Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Tsunami Hits Russia And Japan After Strongest Earthquake Updates1
రష్యా, జపాన్‌పై విరుచుకుపడిన సునామీ.. భారతీయులకు హెచ్చరిక

మాస్కో: రష్యా తీరంలో భారీ భూకంపం అనంతరం.. రష్యా, జపాన్‌ను సునామీ తాకింది. పెద్ద ఎత్తున అలలు ఎగిసి పడుతున్నాయి. ఉత్తర పసిఫిక్‌లోని పలు తీర ప్రాంతాలను సునామీ (Tsunami) తాకింది. ఇక, అంతకుముందు.. రష్యాలో రిక్టర్ స్కేల్‌పై 8.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. జపాన్‌ వాతావరణ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. 2011 తర్వాత పసిఫిక్ ప్రాంతంలో‌ ఇంతటి స్థాయిలో భూకంపం తాజాగా వచ్చినట్టు పేర్కొంది. ఈ క్రమంలోనే రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంతో పాటు జపాన్‌కు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. భారతీయులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.రష్యాలో 8.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో శాన్‌ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్‌ అప్రమత్తమైంది. అనంతరం, ట్విట్టర్‌ వేదికగా.. అమెరికాలోని కాలిఫోర్నియా సహా పశ్చిమ రాష్ట్రాల్లో నివసిస్తున్న భారతీయులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సునామీ ముప్పును శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ జనరల్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. కాలిఫోర్నియా, హవాయితో పాటు అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాల్లో నివసిస్తున్న భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అమెరికా అధికారులు జారీ చేసే అలర్ట్‌లను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పాటించాలి. సునామీ హెచ్చరికలు జారీ అయితే.. వెంటనే ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లండి. తీర ప్రాంతాలకు దూరంగా ఉండండి. అత్యవసర పరిస్థితికి సిద్ధమవ్వండి. మీ ఎలక్ట్రానిక్‌ పరికరాలకు ఛార్జింగ్ ఉండేలా చూసుకోండి. సాయం కోసం ఎమర్జెన్సీ నంబర్లను సంప్రదించండి. అమెరికా అధికారులు ఇచ్చే సూచనలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. వాటిని పాటించాలని హెచ్చరికలు జారీ చేసింది.🚨🚨🚨The Consulate General of India in San Francisco is monitoring the potential tsunami threat following the recent 8.7 magnitude earthquake off Russia's Kamchatka Peninsula. Indian nationals in California, other US West Coast states, and Hawaii are advised to take the…— India in SF (@CGISFO) July 30, 2025ఇదిలా ఉండగా.. జపాన్ వాతావరణ సంస్థ హక్కైడో తూర్పు తీరంలోని నెమురోకు దాదాపు 30 సెంటీమీటర్ల (సుమారు 1 అడుగు) ఎత్తులో మొదటి సునామీ అల చేరిందని తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు.. జపాన్‌లోని నాలుగు పెద్ద దీవులకు ఉత్తరాన ఉన్న హక్వైడో నుంచి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రానున్న మూడు గంటల్లో రష్యా, జపాన్‌ తీర ప్రాంతాల్లో పెద్దఎత్తున సునామీ అలలు రావొచ్చని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే(యూఎస్‌జీఎస్‌) పేర్కొంది. అలస్కా అలూటియన్‌ దీవులలోని కొన్ని ప్రాంతాల్లో సునామీ ప్రభావం ఉంటుందని అలస్కా జాతీయ సునామీ కేంద్రం హెచ్చరించింది. కాలిఫోర్నియా, ఒరెగాన్‌, వాషింగ్టన్‌, హవాయితో సహా పలు ప్రాంతాలను అప్రమత్తం చేసింది.pic.twitter.com/iD520Gt6kS A Massive Earthquake triggers a Tsunami, taking thousands of lives in seconds with little to no warning. #Russia #Tsunami #japan #earthquake— Made on Earth by Humans (@1singdollar) July 30, 2025ధైర్యంగా ఉండండి: ట్రంప్‌మరోవైపు, తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ‘పసిఫిక్‌ మహా సముద్రంలో భారీ భూకంపం కారణంగా హవాయి ప్రాంతానికి సునామీ అలర్ట్‌ జారీ అయ్యింది. అమెరికాలోని పసిఫిక్ తీర ప్రాంతాలకూ ముప్పు పొంచి ఉంది. ప్రజలంతా ధైర్యంగా ఉండండి. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లండి. అధికారుల సూచనలను ఎప్పటికప్పుడు పాటించండి’ అని అధ్యక్షుడు సూచించారు.#ÚltimaHora - #Tsunami golpeando las costas de #Kamchatka, Rusia🇷🇺Los tsunamis son una secuencia de olas y no siempre las primeras olas son las más grandes. pic.twitter.com/aBgpkukOUX— SkyAlert (@SkyAlertMx) July 30, 2025ఇప్పటివరకు ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన ఎలాంటి సమాచారం తెలియలేదు. భూప్రకంపనల నేపథ్యంలో పెట్రోపావ్లోవ్స్క్‌-కామ్చాట్కా నగరంలోని భవనాలు కంపించాయని రష్యా మీడియా తెలిపింది. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీసినట్లు తెలిపింది. కమ్చాట్కా ప్రాంతంలో విద్యుత్‌, సెల్‌ఫోన్‌ సేవల్లో అంతరాయాలు ఏర్పడినట్లు తెలిపింది. భవనాలు అత్యవసర సేవల కోసం ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసినట్లు జపాన్‌ ప్రభుత్వం పేర్కొంది.🚨 BREAKING - Shocking footage of the moment M8.8 earthquake shit the the coast of the Kamchatka Peninsula, East of Russia#Earthquake #Tsunami #Russia #Hawaii #Alert pic.twitter.com/FKnqm6nRdL— T R U T H P O L E (@Truthpolex) July 30, 2025హవాయి, చిలీ, జపాన్, సోలమన్ దీవుల తీరప్రాంతాలలో అలల స్థాయి కంటే 1 నుండి 3 మీటర్ల ఎత్తులో ఎగసిపడే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. రష్యా, ఈక్వెడార్‌లోని కొన్ని తీరప్రాంతాలలో 3 మీటర్ల కంటే ఎక్కువ అలలు ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది.

YSRCP Social Media Post Against Chandrababu And Singapore2
చంద్రబాబుకు సింగపూర్‌ ‘నో’ చెప్పింది.. తట్టుకోలేకపోతున్న చిట్టిబాబు..

సాక్షి, అమరావతి: రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టుకు సింగపూర్‌ కన్సార్షియం పేరుతో చంద్రబాబు, ఆయన బినామీల దోపిడీ బాగోతాన్ని సాక్ష్యాధారాలతో రట్టు చేస్తూ ‘ఎక్స్‌’లో వైఎస్సార్‌సీపీ మంగళవారం పోస్టు చేసింది. ‘గతంలో 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి తక్కువ ధరలకే రైతుల నుంచి భూములు కాజేసింది.రాజధానిలో రూ.లక్ష కోట్లు దోచుకున్న చంద్రబాబు అండ్‌ గ్యాంగ్‌ రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు పేరుతో అదేస్థాయి దోపిడీకీ బరితెగిస్తూ సింగపూర్‌ కన్సార్షియంతో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.18,221.9 కోట్ల పెట్టుబడి పెట్టే ప్రభుత్వానికి స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టులో వచ్చే ఆదాయం 8.7 శాతం, అదే పెట్టుబడి పెట్టే చంద్రబాబు బినామీలతో కూడిన సింగపూర్‌ కన్సార్షియంకు వచ్చే ఆదాయం 91.3 శాతం. ఇది కుంభకోణం కాదా!’ అని వైఎస్సార్‌సీపీ నిలదీసింది. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో ఈ కుంభకోణం గుట్టురట్టవుతుందని, అంతర్జాతీయంగా అప్రతిష్ట పాలవుతామన్న భయంతో సింగపూర్‌ సంస్థల కన్సార్షియం ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని 2019 అక్టోబర్‌ 30న ప్రభుత్వాన్ని కోరింది.సింగపూర్‌ సంస్థల కన్సార్షియం అభ్యర్థన మేరకు ఆ ఒప్పందాన్ని ప్రభు­త్వం రద్దు చేసిందని వైఎస్సార్‌సీపీ గుర్తు చేసింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పునరుద్ధరణకు సింగపూర్‌ సంస్థ కన్సార్షియం ముందుకు రాకపోవడంతో తన దోపిడీకి అడ్డుకట్ట పడిందన్న అక్కసుతో చంద్రబాబు గ్యాంగ్‌ యథావిధిగా దుష్ప్రచారం చేస్తోందని పేర్కొంది. అవినీతి చక్రవర్తి సీబీఎన్‌తో కలవలేమని సింగపూర్‌ చెప్పడంతో తట్టుకోలేక చిట్టిబాబు ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీలు పిచ్చెక్కి ఊగిపోతున్నాయని, బాబుతో ‘నో’ అంటూ సింగపూర్‌ మంత్రి ప్రకటన తర్వా­త తెలుగు దొంగల పార్టీ సోషల్‌ సైకోల వికృ­త, విచిత్ర, ఉన్మాద విన్యాసాలు, కట్టుకథలు, తప్పుడు ప్రచారాలతో మొదలెట్టేశాయంది. అమరావతి స్టార్టప్‌ ప్రాజెక్టుం సింగపూర్‌ పేరుతో బాబు అవినీతి కథలో పాత్రలు, పాత్రధారులతో సహా వాస్తవాలను 14 పాయింట్లతో వైఎస్సార్‌సీపీ ‘ఎక్స్‌’లో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. వైఎస్సార్‌సీపీ ట్విట్టర్‌ వేదికగా.. అమరావతి స్టార్టప్‌ ప్రాజెక్టు… సింగపూర్‌ పేరుతో బాబు అవినీతి కథలో పాత్రలు, పాత్రధారులు.. వాస్తవాలు ఇవీ:తెలుగు దొంగల పార్టీ అధినేత, స్కాముల రారాజు చంద్రబాబును చూసి ఏకంగా దేశాలే బెంబేలెత్తిపోతున్నాయి. అమరావతి పేరిట చంద్రబాబు దోపిడీని చూసి ఇప్పుడు సింగపూర్‌ కూడా ఆ మరక మాకొద్దని ససేమిరా అంది. అమరావతి పునాదులను కుంభకోణాలు, స్కాంలతో మొదలుపెట్టిన చంద్రబాబు, ఇప్పుడు కూడా దాన్ని కొనసాగిస్తుండడంతో చంద్రబాబు ప్రతిపాదనలకు నో అంటూ ఆయన ముఖంమీదే సింగపూర్‌ చెప్పేసింది. దయచేసి తమను ఆ గబ్బులోకి లాగొద్దని చెంప చెళ్లుమనిపించేలా తన వైఖరిని స్పష్టంచేసింది. నీకో నమస్కారం అంటూ దండం పెట్టేసింది. 2018లో అమరావతి పేరిట చంద్రబాబు మొదలుపెట్టిన అవినీతి ఇప్పుడు కూడా జోరుగా సాగుతుండడం సింగపూర్‌ సర్కార్‌ దృష్టిలోనే ఉంది. దీనికి సాక్ష్యంగా తమదేశానికి చెందిన మాజీ మంత్రి, చంద్రబాబుకు సన్నిహితుడు ఈశ్వరన్‌ జైలుపాలైన సంగతిని వాళ్లింకా మరిచిపోలేదు.మరోవైపు 2018 నాటి అంచనాలను విపరీతంగా పెంచి, అమరావతిలో రెండో దఫా దోపిడీకి చంద్రబాబు చేస్తున్న స్కాంలు కూడా సింగపూర్‌ ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. అమరావతిలో భూమి ప్రభుత్వానిది అయినా, ఇసుక ఉచితం అయినా, నిర్మాణ ఖర్చులు 2018తో పోలిస్తే పెరుగుదల లేకపోయినా భారీగా అంచనాలు పెంచి దోచేస్తున్న తీరుతో ఈ అవినీతి వ్యవహారంలోకి అడుగుపెట్టలేమని చెప్పేసింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చదరపు అడుగుకు సుమారు రూ.9 -10వేలు ఖర్చు చేస్తున్న తీరుపై, ఆరేట్లు చూసి వాళ్లే దిగ్భ్రాంతి చెందారని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. అందుకనే బాబు అంటేనే భయపడుతున్నాయి. 💣Truth Bomb 💣Must Read ❗అవినీతి చక్రవర్తి @ncbn తో కలవలేమన్న సింగపూర్‌తట్టుకోలేక పిచ్చెక్కి ఊగిపోతున్న చిట్టిబాబు ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీలు బాబుతో నో అంటూ సింగపూర్‌ మంత్రి ప్రకటన తర్వాత కట్టు కథలు, తప్పుడు ప్రచారాలుతెలుగు దొంగలపార్టీ సోషల్‌ సైకోల వికృత, విచిత్ర, ఉన్మాద… pic.twitter.com/MrzRYFxB8S— YSR Congress Party (@YSRCParty) July 29, 2025వాస్తవం ఏంటేంటే.. సింగపూర్‌ పేరు చెప్పి చంద్రబాబు చెప్పిన అవినీతి కథ ఏంటంటే?1.అమరావతిలో కోర్‌ క్యాపిటల్ ఏరియా 1691 ఎకరాలు. దీని అభివృద్ధి పేరిట చంద్రబాబు వేలకోట్ల అవినీతికి తెరలేపాడు. 2. ఈ 1691 ఎకరాల్లో ల్యాండ్‌ డెవలప్‌ మెంట్‌ కోసం 2018లో ఏపీ ప్రభుత్వం నుంచి CRDA మరియు అమరావతి డెవలప్‌మెంట్‌ పార్టనర్స్‌ లిమిటెడ్‌కు ఒప్పందం కుదిరింది. 3.అమరావతి డెవలప్‌మెంట్‌ పార్ట్నర్స్‌లో సింగపూర్‌ కంపెనీలు అసెండాస్‌ సింగ్‌ బ్రిడ్జ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సెమ్‌కార్ప్‌ ప్రైవేట్‌ లిమిటెడ్లు ఉన్నాయి. ఇవి కన్సార్షియంఏర్పడ్డాయి. ఈ కన్సార్షియం చంద్రబాబు బినామీలతో కూడిన క్యాపిటల్ సిటీ డెవలప్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ CCMDC ని చంద్రబాబు ఉద్దేశ పూర్వకంగా చొరబడేలా చేశాడు. ( అఫీషియల్‌ డాక్యుమెంట్‌ చూడొచ్చు)4.ఉద్దేశ పూర్వకంగా ఈ కంపెనీలకు అప్పగించడానికి స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిని ఎంపిక చేశారు. అంటే ఒక ప్రాజెక్టు ఆలోచన వాళ్లు చేస్తారు, ఎంత ఆదాయం ఇస్తామో వాళ్లే ప్రభుత్వానికి చెప్తారు, అంతకంటే ఎక్కువ ఇస్తామని ఏదైనా ఇతర కంపెనీ ఇస్తే ఆ కంపెనీకి ఆప్రాజెక్టు ఇస్తారు, లేదా, ఆ ధర తామే ఇస్తామంటే, ప్రాజెక్టు ఆలోచన చేసిన కంపెనీకి ఇస్తారు. కాని ఇక్కడ ఆదాయం ఎంత అనే విషయాన్ని ఈ కంపెనీలు చెప్పలేదు. దీన్ని హైకోర్టుకూడా తప్పుబట్టింది. అయినా వీటికే కోర్‌ క్యాపిటల్ ల్యాండ్‌ డెవలప్‌ మెంట్‌ను చంద్రబాబు అప్పగిస్తారు. అమరావతిలో అవినీతికి ఈ రకంగా పునాదులు పడ్డాయి. 5.కోర్‌ క్యాపిటల్ లోని 1691 ఎకరాల్లో రోడ్లకోసం 371 ఎకరాలు పోనూ, మిగిలిన 1321 ఎకరాల్లో 250 ఎకరాలు సింగపూర్‌ కన్సార్షియంకు ఫ్రీగా ఇస్తారు. అవి ఆ కన్సార్షియం అమ్ముకోవచ్చు. ప్రభుత్వానికి ఒక్కపైసా రాదు. మిగిలిన 1070 ఎకరాలను ప్లాట్లుగా వేస్తారు. 6. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ఖర్చులన్నీకూడా మొత్తం ప్రభుత్వమే పెడుతుంది. దీనికోసం రూ.5,500 కోట్లు ప్రభుత్వమే పెడుతోంది. సింగపూర్‌ కన్సార్షియంలో చంద్రబాబు బినామీల CCDMCల వాటాగా కేవలం రూ.221.9 కోట్లు పెట్టుబడి పెడుతుంది.7.విచిత్రంగా ఈ 1070 ఎకరాల్లో తన బినామీలు ఉన్న CCDNCతో కూడిన సింగపూర్‌ కంపెనీల కన్సార్షియంకు, ఉచితంగా 250 ఎకరాలు ఇస్తానని చంద్రబాబు ఒప్పందం చేసుకున్నాడు. ఇవాళ చంద్రబాబు చెప్తున్న ధర ప్రకారం ఎకరా రూ.50 కోట్లు లెక్కవేసుకుంటే ఈ 250 ఎకరాల విలువ అక్షరాల రూ.12,500 కోట్లు. ఇది ప్రజల ఆస్తులను కొట్టేయడం కాదా?8.ఈ అవినీతి బాగోతం ఇక్కడితో ఆగిపోలేదు. 1071 ఎకరాల అభివృద్ధికోసం రూ.18,229 కోట్లు ఖర్చుచేసినా రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతి డెవలప్‌మెంట్‌ పార్టనర్‌ కంపెనీలో దక్కే వాటా 42 శాతం మాత్రమే. చంద్రబాబు బినామీలతోకూడిన సింగపూర్‌ కన్సార్షియంకు దక్కే వాటా 58 శాతం. 9. కాని 250 ఎకరాలు ఉచితంగా ఇవ్వడం ద్వారా రూ.12,500 కోట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధికోసం ప్రభుత్వం ఇచ్చే రూ.5,500 కోట్లు, CCDMC వాటా కింద ఇచ్చే రూ.221.9కోట్లు వెరసి రూ.18,221.9 కోట్లు పెట్టుబడి పెట్టే ప్రభుత్వ సంస్థ సీఆర్డీయేకు దక్కే వాటా కేవలం 42శాతమే. ఇది స్కాం కాదా?10.చివరకు స్టార్టప్‌ ఏరియా టర్నోవర్‌లో ప్రభుత్వానికి సగటున దక్కే వాటా కేవలం 8.7 శాతం దక్కనుండగా కన్సార్షియానికి 91.3 శాతం వాటా లభిస్తుంది. మరి అవినీతి కాదా? 11.వాస్తవానికి కన్సార్షియం ముసుగులో చంద్రబాబు బినామీలు పెట్టుబడులు పెట్టారు. సింగపూర్‌ మంత్రిగా ఉన్న ఈశ్వరన్‌ సహకరించారు. బాబు దెబ్బకు సింగపూర్ ప్రతిష్ఠ కూడా దెబ్బతిన్న మాట వాస్తవం కాదా?12.ఇక ప్లాట్ల విక్రయం వ్యవహారాలు చూసేందుకు తీసుకొచ్చిన CCDMC కంపెనీలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రాతినిధ్యం ఉండదు. మరి ఈ డబ్బు ఎవరి జేబుల్లోకి పోతోంది?13.సింగపూర్‌ ప్రభుత్వం ఉచితంగా మాస్టర్‌ ప్లాన్‌ పనులను ఇచ్చారన్నది అబద్ధం. ‘సుర్బానా–జురాంగ్‌’కు రూ.28.96 కోట్లకు నామినేషన్‌ పద్ధతిలో అప్పగించారు. దీన్ని తప్పు బడుతూ 2023లో కాగ్‌ నివేదిక ఇచ్చింది. 14.అమరావతి స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టులో దోపిడీకి చంద్రబాబు వేసిన స్కెచ్‌కు... 2019 ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం రావడంతో తెరపడింది. కుంభకోణం బహిర్గతమైతే అంతర్జాతీయంగా ప్రతిష్ఠ తీవ్రంగా దెబ్బతింటుందని సింగపూర్‌ సంస్థల కన్సార్షియం ఆందోళన చెందింది. దాంతో 2019 అక్టోబర్‌ 30న ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు నాటి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. వారి అభ్యర్థనల మేరకు ఆ ఒప్పందాన్ని అప్పట్లో ప్రభుత్వం రద్దు చేసింది. ఇది వాస్తవం కాదా?

