బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభాస్థలి పరిశీలన | - | Sakshi

బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభాస్థలి పరిశీలన

Apr 9 2025 1:42 AM | Updated on Apr 9 2025 1:42 AM

బీఆర్

బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభాస్థలి పరిశీలన

ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రం శివారు, చింతలపల్లి గ్రామ సమీపంలోని సుమారు 1200 ఎకరాల్లో ఈనెల 27న బీఆర్‌ఎస్‌ రజతోత్సవ భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి దాస్యం వినయ్‌భాస్కర్‌, ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు వేర్వేరుగా సభా స్థలాన్ని పరిశీలించారు. సభా స్థలి ప్రాంగణంలో అక్కడడక్కడ కొంత వరిపంట కోతదశలో ఉన్నందున ఆ పాంత్రాన్ని బీఆర్‌ఎస్‌ నేతలు పరిశీలించారు. మిగతా స్థల ప్రాంగణం పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. మరో వారం రోజుల్లో సభా స్థలం పనులు పూర్తి కానున్నాయని అంచనా వేశారు. నాయకులు పిట్టల మహేందర్‌, కడారి రాజు, తంగెడ నగేశ్‌, డుకిరె రాజేశ్వర్‌రావు తదితరులు ఉన్నారు.

దూరవిద్య ఎమ్మెస్సీ సైకాలజీ పరీక్షలు వాయిదా

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరి ధిలోని దూరవిద్య కేంద్రం ఎమ్మెస్సీ సైకాలజీ ఫైనలియర్‌ విద్యార్థులు, ఎక్స్‌ అభ్యర్థులకు థియరీ, ప్రాక్టికల్స్‌, డిప్లొమా ఇన్‌ గైడెన్స్‌ అండ్‌ కౌన్సెలింగ్‌ పరీక్షలు ఈనెల 24 నుంచి నిర్వహించాల్సిండగా ఆయా పరీక్షలు వాయిదావేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మళ్లీ ఆయా పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తర్వాత వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.

యాంటీ బయాటిక్స్‌తో పశువులకు ముప్పు

కేవీకే శాస్త్రవేత్త రాజన్న

మామునూరు: అధిక పాల దిగుబడి కోసం విచక్షణారహితంగా యాంటీ బయాటిక్స్‌ వినియోగిస్తే పశువులు, ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిళ్లుతుందని మామునూరు కేవీకే సీనియర్‌ శాస్త్రవేత్త, కోఆర్డి నేటర్‌ రాజన్న అన్నారు. ఖిలా వరంగల్‌ మండలం మామునూరు పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వ విద్యాలయంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కేవీకే, సద్గురు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో ‘యాంటీ మెక్రోబియల్‌ నిరోధకత– పరిష్కారాలు’ అనే అంశంపై పాడి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం డాక్టర్‌ వంశీకృష్ణ యాంటీ బయాటిక్స్‌ వినియోగం, వాటి మోతాదు, ఎక్కువ వాడితే కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. అంతకు ముందు పశువుల పాకల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, షెడ్డు నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన విషయాలపై డాక్టర్‌ అమృత్‌కుమార్‌ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వరప్రసాద్‌, కై లాశ్‌, సాయికిరణ్‌, శాస్త్రవేత్తలు, పాడి రైతులు పాల్గొన్నారు

బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభాస్థలి పరిశీలన 
1
1/2

బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభాస్థలి పరిశీలన

బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభాస్థలి పరిశీలన 
2
2/2

బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభాస్థలి పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement