల్లింపునకు, రూ. 118 కోట్ల మొత్తాన్ని ఆర్ఎస్ బ్రదర్స్, సౌతిండియా షాపింగ్ మాల్ ఫార్మాట్లలో కొత్త స్టోర్స్ను ఏర్పాటు చేసేందుకు కంపెనీ వినియోగించుకోనుంది. సంస్థకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో మొత్తం 73 స్టోర్స్ ఉన్నాయి. సౌతిండియా షాపింగ్ మాల్, ఆర్ఎస్ బ్రదర్స్, కాంచీపురం నారాయణి సిల్క్స్, డి రాయల్, వేల్యూ జోన్ హైపర్మార్ట్ పేరిట వివిధ ఫార్మాట్లలో స్టోర్స్ నిర్వహిస్తోంది. పొట్టి వెంకటేశ్వర్లు, సీర్న రాజమౌళి, తిరువీధుల ప్రసాద రావు తదితరులు ప్రమోటర్లుగా ఉన్నారు. 2024–25లో కంపెనీ రూ. 2,694 కోట్ల ఆదాయం, రూ. 104 కోట్ల లాభం నమోదు చేసింది.

ఇక జీఎస్టీలో రెండే శ్లాబులు!
న్యూఢిల్లీ: సామాన్యులకు వస్తు సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు వీలుగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో రెండు రేట్ల విధానాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. స్టాండర్డ్ (ప్రామాణిక), మెరిట్ (యోగ్యత) కింద వీటిని వర్గీకరిస్తూ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన ప్యానెల్కు నివేదించింది. వీటిపై అధ్యయనం అనంతరం జీఎస్టీ కౌన్సిల్ ముందు ప్యానెల్ తన సిఫారసులు ఉంచనుంది. దాదాపు అన్ని రకాల వస్తు, సేవలు రెండు రేట్ల పరిధిలోనే ఉంటాయి. విలాస, హాని కారక వస్తువులపై మాత్రం 40% ప్రత్యేక రేటు అమలు కానుంది. దీంతో నిత్యావసరాలు, వాహనాలు సహా ఎన్నో రకాల వస్తు, సేవల రేట్లు గణనీయంగా తగ్గనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే కొత్త విధానాన్ని అమలు చేయాలన్న సంకల్పాన్ని ఆర్థిక శాఖ వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో జీఎస్టీ చట్టాన్ని సంస్కరించనున్నట్టు ప్రకటించారు. పన్నుల భారం గణనీయంగా తగ్గుతుందంటూ, దీన్ని దీపావళి కానుకగా అభివర్ణించారు. రోజువారీ వినియోగ వస్తువుల రేట్లు చౌకగా మారనున్నట్టు చెప్పారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. ప్రధాని ప్రసంగం తర్వాత ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. జీఎస్టీలోనే ఎన్నో పన్నులు.. ప్రస్తుతం జీఎస్టీ పరిధిలో 5, 12, 18, 28 శాతం రేట్లు అమల్లో ఉన్నాయి. కొన్నింటిని జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయించగా, విలాస వస్తువులు, సిగరెట్లు వంటి హానికారక (సిన్గూడ్స్) వస్తువులపై 28 శాతం రేటుకు అదనంగా కాంపెన్సేషన్ సెస్ (రాష్ట్రాల కోసం ఉద్దేశించిన పరిహార పన్ను) అమలవుతోంది. 5% పన్ను పరిధిలో 21 శాతం వస్తువులు ఉన్నాయి. 12% పన్ను రేటు కింద 19 శాతం.. 18% పన్ను పరిధిలో 44% వస్తు సేవలు ఉన్నాయి. 12% శ్లాబును ఎత్తివేసి ఇందులో ఉన్న వస్తు, సేవలను 5, 18 శాతం రేట్ల పరిధిలోకి మార్చొచ్చని తెలుస్తోంది. 12 శాతం రేటు పరిధిలోని 99 శాతం వస్తువులు 5 శాతం పరిధిలోకి వెళ్లనున్నట్టు.. 28 శాతం పరిధిలోని 90 శాతం వస్తు సేవలు 18 శాతం రేటు పరిధిలోకి వెళ్లనున్నట్టు సమాచారం. పొగాకు ఉత్పత్తులు, ఆన్లైన్ గేమింగ్ తదితర కొన్ని 40 శాతం పన్ను పరిధిలో ఉంటాయి. ముఖ్యంగా ఆటోమొబైల్, టెక్స్టైల్స్, ఫెర్టిలైజర్స్, పునరుత్పాదక ఇంధనాలు, హస్తకళలు, వ్యవసాయం, ఆరోగ్యం, బీమా తదితర రంగాలకు ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా బంగారంపై 3 శాతం ప్రత్యేక రేటు అమలవుతోంది. దీన్ని అలాగే కొనసాగిస్తారా? లేక 5 శాతం రేటు పరిధిలోకి తెస్తారా? అన్న దానిపై ఇప్పటికి స్పష్టత లేదు. రేట్ల తగ్గింపు కారణంగా రాష్ట్రాలకు ఆదాయం తగ్గినట్టయితే దీన్ని ఎలా భర్తీ చేస్తారో చూడాలి. అలాగే, విలాసవంత, హానికారక వస్తువులపై 28 శాతం పన్నుకు అదనంగా అమలు చేస్తున్న కాంపెన్సేషన్ సెస్సు గడువు 2026 మార్చి 31తో ముగియనుంది. ఈ రూపంలో వచ్చే ఆదాయం ఆ తర్వాత తగ్గనుంది. అయితే, దీన్ని ఎలా సర్దుబాటు చేస్తారన్నది ఆసక్తిగా మారింది. అయితే, రేట్ల తగ్గింపుతో వినియోగం పెరిగి, అదనపు ఆదాయం సమకూరుతుందన్నది ఆర్థిక శాఖ అంచనా. 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచి్చన జీఎస్టీ విధానంలో తొలిసారి పెద్ద ఎత్తున మార్పు చోటుచేసుకోనుంది. జీఎస్టీ రేట్ల క్రమబద్ధీకరణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని, దీన్ని సరైన సమయంలో సరైన చర్యగా ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. సెప్టెంబర్లో కీలక భేటీ.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాష్ట్రాల మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ వచ్చే నెలలోనే సమావేశం కానుంది. ఈ సమావేశంలోనే జీవిత, ఆరోగ్య బీమాలపై పన్ను తగ్గింపు సహా జీఎస్టీలో రేట్ల క్రమబదీ్ధకరణపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పన్నుల తగ్గింపు వల్ల సమాజంలోని అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని, వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని అంచనా వేస్తోంది. గుర్తింపు పరమైన వివాదాలను తొలగిస్తుందని, కొన్ని రంగాలకు ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ను సరిచేస్తుందని.. రేట్ల పరమైన స్థిరత్వం ఏర్పడి వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తుందని భావిస్తోంది. రాష్ట్రాల విస్తృత ఏకాభిప్రాయంతో తదుపరి తరం సంస్కరణలను అమలు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ‘‘జీఎస్టీ కౌన్సిల్ తన తదుపరి భేటీలో మంత్రుల బృందం సిఫారసులపై చర్చిస్తుంది. సాధ్యమైనంత త్వరగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. దీంతో ఆశించిన ప్రయోజనాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సాకారమవుతాయి’’అని పేర్కొంది.

32 ఏళ్లుగా అలాగే బతుకుతున్నాం: ఆకాశ్ అంబానీ
దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపార కుటుంబమైన ముఖేష్ అంబానీ కుటుంబం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎన్ని కోట్లున్నా ఆయన కుటుంబంలోని ప్రతిఒక్కరూ అంతే హుందాతనాన్ని ప్రదర్శిస్తారు. తండ్రి నుంచి వ్యాపార నైపుణ్యాన్ని అందిపుచ్చుకున్న ఆకాశ్ అంబానీ.. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్గా ఆ సంస్థను విజవంతంగా నడిపిస్తున్నారు.ప్రతిఒక్కరికీ తమ జీవితంలో ఎవరోఒకరు ప్రేరణగా నిలుస్తుంటారు. ఇదే క్రమంలో తనకు ప్రేరణ ఎవరని అడిగితే ఆకాశ్ అంబానీ మొదట పేర్కొన్నది కార్పొరేట్ ఐకాన్లు లేదా గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్స్ కాదు.. తమ తల్లిదండ్రులేనని గర్వంగా చెబుతారు. ఆమధ్య ముంబై టెక్ వీక్ లో మాట్లాడిన సందర్భంగా గట్టి బంధం ఉన్న కుటుంబంలో పెరగడం తన పని నైతికతను, ఏకాగ్రతను ఎలా తీర్చిదిద్దిందో వివరించారు. నిస్సందేహంగా, మేము పెరిగిన కుటుంబమే అతిపెద్ద ప్రేరణ అని ఆయన అన్నారు. 32 ఏళ్లుగా తామంతా ఒకే గొడుగు కింద జీవిస్తున్నామని, ముఖ్యంగా తన తల్లిదండ్రుల నుంచి స్ఫూర్తి ఎప్పటికీ ఉంటుందని అన్నారు.ఇప్పటికీ తల్లిదండ్రుల నుంచి రోజువారీ క్రమశిక్షణ, వ్యక్తిగత నిబద్ధతను గమనిస్తుంటానంటారు ఆకాశ్. ముఖేష్ అంబానీ ఇప్పటికీ అర్ధరాత్రి 2 గంటల వరకు తనకు వచ్చే ప్రతి ఈమెయిల్ నూ చదివి క్లియర్ చేస్తారని, ఆ పని ఆయన నలబై ఏళ్లుగా చేస్తున్నారని, ఇక్కడి నుంచే తనకు స్ఫూర్తి వచ్చిందని ఆకాశ్ వివరించారు. ఇక తన తల్లి నీతా అంబానీ నుంచి ఏకాగ్రతతో కూడిన అంకితభావాన్ని ప్రేరణ పొందతానన్నారు.

జీఎస్టీ స్లాబ్ల తగ్గింపునకు కేంద్రం అడుగులు!
దేశవ్యాప్తంగా అమలులో ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) పన్ను నిర్మాణాన్ని మరింత సరళీకరించే పనిని కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టింది. ఈ మేరకు కీలక ప్రతిపాదనలు రూపొందించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న నాలుగు ప్రధాన స్లాబ్లను కుదించి రెండు ప్రధాన స్లాబ్లుగా మారుస్తోంది. తాజా ప్రతిపాదనల ప్రకారం.. 12 శాతం, 28 శాతం, స్లాబ్లను రద్దు చేసి 5 శాతం, 18 శాతం మాత్రమే కొనసాగించాలన్న ఆలోచనను కేంద్ర ఆర్థిక శాఖ ముందుంచినట్లు సమాచారం.నూతన ప్రతిపాదనల ప్రకారం.. 28 శాతం స్లాబ్ పరిధిలోని 90 శాతం వస్తువులను 18 శాతం పరిధిలోకి, అలాగే 12 శాతం స్లాబ్ పరిధిలోని 99 శాతం వస్తువులను 5 శాతం కిందికి తీసుకురానున్నారు. ప్రస్తుతం 12 శాతం స్లాబ్లో ఉన్న టూత్పేస్ట్, మొబైల్ ఫోన్లు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, బట్టలు, బూట్లు వంటి మధ్యస్థాయి వినియోగ వస్తువులను 5 శాతం స్లాబ్లోకి మార్చే యోచన ఉంది. ఇదే సమయంలో, 28 శాతం స్లాబ్లో ఉన్న కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కొన్ని సేవలను 18 శాతం స్లాబ్లోకి తరలించనున్నారు.ప్రత్యేకంగా 40 శాతం స్లాబ్ జీఎస్టీ పన్ను నిర్మాణంలో ప్రధానంగా రెండు స్లాబ్లే కొనసాగనున్నప్పటికీ కొన్ని హానికరమైన వస్తువుల కోసం ప్రత్యేకంగా 40 శాతం స్లాబ్ను ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. ఈ స్లాబ్లో తంబాకు, గుట్కా, సిగరెట్లు వంటి కేవలం 5–7 వస్తువులే ఉండే అవకాశం ఉంది.ఈ మార్పుల వల్ల నిత్యావసర వస్తువులపై పన్ను భారం తగ్గి, వినియోగదారులకు ఉపశమనం కలగనుంది. ముఖ్యంగా మధ్యతరగతి, పేదవర్గాలపై నెలవారీ ఖర్చుల ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. కేంద్రం అంచనా ప్రకారం, ఈ స్లాబ్ మార్పుల వల్ల రూ. 40,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్ల వరకు రెవెన్యూ నష్టం జరగవచ్చని భావిస్తున్నప్పటికీ, వినియోగం పెరిగి, పన్ను ఆదాయం తిరిగి స్థిరపడే అవకాశం ఉందని అధికారులు విశ్వసిస్తున్నారు. అయితే పెట్రోలియం ఉత్పత్తులు ఇప్పటికీ జీఎస్టీ పరిధిలోకి లేవు.స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ జీఎస్టీ మార్పులను "డబుల్ దీపావళి గిఫ్ట్"గా ప్రజలకు ప్రకటించారు. పన్ను వ్యవస్థను సరళీకరించడం ద్వారా ప్రజలపై పన్ను భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చ జరగనుంది. జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది.
ఫ్యామిలీ

"నిశ్శబ్ద సంక్షోభం"గా ఊబకాయం: ప్రధాని మోదీ
స్వాతంత్ర్య దినోత్సవ వేళ ప్రధాని మోదీ యువతకు, ప్రజలకు ఎన్నో వరాలజల్లు కురిపించేలా పథకాలను అందించడమే కాకుండా ప్రజా ఆరోగ్యంపై కూడా మాట్లాడారు. ఈమేరకు ఢిల్లీ ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..ప్రస్తుతం ప్రజలంతా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యపై కీలక వ్యాఖ్యలతోపాటు కొన్ని సూచనలు కూడా అందించారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని సుమారు 103 నిమిషాల పాటు జరిగిన ప్రసంగంలో లక్షలాది మంది పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ..జీవనశైలిలో వస్తున్న మార్పులు, సరైన ఆహారపు అలవాట్ల లేమి, తగిన శారీరక శ్రమ లేకపోవడం కారణంగా గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు, వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం ఎలా పెరిగిపోతోందో నొక్కి చెప్పారు. అంతేగాదు రాబోయే సంవత్సరాల్లో ఊబకాయం మన దేశానికి పెద్ద సవాలుగా మారవచ్చు అని కూడా అన్నారు. ప్రతి కుటుంబంలో నూనె వాడకాన్ని సుమారు 10% తగ్గిస్తే ఇది దేశ ఆరోగ్యానికే మేలు చేస్తుందని చెప్పారు. వంటనూనెతో వ్యాధుల కనెక్షన్..ప్రధాని మోదీ నూనె వాడకం గురించి ఇచ్చిన పిలుపు నిజంగా సరైనదేనా..అంటే..ముమ్మాటికి కరెక్టేనని చెబుతున్నారు నిపుణులు. అధిక నూనె వినియోగం వల్ల సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్లు శరీరంలో అధికమై బరువు పెరిగేందుకు దారితీస్తుందని తెలిపారు. అలాగే ఈ అధిక కొలెస్ట్రాల్ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాని పెంచేస్తుందని పోషకాహారా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే మోదీ భారతీయులు తక్కువ నూనెను ఉపయోగించే సాంప్రదాయ వంట పద్ధతులను స్వీకరించడం తోపాటు ఆవిరి పట్టడం, వేయించడం, ఉడకబెట్టడం, వంటి వాటిపై ఆధారపడాలని, మొక్కల ఆధారిత పదార్థాలను చేర్చుకోవాలని ప్రజలకు హితవు పలుకుతున్నారు. జీవనశైలిపై దృష్టి సారించాలి..ఒత్తిడి, ఆందోళనతో యువత బాధపడటానికి కారణం, యోగా ధ్యానం వంటి అలవాట్ల లేమి కారణమని చెబుతున్నారు మోదీ. కనీసం నడక, సైక్లింగ్, కొద్దిపాటి వ్యాయామాలు చేయాలని సూచించారు. ప్రాసెస్ చేసిన పదార్థాలకు దరిచేరనీయకుండా తృణధాన్యాలు, కూరగాయలు, కాలానుగుణ పండ్లను తీసుకోవాలని సూచించారు. చారిత్రాత్మకంగా భారత్ అనుసరించే సమతుల్య సాంప్రదాయ ఆహార జ్ఞానానికి మళ్లీ తిరిగి రావాలని ఆ ప్రసంగంలో కోరారు.ఎందకు ఈ హెచ్చరికలు అంటే..ఈ ఊబకాయం ప్రస్తుతం నగరాలకే పరిమితం కాలేదు. భారతదేశంలో 24% మంది మహిళలు, 23% మంది పురుషులు అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు. పట్టణ ప్రాంతంలో ఈ పరిస్థితి మరి ఎక్కువగా ఉంది. బాధకరం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరిస్థితి ఇలానే ఉండటమేనని అన్నారు మోదీ. అందుకు ప్రధాన కారణం కేలరీలు అధికంగా ఉండే ఆహార పదార్థాల వినియోగమేనని చెప్పారు.ఇక 136 మిలియన్ల మందికి పైగా ప్రీ డయాబెటిస్ ఉంది. అందులో ఎక్కువ భాగం ఊబకాయం కారణంగా ఈ వ్యాధి బారినపడినవే.బడి వయసు పిల్లలు సైతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.ఊబకాయం కారణంగా వచ్చే వ్యాధుల ప్రమాదం..ఊబకాయం బహుళ దీర్ఘకాలిక పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటంటే..టైప్ 2 డయాబెటిస్రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులురొమ్ము, పెద్దప్రేగు కేన్సర్తో సహా కొన్ని రకాల కేన్సర్లుకీళ్ల ఒత్తిడి కారణంగా వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ తదితరాలు వస్తాయి.దీన్ని గనుక ఆదిలోనే అదుపులో ఉంచే ప్రయత్నం చేయకపోతే 2035 నాటికి, ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు ఈ అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడే అవకాశం ఉందని వరల్డ్ ఒబెసిటీ సమాఖ్య అంచనా వేసింది.ఆరోగ్యం కోసం జాతీయ మిషన్..ఊబకాయంపై వ్యతిరేకంగా పోరాడటాన్ని వ్యక్తిగత బాధ్యత, సమిష్టి లక్ష్యంగా రూపొందించారు మోదీ. నిజానికి చమురు వినియోగాన్ని 10% తగ్గించాలనే ఆయన సూచన పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు..పైగా అందరూ సులభంగా ఆచరించదగినదే. తర్వాతి తరాలకి ఆరోగ్యకరమైన దేశాన్ని బహుమతిగా ఇవ్వాలన్న ఆకాంక్షతో మోఈ ప్రజలకు ఈ ఆరోగ్య సూచనలిచ్చారు. ఆ నేపథ్యంనే మోదీ ఫిట్ ఇండియా ఉద్యమం, పోషన్ అభియాన్ వంటి ప్రచార కారక్రమాలను చేపట్టారు.ఆచరణలోకి తీసుకురాగలమా అంటే..ప్రధాని మోదీ పిలుపుని ఆచరణలో పెట్టేందుకు ఏమంత కష్టపడిపోవాల్సిన పనిలేదు..జస్ట్ ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే చాలు..వంట చేసే మందుకు నూనెను కొలత ప్రకారం ఉపయోగిస్తే చాలు. కంటైనర్ నుంచి నేరుగా కాకుండా ఒక స్పూన్ లేదా కొలతగా పెట్టుకున్న మరేదైనా చాలు. ఆరోగ్యకరమైన నూనెలు ఎంచుకోండి. అంటే ఆవాలు, వేరుశెనగ, బియ్యం ఊక నుంచి వచ్చే ఆయిల్ వంటి వాటిని ఎంచుకోండి. డీప్ ఫ్రై చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. రోజుకు 30 నిమిషాలు నడక లేదా కొద్దిపాటి వ్యాయమాలకి కేటాయించే ప్రయత్నం చేయండి చాలు.గమనిక: ఇది కేవలం అవగామన కోసంమ మాత్రమే ఇచ్చాం. పూర్తి వివ్రాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: స్వేచ్ఛా తరంగాలు..! నవతరానికి స్ఫూర్తి ఈ నారీమణులు..)

షేరెంటింగ్ ముప్పు...పేరెంట్స్ పారాహుషార్
సోషల్ మీడియా రాక ముందు, పిల్లల గారాలు ఇంటి గడప దాటేవి కావు. మహా అయితే స్నేహితులకు, ఇరుగు పొరుగువారికి, బంధువులకు.. పిల్లల ఘనకార్యాల గురించి చెప్పుకొని మురిసిపోయేవారు తల్లిదండ్రులు. పుట్టినరోజు వేడుకల వంటివి చేసినప్పుడు ఆ ఫొటోలు ఉన్న ఆల్బమ్ను ఇంటికి వచ్చిన వారికి చూపించేవారు. సాధారణంగా ప్రతి ఇంట్లోనూ ఇలానే ఉండేది. కానీ ఇప్పుడు ఆ మురిపాలు ఖండాలు దాటుతున్నాయి! పిల్లల ఫొటోలను ఆన్లైన్లో పంచుకోవాలనే సంతోషం సహజమే అయినప్పటికీ, అందువల్ల రాబోయే ప్రమాదాల గురించి కూడా తల్లిదండ్రులు తెలుసుకుని ఉండాలి.ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్, యూట్యూబ్, టెలిగ్రామ్, స్నాప్ చాట్ వంటి విస్తృతి కలిగిన సోషల్ మీడియా వేదికలు అందుబాటులోకి వచ్చాక.. పిల్లలకు సంబంధించిన ప్రతి సంతోషాన్ని తల్లిదండ్రులు ప్రపంచంతో షేర్ చేసుకుంటున్నారు. అయితే అలా షేర్ చేయటం ఆ చిన్నారుల గోప్యతకు భంగం కలుగుతుందని ఆన్లైన్లో కొన్ని సంఘటనలు జరిగే వరకు తల్లిదండ్రులు గ్రహించ లేకపోతున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్మార్ఫింగ్తో మహా ప్రమాదంపిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయటా న్ని ‘షేరెంటింగ్’ అంటున్నారు. దీనివల్ల పిల్లల గురించిన పూర్తి సమాచారం ఇంటర్నెట్లోకి వెళ్లిపోతుంది. కొందరు తల్లిదండ్రులు పిల్లల ఫొటోలపై ఎమోజీలు పెట్టి.. ముఖం కనిపించలేదు, ఇక సేఫ్ అనుకుంటున్నారు. అంతకంటే మూర్ఖత్వం మరోటి లేదు. ఇది ఏఐ యుగం అని మరిచిపోతే ఎలా? వారి ఫొటోలను మార్ఫింగ్ చేసేవాళ్లు, వారి వివ రాలను తమ స్వార్థానికి ఉపయోగించుకునే వాళ్లు ఉంటారు. పిల్లలపై ఆన్లైన్ వేధింపులూ జరగొచ్చు. తమకసలు సంబంధమే లేకుండా పిల్లలు నలుగురు నోళ్లలోనూ నానుతారు. దీనికంతటికీ కారణం తల్లిదండ్రుల అత్యుత్సాహమే.అన్నీ చెప్పేసుకుంటే ముప్పుపిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సైబర్ క్రైమ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమ పిల్లల ప్రైవసీని కాపాడటం తల్లిదండ్రుల బాధ్యతేనని సోషల్ మీడియా ధోరణుల అధ్యయన నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు. పిల్లల వివరాలన్నీ బయటికి వెళ్లిపోతే, ఏ వైపు నుంచైనా హాని, లేదా నష్టం సంభవించవచ్చని చెబుతున్నారు.దొంగచేతికి తాళం ఇచ్చినట్లే!పిల్లల ఫొటోలు.. ముఖ్యంగా వారి పేర్లు, పుట్టిన తేదీలు లేదా వారి లొకేషన్ను బహిర్గతం చేసే వివరాలతో ఉన్న పోస్టులను సైబర్ నేరస్థులు ఊహించని విధంగా వాడుకునే ప్రమాదం ఉంటుంది. తల్లిదండ్రులు షేర్ చేసిన పోస్టుల ఆధారంగా దొంగిలించిన సమాచారాన్ని తప్పుడు బ్యాంకు ఖాతాలను తెరవడానికి, అప్పుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి, లేదా ఈ పిల్లల్ని వేరే పిల్లలుగా నమ్మించి ఎవరినైనా మోసం చేయటానికి వాడుకో వచ్చు. ఇటీవల ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నాయి.పేరెంట్స్.. పారాహుషార్కడుపున పుట్టిన పిల్లలే అయినా వారి సమ్మతి లేకుండా వారి ఫొటోలను, వీడియోలను తల్లిదండ్రులు షేర్ చేయటానికి లేదు. ఒకవేళ పిల్లలు తెలియక సమ్మతించినా పెద్దలు ఆలోచించాలి. పిల్లల గోప్యతకు గౌరవం ఇవ్వాలి. పిల్లలు పెద్దయ్యాక, తమ తల్లిదండ్రులు షేర్ చేసిన తమ చిన్ననాటి ఫొటోల గురించి తెలిసి ఇబ్బంది పడవచ్చు. బాల్యంలోని ఫొటోలను స్నేహితులు చూసి.. లావుగా ఉన్నారనో, నల్లగా ఉన్నారనో వ్యాఖ్యలు చేయవచ్చు. అవి వారిని చాలా బాధిస్తాయి. ఎప్పటివో ఫొటోలు సోషల్ మీడియా సముద్రంలో పడి.. ఇప్పుడు సమస్యల సుడిగుండాలు సృష్టిస్తాయి.భవిష్యత్తుపై ప్రభావం : కాలేజ్ అడ్మిషన్లు, ఉద్యోగ దరఖాస్తుల సమయంలో వారి భవిష్యత్ అవకాశాలను ఏ రూపంలోనైనా అవి ప్రభావితం చేయవచ్చు. మామూలు ఫొటోకు కథనం అల్లి, ఇంటర్నెట్లో తిప్పేవారు ఉంటారు. చదువు, ఉద్యోగాలలోనే కాదు, పెళ్లి సంబంధాల విషయంలోనూ అవాంతరాలు రావచ్చు. (Independence day ఫ్యాషన్ క్లిక్.. మువ్వన్నెల వస్త్రాలు)వేటాడే కళ్లకు చిక్కినట్లే! పిల్లలు స్నానం చేస్తున్నప్పటి ఫొటోలు, బట్టలు మార్చుకుంటున్నప్పటి ఫొటోలు కూడా కొన్ని సార్లు షేర్ అవుతుంటాయి. సైబర్ క్రిమినల్స్లోని వేటగాళ్ల కంట్లో ఆ ఫొ టోలు పడితే.. ఇక వాటిని వాళ్లు అసభ్య కరమైన వెబ్సైట్లకు షేర్ చేసే ప్రమాదం ఉంటుంది.ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీతో పిల్లల ఫొటోలను చూడలేని విధంగా మా ర్చి, నకిలీ ప్రొఫై ల్ను సృష్టించి అన్లైన్లో మోసపూరి తమైన లావా దేవీలను కొన సాగించే వారికి కూడా కొదవ లేదు. వేధింపులు – బెదిరింపులు!ఆన్ లైన్లో : షేర్ చేసిన ఫొటోలను ఎవరు ఎలా దుర్వినియోగం చేస్తారో చెప్ప లేం. మార్ఫింగ్ చేయవచ్చు. మరెవరికైనా షేర్ చేయవచ్చు. ఏడిపించటానికి, బెదిరించ టానికి, వేధించటానికి ఆ వివరాలు తోడ్పడ వచ్చు.అమాయకంగా కనిపించే పిల్లల ఫొటోలపై అసభ్యకరమైన కామెంట్లు చేసేవా రుంటారు. కొందరు మీమ్స్ కూడా సృష్టించి వైరల్ చేస్తుంటారు. ఆ సంగతి అటు తిరిగి ఇటు తిరిగి ఈ పిల్లల్ని చేరిందంటే.. వారు ఆ దారుణాలను తల్లిదండ్రులకు చెప్పటానికి భయపడి, లోలోపలే మానసిక వ్యథను అనుభవిస్తారు. ఇది పిల్లలకు కాకుండా తల్లిదండ్రులకు తెలిసినా వారిదీ ఇదే పరిస్థితి. పోస్ట్లోని వివరాలను బట్టి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని బ్లాక్మెయిల్ చేసేవారూ ఉంటారు. ఇదీ చదవండి: జన్మాంతర సాఫల్యం అంటే ఎంటో తెలుసా?

22 రాష్ట్రాలు, 170 నగరాల్లో రాబిన్ హుడ్ ఆర్మీ మిషన్ సంకల్ప్
సాక్షి, సిటీబ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవం అంటే కేవలం జాతీయ జెండా ఎగరేయడం మాత్రమే కాదు.. మనం సమాజానికి తిరిగి ఇచ్చే క్షణం కూడా.. ఈ ఆలోచనతోనే స్వచ్ఛంద సేవా సంస్థ రాబిన్ హుడ్ ఆర్మీ ఆధ్వర్యంలో హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా మిషన్ సంకల్ప్ 78 ప్రాజెక్టును నిర్వహిస్తోంది. ఆగస్టు 1న మొదలైన ఈ యాత్రలో 22 రాష్ట్రాలు, 170 నగరాల్లో వెనుకబడిన 78 లక్షల పౌరులకు భోజనం, అవసరమైన వస్తువులు అందించనున్నారు. దీంతోపాటు 78 పార్కులు, లైబ్రరీలు, ఆట స్థలాలు, వారసత్వ కట్టడాలు, స్కిల్ సెంటర్లను పునరుద్ధరిస్తూ.. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవానికి ప్రత్యేక అర్థాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిరుపేదల ఆశయాలను ప్రోత్సహించేలా.. మూడు లక్షల మందికి పైగా వాలంటీర్లతో పనిచేసే ఈ సంస్థకు యూనిలివర్, స్విగ్గీ, నోవోటెల్ వంటి అనేక కార్పొరేట్ భాగస్వాములు తోడయ్యారు. రణవీర్ అల్లాహబాదియా, హెల్లీ షా, శెహా్నజ్ గిల్ వంటి ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో దీనిపై ప్రచారం చేస్తున్నారు. ముంబయిలో మాన్కుర్డ్ స్టేషన్ ఆర్ట్ రెన్యువల్, లోనావాలా స్కూల్ సైన్స్ ల్యాబ్ పునరుద్ధరణ, ఢిల్లీలో దృష్టి లోపం ఉన్న బాలికల కోసం బ్రెయిలీ ఆర్ట్ హాల్ వంటి ప్రాజెక్టులు ఈ మిషన్ కృషిని ప్రతిబింబిస్తోంది. ఈ సందర్భంగా రాబిన్ హుడ్ ఆర్మీ స్వదేశీ విభాగం హెడ్ సుస్మితా శ్రీవాస్తవ మాట్లాడుతూ.. లక్షలాది మందికి భోజనం అందించడం మాత్రమే కాదు, వారి ఆశను, ఆశయాలను నెరవేర్చేలా కార్యాచరణను రూపొందించామన్నారు. 2014లో ప్రారంభమైన ఈ జీరో–ఫండ్స్ ఉద్యమం ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 162 మిలియన్ల భోజనాలను అందించిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఆర్ట్.. అదిరేట్టు..!
మాదాపూర్లోని ఆర్ట్ గ్యాలరీ యువ కళాకారుల ప్రతిభకు వేదికగా నిలుస్తోంది. చిత్రకారులు, ఫొటో గ్రాఫర్ల ప్రతిభను వెలికితీసేలా ఏడాది పొడవునా ఏదో ఒక ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. దీంతోపాటు పలు వర్క్షాపులు కూడా నిర్వహిస్తోంది. ఆర్ట్.. అదిరేట్టు అన్న రీతిన చిత్రప్రదర్శనలు నగర సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ప్రదర్శన రాత్రి 7 గంటల వరకూ కొనసాగుతోంది. గణేశ చతుర్థి నేపథ్యంలో 22న పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న చిత్ర ప్రదర్శన 21 వరకూ కొనసాగనుంది.. హైదరాబాద్ నగరంలో చిత్రకళా ప్రదర్శనలకు వేదికగా మారుతోంది మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ అర్ట్ గ్యాలరీ. ప్రముఖ చిత్ర కళాకారులు మొదలు.. యువప్రతిభవంతుల వరకూ తమ కళా ప్రతిభను ప్రదర్శించేందుకు చిత్రమయి స్టేట్ అర్ట్ గ్యాలరీని వేదికగా చేసుకుంటున్నారు. దాదాపు 10కి పైగా గ్యాలరీలు కళాకారులకు అందుబాటులో ఉన్నాయి. గ్యాలరీలనే కాకుండా అడిటోరియాన్ని కూడా నిర్వాహకులు అద్దెకిస్తున్నారు. పిల్లల కోసం చిత్రలేఖన తరగతులు, శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఏడాదిలో దాదాపు 80 ప్రదర్శనల వరకూ జరుగుతాయి. గణేశ చతురి్థ, బతుకమ్మ, ఉమెన్స్ డే, ఆర్ట్ గ్యాలరీ వార్షికోత్సవాలను నిర్వహిస్తారు. కళాకారులకు కావాల్సిన వర్క్షాపులు ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఉత్సవాలకు రెండు, మూడు రోజుల ముందు నుంచే కళాకారులకు కావాల్సిన అన్ని వసతులూ కల్పిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ చిత్ర, ఫొటో ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. ఆలిండియా ఆర్ట్ కాపిటేషన్, ఎగ్జిబిషన్ ఇండియన్ ఫొటో ఫెస్ట్ ప్రతి ఏటా నవంబర్ 20వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకూ నిర్వహిస్తారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తారు. దాదాపు 50కి పైగా దేశాలకు చెందిన కళాకారులు ప్రదర్శనలో భాగస్వాములవుతున్నారు. గణేశ పెయింటింగ్ కాంపిటీషన్.. ఈనెల 22న ఆర్ట్ గ్యాలరీలో గణేశ్ చతుర్థి 2025 పెయింటింగ్ కాంపిటీషన్ నిర్వహించనున్నారు. గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేలు చొప్పున అందించనున్నారు. ఈ నెల 20వ తేదీ వరకూ రిజి్రస్టేషన్ చేసుకోవచ్చు. దీనికి ఎంట్రీ ఫీజు రూ.500లుగా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు 90309 04040, 91000 22958, 76618 72327లలో సంప్రదించవచ్చు. ఆకట్టుకుంటున్న బియాండ్ బౌండరీస్.. 53 మంది చిత్ర కళాకారులు వేసిన చిత్రాలు, స్కల్ప్చర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈనెల 21వ తేదీ వరకూ ఈ ప్రదర్శన సందర్శకులకు అందుబాటులో ఉంటున్నాయి. బిట్వీన్ వాచ్ అండ్ విట్నెస్.. కళాకారుడు వేసిన చిత్రాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ అర్ట్ గ్యాలరీలో బిట్వీన్ వాచ్ అండ్ విట్నెస్ పేరిట ఏర్పాటు చేసిన ఫొటోగ్రఫీ చిత్రప్రదర్శనను గురువారం ప్రారంభించారు. కళాకారుడు శరత్ ముపుడు తీసిన 120 ఫొటోగ్రఫీ చిత్రాలను అందుబాటులో ఉంచారు. ఈనెల 21వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సందర్శకులకు అందుబాటులో ఉండనుంది. ఈ కార్యక్రమంలో పలువురు ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు. గ్యాలరీ బుకింగ్.. సోలో ఎగ్జిబిషన్ రూ.4,500. గ్రూప్ ఎగ్జిబిషన్ రూ.6000లుగా నిర్ణయించారు నిర్వాహకులు. చిన్న కార్యక్రమాలకు అనుకూలంగా శిక్షణ తరగతులు, పుస్తకావిష్కరణ తదితర కార్యక్రమాలు చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. గ్యాలరీలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను సందర్శకులు తిలకించేందుకు ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ అందుబాటులో ఉంటాయి. (చదవండి: యస్...ఇది గణేష్ బండి!)
ఫొటోలు
అంతర్జాతీయం

పాక్లో కొత్తగా ఆర్మీ రాకెట్ ఫోర్స్
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్ వేళ భారత క్షిపణుల ధాటికి పూర్తిగా చేతులెత్తేసిన పాకిస్తాన్కు నెమ్మదిగా తత్వం బోధపడింది. దేశ గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్టంచేసుకోవాలని ఎట్టకేలకు నిర్ణయించుకుంది. అందులోభాగంగా నూతనంగా ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ పేరిట నూతన విభాగాన్ని ఏర్పాటుచేసుకుంటోంది. పాక్ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం అర్ధరాత్రి జరిగిన ఒక కార్యక్రమంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ విషయాన్ని వెల్లడించారు. సంప్రదాయక యుద్ధ సామర్థ్యాలను మెరుగుపర్చుకునే లక్ష్యంతో ఈ ప్రత్యేక యూనిట్ను ఏర్పాటు చేస్తున్న ట్లు పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, త్రివిధ దళాధిపతుల సమక్షంలో షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. భూతలం నుంచి ప్రయోగించే అణు, అణ్వస్త్రయేతర బాలిస్టిక్, హైపర్సోనిక్, క్రూయిజ్ క్షిపణులతో ఈ కొత్త ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ను తీర్చిది ద్దనున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్తో భారత్ తన క్షిపణుల సత్తాను పాక్కు రుచి చూపించాక ఎట్టకేలకు పాక్ ప్రభుత్వం మేల్కొంది. 2025– 2026 ఆర్థిక సంవత్సరంలో రక్షణరంగ బడ్జెట్ను 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఎవరి పంతం నెగ్గుతుందో!
ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలికి, శాంతి దూతగా పేరు సంపాదించాలన్నదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంతం. యుద్ధంలో ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాలను తమదేశంలో సంపూర్ణంగా విలీనం చేసుకొని, చట్టబద్ధత కల్పించుకోవాలన్నదే రష్యా అధినేత పుతిన్ ఆశయం. రెండు భిన్నమైన లక్ష్యాల సాధన కోసం ట్రంప్, పుతిన్ శుక్రవారం అలస్కాలో సమావేశం కాబోతున్నారు. ఇరువురు నేతల భేటీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధానంగా ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ముగించడంపైనే చర్చలు జరుగుతాయని పైకి చెబుతున్నా.. తెరవెనుక ఇతర అంశాలూ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమ అధీనంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాల విషయంలో పుతిన్ పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. అలస్కా భేటీతో ఇరువురు నేతలు ఆశిస్తున్నదేమిటో చూద్దాం.. అందుకే అలస్కా వేదిక ఉక్రెయిన్పై దండయాత్ర కొనసాగిస్తున్న పుతిన్ను ప్రపంచంలో ఏకాకిగా మార్చేందుకు పశ్చిమ దేశాలు చేసిన ప్రయత్నాలు చాలావరకు విఫలమయ్యాయి. అమెరికా నుంచి రష్యాను దూరం చేసేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. అమెరికా వద్ద తన ప్రతిష్ట స్థిరంగా చెక్కుచెదరకుండా ఉందని నిరూపించుకోవాలని పుతిన్ భావిస్తున్నారు. ఇందుకోసం అలస్కా సమావేశాన్ని అవకాశంగా వాడుకోవాలని నిర్ణయించారు. అంతర్జాతీయ రాజకీయాల్లో తన పట్టు ఏమాత్రం సడలలేదని ట్రంప్తో భేటీ ద్వారా పుతిన్ సంకేతం ఇవ్వబోతున్నారు. సమావేశానికి వేదికగా అలస్కాను ఎంచుకోవడం వెనుక ఒక వ్యూహం ఉంది. అలస్కాకు చేరుకోవాలంటే ఇతర దేశాల గగనతలం గుండా ప్రయాణించాల్సిన అసవరం లేదు. ఎవరినో అనుమతి కోరాల్సిన పనిలేదు. రష్యా నుంచి నేరుగా అలస్కాకు చేరుకోగలరు. అలస్కాను 19వ శతాబ్దంలో రష్యా పాలకులు అమెరికాకు విక్రయించారు. 21వ శతాబ్దంలో కొన్ని సరిహద్దుల్లో బలవంతంగా చేసిన మార్పులను సమర్థించుకోవడానికి అలస్కాను వేదికగా పుతిన్ ఎంచుకున్నారు. దేశాల సరిహద్దులు మార్చడం, భూభాగాల యజమానులు మారడం సాధారణ విషయమేనని ఆయన చెప్పదలిచారు. అలాగైతేనే కాల్పుల విరమణ ఉక్రెయిన్తోపాటు యూరోపియన్ దేశాల అధినేతలను పుతిన్ పక్కనపెట్టారు. ప్రత్యక్షంగా అమెరికాతోనే చర్చలకు సిద్ధమయ్యారు. ఇతర దేశాల పరిగణనలోకి తీసుకోవడం లేదు. చర్చలైనా, ఒప్పందమైనా అమెరికాతోనే అంటున్నారు. ఈ విషయంలో ఉక్రెయిన్ అభ్యంతరాలు వ్యక్తం చేసినా పుతిన్ పట్టించుకోలేదు. తాము ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాలను రష్యాలో అంతర్భాగంగా అంతర్జాతీయ సమాజం గుర్తించాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు. అలాగైతేనే ఉక్రెయిన్తో కాల్పుల విరమణకు సిద్ధమని చెబుతున్నారు. అయితే, పుతిన్ డిమాండ్ను ఉక్రెయిన్ వ్యతిరేకిస్తోంది. కబ్జాదారులకు తమ భూమి ఇవ్వబోమని ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ తెగేసి చెప్పారు. ఆక్రమిత ప్రాంతాలను రష్యాలో భాగంగా అధికారికంగా గుర్తించేలా ట్రంప్పై ఒత్తిడి పెంచాలన్నదే పుతిన్ వ్యూహంగా కనిపిస్తోంది. మొదట అమెరికా గుర్తిస్తే తర్వాత ఇతర దేశాలపైనా ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. ఆక్రమిత ప్రాంతాలను వదులుకోకుంటే ఆర్థిక సాయం నిలిపివేస్తామంటూ అమెరికా బెదిరిస్తే ఉక్రెయిన్ దారికి రావడం ఖాయమని పుతిన్ వాదిస్తున్నారు. ఆర్థిక బంధం బలపడుతుందా? అమెరికా–రష్యా మధ్య ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలపైనా ట్రంప్, పుతిన్ చర్చించబోతున్నారు. ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించిన రష్యాపై అమెరికా కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ ఆంక్షలను సడలించి, ఆర్థిక బంధాన్ని బలోపేతం చేసుకొనే దిశగా ఇరువురు నేతలు ఏదైనా ఒప్పందానికి వచ్చే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం రష్యా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటోంది. అమెరికా సాయంతో గట్టెక్కాలన్న ఆలోచనలో పుతిన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపడానికి పుతిన్ అంగీకరిస్తే రష్యాకు ఆర్థికంగా అండగా ఉండడానికి ట్రంప్ ముందుకు రావొచ్చు. యుద్ధానికి ఫుల్స్టాప్ పెట్టకపోతే తీవ్ర పరిణామాల ఉంటాయని ట్రంప్ తాజాగా రష్యాను హెచ్చరించడం గమనార్హం. అంటే ఈ విషయంలో ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. శుక్రవారం జరిగే భేటీలో పుతిన్ను ఆయన ఒప్పించడం ఖాయమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. యుద్ధాన్ని ఆపేసి శాంతి దూతగా నోబెల్ శాంతి బహుమతి స్వీకరించాలని ట్రంప్ ఆరాపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్

అదే జరిగితే భారత్కు మరిన్ని సుంకాలు తప్పవు: అమెరికా
భారత్ సుంకాలతో దాడి చేసిన అమెరికా.. భారత్కు మరో హెచ్చరిక జారీ చేసింది. భారత్పై మరిన్ని సుంకాలు లేదంటే ఆంక్షలు తప్పవని అంటోంది. ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలస్కాలో భేటీ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. చర్చల ఫలితాలను బట్టి ట్రంప్ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది.రష్యాతో చమురు కొనుగోళ్ల విషయంలో భారత్పై ఇప్పటికే సుంకాలు విధించాం. ఒకవేళ.. ట్రంప్-పుతిన్ మధ్య చర్చలు గనుక విఫలమైతే భారత్పై మరిన్ని సుంకాలు, ఆంక్షలు తప్పవు. తుది నిర్ణయం చర్చల ఫలితాలను బట్టే ఉంటుంది అని ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ బుధవారం బ్లూమరాంగ్టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు. భారత్పై సెకండరీ టారిఫ్లు, లేదంటే పరోక్ష ఆంక్షలు విధించే అవకాశం ఉంది అని స్కాట్ స్పష్టం చేశారు.భారత్ తమ మిత్రదేశమంటూనే దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించింది అమెరికా. అంతేకాదు.. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాకు తమ వాణిజ్యం ద్వారా భారత్ పరోక్షంగా ఆర్థిక సాయం అందిస్తోందంటూ ట్రంప్ ఆ టైంలో ఆరోపించారు. ఈ తరుణంలో.. రష్యాతో చమురు, ఆయుధాల కొనుగోళ్లు ఆపకపోవడంతో పెనాల్టీ కింద మరో 25 శాతం మోపారు. దీంతో భారత్పై అగ్రరాజ్యం టారిఫ్లు 50 శాతానికి చేరింది. ఈ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. భారమని తెలిసినా.. జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు కూడా. ట్రంప్ విధించిన దటి దఫా సుంకాలు ఇప్పటికే అమలు అవుతుండగా.. ఈ నెల 27 నుంచి రెండో దఫా ప్రకటించిన సుంకాలు అమల్లోకి రానున్నాయి.ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాలపై వాషింగ్టన్లో వరుస చర్చలు జరిగాయి. అయితే ఆ చర్చలు ఓ కొలిక్కి రాలేదు. ఈలోపు ట్రంప్ భారత్పై 50 శాతం సుంకాలు విధించారు. అదే సమయంలో.. భారత్తో వాణిజ్య చర్చలు ఉండబోవని ప్రకటించారాయన. అయితే ఫాక్స్న్యూస్తో ఈ అంశంపై ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ మాట్లాడారు. ఇరు దేశాల చర్చలు కొనసాగే అవకాశమూ ఉందని వ్యాఖ్యానించారు. ఈ నెల 25న అమెరికా నుంచి ప్రతినిధులు భారత్కు చేరుకుంటారని తెలిపారు. అయితే.. వ్యవసాయ, డెయిరీ మార్కెట్ను కాపాడుకునే ఉద్దేశంలో భారత్ ఉందని, ఇది చర్చలకు విఘాతంగా మారే అవకాశం లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.మూడున్నరేళ్ల యుద్ధానికి ముగింపు పలికే ఉద్దేశంతో శాంతి చర్చలు ఉండబోతున్నాయని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా అధినేత కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నారా? లేదా? అన్నది అలస్కా వేదికగా శుక్రవారం జరగబోయే చర్చలతోనే తేలిపోతుందని చెబుతున్నారాయన. అదే సమయంలో భూభాగాల మార్పిడితోనే శాంతి ఒప్పందం సాధ్యమవుతుందని ఇరు దేశాలకు మరోసారి సూచించారు కూడా. అయితే ఈ ఆలోచనను ఉక్రెయిన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. భూభాగాల విషయంలో రాజీ పడటం తమ రాజ్యాంగానికి విరుద్ధమని అంటోంది. మరోవైపు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీకి యూరప్ దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఉక్రెయిన్ లేకుండా జరిగే చర్చలకు అర్థం ఉండదని, పుతిన్తో జరగబోయే ఒకే ఒక్క భేటీ రష్యా లక్ష్యాలకు అనుకూలంగా ఫలితాలు ఇవ్వవచ్చని యూరప్ దేశాలు భావిస్తున్నాయి.

జాబిలిపై అణువిద్యుత్ సాధ్యమా?
వ్యోమగాములు తమ అంతరిక్ష పరిశో ధనలకు మజిలీగా చందమామను మార్చుకోవాలని భావిస్తున్న తరుణంలో చంద్రునిపై ఏకంగా అణువిద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పాలని నాసా భావిస్తోంది. అయితే 2030కల్లా అక్కడ న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యమా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎక్కువకాలంపాటు వ్యోమగాములు చంద్రునిపైనే స్థిరనివాసం ఏర్పర్చుకుని జీవించాలన్నా, ఎలాంటి విద్యుత్ అవాంతరాల లేకుండా శాస్త్రసాంకేతిక పరిశోధనలు కొనసా గించాలన్నా అనుక్షణం విద్యుత్ సరఫరా తప్పనిసరి. ప్రాణాధార ఉపకరణాలకూ విద్యుత్ ఖచ్చితంగా అవసరం. అందుకే ఐదేళ్ల లోపే అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటుచేయా లని నాసా భావిస్తోంది. కేంద్రక విచ్చిత్తి (న్యూక్లియర్ ఫిజన్) సూత్రంపై పనిచేసే అణుప్లాంట్ను అక్కడ నెలకొల్పనున్నారు. అయితే నాసాకు పోటీగా సొంత అణువిద్యుత్ కేంద్రాలను ఏర్పాటుచేస్తామని చైనా, రష్యాలు సైతం ప్రకటించాయి. మరో పదేళ్లలో ఈ ప్లాంట్లను ఏర్పాటుచేస్తామని ఇప్పటికే వెల్లడించాయి. అణు విద్యుతే ఎందుకు?చందమామపై స్థిరనివాసం ఏర్పర్చుకునే వ్యోమగాముల నిరంతర విద్యుత్ అవసరా లను సౌరవిద్యుత్ ఏమాత్రం తీర్చలేదు. ఎందుకంటే చంద్రునిపై ప్రతిరోజూ సూర్యకాంతి ప్రసారం కాదు. 14 రోజులపాటు ఏకధాటి గా ఎండకాచి తర్వాత 14 రోజులపాటు మైనస్ డిగ్రీ సెల్సియస్ స్థాయిలో చిమ్మచీకటి నెలకొంటుంది. ఈ చీకటిమయ రోజుల్లో విద్యుత్ అవసరాలు తీర్చే ఏకైక ప్రత్యామ్నా యంగా అణువిద్యుత్కేంద్రం నిలుస్తోంది. అందుకే ఎంత ఖర్చయినాసరే వ్యయప్రయా సల కోర్చి చంద్రునిపై న్యూక్లియర్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని నాసా కృతనిశ్చయంతో ఉంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన లకు సైతం పచ్చజెండా ఊపింది. మరో ఐదేళ్లలో అక్కడ అణువిద్యుత్ ప్లాంట్ కలను సాకారంచేయాలని కంకణం కట్టుకుంది. చిన్నస్థాయిలో మొదలెట్టిఅణువిద్యుత్ కేంద్రంలో ఏవైనా ప్రమాదాలు సంభవించినా అక్కడ శూన్యం ఉంటుందికనుక రేడియోధార్మికత అంతటా వ్యాపిస్తుందన్న భయం అక్కర్లేదు. థర్మల్, జల, పవన విద్యుత్లతో పోలిస్తే చందమామపై అణువిద్యుత్ మాత్రమే ఆచరణ సాధ్యమవుతుంది. సౌరఫలకాలతో సూర్యకాంతిని ఒడిసిపట్టి సౌర విద్యుత్ను తయారుచేసినా అది అక్కడి వ్యోమగాముల అవసరాలను ఏమాత్రం తీర్చలేదు. వీటిని పరిగణనలోకి తీసుకుని న్యూక్లియర్ ప్లాంట్ వైపు శాస్త్రవేత్తలు మొగ్గుచూపుతున్నారు. తొలుత కేవలం 100 కిలోవాట్ల విద్యుత్ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ను నెలకొల్పనున్నారు. భూమి మీద అయితే ఇదే 100 కిలోవాట్ల విద్యుత్తో 80 గృహాల విద్యుత్అవసరాలు తీర్చొచ్చు. దశలవారీగా ప్లాంట్ను విస్తరించి గణనీయమైన స్థాయిలో విద్యుత్ను ఉత్పత్తిచేస్తారు.– సాక్షి, నేషనల్ డెస్క్సమస్యలెన్నో...జల, థర్మల్ విద్యుత్ ప్లాంట్లతో పోలిస్తే అణువిద్యుత్ ప్లాంట్కు పెద్దగా భూవిస్తీర్ణంతో పనిలేదు. కానీ చంద్రుని మీదకు ఈ మొత్తం అణువిద్యుత్ వ్యవస్థ ఉపకరణాలను మోసుకెళ్లాలంటే చాలా చాలా కష్టం. పైగా ఇవి రాకెట్లో తరలించేంత తేలికగా ఉండాలి. అత్యధిక బరువులను ఇప్పుడున్న రాకెట్లు అస్సలుమోయలేవు. ఒకవేళ అధిక బరువులను మోసుకెళ్లేలా వ్యోమనౌకలను డిజైన్చేసి రూపొందించినా అవి అంత బరువును మోస్తూకూడా జాగ్రత్తగా చంద్రునిపై ల్యాండ్ కావాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చి అది క్రాష్ ల్యాండ్ అయినా వేలకోట్ల రూపాయల నష్టం ఖాయం. భూమిపై అయితే అణువిద్యుత్ కేంద్రాన్ని ఎంతో మంది సాంకేతిక నిపుణులు తీరిగ్గా, నిశితంగా తనిఖీచేసి నిర్మిస్తారు. చంద్రునిపై ఈ ప్లాంట్ను నిర్మించాలంటే కార్మిక సిబ్బంది దొరకరు. ఉన్న ఆ కొద్దిపాటి వ్యోమగాములే అణుప్లాంట్ ఉన్నతాధికారుల అవతారమెత్తి ప్లాంట్ను బిగించాల్సి ఉంటుంది. అణువిద్యుత్ ప్లాంట్ నుంచి అత్యధిక స్థాయిలో వేడిమి వెలువడుతుంది. దానికి చల్లబరిచే కూలింగ్ వ్యవస్థలను ఏర్పాటుచేయాలి. వాటిని కూడా భూమి మీద నుంచే ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఎంతో శ్రమ, వ్యయంతో కూడిన వ్యవహారం. శూన్యస్థితిని తట్టుకునేలా వినూత్న రీతిలో ప్లాంట్ను డిజైన్ చేయాల్సి ఉంటుంది. రేడియోధార్మిక వ్యర్థ్యాల పారబోత, ప్లాంట్ పాడైతే రిపేర్లు వంటి ఎన్నో అవరోధాలు అక్కడి హఠాత్తుగా స్వాగతం పలుకుతాయి.వీటిని తట్టుకుంటూనే ప్లాంట్ను నిర్వహించాల్సి ఉంటుంది. ట్రంప్ హయాంలో నాసాకు అంతరిక్ష పరిశోధనా బడ్జెట్లో భారీ కోత పెట్టిన నేపథ్యంలో ఇతర మార్గాల్లో ఆదాయం సమకూర్చి ఈ ప్రాజెక్ట్ను సఫలీకృతం చేయాల్సి ఉంది. ఇన్ని బాలారిష్టాలను దాటుకుని ప్లాంట్ ఏర్పాటు సుసాధ్యమైతే జాబిలిపై మానవనివాసం ఎలాంటి జంజాటాలు లేకుండా హాయిగా సాగుతుంది.
జాతీయం