Donald Trump says India may Pay 20 to 25 Tariff3
భారత్‌పై 25 శాతం సుంకాలు.. గడువుకు ముందే ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌ సుంకాలపై ఆగస్టు ఒకటి వరకూ ఇచ్చిన గడువుకు ముందే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్‌ తమకు మంచి మిత్రదేశమని, అయితే ఇదే భారత్‌ ఇతర దేశాల కంటే ఎక్కువ సుంకాలను వసూలు చేసిందని, కానీ తాము అలా చేయబోమని ట్రంప్ పేర్కొన్నారు. తన ఐదు రోజుల స్కాట్లాండ్ పర్యటన ముగించుకుని, వాషింగ్టన్‌కు తిరిగి వస్తూ, ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్‌ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై తాము 20 శాతం నుండి 25 శాతం వరకూ సుంకం రేటు విధించే అవకాశాలున్నాయన్నారు. అయితే ఇందుకు ఆగస్టు ఒకటి వరకూ గడువు ఉందని, దీనికి ముందుగా ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నందున తుది సుంకం ఇంకా ఖరారు కాలేదని ట్రంప్‌ పేర్కొన్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ భారత్​ దిగుమతులపై చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమయ్యింది. భారత్‌పై 20 నుంచి 25శాతం వరకు సుంకాలు విధించే యోచనలో ఉన్నట్టు ట్రంప్‌ సూచన ప్రాయంగా ప్రకటించారు. అమెరికా- భారత్ వాణిజ్య ఒప్పందంపై​ చర్చలు జరుగుతున్న సమయంలో ట్రంప్​ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. భారత్‌ దిగుమతులపై 25శాతం వరకు సుంకాలు విధిస్తారా? అని మీడియా అడిగినప్పుడు ఆయన ‘అలా అనుకుంటున్నాను’ అని సమాధానమిచ్చారు.రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్‌ అమెరికా ప్రయోజనాల కోసమంటూ ప్రపంచ దేశాలపై భారీ మొత్తంలో సుంకాలు విధించేందుకు ప్రయత్నిస్తున్నారు. తొలుత సుంకాల విధింపునకు 2025 ఏప్రిల్​ 2 తుది గడువు​ పెట్టారు. ఆ సమయంలోపు తమతో ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. ఆ తరువాత ఈ గడువును జూలై 9కి మార్చారు. అనంతరం దానిని ఆగస్ట్​ ఒకటి వరకూ పొడిగించారు. కాగా అమెరికా.. యూకే, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్​, యూరోపియన్​ యూనియన్​, జపాన్‌లతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారత్‌తో ఇంకా ఎలాంటి ఒప్పందం నిర్ణయం కాలేదు.

YSRCP President YS Jagan at PAC meeting4
ప్రజల తరఫున ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. వేధింపులు

