ప్రధాన వార్తలు

సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట
ఢిల్లీ: సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట లభించింది. మైనింగ్ కేసులో వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న ఏపీ ప్రభుత్వ పిటిషన్ను హైకోర్టుకు సుప్రీం కోర్టు తిప్పి పంపించింది. అరెస్టు నుంచి రక్షణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్పై గురువారం.. సుప్రీంకోర్టు విచారణ జరిపింది.హైకోర్టు తమ వాదన వినకుండానే ముందస్తు బెయిల్ ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదించారు. దాంతో కేసును ఏపీ హైకోర్టు మరోసారి విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అరెస్టు నుంచి రక్షణను సుప్రీంకోర్టు పొడిగించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.

ఇమేజీ బాగా డ్యామేజీ అవుతోంది బాబూ!
ఆంధ్రప్రదేశ్లో ఆటవిక రాజ్యం నడుస్తోందన్న భావన రోజు రోజుకూ బలపడుతోంది. తెలుగుదేశం పార్టీ నేతల ఆగడాలు రోజురోజుకు శ్రుతి మించుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులున్నా.. పోలీసులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం కూడా దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఇదే విషయానికి ‘‘బాబు ష్యూరిటీ- గుండాయిజం గ్యారంటీ..’’ శీర్షికతో సాక్షి ప్రచురించిన ఒక కథనం అద్దం పడుతోంది.కొద్ది రోజుల క్రితం ఒక స్వతంత్ర సంస్థ జరిపిన సర్వే కూడా ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి బాగా దిగజారిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అత్యధిక శాతం ప్రజలు ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాది పాలనలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలను కోరుకున్నా అది ఆశించినంతమేర సాగడం లేదని సమాచారం. ప్రజల నుంచి ఎక్కడికక్కడ నిరసన వ్యక్తమవుతూండటంతో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారట.ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు ప్రజలు పట్టుపడుతూండటంతో ఎమ్మెల్యేలు దిక్కుతోచని స్థితిలో పడ్డారని తెలుస్తోంది. ఇదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ‘‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’’ అంటూ జనంలోకి వెళుతోంది. అన్ని నియోజక వర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రజలకు చేసిన మోసాలను అంకెలతో వివరిస్తున్నారు. ఇది కాస్తా ప్రభుత్వానికి చికాకుగా మారింది. దీన్ని అడ్డుకునేందుకా అన్నట్టు టీడీపీ, జనసేనలు రెండూ వైసీపీ సభలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి.గుడివాడలో జరిగిన ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశాన్ని టీడీపీ వారు అడ్డుపడే ప్రయత్నం చేయడం ఏమిటి? పోలీసులు నిలువరించలేకపోవడం ఏమిటి? ప్రజాస్వామ్యంలో ఎవరైనా సమావేశాలు పెట్టుకోవచ్చు. జెడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారిక ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేయడం ఏమిటి? వాహనం అద్దాలు పగులగొట్టి మహిళ అని కూడా చూడకుండా అసభ్య పదజాలం వాడడం ఏమిటి?వైఎస్సార్సీపీ వారిపై నిత్యం ఏదో ఒక ఆరోపణ చేసి తామే మహిళోద్దారకులం అని చెప్పుకునే కూటమి పెద్దలు ఈ అంశంపై నోరు తెరవకపోవడం ఏమిటి? పైగా వాహనంలో ప్రయాణిస్తున్న హారిక భర్త రాముపై ఎదురు కేసు పెట్టారట. దాడి ఘటనపై కేసు పెట్టకపోవడంపై గట్టి హెచ్చరిక చేయడంతో టీడీపీ వారిపై కేసులు నమోదు చేసినా కీలకమైన వ్యక్తిపై మాత్రం పెట్టలేదట. అసలు అల్లరికి కారణమైన వ్యక్తిని వదలి వేస్తే ఏమిటి అర్థం? ఇదేనా పోలీసు వ్యవస్థ పనితీరు!నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడిచేసి విధ్వంసం సృష్టించిన వారిపై ఎందుకు చర్య తీసుకోలేదు? ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంతి చేసిన ఫిర్యాదుపై మాత్రం పోలీసులు వేగంగా స్పందించారు. ఎవరి తప్పు ఉన్నా కేసు పెట్టవచ్చు. కాని పోలీస్ యంత్రాంగం ఒక వైపే చూడడం ఏపీ స్పెషాలిటీగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఎక్కడకు వెళ్లినా, పోలీసులు ఏదో రకంగా అడ్డం తగలడం, ఆ పార్టీ వారిపై కేసులు పెట్టడం నిత్యకృత్యంగా మారింది. జగన్ సత్తెనపల్లి టూర్కు సంబంధించి సుమారు 150 మందికి పోలీసులు నోటీసు ఇచ్చి విచారణ పేరుతో వేధిస్తున్నారని చెబుతున్నారు.అనంతపురం వద్ద లింగమయ్య అనే వైఎస్సార్సీపీ నేత హత్యకు గురైతే అక్కడకు జగన్ వెళ్లినప్పుడు కూడా ఇలాగే చేశారు. జగన్ హెలికాఫ్టర్ వద్ద సరైన సెక్యూరిటీ పెట్టకుండా, దాని విండ్ షీల్డ్ దెబ్బతింటే, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి, ఇతర కార్యకర్తలపై కేసులు పెట్టారు. జగన్ మామిడి రైతుల పరామర్శకు బంగారుపాళ్యం వెళితే అక్కడా అదే తంతు. అసలు జగన్ పర్యటనలో 500 మించి పాల్గొనరాదని ఆంక్ష పెట్టి ఏమి సాధించదలిచారు.అయినా జనం వేలాదిగా తరలివచ్చారు అంటే అది జగన్ మీద అభిమానంతోనే కదా? దానిని తట్టుకోలేక ఇక్కడ కూడా ఏదో కారణం చూపి కొందరిని అరెస్టు చేశారు. పైగా చిన్న కేసులు పెట్టవలసిన చోట ఏకంగా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడం, వీలైతే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం వంటివి చేస్తున్నారు. పొగాకు రైతుల సమస్యపై పొదిలి వెళితే అక్కడకు టీడీపీ గూండాలను పోలీసులు ఎలా అనుమతించారు?వైఎస్సార్సీపీ రీకాలింగ్ చంద్రబాబు మానిఫెస్టో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తుండడం అధికార పార్టీ కూటమికి కంటగింపుగా మారింది. దానిని ఎలా ఎదుర్కోవాలో తెలియక వారే అల్లర్లు సృష్టిస్తున్నారు. దీంతో ఏపీలో ఒక రకమైన భయానక వాతావరణం నెలకొంటోంది. రాజకీయపరమైన వేధింపులే కాదు.. ఇతరత్రా కూడా అనేక సంఘటనలు ఏపీలో శాంతి భద్రతలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఉదాహరణకు ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కుప్పంలో అప్పు తీర్చలేదని ఒక మహిళను చెట్టుకు కట్టి హింసించిన ఘటన కలకలం రేపింది.మహిళలపై అత్యాచారాల ఘటనలు రిపోర్టు అవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా శ్రీకాళహస్తిలో జనసేన ఇంఛార్జి కోట వినూత దంపతులు తమ వద్ద పనిచేసిన డ్రైవర్ శ్రీనివాసులును హత్య చేసిన ఉదంతం తీవ్ర సంచలనమైంది. వినూతకు, టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి మధ్య ఉన్న విబేధాల గురించి వస్తున్న వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఒక మహిళా నేతను బెదిరించడానికి బొజ్జల అనుసరించారని వస్తున్న ఆరోపణలు జుగుప్స కలిగిస్తాయి.అవి నిజమైతే అయితే ఈయనపై కూడా కేసు పెట్టాల్సి ఉంటుంది. ఈ వ్యవహారం పవన్ కళ్యాణ్కు తెలిసినా ఆయన పట్టించుకోలేదని వినూత దంపతులు చెబుతున్నారు. చెన్నై పోలీసులు ఈ కేసును పట్టుకున్నారు కాబట్టి ఈ మాత్రం అయినా వెలుగులోకి వచ్చింది. లేకుంటే హత్య ఘటనే ఎవరికి తెలియకుండా పోయేదేమోనన్న సందేహాలు వస్తున్నాయి. వినూతను ఎవరు, ఎందుకు బ్లాక్ మెయిల్ చేశారు, మొదలైన అంశాలు పూర్తిగా వెలుగులోకి రావల్సి ఉంది. ఈ హత్యపై వస్తున్న వార్తల గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ వంటివారు నోరువిప్పడం లేదు. ఇంకో వైపు కరేడు వద్ద భూ సేకరణ వివాదం, ఇండోసోల్కు గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన భూములు వెనక్కి లాక్కుని కరేడు వద్ద వివాదం సృష్టించడం అంటే ఆ పరిశ్రమను ఇబ్బంది పెట్టడమే కదా! రాజధాని అదనపు భూముల పూలింగ్ గొడవ, గతంలో ఒఒక మోసకారి నటిని పట్టుకు వచ్చి ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించడం, ఆ సందర్భంగా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని జైలులో పెట్టడం, గత ప్రభుత్వంలో పనిచేసిన కొందరు ఐఏఎస్లు, ఐపీఎస్లను ఏదో ఒక కేసులో ఇరికిస్తుండడం, పలువురికి పోస్టింగ్లు ఇవ్వకపోవడం, కొంతమంది డీజీ స్థాయి అధికారులు పరిపాలన తీరుతెన్నులపై అసంతృప్తితో ఉండడం, చివరికి తమకు ఉద్యోగం వద్దని చెప్పి రాజీనామా చేసే వరకు వెళ్లడం వంటివి చంద్రబాబు ప్రభుత్వ ప్రతిష్టను బాగా దెబ్బతీస్తున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్లను కూడా వేధిస్తున్నారన్న సమాచారం సహజంగానే దేశమంతటా తెలుస్తుంది. దాని వల్ల ఏపీ ఇమేజీ తీవ్రంగా డామేజి అవుతోంది. అయినా ఫర్వాలేదు.. తమకు రెడ్ బుక్కే ప్రధానమని టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి నేతలు భావిస్తే అది ఏపీ ప్రజలు చేసుకున్న ఖర్మ అనుకోవల్సిందే.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

టీమిండియా స్టార్ క్రికెటర్ మాజీ భార్య, కూతురిపై కేసు నమోదు
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మాజీ భార్య హసీన్ జహా, అతని కుమార్తె అర్షి జహాపై హత్యాయత్నం కేసు నమోదైనట్లు తెలుస్తుంది. వివాదాస్పద స్థలం విషయంలో హసీన్, అర్షి తనపై దాడి చేశారని దలియా ఖాతూన్ అనే మహిళ పశ్చిమ బెంగాల్లోని బిర్భూమ్ జిల్లాలో గల సూరి పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో హసీన్, అర్షిపై BNSలోని 126(2), 115(2), 117(2), 109, 351(3), 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హసీన్, అర్షి దలియా ఖాతూన్పై దాడి చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి.పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్లోని సూరి పట్టణం వార్డ్ నంబర్ 5లో హసీన్ జహా, అమె కుమార్తె అర్షి జహా నివాసముంటున్నారు. ఆ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఇటీవల వారు ఇల్లు నిర్మించడం మొదలుపెట్టారు. ఈ స్థలం అర్షి పేరున రిజిస్టర్ అయ్యిందని వారంటున్నారు. An attempt to murder FIR under BNS sections 126(2), 115(2), 117(2), 109, 351(3) and 3(5) has lodged against Hasin Jahan, the estranged wife of Mohammed Shami and Arshi Jahan, her daughter from her first marriage by her neighbour Dalia Khatun in Suri town of Birbhum district in… pic.twitter.com/2dnqXUKMdK— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) July 16, 2025అయితే ఆ స్థలం తమదని అటు పక్క నివాసముంటున్న దలియా ఖాతూన్ ముందుకు వచ్చింది. హసీన్ మొదలుపెట్టిన కట్టడాన్ని ఆమె ఆపే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఖాతూన్పై హసీన్, అర్షి దాడికి దిగినట్లు తెలుస్తుంది.కాగా, ఇటీవలే జహాకు నెలకు రూ. 4 లక్షల భరణం ఇవ్వాలంటూ షమీని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. షమీ ఆర్థిక స్థితిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈమేరకు తీర్పును వెలువరించింది. ఇందులో జహాకు రూ. 1.5 లక్షలు, కూతురు అర్షికి రూ. 2.5 లక్షలు అని కోర్టు తెలిపింది.

తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ సెలైన్స్పై కవిత కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశమై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్పై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ సరైనదే అని కవిత చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కూడా కవిత ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఎమ్మెల్సీ కవిత తాజాగా మీడియా చిట్ చాట్లో మాట్లాడుతూ..‘బీసీ రిజర్వేషన్పై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే. బీఆర్ఎస్ నాయకులు ఆర్డినెన్స్ వద్దని చెప్పడం సరికాదు. బీఆర్ఎస్ వాళ్ళు నా దారికి రావాల్సిందే. నాలుగు రోజులు టైం తీసుకుంటారేమో అంతే. 2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సబబే. నేను న్యాయనిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్కు సపోర్ట్ చేశాను. అలాగే, తీన్మార్ మల్లన్న నాపై చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకులు స్పందించకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఒక ఎమ్మెల్సీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనను నేను జనాభా లెక్కల నుంచి తీసివేశాను అన్నారు. ఆయన ఎవరో నాకు తెలియదు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమీషన్ల కోసమే బనకచర్ల..అనంతరం, బనకచర్లపై చర్చకు తాను వెళ్లనని సీఎం రేవంత్ రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. నిన్నటి డిల్లీ సమావేశంలో ఎజెండాలో మొదటి అంశమే బనకచర్ల. ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్ సిగ్గులేకుండా గోదావరి జలాలను చంద్రబాబు చేతిలో పెట్టారు. బనకచర్లపై చర్చే జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నాడు. తెలంగాణ హక్కులను కాలరాసిన నాన్ సీరియస్ ముఖ్యమంత్రి తన పదవి రాజీనామా చేయాలి. బనకచర్ల వల్ల ఆంధ్రా ప్రజలకు ఏం లాభం లేదు. కాంట్రాక్టర్లు, కమిషన్ల కోసం బనకచర్ల కడుతున్నారు. ముఖ్యమంత్రి మెగా కంపెనీ వాటా కోసమే డిల్లీకి వెళ్లారు. చంద్రబాబు ఎజెండాలో భాగంగానే సీఎం డిల్లీకి వెళ్ళాడు. బనకచర్ల ఆపకపోతే న్యాయపోరాటం చేస్తాం.సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చంద్రబాబును ఎదుర్కొని సన్మానం చేశారు. సిగ్గులేకుండా బనకచర్ల ప్రాజెక్టును చంద్రబాబుకు అప్పనంగా అప్పగించారు. రేవంత్ రెడ్డి బనకచర్లపై బుకాయిస్తున్నారు. ఆయనకు పాలించే హక్కు లేదు. తక్షణమే సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. నాలుగు విజయాలు సాధించామని సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారు. కృష్ణానది బోర్డును అమరావతిలో పెట్టడం అనేది ఏపీ విభజన చట్టంలో ఉంది. తెలంగాణ ప్రజల హక్కులను చంద్రబాబు కాళ్ల దగ్గర తాకట్టుపెట్టారు.బాబుకు బహుమతిగా గోదావరి నీళ్లు..పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలి. తన స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం కాంగ్రెస్లో అని సీఎం చెప్తుంటారు. ముఖ్యమంత్రి ఇంకా కాలేజీలోనే ఉన్నానని అనుకుంటున్నారు. అందుకే గోదావరి నీళ్లను చంద్రబాబుకు గిఫ్టుగా ఇచ్చారు. తుపాకులగూడెం నుంచి నదుల అనుసంధానం జరిగితే తెలంగాణ, ఆంధ్రాకు న్యాయం జరుగుతుంది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బనకచర్లపై అసలు చర్చ జరగలేదు. కొప్పుల ఈశ్వర్ స్వయంగా బొగ్గుగని కార్మికుడు.. వారికి బొగ్గుగని కార్మిక సంఘం బాధ్యతలు అప్పగించడాన్ని స్వాగతిస్తున్నా’ అంటూ కామెంట్స్ చేశారు.

బెంగళూరు తొక్కిసలాటపై ప్రభుత్వం సంచలన నివేదిక.. RCB, కోహ్లీపై ఆరోపణలు!
బెంగళూరు: ఐపీఎల్-18 సీజన్లో రాయల్ బెంగుళూరు ఛాలెంజర్స్ విజయం సాధించి ట్రోఫిని అందుకుంది. అనంతరం, విజయోత్సవాల వేళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట కారణంగా 11 మంది మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి తాజాగా కాంగ్రెస్ సిద్దరామయ్య ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది. ఈ నివేదికలో ఆర్సీబీ యాజమాన్యంపై ప్రభుత్వం ఆరోపణలు చేసింది. అలాగే, నివేదికలో విరాట్ కోహ్లీ పేరు కూడా ప్రస్తావించడం సంచలనంగా మారింది.తొక్కిసలాటపై ప్రభుత్వం అందించిన నివేదిక ప్రకారం..‘ఐపీఎల్-18 సీజన్లో ఆర్సీబీ విజయం సాధించింది. దీంతో జూన్ మూడో తేదీన ఆర్సీబీ యాజమాన్యం పోలీసులను సంప్రదించి విజయోత్సవ పరేడ్ గురించి చెప్పారు. వేడుకలకు సంబంధించి వారు సమాచారం మాత్రమే ఇచ్చారు. అంతేగానీ.. వేడుకల గురించి ఫార్మట్ ప్రకారం అనుమతులు కోరుతూ ఎలాంటి అభ్యర్థనలు చేయలేదు. ఇలాంటి ఈవెంట్ల కోసం కనీసం ఏడు రోజుల ముందే అనుమతులు తీసుకోవాలి. కానీ, అలాంటిదేమీ లేకుండా.. విజయం అనంతరం పోలీసులను సంప్రదించకుండానే ఆర్సీబీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో విక్టరీ పరేడ్ గురించి పోస్టు పెట్టింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ వేడుకకు ఉచిత ప్రవేశమని ప్రకటించింది.CAT says IPL Team #RCB is prima facie responsible for Bengaluru Stampede which claimed 11 lives.Police is not magician, can't be expected manage huge crowds if not given sufficient time to make arrangements, the Tribunal observed.@RCBTweets @KarnatakaCops #BengaluruStampede pic.twitter.com/2QdmvohATs— Live Law (@LiveLawIndia) July 1, 2025ఆ తర్వాత.. మరో పోస్టులో విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియోను కూడా పంచుకుంది. అందులో ఆయన ఈ విజయాన్ని బెంగళూరు ప్రజలు, ఆర్సీబీ అభిమానులతో జరుపుకోవాలని ఉందని పేర్కొన్నారు. దీంతో స్టేడియం సామర్థ్యానికి మించి మూడు లక్షల మందికి పైగా హాజరయ్యారు. స్టేడియం చుట్టూ దాదాపు 14 కి.మీ. దూరం వరకు ప్రజలు గుమిగూడారు. దీంతో మార్గమధ్యలో, స్టేడియం వద్ద పెద్ద మొత్తంలో పోలీసు సిబ్బందిని మోహరించాం. నిర్వాహకులకు సరైన ప్రణాళికలు లేకపోవడం, సంబంధిత అధికారులకు ముందస్తు సమాచారం అందించడంలో విఫలం కావడం వల్లే తొక్కిసలాట జరిగింది.🚨 Karnataka Govt blames RCB for Bengaluru Stampede🚨Govt to High Court—No permission was taken for RCB’s victory paradePublic was invited without police consultationOver 3 lakh people gathered near Chinnaswamy Stadium11 people died, 50+ injured in the chaos… pic.twitter.com/KQTFFJxoWx— VIPIN_UPDATE🚨 (@Vipin_Update) July 17, 2025స్టేడియం వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో ఎంట్రీ పాస్లు కావాలని నిర్వాహకులు ఎక్స్లో పోస్టులు పెట్టారు. దీంతో అప్పటికే అక్కడికి చేరుకున్నవారు గందరగోళానికి గురయ్యారు. గేట్లు తెరిచే క్రమంలో తొక్కిసలాట జరిగింది. మరోవైపు 1,2, 21 గేట్ నంబర్ల వద్ద ప్రజలు బలవంతంగా లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకొని ఉద్రిక్తతలను తగ్గించారు. ఈ క్రమంలో వేడుకను రద్దు చేయాల్సి ఉన్నా, కార్యక్రమాన్ని మాత్రమే కుదించారు అని పేర్కొంది. అయితే, ఈ ఘటనకు సంబంధించి తమ నివేదికను రహస్యంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును అభ్యర్థించింది. అయితే, దాన్ని తిరస్కరించిన న్యాయస్థానం అలాంటి గోప్యతకు చట్టపరమైన కారణాలు లేవని పేర్కొంది.