గ్రేడ్ పేరెంట్స్ కాదు.. గ్రేట్ పేరెంట్స్!
పిల్లలు చక్కగా చదువుకుని, మంచి మార్కులు తెచ్చుకుని, పెద్ద ఉద్యోగం సంపాదిస్తే తల్లిదండ్రులకు ఎంత సంతోషం! నిజమే కానీ, కొన్నిసార్లు రేయింబవళ్లు కష్టపడి చదివినా కూడా పిల్లలు మంచి మార్కులు సాధించలేరు. అప్పుడు చూడాలి తల్లిదండ్రుల బాధ! ఆ బాధలో పిల్లల్ని కోప్పడతారు, అరుస్తారు. మాట్లాడ్డం మానేస్తారు. ఇతర పిల్లలతో పోల్చి మాట్లాడతారు. ఆ మాటకు పిల్లలు ఎంత బాధపడతారో ఆలోచించరు. కానీ ఇప్పుడీ పరిస్థితి క్రమంగా మారుతోంది! -సాక్షి, స్పెషల్ డెస్క్మార్కులు తగ్గినందుకో, పరీక్ష తప్పినందుకో తల్లిదండ్రులు కోపంతో ఊగిపోవటం అన్నది ప్రతి ఇంట్లోనూ ఉండేదే. అయితే ఇప్పుడిప్పుడు కొందరు పేరెంట్స్ పిల్లల తరఫున ఆలోచిస్తున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో పిల్లలు విస్తృతంగా షేర్ చేస్తున్న తమ అనుభవాలను బట్టి తెలుస్తోంది. కర్ణాటకలోని ఒక కుటుంబం.. బోర్డు పరీక్షల్లో ఆరు సబ్జెక్టుల్లోనూ ఫెయిల్ అయిన తమ కుమారుడుని ప్రోత్సహించడానికి నలుగుర్నీ పిలిచి ‘కేక్ కటింగ్’ చేశారు. కొడుకుని అక్కున చేర్చుకున్నారు. ‘ఈసారి వస్తాయిలే..!’తక్కువ మార్కులు వచ్చినందుకు అమ్మానాన్న తమని కొట్టకుండా, తిట్టకుండా ఎంత ప్రేమగా చూసుకున్నారో వెల్లడిస్తూ పిల్లలు సోషల్ మీడియాలో షేర్ చేసే కథనాలు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి. ఎన్ని మార్కులు వచ్చాయో తల్లిదండ్రులు పట్టించుకోవటం లేదు.. పిల్లల కష్టాన్ని అర్థం చేసుకుంటున్నారు. ‘ఈసారి మంచి మార్కులు వస్తాయిలే’ అని తల నిమురుతున్నారు. వారిలో ధైర్యం నింపుతున్నారు. పిల్లలు అప్పటికీ అదేపనిగా బాధపడుతుంటే వారి ధ్యాసను మళ్లించటానికి బయటికి తీసుకెళుతున్నారు. ఇది మంచి పరిణామంబోర్డు పరీక్ష ఫలితాల సమయంలో తమ తల్లిదండ్రులు తమకు ఎంతలా మద్దతు ఇచ్చారో చెబుతూ విద్యార్థులు సోషల్ మీడియాలో పంచుకుంటున్న అనుభవాలు బాగా వైరల్ అవుతున్నాయి. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు వహించవలసిన పాత్ర ఏమిటన్న దాని గురించి సంభాషణలు కూడా మొదలయ్యాయి. అవి మిగతా తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఆ సంభాషణల్లో సైకాలజిస్టులు కూడా ఉత్సాహంగా పాలు పంచుకుంటున్నారు. ‘ఇది చాలా మంచి పరిణామం’ అంటున్నారు మనో వైజ్ఞానిక నిపుణులు.‘కేక్, పిజ్జా తెప్పించారు’ఇటీవల, పరీక్షల్లో 83 శాతం మార్కులు స్కోర్ చేసిన సీబీఎస్సీ 10వ తరగతి విద్యార్థిని సోషల్ మీడియాలో తన పేరెంట్స్ గురించి ఇలా షేర్ చేసుకుంది. ‘‘ఇంకొంచెం ఎక్కువ మార్కులు వచ్చి ఉంటే బాగుండేదని.. మా అమ్మ మొదట నిరాశపడింది. ఆ వెంటనే, బాగా స్కోర్ చేశావ్ అని సంతోషపడింది. నాన్న నన్ను దగ్గరకు తీసుకుని, ‘మార్కులకు, నిజ జీవితానికి సంబంధం ఉండదు. తక్కువ స్కోర్ చేసిన వారు కూడా గొప్ప జీవితాలను గడపొచ్చు’’ అని చెప్పారు. ఆ రోజు అమ్మానాన్న కేక్, నాకెంతో ఇష్టమైన పిజ్జా ఆర్డర్ చేశారు. నాకు తక్కువ మార్కులు వచ్చినప్పటికీ వారు నన్ను మనస్ఫూర్తిగా దగ్గరకు తీసుకున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను..’’ అని రాసింది. ‘ఇలాంటి చర్యలు పిల్లల్లో కాన్ఫిడెన్స్ను పెంచుతాయి’ అని ఆమె పోస్ట్ కింద ఒక సైకాలజిస్టు కామెంట్ పెట్టారు. ‘ముందే చెప్పేశా..’మరొక విద్యార్థిని, తక్కువ మార్కులు వచ్చినప్పుడు తన తల్లిదండ్రులు తనను ఎలా ఓదార్చారో గుర్తుచేసుకుంది. ‘‘కోప్పడితే పడనివ్వమని నా పేరెంట్స్కి మొదటే చెప్పేశాను. క్వొశ్చన్ పేపర్స్ అన్నీ కష్టంగా వచ్చాయి, సరిగా రాయలేదు, ఫెయిల్ అవుతాను అని చెప్పాను. ఆ క్షణం నుంచి, ఫలితాలు వచ్చే వరకు వాళ్లు అనుక్షణం నన్ను గమనిస్తూనే ఉన్నారు. ‘పోతే పోయిందిలే’ అని ధైర్యం చెబుతూ వచ్చారు. మొత్తానికి 62 శాతంతో పాసయ్యాను. అప్పుడు నాన్న నిరాశగా చూస్తూ అన్న మాట నాకు భలే నవ్వు తెప్పించింది. ‘అదేంట్రా ఫెయిల్ అవుతావని ఎన్నో ఆశలు పెట్టుకుంటే, ఇలా చేసేవేంటి!’ అన్నారు. అమ్మ కూడా నవ్వి నన్ను దగ్గరకు తీసుకుంది’ అని ఆ అమ్మాయి షేర్ చేసింది. ‘ఆంటీ, అంకుల్ సూపర్’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ మీద కామెంట్లు!వెల్డన్ పేరెంట్స్» తల్లిదండ్రులలోని ఈ సానుకూల వైఖరిని విద్యావేత్తలు, మానసిక ఆరోగ్య నిపుణులు స్వాగతిస్తున్నారు. వాళ్లు ఇంకా ఏమంటున్నారంటే..» పిల్లలు మంచి మార్కులు తెచ్చుకున్నా, తెచ్చుకోలేకపోయినా వారు తమ శక్తి మేరకు కష్టపడ్డారని తల్లి దండ్రులు గుర్తించటం, వారిలో నిరుత్సాహం తలెత్తకుండా దగ్గరకు తీసుకోవటం మంచి విషయం.» పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమే.. పరీక్షలే జీవితం కాదు. ఒకసారి విఫలమైపోతే జీవితం అక్కడితో ఆగిపోదు. మార్చి పోతే సెప్టెంబర్ ఎప్పుడూ ఉంటుంది. మళ్లీ రాయొచ్చు.. ఉత్తీర్ణులు కావచ్చు. కానీ, జీవితం పోతే.. మళ్లీ రాదు.» పిల్లల్లో ఆత్మవిశ్వాసం పోతే మళ్లీ అంకురించడం అంత సులభం కాదు. తల్లిదండ్రులు పిల్లలను తిట్టేశాక.. గాయపడిన లేత మనసు కోలుకోవడం చిటికెలో జరిగిపోదు. అది ఈ తరం తల్లిదండ్రులు గ్రహిస్తున్నారు.» తల్లిదండ్రులు కూడా ఒకప్పుడు విద్యార్థులే. వాళ్లూ.. ఈ మార్కులు తక్కువ రావడాలు, ఫెయిలవడాలు.. అన్నీ చూసే ఉంటారు. కానీ, వాళ్లు చదివేటప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు పిల్లలకు తాము అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా, అంతంత డబ్బు వాళ్ల కోసం ఖర్చు చేస్తున్నా వారు రాణించకపోవడాన్ని చాలామంది తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది మారాలి.» కొంతమంది మాత్రం.. ఫెయిల్యూర్ జీవితాలను ఎలా మార్చిందో ప్రముఖుల జీవితాలను ఉదాహరణలుగా తమ పిల్లలకు చెబుతున్నారు. తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోకుండా కాపాడుకుంటున్నారు.» తిట్టినంత మాత్రాన మార్కులు పెరగవు, ఫెయిలైనవారు పాసైపోరు అని తెలుసుకుంటున్నారు.» ఇతరులతో పోల్చినంత మాత్రాన.. ఉన్నపళంగా తమ బిడ్డలో మార్పు వచ్చేయదు. పిల్లలను మనమే నలుగురిలో చులకన చేస్తే వారు రేపు తలెత్తుకుని ఎలా తిరగగలరు అని ఆలోచిస్తున్నారు.

Independence Day 2025: దుస్సాహసానికి దిగారో ఖబడ్దార్!
ప్రతి ఒక్కరమూ భారత్లో, మన తోటివారు చెమటోడ్చి తయారు చేసిన వస్తువులనే వాడతామని ప్రతినబూనుదాం. ఇతరులూ వాడేలా చేద్దాం. స్వదేశీ వస్తువులే అమ్ముతాం అంటూ ప్రతి చిరు వ్యాపారీ, దుకాణదారూ బోర్డు పెట్టాలి. ప్రతి రంగంలోనూ దేశీయ తయారీ వస్తువులే ఉండాలి. వాటిని ప్రపంచ దేశాలన్నింటికీ ఎగుమతి చేసే స్థాయికి చేరాలి. టారిఫ్లతో మన రైతులు, పశుపాలకులు, మత్స్యకారులతో సహా ఎవరూ నష్టపోకుండా అండగా నిలుస్తా. ..: మోదీ :..న్యూఢిల్లీ: దాయాది గుండెలదిరేలా ప్రధాని నరేంద్ర మోదీ సింహనాదం చేశారు. పహల్గాం పాశవికత్వం వెనక పాక్ ప్రమేయాన్ని ప్రస్తావిస్తూ పలుగు రాళ్లతో నలుగు పెట్టారు. ‘‘పహల్గాం ఉగ్రోన్మాదానికి ప్రతీకారంగా మన సైన్యం చేసిన ‘సిందూర’ గర్జన తాలూకు భయంతో శత్రు దేశం నేటికీ నిద్ర లేని రాత్రులు గడుపుతోంది. మన దళాలు పాక్ భూభాగంలో వందలాది కిలోమీటర్ల మేరకు చొచ్చుకెళ్లి మరీ ఉగ్ర, సైనిక లక్ష్యాలను తుత్తునియలు చేశాయి. ఆ విధ్వంసానికి సంబంధించి నేటికీ రోజుకో కొత్త కబురు తెరపైకి వస్తోందంటే అతిశయోక్తి కాదు’’ అంటూ ఎద్దేవా చేశారు. మళ్లీ అలాంటి దుస్సాహసానికి దిగితే దాయాదికి జన్మలో మర్చిపోలేని రీతిలో గట్టి గుణపాఠం నేర్పి తీరతామంటూ ప్రతినబూనారు. అణు బెదిరింపులకు జడిసే రోజులు గతించాయంటూ పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కు పదునైన హెచ్చరికలు జారీ చేశారు. అటువంటి మతిలేని ఉన్మాదానికి దిగితే దీటుగా బదులిస్తామని స్పష్టం చేశారు. ‘‘60 ఏళ్లుగా భారత రైతుల పొట్ట కొడుతూ పాక్ పొలాలను తడుపుతున్న ఏకపక్ష సింధూ నదీ జల ఒప్పందం శాశ్వతంగా కాలగర్భంలో కలిసినట్టే. నీరూ నెత్తురూ కలిసి పారడం జరగని పని’’ అంటూ కుండబద్దలు కొట్టారు. ‘‘భరత జాతి దశాబ్దాలుగా పదేపసదే ఉగ్ర భూతానికి బలవుతూ వస్తోంది. దాయాది దన్నుతో జాతి గుండెను ఉగ్ర పోట్లు పదేపదే చీలుస్తూ వచ్చాయి. అది ఇకపై సాగదు. ఉగ్రవాదానికి మహారాజ పోషకులుగా మారి దానికి జవసత్వాలు అందజేస్తున్న దేశాలు, శక్తులను కూడా ఇకపై విడిగా చూడబోం. వారినీ ఆ ముష్కరులతో సమానంగా శిక్షించి తీరతాం. ఇదే మా నయా మంత్రం’’ అంటూ పాక్కు పెను హెచ్చరికలు చేశారు. ‘‘వారి మధ్య ఎలాంటి తేడా లేదు. ఇద్దరూ మానవాళికి సమాన శత్రువులే’’ అని స్పష్టం చేశారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎర్రకోటపై ప్రధాని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతినుద్దేశించి ఏకంగా 103 నిమిషాల పాటు ప్రసంగించారు. గతేడాది 98 నిమిషాలు ప్రసంగించిన స్వీయ రికార్డును అధిగమించారు. అంతేగాక ఎర్రకోట నుంచి వరుసగా 12 వసారి పంద్రాగస్టు ప్రసంగం చేయడం ద్వారా ఇందిరాగాంధీ రికార్డు (11)ను అధిగమించారు. వరుసగా 17సార్లు పంద్రాగస్టు ప్రసంగాలు చేసిన తొలి ప్రధాని నెహ్రూ తర్వాత రెండోస్థానంలో నిలిచారు. అన్ని రంగాల్లోనూ ఆత్మ నిర్భరత తాలూకు ఆవశ్యకతను మోదీ తన ప్రసంగంలో పదేపదే నొక్కిచెప్పారు. సెమీ కండక్టర్లు మొదలుకుని కీలక ఖనిజాలు, అణు ఇంధనం దాకా అన్నింట్లోనూ స్వయంసమృద్ధి సాధించిన నాడే దేశం నిజమైన అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని స్పష్టం చేశారు. తన వికసిత్ భారత్ కలలను సవివరంగా దేశ ప్రజల ముందుంచారు. కాంగ్రెస్తో పాటు విపక్షాలన్నీ అభివృద్ధి నిరోధకులుగా మారుతున్నాయంటూ తూర్పారబట్టారు. అర్థం లేని డిమాండ్లతో పార్లమెంటును నిత్యం స్తంభింపజేస్తూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కీలక పథకాల అమలులో ఇప్పటికైనా కేంద్రంతో కలిసి రావాల్సిందిగా పిలుపునిచ్చారు.బలగాలు సత్తా చాటాయి ‘‘రాజస్తాన్ ఎడారులు మొదలుకుని హిమ శిఖరాలు, సముద్ర తీరం, అత్యంత జనసమ్మర్ధ ప్రాంతాల దాకా ఇంటింటా నేడు త్రివర్ణ స్ఫూర్తి వెల్లివిరుస్తోంది. కానీ గత ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో అమాయక పర్యాటకులను ఉగ్ర ముష్కరులు పిరికిదెబ్బ తీశారు. పిల్లల కళ్లముందు తండ్రులను పొట్టన పెట్టుకున్నారు. భార్యల సిందూరాన్ని కర్కశంగా తుడిపేశారు. ఆ దారుణాన్ని తలచుకుని జాతి యావత్తూ క్రోధావేశాలతో ఆక్రోశించింది. అందుకు ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో మన సైనిక బలగాలు పూర్తిస్థాయిలో సత్తా చాటాయి’’ అన్నారు.శ్రీకృష్ణుడే స్ఫూర్తిగా మిషన్ సుదర్శన చక్ర దేశ భద్రతకు ఛత్రం పదేళ్లలో అందుబాటులోకి దేశ భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ‘మిషన్ సుదర్శన్ చక్ర’ పేరుతో 2035 నాటికి అత్యంత శక్తిమంతమైన సరికొత్త రక్షణ వ్యవస్థ ఏర్పాటును ప్రధాని మోదీ ప్రకటించారు. దీనిద్వారా దేశ భద్రతా ఛత్రాన్ని మరింతగా విస్తరించి, బలోపేతం చేసి ఆధునీకరిస్తామని పేర్కొన్నారు. ‘‘శనివారం శ్రీకృష్ణుని జన్మదినం. కచి్చతత్వంతో పని పూర్తి చేయడం, ఆ వెంటనే కృష్ణున్ని చేరుకోవడం సుదర్శన చక్రం ప్రత్యేకత. దాని స్ఫూర్తితో రూపొందే పూర్తి దేశీయ భద్రతా వ్యవస్థ కూడా అలాగే అత్యాధునికంగా రూపుదిద్దుకుంటుంది’’ అన్నారు. యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టం వంటివాటితో ఇది ఇజ్రాయెల్ ఐరన్డోమ్ తరహాలో పని చేస్తుందన్నది నిపుణుల అంచనా.‘సింధూ’ ఇక భారత సొత్తే! ‘‘మన నేలపై పుట్టి పారే నదులు శత్రు దేశపు పొలాలను తడుపుతున్నాయి. మన రైతులు దాహార్తితో అల్లాడుతున్నారు. సింధూ ఒప్పందం 70 ఏళ్లుగా వారికి చేసిన నష్టం మాటలకందనిది. అది ఎంతటి ఏకపక్ష ఒప్పందమో ఇప్పుడు దేశవాసులందరికీ తెలిసొచ్చింది. దీన్నిక సహించేది లేదు. ఆ ఒప్పందానికి నూకలు చెల్లినట్టే. సింధూ జలాలన్నీ ఇక పూర్తిగా మన రైతులవే. టారిఫ్లతో మన రైతులు, మత్స్యకారులతో సహా ఎవరూ నష్టపోకుండా అండగా నిలుస్తా’’.అక్రమ వలసలు... అతి పెద్ద కుట్ర! హై పవర్ మిషన్తో అడ్డుకట్ట అక్రమ వలసలు దేశానికి తలనొప్పిగా మారాయని మోదీ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘ఇది పక్కా పథకం ప్రకారం కొందరు పన్నిన కుట్ర. ఉద్దేశపూర్వకంగా చొరబాట్లను ప్రోత్సహిస్తూ పెను సంక్షోభానికి బీజం వేస్తున్నారు. దేశంలో జనాభా సమతౌల్యాన్నే దెబ్బతీయజూస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఇది జాతీయ భద్రత పాలిట పెను ప్రమాదంగా పరిణమిస్తోంది. మన ఐక్యతకు, ప్రగతికి గొడ్డలిపెట్టుగా మారుతోంది. సామాజిక ఉద్రిక్తతల బీజాలు నాటుతోంది. చొరబాటుదార్లు అమాయక గిరిపుత్రులను మోగిస్తున్నారు. వారి అటవీ భూములను కాజేస్తున్నారు. ఈ ఘోరాలను ఇకపై సహించే ప్రసక్తే లేదు. అక్రమ చొరబాట్లకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతస్థాయి డెమోగ్రాఫిక్ మిషన్కు రూపకల్పన చేస్తున్నాం’’ అని ప్రకటించారు. నారీ శక్తికి సలాం ‘‘స్త్రీ శక్తి ప్రతి రంగంలోనూ సత్తా చాటుతోంది. స్టార్టప్లు, క్రీడలు, సైన్యం మొదలుకుని అంతరిక్షం దాకా ప్రతి రంగంలోనూ దేశ సామాజిక, ఆర్థిక ప్రగతిలో కీలక చోదక శక్తిగా నిలుస్తోంది. నేషనల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్డీఏ) నుంచి తాజాగా తొలి బ్యాచ్ మహిళా కేడెట్లు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న చరిత్రాత్మక క్షణాలను తలచుకుని జాతి యావత్తూ గర్వంతో ఉప్పొంగిపోయింది. లక్పతీ దీదీ పథకంతో కోట్లాది మంది మహిళలు స్వయంసమృద్ధి సాధించారు’’.స్వదేశీ సత్తా చాటుదాం-ఆ కలను నిజం చేయండి యువతకు మోదీ సవాలు వందేళ్ల పై చిలుకు దాస్యం మనలను నిరుపేదలుగా, పరాధీనులుగా మార్చిందని మోదీ ఆవేదన వెలిబుచ్చారు. నేటికీ ఏ జాతి ఆత్మ గౌరవానికైనా ఆత్మ నిర్భరతే అతి పెద్ద తార్కాణమని నొక్కిచెప్పారు. స్వయం సమృద్ధ భారతే వికసిత భారత్కు పునాది అని స్పష్టం చేశారు. ‘‘ఇది ఎగుమతులు, దిగుమతులు, కరెన్సీలకే పరిమితం కారాదు. మేడిన్ ఇండియా ఆయుధాల తాలూకు గొప్పదనాన్ని ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచమంతటికీ ఘనంగా చాటాం. శత్రు లక్ష్యాలను రెప్పపాటులో తుత్తునియలు చేశాం. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించకపోతే ఇది సాధ్యపడేదా?’’ అని ప్రశ్నించారు. ‘‘ప్రతి ఒక్కరమూ భారత్లో, మన తోటివారు చెమటోడ్చి తయారు చేసిన వస్తువులనే వాడతామని ప్రతినబూనుదాం. ఇతరులూ వాడేలా చేద్దాం. ‘స్వదేశీ వస్తువులే అమ్ముతాం’ అంటూ ప్రతి చిరు వ్యాపారీ, దుకాణదారూ బోర్డు పెట్టాలి. ప్రతి రంగంలోనూ దేశీయ తయారీ వస్తువులే ఉండాలని, వాటిని ప్రపంచ దేశాలన్నింటికీ ఎగుమతి చేసే స్థాయికి చేరాలి’’ అని ఆకాంక్షించారు. ‘‘దేశీయ జెట్ ఇంజన్లు, యుద్ధవిమానాలు మొదలుకుని సోషల్ మీడియా వేదికల దాకా తిరుగులేని రీతిలో డిజైన్ చేయాలి. మన యువతకు, ఇన్నొవేటర్లకు, సైంటిస్టులకు, ఇంజనీర్లకు, ప్రొఫెషనల్స్కు ఇదే నా సవాలు’’ అని పేర్కొన్నారు. తద్వారా దేశాన్ని బలోపతంగా, స్వయంసమృద్ధంగా తీర్చిదిద్దడంలో పాలుపంచుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. ‘‘అంతరిక్ష రంగంలోనూ ఆత్మ నిర్భరత అత్యవసరం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగు పెట్టిన తొలి భారతీయునిగా రికార్డు నెలకొల్పిన వాయుసేన గ్రూప్కెపె్టన్ శుభాన్షు శుక్లాను చూసి జాతి యావత్తూ పొంగిపోతోంది. తొలి దేశీయ మానవసహిత అంతరిక్ష గగన్యాన్కు త్వరలో శ్రీకారం చుట్టనున్నాం. అంతేకాదు, సొంత అంతరిక్ష కేంద్రాన్నీ నిర్మించుకోనున్నాం’’ అని చెప్పారు. అతి పెద్ద సేవాసంస్థ ఆరెస్సెస్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఆవిర్భావానికి వందేళ్లవుతున్న సందర్భంగా మోదీ అభినందనలు తెలిపా రు. దాన్ని ప్రపంచంలోకెల్లా అతి పెద్ద స్వచ్ఛంద సంస్థగా అభివరి్ణంచారు. ‘‘దేశానికే గర్వకారణమైన ప్రస్థానం ఆరెస్సెస్ది. అంకితభావంతో దేశానికి సేవ చేస్తున్న ఆరెస్సెస్ కార్యకర్తలందరికీ నా సెల్యూట్. కోట్లాది మంది ప్రజలు, సాధుసంతులు, సైంటిస్టులు, టీచర్లు, రైతులు, సైనికులు, శ్రామికులు, వ్యక్తులు, సంస్థల మొక్కవోని ప్రయత్నాల ఫలస్వరూపంగా ఆరెస్సెస్ ఎదిగింది. వ్యక్తి, జాతి నిర్మాణానికి, దేశ సంక్షేమానికి వందేళ్లుగా వారంతా తిరుగులేని త్యాగాలు చేస్తూ వస్తున్నారు. ఆ స్వయం సేవకులదరినీ ఎర్రకోట వేదికగా సగౌరవంగా గుర్తుచేసుకుంటున్నా’’ అన్నారు.తగ్గనున్న జీఎస్టీ శ్లాబులు-దివాలీ డబుల్ బొనాంజా ‘‘త్వరలో భారీస్థాయిలో సరికొత్త జీఎస్టీ సంస్కరణలు తేనున్నాం. జీఎస్టీ శ్లాబులను బాగా తగ్గించనున్నాం. తద్వారా పౌరులపై పన్ను భారం గణనీయంగా తగ్గుతుంది. ఈ దీపావళికి వారికిది కేంద్రం తరఫున డబుల్ బొనాంజా. వార్షిక వ్యక్తిగత ఆదాయ పన్ను చట్టాలను కూడా సరళీకరించాం’’. యువత కోసం... రూ.లక్ష కోట్లు ‘‘దేశ యువత కోసం రూ.లక్ష కోట్లతో ‘ప్రధాన్మంత్రీ వికసిత్ భారత్ రోజ్గార్ యోజన’ పేరుతో కొత్త పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నాం. దీనికింద ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందే యువతీ యువకులందరికీ రూ.15 వేలు అందజేయనున్నాం. యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు అందించే కంపెనీలకు ప్రోత్సహకాలు అందుతా యి. ఈ పథకం ద్వారా కనీసం 3.5 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తాం’’. కీలక ఖనిజాలపై దృష్టి ‘‘ఇది టెక్నాలజీ ఆధారిత శతాబ్ది. దాన్ని అందిపుచ్చుకున్న దేశాలే అభివృద్ధిలో దూసుకెళ్లాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం. గత ప్రభుత్వాలను విమర్శించడం నా లక్ష్యం కాదు. కానీ మన దేశంలో సెమీ కండక్టర్ల తయారీకి సంబంధించిన ఫైళ్లు కదలడం 60 ఏళ్ల కిందే మొదలైంది. కానీ ఏళ్లు గడిచినా ఎక్కడి గొంగళి అక్కడే! అలా మనం అతి విలువైన 50 ఏళ్లను కోల్పోతే మిగతా దేశాలు ఆ రంగంలో దూసుకెళ్లాయి. మేం అధికారంలోకి వచ్చాక సెమీ కండక్టర్ల తయారీకి పెద్దపీట వేస్తున్నాం. ఇక కీలక ఖనిజాల అవసరాన్ని నేడు ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయి. ఈ రంగంలోనూ స్వయం సమృద్ధి సాధించడం అత్యంత కీలకం. పరిశ్రమలు, ఇంధనం, రక్షణ, టెక్నాలజీ... ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా కీలక ఖనిజాలే ప్రాణావసరంగా మారిన పరిస్థితి! ఈ అవసరాలను పూర్తిస్థాయిలో దేశీయంగానే తీర్చుకునేందుకు నేషనల్ క్రిటికల్ మిషన్కు శ్రీకారం చుట్టాం. దేశవ్యాప్తంగా ఏకంగా 1,200 చోట్ల కీలక ఖనిజాల అన్వేషణకు తెర తీశాం’’.పదింతలకు ‘అణు’ పాటవం ‘‘దేశవ్యాప్తంగా 10 కొత్త అణు రియాక్టర్లను శరవేగంగా నిర్మిస్తున్నట్టు మోదీ వెల్లడించారు. దేశ అణు ఇంధన సామర్థ్యాన్ని 2047 నాటికి పదింతలు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటించారు’’.

నాగాలాండ్ గవర్నర్ గణేశన్ కన్నుమూత
చెన్నై: నాగాలాండ్ గవర్నర, బీజేపీ మాజీ ఎంపీ ఎల్ గణేశన్(80) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఈరోజు(శుక్రవారం, ఆగస్టు 15వ తేదీ) సాయంత్రం చెన్నై ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆగస్టు 8వ తేదీన తలకు తగిలిన గాయంతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. కన్నుమూశారు. అప్పట్నుంచి స్పృహకోల్పోయిన గణేషన్.. తిరిగి కోలుకోలేదు. ఆయన అంత్యక్రియలు టీ నగర్లోని ఆయన ఇంటి వద్ద నిర్వహించనున్నారు. గణేశన్ భౌతికాయాన్ని రాజకీయ నాయకులు, బంధువులు సందర్శనార్థం రేపు(శనివారం, ఆగస్టు 16వ తేదీ) ఆయన ఇంటివద్ద ఉంచనున్నారు.1945, ఫిబ్రవరి 16వ తేదీన తంజావూర్లో ఆయన జన్మించారు. ఆయన యువకుడిగా ఉండగానే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు ఆకర్షితుడైన లా గణేషన్.. తండ్రి, అన్నల బాటలోనే నడిచారు. అలా 1970లో ఫుల్టైమ్ ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా ఎంపికయ్యారు.1991లో బీజేపీలో చేరిన ఆయన.. తమిళనాడు రాష్ట్ర యూనిట్కు ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించబడ్డారు. తమిళనాడులో బీజేపీ ఎదుగుదలలో ఆయన కీలక పాత్ర వహించారు. ఆపై 10 ఏళ్ల తర్వాత గణేశన్ బీజేపీ జాతీయ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీకి జాతీయ స్థాయిలో వైస్ ప్రెసిడెంట్గా కూడా ఆయన సేవలందించారు. 2016లో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎంపికయ్యారు. 2021, ఆగస్టు 27వ తేదీన మణిపూర్ గవర్నర్గా బాధ్యతలు తీసుకున్న లా గణేశన్... 2023, ఫిబ్రవరి 19వ తేదీ వరకూ పని చేశారు. అదే సమయంలో జూలై 2022 నుంచి నవంబర్ వరకూ పశ్చిమబెంగాల్ రాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతలు తీసుకున్నారు. 2023 ఫిబ్రవరి నుంచి నాగాలాండ్ గవర్నర్గా సేవలందిస్తున్నారు. ఈ క్రమంలోనే గాయంతో ఆస్పత్రి పాలైన ఆయన... 2025, ఆగస్టు 15వ తేదీన మృతిచెందారు.