మన ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో నేరుగా కానీ, కార్పొరేషన్లకు గ్యారెంటీతో కానీ చేసిన మొత్తం అప్పు రూ.3.32 లక్షల కోట్లు. అయితే అందులో 52 శాతం అప్పును చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఈ 14 నెలల్లోనే చేసింది. ఏ స్కీమ్‌ లేదు. అయినా రూ.1.75 లక్షల కోట్లు అప్పు చేశారు. మన హయాంలో రెండేళ్లు కోవిడ్‌. అయినా అన్ని పథకాలు అమలు చేశాం. గ్రామ, వార్డు సచివాలయాలు కట్టాం. ఆర్బీకేలు కట్టాం. పోర్టుల నిర్మాణం చేపట్టాం. స్కూళ్లు బాగు చేశాం. కొత్త మెడికల్‌ కాలేజీలు తెచ్చాం. విలేజ్‌ క్లినిక్స్‌ కట్టాం. పాలనలో విప్లవాత్మక మార్పులు చూపాం. ఇవన్నీ నిర్వీర్యం అయ్యాయి. – వైఎస్‌ జగన్‌ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావడం లేదు. అవన్నీ వీరి జేబుల్లోకి పోతున్నాయి. అందుకే దేశ ఆదాయం సగటున 12 శాతం పెరిగితే, ఇక్కడ అది కేవలం 3 శాతమే. అంటే ఇక్కడ ప్రభుత్వ ఆదాయం ప్రభుత్వానికి కాకుండా, వీరి జేబుల్లోకి పోతోంది. అందుకే ప్రభుత్వ ఆదాయం పెరగడం లేదు. ఇప్పుడు మళ్లీ సింగపూర్‌ పర్యటన. ఈ డబ్బులన్నీ అక్కడ దాచి పెట్టుకోవడానికే ఈ పర్యటన. – వైఎస్‌ జగన్‌సాక్షి, అమరావతి: సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ సహా ఎన్నికల్లో ఇచ్చిన 143 హామీల అమలులో.. పరిపాలనలో అన్నింటా టీడీపీ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విశృంఖలంగా అవినీతి.. యథేచ్ఛగా దోపిడీ సాగుతోందని మండిపడ్డారు. ప్రజల తరఫున ప్రశ్నిస్తే విపక్షం గొంతు నొక్కేందుకు అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారని ఎత్తిచూపారు. రాష్ట్రంలో ఎక్కడా పరిపాలన అనేది లేదని, ప్రజలకు ఏ మేలూ జరగడం లేదన్నారు. చంద్రబాబు ష్యూరిటీలో పక్కాగా మోసం గ్యారంటీ అన్నది స్పష్టమైందన్నారు. చంద్రబాబు మోసాలు మరింతగా ఎండగట్టాలని.. ఆ దిశలో ఇప్పటికే వైఎస్సార్‌సీపీ కార్యక్రమం చేపట్టిందని– అదే రీకాలింగ్‌ ఆఫ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో (చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుచేసుకుంటూ..) అని గుర్తు చేశారు. ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని, రాష్ట్రంలో ప్రతి ఇంటికీ మన కార్యక్రమం చేరాలని.. అందుకు పార్టీలో సీనియర్‌ నేతలు మరింతగా చొరవ చూపాలని వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో పార్టీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పీఏసీ సభ్యులు హాజరయ్యారు. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు.. అక్రమ కేసులు, అరెస్టులు.. ప్రజల తరపున ప్రశ్నించే గొంతులు నొక్కే ప్రయత్నం.. వైఎస్సార్‌సీపీలో చురుకుగా వ్యవహరిస్తున్న నాయకులే లక్ష్యంగా ప్రభుత్వం కొనసాగిస్తున్న వేధింపులు.. సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడం.. చంద్రబాబు చేసిన, చేస్తున్న మోసాలను ప్రజల్లో ఇంకా బలంగా ఎండగట్టడం.. బాబూ ష్యూరిటీ – మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తీసుకెళ్లడంపై సమావేశంలో వైఎస్‌ జగన్‌ చర్చించారు. కూటమి ప్రభుత్వ మోసాలు, అక్రమాలు, అవినీతిపై ప్రజల తరఫున ప్రశ్నిస్తూ.. పోరాటం చేస్తూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. సూచనలు, సలహాల కోసం పార్టీలో సీనియర్లను పీఏసీలోకి తీసుకొచ్చామని.. నెలకోసారి పీఏసీ సమావేశం జరిగేలా చూస్తామని చెప్పారు. ‘ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు అందరికీ తెలుసు. మనం ఇంకా కష్టపడాల్సి ఉంటుంది. చూస్తుండగానే దాదాపు ఏడాదిన్నర గడిచింది. ఇంకా మనకు మిగిలింది మూడేళ్లు మాత్రమే. మనం ఇప్పుడు రాక్షస పాలన చూస్తున్నాం. దాన్ని ఇంకా ఎదుర్కోవాల్సి ఉంది’ అని అన్నారు. వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. మనం ఇదే సంప్రదాయం కొనసాగిస్తే టీడీపీ సీనియర్‌ నేతలంతా జైళ్లలోనే.. » రాష్ట్రంలో ఎక్కడా పరిపాలన అనేది లేదు. ప్రజలకు ఏ మేలూ జరగడం లేదు. రాష్ట్రంలో విశృంఖలంగా అవినీతి.. యథేచ్ఛగా దోపిడీ సాగుతోంది. ప్రజల తరఫున ప్రశ్నిస్తే విపక్షం గొంతు నొక్కేందుకు అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారు. మన పార్టీ సీనియర్‌ నాయకులను జైళ్లలో పెడుతున్నారు. భవిష్యత్తులో మనం ఇదే సంప్రదాయం కొనసాగిస్తే టీడీపీ సీనియర్‌ నాయకులంతా జైళ్లలోనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మన లీడర్లను అన్యాయంగా జైళ్లలో పెట్టారు. మిథున్‌ రెడ్డిని చూస్తే బాధనిపిస్తోంది. ఆయన్ను నేనే రాజకీయాల్లోకి తీసుకొచ్చాను. మేకపాటి గౌతమ్‌రెడ్డిని కూడా నేనే రాజకీయాల్లోకి తీసుకొచ్చాను. వారి తండ్రులు మా నాన్న బ్యాచ్‌. వారిద్దరూ నా బ్యాచ్‌. నా ఫ్రెండ్స్‌. కేవలం వేధించడం కోసమే మిథున్‌రెడ్డిని అరెస్టు చేసి, జైల్లో పెట్టారు. ఆయన కనీసం ఇక్కడ మంత్రి కూడా కాదు. ఆయన తండ్రి రామచంద్రన్న ఎక్సైజ్‌ మంత్రి కూడా కాదు. » అదే విధంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. ఆయన ఖర్మ ఏమిటంటే, అది చంద్రబాబు నియోజకవర్గం. అక్కడ మంత్రిగా ఉండి కూడా చంద్రబాబు ఓడిపోయాడు. 1978లో ఎమ్మె­ల్యే­గా చంద్రగిరి నుంచి గెల్చి, మంత్రిగా ఉంటూ పోటీ చేసి 1983లో ఓడిపోయాడు. ఆ తర్వాత తన మామ కాళ్లూ వేళ్లూ పట్టుకుని టీడీపీలో చేరి, పోటీ చేశాడు. ఆ తర్వాత చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయాడు. చంద్రగిరిలో తన ప్రత్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కాబట్టి, టార్గెట్‌ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఆయన కొడుకును కూడా వేధించి అరెస్ట్‌ చేయాలని చూస్తున్నారు. » నందిగం సురేష్‌ దళితుడు. ఎంపీగా ఎదిగాడు. 6 నెలల 10 రోజులు.. మొత్తం 191 రోజులు జైల్లో పెట్టారు. ఒక కేసు కాగానే మరో కేసు పెట్టి జైల్లో ఉంచారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డిని కూడా అక్రమంగా అరెస్టు చేశారు. క్వార్ట్జ్‌ గనుల కేసు.. టోల్‌ గేట్‌ కేసు.. ఇలా వరసగా కేసులు పెట్టి, వేధిస్తున్నారు. ఇప్పటికే జైల్లో పెట్టారు. ఇప్పుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ టార్గెట్‌. ఆయన్నూ అరెస్టు చేయాలని చూశారు. కానీ, ఆ కుట్రలో భాగంగా అరెస్టు అ వ్యక్తి (శ్రీకాంత్‌రెడ్డి) జడ్జి ముందు నోరు విప్పి పోలీసుల వేధింపుల గురించి చెప్పడంతో అనిల్‌ కుమార్‌ అరెస్టు కాలేదు. ప్రజల తరఫున ప్రశ్నించే వారందరి గొంతు నొక్కే ప్రయత్నం » ప్రజల తరపున మాట్లాడే వారిని, ప్రజా సమస్యలు ప్రస్తావించే వారిని ఇలా వేధించడం ఇదే మొదటిసారి. నిజానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి, సుపరిపాలన అందిస్తే, ఇలాంటి చర్యలు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏ హామీ అమలు చేయకపోవడంతో, ప్రజల వద్ద ముఖం చెల్లక ఇలా ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశలోనే జోగి రమేష్‌ కొడుకును అరెస్టు చేయడం.. రోజాను వేధించి ఆనందం పొందడం.. విడదల రజని మీదా కేసు పెట్టారు. వేధించే ప్రయత్నం చేస్తున్నారు. » నెల్లూరులో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడి దారుణం. పోలీసుల సమక్షంలోనే ఇంట్లో విధ్వంసం సృష్టించారు. అదృష్టవశాత్తు అప్పుడు ఆయన ఇంట్లో లేరు. ఒకవేళ ఆయన ఇంట్లో ఉండి ఉంటే చంపేసే వారు. ఇంట్లో మొత్తం ధ్వంసం చేశారు. కారును కూడా పడదోశారు. దాడిపై ఆయన ఫిర్యాదు చేస్తే, పట్టించుకోని పోలీసులు.. ఎమ్మెల్యే ఫిర్యాదు చేయగానే తిరిగి ప్రసన్నకుమార్‌రెడ్డిపైనే చర్య తీసుకున్నారు. తాడిçపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని సొంత ఇంటికి పోనివ్వడం లేదు. పైగా సీఐ గన్‌ చూపి బెదిరిస్తున్నారు. కొందరు పోలీసుల అవినీతిపర్వం కొందరు పోలీసులు అవినీతిలో మునిగిపోయారు. ఒక జోన్‌కు డీఐజీ. ఆయన ఆధ్వర్యంలో డీఎస్పీలు, సీఐలు.. వసూళ్లు చేసి, ఎమ్మె­ల్యేలకు, అక్కణ్నుంచి సీఎంకు, ఆయన కుమారుడికి నిధులు ఇస్తున్నారు. అలా ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ చేస్తున్నారు. గ్రామాల్లో బెల్టు షాపులకు వేలం నిర్వహించి, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్ముతున్నారు. వారికి పోలీసులు రక్షణగా నిలుస్తున్నా­రు. ఇసుక దగ్గరుండి అమ్మిస్తున్నారు. ఏ ఒక్క గని కూడా వదలడం లేదు. నేరుగా డీఐజీ డీల్‌ చేస్తున్నాడు. ఎమ్మెల్యేకు ఇంత.. సీఎంకు ఇంత.. ఆయన కొడుక్కి ఇంత.. అని ఇస్తున్నారు. ఇందులో డీఎస్పీ, సీఐలకూ వాటా వెళ్తోంది. ఇంత అవినీతి గతంలో ఎక్కడా చూడలేదు. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ సక్సెస్‌ ‘రీకాలింగ్‌ ఆఫ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో’.. బాబు ష్యూరిటీ– మోసం గ్యారెంటీ కార్యక్రమం బాగా కొనసాగుతోంది. ఇప్పటికే 175 నియోజకవర్గాలకు గాను 169 చోట్ల జరిగింది. ఆరు నియోజకవర్గాల్లో వేర్వేరు కారణాల వల్ల ఆలస్యమైంది. 640 మండలాల్లో దాదాపు 538 మండలాల్లో పూర్తి కాగా, మిగిలిన 102 మండలాల్లో వేగంగా పూర్తి చేస్తాం. దాదాపు 90 నియోజకవర్గాల్లో రచ్చబండ కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయిలో ఈ కార్యక్రమం సాగుతోంది. మన క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా ప్రతి ఇంటికీ ఈ కార్యక్రమం చేరుతోంది. ఆ ఇంటికి చంద్రబాబు ఎంత బాకీ ఉన్నాడు.. గత ఏడాది ఎంత ఎగ్గొట్టాడు.. ఈ ఏడాది ఎంత బాకీ పడుతున్నాడు.. అనేది చెబుతున్నాం. కార్యకర్తల కోసం ప్రత్యేక యాప్‌.. డిజిటల్‌ లైబ్రరీవచ్చే వారంలో మనం ఒక యాప్‌ విడుదల చేస్తున్నాం. రాష్ట్రంలో ఎక్క­డైనా, ఎవరైనా, ఏ కార్యకర్త అయినా అధికారులతో వేధింపులకు గురైతే, లేదా ఏదైనా అన్యాయానికి గురైతే ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఫిర్యాదు చేయొచ్చు. మీకు ఏ రకంగా అన్యాయం జరిగింది..? అని ఆ యాప్‌లో స్పష్టంగా ఉంటుంది. ఫలానా అధికారి.. ఫలానా నాయకుడి ఆదేశాలతో నాపై అన్యాయంగా, అక్రమంగా కేసు పెట్టి.. చిత్రహింసలకు గురి చేశారని బాధితులంతా ఫిర్యాదు చేయొచ్చు. ఏ అధికారి ఎలా ఇబ్బంది పెట్టారో.. ఏ విధంగా బాధ పెట్టారో.. తద్వారా ఎలా ఇక్కట్లకు గురయ్యారో.. ఇబ్బంది పెట్టిన వారి పేర్లతో సహా వివరించవచ్చు. ఎవరి ప్రోద్బలంతో ఇబ్బందులకు గురి చేశారో స్పష్టంగా చెప్పొచ్చు. దానికి సంబంధించిన ఆధారాలు ఉంటే, వాటినీ అప్‌లోడ్‌ చేయొచ్చు. అవన్నీ మన డిజిటల్‌ లైబ్రరీలోని సర్వర్‌కు చేరుతాయి. రేపు మన ప్రభుత్వం రాగానే, డిజిటల్‌ లైబ్రరీలో (సర్వర్‌) దాన్ని ఓపెన్‌ చేస్తాం. ఎవరెవరైతే మన కార్యకర్తలకు అన్యాయం చేశారో వారెవ్వరినీ వదలకుండా చట్టం ముందు నిలబెడతాం. వారందరికీ సినిమా చూపిస్తాం. వారు చేసినవన్నీ వడ్డీతో సహా చెల్లిస్తాం. ఇక్కడ మనం ఎలాంటి అన్యాయం చేస్తామనడం లేదు. ఈ రోజు వారు ఏ విత్తనం విత్తుతున్నారో రేపు అదే పండుతుంది. అందుకే చక్రవడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది.ఆడబిడ్డ నిధి అడిగితే రాష్ట్రాన్ని అమ్మాలంటున్నారు » ఎన్నికలప్పుడు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. 18 ఏళ్లకు మించిన మహిళలు రాష్ట్రంలో 2.10 కోట్లు ఉన్నారు. వారికి నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామన్న హామీ నెరవేర్చలేదు. ఈ పథకాన్ని అమలు చేయాలంటే, రాష్ట్రాన్ని అమ్మాలంటున్నారు. మరి ఎందుకు హామీ ఇచ్చినట్లు? » అమ్మ ఒడి తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది ఇచ్చినా 30 లక్షల మందికి తగ్గించాడు. రూ.15 వేలు ఇస్తామని చెప్పి.. ఆ తర్వాత మాటమార్చి రూ.13 వేలు అని చెప్పారు. అదీ ఇచ్చారా అంటే లేదు. రూ.8,500 చొప్పున ఇచ్చారు. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీలో మనం ఇవన్నీ ప్రజలకు వివరిస్తున్నాం. » రాష్ట్రంలో తొలిసారి పిల్లలు చదువు మానేస్తున్నారు. పిల్లలకు విద్యా దీవెన లేదు. 2024లో జనవరి–మార్చి త్రైమాసికం మొదలు, ఇప్పటి వరకు మొత్తం ఆరు క్వార్టర్లు పెండింగ్‌. రూ.700 కోట్ల చొప్పున మొత్తం రూ.4,200 కోట్లు కావాలి. ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు. వసతి దీవెన ఏటా ఏప్రిల్‌లో రూ.1,100 కోట్ల చొప్పున ఇవ్వాలి. అది కూడా ఇవ్వకపోవడంతో రెండేళ్లకు రూ.2,200 కోట్లు పెండింగ్‌. రెండూ కలిపి మొత్తం రూ.6,400 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు. దీంతో పిల్లలు బడి మానేస్తున్నారు. » ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు. 14 నెలల నుంచి పెండింగ్‌. అలా రూ.4,200 కోట్లు బకాయి. ఇచ్చింది రూ.400 కోట్లు కూడా లేదు. ఆరోగ్య ఆసరాకు ఏటా అయ్యే ఖర్చు రూ.450 కోట్లు. అదీ ఇవ్వడం లేదు. ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం నిరాకరిస్తున్నాయి. » ఏ రైతుకూ, ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఏ రైతు పరామర్శకు వెళ్లినా కేసు పెడుతున్నారు. ఉచిత పంటల బీమా ఎత్తేశారు. ఆర్బీకేలు నిర్వీర్యం చేశారు. ఈ–క్రాప్‌ లేదు. నిరుద్యోగ భృతి దేవుడెరుగు. పిల్లలకు ఏమీ చేయడం లేదు. నాడు–నేడు మనబడి లేదు. అసలు రాష్ట్రంలో పరిపాలన అనేది ఉందా?గ్రామ స్థాయిలోనూ అనుబంధ కమిటీలు » రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. విన్‌ వన్‌సైడ్‌ ఉంటుంది. మొత్తం సీట్లు ఎప్పుడు గెలుస్తామంటే.. గ్రామ స్థాయిలో కూడా పార్టీ నిర్మాణం బాగా జరిగినపుడే. ప్రతి ఊళ్లో కనీసం 10 మందిని (గ్రామ కమిటీ సభ్యులు) ఆ ప్రాంత ఎమ్మెల్యే గుర్తు పట్టాలి. పేరు పెట్టి పిలిచేలా ఉండాలి. »గ్రామ కమిటీల తర్వాత, బూత్‌ కమిటీల నిర్మాణం జరగాలి. అలా ఒక వైపు పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేస్తూనే మరో వైపు ప్రజల్లో మరింత మమేకమై పని చేయాలి. ప్రతి గ్రామంలో మనకు యువజన, మహిళ, విద్యార్థి, సోషల్‌ మీడియా, రైతు, కార్మిక విభాగాల కమిటీలు ఉండాలి. అప్పుడే మరింత బలపడతాం. నేను ఫలానా గ్రామంలో మహిళా అధ్యక్షురాలిని. నేను విద్యార్థి విభాగం నాయకుడిని.. అని చెప్పుకునేలా గ్రామ స్థాయిలో పక్కాగా అన్ని కమిటీల నిర్మాణం జరగాలి. వారికి ఐడీ కార్డు కూడా ఇవ్వాలి. దాని వల్ల వారిని ప్రోత్సహించినట్లు అవుతుంది. దీని వల్ల పార్టీ ఏ కార్యక్రమం చేసినా సక్సెస్‌ అవుతుంది. ఇలా ప్రతి గ్రామంలో ఆరు నుంచి ఏడు కమిటీలు ఏర్పాటు చేస్తే, 13 వేల గ్రామాల్లో ఫ్రంటల్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్షులే దాదాపు 80 వేల మంది ఉంటారు. ఇక సభ్యుల సంఖ్య సరేసరి. రెండు మూడు నెలల్లో ఈ కార్యక్రమం పూర్తి కావాలి. ప్రతి ఒక్కరూ తమ ఫోన్‌లో బాబు ష్యూరిటీకి సంబంధించి క్యూ ఆర్‌ కోడ్‌ ఓపెన్‌ చేసుకునేలా పార్టీ సీనియర్‌ నేతలంతా చొరవ చూపాలి. – వైఎస్‌ జగన్‌మానిటరింగ్‌ ముఖ్యం» మీరంతా సీనియర్‌ లీడర్లు కాబట్టి కాస్త చొరవ చూపాలి. జిల్లా స్థాయిలో అందరితో, నాయకులతో మమేకం కావాలి. పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొనాలి. యువ నాయకులకు స్ఫూర్తిగా నిలుస్తూ పని చేయాలి. »మన వ్యవస్థ.. జిల్లా అధ్యక్షులు.. రీజినల్‌ కో ఆర్డినేటర్లు.. పార్లమెంటు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు.. అందరూ వారి వారి స్థాయిలో క్రియాశీలకంగా మారాలి. మరింత చొరవతో పని చేయాలి. మీరు ఎప్పుడైతే యాక్టివేట్‌ అవుతారో.. జూనియర్‌ నాయకులూ చొరవ చూపుతారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పార్టీని మరింత బలోపేతం చేసే అవకాశం వస్తుంది. ఆ సమయంలోనే మనకు గ్రామాలపై, పార్టీ కార్యకర్తలపై స్పష్టమైన అవగాహన వస్తుంది. ఎవరు, ఎలా కష్టపడుతున్నారనేది తెలుస్తుంది. వారందరినీ వ్యవస్థీకృత విధానంలోకి తీసుకొస్తే, అన్నీ సక్రమంగా జరుగుతాయి.» రచ్చబండ కార్యక్రమం తర్వాత, గ్రామ కమిటీల ఏర్పాటు జరుగుతోంది. గతంలో మొక్కుబడిగా అవి ఏర్పాటయ్యేవి. ఇప్పుడు వాటి ఏర్పాటులో మన నాయకుల మానిటరింగ్‌ ఉండాలి. గ్రామ స్థాయిలో మన కార్యకర్త ఒక వ్యవస్థీకృత విధానంలోకి రావాలి. వారికి మీరు దిశా నిర్దే«శం చేయాలి. » ఇప్పుడు చంద్రబాబునాయుడు చేసిన మోసం స్పష్టంగా కనిపిస్తోంది. అదే మనం ఉంటే, అన్నీ దక్కేవని ప్రజలు గుర్తించారు. చంద్రబాబు రావడంతో బిర్యానీ మాట దేవుడెరుగు.. పలావ్‌ కూడా పోయిందని అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు మీరు మూవ్‌ కావాలి. మరింత అగ్రెసివ్‌గా పని చేయాలి. కార్యకలాపాల్లో అందరూ పాల్గొనాలి. అవన్నీ సక్రమంగా జరగాలంటే గ్రామ కమిటీల ఏర్పాటు కూడా పూర్తి కావాలి. » కార్యకర్తలకు మంచి ఇన్సూరెన్స్‌ కల్పిస్తాం. మన పార్టీకి 15 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రజల్లో మనం బలంగా ఉన్నాం. ఇంకా బలోపేతం కావాలంటే, కార్యకర్తలు చాలా ముఖ్యం. మనం వారికి తోడుగా, అండగా ఉన్నామన్న విశ్వాసం కల్పించాలి. గతంలో మన ప్రభుత్వ హయాంలో కోవిడ్‌ వల్ల కార్యకర్తలను అంతగా పట్టించుకోలేకపోయాం. ఈసారి అలా కాదు. వారికి చాలా ప్రాధాన్యం ఇస్తాం.వైఎస్‌ జగన్‌ భద్రతపై పీఏసీ సభ్యుల ఆందోళన ఇటీవలి పర్యటనల్లో జగన్‌కు ప్రభుత్వం తగిన భద్రత కల్పించక పోవడంపై సమావేశంలో పీఏసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇటీవల చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటన సందర్భంగా పోలీసులు చూపిన నిర్లక్ష్యాన్ని సమావేశంలో సభ్యులు ప్రస్తావించారు. ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వం ఆయనకు తగిన భద్రత కల్పించడం లేదని తేల్చి చెప్పారు. జగన్‌ భద్రతపై వినిపిస్తున్న కథనాలు తమను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయని తెలిపారు. వీటన్నింటి నేపథ్యంలో జగన్‌ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పార్టీ పీఏసీ సభ్యులు స్పష్టం చేశారు.

8 Magnitude Earthquake Hits Russias5
భారీ భూకంపంతో వణికిన రష్యా.. 8.7 తీవ్రత నమోదు

మాస్కో: రష్యాలోని తూర్పు కమ్చట్కా ద్వీపకల్పంలో బుధవారం 8.7 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. రాబోయే మూడు గంటల్లో రష్యా, జపాన్ తీరప్రాంతాలకు విధ్వంసక సునామీ అలలు చేరుకోవచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే హెచ్చరించింది. భూకంప ప్రభావిత ఈ ప్రాంతానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. 🚨 BREAKING: Tsunami waves from the 8.7 magnitude earthquake have begun slamming RussiaBuildings are already being swept awayTsunami waves are also heading to Hawaii, expected to arrives within hours pic.twitter.com/dPg72zln9N— Nick Sortor (@nicksortor) July 30, 2025భూకంప తీవ్రతకు భవనాల లోపల జరిగిన కంపనలు ఆ వీడియోలలో కనిపిస్తున్నాయి. ఒక వీడియోలో భూకంపం సంభవించిన సమయంలో అపార్ట్‌మెంట్‌లోని ఫర్నిచర్ తీవ్రంగా ఊగిపోవడాన్ని గమనించవచ్చు. Videos are pouring in showing VIOLENT SHAKING from the MASSIVE M8.8 Earthquake off Kamchatka, RUSSIA! pic.twitter.com/zwx1jbhx0y— RT (@RT_com) July 30, 2025రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పానికి అతి సమీపంలో ఈ భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తు నేపధ్యంలో జపాన్‌ వాతావరణ విభాగం రష్యా తీరం వెంబడి సునామీ హెచ్చరికలు జారీ చేసింది. జపాన్ కాలమానం ప్రకారం ఈ భూకంపం బుధవారం ఉదయం 8:25 గంటలకు సంభవించింది.#BREAKING Yuzhno-Sakhalinsk, Russia 8.7 Earthquake - 46 Miles deep in the Ocean ALL OF THE WEST COAST IS UNDER TSUNAMI WARNING - We will know soon if the bouys pick up the TSUNAMI level soon hereMillions of people could end up evacuating depending how this goes.Hard to… pic.twitter.com/w54KXkE3If— MəanL¡LMə♡₩ (@MeanLILMeoW) July 30, 2025Breaking right now..Earthquake near Russia 8.7 magnitude and a tsunami alert has been spread to Alaska, Japan, and Russia..Developing story here as information is just coming out now..Prayers for all in its wake..🙏🙏🙏pic.twitter.com/aaTokSE7OQ— Chris from Massachusetts AKA TommyboyTrader (@autumnsdad1) July 30, 2025ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎటువంటి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. జపాన్‌లోని నాలుగు దీవులకు ఉత్తరాన ఉన్న హక్కైడోకు ఈ భూకంప కేంద్రం 250 కిలోమీటర్లు (160 మైళ్ళు) దూరంలో ఉందని సమాచారం. జపాన్‌కు చెందిన ఎన్‌హెచ్‌కే టెలివిజన్ తెలిపిన వివరాల ప్రకారం, ఇది స్వల్ప ప్రభావమే చూపిందని తెలుస్తోంది. ఈ భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి 12 మైళ్ల లోతులో ఉన్నట్లు యూఎస్‌ జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే కమ్చట్కాలో ఏ మేరకు ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందనే సంగతిని రష్యా ఇంకా వెల్లడించలేదు. కాగా హవాయికి దీపానికి రష్యా సునామీ హెచ్చరిక జారీ చేసింది. ఇది తక్కువ ముప్పు కలిగిన అలర్ట్ అని తెలుస్తోంది. టోక్యో భూకంప శాస్త్రవేత్త షినిచి సకాయ్ మీడియాతో మాట్లాడుతూ ఈ భూకంపం జపాన్‌ను తీవ్రంగా ప్రభావితం చేసే సునామీకి కారణంగా నిలవనున్నదని అంచనా వేశారు. ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే దేశాలలో జపాన్ ఒకటి. ఈ ప్రాంతంలో ఈ నెల ప్రారంభంలోనే ఐదు భారీ భూకంపాలు- 7.4 తీవ్రతతో సంభవించాయి. అతిపెద్ద భూకంపం 20 కిలోమీటర్ల లోతులో సంభవించింది. పెట్రోపావ్లోవ్స్క్-కమ్చట్స్కీ నగరానికి తూర్పున 144 కిలోమీటర్ల దూరంలో ఇది తన ప్రభావాన్ని చూపింది. 1952,నవంబర్ 4న కమ్చట్కాలో 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపం ఆందోళన కలిగించింది. నాడు హవాయిలో 9.1 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

Gambhir argument with the Oval curator6
‘నువ్వు గ్రౌండ్స్‌మన్‌వి మాత్రమే’