ఎన్నికల ‘పవర్ ప్లే’.. ఉచితం అంటూ బీహారీలకు నితీశ్ బంపరాఫర్!
పాట్నా: బీహార్లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షం.. ప్రజలకు వరాలను ప్రకటిస్తున్నాయి. బీహార్లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ భారీ ప్లాన్తో హామీలు ఇస్తున్నారు. తాజాగా ప్రజలకు బంపరాఫర్ ఇచ్చారు. బీహార్లో 125 యూనిట్ల లోపు కరెంటు బిల్లులు వస్తే డబ్బులు చెల్లించాల్సి అవసరం లేదని ఆఫర్ ప్రకటించారు. వచ్చే నెల నుంచే ఇది అమలులోకి వస్తుందని నితిశ్ చెప్పుకొచ్చారు.సీఎం నితీశ్ కుమార్ తాజాగా ట్విట్టర్ వేదికగా మరో పథకాన్ని ప్రకటించారు. ట్విట్టర్లో నితిశ్..‘బీహార్ ప్రజల అవసరాల కోసం మేం మరో పథకాన్ని తీసుకువస్తున్నాం. మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కరెంట్ చార్జీలు అందుబాటు ధరల్లోనే ఇస్తున్నాం. దీనిపై ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నాం. గృహ వినియోగదారులు 125 యూనిట్ల వరకు కరెంట్ వాడుకుంటే.. వారు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకం ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.అంటే, జూలై బిల్లులను కూడా కట్టనక్కర్లేదు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 1.67 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. రానున్న మూడేళ్లలో గృహ వినియోగదారులందరి మద్దతుతో ప్రతి ఇంటిపై సోలార్ పవర్ ప్లాంట్లను అమర్చాలని నిర్ణయించాం. బీహార్లో 10వేల మెగావాట్ల సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాంకుటీర్ జ్యోతి పథకం కింద.. అత్యంత పేద కుటుంబాలకు సోలార్ ప్లాంట్ల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. మిగతా వారికి అందుబాటు ధరల్లోనే వీటిని అందజేస్తాం’ అని వెల్లడించారు. దీంతో, ఈ పథకంపై బీహార్ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఈ పథకం ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఇదిలా ఉండగా.. బీహార్ మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారం కోసం అన్ని పార్టీ ప్రజలకు కీలక హామీలు ఇస్తున్నాయి. ఇక, తాము మళ్లీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని నీతీశ్ ఇటీవల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. हमलोग शुरू से ही सस्ती दरों पर सभी को बिजली उपलब्ध करा रहे हैं। अब हमने तय कर दिया है कि 1 अगस्त, 2025 से यानी जुलाई माह के बिल से ही राज्य के सभी घरेलू उपभोक्ताओं को 125 यूनिट तक बिजली का कोई पैसा नहीं देना पड़ेगा। इससे राज्य के कुल 1 करोड़ 67 लाख परिवारों को लाभ होगा। हमने यह…— Nitish Kumar (@NitishKumar) July 17, 2025

అయ్యా పవన్.. నా మనవడి కోసం కాళ్లు పట్టుకున్నా సామీ: రాజేశ్వరమ్మ
సాక్షి, శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జి కోట వినుత మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, రాయుడు హత్యపై అటు జనసేన అధినేత పవన్కళ్యాణ్, ఇటు కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపులేదు. ఇక, తన మనవడు రాయుడు హత్యపై రాజేశ్వరమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.రాయుడు అమ్మమ్మ రాజేశ్వరమ్మ తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘నా మనవడిని ఏం చేయవద్దని కాళ్లు పట్టుకుని వేడుకున్నాను. కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా చంపేశారు. హత్యకు ముందు ఐదుసార్లు పంచాయితీ జరిగింది. ఏ మాత్రం కనికరం లేకుండా నా మనవడిని హత్య చేశారు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించకపోవడం బాధాకరం. నా మనవడికి డబ్బు ఇచ్చారని చెబుతున్నారు. ఆ డబ్బు ఎక్కడుందో తెలియాలి. తమిళనాడు పోలీసులే మాకు న్యాయం చేస్తారు. ఏపీకి కేసు బదిలీ చేస్తే కేసు నీరుగారిపోతుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తనను చంపేస్తున్నారని.. టీడీపీ నేతకు కూడా రాయుడు మెసేజ్ పెట్టాడు. కానీ, ఆయన ఏమీ స్పందించలేదు. నా పేరు బయటకు చెప్పవద్దు.. మీ చావు మీరు చావండి అని అన్నాడని చెప్పుకొచ్చారు. అంతకుముందు.. రాయుడు సోదరి కీర్తి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తనకున్న ఒకే ఒక్క సోదరుడు శ్రీనివాసులు అని.. అతన్ని పొట్టన పెట్టుకున్నారంటూ కన్నీరుమున్నీరవుతోంది. దీన్ని ఇక్కడితో వదిలేస్తే రేపు ఇంకోటి జరుగుతుందని.. తమకు న్యాయం జరగాల్సిందేనని ఆమె పట్టుబడుతోంది. అంతేకాక.. ‘నా అన్నను నాకు లేకుండా చేశారు. మా అన్నను చంపిన వాళ్లను ప్రాణాలతో వదలం. పవన్ రావాలి.. మాకు న్యాయం చేయాలి. న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం. మా అన్నను చంపిన వాళ్లకు కఠినంగా శిక్ష పడాల్సిందే’.. అని చెప్పింది.ఇదిలా ఉండగా.. అతి సామాన్య కుటుంబానికి చెందిన శ్రీనివాసులును కోట వినుత ఆమె భర్త చంద్రబాబు మరో ముగ్గురితో కలిసి అతికిరాతకంగా మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై ముఖ్యనేతలెవరూ స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తమిళ మీడియాలో కూడా ఈ ఉదంతంపై వరుస కథనాలు వస్తున్నప్పటికీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంగానీ, జనసేన అధినేతగానీ ఇప్పటివరకు నోరువిప్పలేదు. అయితే, మృతుడు కుటుంబ సభ్యులు మాత్రం పవన్ రావాలి.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.హత్య ఎందుకు జరిగింది..ఎలా చేశారంటే?జనసేన నేత వినుత వద్ద ఉన్న శ్రీనివాసులుపై నిఘా పెట్టిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ముఖ్యనేత అతడికి డబ్బులు ఎర చూపి, వారి రాజకీయ వ్యూహాలు, ఇతర వ్యక్తిగత విషయాలకు సంబంధించి కీలక సమాచారాన్ని తెలుసుకున్నట్లు సమాచారం. దీన్ని కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్నాయుడు గుర్తించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే గత నెల 21న శ్రీనివాసులును విధుల నుంచి తొలగించారు. అయితే కోట వినుతతో ఉన్న కొన్ని వీడియోలు బయట పడడంతో అతడిని మట్టుబెట్టాలని గత నెలలోనే పక్కా ప్లాన్ వేసినట్లు చెన్నై పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.అయితే అందులోని కొన్ని వీడియోలు బహిర్గతం కావడంతో జీర్ణించుకోలేని కోట చంద్రశేఖర్నాయుడు అతడిని ఎలాగైనా అంతమొందించాలని భావించినట్టు తెలిసింది. తలచిందే తడువుగా పక్కా ప్లాన్ ప్రకారం పార్టీలోని మరో నలుగురు వ్యక్తుల సహాయంతో శ్రీనివాసులును శ్రీకాళహస్తిలోని ఓ గోడౌన్కు తీసుకెళ్లి అక్కడ విచక్షణా రహితంగా కొట్టి చంపినట్టు చెన్నై పోలీసులు భావిస్తున్నారు. అక్కడి నుంచి కారులో చెన్నైకి తీసుకెళ్లి మింట్ ఏరియా కూవం నదిలో పడేసి ఆంధ్రాకు తిరిగి వచ్చేశారని చెన్నై పోలీసులు వెల్లడించారు.నిందితులను పట్టించిన పచ్చబొట్టుచెన్నై నగరం, నార్త్ జోన్ సెవన్ వెల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రైనేజీ కాల్వలో యువకుడి మృతదేహాన్ని ఈనెల 8వ తేదీన గుర్తించిన పోలీసులు పోస్టుమార్టంలో హత్య జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే మృతుడి చేతి మీద జనసేన పార్టీ గుర్తు, వినుత పేరు పచ్చబొట్టు ఉండడంతో ఆ దిశగా దర్యాప్తు కొనసాగించారు. సీసీ ఫుటేజ్ లభించడంతో శనివారం తెల్లవారుజామున శ్రీకాళహస్తికి చేరుకున్న చెన్నై పోలీసులు జనసేన ఇన్చార్జి కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్నాయుడు, హత్యకు సహకరించిన రేణిగుంటకు చెందిన దస్తా సాహెబ్, శ్రీకాళహస్తికి చెందిన కె.శివకుమార్, తొట్టంబేడు మండలానికి చెందిన ఎస్.గోపిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకెళ్లారు.

'వీరమల్లు' ఈ రుద్దుడు ఎందుకు..?
'గబ్బర్ సింగ్' సినిమాలో 'నాకు కొంచెం తిక్క ఉంది దానికి ఒక లెక్క ఉంది' అంటూ పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ చాలా పాపులర్ అయింది. అయితే, ఆయన అభిమానులు 'హరి హర వీరమల్లు' సినిమా విషయంలో ఇదే లెక్కను ఫాలో అవుతున్నారనిపిస్తుంది. పాన్ ఇండియా రేంజ్లో ఎలాంటి బజ్లేని ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు నానాపాట్లు పడుతున్నారు. ట్రైలర్ విడుదల సమయంలో వ్యూస్ పరంగా ఫేక్ చేశారని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మరో కొత్త ప్లాన్ వేశారు. ఈ క్రమంలో దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా మీద హరి హర వీరమల్లు పోస్టర్ అంటూ అందుకు సంబంధించిన ఫేక్ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. అయితే, అవి నిజమేనని అందరూ నెటిజన్లు కూడా షేర్ చేస్తున్నారు. విషయం తెలిసిన వారు మాత్రం ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఎందుకు చేసుకుంటారని ఘాటుగానే విమర్శిస్తున్నారు.గత కొన్ని గంటలుగా సోషల్మీడియాలో బుర్జ్ ఖలీఫా మీద 'హరి హర వీరమల్లు' పోస్టర్ అంటూ ట్రెండ్ అవుతుంది. అయితే, అది నిజమైనది కాదు. సినిమా అధికారిక హ్యాండిల్ను అనుకరించే నకిలీ ఖాతా నుంచి మొదటసారి పోస్ట్ చేయబడింది. ఆపై వందల కొద్ది పలు పేజీలు దానిని షేర్ చేయడంతో వైరల్ అయిపోయింది. అంతపెద్ద ఎత్తున పోస్టర్ను పంచుకుంటే.. చిత్ర యూనిట్ తప్పకుండా తమ అధికారిక పేజీలో షేర్ చేస్తుంది కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమా విడుదలకు కేవలం ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ, సినిమా ప్రచార మాత్రం పెద్దగా లేదని కొందరు చెబుతున్నారు. అందుకే ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అయితే, టాలీవుడ్లో సినిమా బజ్ బాగున్నప్పటికీ.. హిందీ, తమిళ్లో పెద్దగా బజ్ లేదని చెప్పవచ్చు. ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి ప్రమోషన్ కార్యక్రం కూడా చిత్ర యూనిట్ నిర్వహించలేదు. హిందీ హక్కులను ఎవరు కొనుగోలు చేశారన్న వివరాలు అధికారికంగా ఇప్పటికీ వెల్లడించలేదు.పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను మేకర్స్ ఫైనల్ చేశారు. జులై 24న పాన్ ఇండియా రేంజ్లొ విడుదల కానున్న ఈ మూవీ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు విడుదల కానుంది. అయితే, ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను ఈ నెల 20న విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా రన్టైమ్: 2:42 నిమిషాలు ఉన్నట్లు పేర్కొంది.Trust the Process 🔥🦅#HariHaraVeeraMallu #BurjKhalifa pic.twitter.com/tvH2Y8FGo1— HariHaraVeeraMallu (@HHVMTeam) July 16, 2025Nice job @HHVMFilm, @AMRathnamOfl, @MegaSuryaProd HHVM hits Burj Khalifa, excellent promotions👏🏻👏🏻#HariHaraVeeraMallu pic.twitter.com/siMGeNqnkl— Megha Shyam Reddy 🦅🚩 (@MSRv96) July 16, 2025

రూ.19,500 సబ్స్క్రిప్షన్ ఉచితం!
గూగుల్ భారతదేశంలోని విద్యార్థులకు ప్రోత్సహించేందుకు తన ఏఐ ప్రో ప్లాన్ను ఒక సంవత్సరం పాటు ఉచితంగా అందించేందుకు చర్యలు చేపట్టింది. రూ.19,500 సబ్స్క్రిప్షన్ కలిగిన ఏఐ ప్రో ప్లాన్ ద్వారా గూగుల్ అధునాతన ఏఐ సాధనాలకు అవకాశం కల్పిస్తోంది. దీన్ని విద్యార్థులు హోంవర్క్, రైటింగ్, వీడియో జనరేషన్లో సహాయం పొందేందుకు ఉచితంగా ఉపయోగించవచ్చని కంపెనీ తెలిపింది.ఈ ఆఫర్లో భాగంగా 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న భారతీయ విద్యార్థులు 12 నెలల పాటు గూగుల్ ఏఐ ప్రో ప్లాన్ను కాంప్లిమెంటరీ యాక్సెస్గా పొందవచ్చు. ఈ సబ్స్క్రిప్షన్లో జెమినీ 2.5 ప్రో, వీయో 3 వంటి విస్తృత శ్రేణి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇది వీడియో జనరేషన్ ఏఐ మోడల్. జీమెయిల్, డాక్స్, ఇతర గూగుల్ యాప్స్లో 2టీబీ క్లౌడ్ స్టోరేజ్, ఏఐ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి.కళాశాల పాఠ్యాంశాల అధ్యయనం, పరిశోధన, ఉద్యోగ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, సృజనాత్మక ఆలోచన.. వంటి విస్తృత శ్రేణి ఉపయోగాల కోసం విద్యార్థులకు మద్దతుగా నిలుస్తుందని కంపెనీ తెలిపింది. గూగుల్ హైలైట్ చేస్తున్న కొన్ని ఏఐ ఆధారిత టూల్స్ కింది విధంగా ఉన్నాయి.హోంవర్క్ హెల్ప్ & ఎగ్జామ్ ప్రిపరేషన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో 1,500 పేజీల పాఠ్యపుస్తకాలను విశ్లేషించవచ్చు.స్టడీ సపోర్ట్: అధిక పేజీలున్న(1,500 పేజీల వరకు) పాఠ్యపుస్తకాలను విశ్లేషించవచ్చు. పరీక్ష సన్నద్ధతలో సహాయం తీసుకోవచ్చు. సంక్లిష్టమైన అంశాలను సులువుగా అర్థం చేసుకోవచ్చు.రైటింగ్ టూల్స్: వ్యాసాలను రాసేందుకు సాయపడుతాయి.వీడియో జనరేషన్: గూగుల్ వీయో 3 సిస్టమ్ ఉపయోగించి టెక్స్ట్, ఇమేజ్లను షార్ట్ వీడియోలుగా మార్చవచ్చు.జెమిని ఇంటిగ్రేషన్: జీమెయిల్, డాక్స్, షీట్స్, ఇతర యాప్స్లో డైరెక్ట్ ఏఐ సపోర్ట్ ఉంటుంది.క్లౌడ్ స్టోరేజ్: అసైన్మెంట్లు, ప్రాజెక్టులు, మీడియా ఫైళ్లను నిల్వ చేసేందుకు డ్రైవ్, జీమెయిల్, ఫోటోస్ కలిపి 2 టీబీ స్పేస్ ఇస్తుంది.ఉచితంగా ఎలా పొందాలి?కంపెనీ ప్రతిపాదించిన అర్హతా ప్రమాణాలకు అనుగుణంగా విద్యార్థుల స్టేటస్ను విజయవంతంగా ధ్రువీకరించాల్సి ఉంటుంది. కేవలం విద్యార్థులకు మాత్రమే ఈ ఉచిత సబ్ స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులో ఉంటుందని గూగుల్ పేర్కొంది. ఈ ఆఫర్ పొందాలంటే విద్యార్థులు తమ స్టేటస్ను వెరిఫై చేసుకోవాలి.వెరిఫికేషన్ ప్రక్రియ ఎలా..గూగుల్ వన్ స్టూడెంట్ ఆఫర్ పేజీకి వెళ్లాలి.కాలేజీ పేరు, విద్యార్థి పూర్తి పేరు, పుట్టిన తేదీ వంటి అవసరమైన వివరాలను నింపాలి.గుర్తింపు పొందిన సంస్థ నమోదును రుజువు చేయమని కోరితే డాక్యుమెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.వెరిఫై చేసిన తర్వాత గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఏఐ ప్రో ప్లాన్కు సబ్స్క్రైబ్ చేసుకోవాలి.ఈ ఆఫర్ను రిడీమ్ చేసుకోవడానికి చివరి తేదీ 15 సెప్టెంబర్ 2025.నిబంధనలు ఇవే..విద్యార్థికి 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి.భారత నివాసి అయి ఉండాలి.వ్యక్తిగత గూగుల్ ఖాతాను ఉపయోగించాలి.కాలేజీ ఈమెయిల్ లేదా నమోదు రుజువును అందించాలి.థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ ద్వారా సబ్స్రైబ్ చేయకూడదు.గూగుల్ పేమెంట్స్ ఖాతాకు చెల్లుబాటు అయ్యే చెల్లింపు పద్ధతిని జోడించాలి. (పోస్ట్-ట్రయల్ బిల్లింగ్ ప్రయోజనాల కోసం).ఇదీ చదవండి: మారుతీ ఎర్టిగా, బాలెనో ధరలు పెరిగాయ్..మొదటి సంవత్సరానికి ఆఫర్ పూర్తిగా ఉచితం అయినప్పటికీ, ప్రామాణిక రేట్ల వద్ద ఆటోమేటిక్ బిల్లింగ్ను నివారించడానికి విద్యార్థులు ట్రయల్ ముగిసేలోపు రద్దు చేయాలని గూగుల్ పేర్కొంది. ఉచిత వ్యవధి తర్వాత మాన్యువల్గా రద్దు చేయకపోతే సబ్ స్క్రిప్షన్ రిన్యువల్ అవుతుంది.