ప్రేమంటే ఇదేరా.. ప్రియుడి కోసం శ్రీలంక యువతి సాహసం
అన్నానగర్: ప్రేమించిన యువకుడి కోసం ఓ యువతి ఏకంగా దేశం దాటి వచ్చిన ఉదంతమిది. ప్రియుడి కోసం ప్రియురాలు తన దగ్గరున్న నగలు అమ్ముకుని మరీ శ్రీలంక నుంచి నకిలీ పడవలో భారత్కు వచ్చిన ఘటన బుధవారం రామేశ్వరం సమీపంలోని ధనుష్కోటిలో జరిగింది. పోలీసు అధికారుల కథనం మేరకు.. అరిచలమునై బీచు బుధవారం ఉదయం ఓ యువతి శరణార్థిగా వచ్చిందని కోస్టల్ పోలీసులకు సమాచారం అందింది.ఆ మహిళను కేంద్ర, రాష్ట్ర నిఘా విభాగం పోలీసులు పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి విచారించారు. పోలీసుల కథనం మేరకు.. శ్రీలంకలోని మన్నార్కు చెందిన విదుర్షియ (25) తమిళనాడులోని దిండుక్కల్ జిల్లా పళనిలో ఒక శరణార్థి శిబిరంలో తన తల్లి, తండ్రితో కలిసి నివసించేది. ఆ సమయంలో ఆమె ఓ యువకుడిని ప్రేమించింది. గత ఏప్రిల్లో ఆమె శ్రీలంకకు వెళ్లగా, తిరిగి అక్కడి నుంచి భారత్కు రావడానికి వీసా పొందలేకపోయింది.అయితే ఆమె తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోవడానికి నకిలీ పడవలో రావాలని నిర్ణయించుకుంది. దీని కోసం ఆ మహిళ తన నగలను అమ్మి వచ్చిన నగదుతో తలైమన్నార్ బీచ్ నుంచి ఓ ప్లాస్టిక్ పడవ ఎక్కి అరిచల్ మునైకి చేరుకుంది. దర్యాప్తు అనంతరం ఆ యువతిని మండపం శరణార్థి శిబిరానికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
ఎన్ఆర్ఐ

ఇండియాకు వెళ్లిపో.. ఐర్లాండ్లో అమానుష ఘటన
విదేశాల్లో భారతీయులపై దాడులు పెరిగిపోతున్న పరిస్థితులు చూస్తున్నదే. తాజాగా ఐర్లాండ్లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఆరేళ్ల చిన్నారిపై తోటి పిల్లలు జాత్యాంహకారం ప్రదర్శించారు. ఆమెపై ఇష్టానుసారం దాడి చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడి భారతీయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.ఐర్లాండ్ వాటర్ఫోర్డ్ నగరంలో ఆగస్టు 4వ తేదీన దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన ఆరేళ్ల బాలికపై జాత్యంహకార దాడి జరిగింది. భారత్కు తిరిగి వెళ్లిపో అంటూ తోటి పిల్లల్లో కొందరు ఆమెపై ఈ దాడికి తెగబడడం గమనార్హం. ఈ క్రమంలో ఆమె ప్రైవేట్ భాగాలను గాయపరిచినట్లు తల్లి మీడియాకు వివరించారు.సోమవారం సాయంత్రం కిల్బర్రీ ప్రాంతంలోని తన నివాసం బయట నియా నవీన్(6) తోటి పిల్లలలో కలిసి ఆడుకుంటోంది. ఆ సమయంలో 12-14 ఏళ్ల వయసున్న పిల్లలు కొందరు బాలిక వద్దకు వచ్చారు. అప్పటిదాకా అక్కడే ఉన్న బాలిక తల్లి.. మరో బిడ్డకు పాలిచ్చేందుకు లోపలికి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన ఆ బ్యాచ్ సదరు బాలికపై దాడికి తెగబడింది. ఆమె ముఖంపై పిడిగుద్దులు కురిపిస్తూ.. సైకిల్తో ప్రైవేట్ భాగాలను గాయపరిచింది.బాలిక కేకలు విని బయటకు పరిగెత్తుకొచ్చింది ఆ తల్లి. ఆ సమయంలో వాళ్లంతా పారిపోగా.. నడవలేని స్థితిలో బాలిక భయంతో వణికిపోతూ కనిపించింది. డర్టీ ఇండియన్.. గో బ్యాక్ టూ ఇండియా అంటూ వాళ్లు అసభ్య పదజాలం ప్రయోగిస్తూ ఆ బాలికను వారించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.తాను ఎనిమిదేళ్లుగా ఇక్కడ నర్సుగా పని చేస్తున్నానని, ఈ మధ్యే ఐర్లాండ్ పౌరసత్వం దక్కిందని బాలిక తల్లి అనుపా అచ్యుతన్ ‘ఐరీష్ మిర్రర్’ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘‘మేం అధికారికంగానే ఇక్కడ వచ్చి ఉంటున్నాం.. మంచి వృత్తుల్లో స్థిరపడ్డాం. కానీ, ఇక్కడ భారతీయులెవరికీ భద్రత లేకుండా పోయింది. చివరికి ఇంట్లోనూ భయంతోనే గడపాల్సి వస్తోంది. నా బిడ్డను నేను దాడి నుంచి రక్షించుకోలేకపోయా. ఆమె ఇక నుంచి మునుపటిలా సరదాగా ఆడుకోలేదని నేను భావిస్తున్నా’’ అని జరిగిన ఘటన గురించి ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలిక తల్లి తెలిపింది. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పిల్లలపై కఠిన చర్యలు తీసుకోకుండా.. విషబీజాలను వాళ్ల మనసుల్లోంచి తొలగించేలా కౌన్సెలింగ్ ఇప్పించాలని ఆమె కోరుకుంటోంది.ఐర్లాండ్లో భారతీయులపై జాత్యాంహకార దాడులు పెరిగిపోయాయి. గత జులై నుంచి ఇప్పటిదాకా ఐదు ఘటనలు చోటు చేసుకున్నాయి. కిందటి నెలలోనూ ఓ భారతీయుడిపై జాత్యహంకార దాడి జరిగింది. రాజధాని నగరం డబ్లిన్లోని టల్లాట్లో 40 ఏళ్ల వ్యక్తిని దుండగులు దుస్తులు విప్పించి హింసించారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను భారత రాయబారి ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్థానిక కౌన్సిలర్ బాధితుడిని పరామర్శించి, బాసటగా నిలిచారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు రెండు నెలల క్రితమే ఆ దేశానికి వెళ్లినట్లు తెలుస్తోంది. భారతీయులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఐర్లాండ్లోని భారతీయ రాయబార కార్యాలయం అలర్ట్ అయ్యి.. హెల్ప్లైన్ నంబర్లు విడుదల చేసింది.Credits: irishmirror

భారతీయ కుటుంబ వ్యవస్థ చనిపోయిందా?
ఈ ప్రశ్న వేసింది వాన్షివ్ టెక్నాలజీస్ వ్యవస్థాపక సీఈవో గౌరవ్ ఖేటర్పాల్. తనను బాధ పెట్టిన సంఘటన గురించి తలుచుకుంటూ ఆయన ఈ ప్రశ్న వేశారు. విదేశాల్లో ఉంటున్న పిల్లలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న వార్తలను తరచుగా వింటున్నాం. కని, పెంచి ప్రయోజకులను చేసిన పేరెంట్స్ను చివరి రోజుల్లో ఒంటరిగా వదిలేస్తున్న వారు ఎందరో. కనీసం కన్నవారి చివరిచూపునకు కూడా నోచుకోకుండా కన్నుమూస్తున్న తల్లిదండ్రులు కోకోల్లలు. ఈ నేపథ్యంలో గౌరవ్ ఖేటర్పాల్ ఎక్స్లో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఆన్లైన్లో చర్చకు దారితీసింది. అమెరికాలో ఉంటున్న తన స్నేహితుడొకరు.. తండ్రి చివరి రోజుల్లో వ్యవహరించిన తీరును తన పోస్ట్ ద్వారా వెల్లడించారు.'15 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న స్నేహితుడొకరు ఇటీవల తన తండ్రిని కోల్పోయాడు. మూడేళ్ల క్రితం తల్లి చనిపోవడంతో అతడి తండ్రి (84) జైపూర్లో ఒంటరిగా ఉంటున్నాడు. కొద్ది రోజుల ముందు తెల్లవారుజామున 3 గంటలకు నాకొక ఫోన్ కాల్ (Phone Call) వచ్చింది. తన తండ్రి ఆరోగ్యం బాలేదని, వెళ్లి చూడమని అమెరికా నుంచి ఫ్రెండ్ ఫోన్లో చెప్పాడు. కొంతమంది స్నేహితులతో కలిసి నేను వెంటనే ఆయనను ఆస్పత్రిలో చేర్పించాను. గుండెపోటు, అవయవాలు పనిచేయకుండా పోవడంతో పెద్దాయనను ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. సరైన సమయంతో మంచి వైద్యం అందిచడంతో ఆయన కోలుకుకున్నారు. బంధువులు ఆయన చూడటానికి వచ్చారు. కానీ ఎవరూ ఎటువంటి బిల్లులు చెల్లించలేదు సరికదా, ఆయన బాధ్యత భుజానికెత్తుకోవడానికి కూడా ముందుకు రాలేదు. ఇక పెద్దాయన కొడుకు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే తండ్రి ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతుంటే కొడుకు మిలియన్ డాలర్ల ఒప్పందం కోసం అమెరికాలోనే ఉన్నాడు. తండ్రిని చూడటానికి రాలేదు. గత వారమే పెద్దాయన ప్రాణాలు వదిలారు. తండ్రి చనిపోయిన తర్వాత ఇండియాకు వచ్చిన కొడుకు మళ్లీ 3 రోజులకే తిరుగు పయనమయ్యాడు.నన్ను కదిలించినది ఏమిటంటే..అంతిమ గడియల్లో ఉన్న తండ్రి కంటే అమెరికా కలే అతడికి ముఖ్యమైంది. తండ్రి చనిపోయినప్పుడు కూడా అతడి భార్య, పిల్లలు రాలేదు. వాళ్లు అమెరికాలోనే ఉండిపోయారు. "ఆమెకు ఉద్యోగం ఉంది, పిల్లలకు చదువు ఉంది" అని అతడు అన్నాడు - నమ్మశక్యం కాదు!నేను, నా స్నేహితులు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించి, ఖర్చులు చూసుకుంటూ, వంతులవారీగా ఆస్పత్రికి వెళుతూ అతడి తండ్రిని చివరి శ్వాస వరకు వెన్నంటే ఉన్నాం. కానీ నగరంలోని అతడి బంధువులెవరూ మర్యాదపూర్వకంగా కలవడం తప్ప ఎటువంటి సహాయం చేయలేదు.తండ్రి చనిపోయిన మూడో రోజునే నా స్నేహితుడు స్వదేశం విడిచి వెళ్లాడు. తండ్రి అస్థికలను నిమజ్జనం కూడా చేయకుండానే అతడు అమెరికా వెళ్లిపోయాడు.భారతీయ కుటుంబ విలువలు, మన ఆచారాలు, బంధాలు ప్రపంచంలో మరెక్కడా లేనంత మెరుగ్గా.. బలంగా ఉన్నాయని ఇప్పటివరకు నేను నమ్మాను. కానీ ఈ సంఘటన నన్ను పూర్తిగా కదిలించింది! భారతీయ సమాజం ఎటు పయనిస్తోంది, మన కుటుంబ విలువలు ఎక్కడ కనుమరుగవుతున్నాయ'ని గౌరవ్ ఖేటర్పాల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజనులు తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు. విదేశాల్లో ఉంటూ కెరీర్ కొనసాగిస్తువారు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కొంతమంది సానుభూతి వ్యక్తం చేశారు. ఎక్కువ మంది మాత్రం విచ్ఛిన్నమవుతున్న భారతీయ కుటుంబ విలువల గురించే ఆందోళన చెందారు.స్నేహితుడిని బద్నాం చేస్తారా?మరికొందరైతే గౌరవ్పై విరుచుకుపడ్డారు. ట్వీట్ కోసం స్నేహితుడిని బద్నాం చేస్తారా అంటూ ప్రశ్నించారు. 'కేవలం 3 రోజుల కోసమే అమెరికా (America) నుంచి ఎవరూ ఇండియాకు రారు. ప్రయాణానికే ఒక రోజు పడుతుంది. జెట్ లాగ్ ఎలాగూ ఉంటుంది. అతడి తండ్రికి అప్పటికే 84 ఏళ్లు, తన కొడుకుతో ఉండటానికి నిరాకరించి ఉండవచ్చు. ఎందుకంటే సుదీర్ఘ ప్రయాణం, చలి వాతావరణం కారణంగా అమెరికాలో వృద్ధులు నివసించడం కష్టం. అతడు తన తండ్రిని చూసుకోవడానికి సహాయకులను నియమించుకునే ఏర్పాటు చేసి ఉండాలి. మీరు ఎటువంటి రుజువు ఇవ్వకుండానే ఇక్కడ మీ స్నేహితుడిని లక్ష్యంగా చేసుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తుంది. ఆసుపత్రి బిల్లులు కూడా చెల్లించారని కూడా మీరు పేర్కొన్నారు. మీరు నిజం చెబుతుంటే, ఆసుపత్రి పత్రాలు, బిల్లులతో పాటు వృద్ధుడు, అతడి కొడుకు వివరాలను వెల్లడించండి' అంటూ ఒక నెటిజన్ కమెంట్ చేశాడు. దీనిపై ఖేటర్పాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'మీ స్పందన చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మొత్తం మీద.. 3 రోజుల కోసం ఎవరూ అమెరికా నుంచి భారతదేశానికి రారు అనే వాస్తవాన్ని మీరు ఇప్పుడే గమనించారు. మీ IQ వేరే స్థాయిలో ఉందంటూ' సమాధానమిచ్చారు.చదవండి: టాలెంట్ వదిలేసి బొట్టుపై ట్రోల్స్విదేశాల్లో స్థిరపడే వారి సంఖ్యలో గతంలో చాలా తక్కువగా ఉండేదని, ప్రస్తుతం ఈ సంఖ్య బాగా పెరుగుతుండడంతో.. తల్లిదండ్రులకు చివరి రోజుల్లో ఎడబాటు తప్పడం లేదని మరో నెటిజన్ (Netizen) అభిప్రాయపడ్డారు. అఖరి గడియాల్లో పిల్లల కోసం వేచిచూసి తనువు చాలిస్తున్న పేరెంట్స్ సంఖ్య నానాటికీ పెరగడం ఆందోళన కలిగిస్తోందని వాపోయారు. చాలా మంది పిల్లలకు.. తల్లిదండ్రులు వెళ్లిపోయిన తర్వాత, ఆస్తులన్నీ అమ్మేసి ముందుకు సాగడమే ఏకైక లక్ష్యంగా ఉందని పేర్కొన్నారు. మరోవైపు దాదాపు 2 లక్షల మంది భారతీయులు (Indians) తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని ప్రభుత్వ గణాంకాలు ఇటీవల వెల్లడించడం ఈ సందర్భంగా ప్రస్తావనర్హం.ఎవరీ గౌరవ్ ఖేటర్పాల్?రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ కేంద్రంగా పనిచేస్తున్నారు గౌరవ్ ఖేటర్పాల్ (Gaurav Kheterpal). గూగుల్ డెవలపర్ ఏఐ ఎక్స్పర్ట్ అయిన గౌరవ్కు ఐటీ రంగంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. మల్టీ-క్లౌడ్ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్గానూ ఆయన పేరు గాంచారు. చాలా దేశాల్లో ఐటీపై ప్రసంగాలు ఇచ్చారు. గ్లోబల్ మొబైల్ డెవలపర్ చాలెంజ్, యాప్స్ హకథాన్ వంటి పలు రకాల పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. వాన్షివ్ టెక్నాలజీస్ సంస్థను స్థాపించి సీఈవోగా కొనసాగుతున్నారు. Is the Indian family system dead?A friend (let's call him 'X') recently lost his father. He's been living in the US for the last 15 years while his father lived alone in Jaipur - his mother passed away 3 years back. Few days earlier, I received a frantic call from him at 3 AM…— Gaurav Kheterpal (@gauravkheterpal) August 3, 2025

దుబాయ్కి డ్రైవర్లు కావలెను.. జీతం ఎంతంటే?
సాక్షి, అమరావతి: కోవిడ్ సమయంలో డ్రైవర్లు స్వదేశాలకు వెళ్లి తిరిగి రాకపోవడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. డ్రైవర్లు వంటి అసంఘటిత రంగ కార్మికుల కొరతతో విలవిల్లాడుతోంది. దీంతో భారత్కు వచ్చేసిన డ్రైవర్లను ఆకర్షించేందుకు యూఏఈ కంపెనీలు ముందుకొస్తున్నాయి. దీనికోసం జలంధర్ నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ నియామక డ్రైవ్ను నిర్వహిస్తోంది. దుబాయ్కి చెందిన త్రీస్టార్ గ్రూపు, వియోలీయ, అల్లయ్డ్ ట్రాన్స్పోర్టు, దుబాయ్పోర్ట్ వంటి సంస్థలు డ్రైవర్ల నియామకం కోసం 10, 30వ తేదీల్లో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో గణేష్కుమార్ తెలిపారు.కడప, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో దుబాయ్ (Dubai) నుంచి తిరిగి వచ్చిన అనుభవజ్ఞులైన డ్రైవర్లు (Drivers) అత్యధికంగా ఉన్నారని, వారిని గుర్తించి అక్కడ దేశాల్లో ఉపాధి కల్పించేలా స్థానిక అధికారులు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. పదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండి యూఏఈ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి ట్రైలర్, ట్రక్, ఐటీవీ డ్రైవర్లుగా అవకాశాలు కల్పించనున్నారు. 24 నుంచి 48 ఏళ్లలోపు ఉన్న వారు అర్హులని, నెలకు రూ.35,000 నుంచి రూ.94,000 వరకు జీతం లభిస్తుందని ఏపీఎస్ఎస్డీసీ తెలిపింది. డ్రైవింగ్ టెస్ట్, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.ఆగస్టు 10న స్టార్ గ్రూపు, వియోలీయ, అల్లయ్డ్ ట్రాన్స్పోర్టు ఉద్యోగాలకు ఆగస్టు 30న ఐటీవీ డ్రైవర్లకు ఇంటర్వ్యూలు (Interviews) నిర్వహించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఏపీఎస్ఎస్డీసీ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు. లేదా skillinternational@apssdc.in ఈమెయిల్, 91–99888533 35, 8712655686, 8790118349, 8790117279 నంబర్లలో సంప్రదించాల్సిందిగా కోరింది.చదవండి: స్కూల్లో కూలి పనులు చేయిస్తున్నారు

ఎడిసన్లో ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ ప్రారంభం
అమెరికాలో భారతీయుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ తన దౌత్య సేవలను మరింత విస్తరించింది. ఈ క్రమంలోనే అమెరికా వ్యాప్తంగా కొత్తగా 8 ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాత్రా వెల్లడించారు. ఎడిసన్, బోస్టన్, కొలంబస్, డల్లాస్, డెట్రాయిట్, ఓర్లాండో, రాలీ, శాన్ జోస్ వంటి నగరాల్లో ఈ నూతన ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్లను వర్చువల్గా ప్రారంభించారు. దీంతో మొత్తం ICACల సంఖ్య 17కి చేరినట్లు వివరించారు.ఇక న్యూజెర్సీలోని ఎడిసన్లో జరిగిన ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ ప్రత్యేక ప్రారంభోత్సవ కార్యక్రమానికి న్యూయార్క్లోని భారత కాన్సుల్ జనరల్ బినయా ప్రధాన్ హాజరై ప్రసంగించారు. ఇక ఈ కార్యక్రమంలో ఎడిసన్ మేయర్ సామ్ జోషితో పాటు ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీకి చెందిన ప్రముఖ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో VFS గ్లోబల్ నార్త్ అమెరికా, కరేబియన్ అధిపతి అమిత్ కుమార్ శర్మ పాల్గొని ప్రసంగించారు. VFS 150 దేశాలలో 70 ప్రభుత్వాలతో కలిసి పనిచేసిందన్నారు. ఇక నూతన కేంద్రాల నుండి వర్చువల్గా చేరిన ప్రవాసులను ఉద్దేశించి వినయ్ ప్రసంగించారు. ఈ కొత్త కేంద్రాల ఏర్పాటు ద్వారా భారతీయ డయాస్పోరాకు కాన్సులర్ సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని, సేవలు సులభతరం, వేగవంతమౌతాయని వినయ్ పేర్కొన్నారు. శనివారాల్లో కూడా ఈ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ల కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కేంద్రాల ఏర్పాటుతో- అమెరికా వ్యాప్తంగా నివసించే లక్షలాది మంది భారతీయులకు కాన్సులర్ సేవలు మరింత చేరువ చేసినట్టవుతుందని పలువురు ప్రముఖులు వెల్లడించారు. ఈ కొత్త కాన్సులేట్లను తెరవడం ద్వారా భారత్-అమెరికా భాగస్వామ్యాన్ని.. ముఖ్యంగా ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయగలమని అభిప్రాయపడ్డారు.(చదవండి: డాలస్లో కొత్తగా ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్)
క్రైమ్

ప్రియుడితో సుఖం కోసం భర్తను దారుణంగా..
శ్రీకాకుళం జిల్లా: పాతపట్నం మేజర్ పంచాయతీ మొండిగల వీధికి చెందిన నల్లి రాజు (34) మృతి కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడు, మరొకరి సాయంతో భార్యే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో గుర్తించి ముగ్గురినీ అరెస్టు చేశారు. ఈ మేరకు గురువారం పాతపట్నం పోలీస్స్టేషన్లో టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు విలేకరులకు వివరాలు వెల్లడించారు. పాతపట్నం మొండిగలవీధికి చెందిన నల్లి రాజుకు మౌనికతో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. మౌనికకు పాతపట్నం మాదిగవీధికి చెందిన గుండు ఉదయ్కుమార్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాజును హత్య చేయాలని మౌనిక.. తన భార్యకు విడాకులు ఇవ్వాలని ఉదయ్కుమార్ నిర్ణయించుకున్నారు. తర్వాత ఎక్కడికై నా పారిపోయి వివాహం చేసుకోవాలని భావించారు.పక్కా పథకం ప్రకారం..మౌనిక, ఉదయ్కుమార్ కలిసి రాజు హత్యకు పథకం వేశారు. కొత్త ఫోన్ నంబరుతో అమ్మాయిలా చాటింగ్ చేసి ఉదయ్కుమార్ను ఎక్కడికైనా రప్పించి చంపాలని నిర్ణయించుకున్నా సాధ్యం కాలేదు. దీంతో నిద్రమాత్రలు ఇచ్చి చంపాలని కుట్ర పన్నారు. ఇందుకు ఉదయ్కుమార్ తన బావ మాదిగవీధికి చెందిన చౌదరి మల్లికార్జున్ అలియాస్ మల్లికార్జునరావు సహాయం కోరాడు. కుట్రలో భాగంగా ఉదయ్కుమార్ పర్లాకిమిడిలో ఆర్ఎంపీ వైద్యుడి వద్ద పది నిద్రమాత్రలు కొని మౌనికకు ఇచ్చాడు. మౌనిక ఈ నెల 5న రాత్రి భోజనంలో నాలుగు నిద్రమాత్రలు కలిపి పెట్టింది. భర్త వెంటనే నిద్రలోకి వెళ్లడం గమనించి చంపవచ్చని నిర్ధారణకొచ్చింది. ఈ నెల 6న రాత్రి భోజనంలో ఆరు మాత్రలను కలపడంతో రాజు గాఢ నిద్రలోకి వెళ్లిపోయాడు. మౌనిక వెంటనే ప్రియుడు ఉదయ్కుమార్, చౌదరి మల్లికార్జునరావులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. రాత్రి 11.30 సమయంలో ఇద్దరూ వీధి లైట్లు ఆపేసి మౌనిక ఇంటికి వెళ్లారు. రాజు కాళ్లు, చేతులను మౌనిక, మల్లికార్జునరావు పట్టుకోగా.. ఛాతి పై ఉదయ్కుమార్ కూర్చుని తలగడతో ఊపిరి ఆడకుండా చంపేశారు. అనంతరం రాజు మృతదేహంతో పాటు బైక్, చెప్పులు, మద్యం బాటిల్ను హరిజనవీధికి దిగువన పడేసి వెళ్లిపోయారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మౌనిక తన భర్త ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. మరుసటి రోజు ఉదయాన్నే మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మౌనిక ఏడుస్తున్నట్లు నటిస్తూ భర్త మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురినీ నిందితులుగా గుర్తించారు. దీంతో మౌనిక, ఉదయ్కుమార్, మల్లికార్జునరావులు రెవెన్యూ అధికారుల వద్ద లొంగిపోయారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి నరసన్నపేట జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు డీఎస్పీ తెలిపా రు. కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసిన సీఐ వి. రామారావు, ఎస్ఐ బి.లావణ్య, పీసీలు బి.జీవరత్నం, డి.గౌరీశంకర్రావు, పరమేష్లను అభినందించి, రివార్డులను అందజేశారు.

ఉప్పల్లో దారుణం.. ఐదేళ్ల బాలుడిపై హత్యాచారం
హైదరాబాద్: అభమూ శుభమూ తెలియని ఐదేళ్ల బాలుడిపై ఓ మానవ మృగం లైంగిక దాడికి పాల్పడి.. అనంతరం హత్య చేసిన దారుణ ఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. రామంతాపూర్ కేసీఆర్ నగర్లో నివసించే ఓ వ్యక్తి స్థానికంగా ఉన్న టింబర్ డిపోలో పని చేస్తున్నాడు. ఈ నెల 12న తన కుమారుడు (5) కనిపించడం లేదంటూ ఉప్పల్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపిన పోలీసులు.. సీసీ ఫుటేజీల ఆధారంగా అనుమానితుణ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. అసలు విషయం బయట పడింది. అదే టింబర్ డిపోలో పని చేసే కమర్ అనే వ్యక్తి 12వ తేదీన బాలుడికి మాయమాటలు చెప్పి కేసీఆర్ నగర్ సమీపంలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలుడు స్పృహ తప్పిపోగా.. గొంతు నులిమి హత్య చేసినట్లు నిందితుడు వెల్లడించాడు. బిహార్కు చెందిన కమర్.. బాలుడి ఇంటి పక్కనే నివాసం ఉండేవాడని పోలీసులు తెలిపారు. బాలుడి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్ పోలీసులు చెప్పారు.

మహిళను కట్టేసి చితకబాదిన దాయాదులు
మోపాల్ (నిజామాబాద్ రూరల్): నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని సింగంపల్లి గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను దాయాదులు గుంజకు కట్టేసి చితకబాదిన సంఘటన రెండురోజుల తర్వాత వెలుగు లోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరా లు.. గ్రామానికి చెందిన పల్లికొండ సవిత మతిస్థిమితం లేని భర్త, నలుగురు పిల్లలతో జీవనం సాగిస్తోంది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. సవిత ఇంటి ఎదుట నున్న స్థలంలో ఆమె తోటికోడలు పల్లికొండ లక్ష్మికి చెందిన గేదెలు, గొర్రెలు ఉంటాయి. గొర్రెలు, గేదెలు తరచుగా సవిత ఇంట్లోకి వచ్చి మలమూత్రాలు విసర్జించడమే కాకుండా, బియ్యం తినడం వంటివి చేస్తున్నాయి. ఈ విషయమై సవిత పలుమార్లు లక్ష్మి కుటుంబ సభ్యులకు చెప్పినా పట్టించుకోలేదు. మంగళవారం రాత్రి కూడా గేదె సవిత ఇంట్లోకి వెళ్లి బియ్యాన్ని తొక్కి చిందరవందర చేయడంతో లక్ష్మిపై సవిత ఆగ్రహం వ్యక్తం చేసింది. లక్ష్మి కోపంతో సవితను తిడుతూనే మంత్రాలు చేస్తున్నావని ఆరోపించింది. దీంతో ప్రమాణం చేద్దామని సవిత గేదెను తీసుకుని హనుమాన్ గుడి వద్దకు వెళ్లింది. అక్కడికి వచ్చిన లక్ష్మి సవితను హనుమాన్ ఆలయం వద్దనున్న పెద్ద గుంజకు(కట్టె) కట్టేసింది. లక్ష్మి కొడుకు గంగాధర్, కోడలు మమత, భర్త పల్లికొండ గంగాధర్ అక్కడికి చేరుకుని సవితపై దాడి చేశారు. తనను వదిలిపెట్టాలని సవిత వేడుకున్నా కనికరించలేదు. గంట తరువాత స్థానిక మహిళలు జోక్యం చేసుకుని సవిత కట్లు విప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై జాడె సుస్మిత గురువారం గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. పల్లికొండ గంగాధర్, లక్ష్మి, వారి కుమారుడు గంగాధర్, కోడలు మమతను అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు.

క్యాబిన్లో ఇరుక్కుని..
వరంగల్ జిల్లా: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం, మొరిపిరాల మధ్యలో జాతీయ రహదారిపై లారీ, బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. లారీడ్రైవర్, క్లీనర్ తీవ్రగాయాలతో క్యాబిన్లో ఇరుక్కుపోయారు. పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం ఖమ్మం డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు హనుమకొండనుంచి ఖమ్మం వైపు వెళ్తోంది. ఇదే సమయంలో ప్లాస్టిక్ వస్తువుల లోడ్తో ఓ లారీ విజయవాడ నుంచి హనుమకొండ వైపు వస్తోంది. ఈ క్రమంలో మైలారం, మొరిపిరాల మధ్యలో బ్రిడ్జి వద్ద గుంతలను తప్పించుకునే క్రమంలో లారీ, బస్సు ఎదురెదు రుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 44 మందిలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారికి స్పల్ప గాయాలయ్యాయి. అలాగే లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం, వర్ధన్నపేట సీహెచ్సీకి తరలించారు. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ నుజ్జునుజ్జయింది. డ్రైవర్, క్లీనర్ క్యాబిన్లో ఇరుక్కుపోగా.. పోలీసులు జేసీబీ సహాయంతో గంటపాటు శ్రమించి క్యాబిన్ను విడగొట్టి వారిని బయటకు తీశారు. వైద్యంకోసం వీరిని ఎంజీఎంకు తరలించారు. ఈ ఘటన తో వరంగల్, ఖమ్మం జాతీయ రహదారిపై రెండు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఎంజీఎం సూపరింటెండెంట్, వర్ధన్నపేట ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్లకు ఫోన్లో ఆదేశించారు.