లండన్‌: ఇంగ్లండ్‌తో ఐదో టెస్టుకు రెండు రోజుల ముందు భారత జట్టును మానసికంగా దెబ్బ తీసే ప్రయత్నం మొదలైంది. అయితే ఇది ఆటగాళ్ల నుంచి రాలేదు. చివరి టెస్టు జరిగే ఓవల్‌ పిచ్‌ క్యురేటర్‌ చేసిన ‘అతి’ మైదానంలో చర్చకు దారి తీసింది. భారత హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆగ్రహానికి ఇది కారణమైంది. మంగళవారం ఆప్షనల్‌ ప్రాక్టీస్‌ కావడంతో కొందరు భారత ఆటగాళ్లతో పాటు కోచింగ్‌ బృందం ఓవల్‌ మైదానానికి వెళ్లింది. టెస్టుకు ఒకటి లేదా రెండు రోజుల ముందు ఇరు జట్ల కెప్టెన్ లేదా కోచ్‌లు పిచ్‌ను పరిశీలించడం, దానిపై ఒక అంచనాకు రావడం సాధారణ ఆనవాయితీ. గంభీర్‌ కూడా తన సహచర కోచింగ్‌ సిబ్బందితో పిచ్‌ వద్దకు వెళ్లాడు. అయితే క్యురేటర్‌ లీ ఫోర్టస్‌ బృందంలోని ఒక సభ్యుడు అక్కడికి వచ్చి పిచ్‌కు బాగా దగ్గరగా వెళ్లవద్దని, అక్కడి నుంచి 2.5 మీటర్ల దూరం ఉండాల్సిందిగా కోరాడు. ఇది గంభీర్‌కు కాస్త అసహనం తెప్పించింది. పిచ్‌ పాడు కాకుండా క్యురేటర్లు జాగ్రత్తలు చెప్పడం సహజమే అయినా ఒక జట్టు కోచ్‌ను నిలువరించడం ఎప్పుడూ జరగదు. మ్యాచ్‌ జరిగే ప్రధాన పిచ్‌కు బాగా దగ్గరగా భారత ఆటగాళ్లు పదే పదే రావడం క్యురేటర్‌కు ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం. అయితే ప్రాక్టీస్‌కు కేటాయించిన మూడు పిచ్‌లకు ఇది బాగా దగ్గరగా ఉందని, పూర్తిగా అటు వెళ్లకుండా ఉండటం సాధ్యం కాదని మన కోచింగ్‌ బృందం జవాబి చ్చినట్లు తెలిసింది. అయితే వివాదం అక్కడితో ముగిసిపోలేదు. భారత్‌కు చెందిన సహాయకుడు ఒకరు కూలింగ్‌ బాక్స్‌ను ఆటగాళ్ల ప్రాక్టీస్‌ నెట్స్‌ వద్దకు తీసుకెచ్చే ప్రయత్నం చేయగా, దీనిని కూడా క్యురేటర్‌ వారించాడు. దాంతో కోపం వచ్చిన గంభీర్‌ ఏదో మాట అనడం... ఇలా మాట్లాడవద్దని, మళ్లీ ఇలా చేస్తే ఐసీసీకి ఫిర్యాదు చేస్తానని క్యురేటర్‌ అన్నాడు. అంతే...ఏం చేసుకుంటావో చేసుకోమంటూ తనదైన శైలిలో తీవ్రంగా బదులిచ్చాడు. ‘మేం ఏం చేయాలో నువ్వు చెప్పనవసరం లేదు. మా బృందం ఏం చేయాలో కూడా నువ్వు చెప్పవద్దు. నీకు ఎలాంటి అధికారం లేదు. నువ్వు కేవలం గ్రౌండ్స్‌మన్‌వి మాత్రమే. అంతకు మించి ఏమీ కాదు. నీ పరిధిలో ఉండు. నువ్వు గ్రౌండ్స్‌మన్‌వి మాత్రమే’ అని గంభీర్‌ తీవ్రంగా జవాబిచ్చాడు. చివరకు బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్‌ కలగజేసుకొని ఫోర్టిస్‌ను దూరంగా తీసుకెళ్లి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చి oది. ‘పిచ్‌ ఏమీ పురాతన వస్తువు కాదు’ గంభీర్, క్యురేటర్‌ ఫోరి్టస్‌ మధ్య చోటు చేసుకున్న ఘటనపై సితాన్షు కొటక్‌ వివరణ ఇచ్చాడు. ఓవల్‌ గ్రౌండ్‌ క్యురేటర్‌ కాస్త దూకుడైన వ్యక్తి అని తమకు ముందే తెలుసని అన్నాడు. ఈ సిరీస్‌లో ఆడిన నాలుగు టెస్టుల్లోనూ పిచ్‌ క్యురేటర్లు తమకు బాగా సహకరించారని, ఇక్కడే ఇలాంటి అనుభవం ఎదురైందని చెప్పాడు.‘ఒక జట్టు కోచ్‌ను 2.5 మీటర్ల దూరం నిలబడమని చెప్పడం చాలా ఇబ్బందిగా అనిపించింది. మేమేమీ స్పైక్స్‌తో రాలేదు. రబ్బరు చెప్పులతో అక్కడ నిలబడ్డాం కాబట్టి పిచ్‌ పాడవుతుందనే సమస్యే లేదు. అలా ఎవరైనా ఎందుకు చేస్తారు. పిచ్‌ను జాగ్రత్తగా చూసుకోవడాన్ని అర్థం చేసుకోవచ్చు గానీ ఇది కాస్త అతిగా అనిపించింది. మా జట్టు సభ్యులు అక్కడ ఆడబోతున్నారు. ఎన్ని మాటలు చెప్పినా అది క్రికెట్‌ పిచ్‌ మాత్రమే. కాలు పెట్టగానే విరిగిపోయేందుకు అదేమీ 200 ఏళ్లనాటి పురాతన వస్తువు కాదు’ అని కొటక్‌ వివరించాడు. బుమ్రా స్థానంలో ఆకాశ్‌దీప్‌భారత టాప్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఓవల్‌ టెస్టులో ఆడే విషయంలో స్పష్టత వచ్చింది. అతను ఈ టెస్టు నుంచి తప్పుకోవడం ఖాయమైంది. అతని పని భారం తగ్గించేందుకే టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఈ నిర్ణయం తీసుకుంది. సిరీస్‌ను కాపాడుకునే కీలక టెస్టులో బుమ్రాను ఆడించాలని భావించినా... అతని ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకొని, మున్ముందు ఇబ్బంది రాకుండా కాపాడుకునేందుకు ఐదో టెస్టులో ఆడించరాదని బీసీసీఐ వైద్య బృందం సిఫారసు చేసింది. ఈ సిరీస్‌తో బుమ్రా మూడు టెస్టుల ఆడతాడని ముందే ప్రకటించారు. ఈ మూడు టెస్టుల్లో కలిపి అతను 14 వికెట్లు తీశాడు. బుమ్రా స్థానంలో ఆకాశ్‌దీప్‌ బరిలోకి దిగుతాడు. స్వల్ప గాయంతో ఆకాశ్‌దీప్‌ గత మ్యాచ్‌లో ఆడలేదు.

Actress Bindu Madhavi Now Busy With Tamil Movies7
కోలీవుడ్‌లో ఫుల్‌ బిజీగా మన తెలుగమ్మాయి

నటి బిందు మాధవి. ఈ పేరు పక్కింటి అమ్మాయి అనే ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇంతకు ముందు పలు భాషల్లో, చిత్రాల్లో కథానాయికిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా పదహారు అణాల తెలుగు అమ్మాయి. తెలుగు బిగ్‌బాస్‌ విన్నర్‌ అయిన బిందు మాధవి.. తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేశారు. కళగు, కేడీ బిల్లా కిలాడి రంగా, తమిళుక్కు ఎన్‌ ఒండ్రు అళిక్కవుమ్‌ వంటి పలు హిట్‌ చిత్రాల్లో నటించారు. అలా 2019 వరకు వరుసగా చిత్రాలు చేసిన బిందు మాధవి ఆ తరువాత కారణాలు ఏమైనా వెండి తెరపై కనిపించలేదు. అలాంటిది మళ్లీ 2024లో మాయన్‌ చిత్రంతో ఒక రకంగా రీ ఎంట్రీ అయ్యారనే చెప్పవచ్చు. ప్రస్తుతం బ్లాక్‌ మెయిల్, యారుక్కుమ్‌ అంజాల్‌ పగైవనుక్కు అరుళ్వై మొదలగు మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యారు. అందులో ఒకటి బ్లాక్‌ మెయిల్‌. జీవీ ప్రకాష్‌ కుమార్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ఎం.మారన్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు ఒకటవ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా బ్లాక్‌ మెయిల్‌ చిత్రంలో నటించిన అనుభవం గురించి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ ప్రతి కళాకారుడు కళాకారుని తమ జీవితాల్లో ఒక మార్పు తీసుకువచ్చే తరుణం కోసం ఎదురుచూస్తూనే ఉంటారన్నారు అదేవిధంగా మహిళలు తమకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందడం కోసం సవాళతలను ఎదుర్కొంటారన్నారు. అలా దర్శకుడు ఎం మారన్‌ బ్లాక్మెయిల్‌ కథను చెప్పగానే అది తనకు బాగా కనెక్ట్‌ అయిన భావన కలిగిందన్నారు. అది తన కోసమే ఎదురుచూస్తున్న పాత్రగా భావించానన్నారు. దర్శకుడు రాసిన బలమైన , భావోద్వేగాలతో కూడిన ఆ పాత్ర తనలో బాధ్యతను పెంచిందన్నారు. ముఖ్యంగా పలు కథాపాత్రలతో కలిసి తన పాత్ర ఉంటుందన్నారు. జీవీ ప్రకాష్‌ లాంటి అద్భుతమైన నటనను ప్రదర్శించే నటుడుతో కలిసి పనిచేయటం మంచి అనుభవంగా పేర్కొన్నారు. నటి తేజు అశ్విని ,శ్రీకాంత్‌ తదితర నటీనటులందరూ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారన్నారు భావోద్రేకాలతో కూడిన ఉత్సాహబహితమైన థ్రిల్లర్‌ కథాచిత్రంగా ఉంటుందని నటి బిందు మాధవి పేర్కొన్నారు.

Parenting Tips: Darshan Fans Trigger Actor MP Ramya8
మనింట్లో ఇలాంటి అభిమానులున్నారా?

సినీ అభిమానం వెర్రితలలు వేసి భవిష్యత్తు నాశనం చేసుకునే విధంగాటీనేజ్‌ పిల్లలు తయారవుతున్నారా? కర్నాటకలో ఇలాగే జరుగుతోంది.అక్కడ హీరో దర్శన్‌ అభిమానులు తనపై అత్యాచారం చేస్తామని, చంపుతామని బెదిరిస్తున్నారని నటి రమ్య కేసు పెట్టారు. గతంలో దర్శన్‌ అభిమాని రేణుకా స్వామి ఇలాంటి మెసేజ్‌లే పెట్టి హత్యకు గురయ్యాడు. ఆ కేసులో దర్శన్‌ నిందితుడు. ఈ నేపథ్యంలో అతడికి బెయిలు మంజూరు అవడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. రమ్య సుప్రీంకోర్టును మెచ్చుకుంటూ ట్వీట్‌ చేసింది.దాంతో ఆమెను చంపుతామని అభిమానులు బయలుదేరారు. చదువు, ఉద్యోగాల్లో ఉండాల్సిన యువత ఇలాంటి పనుల్లో ఉంటే సరిదిద్దుతున్నామా?ఇంట్లో ఉన్న పిల్లలు బయట ఏ అస్తిత్వంతో ఉన్నారో తల్లిదండ్రులు చెక్‌ చేసుకుంటున్నారా? వారు ఫలానా తల్లిదండ్రుల పిల్లలు అనో, కాలేజీ పిల్లలు అనో, ఏరియా పిల్లలు అనో గుర్తింపు పొందుతున్నారా? లేదా ఫలానా హీరో ఫ్యాన్స్‌ అనో, రాజకీయ పార్టీ అభిమానులనో, వాట్సాప్‌ గ్రూప్‌కు సంబంధించిన యాక్టివ్‌ మెంబర్లనో అందరికీ తెలుస్తున్నారా?హైస్కూల్, కాలేజీ వయసు దాటాక ఇటీవల ఉద్యోగాల్లో చేరాక కూడా మెచ్యూరిటీ లేని విధంగా కేవలం ‘ఫ్యాన్స్‌’గా ఉంటూ సొంత/దొంగ ఐడీలతో దాడి చేసే కుసంస్కారంతో ఉంటే గనక వీరి భవిష్యత్తు ఏమవుతుందో... అనే బాధ తల్లిదండ్రులకు ఉండటం చాలా సహజం. పత్రికల్లో కనిపిస్తున్న రోజువారీ ఘటనలు ‘వెర్రి అభిమానం’ వల్ల ప్రమాదం తెచ్చుకుంటున్న యువతను చూపెడుతున్నాయి. ఇంకానా ఇకపైనైనా మారండి అని హెచ్చరిస్తున్నాయి.దర్శన్‌ అభిమానులు ఏం చేశారు?గత రెండు రోజులుగా కన్నడ హీరో దర్శన్‌ అభిమానులు అక్కడి నటి, మాజీ ఎం.పి. అయిన రమ్యను సోషల్‌ మీడియాలో తీవ్ర పదజాలంతో హింసిస్తున్నారు. ఆమెను చంపుతామని, రేప్‌ చేస్తామని ఇంకా రాయడానికి వీలుకాని భాషలో ఆమెకు క్షోభ కలిగిస్తున్నారు. దానికి కారణం ఇటీవల ఆమె సోషల్‌ మీడియాలో చేసిన కామెంట్‌. దర్శన్‌కు గతంలో కర్నాటక హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. దానిని కర్నాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేస్తే సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్‌ చేస్తూనే కర్నాటక హైకోర్టు బెయిల్‌ ఎలా మంజూరు చేసిందనే విషయమై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇది చాలా అసమంజసం అని చెప్పింది. ఈ విషయాన్నే ఉటంకిస్తూ రమ్య సోషల్‌ మీడియాలో ‘సుప్రీంకోర్టు ఒక ఆశాకిరణంలా కనిపిస్తోంది’ అని రాసింది. అంటే దర్శన్‌ బెయిల్‌ మీద బయట తిరగడం సరి కాదు అని ఆమె ఉద్దేశం. దీంతో ఫ్యాన్స్‌ రెచ్చిపోయారు.దర్శన్‌ కేసుదర్శన్‌ 2024 జూన్‌లో అరెస్ట్‌ అయ్యాడు. దీనికి కారణం చిత్రదుర్గకు చెందిన తన అభిమాని రేణుకా స్వామి హత్యలో అతని ప్రమేయం ఉందనే అభియోగం. రేణుకా స్వామి కూడా ‘వెర్రి అభిమాని’గా ఉండి ప్రాణం మీద తెచ్చుకున్నాడు. జరిగింది ఏమంటే దర్శన్‌కు, అతని భార్య విజయలక్ష్మికి కొంత కాలంగా సయోధ్య లేదు. అందుకు కారణం దర్శన్‌ గర్ల్‌ఫ్రెండ్‌ పవిత్ర గౌడ అని కొందరు అభిమానులు భావించారు. దర్శన్‌ అభిమాని అయిన రేణుకా స్వామి దర్శన్‌ జీవితంలో కలత రేపిన పవిత్ర గౌడను సోషల్‌ మీడియాలో అబ్యూజ్‌ చేయసాగాడు. అతని కామెంట్లు భరించలేని పవిత్ర ఈ సంగతిని దర్శన్‌ దృష్టికి తీసుకు రాగా అతను తన అభిమానులతో కలిసి రేణుకా స్వామిని హత్య చేయించాడని అభియోగం. ఈ కేసు విచారణలో ఉండగానే డిసెంబర్, 2024లో కర్నాటక హైకోర్టు దర్శన్‌కు బెయిల్‌ ఇచ్చింది. దానిని తాజాగా సుప్రీంకోర్టు తప్పు పట్టింది. అలా తప్పు పట్టడం సరైన విషయంగా రమ్య భావిస్తూ కామెంట్‌ చేసింది.కేసుల్లో అభిమానులురమ్యను అశ్లీల మాటలు అంటూ నానా హంగామా చేసిన దర్శన్‌ అభిమానులపై రమ్య పోలీస్‌ కంప్లయింట్‌ ఇచ్చింది. 47 ఇన్‌స్టా హ్యాండిల్స్‌ను పోలీసుల దృష్టికి తెచ్చింది. ఇప్పుడా ఇన్‌స్టా హ్యాండిల్స్‌ ఏ అభిమానులైతే నడుపుతున్నారో వారంతా ప్రమాదంలో పడినట్టు. నేరం రుజువైతే 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. అభిమానం సినిమా చూసేంత వరకూ ఉండాలి కాని ఇలా నటుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి వారికి వత్తాసు పలుకుతూ తీవ్ర చర్యలు చేపట్టేంతగా మాత్రం ఉండకూడదు. ఈ బూతులు తిట్టిన అభిమాని ఇంజినీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌లో ఉండొచ్చు. తల్లిదండ్రులకు ఈ సంగతే తెలియకవచ్చు. రేపు అరెస్ట్‌ అయితే వారి పరిస్థితి ఏమిటి? రమ్యకు మద్దతుగా కన్నడ ఇండస్ట్రీ నిలబడింది. అంతే కాదు కర్నాటక మహిళా కమిషన్‌ సూమోటోగా కేసును తీసుకుని నిందితులను పట్టుకోమని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.ఒక నటుడి వ్యక్తిగత జీవితంలో అనవసరంగా తల దూర్చడం వల్ల ఇప్పటికే ఒక అభిమాని హత్యకు గురయ్యాడు. ఇప్పుడీ కేసు వల్ల ఎందరు అభిమానులు నష్టపోతారో?! తల్లిదండ్రులూ బహుపరాక్‌. తెలుగు నాట కూడా ఇలాగే అభిమానాలు వెర్రితలలు వేస్తున్నాయి. ఫోన్‌ చేతిలో ఉంది కదా అని హద్దు మీరిన వ్యాఖ్యలు చేస్తే అవి నేరాభియోగానికి ఆధారాలవుతాయి. శిక్షకు సాక్ష్యాలవుతాయి. పిల్లల్ని హెచ్చరించండి. వారు ఏ వయసు వారైనా సరే. (చదవండి: ఆలోచనలతో కంప్యూటర్‌ని కంట్రోల్‌ చేస్తున్న తొలి మహిళ! ఏకంగా 20 ఏళ్లకు పైగా పక్షవాతం..)

PM Modi addresses the Lok Sabha during special discussion on Operation Sindoor9
సిందూర్‌ ఆపాలని ఏ దేశాధినేతా చెప్పలేదు