రాహుకేతు పూజలు : తమిళుల కాళహస్తి తిరుప్పాంపురం
జాతకంలో కాలసర్ప దోషం, కళత్ర దోషాలు ఉంటే ఆ దోషాలను తొలగించుకునేందుకు శ్రీకాళహస్తి వెళ్లి రాహుకేతు దోష పూజలు చేయించుకోవడం తెలుగువారి మరి తమిళ తంబీలకు..? వాళ్లకు కూడా ఇలాంటి క్షేత్రం ఒకటి ఉంది.అదే తిరుప్పాంపురం. రాహుకేతువులు ఏకశరీరంగా ఉన్న మహా మహిమాన్వితమైన సర్పక్షేత్రమిది. ఉత్తర శ్రీకాళహస్తిగా పేరు పొందిన ఈ క్షేత్రం తమిళులకు అత్యంత పవిత్రమైనది. తమిళులే కాదు.. ఇరుగు పొరుగు రాష్ట్రాల వారు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకుని సర్పదోషనివారణ పూజలు చేయించుకుని ఉపశమనం పొందుతుంటారు. తిరుక్కాళాత్తి, కుడండై, తిరునాగేశ్వరం, నాగూర్, కీయ్ పెరుపల్లం తదితర అయిదు పుణ్యక్షేత్రాల గొప్పతనాన్ని ఒక్కటిగా కలిగి ఉన్న పవిత్ర స్థలమే తిరుప్పాంపురం. సాక్షాత్తూ సర్పాలే తమకు కలిగిన దోషాన్ని ఇక్కడకు వచ్చి తొలగించుకున్న గాథలు ఉన్నాయి. తిరుప్పాంపురం ఆలయంలో ఉన్న దైవం పేరు శేషపురీశ్వరుడు. అమ్మవారు వండుచేర కుయిలి. ఇక్కడ ఉన్న పుణ్య తీర్థం ఆదిశేష తీర్థం. ఈ ఆలయ విశిష్టతను తమిళ వాల్మీకిగా కొనియాడబడిన తిరునావుక్కరుసు వంటివారు కొనియాడారు. స్థలపురాణం: ఒకసారి కైలాసంలో శివుడిని వినాయకుడు పూజిస్తున్నాడు. అప్పుడు శివుడి మెడలోని పాములు తమనూ కలుపుకుని పూజిస్తున్నట్లు గర్వపడ్డాయి. అది గ్రహించిన శివుడు ఆగ్రహించి, ఇక మీదట నాగుపాములన్నీ తమ దివ్యశక్తులను కోల్పోయి సామాన్య సర్పాలవలె మానవుల చేత చిక్కి నానాహింసల పాలూ అయి మరణిస్తాయని శపించాడు. దీంతో శివుడి మెడలోని వాసుకితోపాటు రాహుకేతువులు తదితర సర్పాలు తమ శక్తిని కోల్పోయి తల్లడిల్లాయి. అవి తమ తప్పును తెలుసుకుని తమకు శాపవిమోచనం కల్పించవలసిందిగా పరమేశ్వరుని ప్రాధేయపడ్డాయి. దాంతో బోళాశంకరుడి మనసు కరిగిపోయింది. మహాశివరాత్రి రోజున తిరు΄్పాంపురం వెళ్లి అక్కడ కొలువై ఉన్న తనను ఆరాధిస్తే శాపవిమోచనం కలుగుతుందని చెప్పాడు. అప్పుడు వాసుకి, ఆదిశేషుడు తదితర అన్ని నాగులూ కలసి ఆ ఏడాది మహాశివరాత్రిరోజు తెల్లవారు ఝామునే తిరునాగేశ్వరంలోని నాగనాథ స్వామిని, తిరుప్పాంపురంలోని పాంబునాథుడిని, నాగూరులోని నగనాథుని ఆరాధించాయి. తిరుప్పాంపురం క్షేత్రంలో ఆరాధించిన వెంటనే నాగుల శాపం తొలగిపోయింది. ఇక్కడ ఈశ్వరుడిని ఆరాధించేందుకు వచ్చిన సర్పాలు ఒక పుణ్యతీర్థాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ తీర్థానికే ఆదిశేష తీర్థమని పేరు. బ్రహ్మ, ఇంద్రుడు, అగస్త్యుడు, గంగాదేవి వంటి వారు ఇక్కడి ఆలయాన్ని సందర్శించి ధన్యులైనట్లు పురాణ గాథలున్నాయి. ఇదీ చదవండి: అవరోధాలు, అపజయాలు కుంగదీస్తున్నాయా? ఇదిగో పరిష్కారం!ఇక్కడ ఉన్న మూడవ కుళోత్తుంగ చోళుడి శిలాఫలకాన్ని బట్టి చూస్తే ఈ ఆలయం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నాటిదని చెప్పవచ్చు. తంజావూరును పాలించిన శరభోజి చక్రవర్తిపాలనలో ఈ ఆలయానికి వసంతమండ΄ాన్ని, తూర్పుదిక్కుగా రాజగోపురాన్ని నిర్మించారు. ఈ గోపురానికి ఎదురుగానే ఆదిశేష తీర్థం ఉంది. ఇక్కడ ఉన్న వినాయక విగ్రహానికి కూడా పూజలు నిర్వహిస్తారు. ఇక్కడి స్వామికి శేషపురీశ్వరుడు, పాంబుపుర నాథుడు, పాంబుపురీశ్వరుడు తదితర నామాలున్నాయి. గర్భగుడిలో శివుని పూజించే రీతిలో ఉన్న ఆదిశేషుని విగ్రహం కనువిందు చేస్తుంది. వెలుపలి ప్రాకారానికి ప్రదక్షిణ మార్గంలో భైరవుడు, సూర్యుడు, దుర్గ, శనీశ్వరుడు, రాహువు, కేతువు తదితర సన్నిధులున్నాయి. ఇక్కడ ఉన్న రావిచెట్టుకింద అసంఖ్యాకంగా సర్పశిలలున్నాయి. ఆలయంలో ఈశాన్య దిక్కుమూలలో రాహుకేతువులు ఒకే సన్నిధిలో కనిపిస్తారు. ఇక్కడ రాహుకాల పూజలు విశేషంగా జరుగుతాయి. అలాగే సర్పదోష పరిహార పూజలకు ఈ ఆలయం పెట్టింది పేరు. రాహుకాలంలో ఆలయం తెరిచిన వెంటనే నేతిదీపాలు కొని వెలిగిస్తారు. రాహు, కేతు దోషాల పరిహారపూజలకు తగిన సంభారాలు ఇక్కడే లభిస్తాయి. సర్పదోష నివృత్తి కోసం వచ్చిన భక్తులు ఆలయంలో పూజలు చేయించుకుంటూ కనిపిస్తారు. జాతకంలో సర్పదోషం ఉన్నవారు, రాహుకేతువులకు మొక్కుకుని, తిరుప్పాంపురంలో పూజలు చేయించుకునే వారు అధిక సంఖ్యాకంగా కనిపిస్తుంటారు. చదవండి: అమెరికా స్టోర్లో రూ. లక్ష కొట్టేసిన భారత మహిళ, అరెస్ట్ : నెట్టింట చర్చఎలా వెళ్లాలంటే..?తమిళనాడులోని కుంభకోణం నుంచి కారైక్కాల్ వెళ్లే దారిలో ప్రధాన రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. చెన్నై సెంట్రల్ నుంచి కుంభకోణానికి రైళ్లు, బస్సులు ఉన్నాయి. కుంభకోణం వరకు వెళ్తే అక్కడ నుంచి తిరుప్పాంపురం వరకు వెళ్లడానికి మినీ బస్సులు, ఆటోలు, ప్రైవేటు వాహనాలు, ఆర్టీసు బస్సులు ఉన్నాయి. చూడదగ్గ ఇతర ప్రదేశాలు: సాధారణంగా తమిళనాడులోని నవగ్రహాలయానికి వెళ్లే వారు ఇక్కడికి వస్తుంటారు లేదంటే ఇక్కడికి వచ్చినవారు నవ గ్రహాలయానికి వెళ్తారు. అలాగే కుంభకోణంలోని ఐరావతీశ్వరన్ ఆలయం, ఉప్పిలియప్పన్ ఆలయం, ఆదికుంభేశ్వరన్ ఆలయం, సారంగపాణి ఆలయం, ఆరుల్మిగు స్వామినాథన్ ఆలయం, సూర్యనాయర్ కోయిల్, పట్టీశ్వరం ఆలయం తదితరాలున్నాయి.– డి.వి.ఆర్. భాస్కర్
విశాఖ: వాహన మిత్ర అమలు చేయాలంటూ ఆటో డ్రైవర్ల ర్యాలీ
'పరదా' తొలగిస్తూ మెప్పించేలా సాంగ్
ఎస్బీఐకి డబ్బు అవసరం.. నిధుల సమీకరణ షురూ
మరాఠీని వ్యతిరేకించిన మార్వాడీపై దాడి
కోడలి వివాహేతరం సంబంధం, భరించలేకే నా కొడుకు సూసైడ్..!
కొత్త టెక్నాలజీతో ఫ్యాన్లు ఆవిష్కరణ
టీమిండియా స్టార్ క్రికెటర్ మాజీ భార్య, కూతురిపై కేసు నమోదు
‘మేరోరపి సారతరా భక్తిః : నిజమైన భక్తి
‘బుమ్రా ఆడనప్పుడే.. టీమిండియా ఎక్కువ మ్యాచ్లు గెలిచింది’
అత్యుత్తమ ‘ఫన్’ దేశం అదే..! టాప్ 40లో ఇండియా స్థానం?
సెకెండ్ ఇన్నింగ్స్లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీ.. మళ్లీ అదే తరహా విధ్వంసం
42 ఏళ్ల లారీడ్రైవర్తో డిగ్రీ విద్యార్థిని వివాహేతర సంబంధం..!
నేను బతికుండగానే కొడుకు చనిపోవాలని కోరుకున్నా: సీనియర్ నటుడు
ఇలాంటి మాటల వల్లే 'జబర్దస్త్' నుంచి వెళ్లిపోయా: అనసూయ
ఈ రాశి వారు వ్యాపారాలు విస్తరిస్తారు.. ఆకస్మిక ధనలాభం
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
ఇంత బరితెగింపా.. గుంపులో ఎవరూ చూడలేదనుకున్నారా?
వైద్యుల కాపురంలో ‘బుట్టబొమ్మ’ చిచ్చు
తేజేశ్వర్ కేసులో మరో ట్విస్ట్
హీరోతో 'బ్రహ్మముడి' సీరియల్ నటి నిశ్చితార్థం
ఒక్కరోజులోనే ఓటీటీలోకి హిట్ సినిమా.. ఇదేం విడ్డూరం
రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక గంట మ్యూజిక్ వినండి చాలు!
లేదంటే 50 రోజుల్లో మిమ్మల్ని నోబెల్కి నామినేట్ చేయమని అసలు విషయం చెప్పేద్దాం!
అత్తింట్లో ఏ సమస్యాలేదు...కానీ బిడ్డను పట్టుకుని మరీ..!
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. వరల్డ్ రికార్డు బద్దలు
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాల్లో అనుకూలత
సాక్షి కార్టూన్ 16-07-2025
అందులో కూర్చుంటే అహంకారం పెరుగుతుందని అలా నిలబడే పాలన చేస్తున్నారు!
ఇది శాంపిల్ మాత్రమే. బాగా ప్రాక్టీస్ చెయ్!
ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్, చరణ్ని చూసి అలా ఫీలయ్యా :జెనీలియా
విశాఖ: వాహన మిత్ర అమలు చేయాలంటూ ఆటో డ్రైవర్ల ర్యాలీ
'పరదా' తొలగిస్తూ మెప్పించేలా సాంగ్
ఎస్బీఐకి డబ్బు అవసరం.. నిధుల సమీకరణ షురూ
మరాఠీని వ్యతిరేకించిన మార్వాడీపై దాడి
కోడలి వివాహేతరం సంబంధం, భరించలేకే నా కొడుకు సూసైడ్..!
కొత్త టెక్నాలజీతో ఫ్యాన్లు ఆవిష్కరణ
టీమిండియా స్టార్ క్రికెటర్ మాజీ భార్య, కూతురిపై కేసు నమోదు
‘మేరోరపి సారతరా భక్తిః : నిజమైన భక్తి
‘బుమ్రా ఆడనప్పుడే.. టీమిండియా ఎక్కువ మ్యాచ్లు గెలిచింది’
అత్యుత్తమ ‘ఫన్’ దేశం అదే..! టాప్ 40లో ఇండియా స్థానం?
సెకెండ్ ఇన్నింగ్స్లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీ.. మళ్లీ అదే తరహా విధ్వంసం
42 ఏళ్ల లారీడ్రైవర్తో డిగ్రీ విద్యార్థిని వివాహేతర సంబంధం..!
నేను బతికుండగానే కొడుకు చనిపోవాలని కోరుకున్నా: సీనియర్ నటుడు
ఇలాంటి మాటల వల్లే 'జబర్దస్త్' నుంచి వెళ్లిపోయా: అనసూయ
ఈ రాశి వారు వ్యాపారాలు విస్తరిస్తారు.. ఆకస్మిక ధనలాభం
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
ఇంత బరితెగింపా.. గుంపులో ఎవరూ చూడలేదనుకున్నారా?
వైద్యుల కాపురంలో ‘బుట్టబొమ్మ’ చిచ్చు
తేజేశ్వర్ కేసులో మరో ట్విస్ట్
హీరోతో 'బ్రహ్మముడి' సీరియల్ నటి నిశ్చితార్థం
ఒక్కరోజులోనే ఓటీటీలోకి హిట్ సినిమా.. ఇదేం విడ్డూరం
రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక గంట మ్యూజిక్ వినండి చాలు!
లేదంటే 50 రోజుల్లో మిమ్మల్ని నోబెల్కి నామినేట్ చేయమని అసలు విషయం చెప్పేద్దాం!
అత్తింట్లో ఏ సమస్యాలేదు...కానీ బిడ్డను పట్టుకుని మరీ..!
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. వరల్డ్ రికార్డు బద్దలు
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాల్లో అనుకూలత
సాక్షి కార్టూన్ 16-07-2025
ఇది శాంపిల్ మాత్రమే. బాగా ప్రాక్టీస్ చెయ్!
అందులో కూర్చుంటే అహంకారం పెరుగుతుందని అలా నిలబడే పాలన చేస్తున్నారు!
అమెరికా స్టోర్లో రూ. లక్ష కొట్టేసిన భారత మహిళ, అరెస్ట్ : నెట్టింట చర్చ
సినిమా

రూ.9 కోట్లు పరిహారం కోరుతూ నటుడు పిటిషన్
ఓ చిత్ర నిర్మాణ సంస్థ నుంచి రూ. 9 కోట్లు నష్టపరిహారం కోరుతూ చైన్నె హైకోర్టులో కోలీవుడ్ నటుడు రవిమోహన్ పిటిషన్ దాఖలు చేశారు. కోయంబత్తూర్కు చెందిన బాబీటచ్ గోల్డ్ యూనివర్సల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా నటుడు రవిమోహన్ హీరోగా రెండు చిత్రాలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అందుకు గానూ ఆయనకు రూ.6 కోట్లు అడ్వాన్స్ కూడా చెల్లించింది. అయితే నటుడు రవిమోహన్ తమ సంస్థకు చిత్రాలను చేయకుండా ఇతర చిత్రాలను చేస్తున్నారని, ఈనేపథ్యంలో తామిచ్చిన అడ్వాన్స్ను వడ్డీతో సహా రూ.10 కోట్లు చెల్లించేలా ఆదేశించాలని చైన్నె సిటీ కోర్టులో ఆ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో నటుడు రవిమోహన్ కూడా చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో తాను కేటాయించిన కాల్షీట్స్ను బాబీగోల్డ్ టచ్ యూనివర్శల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఉపయోగించుకోలేదని అందులో పేర్కొన్నారు. అయినప్పటికీ తాను మరో చిత్రం చేసి ఆ సంస్థ నుంచి తీసుకున్న అడ్వాన్స్ను తిరిగి ఇస్తానని చెప్పానట్లు అందులో పేర్కొన్నారు. అయితే వారం రోజుల్లోనే ఆ అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని ఆ సంస్థ ఒత్తిడి చేసిందని పేర్కొన్నారు. అదే విధంగా తాను కేటాయించిన కాల్షీట్స్ను ఉపయోగించుకోకుండా తన సమయాన్ని వృధా చేయడంతో తనకు నష్టం వాటిల్లిందన్నారు. వారి సినిమాకు ఒప్పుకున్నందున తాను మరో సినిమాకు కాల్షీట్స్ ఇవ్వలేకపోయానన్నారు. దీంతో వారే తనకు రూ. 9 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు.

'వీరమల్లు' ఈ రుద్దుడు ఎందుకు..?
'గబ్బర్ సింగ్' సినిమాలో 'నాకు కొంచెం తిక్క ఉంది దానికి ఒక లెక్క ఉంది' అంటూ పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ చాలా పాపులర్ అయింది. అయితే, ఆయన అభిమానులు 'హరి హర వీరమల్లు' సినిమా విషయంలో ఇదే లెక్కను ఫాలో అవుతున్నారనిపిస్తుంది. పాన్ ఇండియా రేంజ్లో ఎలాంటి బజ్లేని ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు నానాపాట్లు పడుతున్నారు. ట్రైలర్ విడుదల సమయంలో వ్యూస్ పరంగా ఫేక్ చేశారని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మరో కొత్త ప్లాన్ వేశారు. ఈ క్రమంలో దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా మీద హరి హర వీరమల్లు పోస్టర్ అంటూ అందుకు సంబంధించిన ఫేక్ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. అయితే, అవి నిజమేనని అందరూ నెటిజన్లు కూడా షేర్ చేస్తున్నారు. విషయం తెలిసిన వారు మాత్రం ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఎందుకు చేసుకుంటారని ఘాటుగానే విమర్శిస్తున్నారు.గత కొన్ని గంటలుగా సోషల్మీడియాలో బుర్జ్ ఖలీఫా మీద 'హరి హర వీరమల్లు' పోస్టర్ అంటూ ట్రెండ్ అవుతుంది. అయితే, అది నిజమైనది కాదు. సినిమా అధికారిక హ్యాండిల్ను అనుకరించే నకిలీ ఖాతా నుంచి మొదటసారి పోస్ట్ చేయబడింది. ఆపై వందల కొద్ది పలు పేజీలు దానిని షేర్ చేయడంతో వైరల్ అయిపోయింది. అంతపెద్ద ఎత్తున పోస్టర్ను పంచుకుంటే.. చిత్ర యూనిట్ తప్పకుండా తమ అధికారిక పేజీలో షేర్ చేస్తుంది కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమా విడుదలకు కేవలం ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ, సినిమా ప్రచార మాత్రం పెద్దగా లేదని కొందరు చెబుతున్నారు. అందుకే ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అయితే, టాలీవుడ్లో సినిమా బజ్ బాగున్నప్పటికీ.. హిందీ, తమిళ్లో పెద్దగా బజ్ లేదని చెప్పవచ్చు. ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి ప్రమోషన్ కార్యక్రం కూడా చిత్ర యూనిట్ నిర్వహించలేదు. హిందీ హక్కులను ఎవరు కొనుగోలు చేశారన్న వివరాలు అధికారికంగా ఇప్పటికీ వెల్లడించలేదు.పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను మేకర్స్ ఫైనల్ చేశారు. జులై 24న పాన్ ఇండియా రేంజ్లొ విడుదల కానున్న ఈ మూవీ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు విడుదల కానుంది. అయితే, ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను ఈ నెల 20న విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా రన్టైమ్: 2:42 నిమిషాలు ఉన్నట్లు పేర్కొంది.Trust the Process 🔥🦅#HariHaraVeeraMallu #BurjKhalifa pic.twitter.com/tvH2Y8FGo1— HariHaraVeeraMallu (@HHVMTeam) July 16, 2025Nice job @HHVMFilm, @AMRathnamOfl, @MegaSuryaProd HHVM hits Burj Khalifa, excellent promotions👏🏻👏🏻#HariHaraVeeraMallu pic.twitter.com/siMGeNqnkl— Megha Shyam Reddy 🦅🚩 (@MSRv96) July 16, 2025

'ఓజీ'తో అఖండ వార్.. తగ్గేది ఎవరంటే..?
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు పోటీ పడనున్నాయి. దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న పవన్ కల్యాణ్ (ఓజీ), బాలకృష్ణ (అఖండ 2) విడుదల కానున్నాయి. ఇప్పటికే రెండు సినిమాల నుంచి అధికారికంగా ప్రకటన వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద మొదటిసారి పవన్తో బాలయ్య పోటీ పడుతుండటంతో అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ మధ్య మరోసారి బాక్సాఫీస్ లెక్కలపై చర్చ జరగనుంది. దసరా విజేతగా ఎవరు నిలుస్తారో అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ పోటీ నుంచి బాలయ్య తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇండస్ట్రీలో బలంగానే వార్తలు వినిపిస్తున్నాయి.రెండు భారీ బడ్జెట్ చిత్రాల మధ్య పోటీ ఎందుకనే 'అఖండ'నే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఆపై అఖండ2 ప్రాజెక్ట్తో పాన్ ఇండియా రేంజ్లో విజయం సాధించాలని దర్శకుడు బోయపాటి పక్కా ప్రణాళికతో ఉన్నారు. అందులో భాగంగానే ఈ సినిమా గ్రాఫిక్స్ పనులతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం కేటాయించాలని ఆయన ఆలోచిస్తున్నారట. ఆపై ఇంకా కొంత భాగం షూటింగ్ పనులు కూడా పెండింగ్లో ఉన్నాయట. 2021 డిసెంబర్లో అఖండ విడుదలై బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇప్పుడు సీక్వెల్ కూడా డిసెంబర్ నెలలోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. అఖండ2 చిత్రాన్ని బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా సంయుక్త (Samyuktha) నటిస్తోంది. ఓజీ' సినిమాను రూ. 250 కోట్ల బడ్జెట్తో నిర్మాత డీవీవీ దానయ్య ప్లాన్ చేశారని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. ఇలా అత్యంత బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రాలు ఒకేరోజు విడుదలైతే తప్పకుండా థియేటర్స్ విషయంలో ఇబ్బందులు రావచ్చు. అందుకే ఎవరో ఒకరు తమ సినిమాను వాయిదా వేసుకుని, నిర్మాణ పరంగా మరింత బలంగా తెరకెక్కించి కొత్త తేదీన విడుదల చేయడం బెటర్ అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

'జెనీలియా' కోసం స్పెషల్ సాంగ్ పాడిన దేవి శ్రీ ప్రసాద్
ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా నటిస్తున్న చిత్రం ‘జూనియర్’. ఈ నెల 18న విడుదల అవుతున్నా ఈమూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. అగ్ర నటీనటులతో దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి రజనీ కొర్రపాటి నిర్మాత. శ్రీలీల కథానాయికగా నటించింది. జెనీలియా, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయితే, జెనీలియా కోసం సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ ప్రత్యేకమైన పాటతో మెప్పించారు.ఒకప్పుడు తెలుగు తెరపై యూత్ కలలరాణిగా జెనీలియా గుర్తింపు పొందారు. సుమారు 13 ఏళ్ల తర్వాత తెలుగు స్క్రీన్పై ఆమె మళ్లీ 'జూనియర్' సినిమాతో కనిపించనుంది. దీంతో సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ 'బొమ్మరిల్లు' సినిమా నుంచి 'అప్పుడో ఇప్పుడో కలగన్నానే చెలి' సాంగ్తో ఆమెను మెప్పించారు. ఈ సాంగ్తో పాటు బొమ్మరిల్లు సినిమా కూడా జెనీలియా కెరీర్లో చాలా ప్రత్యేకం. అందుకే ఆమె కూడా దేవీ పాటకు బాగా కనెక్ట్ అయ్యారు. సోషల్మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది.‘బొమ్మరిల్లు’లో జెనీలియా పోషించిన హాసిని పాత్ర అందరికి గుర్తుండిపోయింది. వివాహానంతరం సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్న ఆమె దాదాపు 13ఏళ్ల విరామం తర్వాత దక్షిణాదిలో 'జూనియర్' సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో జెనీలియా కీలక చాలా కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమా కథ తనతో పాటు భర్త రితేష్దేశ్ముఖ్కు కూడా బాగా నచ్చడంతోనే నటించానని ఆమె చెప్పారు. బొమ్మరిల్లులో హాసిని, హ్యాపీలో మధుమతి పాత్రలు ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో మెమొరబుల్గా మిగిలిపోయాయని చెప్పవచ్చు. అందుకే జెనీలీయా చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

ICC: కీలక సమావేశం.. ఐసీసీ కొత్త ప్రణాళికలు
టీ20 ప్రపంచకప్-2026 (T20 WC 2026) టోర్నమెంట్లో ఆడేందుకు ఇటీవలే ఇటలీ దేశపు జట్టు అర్హత సాధించింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్కు పెరుగుతున్న ఆసక్తి, యూరోప్ దేశాల్లోనూ ఆట విస్తరిస్తున్న తీరుకు ఇది సరైన ఉదాహరణ. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఇప్పుడు సరిగ్గా దీనిపైనే మరింత దృష్టి పెట్టనుంది. కొత్త దేశాల్లో క్రికెట్ను మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కొత్త ప్రణాళికలు రూపొందించాలని ఐసీసీ భావిస్తోంది.24 జట్లకు పెంచే ప్రతిపాదనఈ నేపథ్యంలో ఇదే అంశంపై మరింత సమగ్ర చర్చ, భవిష్యత్తు కార్యాచరణ విషయంలో ఐసీసీ చర్చించనుంది. గురువారం (జూలై 17) నుంచి నాలుగు రోజుల పాటు జరిగే ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో ప్రధాన ఎజెండాల్లో ఇది కూడా ఒకటి. వచ్చే టీ20 వరల్డ్ కప్ 20 జట్లతో జరగనుంది. దీనిని ఆ తర్వాత 24 జట్లకు పెంచే ప్రతిపాదనపై కూడా సమావేశంలో చర్చిస్తారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బోర్డుల మద్దతుఅమెరికా–వెస్టిండీస్లలో జరిగిన 2024 టీ20 వరల్డ్ కప్ నిర్వహణలో చోటు చేసుకున్న అవినీతిపై విచారణ కొనసాగుతుండగా... విచారణలో వెల్లడైన అంశాలతో ఏజీఎంలో నివేదిక ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. టెస్టు క్రికెట్ను పెద్ద, చిన్న జట్లతో రెండు వేర్వేరు స్థాయిల్లో నిర్వహించే అంశంపై కూడా చర్చించనున్నారు. ఇలా టెస్టులను వర్గీకరించే అంశానికి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బోర్డులు గట్టిగా మద్దతు పలుకుతున్నాయి.జాంబియా రీ ఎంట్రీతాజాగా ఆసీస్పై విండీస్ 27 ఆలౌట్ ప్రదర్శనను బట్టి చూస్తే దీనిపై గట్టిగానే చర్చ సాగనుంది. అయితే 2025–27 డబ్ల్యూటీసీ టెస్టుల షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఏదైనా మార్పుపై నిర్ణయం తీసుకుంటే 2027 తర్వాతే సాధ్యమవుతుంది. మరో వైపు నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా 2019లో సస్పెన్షన్కు గురైన జాంబియా జట్టుకు ఐసీసీ అసోసియేట్ టీమ్గా మళ్లీ అవకాశం కల్పించనుండగా...తొలిసారి ఈస్ట్ తైమూర్ టీమ్ కూడా ఐసీసీలో భాగం కానుంది. ఐసీసీ కొత్త సీఈఓ హోదాలో సంజోగ్ గుప్తా తొలిసారి ఈ సమావేశంలో కీలక పాత్ర పోషించనున్నారు. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన టీ20 యోధుడు

రిటైరైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. బాబర్ ఆజమ్ ఆల్టైమ్ రికార్డు బద్దలు
రికార్డుల రారాజు విరాట్ కోహ్లి పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించినా చారిత్రక రికార్డులు సాధించాడు. తాజాగా ఐసీసీ ఆల్టైమ్ టీ20 పాయింట్లను అప్డేట్ చేయగా.. అందులో విరాట్ కెరీర్ అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు 897 నుంచి 909 పాయింట్లకు పెరిగాయి. దీంతో విరాట్ మూడు ఫార్మాట్లలో 900 ప్లస్ రేటింగ్ పాయింట్స్ (అత్యుత్తమంగా) అందుకున్న తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటికే విరాట్ టెస్ట్ల్లో అత్యుత్తమంగా 937, వన్డేల్లో అత్యుత్తమంగా 909 రేటింగ్ పాయింట్స్ కలిగి ఉన్నాడు.ఐసీసీ టీ20 రేటింగ్ పాయింట్ల అప్డేషన్ తర్వాత విరాట్ మరో చారిత్రక రికార్డును కూడా సాధించాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో అత్యధిక కాలం నంబర్ వన్గా కొనసాగిన బ్యాటర్గా అవతరించాడు. రేటింగ్ పాయింట్ల అప్డేషన్ తర్వాత విరాట్ నంబర్ వన్గా కొనసాగిన జమానా 1013 రోజుల నుంచి 1202 రోజులకు మారింది. రేటింగ్ పాయింట్ల అప్డేషన్కు ముందు అత్యధిక కాలం నంబర్ వన్ టీ20 బ్యాటర్గా కొనసాగిన రికార్డు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ పేరిట ఉండేది. బాబర్ టీ20ల్లో 1057 రోజులు నంబర్ వన్గా కొనసాగాడు. తాజా అప్డేషన్తో విరాట్ బాబర్ రికార్డును బద్దలు కొట్టి అత్యధిక కాలం నంబర్ వన్ టీ20 బ్యాటర్గా కొనసాగిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.పై రెండు రికార్డులతో విరాట్ టీ20 కెరీర్ మరింత హైలైట్ అయ్యింది. విరాట్ ఇప్పటికే వన్డే, టెస్ట్ల్లో లెక్కలేనన్ని, ఎవరికీ సాధ్యపడని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. కొత్తగా చేరిన రెండు రికార్డులతో విరాట్ అంతర్జాతీయ కెరీర్ మొత్తం పరిపూర్ణమైనట్లైంది.విరాట్ అంతర్జాతీయ కెరీర్లో 125 టీ20లు ఆడి 48.69 సగటుతో 4,188 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా టెస్టుల్లో 123 మ్యాచ్లు ఆడి 9230 పరుగులు చేశాడు. అందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 36 ఏళ్ల విరాట్ వన్డేల్లో ఇప్పటివరకు 302 మ్యాచ్లు ఆడి 57.9 సగటున 51 సెంచరీలు, 74 హాఫ్ సెంచరీల సాయంతో 14181 పరుగులు చేశాడు.

సొంతగడ్డపై శ్రీలంకకు ఊహించని పరాభవం.. చరిత్ర సృష్టించిన లిట్టన్ దాస్
ఇటీవలికాలంలో సొంతగడ్డపై ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోతున్న శ్రీలంకకు ఎదురుదెబ్బ తగిలింది. అన్ని విభాగాల్లో వారికంటే బలహీనమైన బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నిన్న (జులై 16) జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో బంగ్లాదేశ్ ఆతిథ్య జట్టుపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. బంగ్లాదేశ్కు శ్రీలంకలో ఇది తొలి టీ20 సిరీస్ విజయం. బంగ్లా కెప్టెన్గా లిట్టన్ దాస్కు పరాయి గడ్డపై ఇది రెండో టీ20 సిరీస్ గెలుపు. ఈ సిరీస్ గెలుపుతో లిట్టన్ దాస్ చరిత్ర సృష్టించాడు. పరాయి గడ్డపై రెండు టీ20 సిరీస్ విజయాలు సాధించిన తొలి బంగ్లాదేశ్ కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు. లిట్టన్ గతేడాది డిసెంబర్లో వెస్టిండీస్ను వారి సొంతగడ్డపై 3-0 తేడాతో ఓడించాడు. శ్రీలంక, వెస్టిండీస్లో కాకుండా బంగ్లాదేశ్ పరాయి దేశాల్లో మరో రెండు టీ20 సిరీస్ విజయాలు మాత్రమే సాధించింది. ఈ రెండు కూడా జింబాబ్వేలో కాగా.. ఒకటి మష్రఫే మొర్తజా నేతృత్వంలో (2012లో 3-1 తేడాతో), మరొకటి మహ్మదుల్లా సారథ్యంలో (2021లో 2-1 తేడాతో) సాధించింది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను బంగ్లా బౌలర్లు ఉక్కిరిబిక్కిరి చేశారు. మెహిది హసన్ (4-1-11-4) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి లంక బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ముస్తాఫిజుర్ (4-0-17-1), రిషద్ హొస్సేన్ (4-0-20-0) కూడా అదే పని చేశారు. షొరిఫుల్ ఇస్లాం (4-0-50-1), తంజిమ్ హసన్ సకీబ్ (2-0-23-0) మాత్రం ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. షమీమ్ హొస్సేన్ 2 ఓవర్లలో ఓ వికెట్ తీసి పర్వాలేనిపించాడు. బంగ్లా బౌలర్ల దెబ్బకు శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. లంక ఇన్నింగ్స్లో పథుమ్ నిస్సంక (46), దసున్ షనక (35 నాటౌట్), కమిందు మెండిస్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ ఆడుతూపాడుతూ విజయం సాధించింది. తంజిద్ హసన్ తమీమ్ (47 బంతుల్లో 73 నాటౌట్; ఫోర్, 6 సిక్సర్లు) విధ్వంసకర అర్ద శతకంతో బంగ్లాదేశ్కు సునాయాస విజయాన్నందించాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ (0) ఔటైనా.. లిట్టన్ దాస్ (26 బంతుల్లో 32; 2 ఫోర్లు, సిక్స్), తౌహిద్ హృదోయ్ (25 బంతుల్లో 27 నాటౌట్; ఫోర్, సిక్స్) తమీమ్కు సహకరించారు. ఫలితంగా బంగ్లాదేశ్ 16.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. లంక బౌలర్లలో నువాన్ తుషార, కమిందు మెండిస్ తలో వికెట్ తీశారు.

తొలి వన్డేలో ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్
ఇంగ్లండ్ పర్యటనలో భారత మహిళల క్రికెట్ జట్టు అదిరిపోయే విజయాలతో దూసుకుపోతుంది. ఈ పర్యటనలో ఇదివరకే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-2 తేడాతో కైవసం చేసుకున్న భారత్.. తాజాగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లోనూ బోణీ కొట్టింది. ఈ సిరీస్లో భాగంగా నిన్న (జులై 16) సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. తద్వారా ఈ సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.తొలి వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. సోఫీ డంక్లీ (83), డేవిడ్సన్ రిచర్డ్స్ (53) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఎమ్మా లాంబ్ (39), కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (41), సోఫీ ఎక్లెస్టోన్ (23 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ట్యామీ బేమౌంట్ (5), ఆమీ జోన్స్ (1) నిరాశపరిచారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా తలో రెండు వికెట్లు తీయగా.. అమన్జోత్ కౌర్, శ్రీ చరణి చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. ఆది నుంచే నిలకడగా ఆడుతూ పెద్దగా కష్టపడకుండానే విజయం సాధించింది. టాపార్డర్ బ్యాటర్లలో ప్రతీక రావల్ (36), స్మృతి మంధన (28), హర్లీన్ డియోల్ (27), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (17), జెమీమా రోడ్రిగెజ్ (48) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. ఆల్రౌండర్ దీప్తి శర్మ (62 నాటౌట్) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో భారత్ను గెలిపించింది. దీప్తి.. అమన్జోత్ (20 నాటౌట్) సహకారంతో టీమిండియాను విజయతీరాలకు (48.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి) చేర్చింది.చివర్లో జెమీమా, రిచా ఘోష్ (10) స్వల్ప వ్యవధిలో (15 పరుగులు) ఔటైనప్పుడు కాస్త ఒత్తిడికి గురైన భారత శిబిరం.. దీప్తి బాధ్యతాయుతమైన బ్యాటింగ్ చూసి గెలుపు ఖరారు చేసుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ (10-1-34-1) ఒక్కరే భారత బ్యాటర్లను కాస్త ఇబ్బంది పెట్టింది. మిగతా బౌలర్లనంతా భారత బ్యాటర్లు సమర్దవంతంగా ఎదుర్కొన్నారు. ఛార్లోట్ డీన్ 2, లారెన్ ఫైలర్, లారెన్ బెల్ తలో వికెట్ తీశారు. ఈ సిరీస్లో రెండో వన్డే ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జులై 19న జరుగనుంది.
బిజినెస్

ఐపీవోకు ఐవీఎఫ్ హాస్పటల్
ఫెర్టిలిటీ సర్వీసుల దిగ్గజం ఐవీఎఫ్ హాస్పిటల్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి గోప్యతా మార్గంలో ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇటీవల కొంతకాలంగా అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ(ఏఆర్టీ) రంగంపట్ల దేశీయంగా ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఇందిరా ఐవీఎఫ్ ప్రాస్పెక్టస్కు ప్రాధాన్యత ఏర్పడింది.ఈ రంగంలో సుప్రసిద్ధమైన మరో సంస్థ గౌడియం ఐవీఎఫ్ అండ్ ఉమన్ హెల్త్ సైతం లిస్టింగ్ యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. ఇందిరా ఐవీఎఫ్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఐపీవోకు ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. అయితే మార్చిలో డాక్యుమెంట్స్ను వెనక్కి తీసుకుంది. కంపెనీ వ్యవస్థాపకుడు అజయ్ ముర్డియాపై బాలీవుడ్ బయోపిక్ రిలీజ్ నేపథ్యంలో వెనకడుగు వేసింది. తద్వారా పరోక్షంగా కంపెనీ సొంత ప్రమోషన్కు అవకాశమున్నట్లు సెబీ అభిప్రాయపడటంతో ఇందిరా ఐవీఎఫ్ ఐపీవోను విరమించుకున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: మారుతీ ఎర్టిగా, బాలెనో ధరలు పెరిగాయ్..అయితే కంపెనీ ప్రతినిధి ఒకరు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రాస్పెక్టస్ను ఉపసంహరించినట్లు తెలియజేశారు. సెబీ ఆదేశాలతో అన్నది సరికాదని స్పష్టం చేశారు. ఇటీవల ఎన్బీఎఫ్సీ దిగ్గజం టాటా క్యాపిటల్సహా.. ఐనాక్స్ క్లీన్ ఎనర్జీ, లాజిస్టిక్స్ కంపెనీ షాడోఫాక్స్ టెక్నాలజీస్, గాజా ఆల్టర్నేటివ్ ఏఎంసీ, షిప్రాకెట్, ఫిజిక్స్వాలా, బోట్ బ్రాండ్ మాతృ సంస్థ ఇమేజిన్ మార్కెటింగ్ సైతం గోప్యతా విధానంలోనే సెబీకి ప్రాస్పెక్టస్లను దాఖలు చేయడం గమనార్హం!

మారుతీ ఎర్టిగా, బాలెనో ధరలు పెరిగాయ్..
మారుతీ సుజుకీ ఎర్టిగా, బాలెనో కార్ల ధరలు పెంచింది. ఈ మోడళ్లలో స్టాండర్డ్గా ఆరు ఎయిర్ బ్యాగులు అందిస్తున్న కారణంగా వీటి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎర్టిగా ఎక్స్షోరూమ్ ధర 1.4% మేర పెరగ్గా.. బాలెనో ధర 0.5% పెరిగిందని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. జులై 16 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ప్రీమియం హ్యాచ్బ్యాక్ బాలెనో ధర రూ.6.7 లక్షలు – రూ.9.92 లక్షలుగా ఉంది. ఎర్టిగా ధర రూ.8.97 లక్షల నుంచి ప్రారంభమై రూ.13.25 లక్షల వరకు ఉంది.ఇదీ చదవండి: ఉపాధి కల్పించేలా రూ.200 కోట్లు పెట్టుబడిధరల పెరుగుదల వెనుక ప్రధాన కారణాలుఉక్కు, అల్యూమినియం, రబ్బరు వంటి ముడి పదార్థాలు సంవత్సర ప్రాతిపదికన గణనీయమైన పెరుగుదలను చూశాయి. అల్యూమినియం 10.6%, రబ్బరు దాదాపు 27% పెరిగింది. ఇవి నేరుగా తయారీ వ్యయాలను పెంచుతాయి.యూఎస్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి బలహీనపడింది. దిగుమతి చేసుకునే విడిభాగాలు మరింత ఖరీదైనవిగా మారాయి.భారత్ స్టేజ్ 7 ప్రమాణాలను అమలు చేయడం కోసం వాహన తయారీదారులు శుభ్రమైన సాంకేతికతల్లో పెట్టుబడి పెట్టాలి.ఆపరేషనల్ & లాజిస్టిక్స్ ఖర్చులు పెరిగాయి. ఇంధనం, రవాణా, గిడ్డంగుల ఛార్జీలు పెరిగాయి.స్థానిక తయారీని ప్రోత్సహించడానికి, దిగుమతి చేసుకునే విడిభాగాలపై సుంకాలు పెరిగాయి. ఇది మార్జిన్లపై ప్రభావం చూపింది.

సాఫీగా రేట్ల కోత బదిలీ
న్యూఢిల్లీ: వ్యవస్థలో నగదు లభ్యత పెంపు దిశగా ఆర్బీఐ ఈ ఏడాది ఆరంభం నుంచి తీసుకున్న చర్యలు.. 100 బేసిస్ పాయింట్ల (ఒక శాతం) రేట్ల తగ్గింపు పూర్తి ప్రయోజనాన్ని బ్యాంక్లు బదిలీ చేసేందుకు అనుకూలిస్తుందని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు రూపంలో ఆర్బీఐ రూ.5.6 లక్షల కోట్ల మేర లిక్విడిటీని పెంచినట్టు గుర్తు చేసింది. దీంతో మార్చి నుంచి నగదు లభ్యత మిగులు స్థాయికి చేరినట్టు తెలిపింది. సీఆర్ఆర్ను (నగదు నిల్వల నిష్పత్తి) 100 బేసిస్ పాయింట్లను తగ్గించడం రూపంలో మరో రూ.2.7 లక్షల కోట్ల నగదు దశల వారీగా వ్యవస్థలోకి చేరుతుందని పేర్కొంది. జనవరి నుంచి వ్యవస్థలో లిక్విడిటీని గణనీయంగా పెంచడమే కాకుండా, భవిష్యత్తులోనూ తగినంత లిక్విడిటీని కొనసాగించాలన్న ఆర్బీఐ నిర్ణయం నిధుల పరమైన పరిస్థితులను సులభతరం చేసినట్టు వివరించింది. ‘‘పెరుగుతున్న మిగులు నిధులు, డిపాజిట్ రేట్లు తగ్గుతుండడం దీన్ని స్పష్టం చేస్తోంది. రుణ వృద్ధి మందగించడంతో ఈ రంగం రుణ/డిపాజిట్ రేషియో పెరుగుదల తిరోగమించడం డిపాజిట్ల పరంగా బ్యాంక్లపై ఒత్తిళ్లను తగ్గిస్తుంది’’అని ఫిచ్ రేటింగ్స్ నివేదిక వెల్లడించింది. నిధుల వ్యయాలు దిగొస్తాయి.. ఈ ఏడాది వడ్డీ రేట్లను ఆర్బీఐ ఒక శాతం వరకు తగ్గించడం తెలిసిందే. ఫిబ్రవరిలో పావు శాతం, ఏప్రిల్లోనూ పావు శాతం, జూన్లో అరశాతం తగ్గింపు నిర్ణయాలు తీసుకోవడాన్ని ఫిచ్ రేటింగ్స్ నివేదిక గుర్తు చేసింది. ఈ చర్యలు ఆర్బీఐ లిక్విడిటీ విధానంలో గణనీయమైన మార్పునకు నిదర్శనమని పేర్కొంది. నిధుల పరంగా ఒత్తిళ్లు లేకుండా రుణ వృద్ధికి ఈ చర్యలు మద్దతునిస్తాయని తెలిపింది. ‘‘తగినంత లిక్విడిటీ వల్ల తాజా నిధుల సమీకరణ వ్యయాలు తగ్గుతాయి. 2025–26 సంవత్సరంలో బ్యాంకుల మార్జిన్లు 0.30 శాతం తగ్గుతాయన్నది మా అంచనా. 2026–27లో డిపాజిట్లపై వ్యయాలు తగ్గడం ఫలితంగా మార్జిన్ల ఒత్తిళ్లు దిగొస్తాయి. తక్కువ సీఆర్ఆర్ కూడా ఇందుకు అనుకూలిస్తుంది’’అని ఈ నివేదిక వివరించింది. జూన్ సమీక్షలో ఆర్బీఐ సీఆర్ఆర్ను సైతం ఒక శాతం తగ్గించి 3 శాతం చేయడం గమనార్హం.

భారత్–సింగపూర్ మధ్య నిధుల బదిలీ సులభతరం
న్యూఢిల్లీ: భారత్–సింగపూర్ మధ్య నిధుల బదిలీని మరింత సులభతరం చేస్తూ.. యూపీఐ–పేనౌ కిందకు మరో 13 బ్యాంక్లను చేర్చినట్టు ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ ప్రకటించింది. ఈ నెట్వర్క్ పరిధిలోకి మొత్తం 19 భారత బ్యాంక్లు చేరినట్టయింది. ‘‘జూలై 17 నుంచి రెండు దేశాల్లోని యూజర్లు మరిన్ని బ్యాంకుల పరిధిలో నిధులను బదిలీని సులభంగా చేసుకోవచ్చు. ఈ సేవ మరింత సౌకర్యంగా, అందుబాటులోకి వస్తుంది’’అని ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్) తెలిపింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కి ఎన్ఐపీఎల్ అనుబంధ సంస్థ కావడం గమనార్హం. ఆర్బీఐ, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ (ఎంఏఎస్) సంయుక్తంగా యూపీఐ–పేనౌ సేవలను లోగడ ప్రారంభించడం తెలిసిందే.
ఫ్యామిలీ

హీరో మాధవన్ వెయిట్లాస్ జర్నీ..! వ్యాయమాలు చేయకుండా జస్ట్ 21 రోజుల్లో..
తమిళ నటుడు మాధవన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న నటుడిగా పేరుగాంచిన ఆర్ మాధవన్..ఐదు పదుల వయసులో కూడా అదే యంగ్ లుక్లో అభిమానులను అలరిస్తున్నారు. ఒకనొక టైంలో అధిక బరువుతో ఇబ్బందిపడ్డ మాధవన్ గతేడాది 2024లో అనూహ్యంగా బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మళ్లీ ఇదివరకటి మాధవన్ మన ముందుకు వచ్చేశాడంటూ అతడి అభిమానులు ఖుషీ అవుతున్నారు. అది కూడా 21 రోజుల్లోనే అదనపు బరువుని తగ్గించుకోవడం విశేషం. మరి అందుకోసం అతడు ఎలాంటి డైట్ ప్లాన్ అనుసరించాడు, ఎలాంటి వర్కౌట్లు చేసేవాడో తెలుసుకుందామా..!.చాలా తక్కువ సమయంలోనే బరువు తగ్గేందుకు మాధవన్ ఎలాంటి వర్కౌట్లను ఆశ్రయించలేదన. జస్ట్ తీసుకునే ఆహారంలోనే మార్పులు, చక్కటి జీవనశైలితో బరువు తగ్గాడట. ఓ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా వెల్లడించారు. తాను అడపాదడపా ఉపవాసం(మెడిటేరియన్ డైట్), రోజుకు 45 నుంచి 60 సార్లు బాగా నమిలి తినడం, నీళ్లు అధికంగా తీసుకోవడం వంటివి అనుసరించినట్లు తెలిపారు. అలాగే రోజులో తన చివరి భోజనం సాయంత్రం 6.45 గంటలకు (వండిన ఆహారం మాత్రమే తీసుకునేవారట). తెల్లవారుజామున సుదీర్ఘ వాకింగ్, గాఢనిద్ర, పోన్కి దూరంగా ఉండటం వంటివి చేశానని చెప్పారు. పుష్కలంగా నీరు, ఆకుపచ్చని కూరగాయలు తీసుకున్నానని చెప్పుకొచ్చారు. శరీరంగా సులభంగా జీర్ణం చేసుకునే పోషకాహారానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. అలా మాధవన్ 21 రోజుల్లో ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గారు. ఇది మంచిదేనా అంటే..నిపుణులు ఏమంటున్నారంటే..అడపాదడపా ఉపవాసంఅడపాదడపా ఉపవాసం అనేది ఒక విధమైన తినే విధానం. ఇది ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడానికి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆర్.మాధవన్ ప్రతిరోజూ సాయంత్రం 6:45 గంటలకల్లా తన చివరి భోజనం తింటానని, మధ్యాహ్నం 3:00 గంటల తర్వాత ఎలాంటి పచ్చి ఆహారాన్ని తిననని వెల్లడించాడు.ఆహారాన్ని సరిగ్గా నమలడంఇలా 45 నుంచి 60 సార్లు ఆహారాన్ని నమలడానికి బరువు తగ్గడానికి మధ్య చాలా అవినాభావ సంబంధం ఉందని అధ్యయనాలు పేర్కొన్నాయి కూడా. ఇది బరువు తగ్గాలనుకునేవారికి సరైన వ్యూహంగా చెబుతున్నారు నిపుణులు.ఉదయాన్నే వాకింగ్బరవుని అదుపులో ఉంచడానికి ఉత్తమ మార్గం ఇది. ఎలాంటి కఠిన వ్యాయామాలతో పనిలేకుండా చేసే సుదీర్ఘ వాకింగ్ కండరాలకు మంచి కదలిక తోపాటు సులభంగా కేలరీలను బర్న్ చేయడంలో తోడ్పడుతుంది.స్లీప్ అండ్ స్క్రీన్ డిటాక్స్మంచి నాణ్యమైన నిద్రకు స్కీన్ సమయం తగ్గించడమే అని నిపుణులు చెబుతున్నారు. నిద్రకు కనీసం ముందు 90 నిమిషాలు పాటు స్క్రీన్లకు దూరంగా ఉండటం చాలామంచిదని సూచించారు.పుష్కలంగా ద్రవాలు, ఆరోగ్యకరమైన ఆకుకూరలుబరువు తగ్గించే ప్రయాణంలో తాను పుష్కలంగా ద్రవాలు తాగానని హైడ్రేటెడ్గా ఉంచుకున్నానని ఆర్.మాధవన్ తెలిపారు. మాధవన్ తన శరీరం సులభంగా జీర్ణం చేసే ఆకుపచ్చ కూరగాయలు, ఆహారాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాసెస్ చేసిన ఆహారాలకు చాలా దూరంగా ఉన్నారు. ఇది సరైన జీవనశైలికి నిదర్శనమని చెబుతున్నారు నిపుణులు. ఈ విధమైన ఆరోగ్యకరమైన పద్ధతులను అనుసరిస్తే ఎవ్వరైనా..సులభంగా బరువు తగ్గుతారని నమ్మకంగా చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించి చూడండి మరి..!.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.No exercise, No running... 😏21 நாட்களில் மாதவன் உடல் மாற்றம், அது எப்படி சாத்தியம்? 🤔 pic.twitter.com/ssrATrqOnr— Aadhavan® (@aadaavaan) July 17, 2024 (చదవండి: రిమ్ 'జిమ్'.. హోమ్..! కోవిడ్ తర్వాత పెరుగుతున్న ట్రెండ్..)

మైండ్ బ్లోయింగ్..ఒక్కసారిగా గ్లామ్ అవతార్లో నటి, అభిమానులు ఫిదా!
ప్రముఖ నటి విద్యాబాలన్ సడెన్గా తన లుక్ను మార్చేసింది. బాలీవుడ్లో విలక్షణ నటిగా, ఒక ఐకాన్గా పేరుతెచ్చుకున్న నటి యంగ్ , డైనమిక్లో అభిమానులనుఒక్కసారిగా మెస్మరైజ్ చేసింది. తన స్టైలిష్ ఫోటోలను విద్యా ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఇవి వైరల్గా మారాయి. విద్యాబాలన్ బాలీవుడ్ ఐకానిక్ నటిగా తనకంటూ పేరు సంపాదించుకున్నారు. సినిమా ప్రమోషన్ అయినా, రెడ్ కార్పెట్ అయినా, మ్యాగజైన్ కవర్లైనా, విద్యాబాలన్ చేనేత వస్త్రాలు ఆమె స్పెషల్టీ. కానీ ఆమె తాజా లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది .విద్యాబాలన్ 'ఐటీ' కవర్ గర్ల్ ది పీకాక్ మ్యాగజైన్ జూలై -2025 ఎడిషన్ కవర్ షూట్ కోసం విద్యాబాలన్ తన అద్భుతమైన పరివర్తనతో అందరి దృష్టిని ఆకర్షించింది. విద్యాబాలన్కు సంబంధించిన స్టైలిష్ ఫోటోలను 'ఎ ఫోర్స్ టు రెకౌన్ విత్' అనే శీర్షికతో మ్యాగజైన్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. అద్భుతంగా ఉంది అని ఒకరు "కాంజీవరం చీర లుక్ నుండి - ఇప్పుడు ఇది! మైండ్ బ్లోయింగ్...మాటలు లేవు" అని మరొకరు వ్యాఖ్యానించడం విశేషం. అంతేకాదు ఇది ఏఐ ఫోటో కాదు అంటూ కొనియాడడం గమనార్హం.కాగా 2003 వ సంవత్సరం లో ‘బాలో టేకో’ అనే బెంగాలీ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆమె ‘పరిణీత’ అనే చిత్రంతో హీరోయిన్ గా మారడమేకాదు, ఫ్యాన్ ఫాలోయింగ్నుసంపాదించుకుంది, దర్శక నిర్మాతల చాయిస్గా మారిపోయింది. ఇటీవల భారీగా బరువు తగ్గి 46 ఏళ్ల వయసులో మరింత అందంగా మారిపోయిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by The Peacock Magazine (@thepeacockmagazine_)

నీట్, యూపీఎస్సీలలో ఓటమి..ఇవాళ రోల్స్ రాయిస్లో రూ. 72 లక్షలు..
వరుస ఓటములు కొందరిని కుంగదీసి ఏమి చేయలేని స్థితికి చేరుస్తాయి. కొందరికి అవి మరింతగా బలంగా పుంజుకోవడానికి దోహదపడి..ఎవ్వరూ ఊహించనంత స్థాయికి చేరుస్తాయి. గెలవాలన్న దృఢ సంకల్పం, వెనక్కి తగ్గని పట్టుదల ఉన్నవారే ఫెయిల్ అనే పదానికి సరైన అర్థం ఇచ్చేలా గెలిచి చూపిస్తారు. అలాంటి ఘనతనే సాధించింది ఈ కర్ణాటక అమ్మాయి. అంతేగాదు చిన్న వయసులోనే యూకే ఆధారిత విమానాయన దిగ్గజం రోల్స్ రాయిస్లో భారీ వేతనంతో పనిచేసే అవకాశాన్ని అందుకుని శెభాష్ అనిపించుకుంది. కర్ణాటకలోని తీర్థహళ్లి తాలూకాలోని కోడూరుకి చెంఇన రీతూపర్ణ సెయింట్ ఆగ్నెస్లో పాఠశాల విద్యను పూర్తి చేసి, నీట్ ద్వారా ప్రభుత్వ ఎంబీబీఎస్ సీటు సంపాదించాలనుకుంది. అందులో విఫలమవ్వడంతో తీవ్రంగా నిరుత్సాహపడింది. డాక్టర్ కావాలన్నది ఆమె కల..కానీ అది చూస్తుండగానే ఆవిరైపోయింది. సరిగ్గా ఆ సమయంలో రీతూపర్ణ తండ్రి ఆమెను ఇంజనీరింగ్ వైపుకి వెళ్లమని సూచించారు. అలా ఆమె 2022లో మంగళూరులోని సహ్యాద్రి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ (SCEM)లో సెట్ ద్వార్ అడ్మిషన్ పొంది ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అయ్యింది. కాలేజ్ మొదటి రోజు నుంచే శ్రద్ధగా చదవడం మొదలు పెట్టింది. అలా ఆమె ఆటోమేషన్ పట్ల ఆకర్షితురాలై రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ వైపుకి వెళ్లింది. తన సీనియర్ విద్యార్థుల నుంచి ప్రేరణ పొంది..ప్రభావవంతమైన ప్రాజెక్టులను రూపొందించడం ప్రారంభించింది. రోబోలు నిర్మించడం..పతకాలు గెలుపొందడం..తన బృందంతో కలిసి రితుపర్ణ వక్క రైతుల కోసం రోబోటక్ స్ప్రేయర్ హార్వెస్టర్ని నిర్మించింది. గోవాలో జరిగిన అంతర్జాతీయ ఇనెక్స్లో జరిగిన పోటీలో ఈ రోబోలిక్ స్ప్రేయర్ బంగారం, వెండి పతకాలను గెలుచుకుంది. ఆ పరిజ్ఞానమే తనకు నిట్కే సూరత్కల్లో రోబోటిక్ సర్జరీపై పరిశోధన చేసేందుకు దోహదపడింది. దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్ ములై ముహిలన్ ఎంపీతో నేరుగా సంభాషించి, ఘన వ్యర్థాల నిర్వహణ కోసం మొబైల్ యాప్ని డెవలప్ చేయడంలో సహాయపడింది. మంచి గుర్తింపు కోసం..తన పరిజ్ఞానంతో మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతో రీతూపర్ణ ఇంటర్న్షిప్ కోసం రోల్స్ రాయిస్ను సంప్రదించింది. కంపెనీ ప్రారంభంలోనే ఆమె అవకాశాలను తోసిపుచ్చింది. అలా ఒక నెలలో కేటాయించిన పనిని కూడా పూర్తి చేయలేకపోయింది రీతూపర్ణ. దాంతో ఒక్క ఛాన్స్ అంటూ ఒక్క నెల గడువుతో పూర్తి చేసే మరో సవాలుని తీసుకోవాల్సి వచ్చింది. అయితే దానిని ఆమె కేవలం ఒక వారంలోనే పూర్తి చేసింది. రీతూ సామర్థ్యం చూసి ఇంప్రెస్ అయిన రోల్స్ రాయిస్ మరో అసైన్మెంట్ ఇచ్చింది. అలా ఎనిమిది నెలలు కష్టతరమైన ప్రాజెక్టులు, ఇంటర్వ్యూలతో గడిచిపోయింది. చెప్పాలంటే తన ఆరవ సెమిస్టర్లో కాలేజ్కి డుమ్మా కొట్టి మరీ యూకే వర్క్షిప్ట్స్లో పనిచేసింది. అలా డిసెంబర్ 2024 నాటికి 39.6 లక్ష ప్రీ ప్లేసమెంట్ ఆఫర్ అందుకుంది. ఇక ఏప్రిల్ 2025 నాటికి తన పనితీరుతో రూ. 72.3 లక్షలకు వేతన ఆఫర్ని అందుకుంది. అమెరికాకు వెళ్లనుంది..రీతూపర్ణ తన ఏడో సెమిస్టర్ పూర్తి చేసిన తదనంతరమే రోల్స్ రాయిస్లో పూర్తి సమయం పనిచేసేందుకు యూఎస్ఏలోని టెక్సాస్కు వెళ్లనుంది. అక్కడ ఆమె జెట్ ఇంజిన్ తయారీ యూనిట్లో పనిచేయనుంది. ఆమె ఈ కంపెనీలోకి ప్రాబ్లం సొల్యూషన్ అనే ప్రతిష్టాత్మక డీసీ ఫెలోషిఫ్ ప్రోగామ్ ద్వారా ఎంపికైంది. ఆమె తోపాటు కన్నడ నుంచి సుమారు 15 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. కాగా ఆమె డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ లారెన్స్ జోసెఫ్ ఫెర్నాండెజ్ రీతూపర్ణ విజయాన్ని కళాశాలకు గర్వకారణమైన క్షణంగా అభివర్ణించడమే గాక ఔత్సాహిక యువ ఇంజనీర్లకు ప్రేరణగా నిలిచిందని కొనియాడారు. చివరగా రీతూపర్ణ మాట్లాడుతూ.."ఇటీవల యువత చాలా పెద్ద కలలు కంటున్నారు గానీ 50% మాత్రమే ఔట్పుట్ ఇస్తున్నారు. కానీ విజయం సాధించాలంటే 200% ఔట్పుట్ ఇవ్వాలి. దృఢ సంకల్పంతో ఉంటూ మూలాల్ని మర్చిపోకూడదు. అప్పుడే గెలుపు తీరాన్ని అందుకోగలమని చెబుతోంది." రీతూపర్ణ.(చదవండి: మహాత్మా గాంధీ అరుదైన పెయింటింగ్..వేలంలో ఏకంగా..!)

ఆ అయిదు రోజుల నిషేధంపై విజయం
రుతుస్రావం (menstrual) జరుగుతున్న మహిళలను అపవిత్రమైనవారిగా.. అంటరానివారిగా పరిగణించే గ్రామాలు ఇప్పటికీ మన దేశంలో ఇంకా ఉన్నాయి. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని మాడియాతెగ మహిళలు శతాబ్దాలుగా 'ఆ ఐదు రోజులు' ఊరికి దూరంగా రుతు గుడిసె (menstrual huts or kurma ghars) లలో ఒంటరిగా ఉంటున్నారు. ఇప్పుడా ఆచారానికి అక్కడి మహిళలంతా కలిసి స్వస్తి పలికారు. ఆ గ్రామంలోని అన్ని వయసుల మహిళలకు సమష్టిగా 'మావా ఆస్కాన్లోన్' (మహిళలుగా ఇది మా నిజమైన ఇల్లు) ను ఏర్పాటు చేశారు. దశాబ్దాలుగా ఈ ఆచారాన్ని నిర్మూలించడానికి కృషి చేసి, విజయం సాధించారు. ఈ నిర్మాణం మహిళలకు ఒక ఆశ్రయం మాత్రమే కాదు సమావేశాలు జరుపు కోవడానికి, ఒకరికొకరు మద్దతుగా నిలబడటానికి మహిళల కమ్యూనిటీ కేంద్రంగా కూడా పనిచే స్తుంది. సమీప గ్రామాల మహిళలు కూడా ఈ ఇంటికి వస్తున్నారు. మహిళలే మహిళల కోసం ఐక్య తగా సదస్సులు ఏర్పాటు చేసి, అవగాహన కల్పిస్తున్నారు.దశాబ్దాల కాలంగా కుర్మాఘర్ (రుతు గుడిసె) ఆచారాన్ని నిర్మూలించడానికి గడ్చిరోలికి చెందిన స్వర్మ్ అనే ఎన్జీవో అక్కడి మహిళలకు మద్దతుగా నిలిచింది. ఇది సహజమైన జీవప్రక్రియ. ఈ సమ యంలో మహిళలకు అవసరమైన భావోద్వేగ, శారీ లేక మద్దతు కుటుంబం నుండి మాత్రమే లభి స్తుంది, ఒంటరితనంతో కాదు" అని పదే పదే చెబుతూ గ్రామంలోని పురుష సభ్యులను, సంప్ర దాయ విశ్వాస నాయకులలో మార్పునకు కృషి చేసింది. 'మొదట్లో అసాధ్యం అనిపించింది. కానీ,చేశారు. శ్రమించారు. కానీ, నిజాయితీగా కృషి చేయడంతో మనస్తత్వాలు రడం ప్రారంభించాయి. ఇక నుంచి రుతు గుడిలో ఏ ఒక్క మహిళ కూడా ఉండకూడదు అని స్థంగా చెబుతున్నారు' అంటారు ఎన్టీవో డైరెక్టర్ దిలీప్ బర్సగా..ఒంటరి వేదన నుంచి విముక్తిమహిళల కోసం ఆశ్రమం నిర్మించాలనుకున్న డు కుర్మ ఘరాగా ఉండకూడదనే షరతుతో గీకరించారు. అంటే, వారు ఆ రుతు గుడిసెతో తటి మానసిక, శారీరక క్షోభను అనుభవించారో చేసుకోవచ్చు. మహిళలు ఒంటరిగా ఉండే. పది ఐదు రోజుల నుండి మూడు రోజులకు, వాత రెండు రోజులకు తగ్గింది. అయినప్పటికీ డా ఇళ్ల వాళ్లు రుతుస్రావం ఉన్న మహిళలను శ్లోకి అనుమతించడాన్ని నేటికీ వ్యతిరేకిస్తున్నాయి. రుతుస్రావం ఉన్న, లేని మహిళలు అందరూ ఒకే పైకప్పు కింద కలిసి ఉండటం వల్ల ఈ నిషేధం తొలగిపో యేంతవరకు అవిశ్రాంతంగా కృషిచేశారు శ్రమించారు. ఫలితంగా నేడు అందరూ కలిసి ఉంటున్నారు. కొందరు రుతుక్రమంలో ఉన్న మహిళలు ఇప్పటికీ కేంద్రంలో పగటిపూట గడు పుతారు. కానీ, రాత్రికి ఇంటికి తిరిగి వెళతారు. ఈ ఇల్లు ఇప్పుడు అన్నిరకాల సమావేశాలకు ఉపయోగపడుతుంది. మహిళల విజయానికి చిహ్నంగా మారింది. ఆంక్షల నుంచి అవగాహనవైపుగానెల్గుండ గ్రామానికి చెందిన మాడియా తెగ సభ్యురాలు బేబీ మర్కుమే మాట్లాడుతూ 'ఊరికి దూరంగా 15 గుడిసెల వరకు ఉన్నాయి. అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉండవు. తుఫానుల వల్ల చాలా వరకు పైకప్పులు ఎగిరిపోయాయి. రుతు క్రమం సమయంలో నది నీటిని తాకడానికి కూడా వీల్లేని ఆంక్షలు, మూడవ రోజు, మళ్లీ ఐదవ రోజున స్నానం చేసి, ఊరి లోపలికి వెళ్లాలి. దీనివల్ల రకర కాల జబ్బులు వచ్చేవి. కానీ, ఊరి పెద్దవాళ్లు మొండిగా ఉంటారు' అని చెబుతుంది ఆమె. 201 1లో స్వర్క్ 223 రుతు గుడిసెలలో ఒక సర్వే నిర్వ హించింది. అందులో.. పాముకాటు, అడవి జంతు వుల దాడులు, ఒంటరితనం, అధిక రక్తస్రావం, వైద్య అత్యవసర పరిస్థితుల వల్ల 28 మంది అమ్మా యిలు మరణించారని గుర్తించింది. బాధితుల్లో దాదాపు 70 శాతం మంది 11 నుంచి 37 సంవత్స రాల మధ్య వయసు గలవారే అని చెబుతారు. ఇక్కడి మహిళలు, గిరిజన పరిశోధన శిక్షణ సంస్థ గడ్చిరోలిలోని 50 గ్రామాలకు తన బృందాన్ని పంపింది. ఆశా, అంగన్వాడీ కార్యకర్తల సాయంతో విద్య, వైద్యం వంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది..
ఫొటోలు
అంతర్జాతీయం

బిష్ణోయ్ గ్యాంగ్కు టెర్రర్ ట్యాగ్?.. కెనడాలో పెరుగుతున్న ఒత్తిడి
ఒట్టావా: కెనడాతో సహా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్..హింస, దోపిడీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో పాటు, పలు హత్యలకు పాల్పడుతున్నదని కెనడియన్ నేత డేనియల్ స్మిత్ పేర్కొన్నారు. ఈ గ్యాంగ్ అంతర్జాతీయ నేర నెట్వర్క్ కలిగివున్నదని, అందుకే ఈ గ్యాంగ్కు టెర్రర్ ట్యాగ్ ఇవ్వాలని ఆయన ఒక సోషల్ మీడియా పోస్ట్లో కోరారు.లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లక్ష్యం నేరపూరితమైనదని, హింసాత్మకమైనదని స్మిత్ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ ముఠా కార్యకలాపాలకు ఎటువంటి హద్దులు లేవని, దీనికి దేశంలో స్థానం ఉండకూడదని అన్నారు. బిష్ణోయ్ ముఠాను ఉగ్రవాద సంస్థగా అధికారికంగా గుర్తించడం ద్వారా, దాని ఆటలు ఇకపై సాగవని , ప్రాంతీయ స్థాయి చట్ట అమలు సంస్థల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడదని స్మిత్ పేర్కొన్నారు. కాగా బిష్ణోయ్ నెట్వర్క్లో కీలకంగా భావిస్తున్న గోల్డీ బ్రార్పై చర్యలు తీసుకోవాలని భారత్ ఎప్పటినుంచో కెనడాను కోరుతూ వస్తోంది. The Lawrence Bishnoi Gang is a transnational criminal network responsible for violence, extortion, drug trafficking and targeted killings, including here in Canada. Its reach is global, and its intent is criminal and violent.We know that gang activity knows no boundaries and… pic.twitter.com/wYwdAx3pfT— Danielle Smith (@ABDanielleSmith) July 15, 2025గత జూన్లో బ్రిటిష్ కొలంబియా నేత డేవిడ్ ఎబీ కెనడాకు ఇదేవిధమైన అభ్యర్థన చేశారు. ఈ ముఠా అల్బెర్టా, ఒంటారియో ప్రాంతంలోని దక్షిణాసియా ప్రజలపై పలు నేరాలకు పాల్పడిందని డేవిడ్ ఎబీ ఆరోపించారు. ఇదే సమయంలో సర్రే మేయర్ బ్రెండా లాక్ ఈ పిలుపుకు మద్దతునిచ్చారు. బిష్ణోయ్ ముఠాను ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తే, కెనడియన్ చట్ట అమలు సంస్థలకు వ్యవస్థీకృత నేర నెట్వర్క్లతో పోరాడేందుకు అవకాశం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.

‘అనవసర ప్రయాణాలొద్దు’.. ఇరాన్లోని భారతీయులకు హెచ్చరిక
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ జూన్ 13న ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ను మొదలుపెట్టి, ఇరాన్కు చెందిన సైనిక, అణు సౌకర్యాలపై బాంబు దాడి చేయడంతో ప్రారంభమైన ప్రాంతీయ ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో ఇరాన్లోని భారత పౌరులు అనవసర ప్రయాణాలను మానుకోవాలని కోరింది.గత కొన్ని వారాలుగా ఇరాన్లో పెరుగుతున్న భద్రతా సమస్యల మధ్య ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం ఈ ప్రకటన చేసింది. ‘గత కొన్ని వారాలుగా నెలకొన్న భద్రతా సంబంధిత పరిణామాల దృష్ట్యా, ఇరాన్లో అనవసరమైన ప్రయాణాలు చేపట్టే ముందు ఇక్కడి పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించాలని భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్’లో సూచించింది. ఇరాన్లో ఇప్పటికే ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాలు, ఫెర్రీలను వినియోగించుకోవచ్చని తెలిపింది. pic.twitter.com/boZI4hAVin— India in Iran (@India_in_Iran) July 15, 2025ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ను ప్రారంభించి ఇరాన్పై దాడులకు తెగబడిన దరిమిలా ఇరాన్ ఇజ్రాయెల్పై క్షిపణి, డ్రోన్ దాడులతో ప్రతీకారం తీర్చుకుంది. జూన్ 24న ఇజ్రాయెల్ తన దురాక్రమణను ఏకపక్షంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో 12 రోజుల ఈ యుద్ధం ముగిసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

రష్యాతో వ్యాపారం చేస్తే ఊరుకోం
వాషింగ్టన్: ఉక్రెయిన్పై ఆక్రమణ జెండా ఎగరేసిన రష్యాను నిలువరించేందుకు దాని ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు నాటో కూటమి పరోక్ష చర్యలకు దిగింది. రష్యా నుంచి చమురు కొనుగోలుసహా పలురకాల వాణిజ్య కార్యకలాపాల కొనసాగిస్తున్న భారత్, చైనా, బ్రెజిల్లపై నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే హెచ్చరికలు చేశారు. రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను ఎదుర్కోవలసి ఉంటుందని రుట్టే బ్రెజిల్, చైనా, భారత్లను హెచ్చరించారు. బుధవారం అమెరికా సెనేటర్లతో వాషింగ్టన్లో సమావేశమైన అనంతరం మీడియాతో రుట్టే మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను శాంతి చర్చలకు ఒప్పించేలా పుతిన్పై భారత్, చైనా, బ్రెజిల్లు ఒత్తిడితేవాలని రుట్టే వ్యాఖ్యానించారు. ‘భారత ప్రధాన మంత్రి, చైనా అధ్యక్షుడు, బ్రెజిల్ అధ్యక్షుడు... మీరు ఎవరైనా కావొచ్చుగానీ రష్యాతో మీరు ముడిచమురు, సహజ వాయువు కొనుగోలుసహా వాణిజ్య వ్యాపారాలను వెంటనే ఆపేయండి. మీరో విషయం గుర్తుంచుకోవాలి. రష్యాలోని ఆ పెద్దమనిషి(పుతిన్) గనక ఉక్రెయిన్తో శాంతి ఒప్పందానికి ముందుకు రాకపోతే నేను టారిఫ్ల కొరడాతో రంగంలోకి దిగుతా. భారత్, బ్రెజిల్, చైనాలపై 100 శాతం టారిఫ్లు విధిస్తా. ఆర్థిక ఆంక్షలు సైతం విధిస్తా. నా ఈ హెచ్చరికలను మీరు చాలా సీరియస్గా తీసుకోవాల్సిందే. లేదంటే దీని విపరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వాటిని మీరు ఎదుర్కోక తప్పదు. కొత్తగా ఈ 100 శాతం టారిఫ్ల బాధ తప్పాలంటే మీరు వెంటనే రష్యా అధ్యక్షుడు పుతిన్పై ఒత్తిడి బాగా పెంచాలి. ఉక్రెయిన్తో శాంతి చర్చలకు పుతిన్ను ఒప్పించాలి. పుతిన్ ఆ శాంతి చర్చలకు కట్టుబడి ఉండాలి. పుతిన్కు వెంటనే ఫోన్ చేసి, శాంతి చర్చలపై మరింత సీరియస్గా ఆలోచించాలని సూచనలు చేయండి. మీరు చర్చలపై ముందడుగువేయకుంటే నాటో మాపై 100 శాతం టారిఫ్లు విధిస్తుందట అని పుతిన్కు చెప్పండి. శాంతి ఒప్పందంగనక సాధ్యంకాకపోతే మీ మూడు దేశాలపై టారిఫ్లు విధించడం ఖాయం. ఈ గుదిబండను మీరు మోయకతప్పదు’’’ అని రుట్టే హెచ్చరించారు. ఉక్రెయిన్కు సైనిక మద్దతు మరింత పెంచుతామని, రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలపై టారిఫ్లను విపరీతంగా పెంచుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజు రుట్టే ఇలా భారత్ను హెచ్చరిస్తూ వ్యాఖ్యలుచేయడం గమనార్హం. రష్యా, దాని భాగస్వాములపై 100 శాతం సుంకాలు విధిస్తాం: అమెరికా రష్యా ఎగుమతులపై 100 శాతం సుంకాలను విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. 50 రోజుల్లోపు ఉక్రెయిన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోకపోతే రష్యా నుంచి ముడిచమురును కొనుగోలుచేసే దేశాలపై మరోదఫా ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ‘50 రోజుల్లోపు శాంతి ఒప్పందం కుదరాల్సిందే. అది జరక్కపోతే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. టారిఫ్ల మోత మోగిస్తా. ఇతర ఆర్థిక ఆంక్షలు మోపుతా’’ అని ట్రంప్ ప్రకటించారు. అమెరికా కాంగ్రెస్ ఆమోదం అవసరం లేకుండానే మరోదఫా టారిఫ్లను అమలు చేయవచ్చన్నారు. అత్యధిక కొనుగోలుదారుల్లో భారత్ తాజా అంతర్జాతీయ వాణిజ్య నివేదికల ప్రకారం రష్యా నుంచి ముడి చమురును అధికంగా దిగుమతి చేసుకుంటున్న, కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్, చైనా, తుర్కియే తొలి వరసలో ఉన్నాయి. ట్రంప్ నిజంగానే ఆర్థిక ఆంక్షలు విధిస్తే భారత్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్న ఈ తరుణంలో ట్రంప్ కొత్తగా టారిఫ్ల కొరడా ఝులిపిస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలకు అంతరాయం కలిగే వీలుంది. ట్రంప్ బెదిరింపులపై రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ దీటుగా స్పందించారు. ‘ ట్రంప్తో చర్చలు జరపడానికి రష్యా సిద్ధంగా ఉంది. కానీ రష్యానే బెదిరించాలని చూడటం తగదు. అలి్టమేటం జారీ చేయడం అస్సలు ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి చర్యలు సానుకూల ఫలితాలను ఇవ్వవని గుర్తుంచుకుంటే మంచిది’ అని సెర్గీ వ్యాఖ్యానించారు.

అమెరికాను ముంచెత్తిన వరదలు
వాషింగ్టన్: న్యూయార్క్ నగరంతో సహా అమెరికాలోని ఈశాన్య ప్రాంతంలో కుండపోత వర్షం కురిసింది. అనేక నగరాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దీంతో రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. గ్యాస్ స్టేషన్లు, సబ్వేలు మునిగిపోయాయి. విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. విమాన రాకపోకలు ఆలస్యమయ్యాయి. సోమవారం సాయంత్రానికే న్యూయార్క్, వాషింగ్టన్, బాల్టీమోర్, నెవార్క్, న్యూజెర్సీ, వర్జీనియా వంటి అనేక ప్రాంతాలలో వరద హెచ్చరికలు జారీ చేశారు.సాయంత్రమే స్టేటెన్ ఐలాండ్, మాన్హట్టన్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. న్యూయార్క్లో వాహనాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. డ్రైవర్లకు రెస్క్యూ సిబ్బంది సహాయం చేశారు. న్యూజెర్సీలో వరదల కారణంగా బస్సులు, రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఆకస్మిక వరదలు, భారీ వర్షాల కారణంగా న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పౌరులు ఇళ్లలోనే ఉండాలని, అనవసరమైన ప్రయాణాలను నివారించాలని సూచించారు. న్యూజెర్సీలోని కొన్ని ప్రాంతాల్లో 5 అంగుళాల వరకు వర్షం కురిసింది.టెక్సాస్లో 131కి చేరిన మృతులు.. మరోవైపు టెక్సాస్లో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 131కి పెరిగింది. గ్రేటర్ కెర్విల్లే ప్రాంతంలో 97 మంది ఆచూకీ తెలియలేదు. కెర్ కౌంటీ మరణాల్లో దాదాపు మూడింట ఒక వంతు మంది పిల్లలే కావడం గమనార్హం. విమాన కార్యకలాపాలకు అంతరాయం.. తుఫాను కారణంగా సోమవారం ఒక్క రోజే అమెరికా అంతటా విమాన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 10,000 విమానాలు ఆలస్యమయ్యాయి. 1,600 కంటే ఎక్కువ రద్దయ్యాయి. ఫ్లోరిడాను భారీ వర్షాలు ముంచెత్తే అవకావం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇది విమాన రాకపోకలను మరింత ప్రభావితం చేయనుంది.
జాతీయం

కబుర్లు చెప్తా.. కమ్మటి భోజనం పెడతా
లక్నో: అంతరిక్షరంగంలో భారత కీర్తిపతాకను అంతర్జాతీయ అంతరిక్షకేంద్రంలో ఎగరేసి పుడమికి తిరిగొచ్చిన వ్యోమగామి శుభాంశు శుక్లా రాక కోసం లక్నోలో ఆయన కుటుంబం ఎదురుచూస్తోంది. ఈ సందర్భంగా శుక్లా సతీమణి కామ్నా మీడియాతో మాట్లాడారు. ‘‘అద్వితీయమైన ఆయన అంతరిక్ష యాత్ర ముగింపు తర్వాత కుటుంబంతో ఎప్పుడు గడుపుతారా అని మేమంతా ఎదురు చూస్తున్నాం. ఆయన లక్నోకు రాగానే ఇంటి భోజనం రుచి చూపిస్తా. తినలేకపోయిన ఆయనకు ఎంతో ఇష్టమై న వంటకాలను కొసరి కొసరి వడ్డిస్తా’’ మా ఆరేళ్ల అబ్బాయి కియాశ్ సహా కుటుంబం మొత్తం సర దాగా గడుపుతాం’’ అని ఆయన భార్య కామ్నా చెప్పారు. ‘‘ఈయన వెళ్లిన వెంటనే నాకు ఫోన్ చేశా రు. సంభ్రమాశ్చర్యాలకు గురయ్యా. ఆయన గొంతు వినగానే ప్రాణం లేచొచ్చింది. అక్కడ ఆయన చేసిన శాస్త్రసాంకేతిక ప్రయోగాలపైనే మేమిద్దరం మాట్లాడుకున్నాం. భూమికి దూరంగా అంతెత్తులో గడపడం అసాధారణంగా ఉందని నాతో అనేవారు. అక్కడ ఉన్న ఈ 18 రోజుల్లో ఆయనతో జరిపిన ఈ ఫోన్కాల్ సంభాషణలు నా జీవితంలో మర్చిపోలే ను. ఆయన స్వదేశాను గమనం మా కుటుంబానికే కాదు యావత్ దేశానికి గర్వకారణం కావడం నాకెంతో నచ్చింది అని ఆమె అన్నారు.

ఆకాశ్ ప్రైమ్ పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: భారత స్వదేశీ తయారీ గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్టంచేసేలా ఆకాశ్ ప్రైమ్ క్షిపణి పరీక్ష విజయవంతమైందని భారత రక్షణ శాఖ వర్గాలు బుధవారం ప్రకటించాయి. సముద్రమట్టానికి 15,000 అడుగుల ఎత్తులో లద్దాఖ్లో భూతలం నుంచి గగనతల లక్ష్యాలను చేధించే ఆకాశ్ ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించామని రక్షణ వర్గాలు తెలిపాయి. క్షిపణిని అభివృద్ధి చేసిన రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) సహకారంతో లద్దాఖ్ సెక్టార్లో ఈ ప్రయోగపరీక్షలు పూర్తయ్యాయి. గగనంలో వేగంగా భిన్న దిశల్లో కదిలే రెండు లక్ష్యాలను ఆకాశ్ ప్రైమ్ మిస్సైల్ అత్యంత ఖచ్చితత్వంతో చేధించింది. అననుకూల వాతావరణంలోనూ పూర్తి సమర్థతతో పనిచేసి క్షిపణి తన సత్తా చాటింది. భారత సైన్యంలోని మూడో, నాలుగో ఆకాశ్ రెజిమెంట్లో ఈ కొత్త ఆకాశ్ ప్రైమ్ క్షిపణులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆపరేషన్ సిందూర్ వేళ పాకిస్తాన్ నుంచి దూసుకొచ్చిన డ్రోన్లు, క్షిపణులను ఆ ఆకాశ్ ప్రైమ్ క్షిపణి విజయవంతంగా అడ్డుకుని ఇప్పటికే తన సమర్థతను నిరూపించుకుంది. ఆనాడు పాకిస్తాన్కు చైనా తయారీ యుద్ధవిమానాలు, ఇజ్రాయెల్ సరఫరా చేసిన డ్రోన్ల నుంచి పొంచి ఉన్న ముప్పును ఆకాశ్ ప్రైమ్ క్షిపణులు తప్పించాయని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.

వచ్చే నెలలో మోదీ చైనా పర్యటన!
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ వచ్చే నెలలో చైనాలో పర్యటించబోతున్నారు. ఆగస్టు 31, సెపె్టంబర్ 1వ తేదీల్లో చైనాలోని తియాంజిన్ నగరంలో జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారని సమాచారం. 2020 జూన్లో జరిగిన భారత్, చైనా జవాన్ల భీకర ఘర్షణ తర్వాత మోదీ చైనాకు వెళ్తుండడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఆయన చివరిసారిగా 2019లో చైనాలో పర్యటించారు. గల్వాన్ లోయ ఘటన తర్వాత భారత్–చైనా ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయి. సంబంధాలు పునరుద్ధరించుకోవాలని ఇరుదేశాలు భావిస్తున్నాయి. ఈ విషయంలో మోదీ చైనా పర్యటన కీలకమైన ముందడుగు అవుతుందని దౌత్య నిపుణులు అంచనా వేస్తున్నారు. మోదీ చైనా పర్యటన సందర్భంగా చైనా అధినేత షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. చైనాలో ఎస్సీఓ సదస్సు నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా సభ్యదేశాల అధినేలతో మోదీ భేటీ అవుతారు. చైనా పర్యటన కంటే ముందు ప్రధానమంత్రి జపాన్లో పర్యటిస్తారని సమాచారం. మోదీ ప్రధానమంత్రి హోదాలో ఇప్పటిదాకా ఐదు సార్లు చైనాలో పర్యటించారు. దేశ విదేశాల్లో షీ జిన్పింగ్తో 18 సార్లు సమావేశమయ్యారు. మరోవైపు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ మంగళవారం చైనా అధినేత జిన్పింగ్తో భేటీ అయిన సంగతి తెలిసిందే. భారత్–చైనా సంబంధాలపై వారు చర్చించారు.

శుభ సప్తకం
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లోకి అడుగు పెట్టిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా ఘనత సాధించారు. యాగ్జియం –4 మిషన్లో భాగంగా శుభాంశు చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతంగా ముగియటంతో ఇక ఇప్పుడు – ఐఎస్ఎస్లో ఉన్న ఈ 18 రోజుల్లోనూ ఆయన జరిపిన 7 ప్రధాన ప్రయోగాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి మొదలైంది. భారత్ ఎంతో ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తున్న భవిష్యత్ మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్యాన్’కు ఇవి ఎంతో ఉపయుక్తమైనవి కావటం వలన కూడా ఈ ప్రయోగాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తిలో వివిధ జీవ, భౌతిక వ్యవస్థలను అధ్యయనం చేయటానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు వంటి ప్రసిద్ధ భారతీయ పరిశోధన సంస్థలు రూపొందించిన ఆ ప్రయోగాలు ఏమిటో చూద్దాం. 1 టార్డిగ్రేడ్ ఏంటివి?: టార్డిగ్రేడ్లు అంటే నీటి ఎలుగు బంట్లు. ఎనిమిది కాళ్లుండే సూక్ష్మజీవులు. ఇవి అధిక ఉష్ణోగ్రతలు, రేడియేషన్ వంటి తీవ్ర ప్రతికూల పరిస్థితులలో కూడా ఎక్కువ కాలం జీవించగలవు. ఏంటి ఉపయోగం?: టార్డిగ్రేడ్లు అంతరిక్షంలో ఎలా మనుగడ సాగిస్తాయో అర్థం చేసుకోవడం వల్ల అంతరిక్ష కార్యకలాపాల్లో వ్యోమగాముల రక్షణకు కొత్త వ్యూహాలను అభివృద్ధి చేయవచ్చు. శుభాంశు అంతరిక్షంలో భారత జాతి టార్డిగ్రేడ్లపై అధ్యయనం చేసి, అవి ఎలా మనుగడ సాగిస్తాయో, పునరుత్పత్తి చేస్తాయో, సూక్ష్మ గురుత్వాకర్షణకు (మైక్రోగ్రావిటీ) ఎలా స్పందిస్తాయో, రోజులు గడుస్తున్నకొద్దీ వాటిలో వచ్చే మార్పులు (ఏజింగ్ ప్యాటర్న్స్) పరిశీలించారు. ఈ అధ్యయనం వల్ల రక్షణ వ్యూహాలే కాకుండా.. అంతరిక్షంలో ఆహారాన్ని, జీవ నమూనాలను ఎలా నిల్వ చేయవచ్చో తెలుస్తుంది.2 మయోజెనిసిస్ఏంటిది?: మయోజెనిసిస్ అంటే కండరాల్లోని కణాల అభివృద్ధి/పెరుగుదల. దీర్ఘకాలిక అంతరిక్ష యాత్రల సమయంలో వ్యోమగాముల కండరాల బరువు తగ్గుతుంటుంది. తద్వారా కండరాలు బలహీనమవుతాయి.ఏంటి ఉపయోగం?: కండరాల్లో కణాలను సూక్ష్మ గురుత్వాకర్షణలో అధ్యయనం చేసి అవి ఎలా ప్రవర్తిస్తాయో, వాటిలో వచ్చే మార్పులేమిటో శుభాంశు నిశితంగా పరిశీలించారు. సూక్ష్మ గురుత్వాకర్షణలో కండరాల్లో కణాలు ఎలా ప్రవర్తిస్తాయో అర్థం చేసుకోవడం వల్ల వాటి బరువు తగ్గకుండా నివారణోపాయాలను కనిపెట్టటానికి, ఆరోగ్య పరిరక్షణకు ఈ అధ్యయనం తోడ్పడుతుంది.3 విత్తనాల పెరుగుదలఏంటిది?: అంతరిక్షంలోకి శుభాంశు పెసర, మెంతి విత్తనాలు తీసుకెళ్లి ట్రేలలో వాటిని ఉంచారు. ఏంటి ఉపయోగం?: సూక్ష్మ గురు త్వాకర్షణ ప్రభావం మొలకలపైనా, విత్తనాల పెరుగుదలపైనా ఎలా ఉంటుందో అధ్యయనం చేశారు. అంతరిక్షంలో మొక్కలను పెంచడం వల్ల దీర్ఘకాలిక మిషన్లలో వ్యోమగాము లకు స్థిరమైన ఆహార వనరు లభిస్తుంది.4 సైనోబ్యాక్టీరియాఏంటివి?: సైనోబ్యాక్టీరియా అనేవి ఆక్సిజన్ను, పోష కాలను ఉత్పత్తి చేయగల సూక్ష్మజీ వులు. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం భూమిపై మొట్టమొదట ప్రాణ వాయువును ఉత్పత్తి చేసిన జీవులు ఇవి.ఏంటి ఉపయోగం?: సూక్ష్మ గురుత్వాకర్షణలో సైనో బ్యాక్టీరియా ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోవడం ద్వారా అంతరిక్ష కార్యకలాపాల కోసం ‘బయో రీజెనరేటివ్ లైఫ్ సపోర్ట్ వ్యవస్థ’లను అభివృద్ధి చేయవచ్చు. ఉన్న వనరులను రీ సైకిల్ చేసి ఆక్సిజన్, నీరు, ఆహారం వంటి వనరులను తయారు / ఉత్పత్తి చేయటం ద్వారా అంతరిక్షంలో మానవ మనుగడకు సహాయం చేసే కృత్రిమ వ్యవస్థలే ఈ బయో రీజెనరేటివ్ వ్యవస్థలు. ఇవి పర్యావరణ కాలుష్యాన్ని కూడా తగ్గిస్తాయి.5 మైక్రో అల్గేఏంటివి?: మంచినీరు, సముద్ర పర్యావరణ వ్యవస్థలలో కీలక పాత్ర పోషించే సూక్ష్మ, ఏకకణ జల జీవులనే సూక్ష్మ శైవలాలు (మైక్రో ఆల్గే) అంటారు. ఇవి పోషకాలను అందించగల ఆహారంగా స్వీకరించతగిన సూక్ష్మజీవులు. అలాగే బొగ్గు వంటి శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయమైన బయో ఇంధనంగానూ ఉపయోగపడతాయి.ఏంటి ఉపయోగం?: సూక్ష్మ గురుత్వాకర్షణలో సూక్ష్మ శైవలాలు ఎలా పెరుగుతాయో అర్థం చేసుకోవడం, వ్యోమగాములకు స్థిరమైన ఆహార వ్యవస్థలను అభివృద్ధి చేయటం ఈ అధ్యయన లక్ష్యం. అలాగే అంతరిక్షంలో ఇంధన సమస్యల పరిష్కారానికి కూడా ఇది దారి చూపుతుందని భావిస్తున్నారు.6 పంట విత్తనాలుఏంటిది?: ఈ ప్రయోగం ఆహార పంటల విత్తనాలపై సూక్ష్మగురుత్వాకర్షణ ప్రభావాన్ని పరిశీలించింది. ఏంటి ఉపయోగం?: శుభాంశు సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో పంట విత్తనాల పెరుగుదల, దిగుబడులపై అధ్యయనం చేశారు. దీర్ఘకాలిక అంతరిక్ష యాత్రలలో వ్యోమగాములకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించే విధానాలను తెలుసుకోవటానికి ఈ అధ్యయన ఫలితాలు ఉపకరిస్తాయి. 7 వాయేజర్ డిస్ప్లేలుఏంటివి?: కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు. ఈ ప్రయోగంతో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు అంతరిక్షంలో ఎలా పనిచేస్తాయి, వాటి వాడకం వల్ల వ్యోమగాములపై ఎలాంటి ప్రభావం ఉంటుందో శుభాంశు విశ్లేషించారు. ఏంటి ఉపయోగం?: సూక్ష్మ గురుత్వాకర్షణలో కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు వ్యోమగాముల కళ్లు, మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతాయి, ఎన్ని గంటల పాటు వాటిని వినియోగించవచ్చు, అంతరిక్ష అవసరాల కోసం ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు కావాలి.. వంటి విషయాలు తెలుసుకునేందుకు ఈ ప్రయోగం తోడ్పడుతుంది.
ఎన్ఆర్ఐ

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఉత్సవం
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బోనాల పండుగ వైభవంగా జరిగింది. శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో సుమారు 900 మంది భక్తులతో ఈ వేడుకు ఘనంగా జరిగింది. అంతర్జాలం ద్వారా మరో 7,000 మంది వీక్షించారు. తెలంగాణ జానపద గేయాలు, భక్తిగీతాలు, నృత్యప్రదర్శనలు ఉత్సవానికి విశేష ఆకర్షణగా నిలిచాయి.బోయిన స్వరూప, పెద్ది కవిత, సరితా తులా, దీపారెడ్డి, మోతే సుమతి, గంగా స్రవంతి, సంగీత తదితర మహిళలు కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించారు. మొదటి నుంచి చివరి వరకు సాంప్రదాయభరితంగా, సాంస్కృతిక ఘనతతో కొనసాగిన ఈ కార్యక్రమంలో తెలుగు కుటుంబాలు, కార్మిక సోదరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.మహిళలు, చిన్నారులు ఉత్సాహంతో నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. కాళికా అమ్మవారికి వేపచెట్టు రెమ్మలు, పసుపు, కుంకుమతో అలంకరించి, దీపం వెలిగించిన బోనాలను అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పించారు. మట్టి కుండల్లో అన్నం, పాలు, పెరుగు, బెల్లంతో చేసిన బోనాలను తలపై మోస్తూ, డప్పులు, పోతురాజులు, ఆటగాళ్లతో ఆలయానికి తరలివచ్చారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను పంచిపెట్టారు. పెద్దపులి ఆట, పోతురాజు వేషధారణ, సాంస్కృతిక నృత్యాలు కార్యక్రమానికి మరింత ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా సింగపూర్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని నిర్వాహకుడు బోయిన సమ్మయ్య తెలిపారు.బోనాలు తెలంగాణకు ప్రత్యేకమైన సాంప్రదాయక పండుగ అని, తక్కువ సమయంలో పెద్ద ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిచారంటూ సమాజం అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అభినందించారు. ఈ ఏడాది సమాజం సువర్ణోత్సవాలను కూడా ప్రకటించారు. కార్మిక సోదరులు పెద్దఎత్తున హాజరయినందుకు ఉపాధ్యక్షులు పుల్లన్నగారి శ్రీనివాసరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఉపాధ్యక్షులు కురిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి స్పాన్సర్ వజ్ర రియల్ఎస్టేట్కు అభినందనలు తెలిపారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సింగపూర్ తెలుగు సమాజం, అరసకేసరి దేవస్థానం సభ్యులకు, ఆహుతులకు, హాజరైన భక్తులు అందరికీ గౌరవ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.కోశాధికారి ప్రసాద్, ఉపకోశాధికారి ప్రదీప్, ఉపాధ్యక్షులు నాగేష్, మల్లిక్, కార్యదర్శి స్వాతి, కమిటీ సభ్యులు గోపి కిషోర్, జనార్ధన్, జితేందర్, భైరి రవి, గౌరవ ఆడిటర్లు ప్రీతి, నవత తదితరులు ఈ వేడుకలో భాగం పంచుకున్నారని, తెలుగు వారంతా బోనాల స్ఫూర్తితో పాల్గొని మన ఐక్యతను చాటారని నిర్వాహకులు పేర్కొన్నారు.

ట్రంప్కు మరో షాక్.. రాజీనామా యోచనలో కాష్ పటేల్!
ట్రంప్ వీరవిధేయుడు, ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బ్యూటీఫుల్ బిల్లు విషయంలో విభేదాలతో ఎలాన్ మస్క్ డోజ్ను వీడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాష్ పటేల్ కూడా ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో అదే బాటలో పయనించే అవకాశం కనిపిస్తోంది.వాషింగ్టన్: భారత సంతతికి చెందిన కాష్ పటేల్(కశ్యప్ ప్రమోద్ పటేల్) ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారు. ఎఫ్బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో రాజీనామా చేస్తారనే ఊహాగానాల నడుమ.. కాష్ ఈ నిర్ణయం వైపు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. డాన్ రాజీనామా చేసిన వెంటనే తన పదవి నుంచి వైదొలగాలని కాష్ భావిస్తున్నారని స్థానిక మీడియా కథనాలు ఇస్తోంది. ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్లో ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలూ ఉన్నాయి. ఎఫ్బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినోఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారాన్ని అమెరికా న్యాయ విభాగం.. ఎఫ్బీఐ కలిపి విచారిస్తోంది. అయితే ఈ కేసును అటార్నీ జనరల్ పామ్ బాండీకు అప్పగించినప్పటి నుంచి ఎఫ్బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన సెలవులపై వెళ్లారు. అయితే ఆమె ఉండగా తాను తిరిగి విధుల్లోకి రాలేనని బోంగినో ఎఫ్ఐబీకి స్పష్టం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ తరుణంలోనే కాష్ పటేల్ ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బోంగినో గనుక రాజీనామా చేస్తే.. కాష్ తాను పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నారని అక్కడి మీడియా కథనాలు ఇచ్చింది. పామ్ బాండీ‘‘ఈ దర్యాప్తులో పామ్ బాండీ ఉండాలని కాష్ పటేల్ కూడా కోరుకోవడం లేదు. బాండీ మరికొన్ని పత్రాలను విడుదల చేయకపోవడంపైనా ఎఫ్బీఐ వర్గాల్లో తీవ్ర అసహనం నెలకొంది. అందుకే బోంగినో గనుక వీడితే ఆయన కూడా ఎఫ్బీఐని వీడే అవకాశం ఉంది’’ అని ఓ ప్రముఖ జర్నలిస్టు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఎఫ్బీఐకి, డీవోజే(డిపార్ట్మెంట ఆఫ్ జస్టిస్)కు నడుమ పొసగట్లేదన్న విషయాన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ట్రంప్ అనుచరురాలు లారా లూమర్ సైతం ధృవీకరించడం గమనార్హం. పారదర్శకత లోపించిందనేది ప్రధాన ఆరోపణతో ఎఫ్బీఐ వర్గాలు బాండీ తీరుపట్ల అసంతృప్తిగా ఉన్నాయంటూ లూమర్ తెలిపారు. ఈ క్రమంలో బాండీని.. బ్లోండీ అంటూ ఆమె ఎద్దేవా చేయడం గమనార్హం. ప్రముఖ ఇన్వెస్టర్ అయిన ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఫైల్స్ ఇప్పటిదాకా బయటకు రాకపోవడంతో అమెరికా రాజకీయాల్లో, మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. అయితే.. ఎప్స్టీన్ ఫైల్స్లో.. ప్రముఖుల పేర్లు ఉన్నాయని, వాటిని త్వరలోనే బయటపెడతామని ఫిబ్రవరిలో ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పామ్ బాండీ ప్రకటించారు. అయితే తాజాగా డీవోజే-ఎఫ్బీఐ సంయుక్తంగా విడుదల చేసిన మెమోలో.. ఎలాంటి ఆధారాల్లేవని, కేసును ముగించినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బాండీ మాటమార్చి.. తన గత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఒకవైపు ఎలాన్ మస్క్ సైతం ఈ వ్యవహారంపై ట్రంప్ ప్రభుత్వానికి చురకలంటిస్తున్నారు. మరోవైపు ట్రంప్ ఈ వ్యవహారంపై తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటిదాకా ఎఫ్బీఐ వర్సెస్ జ్యూడీషియల్ డిపార్టెమెంట్ వ్యవహారంపై వైట్హౌజ్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇంకోవైపు మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA) ఉద్యమకారులు సైతం ఈ పరిణామాలపై అసంతృప్తితో రగిలిపోతున్నారు.కశ్యప్ పూర్వీకులు భారత్లోని గుజరాత్ నుంచి వలస వెళ్లారు. అతడి తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. ఉగాండా నుంచి అమెరికాకు వలస వచ్చారు. 1980లో న్యూయార్క్లో కశ్యప్ జన్మించారు. యూనివర్శిటీ ఆఫ్ రిచ్మాండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ లండన్లో న్యాయవిద్యను పూర్తి చేశారు.అనంతరం మియామీ కోర్టుల్లో లాయర్గా వివిధ హోదాల్లో సేవలందించారు. ఆ సమయంలోనే ట్రంప్కు ఆయన దగ్గరయ్యారు. ఫిబ్రవరి 22వ తేదీన ఎఫ్బీఐ 9వ డైరెక్టర్గా కాష్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో పామ్ బాండీ కాష్తో ప్రమాణం చేయించగా.. భగవద్గీత మీద చేయి ఉంచి ఆయన బాధ్యతలు చేపట్టారు.

యూఎస్కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్!
కూటి కోసం కోటి తిప్పలు..ఇది సగటు మనిషి ఆలోచన. మెరుగైన జీవితం కోసం డాలర్ డ్రీమ్స్ ఎందరివో. విదేశాలకు వెళ్లాలి. డాలర్లలో సంపాదించాలి అనేది లెక్కలేనంతమంది భారతీయు యువతీ యువకుల ఆశ, ఆశయం. కానీ డాలర్ డ్రీమ్స్ ఇపుడు మసక బారుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువమంది భారతీయ టెకీలు నివసించే అమెరికాలోరోజు రోజుకీ మారుతున్న పరిణామాలు భారతదేశానికి తిరిగి పయనమయ్యేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్డిట్లో అమెరికాలో ఉంటున్న ఒక యువజంట పోస్ట్ వైరల్గా మారింది. ఈ జంట గత 15 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తోంది. వీరి ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) హోదాను కలిగి ఉన్నారు, ఇది వారికి ఏ దేశంలోనైనా నివసించడానికి, పని చేయడానికి వెసులుబాటునిస్తుంది. కుమారుడికి కూడా అమెరికా పౌరసత్వం ఉంది. ముగ్గురు సభ్యుల ఫ్యామిలీ ఇండియాకు తిరిగి రావాలని ప్లాన్ చేస్తోంది. ‘‘మేం ఇద్దం 30ల్లో ఉన్నాం. టెక్నాలజీ, ఇక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భారతదేశానికి తిరిగి వెళ్లాలని భావిస్తున్నాం. ఒక ముగ్గురు సభ్యులున్న కుటుంబం ఇండియాలో బతకాలంటే రూ. 25 కోట్లు సరిపోతాయా... రిటైర్ మెంట్ తరువాత పిల్లలను పెంచుకుంటూ, హ్యాపీగా జీవించాలి అసలు ఎంత కావాలి దయచేసి తెలపండి’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇండియాకు వెళ్లాక కొంతకాలం విరామం తీసుకోవచ్చు. ఆ తరువాత ఇంట్రస్ట్ను బట్టి ఉద్యోగాలు వెదుక్కుంటాం. కానీ అది మా జీవితాలను ప్రభావితం చేయకూడదని పేర్కొన్నారు. దాదాపు 5.5 మిలియన్ల డార్లు (సుమారు రూ. 47.21 కోట్లు) ఉన్నాయంటూ తమ ఆస్తులకు సంబంధించిన వివరాలను కూడా అందించారు.రెడ్డిటర్లు ఈ పోస్ట్పై స్పందించారు. అది మీరుండే నగరం, ఇల్లు,అలవాట్లు, జీవన శైలిసహా అనేక అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని కొందరు సాధారణంగా భారతీయ నగరంలో జీవించడానికి రూ. 25 కోట్లు సరిపోతాయని మరి కొందరు చెప్పగా, టైర్ 2 స్మార్ట్/బాగా అభివృద్ధి చెందిన నగరంలో నివసిస్తుంటే ప్రామాణిక ఖర్చులు అద్దె, ఆహారం, కొన్ని అవసరమైన వస్తువులు సహా 75 వేల రూపాయలు సరిపోతాయి. సొంత ఇల్లు ఇంకా మంచిది. పిల్లవాడికి ఒక మాదిరి స్కూలు ఫీజు నెలకు 30-50 వేలు చాలు. నికరంగా ఒక స్టాండర్డ్ లైఫ్కి నెలకు 2 లక్షలు బేషుగ్గా సరిపోతాయి రెండు మూడేళ్ల తరువాత ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుంటే చాలు అని ఒకరు వివరించారు. (Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!)ముగ్గురే కాబట్టి ఇక్కడ సౌకర్యవంతంగా బతకాలంటే జీవనశైలి బట్టి నెలకు కనీసంగా రూ. 4 లక్షలు, గరిష్టంగా రూ. 8 కోట్లు సరిపోతాయని లెక్కలు చెప్పారు. మరో యూజర్ ఏమన్నారంటే.. "నేను ఇటీవల భారతదేశంలో (ముఖ్యంగా బెంగళూరులో) కొంత సమయం గడిపాను. US కి దగ్గరగా జీవించాలనుకుంటే ఇండియాచాలా ఖరీదైనది. US సబర్బన్ లాంటి, బెంగళూరులోని ఆదర్శ్, బ్రిగేడ్ లేదా ప్రెస్టీజ్ వంటి కొన్ని ప్రీమియర్ గేటెడ్ కమ్యూనిటీలు 2000 చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో రూ. 5 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అవుతాయి కానీ మీరు ఇంతకంటే చవగ్గా కూడా బతకొచ్చు. కాబట్టి మూడు మిలియన్ డాలర్లు సరిపోతాయా లేదా అనేది మీమీదే ఆధారపడి ఉంటుదని మరొకరు వ్యాఖ్యానించారు.అంతేకాదు “ఇండియాలో ట్రాఫిక్, దుమ్ము, కాలుష్యం, అవినీతి, శాంతిభద్రతల సమస్యలు, వేడి, నీటి కొరత లాంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.” అని మరో రెడ్డిటర్ వ్యాఖ్యానించాడు.ఇదీ చదవండి: Lishalliny Kanaran : భారతీయ పూజారిపై మిస్ గ్రాండ్ మలేషియా సంచలన ఆరోపణలు!

లండన్లో వైభవంగా 'టాక్' బోనాల జాతర వేడుకలు
లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల కుయుకే నలుమూలల నుండి సుమారు 2000కి పైగా ప్రవాసీయులు హాజరయ్యారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. వ్యాఖ్యాతలుగా ఉపాధ్యక్షులు సురేష్ బుడగం, కమ్యూనిటీ అఫైర్స్ ఛైర్ పర్సన్ గణేష్ కుప్పాల, కార్యదర్శి శైలజా జెల్ల వ్యవహరించారు. ముఖ్య అతిదులుగా పార్లమెంటరీ అండర్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ (మైగ్రేషన్ & సిటిజన్ షిప్) సీమా మల్హోత్రా, మాజీ ఎంపీ వీరేంద్రశర్మ, హౌంస్లౌ నగర మేయర్ అమీ క్రాఫ్ట్, అతిదులుగా కెన్సింగ్టన్ అండ్ చెల్సియా డిప్యూటీ మేయర్ ఉదయ్ ఆరేటి ఎంపీ కంటెస్టెంట్ ఉదయ్ నాగరాజు, స్థానిక కౌన్సిలర్లు ప్రభాకర్ ఖాజా, అజమీర్ గ్రేవాల్, ప్రీతమ్ గ్రేవాల్, బంధన చోప్రా పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, యూకే తెలుగు బిజినెస్ ఛాంబర్ డైరెక్టర్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, తొట్టెల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా అనిల్ కూర్మాచలం అందరికీ బోనాలు (Bonalu) శుభాకాంక్షలు తెలిపారు. టాక్ కార్యక్రమాలు గొప్పగా ఉన్నాయని అభినందించారు. మన రాష్ట్ర పండగని మరింత వైభవంగా తెలంగాణలో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.టాక్ సంస్థ అద్యక్షులు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో ఉన్న తెలంగాణా బిడ్డల కోసం చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించి, అందరు ఇందులో బాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు సంస్థను నడిపిస్తున్న ఎమ్మెల్సీ కవితకు కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ సంస్థ ద్వారా ఆడబిడ్డలందరు బోనాలతో సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న తీరు నూతన ఉత్సాహాన్ని నింపిందంటూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. సంస్థ భవిష్యత్తు కార్యక్రమాలను ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి వివరించారు.ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు మాట్లాడుతూ బోనాల జాతర ఇంతటి విజయం సాదించడం సంతోషంగా ఉందని తెలిపారు. టాక్ వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం తన సహకారం వల్లే ఇంత ఘనంగా సంబరాలు నిర్వహించుకోవడం సంతోషమన్నారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షులు, టాక్ జాతీయ కన్వీనర్ నవీన్ రెడ్డి తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాక బోనాలు -బతుకమ్మ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారన్నారు.బోనాల జాతర వేడుకల విజయానికి కృషి చేసిన సహకరించిన స్థానిక ప్రభుత్వ యంత్రాంగానికి, టాక్ కార్యవర్గానికి, స్థానిక సంస్థలకు, అతిధులకు, అలాగే హాజరై ప్రోత్సహించిన ఎన్నారై మిత్రులకు టాక్ అడ్వైజరీ చైర్మన్ మట్టా రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే మాజీ అధ్యక్షులు, టాక్ జాతీయ కన్వీనర్ అశోక్ గౌడ్ దూసరి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. ఈవెంట్ స్పాన్సర్స్ అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ ఎగ్జిక్యూటివ్ టీం జ్ఞాపికలతో సత్కరించింది.ఈ కార్యక్రమంలో, పవిత్ర, సత్య చిలుముల, మట్టా రెడ్డి, సురేష్ బుడగం, రాకేష్ పటేల్, సత్యపాల్ రెడ్డి పింగిళి, రవి రేతినేని, రవి ప్రదీప్ పులుసు, మల్లా రెడ్డి, గణేష్ పాస్తాం, శ్రీకాంత్, నాగ్, శ్రీధర్ రావు, శైలజ,స్నేహ, విజయ లక్ష్మి, శ్వేతా మహేందర్, స్వాతీ, క్రాంతి, శ్వేత శ్రీవిద్య, నీలిమ, పృద్వి, మణితేజ, నిఖిల్ రెడ్డి, హరిగౌడ్, రంజిత్, రాజేష్ వాక, మాధవ రెడ్డి, అంజన్, తరుణ్ లూణావత్, సందీప్, ఆనంద్, లత, పావని, జస్వంత్, మాడి, ప్రశాంత్, వినోద్ నవ్య, ఉమా, తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్

కదులుతున్న కారులో మహిళపై గ్యాంగ్రేప్
జైపూర్: రాజస్తాన్లోని అల్వార్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఏడుగురు దుండగులు ఓ మహిళను అపహరించి, సామూ హిక అత్యాచారానికి పాల్పడ్డారు. కారులో ప్రయాణిస్తూ ఒకరి తర్వాత ఒకరు రేప్ చేశారు. 11 రోజులపాటు బాధితురాలిని నిర్బంధించారు. చివరకు రోడ్డు పక్కన వది లేసి వెళ్లిపోయారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. బాధితురాలి భర్త ఫిర్యాదు ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ 24న రాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళను ముగ్గురు వ్యక్తులు అపహరించారు. బొలేరో వాహనంలో బలవంతంగా ఎక్కించి తీసుకెళ్లారు. వాహనంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన మహిళపై దాడికి దిగారు. నోట్లో గుడ్డలు కుక్కారు. గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మరో నలుగురు ఉన్నారు. 11 రోజులు అక్కడే నిర్బంధించారు. ఏడుగురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు. బాధితురాలిని నగ్నంగా మార్చి అభ్యంతకరంగా వీడియోలు చిత్రీకరించారు. పోలీసులకు చెబితే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని హెచ్చరించారు. రూ.3 లక్షల ఇస్తామని, నోరు మూసుకోవాలని చెప్పారు. అపస్మారక స్థితికి చేరిన బాధితురాలిని రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారు. స్థానికుల సాయంతో ఆమె తన ఇంటికి చేరుకున్నారు.

కూతురి గొంతు నులిమి చంపేసిన తల్లిదండ్రులు
ఒంగోలు టౌన్: క్షణికావేశానికి గురైన తల్లిదండ్రులు కుమార్తె గొంతు నులిమి చంపేయడం సంచలనం సృష్టించింది. ఒంగోలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ముంగమూరు రోడ్డులోని విలేకరుల కాలనీ 1వ లైనులో నివశించే పల్నాటి రమేష్, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురికి వివాహం చేసి అత్తారింటికి పంపించారు. చిన్న కుమార్తె తనూష (23) డిగ్రీ చదివి హైదరాబాద్లోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసింది. కొద్దిరోజులుగా ఒంగోలులోనే తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఒంగోలుకు చెందిన పెళ్లయి పిల్లలున్న ఒక వ్యక్తిని తనూష ప్రేమించింది. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలో తనూషకు, తల్లిదండ్రులు రమేష్, లక్ష్మికి మధ్య మంగళవారం రాత్రి వివాదం జరిగింది. క్షణికావేశానికి గురైన రమేష్, లక్ష్మి తనూష గొంతును బలంగా నులిమారు. ఊపిరాడని తనూష ప్రాణం వదిలింది. కాసేపటికి తేరుకున్న రమేష్, లక్ష్మి భయాందోళనకు గురయ్యారు. ఎవరికీ తెలియకుండా కుమార్తె మెడకు చున్నీ బిగించి ఫ్యానుకు వేలాడదీశారు.రాత్రి 11.30 గంటల సమయంలో ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుందని, కరెంటు లేకపోవడంతో సకాలంలో తాము గమనించలేదంటూ సీన్ క్రియేట్ చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగప్రవేశం చేసిన పోలీసులు తనూష మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించారు. తల్లిదండ్రుల వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన తీరులో విచారణ జరపగా.. అసలు విషయం బయటపడింది. సీఐ విజయకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బెజవాడలో జంట హత్యలు
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): విజయవాడ నగరంలో పట్టపగలు ఇద్దరు వ్యక్తులను ఓ రౌడీషీటర్ హత్య చేశాడు. మద్యం మత్తులో డబ్బుల కోసం గొడవపడి.. ఇద్దరిని కత్తితో పొడిచి చంపేశాడు. విజయవాడ గవర్నర్పేటలోని అన్నపూర్ణ థియేటర్ సమీపంలో రౌడీషీటర్ జమ్ము కిశోర్, ఎం.రాజు(37), గాదె వెంకట్(25) మూడు నెలలుగా అద్దెకు ఉంటున్నాడు. కిశోర్, రాజు విజయవాడకు చెందిన వారు కాగా.. గాదె వెంకట్ విజయనగరానికి చెందిన వ్యక్తి. బుధవారం మధ్యాహ్నం ముగ్గురూ తమ గదిలో ఫుల్గా మద్యం సేవించారు. ఆ సమయంలో డబ్బుల విషయమై ముగ్గురి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రాజు, వెంకట్ను కిశోర్ కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న రాజు, వెంకట్ను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకుసమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కిశోర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కిశోర్పై ఎనిమిది కేసులు ఉన్నట్లు వెల్లడించారు. 2001లో హత్య కేసుతో తొలిసారి పోలీస్ రికార్డుల్లోకి ఎక్కిన కిశోర్పై అదే ఏడాది రౌడీషీట్ తెరిచినట్లు తెలిపారు.

అనిల్ హత్య వెనుక టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మనవడు?
సాక్షి టాస్క్ఫోర్స్/సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ మెదక్ జోన్/కొల్చారం: మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మారెల్లి అనిల్ కుమార్ హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య వెనుక వైఎస్సార్ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మనవడి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం హైదరా బాద్లో పార్టీ సమావేశానికి హాజరై తిరిగి వెళ్తుండగా మెదక్ జిల్లా ఘన్పూర్ శివారులో రెండు కార్లలో వచ్చిన దుండగులు అనిల్పై కాల్పులు జరిపి హత్య చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మన వడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.ఆపై సెటిల్మెంట్లు.. దందాలు మొదలుపెట్టారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పేరుతో ఏపీలోని ప్రొద్దుటూరు, బద్వేలు, నాగులపల్లె, దర్శి ప్రాంతాల్లోని సన్నిహితుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. వారికి నమ్మకం కలిగించేందుకు కొన్ని ప్లాట్లను ఆయా వ్యక్తుల పేర్ల మీద ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ విషయం బయటపడటంతో దర్శి ప్రాంతానికి చెందిన వ్యక్తులు.. ఎమ్మెల్యే మనవడిని నిలదీ శారు. తమకు డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యవహారాల నేపథ్యంలో ఓ సెటిల్మెంట్కు సంబంధించి అనిల్కు ఆ ఎమ్మెల్యే మనవడు దాదాపు రూ.కోటి ఇవ్వాల్సి ఉన్నట్లు తెలిసింది.డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో బెంజ్ కారు అప్పగించినట్లు సమాచారం. రోజులు గడుస్తున్నా ఆ డబ్బులు చెల్లించకపోవడంతో ఎమ్మెల్యే మనవడిని అనిల్ పరుష పదజాలంతో దూషించినట్లు తెలిసింది. దీన్ని ఎమ్మెల్యే మనవడు తీవ్ర అవమానంగా భావించి.. ఓ మాజీ నక్సలైట్కు సుపారీ, ఆయుధం ఇచ్చి అనిల్ను హత్య చేయించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లుఅనిల్ హత్యలో ఏపీకి చెందిన కొందరు ప్రత్యక్షంగా పాల్గొన్నారని, నేరం చేసిన తర్వాత అక్కడికే పారిపోయారని తెలిసింది. ఇందులో తన మనవడి పాత్ర వెలుగులోకి వస్తుండటంతో ఆ సీనియర్ ఎమ్మెల్యే చక్రం తిప్పారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఆయన సోదరుడి కుమారుడు రంగంలోకి దిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణలో రాజకీయ పెద్దలతో తనకున్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకుని.. ఇక్కడి పోలీసులపై ‘పెద్ద’ స్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నట్టు సమాచారం.కేసును తొక్కిపెట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే రెండు రోజులుగా దర్యాప్తు నత్తనడకన నడుస్తున్నట్లు సమాచారం. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొంటున్న పోలీసులు.. ఎలాంటి పురోగతిని సాధించలేకపోతున్నారు. దీనికి రాజకీయ ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది. కాగా, అనిల్ అంత్యక్రియలు బుధవారం ఆయన స్వగ్రామం పైతరలో జరిగాయి. అదుపులో నిందితులు?సీనియర్ ఎమ్మెల్యే మనుమడి వద్ద విల్లా కొనుగోలు చేసిన రామచంద్రారెడ్డి అనే వ్యక్తిని మెదక్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అతడిని జీడిమెట్ల పోలీస్స్టేషన్లో విచారిస్తున్నట్లు సమాచారం. అనిల్తో పరిచయాలపై ఆరా తీసినట్లు తెలిసింది. అనిల్ గతంలో పలు తగాదాల్లో ఉన్న భూములను సెటిల్మెంట్లు చేశాడని, అందుకే విల్లాకు సంబంధించిన గొడవ తనకు చెప్పటంతో రూ.2 కోట్లకుగాను రూ.1.20 కోట్లు వసూలు చేశాడని పోలీసులకు వివరించినట్లు తెలిసింది. కాగా అనిల్పై కాల్పులు జరిపిన నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంపై మెదక్ డీఎస్పీని వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. లేరంటూ సమాధానం దాటవేశారు.