న్యూఢిల్లీ: నిఘా వైఫల్యం కారణంగా పహల్గాంలో అత్యంత పాశవిక దాడి జరిగిందని, ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్‌ సాధించిన కీలక విజయాలేంటో చెప్పాలంటూ విపక్షాల డిమాండ్ల మధ్య లోక్‌సభలో ప్రధాని మోదీ సూటిగా సమాధానమిచ్చారు. ఆపరేషన్‌ సిందూర్‌పై 16 గంటల ప్రత్యేక చర్చకు సమాధానంగా ప్రధాని మోదీ వివరణ ఇస్తూనే గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు, విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. భారత్, పాక్‌ పరస్పర సైనిక చర్యలు పరిసమాప్తం కావడానికి తానే ముఖ్యకారణమని ఇప్పటికే పాతికసార్లు ఢంకా భజాయించిన ట్రంప్‌ మాటల్లో రవ్వంతైనా నిజంలేదని స్పష్టంచేశారు. ఉగ్రవాదాన్ని కాళ్లకింద నలిపేసేటప్పుడు ప్రపంచంలో ఏ దేశం వారించినా ఊరుకునేది లేదని వ్యాఖ్యానించారు. సిందూర్‌ తక్షణం ఆపేయాలని ప్రపంచంలో ఏ దేశ నేతా తమకు చెప్పలేదని మోదీ స్పష్టం చేశారు. 102 నిమిషాల ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..విజయోత్సవంలో ప్రసంగిస్తున్నా..‘‘ఉగ్రవాదానికి కుంభస్థలం వంటి పాక్‌లోని ఉగ్రస్థావరాలను మనం నేలమట్టంచేసినందుకు ఈరోజు పార్లమెంట్‌లో విజయోత్సవం జరుపుకుంటున్నట్లు అనిపిస్తోంది. భారత వాణిని ప్రపంచానికి వినిపించేందుకు, భారత్‌ అంటే ఎంటో అందరికీ మరోసారి చాటిచెప్పేందుకే మాట్లాడుతున్నా. సిందూర్‌ వేళ నాపై నమ్మకం ఉంచిన ప్రజలందరికీ రుణపడిపోయా. ఉగ్రవాదానికి తల్లివేరు వంటి పాక్‌కు ఆపరేషన్‌ సిందూర్‌తో అసాధారణరీతిలో గుణపాఠం చెప్పాం. ఆ భీకర దాడుల నుంచి పాక్‌ ఇంకా కోలుకోలేదు. దాడులు మళ్లీ జరగొచ్చని వాళ్లు ఇప్పటికీ భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆపరేష్‌ సిందూర్‌ అమలుకోసం మేం సైనిక బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. పహల్గాం దుశ్చర్యకు దీటుగా బదులిస్తూ పాక్‌ నడిబొడ్డున క్షిపణుల వర్షం కురిపించాం. కేవలం 22 నిమిషాల్లో భిన్న ప్రాంతాల్లోని కీలక ఉగ్రస్థావరాలను నేలమట్టంచేశాం. అణు బెదిరింపులు మన దగ్గర పనిచేయవని పాక్‌ను గట్టిగానే హెచ్చరించాం. మన దాడుల ధాటికి పాక్‌ వైమానిక స్థావరాలు సర్వనా శనమై ఇప్పటికీ అలాగే ఐసీయూలో ఉన్నాయి’’.ఆత్మనిర్భరతను ప్రపంచం కళ్లారా చూసింది‘‘ఆపరేషన్‌ సిందూర్‌లో బ్రహ్మోస్‌ వంటి స్వదేశీ క్షిపణులుసహా సొంత డ్రోన్ల వినియోగంతో భారత్‌ సాధించిన స్వావలంభన, ఆత్మనిర్భరతను ప్రపంచం కళ్లారా చూసింది. అమాయకులను ఉగ్రదా డులతో బలితీసుకుంటే ఎలాంటి స్పందనా ఉండదని ఇన్నాళ్లూ ఉగ్రదాడుల సూత్రధారులు భావించారు. ఇకపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే భారత్‌ దండయాత్ర చేయగలదని ఆపరేషన్‌ సిందూర్‌తో ఉగ్రవాదులక బాగా తెలిసొచ్చింది. ఆపరేషన్‌ సిందూర్‌ నుంచి సింధు దాకా భారత్‌ భిన్నకోణాల్లో ప్రతీకార చర్యలు చేపట్టింది. భవిష్య త్తులో తోకజాడిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పాక్‌కు బోధపడింది. ఉగ్రపోషకులు, పాక్‌ పాలకులు ఒక్కరే అనే భావనతోనే భారత్‌ ముందుకెళ్తోంది. ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఆపరేషన్‌ సిందూర్‌ మొదలెడితే ప్రపంచంలో మూడు దేశాలు తప్ప ఏ దేశమూ భారత్‌కు అడ్డుచెప్పలేదు. పాక్‌కు ఆ మూడుదేశాలే మద్దతు పలికాయి. ఇలా ప్రపంచదేశాలన్నీ భార త్‌కు అండగా నిలిస్తే కాంగ్రెస్‌ మాత్రం మన సైనికుల వీరత్వానికి సలామ్‌ చేయలేదు. పాకిస్థా న్‌ను కాంగ్రెస్‌ వెనకేసుకురావడం దౌర్భా గ్యం. గతంలో సర్జికల్‌ దాడులు చేసినప్పుడూ కాంగ్రెస్‌ ఇదే పాట పాడింది’’.నిమిషాల్లో నాశనం చేశాం‘‘పాక్‌ నడిబొడ్డున, ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రస్థా వరాలపై మన బలగాలు మేలో మెరుపుదాడులు చేశాయి. నిమిషాల్లోనే మీ స్థావరాలను సమాధులుగా మార్చగలమని పాక్‌కు నిరూపించాం. తొలుత ఉగ్రస్థావరాలను మన బలగాలు ధ్వసంచేశాయి. ఉగ్రవాదులకు సాయంగా పాక్‌ బలగాలు ప్రతిదాడులకు సిద్ధపడడంతోనే వాళ్ల వైమానిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించి కోలుకోలేని దెబ్బతీశాం. దీంతో పాక్‌ కాళ్లబేరానికి వచ్చింది. పాక్‌ డైరెక్టర్స్‌ జనరల్‌ ఆఫ్‌ మిలటరీ ఆపరేషన్స్‌(డీజీఎంఓ) నుంచి ఫోన్‌ వచ్చింది. ఇంతకుమించి దాడులు చేస్తే ఇప్పట్లో కోలుకోలేమని ప్రాధేయపడ్డారు. అందుకే సిందూర్‌కు ముగింపు పలికాం. ఆపరేషన్‌ను ఆపడానికి ఇదే ఏకైక కారణం. అంతేగానీ ప్రపంచంలో మరే దేశాధినేత కారణంగానో సిందూర్‌ ఆగలేదు. ఆపాలని ఎవరూ మాకు చెప్పలేదు. మే 9వ తేదీ రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ పదేపదే నాకు ఫోన్‌ చేశారు. అప్పటికే త్రివిధ దళాధిపతులతో భేటీలో బిజీగా ఉన్నాను. భేటీ తర్వాత నేనే ఫోన్‌కాల్‌ చేసి మాట్లాడా. పాక్‌ దాడి చేయబోతోందని ఉప్పందించారు. ఎలాంటి దాడినైనా అడ్డుకోగలమని ఆయనకు స్పష్టంచేశా. దాడికి ప్రతిదాడి దారుణంగా ఉంటుందని చెప్పా. బుల్లెట్లకు బాంబులతో సమాధానం చెప్తామన్నా. ఎన్నో విషయల్లో భారత్‌ స్వావలంభన సాధిస్తోంది. కాంగ్రెస్‌ మాత్రం చాలా అంశాలను ఎత్తిచూపేందుకు పాక్‌ పేరును మధ్యలోకి లాక్కొస్తోంది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పరోక్షంగా పాక్‌ అజెండాను ప్రకటించే అధికారిక ప్రతినిధులుగా తయార య్యా రు. గతంలో మేం సర్జికల్‌ దాడులుచేస్తే కాంగ్రెస్‌ వాళ్లు ఆధారాలు కావాలన్నారు. ఆనాడు పైలట్‌ అభి నందన్‌ పాక్‌ బలగాలకు దొరికిపోతే ఎలా విడిపించుకొస్తారో చూస్తామని మాట్లాడారు. తీరా మేం తీసుకొచ్చాక ఇదే కాంగ్రెస్‌ నేతలు నోరుమూశారు. ఉగ్రవాదులకు జరిగిన భారీ నష్టాన్ని చూసి అక్కడ పాక్‌ మాత్రమే కాదు ఇక్కడ భారత్‌లోనూ కొందరు ఏడుస్తున్నారు’’ అని మోదీ ఎద్దేవా చేశారు.విశ్వశాంతికి ఇది అవసరం‘‘విశ్వశాంతి సాధనలో ఆయుధ సంపత్తితో తులతూగడం కూడా ముఖ్యమే. అందుకే రక్షణరంగంలో ప్రైవేట్‌ భాగస్వామ్యానికి ద్వారాలు తెరిచాం. ఇప్పడు వందకు పైగా అంకురసంస్థలు రక్షణరంగంలో కృషిచేస్తున్నాయి. కొన్ని సంస్తలను మహిళలు ముందుండి నడిపిస్తున్నారు. ఇలాంటి జాతీయ భద్రతా ముందుచూపు కాంగ్రెస్‌కు గతంలోలేదు. ఇకమీదట కూడా రాదు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను ఇప్పటికీ భారత్‌ ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయిందన్న ప్రశ్నకంటే ముందు అసలు అదెలా మన చేయిజారిందనే ప్రశ్న వేసుకోవాలి. విశాల కశ్మీరం చేజారడానికి కారకులెవరు? నెహ్రూ హయాం నుంచి మొదలుపెడితే గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చేసిన ఘోర పరిపాలనా తప్పిదాల కారణంగానే భారత్‌ ఇప్పటికీ ఉగ్రదాడులు, ఇతర గాయాలతో బాధపడుతోంది’’ అని అన్నారు.వేయి క్షిపణులు ప్రయోగిస్తే అన్నింటినీ గాల్లోనే కూల్చేశాం‘‘భారత గగనతల రక్షణ వ్యవస్థల సత్తాను చూసి ప్రపంచదేశాలు నివ్వెరపోయాయి. సిందూర్‌కు ప్రతిగా పాక్‌ 1,000కిపైగా క్షిపణులను ప్రయోగిస్తే మన గగనతల రక్షణవ్యవస్థలు వాటన్నింటినీ గాల్లోనే పేల్చేశాయి. అదంపూర్‌ వైమానికస్థావరం నాశనమైందని పాక్‌ కారుకూతలు కూస్తే తెల్లారే అక్కడికెళ్లి అది నిక్షేపంగా ఉందని ప్రపంచానికి చాటిచెప్పా. భారత సైనిక సత్తాను దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్‌ నమ్మకపోవడం దారుణం. మన రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి, హోం మంత్రులు చెప్పిన మాటలకూ కాంగ్రెస్‌ విలువ ఇవ్వట్లేదు. పాక్‌ రిమోట్‌ కంట్రోల్‌తో కాంగ్రెస్‌ పనిచేస్తుందేమో. కొందరు కాంగ్రెస్‌ యువనేత (రాహుల్‌)లు ఆపరేషన్‌ సిందూర్‌ను తమాషాగా కొట్టిపారేశారు. మన సైనికుల అద్భుత విజయాన్ని చూసి కాంగ్రెస్‌ నేతలు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. లోక్‌సభలో ప్రత్యేక చర్చ మొదలైన నాడే ఆపరేషన్‌ మహదేవ్‌లో పహల్గాం ముష్కరులు ఎలా చనిపోయారని ప్రశ్నిస్తున్నారు. జాడ కనిపెట్టి ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి వారాలు, తేదీలు చూడాలా?’’ అని మోదీ ఆగ్రహంవ్యక్తం చేశారు.సిందూ నదీజలాల ఒప్పందం నెహ్రూ పాపమే‘‘మన నదీజలాలపై ప్రపంచబ్యాంక్‌ అజమాÆ ‡ుుషీ చేసేలా నెహ్రూ ప్రభుత్వం ఘోర తప్పుడు నిర్ణయం తీసుకుంది. భారతనేలపై పారే సిందూ నదీజలాల్లో 80 శాతం వాటా పాక్‌కు ఆయనే ధారాదత్తంచేశారు. ఇంతటి జనాభా ఉన్నప్పటికీ మనకు 20 శాతం మాత్రమే హక్కులు దఖలుపడ్డాయి. మన భారతీయ రైతుల నీటికష్టాలు నెహ్రూకు పట్టలేదు. నీళ్లివ్వడంతోపాటు నెహ్రూ పాక్‌కు నిధులు కూడా ఇచ్చారు. సిందూ నదీజలాలపై డ్యామ్‌లు కట్టుకునేందుకు నెహ్రూ ప్రభుత్వం పాక్‌కు ఆర్థికసాయం చేసింది. సిందూ నదీజలాల ఒప్పందంలో నెహ్రూ చేసిన భారీ తప్పిదాలను తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలూ సరిచేయలేదు. మేం వచ్చాకే ఆ తప్పులను సవరించాం. ఉగ్రదాడులతో భారతీయుల రక్తం పారేలా చేస్తున్నారు. అందుకే సిందూ నదీజలాల ఒప్పందం నుంచి వైదొలిగాం. నీళ్లు, రక్తం కలిసి ప్రవహించబోవని స్పష్టంచేశాం. ఆపరేషన్‌ సిందూర్‌ ముగిసిపోలేదు. పాక్‌ మళ్లీ కుయుక్తులతో పేట్రేగిపోతే సిందూర్‌ మళ్లీ మొదలవుతుంది’’ అని మోదీ స్పష్టం చేశారు.

Rasi Phalalu: Daily Horoscope On 30-07-2025 In Telugu10
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: శు.షష్ఠి రా.2.06 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: హస్త రా.10.31 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.11.39 నుండి 12.31 వరకు, అమృతఘడియలు: సా.4.02 నుండి 5.46 వరకుసూర్యోదయం : 5.41సూర్యాస్తమయం : 6.31రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకుయమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు మేషం: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి విషయంలో ఒప్పందాలు. దూరపు బంధువుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.వృషభం: ఇంటాబయటా సమస్యలు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. బంధువులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.మిథునం: కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. పనుల్లో జాప్యం. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపార విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగులకు పనిఒత్తిడులు.కర్కాటకం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. దైవదర్శనాలు. ఉద్యోగయత్నాలు సానుకూలం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.సింహం: కొన్ని సమస్యలు వేధిస్తాయి. పనుల్లో అవాంతరాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యం మందిస్తుంది. వ్యాపార , ఉద్యోగాలలో చిక్కులు.కన్య: రుణవిముక్తి. సంఘంలో ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు. పాత బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.తుల: పనులలో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆత్మీయులు, బంధువులతో అకారణ వైరం. శ్రమ తప్పకపోవచ్చు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.వృశ్చికం: ముఖ్య సమాచారం. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. పనులలో విజయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు నూతనోత్సాహం.ధనుస్సు: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆప్తులతో సఖ్యత. విందువినోదాలు. భూలాభాలు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.మకరం: బంధువులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. పనులు ముందుకు సాగవు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.కుంభం: ముఖ్య నిర్ణయాలు వాయిదా. పనుల్లో చికాకులు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.మీనం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. పనులలో అనుకూలత. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement