Hanamkonda District News
-
టెంట్సిటీ నిర్మాణాలు త్వరగా చేపట్టాలి
కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతీనది పుష్కరాల్లో టూరిజంశాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన టెంట్సిటీ పనులు యుద్ధప్రాతిపాదికన చేట్టాలని మంత్రి శ్రీధర్బాబు.. భూపాలపల్లి కలెక్టర్ రాహుల్శర్మను ఆదేశించినట్లు తెలిసింది. బుధవారం హైదరాబాద్లోని సెక్రటేరియట్లో జరిగిన సరస్వతీ పుష్కరాల యాప్, వెబ్పోర్టల్ ప్రారంభ సమీక్షలో కలెక్టర్తో మంత్రి మాట్లాడినట్లు తెలిసింది. కాళేశ్వరంలోని వీఐపీ(సరస్వతి) ఘాట్ వద్ద తాత్కాలిక టెంట్సిటీ నిర్మాణాలకు రూ.83లక్షలు కేటాయించిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటి వరకు పనులు మొదలు కాలేదు. మేఘా, సింగరేణి, ఎన్టీపీసీల్లో ఏదో ఒక్క సంస్థకు అప్పగించి పనులు పూర్తి చేయాలని కలెక్టర్ను ఆదేశించినట్లు సమాచారం. టెంట్సిటీ కోసం ఇప్పటికే కాళేశ్వరంలో దేవస్థానానికి సంబంధించిన గుడిమాన్యం భూమిలో ఆరు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. రైతులకు కూడా పంటనష్టం అందజేశారు. కానీ నిర్మాణాలు మొదలు కాకపోవడంతో మంత్రి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో రెండు రోజుల్లో షార్ట్టెండర్స్ పిలిచి పనులు చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు ఆలయ వర్గాల సమాచారం. వీఐపీ ఘాట్ వద్ద విగ్రహాల తొలగింపు కాళేశ్వరంలోని వీఐపీ(సరస్వతి)ఘాట్ వద్ద పుష్కఘాట్ విస్తరణలో భాగంగా వేప, జమ్మి చెట్లు కలిసి ఉన్న చెట్టు కింద భక్తులు ఏర్పాటు చేసిన పలు దేవతా విగ్రహాలకు బుధవారం ఉద్వాసన పూజ చేసి తొలగించారు. కాగా, ఇటీవల కలెక్టర్ రాహుల్శర్మ సరస్వతీనది పుష్కరాల అభివృద్ధి పనులు పరిశీలించిన సమయంలో ఘాట్పై ఉన్న వేప, జమ్మి చెట్లు కలిసి ఉన్న చెట్టును తొలగించొద్దని, దేవతా విగ్రహాలను తొలగించి ప్రత్యేకంగా మళ్లీ ఓ చోట ఏర్పాటు చేయాలని అఽధికారులకు ఆదేశించారు. దీంతో తొలగింపు పనులు చేపట్టారు. కలెక్టర్కు మంత్రి శ్రీధర్బాబు ఆదేశం -
ఒక్కడే..18 బైక్లు చోరీ
హసన్పర్తి: ఒకే యువకుడు వివిధ ప్రాంతాల్లో పార్క్ చేసిన 18 బైక్లు చోరీ చేశాడు. వాహనాల తనిఖీల్లో తప్పించుకునే క్రమంలో పోలీసులను చూసి పారిపోతుండగా అదుపులోకి తీసుకుని తీసుకుని విచారించగా ఈ విషయం బయటపడింది. ఇందుకు సంబంధించిన వివరాలను కాజీపేట ఏసీపీ తిరుమల్ బుధవారం విలేకరులకు వెల్లడించారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం ఫతేపూర్కు చెందిన గుగులోత్ చందూలాల్ కొంతకాలంగా 56వ డివిజన్ గోపాలపురంలో ఉంటున్నాడు. తన స్నేహితుడి ఐడీతో జొమాటో, స్విగ్గి, ర్యాపిడో సంస్థల్లో పనిచేస్తున్నాడు.అయితే ఆ ఆదాయం సరిపడక పోవడంతో సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనకు వచ్చి రద్దీ ప్రాంతాల్లో పార్క్ చేసిన వాహనాలను మాయం చేస్తున్నాడు. ఇందులో భాగంగా హనుమకొండ పీఎస్ పరిధిలో ఏడు, హసన్పర్తి పీఎస్ పరిధిలో మూడు, కేయూసీ పీఎస్ పరిధిలో ఒకటి, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ పరిధిలో నాలుగు, భువనగిరిలో రెండు, హైదరాబాద్లో ఒకటిచొప్పున ఎత్తుకెళ్లాడు. ఇంటిలోనే చోరీ వాహనాలు.. హసన్పర్తి మండల కేంద్రంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసిన చందూలాల్ తప్పించుకునే క్రమంలో పట్టుకుని విచారించారు. చోరీ వాహనాలను ఫతేపూర్లోని తన ఇంటిలోనే భద్రపరిచినట్లు నిందితుడు అంగీకరించాడు. దీంతో అతడి ఇంటికెళ్లి 18 బైక్లు స్వాధీనం చేసుకున్న ట్లు ఏసీపీ తిరుమల్ చెప్పారు. కాగా, నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా, ఏసీపీ తిరుమల్, పోలీస్ ఇన్స్పెక్టర్ చేరాలు, ఎస్సై దేవేందర్, సిబ్బందిని వరంగల్ పో లీసు కమిషనర్ సన్ప్రీత్సింగ్ అభినందించారు. రద్దీ ప్రాంతాలే లక్ష్యం.. నిందితుడి అరెస్ట్ వివరాలు వెల్లడించిన కాజీపేట ఏసీపీ -
దిగుమతి సుంకాలు తగ్గిస్తే పత్తి రైతులకు నష్టాలు
వరంగల్: ది సదరన్ ఇండియా మిల్స్ అసోసియేషన్ కోరినట్లు దిగుమతి సుంకాలను 11శాతం కంటే ఎక్కువ మినహాయింపు కేంద్ర ప్రభుత్వం ఇస్తే దేశంలోని పత్తి రైతులు నష్టపోతారని తెలంగాణ కాటన్ మిల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, వరంగల్ చాంబర్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి అన్నారు. బుధవారం మధ్యాహ్నం మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అధ్వర్యంలో కేంద్ర కమిషనర్ ఆఫ్ టెక్స్టైల్స్ రూప్ రాశి.. వీడియో కాన్ఫరెన్న్స్ నిర్వహించారు. ఈ వీసీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల టెక్స్టైల్స్ సెక్రటరీలు, ఫైనాన్స్ సెక్రటరీలు, సీసీఐ సీఎండీ లలిత్కుమార్ గుప్తా, దేశంలో టెక్స్టైల్స్, స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషనలతోపాటు తెలంగాణ కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి పాల్గొన్నారు. రవీందర్రెడ్డి మాట్లాడుతూ దేశంలోని టెక్స్టైల్స్ ఇండస్ట్రీ దిగుమతి చేసుకుంటున్న దూదిబేళ్లపై దిగుమతి సుంకాలను కేంద్ర ప్రభుత్వం మినహాయింపు(తగ్గిస్తే) ఇస్తే దేశంలోకి ఇతర దేశాలనుంచి దూదిబేళ్ల దిగుమతులు ఎక్కువై సాగు చేసే రైతుల ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. -
వేసవిలో డ్రైవర్లు జాగ్రత్తలు తీసుకోవాలి
హన్మకొండ: వేసవి కాలంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ డ్రైవర్లు విధులు నిర్వర్తించాలని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయ భాను అన్నారు. బుధవారం హనుమకొండ రాంనగర్లోని ఆర్టీసీ హనుమకొండ డిపోలో జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ డ్రైవర్లకు వాటర్ క్యాన్లు, రుమాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ డ్రైవర్లు ఎండతోపాటు ఇంజన్ వేడి తట్టుకోవడం ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. ఇలాంటి తరుణంలో తగినంత తాగు నీరు తీసుకోవాలన్నారు. అదే విధంగా ఎండ నుంచి ఉపశమనానికి రుమాలు చుట్టుకోవాలన్నారు. డ్యూటీలో అస్వస్థతకు గురవుతున్నట్లు కనిపించినా, డీ హైడ్రేషన్కు గరైనా వెంటనే ఓఆర్ఎస్ తీసుకోవాలన్నారు. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వడగాలులు, ఎండ వేడి నుంచి కొంతైనా ఉపశమనం పొందొచ్చన్నారు. ఈ క్రమంలోనే హనుమకొండ డిపోలోని ప్రతీ డ్రైవర్కు జ్యూట్ బ్యాగుతో కూడిన 5 లీటర్ల వాటర్ క్యాన్, రుమాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించినట్లు వివరించారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. హనుమకొండ డిపో మేనేజర్ బి.ధరమ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్లు కేశరాజు భానుకిరణ్, మహేశ్, హనుమకొండ డిపో ట్రాఫిక్ సూపర్వైజర్ నజియాసుల్తానా, మెకానిక్ సూపర్వైజర్ వి.చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయ భాను -
నెల రోజుల్లో ‘కిటెక్స్’ ప్రారంభం
గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ–సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు(కేఎంటీపీ)లోని కేరళ కేంద్రంగా ఉన్న ‘కిటెక్స్’ కంపెనీని నెల రోజుల్లో ప్రారంభిస్తామని మేనేజర్ మనోజ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ సత్యశారద, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి కంపెనీ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా మేనేజర్ మనోజ్.. కలెక్టర్, ఎమ్మెల్యేకు కంపెనీలో తయారు చేసే గార్మెంట్లు, ఉద్యోగావకాశాల గురించి వివరించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోందని, వచ్చే నెలలో ప్రధాని మోదీతో కంపెనీని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా, కంపెనీలో ఇప్పటికే పలు కేటగిరీలకు చెందిన ఉద్యోగుల భర్తీ ప్రత్యక్షంగా, ఆన్లైన్లో కొనసాగుతోంది. కంపెనీ ఇప్పటికే 25,000 ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రతి రోజూ నిరుద్యోగులు కంపెనీ వద్దకు దరఖాస్తులతో క్యూ కడుతున్నారు. టీజీ ఐఐసీ జోనల్ మేనేజర్ అజ్మీరా స్వామి, గీసుకొండ తహసీల్దార్ ఎండి. రియాజుద్దీన్, తదితరులు పాల్గొన్నారు. 20న హజ్ యాత్రికులకు శిక్షణ న్యూశాయంపేట : పవిత్ర మక్కాలోని హజ్యాత్రకు వెళ్లే ఉమ్మడి వరంగల్ జిల్లా యాత్రికులకు ఈనెల 20 ఆదివారం ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా హజ్ సొసైటీ అధ్యక్షుడు సర్వర్మోహియోద్దీన్ ఘాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వరంగల్ ఎల్బీ నగర్లోని ఏ1 ఫంక్షన్హాల్లో ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. యాత్రికులకు ప్రొజెక్టర్ ద్వారా సవివరంగా యాత్ర ఎలా చేయాలనే విషయాలపై శిక్షణ అందిస్తారన్నారు. శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర హజ్కమిటీ చైర్మన్ ఖుష్రూపాషా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. యాత్రీకులు సకాలంలో హాజరుకావాలని ఆయన కోరారు. ● కంపెనీ మేనేజర్ మనోజ్ ● పనుల పురోగతిని పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యేకు వివరించిన మేనేజర్ -
మోసగించడం కాంగ్రెస్కు వెన్నతో పెట్టిన విద్య
ఎల్కతుర్తి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను నమ్మించి మోసం చేయడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. బుధవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామ సమీపంలో సుమారు 1,200 ఎకరాల్లో ఈనెల 27న నిర్వహించబోయే బీఆర్ఎస్ రజతోత్స సభ ఏర్పాట్లను ఆమె మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, నరేందర్, నాయకులు నాగుర్ల వెంకన్న, భరత్కుమార్, రాకేశ్రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్యవతి రాథోడ్ మాట్లాడారు. తప్పుడు ప్రచారం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చితకిలపడిపోయిందన్నారు. నాడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని చెప్పారు. సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సదానంద, పార్టీ మండల అధ్యక్షులు మహేందర్, మండల సురేందర్, సింగిల్విండో చైర్మన్ శ్రీపతి రవీందర్గౌడ్, తంగెడ మహేందర్, గోల్లె మహేందర్, మాజీ సర్పంచ్లు కుర్ర సాంబమూర్తి, దుగ్యాని సమ్మయ్య, జూపాక జడ్సన్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ -
రూ. 5.60 లక్షల విలువైన ఎండు గంజాయి పట్టివేత
● ముగ్గురి అరెస్ట్, రిమాండ్ ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ సంపత్రావు భూపాలపల్లి అర్బన్: గణపురం మండలం రవినగర్ సమీపంలో రూ. 5.60లక్షల విలువైన 11 కేజీల ఎండు గంజాయి పట్టుకుని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం భూపాలపల్లి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్ల డించారు. భూపాలపల్లి మండలం గుర్రంపేటకు చెందిన ఆరెల్లి అఖిల్, గణపురం మండలం చెల్పూరుకు చెందిన ఆముదాల కార్తీక్, హనుమకొండ జిల్లా నడికూడ మండలం వరికోల్కు చెందిన ముస్కే రోహిత్ స్నేహితులు. తాము సంపాదించే డబ్బులు జల్సాలకు సరిపోకపోవడంతో కొద్ది రోజులుగా ఒడిశాలోని కొండప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసి భూపాలపల్లి, గణపురం మండలాల పరిసర ప్రాంతాల్లో అమ్ముతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 15న రవినగర్ సమీపంలో గంజాయి రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు అశోక్ తన సిబ్బందితో కలిసి మంగలోనికుంట మత్తడి వద్ద మాటు వేయగా ముగ్గురు వ్యక్తులు సంచులు పట్టుకుని అనుమానాస్పందగా కనిపించారు. దీంతో అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి రవాణా చేస్తున్నట్లు అంగీకరించడంతో సరుకు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ సంపత్రావు తెలిపారు. కాగా, గంజాయిని పట్టుకోవడంలో ఉత్తమ విధులు నిర్వర్తించిన చిట్యాల సీఐ మల్లేశ్, సీసీఎస్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అశోక్, సీసీఎస్ ఎస్సై భాస్కర్రావు, సిబ్బందిని అభినందించారు. వడదెబ్బతో మహిళ మృతి నర్సంపేట రూరల్ : వడదెబ్బతో ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘ టన నర్సంపేట మండలంలోని రాజుపేట శివారు గార్లగడ్డతండా లో చోటు చేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం.. తండాకు చెందిన ఫాల్తియా వసంత (35) మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి పజ్జజొన్న చేనులో పని చేసి సాయంత్రం ఇంటికి వచ్చింది. అదేరోజు రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబీకులు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది. మృతురాలికి భర్త భద్రు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రైలునుంచి జారి పడి యువకుడి మృతి ఖిలా వరంగల్ : వరంగల్ రైల్వేగేట్ వద్ద ఓ యువకుడు రైలు నుంచి జారి పడి మృతి చెందినట్లు జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ రాజు తెలిపారు. వరంగల్ శివనగర్లోని ఏసీరెడ్డి నగర్కు చెందిన పెరుమాండ్ల అనిల్ (29) మంగళవారం రామగుండంలో కూలి పనికి వెళ్లి తిరిగి రైలులో సాయంత్రం ఇంటికి బయలుదేరాడు. ఈక్రమంలో రైలు వరంగల్ రైల్వే గేట్ సమీపాన చేరుకోగానే అనిల్ అందులోనుంచి జారిపడగా తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆటోలో ఎంజీఎం తరలించగా.. వై ద్యుల సూచన మేరకు హైదరాబాద్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవా రం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య మానస ఫిర్యాదు మేరకు శవపంచనామ నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ రాజు తెలిపారు. -
విద్యుత్ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి హన్మకొండ : ఈదురుగాలులు, భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో 16 సర్కిళ్ల పరిధిలో ప్రతీ అధికారి, ఉద్యోగి అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. బుధవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల సూపరింటెండెంట్ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ఈదురుగాలులకు చెట్లు విరిగి లైన్లు తెగిపడి ట్రిప్పింగ్స్, బ్రేక్ డౌన్స్ జరిగిన వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎప్పటికప్పడు తమ సర్కిల్ పరిధిలోని సమాచారాన్ని కంట్రోల్ రూమ్కు చేరవేయాలని, అక్కడి నుంచి కార్పొరేట్ ఆఫీస్కు సమాచారం అందించాలన్నారు. కావాల్సిన మెటీరియల్ అందుబాటలో ఉంచామని, ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. ఎక్కువ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, జగిత్యాల, పెద్దపల్లి ప్రాంతాల్లో ఎక్కువ ఈదురుగాలులు, భారీ వర్షాలు పడుతాయని, ఎస్ఈలు ఎప్పటికప్పుడు విద్యుత్ సరఫరా మానిటర్ చేస్తూ, మెన్, మెటీరియల్తో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్ టి.మధుసూదన్, సీఈలు రాజుచౌహాన్, అశోక్, 16 సర్కిళ్ల ఎస్ఈలు పాల్గొన్నారు. -
పీఆర్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
● వరంగల్ జెడ్పీ సీఈఓ రాంరెడ్డి వరంగల్: జిల్లాలోని పంచాయతీరాజ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వరంగల్ జెడ్పీ సీఈఓ రాంరెడ్డి తెలిపారు. అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యలపై బుధవారం సీఈఓ రాంరెడ్డి ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా పీఆర్లోని ఆఫీస్ సబార్డినేట్లకు రికార్టు అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించకుండా.. ఇతర శాఖల నుంచి వచ్చిన వారి కోసం ఖాళీగా పెట్టినట్లు విమర్శలు వస్తున్నట్లు సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. రికార్డు అసిస్టెంట్ల పదోన్నతులతోపాటు కారుణ్య నియామకాలకు సంబంధించిన ఫైళ్లను క్లియర్ చేస్తామని సీఈఓ హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. సమావేశంలో పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం నాయకులు యుగేందర్, విజయపాల్రెడ్డి, రవికుమార్, రాజ్కుమార్, ఎలీషా తదితరులు పాల్గొన్నారు. కక్కిరాలపల్లిలో వ్యక్తి ఆత్మహత్య ఐనవోలు: ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన మండలంలోని కక్కిరాలపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై పస్తం శ్రీనివాస్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కత్తెరశాల చందర్(40) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో రెండో భార్య శ్వేతతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీనిపై మనస్తాపానికి గురైన చందర్ బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, చందర్కు మొదట మమతతో వివాహం జరగగా ఇద్దరు కుమారులు రాజేశ్, రోహిత్ జన్మించారు. చందర్తో మొదటి భార్య, కుమారులు వేరుగా ఉండడంతో సుమారు 10 సంవత్సరాల క్రితమే శ్వేతను రెండో వివాహం చేసుకున్నాడు. చందర్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్సై తెలిపారు. -
తెలుసుకోండి..!
కొనేముందు ఖిలా వరంగల్: బంగారం ఆభరణాలంటే ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా మహిళలు మక్కువ చూపుతారు. హుందాకు చిహ్నంగా భావిస్తారు. అందుకే పెళ్లిళ్లు, శుభకార్యాలయాల్లో బంగార ఆభరణాలదే అగ్రస్థానం. ధర ఎంత పెరిగినా.. పసిడిని కొనుగోలు చేయడం మానరు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం సంప్రదాయ అవసరాలు తీర్చడమే కాకుండా పెట్టుబడులకు కూడా ఉపయోగపడుతోంది. అందుకే చాలా మంది భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని బంగారం కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏటా బంగారం విక్రయాలు పెరుగుతున్నాయి. అదే స్థాయిలో షాపులు కూడా పెరుగుతున్నాయి. భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ, ములుగు, ఏటూరునాగరం, నర్సంపేట, పరకాల, తొర్రూరు, వర్ధన్నపేట, స్టేషన్ఘన్పూర్ తదితర ప్రాంతాల్లో పదుల సంఖ్యల్లో బంగారు ఆభరణాల షాపులు ఉన్నాయి. కొనుగోలు సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అసలు బంగారం, దాని నాణ్యతను సులువుగా గుర్తించి మోసాలకు చెక్ పెట్టొచ్చు. వరంగల్ ట్రైసిటీలో చిన్న, పెద్ద కలిపి సుమారు 150పైగా దుకాణాలు ఉన్నాయి. అనధికారికంగా మరికొన్ని వెలుస్తున్నాయి. ప్ర స్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.95 వేలకుపైగా చేరింది. ఈ క్రమంలో కొనుగోలు సమయంలో వినియోగదారులు అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.బంగారంలోనే రంగులుబంగారు ఆభరణం తయారీలో నికిల్, మాంగనీస్ లేదా పల్లాడియం వంటి లోహాలు కలుపుతారు. అప్పుడు అది బంగారం వర్ణంలోనే కొంచెం తెల్లని ఛాయలో ఉంటుంది. రాగి ఎక్కువ కలిపితే ఎరుపు, గులాబీ ఛాయలో కనిపిస్తుంది. రోజ్గోల్డ్ అయితే అందులో 25 శాతం రాగి కలిపినట్లు అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ఆ బంగారంతో 18 క్యారెట్లు మాత్రమే ఉంటుంది. వెండి, మాంగనీస్, రాగిని ఉపయోగిస్తే బూడిద రంగు ఛాయలో ఉంటుంది. కేవలం వెండిని మాత్రమే కలిపితే గ్రీనిస్ షేడ్లో కనిపిస్తుంది.స్వచ్ఛత గుర్తింపు ఇలా..ఆభరణం అంచులు రంగు పోయి బంగారపు వర్ణం కాకుండా ఇతర వర్ణం కనిపిస్తుంటే అది కచ్చితంగా పూత పోసిన ఆభరణమని గ్రహించాలి. నోటి పళ్ల మధ్య పెట్టి బలంతో ఆభరణాన్ని నొక్కి చూడండి. స్వచ్ఛ బంగారమా.. పూత పోసిందా అని తెలుసుకోవచ్చు. పంటి గాట్లను గమనించి బంగారం నాణ్యతను సులభంగా తెలుసుకోవచ్చు. బంగారంలో ఇనుము కలిసి ఉంటే ఆయస్కాంతంతో గుర్తించొచ్చు. షైనింగ్ లేని సిరామిక్ ప్లేట్ మీద బంగారు ఆభరణాన్ని రుద్దితే నల్లని చారలు పడితే ఆది స్వచ్ఛమైనది కాదు. బంగారు గీతలు పడితే స్వచ్ఛమైనది అని అర్థం. ఆభరణం కొనుగోలుకు ముందే షాపు వద్ద నైట్రిక్ యాసిడ్తో టెస్ట్ చేయమని కోరవచ్చు. ఆభరణంపై చుక్క నైట్రిక్ యాసిడ్ వేసిన వెంటనే రసాయనిక చర్య ప్రారంభమై ఆకుపచ్చ రంగులో కనిపిస్తే బేస్ మెటల్ లేదా బంగారు పూత వేసిందిగా గ్రహించాలి. బంగారం వర్ణంలోనే రియాక్షన్ కనిపిస్తే బంగారం పూత వేసి ఇత్తడిగా గమనించాలి. పాల రంగులో కనిపిస్తే వెండి ఆభరణంగా ఎలాంటి రియాక్షన్ లేకపోతే దానిని స్వచ్ఛమైన ఆభరణంగా గుర్తించాలి.కేడీఎం అంటే..జ్యూవెల్లరీ దుకాణంలో బంగారం కొనే సమయంలో ఆ ఆభరణం కేడీఎం అని షాపు యజమానులు చెబుతారు. అసలు కేడీఎం అంటే బంగారు ఆభరణాలు తయారీలో కాడ్మియంతో సోల్డరింగ్ చేస్తారు. ఇవి 91.6 స్వచ్ఛతతో ఉంటాయి.ఇవి గమనించాలి..24 క్యారెట్ల బంగారంలో 99.9, 22 క్యారెట్ బంగారంలో 91.6 శాతం స్వచ్ఛత ఉంటుంది. స్వచ్ఛ బంగారం మొత్తగా ఉంటుంది. బంగారంలో కలిపిన ఇతర లోహాల శాతాన్ని బట్టి ఆభరణాల రంగు, గట్టిదనం, మన్నిక ఆధారపడి ఉంటాయి. నాణ్యత తెలిపే కొలమానం వేయించుకుని రశీదులు తీసుకోవాలి. భవిష్యత్లో తేడా వస్తే కేసు వేయడానికి అవకాశం ఉంటుంది. పసిడి నాణ్యతను గుర్తించండిలా..హాల్మార్క్తోనే మోసాలకు చెక్యూనిక్ ఐడీ నంబర్ను బట్టి స్వచ్ఛతనాణ్యత శాతం సర్టిఫికెట్తోనేఅసలు గుర్తింపుక్యారెట్ల బట్టి స్వచ్ఛత..24 క్యారెట్ల: 99.9 శాతం స్వచ్ఛత ఇది.బిస్కెట్ రూపంలో ఉంటుంది.22 క్యారెట్లు: 91.6 శాతం బంగారం,మిగతా 8.4 శాతం ఇతర లోహాలు కలుస్తాయి.18 క్యారెట్ల: 75 శాతం బంగారం,మిగతా 25శాతం ఇతర లోహాలు14 క్యారెట్లు: 58.5 శాతం బంగారం,మిగతా భాగం ఇతర లోహలు12 క్యారెట్లు: 50శాతం మాత్రమేబంగారం, మిగతా 50శాతం ఇతర లోహాలు మిశ్రమంతో తయారీ అవుతుంది.10 క్యారెట్లు: 41.7 శాతం బంగారం మాత్రమే ఉంటుంది.24 క్యారెట్లు అంటే..బంగారం స్వచ్ఛతను క్యారెట్ల రూపంలో కొలుస్తారు. 99.9 శాతం స్వచ్ఛత ఉన్న బంగారాన్ని 24 క్యారెట్ల బంగారం అంటారు. దీనితో ఆభరణాలు చేయరు. ఇది బిస్కెట్ రూపంలోనే ఉంటుంది. ఆభరణాలు గట్టిగా , మన్నికగా ఉండేందుకు గాను స్వచ్ఛమైన బంగారానికి రాగి, వెండి, కాడ్మియం, జింక్ వంటి ఇతర లోహాలు కలుపుతారు. ఇలా చేయడం ద్వారా బంగారం స్వచ్ఛత 22.18.14 క్యారెట్లుగా నిర్ధారిస్తారు. -
హాల్మార్క్ సర్టిఫికెట్తో కొనుగోలు చేయాలి
బంగారు ఆభరణాల కొనుగోలులో వినియోగదారులు జాగ్రత్తలు పాటించాలి. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు వ్యాపారులకు వరంగా, వినియోగదారులకు భారంగా మారాయి. రెడీమేడ్ బంగారం, వెండి ఆభరణాల్లో 60 నుంచి 70శాతం నష్టాన్ని కలిగిస్తాయి. నాణ్యతాప్రమాణాల గుర్తింపు కోసం హాల్మార్క్ ముద్ర, నాణ్యత శాతాన్ని సూచించే నంబర్తో కూడిన వస్తువునే కొనుగోలు చేయాలి. వస్తువు నాణ్యత లేనిపక్షంలో బీఐఎస్కు ఆన్లైన్లో లేదా వినియోగదారుల సంఘాల ప్రతినిధికి ఫిర్యాదు చేయాలి –మొగిలిచెర్ల సుదర్శన్, రాష్ట్ర అధ్యక్షుడు, సీసీఐ -
రెండు రోజుల శిక్షణలో కమిషనర్
వరంగల్: చైన్నెలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ‘స్పాంజ్ పార్క్ ఫ్రేమ్ వర్క్ ఫర్ రెసిలెంట్ ఓపెన్ స్పేసెస్’ కార్యక్రమంలో వరంగల్ బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే బుధవారం పాల్గొన్నారు. స్థిరమైన పట్టణాభివృద్ధి–స్మార్ట్ సిటీస్–ఐఐ (ఎస్యూడీఎస్–2) ప్రాజెక్టులో భాగంగా ఈశిక్షణ చైన్నెలో నిర్వహిస్తున్నారు. జర్మన్ ఫెడరల్ మినిస్ట్రీ ఫర్ ఎకనామిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్(బీఎంజడ్) తరఫున డ్యూయిష్ గెసెల్స్ చాఫ్ట్ ఫర్ ఇంటర్నేషనల్ జుసామెనార్బీట్ (జీఐజడ్) మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్(ఏంఓహెచ్యుఏ) సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ ఏర్పాటు చేశారు. నగరాల్లో స్పాంజ్ పార్కుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయడం, డిజైన్ చేయడం, అమలు చేయడంతో పాటు వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి పట్టణ అధికారుల సామర్థ్యాలను పెంపొందించడం ఈ శిక్షణ ప్రధాన లక్ష్యమని కమిషనర్ తెలిపారు. పట్టణాల్లో సంభవించే వరదలను తగ్గించడం, భూగర్భ జలాలను పెంపొందించడం (రీఛార్జ్ చేయడం) పురపాలికల్లో ఇలాంటి వినూత్న ఆవిష్కరణలను అమలు చేయడానికి ప్రణాళికలను రూపొందించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. -
జాతీయ రహదారితో జిల్లా అభివృద్ధి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద వరంగల్: జాతీయ రహదారి నిర్మాణంతో జిల్లా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. సంగెం మండలం తిమ్మాపూర్, గీసుకొండ మండలం మచ్చాపూర్ గ్రామాల్లో గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులతో బుధవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఆర్బిటేషన్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. హైవే నిర్మాణంతో భవిష్యత్లో హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా వరంగల్ను చూడవచ్చని తెలిపారు. నేషనల్ హైవే యాక్ట్ ప్రకారం రైతులకు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో వరంగల్ ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, సంగెం, గీసుకొండ, తహసీల్దార్లు రాజ్కుమార్, రియాజొద్దీన్, రైతులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ప్రత్యేక అధికారులు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు కోసం ప్రభుత్వం నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారులను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నర్సంపేట నియోజకవర్గానికి ఆర్డీఓ ఉమారాణి, వర్ధన్నపేటకు డీసీఓ ఎం.నీరజ, వరంగల్ తూర్పు నియోజకవర్గానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ కె.ప్రసన్నరాణిని నియమించింది. -
స్విమ్మింగ్ పూల్ నిర్మాణం పూర్తి చేయండి
మేయర్ గుండు సుధారాణి వరంగల్: బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలోని ఇండోర్ స్టేడియం సమీపంలో సుమారు రూ.1.50 కోట్లతో చేపట్టిన స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులను మేయర్ ఆకస్మికంగా తనిఖీ చేసి పనులు కొనసాగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యం సరికాదని మేయర్ అన్నారు. పనులు త్వరితగతిన పుర్తయ్యేలా ఇంజనీరింగ్ అధికారులు నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. స్విమ్మింగ్ ఫూల్ చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేయాలని హార్టికల్చర్ అధికారిని ఆదేశించారు. కార్యక్రమంలో హెచ్ఓ రమేశ్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, ఈఈ రవికుమార్, డీఈ రాజ్కుమార్, ఏఈ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హుల ఎంపికలో మార్గదర్శకాలు తప్పనిసరి
హన్మకొండ అర్బన్: ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపికలో ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ఎంపిక తీరుపై వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో బుధవారం కలెక్టరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులైన వారి ఎంపికను ఇందిరమ్మ కమిటీతో కలిసి అధికారులు చేయాలన్నారు. మే 2వ తేదీన ఎంపిక చేసిన వారి జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించాలన్నారు. వేసవి నేపథ్యంలో.. జిల్లాలో ఎక్కడా తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట చేతిపంపులకు మరమ్మతులు చేయించాలన్నారు. అనంతరం మిషన్ భగీరథ ఎస్ఈ మల్లేశం మాట్లాడుతూ.. మిషన్ భగీరథ ద్వారా జిల్లాలోని అన్ని గ్రామాలకు, ఆవాసాలకు తాగునీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లు తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించడానికి చర్యలు చేపడతామని అధికారులకు సూచించారు. సమావేశంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అధికారులు అడిగిన పలు సందేహాలకు జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి రవీందర్ వివరణ ఇచ్చారు. కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, ఎంపీడీఓలు, ఎంపీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి అధికారులతో సమీక్ష -
గురువారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోuఉమ్మడి జిల్లాలో ప్రజల సొమ్ముతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చిట్టీ డబ్బులు డిపాజిట్లుగా...తొండ ముదిరి ఊసరవెల్లిగా మారినట్లు చిట్ఫండ్ కంపెనీలు ముదిరి రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోయాయి. కొందరు తమ చిట్ఫండ్ కంపెనీలో చేరిన ఖాతాదారుడికి సకాలంలో డబ్బులు చెల్లించకుండా ‘మీ డబ్బులు మా వద్ద భద్రంగా ఉంటాయి. నెలనెలా వడ్డీ ఇస్తాం’. అంటూ డిపాజిట్లు చేయించుకున్నారు. అదే సమయంలో ఖాతాదారుడికి అవసరముండి డిపాజిట్ డబ్బులు చెల్లించండి అంటే డబ్బులు లేవు తాము చేసిన వెంచర్లో ప్లాట్ తీసుకో.. లేదంటే దిక్కున చోట చెప్పుకోమంటూ బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో బాధితులంతా కలిసి సంఘాలను ఏర్పాటు చేసుకుని చిట్స్ కార్యాలయాల ఎదుట డప్పు వాయిస్తూ నిరసన తెలపుతున్నారు. ● కట్టిన డబ్బులు ఇవ్వకుండా తిప్పుకుంటున్న సంస్థలు ● చిట్ఫండ్స్ బాధితులంతా కలిసి సంఘాల ఏర్పాటు ● అయ్యా మా చిట్టీ డబ్బులు మాకు ఇప్పించండని అధికారులకు వేడుకోలు ● ఏం చేయలేమంటూ చేతులెత్తేస్తున్న యంత్రాంగం ● డబ్బులు లేవు.. ప్లాట్లు తీసుకోండంటూ నిర్వాహకుల బెదిరింపులు కాజీపేట అర్బన్ : ప్రైవేట్ వ్యక్తుల వద్ద చిట్టీలు కడితే సొమ్ముకు భద్రత ఉండదని, రిజిస్టర్డ్ చిట్ఫండ్స్ కంపెనీల్లో చేరితే ప్రభుత్వమే భద్రత కల్పిస్తుందని ఆశపడ్డ సామాన్య, మధ్య, తరగతి కుటుంబాలకు నిరాశే మిగిలింది. చిట్టీ గడువు ముగిసినా డబ్బులు ఇవ్వకుండా నిర్వాహకులు తిప్పుకుంటున్నారు. గట్టిగా అడిగితే ప్లాట్ అయితే ఉంది.. తీసుకుంటే తీసుకో.. లేకపోతే లేదు అంటూ బెదిరిస్తున్నారు. దీంతో ఎటూ పాలుపోని ఖాతాదారులు బాధిత సంఘంగా ఏర్పడి అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. ఆయా చిట్ఫండ్ సంస్థల ఎదుట నిరసనలు తెలుపుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న పలు ఘటనలే ఇందుకు నిదర్శనం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు ఎనిమిది వేల మంది చిట్స్బాధితులు డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో చిట్స్, టర్నోవర్ ఇలా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రిజిస్టర్డ్ చిట్స్ 168 బ్రాంచ్లు ఉన్నాయి. ఇందులో 108 చిట్స్ కంపెనీల బ్రాంచీలు మాత్రమే నేటికీ లావాదేవీలను కొనసాగిస్తున్నాయి. 60 కంపెనీలు గతంలో తాము తీసుకున్న చిట్టీల లావాదేవీలు తప్ప కొత్తవి వేయడం లేదు. ఉమ్మడి జిల్లాలో ఏడాదికి చిట్స్ కంపెనీలు రూ.340కోట్ల టర్నోవర్తో నడుస్తుంటాయి. కరోనా సమయంనుంచి నేటి వరకు చిట్ఫండ్స్ తమకు రావాల్సిన డబ్బులను రికవరీ చేసుకుంటున్నాయి తప్ప ఖాతాదారులకు డబ్బులు ఇవ్వకుండా తిప్పుకుంటున్నాయి. ఆస్తులు, డిపాజిట్లు సీజ్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెలనెలా వాయిదాలు కట్టి తిరిగి చెల్లింపులకు నోచుకోని బాధితులు చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్తోపాటు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. దీంతో వరంగల్ నగరంలోని పలు పేరుమోసిన చిట్పండ్ సంస్థల ఆస్తులు, డిపాజిట్లను సీజ్ చేశారు. సీజ్ చేసిన డిపాజిట్ల విలువ రూ.76కోట్లు కాగా, రూ.100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. డబ్బుల కోసం వెళ్లిన ఖాతాదారులకు ‘మా ఆస్తులు, డిపాజిట్లు సీజ్ చేశారు. మేం ఎలా చెల్లించాలో చెప్పండి’ అంటూ నిర్వాహకులు ఎదురు ప్రశ్నించడంతోపాటు కొన్ని సందర్భాల్లో దాడులకు సైతం దిగుతున్నారు. డబ్బులకు జవాబుదారీ ఎవరు? రిజిస్టర్డ్ చిట్ఫండ్ కంపెనీల ఏర్పాటు సమయంలో చిట్టీలకు తగ్గట్టుగా వందశాతం డిపాజిట్ రూపంలో జిల్లా చిట్స్ సహాయ రిజిస్ట్రార్ కార్యాలయంలో చెల్లించాల్సి ఉంటుంది. ‘కంపెనీ సకాలంలో చెల్లింపులు చేయకపోయినా, బోర్డు తిప్పేసినా మీ డబ్బులకు ఎలాంటి ఢోకాలేదు. డిపాజిట్ల నుంచి చెల్లించే అవకాశం ఉంది’ అని నమ్మబలుకుతారు. దీంతో మన సొమ్ము భద్రత ఉందని భావించి సామాన్య, మధ్య తరగతి ప్రజలు చిట్ఫండ్ కంపెనీల్లో చేరుతున్నారు. ఇప్పటికే పలు చిట్ఫండ్ కంపెనీలు డబ్బులు చెల్లించకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే మరోవైపు ఇటీవలి కాలంలో తొమ్మిది చిట్ఫండ్ కంపెనీలు బోర్డు తిప్పేశాయి. ఆయా బాధితులు అధికారుల దగ్గరికి వెళ్తే.. తాము ఏం చేసే పరిస్థితి లేదు. వారిని పిలిపించి మాట్లాడతాం.. లేదంటే పోలీస్ స్టేషన్కు వెళ్లండి అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా..లేదా అన్నది వేచి చూడాల్సిందే. అక్షర చిట్స్ కార్యాలయం ఎదుట డప్పు వాయిస్తూ నిరసన తెలుపుతున్న బాధితులు (ఫైల్)న్యూస్రీల్ -
తెలుగు విభాగంలో ‘బదిలీ’ వివాదం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని తెలుగు విభాగంలో బదిలీ వివాదం నెలకొంది. ఓ తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ బదిలీపై జరిగిన డిపార్ట్మెంటల్ సమావేశంలో విభాగాధిపతి తీరుపై మిగతా సభ్యులు అభ్యంతరం తెలుపుతూ రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేసే వరకు వెళ్లారు. ఈ వివాదానికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. యూనివర్సిటీ పరిధి హనుమకొండలోని ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల తెలుగు విభాగంలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్గా 13 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ సదాశివ్ తనను యూనివర్సిటీ క్యాంపస్కు బదిలీ చేయాలని కొన్నినెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం దృష్టికి పలుసార్లు తీసుకెళ్లారు. తెలుగు విభాగం అధిపతికి కూడా వినతిపత్రం సమర్పించారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుంచి సదాశివ్ను బదిలీ చేయాలంటే డిపార్ట్మెంటల్ కమిటీ (డీసీ) సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. క్యాంపస్లోని తెలుగ విభాగం నుంచి మరో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ను ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి బదిలీ చేయాల్సి ఉంటుంది. క్యాంపస్లో తెలుగు విభాగంలో ఓ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ 14 ఏళ్లుగా పనిచేస్తున్నారు. అతడిని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి, తనను క్యాంపస్లోని తెలుగు విభాగానికి బదిలీ చేయాలని కోరుతూ వస్తున్నారు. డిపార్ట్మెంటల్ కమిటీ సమావేశంలో రచ్చ సదాశివ్ బదిలీపై ఇటీవల కేయూ తెలుగు విబాగం అధిపతి, కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లింగయ్య డిపార్టుమెంటల్ కమిటీ(డీ.సీ) సమావేశం నిర్వహించారు. ఇందులో యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి.మనోహర్ మరో రెండు విభాగాలకు విభాగాల అధిపతులు (రెగ్యులర్ మహిళా ఆచార్యులు) సభ్యులుగా పాల్గొన్నారు. తెలుగు విభాగంలో 2013లో అప్పటి డిపార్టుమెంటల్ కమిటీ సదాశివ్ను మహబూబాబాద్ పీజీ సెంటర్కు బదిలీ చేయాలని నిర్ణయించిందని, ఇప్పుడు మహబూబాబాద్ పీజీ సెంటర్కు బదిలీ చేద్దామనేది తెలుగు విభాగం అధిపతి లింగయ్య పేర్కొన్నారు. అప్పటి డీసీ నిర్ణయం ఇన్ని సంవత్సరాల తర్వాత అమలు చేయడం సరికాదని, నూతనంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ప్రొఫెసర్ మనోహర్ సూచించారు. దీన్ని లింగయ్య విభేదించారు. అంతేకాకుండా మనోహర్ సూచనలను వ్యతిరేకిస్తూ అమర్యాదగా ప్రవర్తించారని, ఆయన మాటను ఖాతరు చేయకుండా విభాగాధిపతి వ్యవహరించిన తీరుతో సమావేశం నుంచి మనోహర్తోపాటు మరో ఇద్దరు ఆచార్యులు వెళ్లిపోయారు. లింగయ్య తీరుపై లిఖితపూర్వకంగా కేయూ రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేశారు. ఈవిషయాన్ని బుధవారం ప్రొఫెసర్ మనోహర్ ధ్రువీకరించారు. తెలుగు విభాగాఽధిపతిగా ఉన్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్పై రిజిస్ట్రార్ దృష్టికి వెళ్లినా ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని, తనను బదిలీ చేయడం లేదని సదాశివ్ రిజిస్ట్రార్, వీసీలను కలిసి తన ఆవేదన వ్యక్తం చేశారు. సదాశివ్ను బదిలీ చేయడంలో తాత్సారం డీసీ మీటింగ్లో విభాగాధిపతి తీరుపై విస్మయం రిజిస్ట్రార్కు ప్రిన్సిపాల్ మనోహర్ ఫిర్యాదు -
హత్యకేసులో నిందితుడికి జీవిత ఖైదు
కాళేశ్వరం: హత్యకేసులో నిందితుడికి భూపాలపల్లి జడ్జి నారాయణబాబు రూ.10వేల జరిమానా, జీవితౖఖైదు విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించినట్లు ఎస్సై పవన్కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సీతానాగారం గ్రామానికి చెందిన సంగిశెట్టి కిశోర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం బ్రహ్మణపల్లి ఇసుక క్వారీలో సూపర్ వైజర్గా పని చేస్తూ ఉండేవాడు. 2018లో కిశోర్ స్నేహితుడు, ఇసుక క్వారీ ఇన్చార్జ్గా పనిచేసే ఆంధ్రప్రదేశ్లోని విజయనగరానికి చెందిన చోడవరపు నర్సింహామూర్తి మహదేవపూర్ మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన యువతి గోగుల లలితను ప్రేమ వివాహం చేసుకోవడానికి విజయనగరం తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఆ యువతి తమ్ముడు గోగుల విజయ్ 2018 ఆగస్టు 26న నర్సింహామూర్తికి సహకరించాడనే కోపంతో కిశోర్ను గొడ్డలిలో నరికి చంపాడు. ఈ విషయమై మృతుడి తండ్రి సంగిశెట్టి దుర్గారావు మరుసటి రోజు 27న మహదేవపూర్ పీఎస్లో ఫిర్యాదు చేశాడు. దీంతో అప్పటి ఎస్సై డి. విజయ్కుమార్ కేసు నమోదు చేయగా అప్పటి మహదేవపూర్ సీఐ రంజిత్ కుమార్ నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తర్వాత సీఐగా వచ్చిన అంబటి నర్సయ్య నిందితుడిపై చార్జ్షీట్ ఫైల్ చేశారు. కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎదులాపురం శ్రీనివాస్ వాదనలు వినిపించారు. నేరం రుజువుకావడంతో భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు.. నిందితుడికి జీవిత ఖైదు, రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారని ఎస్సై వివరించారు. తీర్పు వెలువరించిన జడ్జి నారాయణబాబు -
‘మత్తు’ తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్
వరంగల్ క్రైం : గంజాయి, హశీష్ ఆయిల్ తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా తెలిపారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.5 లక్షల విలువైన 10 కిలోల గంజాయి, సుమారు రూ.25 లక్షల విలువైన 2 కిలోల హశీష్ ఆయిల్, మూడు సెల్ఫోన్లు, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, ఆటో స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. డీసీపీ కథనం ప్రకారం.. హనుమకొండకు చెందిన సుధాకర్, కోటగిరి సాయివినయ్ అలియాస్ వినయ్ 2023లో తన స్నేహితుడు వరుణ్తో కలిసి ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి వెళ్లి గంజాయి తీసుకొస్తుండగా డొంకరాయి పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక్కడ (జైలు) ములుగుకు చెందిన లావుడ్యా రవీందర్కు తాను గంజాయి అమ్ముకుంటానని చెప్పాడని పేర్కొంటూ ఇటీవల సుధాకర్పై దాడిచేయగా సాయి వినయ్పై హనుమకొండ పీఎస్లో కేసు నమోదైంది. అనంతరం సాయి వినయ్ను ఖమ్మం సెంట్రల్ జైలుకు తరలించగా అక్కడ హరి, కబీర్ సింగ్ ఇద్దరు పరిచయమై సాయి వినయ్ ఫోన్ నంబర్ తీసుకున్నారు. మూడు వారాల క్రితం హరి.. సాయివినయ్కి ఫోన్ చేసి తన దగ్గర హశీష్ ఆయిల్ ఉందని చెప్పాడు. దీనిని సిగరెట్లకు పూసి తాగితే కిక్కు వస్తుందని, ఇది కిలో రూ. 12.50 లక్షల వరకు ఉంటుందని చెప్పి తన అన్న రామ్మూర్తి ద్వారా ఆ ఆయిల్ను వరంగల్ రైల్వే స్టేషన్లో అందజేయగా సాయివినయ్ ఇంట్లో దాచాడు. పది రోజుల క్రితం ములుగు జిల్లా జగ్గన్నపేట అన్నంపల్లి తండాకు చెందిన ఆటో డ్రైవర్ లావుడ్యా రవీందర్, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమర్ సింగ్ తండాకు చెందిన గుగులోత్ హరిసింగ్.. 12 కిలోల ఎండు గంజాయి తీసుకుని సాయి వినయ్కు ఇవ్వగా దానిని కూడా తన ఇంట్లో దాచాడు. అనంతరం సాయి వినయ్.. రవీందర్కు ఫోన్ చేసి తన దగ్గర హశీష్ ఆయిల్ ఉందని తెలుపగా రవీందర్, హరిసింగ్ మంగళవారం ఆటోలో సాయివినయ్ ఇంటికి వచ్చారు. అనంతరం ఇద్దరు ఆటోలో, ఒకరు బైక్పై వెళ్తుండగా రెడ్డికాలనీ ప్రాంతంలో పోలీసులకు అనుమానం వచ్చింది. తనిఖీ చేయగా గంజాయి, హశీష్ ఆయిల్ లభించడంతో ముగ్గురిని అరెస్ట్ రిమాండ్కు తరలించామని, మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు డీసీపీ షేక్ సలీమా తెలిపారు. 10 కిలోల గంజాయి, 2 కిలోల హశీష్ ఆయిల్ స్వాధీనం వివరాలు వెల్లడించిన డీసీపీ షేక్ సలీమా -
నీతి ఆయోగ్లో గంగారం బ్లాక్కు మొదటి ర్యాంక్
గంగారం: దేశంలో ఆకాంక్షిత (ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం) మండలాల డెల్టా ర్యాంకింగ్స్లో తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం అగ్రస్థానం, ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం రెండో స్థానంలో నిలిచిందని ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం అధికారి శ్రీనాథ్ హాల్కే వెల్లడించారు. మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్కుమార్ సూచన మేరకు అన్నిశాఖల సమన్వయంతో కేత్రస్థాయిలో ఐదు థీమ్లు, 40 సూచికల ద్వారా లోపాలను గుర్తించి మెరుగుపరచడం వల్లే విజయం సాధ్యమైందన్నారు. హెల్త్ అండ్ న్యూట్రిషీయన్, విద్య, సామాజికాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల్లో అభివృద్ధి సాధించడంతో గంగారం మండలం నీతి ఆయోగ్లో మొదటి ర్యాంకు సాధించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ధనసరి సీతక్క అభినందనలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ నీతి ఆయోగ్ ప్రకటించిన డిసెంబర్ మూడో త్రైమాసిక ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం (ఏబీపీ) డెల్టా ర్యాంకింగ్స్లో రాష్ట్రంలోనే గంగారం బ్లాక్ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. భారతదేశంలో అత్యంత అభివృద్ధి చెందిన బ్లాక్లలో పాలనను మెరుగుపర్చడం, జీవన నాణ్యతా ప్రమాణాలను పెంచడం లక్ష్యమన్నారు. బ్లాక్ల పనితీరు, సూచికల పురోగతిపై ర్యాంకింగ్ ఆధారపడి ఉంటుందన్నారు. మహబూబాబాద్, ములుగు జిల్లాల సంబంధిత అధికారులు మరింత ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో పనిచేసి అభివృద్ధికి బాటలు వేయాలని సీతక్క కోరారు. -
భాషాపండితులకు సన్మానం
విద్యారణ్యపురి: రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత్ పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఏడాది ఉద్యోగ విరమణ పొందబోతున్న పలువురు భాషాపండితులను టెన్త్ స్పాట్లో సన్మానించారు. మూల్యాంకనం చేపడుతున్న ఫాతిమా హైస్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో డీఈఓ వాసంతి మాట్లాడుతూ టెన్త్ మూల్యాంకనంలో భాగస్వాములైన భాషాపండితుల సేవలను కొనియాడారు. రాష్ట్రీయ భాషా పండిత్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్లా మాట్లాడుతూ భాషా పండితులు అప్గ్రేడ్ కోసం కృషి చేయగా పదోన్నతులు లభించాయని గుర్తుచేశారు. ఆ పరిషత్ బాధ్యులు అంకేశ్వరపు కుమారస్వామి, బి. వెంకన్న, అల్లం నర్సయ్య, సదానందం, భిక్షపతి, లక్ష్మీనారాయణ, తిరుపతయ్య, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
సుందరీమణుల సందర్శనకు ఏర్పాట్లు చేయండి
హన్మకొండ అర్బన్: వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు మే 14వ తేదీన వరంగల్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అందకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాంప్లెక్స్హాల్లో సుందరీమణులు హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రాన్ని సందర్శించనున్న నేపథ్యంలో అక్కడ చేయాల్సిన ఏర్పాట్లపై వివిధశాఖల అధికారులతో సమీక్షించారు. ప్రావీణ్య మాట్లాడుతూ హైదరాబాద్లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరీ పోటీల్లో పాల్గొననున్న వారిలో 30 మంది వరంగల్ పర్యటనకు వస్తున్న దృష్ట్యా ఈ కార్యక్రమం నిర్వహణతో చారిత్రక వారసత్వ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.సమావేశంలో జిల్లా ఖజానాఖాఖ అధికారి శ్రీనివాస్ కుమార్, నెహ్రూ యువకేంద్ర డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్, పర్యాటక శాఖ జిల్లా మేనేజర్ శివాజీ, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, కుడా పీఓ అజిత్రెడ్డి, ఈఈ భీమ్రావు, హనుమకొండ ఏసిపి దేవేందర్రెడ్డి, ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రతినిధులు పాల్గొన్నారు. నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక చేయాలి ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం నియోజకవర్గ, మండల స్థాయి ప్రత్యేక అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, పరకాల ఆర్డీఓ కె.నారాయణ, కాజీపేట మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ పాల్గొన్నారు.నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలి వరంగల్: గ్రామాల్లో నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టర్లో ఎంపీడీఓలతో మంగళవారం వేసవి నీటి ఎద్దడి నివారణ, ఇందిరమ్మ ఇళ్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలసి మాట్లాడారు. ఈనెల 30 నుంచి మే 31 వరకు ఉష్టోగ్రతలు పెరగడం వల్ల భూగర్భ జలాలు పడిపోయే ప్రమాదం ఉంటుందని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాలవారీగా ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను మండల స్థాయి అధికారులు మరోసారి స్క్రూటీని చేయాలని అదేశించారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టాలి ఖిలా వరంగల్: నకిలీ విత్తనాలను అధికారులు సమన్వయంతో ఆరికట్టాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం వరంగల్ శివనగర్లోని శ్రీసాయి కన్వెన్షన్ హాల్లో వ్యవసాయ జిల్లా అధికారి అనురాధ అధ్యక్షతన విత్తన, ఎరువుల కంపెనీల ప్రతినిధులు, డీలర్లు, వ్యవసాయ అధికారుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. నకిలీ, కాలం చెల్లిన విత్తనాలు, నిషేధిత పురుగుల మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్కుమార్, డీలర్ల అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు, ఏసీపీ కిరణ్కుమార్, ఏసీపీ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మహాసభను విజయవంతం చేయాలిహన్మకొండ: తెలంగాణ ప్రజాఫ్రంట్ వరంగల్, హనుమకొండ జిల్లాల నాలుగో మహా సభను విజయవంతం చేయాలని ఆ ఫ్రంట్ వరంగల్, హనుమకొండ జిల్లాల కన్వీనర్ జనగాం కుమారస్వామి పిలుపునిచ్చారు. హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం మహాసభ పోస్టర్ను ప్రజాఫ్రంట్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 20న హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్క్లబ్లో తెలంగాణ ప్రజాఫ్రంట్ నాలుగో జిల్లా మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరేందుకు జరిగే ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ హరగోపాల్, పాశం యాదగిరి, ప్రొఫెసర్ కాశీం, అనిశెట్టి రజిత, గాదె ఇన్నయ్య తదితరులు ఈ సభలో ప్రసంగిస్తారని వివరించారు. కార్యక్రమంలో గొల్లూరి ప్రవీణ్ కుమార్, బి.రమాదేవి, వెంగళ్రెడ్డి, సుధీర్ బాబు, ఇంద్రసేనా, పాపయ్య, ఎన్.రఘుశర్మ, గాదరి ఉప్పలయ్య, సందీప్, కళ్యాణ్, డి.జ్యోతిరమణి, వెంకటేశ్వర్లు, రమేశ్చందర్, కుమార్, రాజేందర్, భిక్షపతి, తిరుపతి, సత్యనారాయణ పాల్గొన్నారు. -
స్టీమ్ టు వందేభారత్..
172 వసంతాల భారతీయ రైల్వే సుదీర్ఘ ప్రయాణంలో కాజీపేట జంక్షన్ ప్రస్థానం ● ఏప్రిల్ 16 నుంచి 21వ తేదీ వరకు రైల్వే వారోత్సవాలు ● ప్రతిభ కనబరిచిన వారికి ఏటా అవార్డులు ● కాజీపేట జంక్షన్ నుంచి పలువురు ఎంపికకాజీపేట రైల్వే డీజిల్లోకోషెడ్ నిర్మాణం.. కాజీపేట రైల్వే డీజిల్లోకోషెడ్ను ఏప్రిల్ 21, 1973లో ప్రారంభించారు. నాటి నుంచి డీజిల్షెడ్ దినదినాభివృద్ధి సాధించి భారతీయ రైల్వేలో గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం షెడ్లో 240 ట్రాక్షన్, డీజిల్లోకోల నిర్వహణతో 715 మంది రైల్వే కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ షెడ్ నుంచి డిప్యుటేషన్పై ఇతర దేశాల రైల్వేకు డీజిల్షెడ్ కార్మికులు వెళ్తుంటారు. డీజిల్షెడ్ ఉత్తమ నిర్వహణ షెడ్గా రైల్వే జీఎం, రైల్వే బోర్డు, ఇతర రైల్వే అవార్డులను సొంతం చేసుకుంది. కాజీపేట రూరల్ : భారతీయ రైల్వేకు నేటి(బుధవారం)తో 172 వసంతాలు పూర్తయ్యాయి. దేశంలో మొదటి రైలు 1853 ఏప్రిల్ 16వ తేదీన ముంబాయి–థానే మధ్య 34 కి.మీతో నడిపించారు. భారతీయ రైల్వే ప్రస్థానం మొదటి స్టీమ్ లోకోమోటివ్ నుంచి ప్రారంభమై.. ప్రస్తుతం డిజీల్లోకోమోటివ్, హాల్కోలోకోమోటివ్, ఎలక్ట్రిక్లోకోమోటివ్, వందేభారత్ రైళ్లతో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కాజీపేట రైల్వే స్టేషన్ ఏర్పాటుకు శ్రీకారం.. కాజీపేట మీదుగా నిజాం స్టేట్ రైల్వే కంపెనీ లిమిటెడ్ అధికారులు సరుకు రవాణా కోసం హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ వరకు సింగిల్లైన్ నిర్మించారు. 1904లో కాజీపేట రైల్వే స్టేషన్ను చిన్న షెడ్డుతో ప్రారంభించారు. తర్వాత కాజీపేట–సికింద్రాబాద్ రైల్వే లైన్ నిర్మాణం జరిగింది. 1917లో కాజీపేటలో రైల్వే స్టీమ్లోకోషెడ్ను ఏర్పాటు చేశారు. డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజిన్ల వినియోగంతో 1991లో స్టీమ్లోకోషెడ్ మూతబడింది. 1923లో కాజీపేట రైల్వే స్టేషన్ జంక్షన్గా మారింది. 1917లో విజయవాడ–బల్హార్షా మధ్య కాజీపేట మీదుగా డబుల్లైన్ ఏర్పాటైంది. కాజీపేట–బల్హార్షా మధ్య మూడో రైల్వే లైన్ కూడా పూర్తి కావొస్తుంది. కాజీపేట కేంద్రంగా 1992లో ఎలక్ట్రిక్లైన్ నిర్మాణం జరిగింది. 1970 వరకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైల్వేతో సంయుక్తంగా ఆర్టీసీ కండక్టర్ల నియామకం చేపట్టింది. అప్పట్లో వీరి కోసం కాజీపేట జంక్షన్లో క్వార్టర్స్ను కూడా నిర్మించారు. కాజీపేట నుంచి రోజూ 170 రైళ్లు రాకపోకలు, 15 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. రోజుకు రూ.సుమారు 12 లక్షల ఆదాయం వస్తోంది. కాజీపేట కేంద్రంగా సుమారు 5 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. కాజీపేట యంత్రాంగం బల్హార్షా మాణిక్ ఘర్, విజయవాడ వద్ద కొండపల్లి, కరీంనగర్ రూట్లో జగిత్యాల, సికింద్రాబాద్ రూట్లో భువనగిరి వరకు విస్తరించి ఉంది. ప్రస్తుతం కాజీపేట రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ స్టేషన్ స్కీం రీ–డెవలప్మెంట్ వర్క్స్తో ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్గా అత్యాధునీకరిస్తున్నారు. కొన్ని నెలల్లో కాజీపేట కేంద్రంగా నిర్మిస్తున్న రైల్వే కోచ్ఫ్యాక్టరీ, వ్యాగన్షెడ్లు ప్రారంభం కానున్నాయి. దీంతో కాజీపేట జంక్షన్ ప్రాముఖ్యత మరింత పెరగనుంది. కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్లోకోషెడ్ నిర్మాణం.. కాజీపేటలో 2004లో రైల్వే ఎలక్ట్రిక్లోకోషెడ్ నిర్మాణం జరిగింది. మొదట ఈ షెడ్ 100 లోకోమోటివ్ల నిర్వహణ సామర్థ్యంతో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 205 లోకోల నిర్వహణతో సుమారు 420 మంది రైల్వే సిబ్బందితో షెడ్ నిర్వహణ జరుగుతోంది. దినదినాభివృద్ధి చెంది ఈ షెడ్ దక్షిణ మధ్య రైల్వేలో ప్రత్యేక గుర్తింపు సాధించి ఎన్నో రైల్వే అవార్డులు కై వసం చేసుకుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా పట్టాలపైకి రైళ్లు.. సాంకేతిక విప్లవం దినదినాభివృద్ధి చెంది స్టీమ్లోకోమోటివ్ నుంచి డీజిల్లోకోమోటివ్, డబ్ల్యూడీఎం–2, 3, 4, 6 (కంప్యూటరైజ్డ్లోకోమోటివ్), తర్వాత ఎలక్ట్రిక్లోమోటివ్, ఎలక్ట్రిక్లోకోమోటివ్లో అమెరికా టెక్నాలజీతో డబ్ల్యూఎపీ–2, 4, 7, డబ్ల్యూఎజీ– 5, డబ్ల్యూఎపీ–12 లోకోమోటివ్లు వచ్చాయి. తర్వాత వందేభారత్ రైలు 130 కేఎంపీహెచ్ స్పీడ్తో పట్టాలపై పరుగులు పెడుతోంది. రైల్వే శాఖ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్యాసింజర్ నుంచి ఎక్స్ప్రెస్, సూపర్ఫ్టాస్, సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టి తక్కువ ఖర్చుతో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తుంది. 1853, ఏప్రిల్ 16న మొదటి రైలు ప్రారంభమైనప్పటి నుంచి ఏటా రైల్వే వీక్ అవార్డుల వారోత్సవాల పేరిట విధుల్లో ప్రతిభ కనబరిచిన రైల్వే అధికారులు, కార్మికులకు అవార్డులు, నగదు పురస్కార్, ప్రశంస పత్రాలు ప్రదానం చేసి వారిని ప్రోత్సహిస్తోంది. కాజీపేట జంక్షన్ నుంచి కూడా ఈ ఏడాది పలువురు రైల్వే అవార్డులకు ఎంపికై నట్లు అఽధికారులు తెలిపారు. -
ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్గా రాజేందర్ ఎన్నిక
హన్మకొండ చౌరస్తా: ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్గా టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఎన్నికయ్యారు. హనుమకొండ అలంకార్ జంక్షన్లోని టీఎన్జీఓస్ భవన్లో టీఎన్జీఓ, టీజీఓ, ఉపాధ్యాయ, నాలుగో తరగతి ఉద్యోగులు, కార్మిక, పెన్షనర్ల, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాల నాయకుల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా కమిటీని ఎన్నుకున్నారు. చైర్మన్గా రాజేందర్, కన్వీనర్గా టీజీఓ జిల్లా అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, కోకన్వీనర్గా పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, గౌరవ అధ్యక్షుడిగా టీజీఓ నాయకుడు ఎ.జగన్మోహన్రావుతోపాటు మిగిలిన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జేఏసీ నేతలు బైరి సోమయ్య, డాక్టర్ ప్రవీణ్, శ్రీహరి, శ్రీనివాస్, పుల్లూరు వేణుగోపాల్, పనికెల రాజేశ్, సర్వర్ హుస్సేన్, శ్యాంసుందర్, గోపాల్రెడ్డి, రవీందర్, పెండెం రాజు, రాంబాబు పాల్గొన్నారు. -
టాక్సీ అడ్డా..
కళాభవనం..వరంగల్: కళాకారులను ప్రోత్సహించేందుకు వరంగల్ నగరంలో మంజూరు చేసిన మల్టీపర్పస్ కల్చ రల్ కాంప్లెక్స్ (మినీ రవీంద్రభారతి) నిర్మాణ స్థలం ప్రస్తుతం టాక్సీల స్టాండ్గా మారింది. 24–05–2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.నాలుగు కోట్ల నిధులు మంజూరు చేయగా.. ఏడాదిలో నిర్మించాలన్న నిబంధనలతో హైదరాబాద్కు చెందిన శ్రీకో సంస్థ ప్రాజెక్టు పనులు దక్కించుకుంది. మొదటి విడత పర్యాటక శాఖ నుంచి కళాభవనం నిర్మాణానికి కోటి రూపాయల నిధులు విడుదల చేయగా పనులు ప్రారంభమయ్యాయి. బెస్మెంట్తోపాటు పిల్లర్లు, జనరేటర్ రూం నిర్మించిన కాంట్రాక్టర్కు రూ.69.88 లక్షలను చెల్లించారు. నిధులు విడుదల అయితే తప్ప మిగిలిన పనులు చేపట్టేది లేదని కాంట్రాక్టర్ చేతులు ఎత్తేయడంతో 12 ఏళ్ల క్రితం ప్రారంభమైన కళాభవనం నిర్మాణ దశలోనే ఉంది. ఏళ్లు గడుస్తున్నా, పాలకులు మారుతున్నా తూర్పు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడకపోవడంతో అసంపూర్తిగా ఉన్న పిల్లరు ఆకాశాన్ని చూస్తున్నాయి. నిధులు లేని కారణంగానే పనులు పూర్తిచేయలేక పోతున్నామని సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు. నిధులు తేవడంలో ప్రజాప్రతినిధుల విఫలం రూ.12 కోట్లతో చేపట్టిన కాళోజీ కళా క్షేత్రం నిర్మాణ వ్యయం సుమారు రూ.100 కోట్లకు పెరిగింది. వరంగల్ పశ్చిమ ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి నిధులు మంజూరు చేయించి పూర్తి చేసి ప్రారంభించుకున్నారు. రూ.నాలుగు కోట్ల వ్యయంతో చేపట్టిన కళాభవనానికి నిధులు తేవడంలో జిల్లాతోపాటు తూర్పు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు విఫలమయ్యారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్మార్ట్సిటీ ప్రాజెక్టుకు వస్తున్న వందల కోట్ల రుపాయలతో వృథా పనులు చేస్తూ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని నగరవాసులు ఆరోపిస్తున్నారు. మూడుసార్లు శంకుస్థాపనలు.. వరంగల్ పోచమ్మమైదాన్ సమీపంలో మల్టీపర్సస్ కల్చరల్ కాంప్లెక్స్ (కళాభవనం)కు ఇప్పటికీ మూడుసార్లు శంకుస్థాపనలు చేసినా పూర్తికాలేదు. మినీ రవీంద్రభారతిని పూర్తిచేయాలని జిల్లాలోని కళాకారులు పలుమార్లు అధికారులు, నాయకులను కోరినా పట్టించుకోలేదు. నిధులు మంజూరు చేయకపోవడంతో కళాభవనం నిర్మాణం బేస్మెంట్తో ఆగిపోయింది. హామీలకే హరిత హోటల్.. కళాభవనం స్థలంలో హరిత హోటల్ నిర్మించాలని మూడేళ్ల క్రితం అప్పటి తూర్పు ఎమ్మెల్యే నరేందర్ సూచనల మేరకు అప్పటి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్థలాన్ని పరిశీలించారు. వరంగల్ తూర్పులో కళాభవనం నిర్మించాలని సాంస్కృతిక కళాకారులు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు కళాభవనంతోపాటు హరిత కాకతీయ హోటల్ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. వరంగల్లో లేని ఆడిటోరియాలు.. వరంగల్, హనుమకొండ జిల్లాల ఏర్పాటుతో ఆర్ట్స్ కళాశాల, నేరెళ్ల వేణుమాధవ్, పోతన ఆడిటోరియాలతోపాటు ఇటీవల రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం హనుమకొండ జిల్లా పరిధిలోనే ఉన్నాయి. వరంగల్ జిల్లా కేంద్రమైన వరంగల్ తూర్పులో ఆడిటోరియాలు లేకుండా పోయాయి. జిల్లా సమీక్షలు హనుమకొండ లేదా ఏదైనా ప్రైవేట్ ఫంక్షన్హాల్లో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల మెగా జాబ్మేళాను వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలోని ఎంకే నాయుడు ఫంక్షన్హాల్లో నిర్వహించారు. స్థలం సరిపోక వచ్చిన నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కళాభవనం పూర్తయితే జిల్లాలో తమకు ఆదరణ లభిస్తుందనే ఆశతో జిల్లాలోని కళాకారులు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన ఈ భవన నిర్మాణ పనులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నా యి. ప్రస్తుతం మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోపాటు ఈభవన నిర్మాణం కోసం కృషిచేసిన ఎమ్మెల్సీ సారయ్య సైతం అదే పార్టీలో ఉన్నారు. ఇప్పటికైనా కళాభవనం నిర్మాణంపై దృష్టి పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు. ఇబ్బందులు పడుతున్నాం.. కళలకు సంబంధించిన కార్యక్రమాలు చేయాలంటే ఇబ్బందులు పడుతున్నాం. అదేవిధంగా వరంగల్లో ప్రత్యేకంగా కళావేదిక లేకపోవడం, సంస్థలు రాకపోవడంతో కళాకారులు దూరం వెళ్లి ప్రదర్శనలు ఇవ్వాల్సి వస్తోంది. శిక్షణ అకాడమీలు ఒకే సమయంలో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తే ఆడిటోరియం అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నిధులు మంజూరు చేయించి కళాభవనం నిర్మాణాన్ని పూర్తిచేయించాలి. – ఆడెపు రవీందర్, శ్రీబాలాజీ క్రియేషన్స్ అధినేత నిధులు లేక వరంగల్లో పూర్తికాని మినీ రవీంద్రభారతి 12 సంవత్సరాలుగా పిల్లర్లకే పరిమితం తూర్పు నియోజకవర్గ నాయకుల నిర్లక్ష్యమే కారణమంటూ విమర్శలు -
17 నుంచి ‘భూభారతి’ సదస్సులు
హన్మకొండ అర్బన్: ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం జిల్లాలో అమల్లోకి వచ్చిందని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కలెక్టరేట్లో భూ భారతి చట్టానికి సంబంధించిన మార్గదర్శకాలపై తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, రెవెన్యూ విభాగం సూపరింటెండెంట్లకు మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. చట్టం గెజిట్ ప్రతులు, జీఓ పత్రాలు ప్రతి తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వద్ద తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈనెల 17 నుంచి ప్రతి మండలంలో భూభారతి అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామాల్లో నిర్వహించే సదస్సులకు స్థానిక ఎమ్మెల్యేతోపాటు భూమి హక్కులకు సంబంధించి అవగాహన ఉన్న వ్యక్తులను, మీ సేవ కేంద్రాల ఆపరేటర్లను ఆహ్వానించాలని సూ చించారు. సందేహాల నివృత్తికి తహసీల్దార్ కార్యాలయాల్లో హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేయాలన్నారు. నూతన చట్టంలోని పలు అంశాలపై పరకాల, హనుమకొండ ఆర్డీఓలు డాక్టర్ నారాయణ,రాథోడ్ రమేశ్ పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సదస్సులో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. అవగాహన కల్పించాలి : వరంగల్ కలెక్టర్ సత్యశారద వరంగల్: ప్రభుత్వం అమలు చేయనున్న భూ భారతి నూతన రెవెన్యూ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. వరంగల్ కలెక్టరేట్లో భూభారతి చట్టంపై తహసీల్దార్లతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి కలెక్టర్ మాట్లాడారు. ఏప్రిల్ 17 నుంచి 30వ తేదీ వరకు ప్రతి మండలంలో ఈ చట్టంపై అవగాహన సదస్సులకు షెడ్యూల్ రూపొందించాలన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే ప్రచారం నిర్వహించాలని జిల్లా పౌరసంబంధాల అధికారి అయూబ్అలీని ఆదేశించారు. ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి హెల్ప్లైన్ నంబర్ 040293 13999 ఏర్పాటు చేయాలని తెలిపారు. మండల స్థాయిలో రెవెన్యూ సమస్యలపై సమగ్రమైన నోట్స్ తయారు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.సమావేశంలో డీఆర్ఓ విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య కలెక్టరేట్లో అధికారులకు అవగాహన -
ప్రసన్నాంజనేయస్వామికి తమలపాకులతో అలంకరణ
హన్మకొండ అర్బన్: హనుమకొండ పద్మాక్షికాలనీలోని హనుమత్గిరి శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో మంగళవారం స్వామిని తమలపాకుల మాలతో అలంకరించినట్లు అర్చకుడు ఆరుట్ల రామాచార్యులు తెలిపారు. అనంతరం స్వామివారికి హారతి, భజన కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. మధ్యాహ్నం దీక్ష స్వీకరించిన స్వాములకు భిక్ష (అన్నదానం) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో శ్రీహనుమాన్ దీక్ష సేవాసమితి అధ్యక్షుడు గందె కృష్ణ, ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల రవికుమార్, సభ్యులు కరు దశరథ్కుమార్, మాదాసు మొగిలయ్య, గండ్రతి సుధాకర్, సత్యం, సీతా సమ్మయ్య, శంకర్, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా కె.పట్టాభిరామారావువరంగల్ లీగల్: హనుమకొండ ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి సీహెచ్.రమేశ్బాబు మంగళవారం భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. అయన స్థానంలో రంగారెడ్డి జిల్లా మొదటి ఆదనపు జడ్జి డాక్టర్ కె.పట్టాభిరామారావు రానున్నారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.నారాయణబాబు వరంగల్ జిల్లా కోఆపరేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్గా బదిలీపై వస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఎండీ అబ్దుల్ రఫీ, జనగామ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమను బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ అయిన న్యాయమూర్తులు ఈనెల 23 వరకు తమ నూతన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ముగిసిన ‘టెన్త్ స్పాట్’విద్యారణ్యపురి: కాజీపేటలోని ఫాతిమా హైస్కూల్లో ఈ నెల 7వ తేదీనుంచి ప్రారంభమైన టెన్త్ జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ మంగళవారం సాయంత్రం ముగిసింది. అన్ని సబ్జెక్టులు, ఒకేషనల్ కోర్సుల పరీక్షలవి కలిపి 2,27,403 జవాబుపత్రాలు వచ్చాయి. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలనుంచి ఎస్ఏలు, ఎస్జీటీలను స్పాట్ విధులకు కేటాయించారు. సీఈలుగా 113మంది, ఏఈలుగా 676మంది ఎస్ఏలు, 224మంది ఎస్జీటీలు స్పెషల్ అసిస్టెంట్లుగా విధుల్లో పాల్గొన్నారు. హనుమకొండ డీఈఓ వాసంతి క్యాంపు ఆఫీసర్గా, 8మంది పీజీహెచ్ఎంలు అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లుగా వ్యవహరించారు. ఈ నెల 30న లేదా మే మొదటివారంలో పరీక్ష ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. క్యాంపస్ ఇంటర్వ్యూలు రామన్నపేట : వరంగల్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్గనైజేషన్ ప్రైవేట్ లిమి టెడ్, హిందుస్థాన్ కోకాకోలా బేవరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించాయి. డిప్లొమా ఇన్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ అభ్యర్థులు అర్హులుగా, 18 నుంచి 24 సంవత్సరాల్లోపు ఉన్న అభ్యర్థులకు అవకాశం కల్పించారు. ప్రాంగణ నియామకాలకు 65 మంది విద్యార్థినులు హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. డాక్టర్ రామకృష్ణకు దళితరత్న అవార్డుహన్మకొండ చౌరస్తా: హనుమకొండ జిలా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణకు రాష్ట్ర ప్రభుత్వం దళితరత్న అవార్డు అందజేసి సత్కరించింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో జయంతి ఉత్సవ కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో రామకృష్ణకు అవార్డును ప్రదానం చేసింది. తోలు పరిశ్రమపై రామకృష్ణ చేస్తున్న పోరాటం, దళితులకు మంచి చేయాలన్న ఆశయాన్ని గుర్తించి అవార్డు అందజేసినట్లు రామకృష్ణ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం సీఎం రేవంత్రెడ్డి జీఓ విడుదల చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని, దళితుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. -
మే 1 నుంచి వేసవి క్రీడాశిక్షణ శిబిరాలు
వరంగల్ స్పోర్ట్స్: పట్టణ పరిధిలో వేసవి క్రీడాశిక్షణ శిబిరాలను మే 1 నుంచి 31 వరకు నిర్వహించనున్నట్లు హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్ తెలిపారు. శిబిరాల నిర్వహణ, క్రీడాకారుల నమోదు అంశంపై మంగళవారం హనుమకొండ ఇండోర్ స్టేడియంలోని డీఎస్ఏ కార్యాలయంలో కోచ్లతో డీవైఎస్ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్కుమార్ మాట్లాడుతూ శిబిరాలకు విద్యార్థులను తీసుకొచ్చేలా ఒక్కొ కోచ్కు 10 పాఠశాలలను అప్పగించినట్లు తెలి పారు. ఆయా కోచ్లు పాఠశాల హెచ్ఎంలు, ప్రిన్సి పాళ్లతో మాట్లాడి నాలుగు నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు శిబిరాల్లో పాల్గొనేలా చూడాలని సూచించారు. శిక్షణ శిబిరాల్లో పాల్గొనే విద్యార్థులు ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తులను ఇండోర్ స్టేడియంలో అందజేయాలని తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనేలా, వేసవి సెలవులను వృథా చేయకుండా ఆసక్తి గల క్రీడాంశాల్లో శిక్షణ అందించేలా చొరవ చూపాలని తల్లిదండ్రులను కోరారు. సమావేశంలో కోచ్లు శ్రీమన్నారాయణ, వెంకటేశ్వర్లు, విష్ణువర్ధన్, అఫ్జల్, జీవన్గౌడ్, ప్రభుదాస్, శంకర్, రమేశ్, ప్రశాంత్, నరేందర్, నవీన్కుమార్, రమేశ్ పాల్గొన్నారు. -
కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమ్మె నోటీస్
బుధవారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025కేయూ క్యాంపస్: తమను రెగ్యులరైజ్ చేయాలని ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిరసిస్తూ కాంట్రాక్టు ప్రొఫెసర్స్ కోఆర్డినేషన్ బాధ్యులు మంగళవారం కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డికి సమ్మెనోటీస్ అందజేశారు. తొలుత కొంతసేపు పరిపాలన భవనం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేయూ కోఆర్డినేషన్ బాధ్యులు శ్రీధర్కుమార్లోథ్, నిరంజన్, సాధు రాజేశ్, మాదాసి కనకయ్య, జూల సత్య మాట్లాడుతూ రాష్ట్రంలోని 12 యూని వర్సిటీల్లో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఈనెల 19 నుంచి సమ్మెకు వెళ్తున్నారని తెలిపారు. ఈనెల 16, 17 తేదీల్లో హైదరాబాద్లో ఇందిరాపార్కు వద్ద మహాధర్నా తలపెట్టామని పేర్కొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల కోఆర్డినేషన్ బాధ్యులు బి. సతీశ్, సంకినేని వెంకట్, ఫిరోజ్పాషా, ఆశీర్వాదం, అరూరి సూర్యం, గడ్డం కృష్ణ, టి.నాగయ్య, రఘువర్ధన్రెడ్డి, వినీత, శ్రీదేవి, సునీత, సుచిరితపాల్, భాగ్య, ఉషాకిరణ్, వాణిశ్రీ, సదాశివ్, ప్రసాద్, వెంకటేశం, సాహితి, చందూలాల్, సత్యనారాయణ పాల్గొన్నారు. కాగా, యూనివర్సిటీలో వివిధ పరిపాలన పదవులు నిర్వహిస్తున్న పలువురు కాంట్రాక్టు ప్రొఫెసర్లు తమ పదవులకు రాజీనామాలు చేసి అధికారులకు సమాచారం అందించారు.న్యూస్రీల్ -
అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు..
●వివాహిత నవ్య బలవన్మరణంపై కేసు నమోదు మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సంపేట బైపాస్ రోడ్లో ఆదివారం రాత్రి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన నవ్య మృతిపై ఆమె తండ్రి ఉత్తరాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ సోమవారం రాత్రి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని బ్రాహ్మణ బజార్కు చెందిన శ్రీపాద ఉత్తరాచారి పెద్ద కుమార్తె నవ్య (21)ను ఇల్లందు మండలం ధర్మారం తండాకు చెందిన తాడూరి భిక్షమాచారి, సత్యవతి దంపతుల కుమారుడు రవిచంద్రాచారికి ఇచ్చి గతేడాది డిసెంబర్ 26వ తేదీన వివాహం జరిపించారు. వివాహం సమయంలో రూ.50 వేలు కట్నం ఇచ్చారు. భర్త రవిచంద్రాచారి, అత్తామామ భిక్షమాచారి, సత్యవతి తరచూ అదనపు కట్నం కోసం నవ్యను వేధింపులకు గురిచేస్తుండేవారు. ఈ క్రమంలో పలుమా ర్లు పంచాయితీలు జరగగా అదనపు కట్నం డబ్బులు తర్వాత ఇస్తామని ఆపుకుంటూ వచ్చారు. ఆది వారం సాయంత్రం నవ్య తాను ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడుతున్నానని పక్కింటి వారికి చెప్పగా వారు హు టాహుటిన వచ్చి భర్త రవిచంద్రాచారికి చెప్పారు. అప్పటికే ఆమె ఇంట్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి ఉత్తరాచారి ఫిర్యాదు మేరకు టౌన్ ఎస్సై బి.విజయ్ కుమార్ కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కు టుంబీకులకు అప్పగించారని సీఐ తెలిపారు. నేడు నగరంలో విద్యుత్ ఉండని ప్రాంతాలు హన్మకొండ: హనుమకొండలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ డీఈ జి.సాంబరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కంచరకుంట, కుడా కార్యాలయం, చింతల నర్సింహుల్ బుక్ స్టాల్ ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, శాంతినగర్, సుబేదారి, పోస్టల్ కాలనీ, ఎకై ్సజ్ కాలనీ, అదాలత్ కూడలి, అడ్వొకేట్స్ కాలనీ, హంటర్ రోడ్ ప్రాంతం, జూ పార్కు, వడ్డెపల్లి, విజయపాల్ కాలనీ, రాఘవేంద్ర కాలనీ ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫాతిమానగర్ ప్రాంతాల్లో ఉదయం 8 నంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని వివరించారు. వరంగల్లో.. వరంగల్లోని మిల్స్ కాలనీ పోలీసు స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, ఏఎస్ఎం కళాశాల, దుర్గేశ్వర స్వామి దేవాలయం ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని వరంగల్ టౌన్ డీఈ ఎస్.మల్లికార్జున్ తెలిపారు. పిన్నవారి వీధి ప్రాంతంలో మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు, ఇంతేజార్గంజ్ పోలీసు స్టేషన్, విశ్వకర్మ వీధి, జేపీఎన్ రోడ్, ఎల్లంబజార్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు వివరించారు. -
కులనిర్మూలనకు కృషి చేసిన మహనీయుడు అంబేడ్కర్
హన్మకొండ: సమాజంలో అంటరానితనం, కుల నిర్మూలనకు కృషి చేసిన మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ అని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ కార్యాలయం ఆవరణలోని స్పోర్ట్స్ క్లబ్లో తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. 150 మంది విద్యుత్ ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని సీఎండీ ప్రారంభించారు. అంతకు ముందు అంబేడ్కర్ చిత్రపటానికి ఆయన, డైరెక్టర్లు, అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ రాజ్యాంగం మనుగడలో ఉన్నంతకాలం అంబేడ్కర్ పేరు చిర స్థాయిలో నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు ఎ.ఆనందం, కార్యదర్శి ఎన్.కుమారస్వామి, ఫైనాన్స్ సెక్రటరీ నర్సింహారావు, టీజీ ఎన్పీడీసీఎల్ ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, వి.తిరుపతి రెడ్డి, సీజీఆర్ఎఫ్ నిజామాబాద్ చైర్మన్ ఇ. నారాయణ, హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, డి.ఈలు విజేందర్ రెడ్డి, సామ్యనాయక్, జి.సాంబరెడ్డి, ఎస్.మల్లికార్జున్, భిక్షపతి పాల్గొన్నారు.● టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
ఎంజీఎంలో ఎక్స్రే కష్టాలు..
ఎంజీఎం : ఉత్తర తెలంగాణ పేద రోగుల పెద్దది క్కు ఎంజీఎం ఆస్పత్రిలో నిత్యం ఏదో ఒక్క సమస్య తలెత్తుతూనే ఉంది. ఒక రోజు మందులు ఉండవు.. మరో రోజు వైద్యులు రారు. అన్ని బాగున్నాయి.. అనుకున్న క్షణమే పరికరాల్లో సాంకేతిక లోపమంటూ సేవలు అందవు.. ఇలా ఆస్పత్రిలో ఏ విభాగంలో చూసినా ఏదో సమస్య కనిపిస్తూనే ఉంటుంది. ఫలితంగా ఎంజీఎంకు వస్తే పూర్తి స్థాయి వైద్య చికిత్సలు అందుతాయా అనే నమ్మకం రోజురోజుకూ సన్నగిల్లుతోంది. ఈక్రమంలో మూడు రోజుల నుంచి ఆస్పత్రిలో అత్యంత కీలక విభాగమైనా క్యాజు వాలిటీలో ఎమర్జెన్సీ ఎక్స్రే సేవలు నిలిచాయి. ఈ సేవలను వెంటనే పునరుద్ధరణ చేయాల్సిన అవసరమన్నా రోజులు తరబడిగా పట్టించుకోవడం లేదు. ఫలితంగా క్షతగాత్రులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఒక పక్క ప్రమాదంలో విరిగిన కాళ్లు, చేతులతో ఆస్పత్రిలోని క్యాజువాలిటీ విభాగానికి వస్తే చికిత్స కోసం ఎక్స్రే పనిచేయకపోవడంతో ఇక్కడి నుంచి నుంచి ఓపీ బ్లాక్లో ఉన్న ఎక్స్రే గదికి క్షతగాత్రులను తరలించే సమయంలో వినబడుతున్న ఆర్తనాదాలు అందరినీ కంటతడిపెట్టిస్తున్నాయి. చికిత్స కోసం తిప్పలు పడాల్సిందే.. ఎమర్జెన్సీ ఎక్స్రే పరికరం పనిచేయకపోవడంతో ఈ సేవల కోసం క్షతగాత్రుల బంధువులు తిప్పలు పడాల్సి వస్తోంది. క్షతగాత్రుడిని క్యాజువాలిటీ నుంచి ఓపీ బ్లాక్లోని 92 గదికి తరలించేందుకు వీల్ చైర్స్, స్ట్రెచర్స్ దొరకబట్టడానికి కుస్తీ పట్టాల్సిందే. ఆస్పత్రిలోని 92 గది ఎక్కడ అని తెలుసుకునేందుకు మరో ప్రయత్నం చేయాలి. చివరకు అక్కడికి వెళ్లాక ఒకే ఒక్క ఎక్స్రే పరికరం పనిచేస్తుండడంతో సేవల కోసం ఎదురుచూడాలి.. ఆ సమయంలో క్షతగాత్రుల రోదనలు చూడలేక సిబ్బందితో వా గ్వాదానికి దిగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా ఎంజీఎంలో అత్యవసర సేవల కోసం వచ్చిన క్షతగా త్రుల బాధలు నిత్యం పెరిగిపోతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోతున్నారు. ఉన్న ఒకే ఒక్క ఆర్ఎంఓ అన్ని పనులు చక్కబెట్టలేక చేతులేతేస్తున్న దుస్థితి. ఇప్పటికై నా ప్రభుత్వం, జిల్లా మంత్రులు స్పందించి ఎంజీఎంపై ప్రత్యేక దృష్టి సారించాలని రోగులు వేడుకుంటున్నారు. ఆస్పత్రిలో నిలిచిన ఎమర్జెన్సీ ఎక్స్రే సేవలు మూడు రోజులుగా ఆ గదికి తాళం గాయాలతో క్షత్రగాత్రుల నరకయాతన, ఆర్తనాదాలు పట్టించుకోని ఆస్పత్రి ఉన్నతాధికారులుమరమ్మతులు చేస్తాం..ఎమర్జెన్సీ పరికరంలో సాంకేతిక లోపం ఏర్పడింది. ఎక్స్రే సేవలను 92 గదిలోని డిజిటల్ ఎక్స్రే ద్వారా అందిస్తున్నాం. ఎమర్జెన్సీ విభాగంలో ఎక్స్రే పరికరానికి మరమ్మతులు చేపడుతాం. –కిశోర్, సూపరింటెండెంట్ -
డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కలిసి రావాలి
హన్మకొండ: డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. అంబేడ్కర్ జయంతి రోజున ఇలాంటి మంచి నిర్ణయం తీసుకోవడంతోపాటు గంజాయి నిర్మూలనకు కృషి చేద్దామన్నారు. సోమవారం హనుమకొండ అంబేడ్కర్ భవన్లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను జరుపుకున్నారు. ముందుగా అంబేడ్కర్ చిత్ర పటానికి ఎమ్మెల్యే నాయిని, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, గిరిజన ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ బెల్లయ్య నాయక్, అతిథులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్తో పిల్లలుతమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ క్రమంలో ఇక్కడినుంచి వీటి నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేష్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డీఈ శ్రీలత, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ నవీన్ కుమార్, డీపీఆర్ఓ గంగవరపు వెంకట భానుప్రసాద్, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జగన్మోహన్, మహనీయుల ఉత్సవ కమిటీ చైర్మన్ అంకేశ్వరపు రాంచందర్ రావు, వైస్ చైర్మన్ సుకుమార్, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పుట్ట రవి, చుంచు రాజేందర్, సింగారపు రవి ప్రసాద్, ఈవీ శ్రీనివాస్ రావు, వివిధ కుల, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి -
ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిన అంబేడ్కర్
ఖిలావరంగల్: దేశ ఔన్నత్యం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రపంచానికి చాటుతూ.. రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత రూప శిల్పి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం వరంగల్ 35వ డివిజన్ శివనగర్లో అంబేడ్కర్ విగ్రహాన్ని మేయర్ గుండు సుధారాణి, స్థానిక కార్పొరేటర్ సొమిశెట్టి ప్రవీణ్తో కలిసి మంత్రి సురేఖ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆలోచనలు, ఉద్యమాలు ఇప్పటికీ మార్గదర్శకం అన్నారు. పౌరుడి నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి అని చాటిన మహామేధావి అని కొనియాడారు. కార్యక్రమంలో విగ్రహ ఫౌండేషన్ దాత మెరుగు అశోక్, విగ్రహ దాత రేణుకుంట్ల రవీందర్, అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పొలేపాక నరేందర్, విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ అధ్యక్షుడు రేణుకుంట్ల శివ, నాయకులు దిడ్డి కుమారస్వామి, మీసాల ప్రకాశ్, కొత్తపెల్లి శ్రీనివాస్, శామంతుల శ్రీనివాస్, గడ్డం రవి, శ్రీరాం రాజేశ్, పగడాల సతీశ్ పాల్గొన్నారు. సమసమాజ స్వాప్నికుడు.. వరంగల్: సమసమాజ స్వాప్నికుడు బీఆర్ అంబేడ్కర్ అని మంత్రి కొండా సురేఖ అన్నారు. అంబేడ్కర్ జయంతి వేడుకలను వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. వరంగల్ కాశిబుగ్గ జంక్షన్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి కొండా సురేఖ, బల్దియా మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడతూ.. అంబేడ్కర్ ఆలోచనలు, ఉద్యమాలు ఇప్పటికీ మార్గదర్శకమేనన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు -
నువ్వు ఉండి ఏం ప్రయోజనం లేదు చనిపో..
వర్ధన్నపేట : ప్రస్తుత సమాజంలో రక్తసంబంధాలు మంటగలుస్తున్నాయని చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఆస్తి కోసం కన్న తండ్రి అని చూడకుండా కుమారుడు, కోడలు నిత్యం వేధింపులకు గురిచేసి అతడు బలవన్మరణానికి పాల్పడేలా కారణమయ్యారు. పొలం, ఇంటి స్థలాలు, ఇల్లు తమపేర చేయాలని కొద్ది రోజులుగా ఒత్తిడి చేస్తుండగా దీనికి ఆ వృద్ధుడు ససేమిరా అంటున్నాడు. దీంతో మానసికంగా హింసిస్తున్నారు. నువ్వు ఉండి ఏం ప్రయోజనం లేదు మందు తాగి చనిపో అని కోడలు వేధింపులకు గురిచేయడంతో మనస్తాపం చెందిన ఆ వృద్ధుడు గడ్డిమందుతాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని కడారిగూడెంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నాంపల్లి మల్లేశం(93)కు నలుగురు సంతానం. చిన్న కుమారుడు కోటేశ్వర్, అతడి భార్య ఎలేంద్ర.. గత కొద్ది రోజులుగా ఆస్తి కోసం నిత్యం వేధిస్తున్నారు. మల్లేశం పేర ఉన్న పొలం, ఇంటి స్థలాలు, ఇల్లు తమపేర చేయాలని మానసిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఎలేంద్ర ‘నువ్వు ఉండి ఏం ప్రయోజనం లేదు.. మందు తాగి చనిపో’ అని మామ మల్లేశంను వేధించింది. దీంతో మల్లేశం ఇంటి వద్ద గడ్డిమందు తాగాడు. గమనించిన రెండో కుమారుడు చంద్రమౌళి వెంటనే 108లో ఎంజీఎం తరలించారు. చికిత్స పొందుతున్న క్రమంలో ఆదివారం రాత్రి 8.20 గంటలకు మల్లేశం చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి కూతురు అమరావతి విజయ ఫిర్యాదు మేరకు చిన్నకుమారుడు కోటేశ్వర్, అతడి భార్య ఎలేంద్రపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చందర్ సోమవారం తెలిపారు. ఆస్తి కోసం తండ్రికి కొడుకు, కోడలు మానసిక వేధింపులు ● మనస్తాపంతో గడ్డి మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య ● కడారిగూడెం గ్రామంలో ఘటన ● పోలీసులకు మృతుడి కూతురు ఫిర్యాదు.. కేసు నమోదు -
కూలీకి వస్తూ కానరానిలోకాలకు..
టేకుమట్ల: కూలీకి వస్తూ ఓ మహిళ కానరానిలోకాలకు వెళ్లింది. హార్వెస్టర్ వెనక్కి వస్తుండగా దాని కింద పడి మృతి చెందింది. ఈ ఘటన సోమవారం సాయంత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం బూర్నపల్లి శివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన కొంత మంది కూలీలు వరి పంటలో బెరుకుల తీసేందుకు ఆటోలో బూర్నపల్లికి వస్తున్నారు. ఈ క్రమంలో ఆటో ముందు హార్వెస్టర్ వెళ్తుండగా.. ఎదురుగా ఆర్టీసీ బస్సు వస్తోంది. దీంతో హార్వెస్టర్ ఆపరేటర్ బస్సుకు దారి ఇచ్చేందుకు వెనక్కి తీస్తున్నాడు. ఈ క్రమంలో హార్వెస్టర్ వెనుక ఉన్న ఆటోను డ్రైవర్ కూడా వెనక్కి తీస్తుండగా అందులో ఉన్న ఇద్దరు మహిళలు భయంతో కిందికి దిగారు. అయితే హార్వెస్టర్ వారిపైకి ఎక్కింది. ఈ ఘటనలో దాసరి కనుకమ్మ(55) అక్కడికక్కడే మృతి చెందగా, మరో కూలీ వసంతకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వసంతను చికిత్స నిమిత్తం వరంగల్ తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై దాసరి సుదాకర్ ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదంపై వివరాలు సేకరించారు. అనంతరం కనుకమ్మ మృతదేహాన్ని చిట్యాల ఆస్పత్రి మార్చురీకి తరలిచారు. కన్నీరుమున్నీరైన కూలీలు.. క్షణం ముందు ప్రాణంతో అందరి మధ్య ప్రయాణించిన కనుకమ్మ రెప్పపాటు క్షణంలో విగతజీవిగా మారడంతోపాటు మరో మహిళ తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతుండగా చలించిన తోటి కూలీలు కన్నీరుమున్నీరయ్యారు. సాయంత్రం కూలీకి రాకున్నా బతికేదేమో అని విలపించారు. ప్రాణాలు తీస్తున్న సాయంత్రం కూలీ.. వేసవిలో ఎండలు తీవ్రంగా ఉండడంతో వ్యవసాయ కూలీలు ఉదయం, సాయంత్రం రెండు పూటల పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల మండలంలోని రామకిష్టాపూర్(టి) గ్రామానికి చెందిన మహిళా కూలీలు సాయంత్రం వేళ పొలంలోని బెరుకులు తీసేందుకు వెళ్లగా లారీ అదుపు తప్పి మీదపడిన ఘటనలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే మొట్లపల్లి నుంచి కూలీలు సాయంత్రం వేళ పొలంలోని బెరుకులు తీసేందుకు వస్తుండగా హార్వెస్టర్ మృత్యుశకటమై కనుకమ్మను కబలించింది. హార్వెస్టర్ కింద పడి మహిళా కూలీ మృతి ఒకరికి తీవ్ర గాయాలు బూర్నపల్లి శివారులో ఘటనబావిలోడి వ్యక్తి.. నెక్కొండ: వ్యవసాయ బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం మండలంలోని వెంకటాపురంలో జరిగింది. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రాళ్లబండి పెద్ద రాజయ్య (56) ఈనెల 13న సాయంత్రం తన పొలం వద్దకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో దారిలో గ్రామానికి చెందిన కొత్తపల్లి వీరారావు వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డాడు. కుటుంబీకులు రాజయ్య కోసం వెతకగా సోమవారం సాయంత్రం బావిలో శవమై తేలి కనిపించాడు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించామని ఎస్సై పేర్కొన్నారు. మృతుడి కుమారుడు శివకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసున్నామని ఎస్సై తెలిపారు. -
పెళ్లి బాధ.. చితికి చేర్చింది..
దుగ్గొండి: ఉన్నత విద్యనభ్యసించాడు. ఎంతకూ పెద్ద ఉద్యోగం రాలేదు. చివరికి ఓ కంపెనీలో చిన్న ఉద్యోగంలో చేరాడు. వచ్చే వేతనం ఖర్చులకూ సరిపోవడం లేదు. మంచి ఉద్యోగం లేదని వచ్చిన పెళ్లి సంబంధాలు రద్దువుతున్నాయి. దీంతో ఓ యువకుడు మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్ప డ్డాడు. ఈ ఘటన సోమవారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఇంగోళి రాజేశ్వర్రావు, పద్మ దంపతుల కుమారుడు వేణు(30) బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు సాగించి చివరికి తక్కువ వేతనానికి హైదరాబాద్లో ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అయితే వేతనం ఖర్చులకు సరిపోకపోవడంతో నాలుగు రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. ఈ విషయం తండ్రికి చెప్పడంతో వ్యవసాయం చేసుకుందామని చెప్పి ఓదార్చాడు. వ్యవసాయ పనులు చేయలేక పోయాడు. ఏ పనిచేయలేక తల్లిదండ్రులకు భారంగా మారానని మదనపడుతున్నాడు. ఇదే తరుణంలో వేణుకు అనేక పెళ్లి సంబంధాలు చూశారు. వేణు ఉద్యోగ వివరాలు తెలుసుకున్నాక పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు. ఇలా మూడు సంబంధాలు రద్దు అయ్యాయి. ఇక తనకు పెళ్లికాదని మనస్తాపంతో తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లిన అనంతరం ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన మృతుడి అమ్మమ్మ లచ్చమ్మ దారి వెంట వెళ్తున్న వారిని పిలిచి విషయం చెప్పి తలుపులు తీయించింది. అప్పటికే వేణు ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. కిందికి దించి చూడగా మృతిచెంది ఉన్నాడు. చేతికందొచ్చిన కుమారుడు బలవన్మరణానికి పాల్పడడంతో రాజేశ్వర్రావు, పద్మ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు తెలిపారు. సంబంధం కుదరడం లేదని యువకుడి బలవన్మరణం -
మోటార్లతో నీటిని తోడేశారు
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్లో ఏ రైతును కదిలించిన కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఆదివా రం కురిసిన భారీ వర్షంతో 20వేల బస్తాలకు పైగా ధాన్యం తడిసి పోగా, వరద వెళ్లే దారిలేక ధాన్యం రాశుల పక్కనే నిలిచి ముంచేసింది. నీటిలో ముని గిన ధాన్యాన్ని బయటకు తీసేందుకు రైతులు మో టార్లు పెట్టి తోడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనగామ మండలం చౌడారం గ్రామానికి చెందిన రైతు దండబోయిన రజిత కుటుంబం ఐదు ఎకరాలు సా గు చేయగా, 200 బస్తాల దిగుబడి వచ్చింది. ప్రభు త్వ మద్దతు ధరకు అమ్ముకునేందుకు మార్కెట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్కు నా లుగు రోజుల క్రితం ధాన్యం తీసుకొచ్చారు. తేమ పేరుతో కొనుగోలు ఆలస్యం కావడంతో అకాల వర్షం 200 బస్తాలను ముంచేసింది. 20 బస్తాలు వరదలో కొట్టుకుపోయాయి. రాత్రి 7.30 గంటల నుంచి సోమవారం ఉదయం 11 గంటలకు వరకు 180 బస్తాల ధాన్యం నీటిలోనే ఉండిపోయింది. దీంతో రైతులు ఇంట్లో వినియోగించే నీటి మోటారును తీసుకొచ్చి కుటుంబమంతా నాలుగు గంటల పాటు కష్టపడి తోడేశారు. ఒక్క అధికారి వచ్చి పలకరించలేదని, టార్పాలిన్ కవర్లు సైతం ఇవ్వలేదని మహిళా రైతు రజిత.. కన్నీరుమున్నీరుగా విలపించారు. 12 గంటలపాటు తడిసిన ధాన్యం మొలకెత్తే పరిస్థితి ఉందని ఆందోళనే వ్యక్తం చేస్తున్నారు. జనగామ మార్కెట్ ఐకేపీ సెంటర్లో రైతుల గోస -
రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలి
వరంగల్: నర్సరీల్లో రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి నగర పరిధిలోని 18 వ డివిజన్ క్రిస్టియన్ కాలనీలోని నర్సరీని కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులు, నర్సరీని సక్రమంగా నిర్వహించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. బల్దియా పరిధి 9 నర్సరీల్లో 10 లక్షల మొక్కలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వర్షాకాలంలోగా నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో హెచ్ఓ లక్ష్మారెడ్డి, హార్టికల్టర్ అసిస్టెంట్ ప్రిన్సి తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగులైన యువతకు ఆర్వీవై ఒక మంచి అవకాశం నిరుద్యోగులైన యువతకు రాజీవ్ యువ వికాసం(ఆర్వైవీ) పథకం మంచి అవకాశమని కమిషనర్ డాక్టర్ అశ్వినీ తానాజీ వాకడే అన్నారు. సోమవారం వరంగల్ కాశిబుగ్గ సర్కిల్ కార్యాలయాన్ని కమిషనర్ ఆకస్మికంగా సందర్శించారు. సెలవు రోజున ప్రత్యేక కౌంటర్ ద్వారా స్వీకరిస్తున్న రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఆదివారం, సోమవారం స్వీకరించిన దరఖాస్తుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చివరి రోజైన సోమవారం సాయంత్రం 5 గంటల వరకు జీడబ్ల్యూఎంసీ పరిధిలో 10,254 దరఖాస్తులు స్వీకరించినట్లు కమిషనర్ తెలిపారు. బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే -
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ అందరివాడు
అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలి● వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య హన్మకొండ: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ అందరి వాడని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం హనుమకొండలోని ఆయన విగ్రహానికి ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ పి.ప్రావీణ్య, నగర మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి శ్రీలత, రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్ ఖుస్రు పాషా, మాజీ మేయర్ ఎరబ్రెల్లి స్వర్ణ, అధికారులు, ప్రజా సంఘాల నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా కడియం కావ్య మాట్లాడుతూ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ఆధారంగానే తమకు ఎంపీ, ఎమ్మెల్యేలుగా అవకాశాలు లభించాయన్నారు. ఆయన ఆలోచన విధానాన్ని గ్రామాల్లోని చివరి ఇంటి వరకూ తీసుకెళ్తున్నట్లు తెలిపారు. -
సీఎం సమావేశంలో కలెక్టర్లు
వరంగల్: హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సోమవారం సీఎం రేవంత్రెడ్డి కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో వరంగల్, హనుమకొండ కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, ప్రావీణ్య పాల్గొన్నారు. ఈసమావేశంలో భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, వేసవి తాగు నీటి ప్రణాళికలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిశానిర్దేశం చేశారు. అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం● రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఖిలా వరంగల్: వేసవిలో అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం వరంగల్ శివనగర్లోని అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద ఈ నెల 14 నుంచి 20వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాల వాల్పోస్టర్ను మేయర్ గుండు సుధారాణి, ఏసీపీ నందిరామ్నాయక్, డీఎఫ్ఓ కేవీ సతీశ్కుమార్, ఎస్ఎఫ్ఓ రాజేశ్వర్రావుతో కలిసి ఆవిష్కరించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు. కార్యక్రమంలో జమేదార్ మాధవరెడ్డి, నవీన్రాజు, మీసాల ప్రకాశ్, కార్పొరేటర్ సొమిశెట్టి ప్రవీణ్ పాల్గొన్నారు. మృత పిండం అప్పగింతఎంజీఎం: నగరంలోని రైల్వే గేట్ సమీపంలో కేవీఎన్ రెసిడెన్సీ నివాసి అయిన భావన గర్భంలో పెరుగుతున్న 6 నెలల పిండంలో ప్రమాదకరమైన వ్యాధిని గుర్తించిన వైద్యులు తల్లికి అపాయం జరుగుతుందని పిండాన్ని తొలగించారు. తల్లిదండ్రులు సమాజ హితం కోరి కేఎంసీ వైద్య విద్యకు దానం చేయడానికి ముందుకు వచ్చారు. తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాతల అసోసియేషన్ వరంగల్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాంకుమార్రెడ్డి ఆదేశంతో కళాశాల అనాటమీ విభాగానికి మృత పిండాన్ని అప్పగించారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్రెడ్డి, ఉపాధ్యక్షురాలు మునిగాల పద్మ, వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షులు మల్లారెడ్డి, వేణు తదితరులు పాల్గొన్నారు. ట్రాక్ రెన్యువల్ పనులుకాజీపేట రూరల్: కాజీపేట రైల్వే స్టేషన్లో సోమవారం రైల్వే ఇంజనీరింగ్ అధికారులు ట్రాక్ రెన్యువల్, మరమ్మతు పనులు చేపట్టారు. ముందస్తుగా ఎలాంటి సాంకేతిక సమస్య తలెత్తకుండా ట్రాక్ను తనిఖీ చేసి మరింత సమర్థవంతంగా ఉండేందుకు యంత్రాల సాయంతో మరమ్మతు పనులు చేపడుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.ఏప్రిల్ 11: హనుమకొండలోని గాంధీనగర్ పోచమ్మ గుడి సమీపంలోని షామా డిస్ట్రిబ్యూటరీలో ఎక్స్పైరీ తేదీలు ముద్రించకుండానే ఐస్క్రీమ్లు ప్యాక్ చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేసి నిబంధనలు పాటించకుండా ఐస్క్రీమ్ తయారు చేస్తున్న నిర్వాహకులను పట్టుకున్నారు. రూ.25,740 విలువైన ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని నిర్వాహకుడు మొహమ్మద్ జాన్ పాషాను అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 12: మడికొండలోని కనకదుర్గ కాలనీలో ఓంకార్ ఐస్ క్రీమ్ డిస్ట్రిబ్యూటరీలో టాస్క్ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేశారు. తయారీ, ఎక్స్ పైరీ తేదీలు ముద్రించకుండా అమ్మకానికి సిద్ధంగా ఉంచిన రూ.2,39,476 విలువైన ఐస్ క్రీమ్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు వొల్లాల రవీందర్ను అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 14: వరంగల్ బాలాజీనగర్లోని కూల్ టచ్ ఐస్ క్రీమ్ కంపెనీలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. నియమాలు పాటించకుండా, తయారీ, ఎక్స్ పైరీ తేదీలు ముద్రించకుండా, లైసెన్స్ లేకుండా అమ్మకానికి సిద్ధంగా ఉంచిన రూ.83,200ల విలువైన ఎనిమిది రకాల ఉత్పత్తులను గుర్తించారు. టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.పవన్కుమార్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కృష్ణమూర్తి సంయుక్తంగా దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు అల్లిపురం శ్రీపాల్రెడ్డిని అదుపులోకి తీసుకొని తదుపరి విచారణ కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు. -
చనిపోయిన వ్యక్తి భూకబ్జా చేశాడట!
తొమ్మిదేళ్ల క్రితం మరణించిన వ్యక్తిపై కేసువరంగల్ క్రైం: చనిపోయిన వ్యక్తి వచ్చి భూ కబ్జా చేసినట్లు కేసు నమోదు చేసిన పోలీసుల్ని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చూడొచ్చు. 9 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి లేచి వచ్చి అక్రమంగా భూమిలోకి చొరబడి, బెదిరింపులకు పాల్పడినట్లు వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్లో ఏ–1 కింద కేసు నమోదు చేశారో పోలీస్ అధికారి. సివిల్ కేసుల్లో తలదూర్చవద్దని పోలీస్ ఉన్నతాధికారులు మొత్తుకుంటున్నా.. కొందరు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్నందుకు ఇదో ఉదాహరణ. భూదందాలకు చిరునామాగా మారిన ఆ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతర్ చేస్తూ.. తనకు నచ్చని వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు, ఆపోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడనే ప్రచారం సాగుతోంది. ఇటీవల ఓ కేసులో రెండు వర్గాలు రాజీకుదుర్చుకోగా.. రాజీ పడవద్దని ఒత్తిడి చేసి వివాదాస్పదుడిగా పేరు మూటగట్టుకున్నట్లు తెలుస్తోంది. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది జనవరి 21న కొంత మంది వ్యక్తులు తన భూమిలోకి అక్రమంగా చొరబడి, హద్దు రాళ్లను పీకేసి ప్లాట్ల యజమానులను చంపుతామని బెదిరించినట్లు ఓ మహిళ ఆ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎలాంటి విచారణ చేయకుండానే అదే రోజు పిటిషనల్లో పేర్కొన్న వ్యక్తులపై కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ నంబర్ 47/2025 లో ఏ–1గా ఉన్న బత్తిని చంద్రశేఖర్ చనిపోయి సుమారు తొమ్మిదేళ్లవుతోంది. ఎఫ్ఐఆర్ కాపీ చూసిన అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. చనిపోయిన వ్యక్తి ఎక్కడినుంచి వచ్చి అక్రమంగా భూమిలోకి ప్రవేశించి.. హద్దు రాళ్లు పీకేసి చంపుతానని బెదిరిస్తాడని ప్రశ్నిస్తున్నారు. మృతుడి బంధువులు అడిగితే నా ఇష్టం వచ్చిన వారిపై కేసు నమోదు చేస్తా. అవసరం అయితే నీపై (ప్రశ్నించిన వ్యక్తిపై ) కేసు పెడతానని సదరు అధికారి బెదిరింపులకు దిగాడు. దీంతో చేసేదేమీ లేక బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారు కూడా ఏమీ చేయలేక సదరు అధికారిపై చిరుకోపం ప్రదర్శించి చేతులు దులుపుకున్నట్లు సమాచారం. మిస్సింగ్, చిన్న చిన్న చీటింగ్ కేసులు పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఉన్నతాధికారులకు ముందస్తు సమాచారం ఇచ్చి.. అవసరం అయితే వారు చెప్పిన సెక్షన్లు వచ్చేలా కేసులు నమోదు చేయడం పోలీస్ స్టేషన్లలో అనవాయితీ. అలాంటిది ఫిర్యాదు వచ్చీ రాగానే.. కనీసం అవతలి వ్యక్తులపై ఎలాంటి విచారణ లేకుండానే, వారిని పోలీస్స్టేషన్కు పిలవకుండానే కేసులు నమోదు చేయడం సదరు అధికారికే చెల్లింది. బాధితుల భూమికి, ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన సర్వే నంబర్లకు ఎలాంటి సంబంధం లేకపోవడం గమానార్హం. చనిపోయిన వ్యక్తిపై నమోదైన ఎఫ్ఐఆర్విచారించకుండానే.. చట్ట ప్రకారం.. పోలీస్స్టేషన్లలో భూదందాలకు సంబంధించిన కేసులు పట్టించుకోవద్దు. ఏది ఉన్నా న్యాయస్థానాల్ని సంప్రదించాలని సలహా ఇవ్వాలి. పోలీస్ స్టేషన్లలో తాటికాయలంత అక్షరాలతో ‘ఇక్కడ భూ సమస్యలు పరిష్కరించబడవు. సివిల్ తగదాలకు పరిష్కారం లేదు’ అని రాసి ఉంటుంది. అలాంటిది ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కనీసం విచారణ జరపకుండా రెండు వర్గాల అభిప్రాయాలు తెలుసుకోకుండా చేతిలో అధికారం ఉందని, కాసుల కక్కుర్తితో చనిపోయిన వ్యక్తిపై కేసులు నమోదు చేసి నిబంధనలకు నీళ్లు వదిలారు. ఈ ఒక్క ఘటన వెలుగులోకి రాగా.. ఇలాంటి వెలుగు చూడని ఘటనలు మరెన్ని ఉన్నాయోననే అనుమానాలు కలుగుతున్నాయి. కాసులకు కక్కుర్తి పడే కొంత మంది పోలీసు అధికారుల కారణంగా వరంగల్ కమిషనరేట్ పోలీసుకున్న ఘన చరిత్ర మసకబారుతోందన్న ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి శవాలపై కేసులు పెట్టే సదరు అధికారి అక్రమ దందాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, బాధితులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రస్తుతం రోజువారీ జరిగే రిజిస్ట్రేషన్లు ఇలా...
భీమదేవరపల్లి : 20 నుంచి 30 స్టేషన్ఘన్పూర్ : 25 నుంచి 30 జనగామ : 40 నుంచి 55 కొడకండ్ల : 7 నుంచి 15 మహబూబాబాద్ : 45 నుంచి 60 ములుగు : 10 నుంచి 20 వరంగల్ ఆర్వో : 70 నుంచి 110 వరంగల్ రూరల్ : 25 నుంచి 35 వరంగల్ఫోర్ట్ : 25 నుంచి 40 వర్ధన్నపేట : 6 నుంచి 15 నర్సంపేట : 20 నుంచి 35 పరకాల : 15 నుంచి 25 భూపాలపల్లి : 20 నుంచి 30 -
రథోత్సవం ప్రారంభం
వరంగల్ : గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం పెద్ద రథోత్సవం ప్రారంభమైంది. స్థానిక పురవీధుల్లో స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్, మాజీ ఎంపీ పసునూరి దయాకర్, గోపాల నవీన్రాజ్, చింతాకుల సునీల్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. రథయాత్ర కొంత ఆలస్యంగా కరెంటు వైర్లు తీయడం మళ్లీ బిగించడంతో లేట్ అవుతుందని సోమవారం మధ్యాహ్నం వరకు దుర్గేశ్వర ఆలయం చేరుకుంటుందని తెలిపారు. సత్యనారాయణ, మీసాల ప్రకాశ్, జాతి రమేశ్, శ్రీనివాస్, బండి శంకర్, మహేష్, రాజు, శంకర్, పాల్గొన్నారు. సేంద్రియ ఆహారం తీసుకోవాలిహన్మకొండ చౌరస్తా: సేంద్రియ పద్ధతిలో పండించిన వాటిని తినాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్లోని నేరేళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో గ్రామ భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి గ్రామీణ ఉత్పత్తుల సంతను ఆదివారం బండా ప్రకాశ్ ము ఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత జంక్ఫుడ్కు అలవాటు పడి అనేక వ్యాధులు కొని తెచ్చుకుంటోందన్నారు. జంక్ఫుడ్, రసాయనాలతో కూడిన ఆహార పధార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. తెలంగాణ గ్రామ భారతి అధ్యక్షురాలు సూర్యకళ మాట్లాడుతూ ప్రజల్లో మార్పులు తీసుకురావాలన్న సదుద్దేశంతో ప్రతీ నెల ప్రకృతి సంత నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్, సంస్థ వరంగల్ జిల్లా బాధ్యుడు అజిత్రెడ్డి, తోట ఆనందం, అనిత, బయ్య సారయ్య తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్లు కల్పించాలిహన్మకొండ చౌరస్తా: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించాలని భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ డిమాండ్ చేశారు. ఇటీవల ఎన్నికై న హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా మానుక సతీశ్, యువజన విభాగం అధ్యక్షుడిగా నడిపల్లి శ్రీధర్, జనగామ జిల్లా అధ్యక్షుడు ఏషబోయిన రమేశ్చేత ఆదివారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాజేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో దివ్యాంగుల సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎండీ షరీఫ్, జిల్లా సభ్యుడు నరేవ్, అనిల్, మమత పాల్గొన్నారు. మల్లన్నకు ప్రత్యేక పూజలు ఐనవోలు: సూర్యుడు మీనరాశి నుంచి మేష రాశిలోకి ప్రవేశించడం సందర్భంగా ఆదివారం ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక సంక్రమణ పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయంలో నిత్య పూజలు నిర్వహించిన అనంతరం ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు ఐనవోలు మధుకర్ శర్మ, వేద పండితులు విక్రాంత్ వినాయక్ జోషి ఆధ్వర్యంలో స్వామి వారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, రుద్ర హోమం జరిపించారు. అలాగే గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మలతో శ్రీమల్లికార్జునస్వామి కల్యాణం నిర్వహించారు. కాగా.. ఒగ్గు పూజారులు పెద్దపట్నం వేసి, ఒగ్గు కథలు చెబుతూ.. మల్ల న్న కల్యాణంతో పాటు ప్రత్యేక ఒగ్గు పూజలు చేశారు. కార్యక్రమంలో ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు, ఆలయ అర్చక సిబ్బంది పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది
ఎల్కతుర్తి: కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాల న సాగిస్తోందని ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నా రు. ఈనెల 27న ఎల్కతుర్తి మండలం చింతలపల్లి సమీపాన నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభా స్థలిని ఆయన మాజీ ఎమ్మెల్యే సతీశ్కుమార్తో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈసందర్భంగా విలేకరులతో మాట్లాడారు. గడిచిన 25 ఏళ్ల కాలంలో తెలంగాణలో నెలకొన్న సమస్యలను అప్పటి సీఎం కేసీఆర్ పరిష్కరిస్తే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే తిరిగి వెనుకటి రోజులను తీసుకొచ్చిందని విమర్శించా రు. బీఆర్ఎస్ సర్కారు కరెంట్ సమస్య లేకుండా, గుంట పొలం ఎండిపోకుండా చేస్తే.. ఇప్పుడు కరెంట్, నీరు లేక వందల ఎకరాల్లో పంటలు ఎండిపోయిన పరిస్థితి దాపురించిందన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిత్తం సదానందం, బీఆర్ఎస్ నాయకులు పిట్టల మహేందర్, మండల సురేందర్, తంగెడ మహేందర్, గోల్లె మహేందర్, తంగెడ నగేశ్, శేషగిరి, కడారి రాజు, జూపాక జడ్సన్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి -
బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి
గీసుకొండ: కేంద్రంలోని బీజేపీ కుట్రలు, ఆ పార్టీ సర్కారు తీరు కారణంగా రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ఆదివారం కాంగ్రెస్ నాయకుడు దుపాకి సంతోష్ నిర్వహించిన ‘జై బాపు, జై అంబేడ్కర్, జై సంవిధాన్’ ర్యాలీలో పాల్గొని ఆయన మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షణ ప్రతీఒక్కరి బాధ్యత అన్నారు. పార్లమెంట్ సాక్షిగా బీజేపీ రాజ్యాంగాన్ని అవమానపర్చిందని ఆరోపించారు. బీజేపీ తీరుపై ప్రజలకు అవగాహన కలిగించడానికి గ్రామ గ్రామాన కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. బీజేపీ మతాల మధ్య చిచ్చుపెడుతూ, లౌకికవాదానికి తూట్లు పొడుస్తోందన్నారు. గరీబ్నగర్, కీర్తినగర్లో నిర్వహించిన ర్యాలీల్లో ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరె డ్డి, కొ ండేటి కొమురారెడ్డి, సాల్మన్, గోదాసి చిన్న, దా సారపు సారయ్య, జానీ, హుజూర్, చెక్క రమేశ్, మ హ్మద్ ఆఫ్రీన్, శైలజ, లలిత, శోభారాణి ఉన్నారు. రాజ్యాంగ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి -
మావోయిస్టులతో చర్చలు జరపాలి
ఖిలా వరంగల్: కేంద్రం కాల్పులు విరమించి మావోయిస్టులతో చర్చలు జరపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం వరంగల్ శివనగర్లోని సీపీఐ తమ్మెర భవనంలో పార్టీ ఉమ్మడి జిల్లా సమితి సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ కగార్’ పేరుతో మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడం సరికాదన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడిదారీ వర్గాలకు, కార్పొరేట్ శక్తులకు మేలు జరిగిందే తప్ప పేదలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే విపక్షాలపై ఈడీ, సీబీఐ, ఈసీలను ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని, ఇటీవలే వంట గ్యాస్ ధరల ను పెంచి పేద ప్రజలపై భారం మోపారని అన్నా రు. మోదీ సర్కారు దుష్పరిపాలనకు వ్యతిరేకంగా కలిసి వచ్చే లౌకిక శక్తులతో పారాడాలని, ఈనెల 21న ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాస్రావు, జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజారెడ్డి, బి.విజయసారధి, మేకల రవి, నేదునూరి జ్యోతి, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు -
మాకూ కావాలి ‘స్లాట్ బుకింగ్’
సోమవారం శ్రీ 14 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 8లోuసమష్టి అవగాహన, కఠిన చర్యలు అవసరం రమ్మీ యాప్ల ప్రభావం ఊహించలేనంత భయంకరంగా ఉంది. విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగులు.. ఇలా ఎవరికీ మినహాయింపు లేకుండా ఉంది. ఈ చీకటి ప్రపంచాన్ని ఎదుర్కోవాలంటే ప్రతీ విద్యాసంస్థలో సైబర్ క్రైమ్పై అవగాహన, మానసిక, ఆరోగ్య సదస్సులు నిర్వహించాలి. మండల స్థాయిలో మోసపోయిన యువత పునరావాసం కోసం శ్రీడిజిటల్ బాధితుల కమిటీశ్రీ ఏర్పాటు చేయాలి. ఎవరు యాప్లను ప్రమోట్ చేస్తున్నారో గుర్తించి న్యాయపరంగా వారిపై కేసులు నమోదు చేయాలి. ముఖ్యంగా విద్యాశాఖ, పోలీస్ వ్యవస్థ, న్యాయ శాఖ, మానసిక ఆరోగ్య సంస్థలు సమష్టిగా పనిచేయాలి. – డాక్టర్.బి.కేశవులు, ఎండీ సైకియాట్రిస్ట్, సీనియర్ మానసిక వైద్య నిపుణులు నిషేధించిన ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దు ప్రభుత్వం నిషేధించిన ఆన్లైన్ గేమ్స్ ఆడటం, వాటిని నిర్వహించడం చట్టరీత్యా నేరం. చర్యలు ఉంటాయి. యువత ఇటీవల ఆన్లైన్ గేమ్స్పై ఆసక్తి చూపుతోంది. ఇది సరైనది కాదు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారు.. ఏ ఆటలాడుతున్నారో గమనించాలి. ఆన్లైన్ ఆటలకు బానిస కావొద్దు. బంగారు భవిష్యత్ను నాశనం చేసుకోవద్దు. – కొత్త దేవేందర్ రెడ్డి, ఏసీపీ, హనుమకొండవిద్యారణ్యపురి : తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలపై అనేక పోరాటాలను టీఎస్యూటీఎఫ్ నిర్వహించిందని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు బద్దం వెంకటరెడ్డి అన్నా రు. ఆదివారం హనుమకొండలోని టీఎస్యూటీఎఫ్ కార్యాలయంలో సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆ యన ఉపాధ్యాయ సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీచర్ల సమస్యలపై అనేక ఐక్య ఉద్యమాలను టీఎస్యూటీఎఫ్ నిర్మించిందని ఆయన గుర్తుచేశారు. కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు డి.కిరణ్కుమార్, హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ిసీహెచ్ రవీందర్రాజు, పెండెంరాజు, కుమార్, సి.సుజన్ ప్రసాద్రావు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గోపాల్నాయక్, జిల్లాల బాధ్యులు లింగారావు, కరుణాకర్, కె.మోజెస్, సీఎస్ఆర్ మల్లిక్, సదానందం, భాస్కర్రా వు, తిరుపతి, శ్రీనివాస్ పాల్గొన్నారు. ● ‘నా ఫ్రెండ్ రూ.500 పెట్టి రూ.1,500 గెలిచాడు. నేనూ ట్రై చేశా. 5 రోజుల్లో రూ.8,000 పోయాయి. చివరికి సెల్ఫోన్ అమ్మేశా.’ – ఇంజనీరింగ్ విద్యార్థి, వరంగల్ ● ‘నాకు డబ్బు రావడం ప్రారంభమైన తర్వాత ఆడి రెఫరల్ గ్రూపులు క్రియేట్ చేశా. నా అకౌంట్లో డబ్బులు జమవుతాయని మెసేజ్ వచ్చింది. ఆఖరికి నా ఖాతా ఫ్రీజ్ అయ్యింది.’ – డిగ్రీ విద్యార్థి, నర్సంపేట– సాక్షిప్రతినిధి, వరంగల్.. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రమ్మీ గేమింగ్ యాప్ల సంస్కృతి పెరుగుతోంది. రమ్మీ యాప్లు యువత జీవితాలపై బలమైన దాడి చేస్తున్నాయి. ‘గేమింగ్’ ముసుగులో జూ దపు బానిసత్వం విస్తృతంగా వ్యాపిస్తోంది. ఫలితంగా అనేక మంది ఈ ఉచ్చులో చిక్కుకు ని అప్పులు మూటగట్టుకుంటున్నారు. వాటిని తీర్చలేక చివరికి ప్రాణాలు తీసుకుంటున్నారు. యాప్ల వ్యాప్తి.. ఉమ్మడి వరంగల్లో 2022 తర్వాత రమ్మీ యాప్ విష సంస్కృతి విచ్చలవిడి అయ్యింది. ప్రధానంగా నగరంలోని వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాలతోపాటు మహబూబాబాద్, జనగామ, పరకాల, నర్సంపేట తదితర పట్టణాల్లో ఈయాప్ల వినియోగం గణనీయంగా పెరిగింది. ‘రమ్మీ కల్చర్’, ‘ఎ 23 రమ్మీ’, వెల్త్ రమ్మీ’, ‘జంగిల్ రమ్మీ’.. వంటి యాప్లు టాప్–డౌన్లోడెడ్గా ఉన్నాయి. టెలిగ్రామ్ చానల్స్ ద్వారా ‘100 శాతం గెలుపు ట్రిక్స్’, ‘మీకు మద్దతు అందించే రమ్మీ టీచర్స్’.. తదితర పేర్లతో ఇన్ఫ్లుయెన్సర్లు మోసం చేస్తూనే ఉన్నారు. అందరూ టార్గెటే.. యూత్ నుంచి గృహిణుల దాకా.. అన్ని వర్గాలను ఈ రమ్మీ యాప్లు టార్గెట్ చేస్తూ విస్తరిస్తున్నాయి. బీటెక్, డిగ్రీ, ఇంటర్ విద్యార్థులు.. ఇలా అనేక మంది ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా హనుమకొండ, కాజీపేట, వరంగల్ ట్రైసిటీ పరిధి విద్యాసంస్థల్లో చదివేవారు, ప్రైవేట్ టీచర్లు, క్లర్కులు, ఆర్థిక ఒత్తిడిలో ఉన్న వర్గాలు, గృహిణులు ‘టైమ్ పాస్’గా మొదలుపెట్టి ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతున్నారు. వారం రోజుల వ్యవధిలో భారీగా డబ్బులు కోల్పోయిన సుమారు 20 మందికి పైగా వివిధ ప్రాంతాల్లో పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. గేమ్ మాఫియా.. ‘బ్రోకర్’ వ్యవస్థ ఉమ్మడి వరంగల్లోని పలు ప్రాంతాల్లో రమ్మీ గేమ్ యాప్ల వినియోగం విచ్చలవిడిగా సాగుతున్నదని, వాటి పట్ల ఆకర్షితులు కావొద్దని సైబర్ క్రైమ్ పోలీస్లు ఇప్పటికి చాలా సార్లు హెచ్చరించారు. ప్రధానంగా వరంగల్ ట్రై సిటీలో మూడు టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా రెండు లక్షల రూపాయల వరకు రోజువారీ బెట్టింగ్ జరుగుతున్నట్లు సైబర్ పోలీసుల అనుమానం. ఈగ్రూపులకి ‘మాస్టర్ బ్రోకర్లు’ నిధులు సమకూరుస్తూ యువతకు ‘విజయం’ చూపించి మాయ చేస్తున్నట్లు సమాచారం.నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు హన్మకొండ : హనుమకొండలోని పలు ప్రాంతాల్లో ఈనెల 14న విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి తెలిపారు. నరేంద్రనగర్, జూలైవాడ ప్రాంతాల్లో ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు, వడ్డేపల్లి, విజయపాల్ కాలనీ, రాఘవేంద్రనగర్ ప్రాంతాల్లో ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు. అలాగే వరంగల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని ఎన్పీడీసీఎల్ వరంగల్ టౌన్ డీఈ ఎస్.మల్లికార్జున్ తెలిపారు. పిన్నవారి స్ట్రీట్, దుర్గేశ్వర స్వామి దేవాలయం, మట్టెవాడ, ఎల్లంబజార్ ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి 12 గంటల వరకు సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడతాం టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకటరెడ్డి న్యూస్రీల్గేమింగ్ ముసుగులో ఆన్లైన్ జూదం కేరాఫ్గా మారిన ఉమ్మడి వరంగల్ ‘టైమ్ పాస్’తో మొదలై అప్పుల ఊబిలోకి ప్రాణాలు తీసుకుంటున్న యువత అవగాహన కల్పిస్తున్నా మారని తీరుమోసం ఎలా జరుగుతుందంటే? మొదటి మూడు గేమ్లు గెలిచేలా ఈ యాప్లను రూపొందించి నమ్మకం కలిగేలా చేస్తారు. మూడు గేమ్ల తర్వాత చివరికి ‘ఆటో బాట్’ వాడడం వల్ల యూజర్ గెలిచే అవకాశం కనీస స్థాయికి దిగిపోతుంది. యూజర్ నెగ్గడం పక్కన పెడితే.. ఒక వేల గెలిచినా ఆ డబ్బును దక్కించుకోలేక పోతున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా గెలుచుకున్న డబ్బును విత్ డ్రా చేసుకోవడంలో ఆలస్యం జరిగితే పూర్తిగా నిలిపివేస్తున్నట్లు పలువురు బాధితులు తెలిపారు. కాగా.. గేమ్లోకి ‘ఫ్రెండ్స్ని లాగితే రూ.100 బోనస్’.. అంటూ రెఫరల్ మాయాజాలంతో పాటు అనేక రకాలుగా వల వేస్తున్నట్లు యాప్ వాడుతున్నవారు చెబుతున్నారు.హెల్ప్ డెస్క్ ప్రారంభించినప్పటికీ.. తెలంగాణ వ్యాప్తంగా సైబర్ సెల్ 2024లో ‘గేమింగ్ యాప్ మోసాల’పై స్పెషల్ హెల్ప్లైన్ ప్రారంభించింది. డిజిటల్ డిటాక్స్ క్యాంపెయిన్ ద్వారా పదుల సంఖ్యలో కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. అయితే యాప్లు విదేశీ సంస్థల ఆధీనంలో ఉండడం వల్ల వాటిపై నేరుగా చర్య తీసుకోవడం కష్టంగా మారుతోందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తద్వారా వారించే వారికన్నా గేమ్ యాప్లు వినియోగించే వారే ఎక్కువవుతున్నారని ఓ పోలీస్ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. -
గురుకులాల ద్వారా ఉచితంగా న్యాయవిద్య
కాజీపేటలోని బీసీ గురుకుల ఉమెన్ ‘లా’ కాలేజీ భవనం.. విద్యారణ్యపురి: తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్ల క్రితం వరకు యూనివర్సిటీ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీల్లోనే ‘లా’ చదువుకోవాల్సి వచ్చేది. దీనికి వేలాది రూపాయల ఫీజులు చెల్లించాల్సిందే. ముఖ్యంగా యూనివర్సిటీల కాలేజీల్లో సీట్లకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ప్రైవేట్ లాకాలేజీల్లోనూ అధిక ఫీజులు చెల్లించి చదువుతున్నారు. మేనేజ్మెంట్ కోటాలో సంవత్సరానికి రూ.లక్ష ఫీజు తీసుకునే కాలేజీలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో న్యాయవాద వృత్తిలో స్థిరపడాలనుకునే పేద విద్యార్థినీ, విద్యార్థులకు రాష్ట్రంలోని బీసీ గురుకులాల్లో ఉచితంగా న్యాయ విద్యనందించేందుకు ప్రభుత్వం రెండేళ్ల క్రితమే చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా మహాత్మాజ్యోతిబాపూలే బలహీనవర్గాల విద్యాలయాల సంస్థ ద్వారా ఐదేళ్ల ‘లా’ కోర్సు ఉచితం అందజేస్తోంది. కాగా, కొన్నేళ్ల క్రితమే రాష్ట్రంలో హైదరాబాద్లోని చైతన్యపురిలో సాంఘిక సంక్షేమ గురుకులం బాలికల ‘లా’ కళాశాలగా ఉంది. అలాగే, సంగారెడ్డిలో గిరిజన సంక్షేమ గురుకులం బాలుర ‘లా’ కళాశాలగా ఉంది. బీసీ గురుకులాల ద్వారా.. తెలంగాణ ప్రభుత్వం బీసీ గురుకులాల ద్వారా న్యాయ విద్యనందిస్తుంది. ఇందులో భాగంగా 2023–2024 విద్యాసంవత్సరంలో కాజీపేట సోమిడి రోడ్డులో గురుకుల ‘లా’ ఉమెన్ కళాశాల ఏర్పాటు చేసింది. అలాగే, హైదరాబాద్ మహేశ్వరంలో గురుకుల ‘లా’ మెన్ కాలేజీ నిర్వహిస్తోంది. వీటిల్లో ప్రవేశాలకు టీజీ లాసెట్ ద్వారానే అడ్మిషన్లు కల్పిస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ వర్గాల్లో తక్కువ ఆదాయం కలిగిన పేద కుటుంబాలకు చెందిన ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ ‘లా’ గురుకులాల్లో అడ్మిషన్లు పొందొచ్చు. అనేక సదుపాయాలు.. ఈ గురుకుల ‘లా’ కళాశాలలో విద్యార్థుల అడ్మిషన్ల గరిష్ట వయోపరిమితి 20 ఏళ్లు ఉంది. వివాహితులకు ప్రవేశం లేదు. విద్యార్థినులు అడ్మిషన్లు పొందాక తప్పనిసరిగా హాస్టల్ వసతి పొందాల్సింటుంది. ఉచితంగా హాస్టల్వసతితోపాటు మెస్సదుపాయం ఉంటుంది. ఉచితంగా యూనిఫామ్స్, బుక్స్, నోట్బుక్స్ కూడా అందజేస్తారు. కాజీపేట గురుకుల కళాశాలలో 60 సీట్లు.. ప్రస్తుతం హనుమకొండ జిల్లా కాజీపేట సోమిడిలో ఉన్న గురుకుల ‘లా’ కళాశాలలో విద్యార్థినులకు ఈ విద్యాసంవత్సరం 2025–2026లో మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు 60 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆ కళాశాలలో ఫస్టియర్లో 24 మంది, సెకండియర్లో 30 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ప్రతీ విద్యాసంవత్సరంలో 60 సీట్లు ఉన్నా పూర్తిస్థాయిలో భర్తీకావడం లేదు. న్యాయవిద్యలో స్థిరపడాలనుకునేవారు ఈ గురుకులంలో అడ్మిషన్లు పొందాలని అధికారులు కోరుతున్నారు. హైదరాబాద్లోని మహేశ్వరంలో గురుకుల ‘లా’ మెన్ కళాశాలలో కూడా 60 సీట్లు ఉన్నాయి. ఇప్పటికే టీజీ లాసెట్ నోటిఫికేషన్ తెలంగాణలో వివిధ యూనివర్సిటీల పరిఽధిలోని ‘లా’ కళాశాలల్లో 2025–2026 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకుగాను ఉస్మానియా యూనివర్సిటీ ఇ ప్పటికే టీజీలాసెట్ నోటిఫికేషన్ జారీచేసింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అపరా ధ రుసుములేకుండా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు ఈనెల 15 వతేదీ వరకు గడువు ఉంది. రూ. 5 వందల అపరాధ రుసుముతో ఈనెల 25వరకు, రూ. వెయ్యితో మే 5 వరకు, రూ. 2వేలతో మే 15వరకు, రూ 4వేల అపరాధ రుసుముతోమే 25వతేదీవరకు దరఖాస్తులు చేసుకునేందుకు గడువు ఉంది. కాగా, లాసెట్ జూన్ 6న జరగబోతుంది.ఎవరికెన్ని సీట్లు.. బీసీ గురుకుల ‘లా’ కాలేజీలో ఉన్న 60 సీట్లలో బీసీఏ– 13, బీసీ– బీ 15, బీసీ–సీ 2, బీసీ –డీ 11, బీసీ –ఈ 6, ఈబీసీ 1, ఎస్సీ–9, ఎస్టీ –3 సీట్లు కేటాయిస్తారు. ఈ బీసీ గురుకులంలో మొదటి, రెండో సంవత్సరం కలిపి ప్రస్తుతం 54 మంది విద్యార్థినులు చదువుతున్నారు.లాసెట్ ద్వారానే ఈ విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు ఇవ్వనున్నారు. ఐదేళ్ల ‘లా’ కోర్సు.. టీజీ లాసెట్ ద్వారానే సీట్ల భర్తీ రెండేళ్ల క్రితం కాజీపేటలో ఉమెన్, హైదరాబాద్ మహేశ్వరంలో మెన్ కళాశాలలు ఏర్పాటు.. హాస్టల్ వసతి, మెస్ ఇతర సదుపాయాలునామమాత్రపు ఫీజు ఐదేళ్ల ‘లా’ కోర్సులో ప్రవేశానికి నామమాత్రపు ఫీజు కేవలం రూ. 4వేలు మాత్రమే ఉంది. రూ. 4వేలు కాషన్ డిపాజిట్గా అడ్మిషన్ల సమయంలో చెల్లించాల్సింటుంది. కోర్సు పూర్తిచేశాక విద్యార్థులకు తిరిగి చెల్లిస్తారు.నాణ్యమైన న్యాయ విద్య గురుకుల ‘లా’ ఉమెన్స్ కాలేజీలో నాణ్యమైన న్యాయ విద్యనందిస్తున్నాం. నిరంతర పర్యవేక్షణతోపాటు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యాబోధన చేయిస్తున్నాం. న్యాయవాద వృత్తిలో స్థిరపడాలనే విద్యార్థినులు గురుకుల ‘లా’ కళాశాలలో టీజీసెట్ద్వారా అడ్మిషన్లు పొందాలి. – ఎన్ రవి, ప్రిన్సిపాల్, ఎంజేపీటీబీసీడబ్ల్యూ గురుకుల ‘లా’ ఉమెన్ కాలేజీ, కాజీపేట -
జానకమ్మ సహకారం గొప్పది..
పర్యావరణ పరిరక్షణలో రామయ్య రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు చేశారు. రామయ్యతో పాటు ఆయన సతీమణి జానకమ్మ కూడా ప్రతీ కార్యక్రమానికి హాజరయ్యేవారు. రామయ్య కృషిలో పాలుపంచుకునేవారు. ఆమె సహకారం గొప్పది.. తన పిల్లలతో పాటు మొక్కలను ప్రాణంగా పెంచుకున్నారు. ఎక్కడైనా ఖాళీస్థలం కనిపిస్తే విత్తనాలు చల్లుతూ, మొక్కలు నాటేవారు. రామయ్య మృతి తీరనిలోటు. నిట్లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో మాట్లాడా. ఆ దంపతులను సన్మానించా. – వల్లంపట్ల నాగేశ్వరరావు, వనప్రేమి అవార్డు గ్రహీత, కవి, రచయిత, కళాకారుడు, హనుమకొండ -
ప్రజలకు ఏం చేశారని రజతోత్సవ సభ
● ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హన్మకొండ చౌరస్తా: పదేళ్లు అధికారంలో ఉండి ప్ర జలను మోసం చేసినందుకా..? ఏం చేశారని రజతో త్సవ సభ పెట్టుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులకు మూడెకరాల భూమి, దళితుడిని సీఎం చేస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని.. ఇలాంటి అనేక హామీలు ఇచ్చి పదేళ్లు ప్రజలను మోసం చేసి, పీడించినందుకా సంబురాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. ఇంతకీ 25 సంవత్సరాల ఉత్సవాలు టీఆర్ఎస్ పార్టీకా, తెలంగాణ పదాన్ని తీసేసిన బీఆర్ఎస్ పార్టీకా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేయడమే బీఆర్ఎస్ ఎజెండా తప్పితే మరో అంశం లేదన్నారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, పీసీసీ సభ్యుడు బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కార్పొరేటర్లు జక్కుల రవీందర్, వేముల శ్రీనివాస్, మామిండ్ల రాజు, మాజీ కార్పొరేటర్ తాడిశెట్టి విద్యాసాగర్, నాయకులు డాక్టర్లు పెరుమాండ్ల రామకృష్ణ, పులి అనిల్, బంక సరళ, బంక సంపత్, నాయిని లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కడియం రాజీనామా చేసే వరకు వదలం
● భూ చెర పడుతున్న ఆంధ్రా అల్లుడు, బినామీలు ● గురువులకు పంగనామాలు పెట్టడంలో సిద్ధహస్తుడు ● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిహన్మకొండ: బీఆర్ఎస్ శ్రేణులు శ్రమించి గెలిపించిన కడియం శ్రీహరి రాజీనామా చేసే వరకు వదిలిపెట్టమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గులాబీ జెండామీద, బీఆర్ఎస్ కార్యకర్తల కష్టం మీద గెలిచిన కడియం శ్రీహరికి సిగ్గూ శరం, చీము నెత్తురుంటే వెంటనే రాజీనామా చేసి ఉప ఎన్నికలో గెలిచి మాట్లాడాలని హితవు పలికారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, నాయకులు కేటీఆర్, హరీశ్రావు, తాటికొండ రాజయ్య, తనపై ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడారని, దీనిని కడియం విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ఆంధ్రా అల్లుడు, బినామీలు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో భూములు చెరబట్టారని ధ్వజమెత్తారు. దేవునూర్లో 25 ఎకరాలు బినామీ పేరుతో కొనుగోలు చేసి వ్యవసాయం చేయించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నీతివంతునివైతే హైదరాబాద్లో మూడు భవనాలు, అమెరికాలో మూడు భవనాలు ఎక్కడి నుంచి వచ్చాయని, హనుమకొండలో అంత పెద్ద ఇల్లు ఎలా నిర్మించావని తూర్పారబట్టారు. కడియం కంటే తాను ఒక్క రోజు తన సొంత నియోజకవర్గంలో లేకున్నా రాజీనామా చేస్తానన్నారు. కడియం తన మొదటి గురువు ఎన్టీఆర్, రెండో గురువు చంద్రబాబు, మూడో గురువు కేసీఆర్కు పంగనామాలు పెట్టాడని, కొత్త గురువు రేవంత్ రెడ్డికి కూడా పంగనామాలు పెడతారని పల్లా దుయ్యబట్టారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నాయకులపై కడియం శ్రీహరి నోరు పారేసుకోవడాన్ని ఖండించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, నన్నపునేని నరేందర్ మాట్లాడారు. సమావేశంలో నాయకులు ఇండ్ల నాగేశ్వర్రావు, గున్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, పులి రజనీకాంత్, జోరిక రమేశ్, చింతల యాదగిరి, తదితరులు పాల్గొన్నారు. -
భూమి ఆక్రమించినట్లు నిరూపిస్తే రాజీనామా
జనగామ రూరల్: దేవునూర్ అటవీ భూమిలో గుంట స్థలం ఆక్రమించినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం జనగామ జిల్లా కేంద్రంలోని ఎన్ఎంఆర్ గార్డెన్లో విలేకరులతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపణలు, విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అంటూ పదేపదే పదవికి రాజీనామా చేయాలనడం సరికాదన్నారు. ప్రస్తుతం ఈ విషయం సుప్రీం కోర్టులో ఉందని, తీర్పునకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 36మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి బీఆర్ఎస్లో చేరిన విషయం రాజేశ్వర్రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టింది నిజం కదా అంటూ.. పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్యకు బీ ఫామ్ ఇచ్చి ఎన్నికల ఖర్చుకు నిధులు ఇచ్చామనడం సరికాదిని, ఇది నిరూపిస్తే తమ పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. నిరూపించకపోతే పల్లా రాజీనామా చేయాలన్నారు. అటవీ శాఖ నోటిఫికేషన్లో లేని 23 మంది రైతులకు చెందిన 43 ఎకరాల పట్టా భూములను రైతులకు చెందాలని అనడం భూమి కబ్జా చేసినట్టా అని ప్రశ్నించారు. దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడాలని హితవు పలికారు. అనంతరం స్టేషన్ఘన్ఫూర్ నియోజకవర్గ లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అదజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, గుడి వంశీధర్రెడ్డి, ప్రవీణ్, కోళ్ల రవి, తదితరులు పాల్గొన్నారు. పట్టా భూములను రైతులకు చెందాలనడం కబ్జా చేసినట్టా? స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలి
● శ్రీచాముండేశ్వరి అనుగ్రహ పీఠాధిపతి శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి ● భక్తిశ్రద్ధలతో హనుమాన్ శోభాయాత్ర ఖిలా వరంగల్: అఖండ భారతావని కోసం హిందువులందరూ సంఘటితమై హిందూ, సనాతన ధర్మ పరిరక్షణకు పాటుపడాలని చాముండేశ్వరి అనుగ్రహ పీఠాధిపతి శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం వరంగల్ రంగశాయిపేట మహంకాళీ దేవాలయ ప్రాంగణం వద్ద విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ వరంగల్ సంయుక్త ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర, బైక్ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీచాముండేశ్వరి అనుగ్రహ పీఠాధిపతి చాంముండేశ్వర మహర్షి ముఖ్యఅతిథిగా హాజరరై మాట్లాడారు. కాగా, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మరావు, కొండేటి శ్రీధర్, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్తో కలిసి మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాంకాళి దేవాలయం నుంచి ప్రారంభమైన ఈయాత్ర ఉర్సు కరీమాబాద్, ఫ్లైఓవర్ మీదుగా బట్టల బజార్, ఎంజీఎం జంక్షన్, ములుగు రోడ్డు, హనుమకొండ జంక్షన్ మీదుగా పద్మాక్షి దేవాలయ ప్రాంగణం వరకు భక్తిశ్రద్ధలతో సాగింది. కార్యక్రమంలో బీజేపీ నేతలు వన్నాల వెంకటరమణ, కుసుమ సతీశ్, మల్లాడి తిరుపతిరెడ్డి, బన్న ప్రభాకర్, శ్యాం, తదితరులు పాల్గొన్నారు. శోభాయాత్రకు భారీ భద్రత.. హనుమాన్ శోభాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు వరంగల్ ఏసీపీ నందిరామ్నాయక్ ఆధ్వర్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ముగ్గురు ఇన్స్పెక్టర్లు, పది మంది ఎస్సైలు, వందమంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు -
మిస్ వరల్డ్ పోటీలు రద్దు చేయాలి
● ప్రొఫెసర్ కాత్యాయని హన్మకొండ: రాష్ట్రంలో నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీలను రద్దు చేయాలని ప్రొఫెసర్ కాత్యాయని అన్నారు. శనివారం హనుమకొండలో మిస్ వరల్డ్ పోటీలపై అందాల పోటీల వ్యతిరేక కమిటీ ఆధ్యర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రొఫెసర్ కాత్యాయని మాట్లాడుతూ.. అందాన్ని ఆనందిస్తాం.. కానీ అందం పెట్టుబడి కావడమే సమస్యగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా ప్రతినిధి కళ మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్లు దోచుకొని ఓటమికి గురయ్యారన్నారు. ఆయన అన్యాయాలు భరించలేకకే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆరు గ్యారెంటీలతో గద్దెనెక్కిస్తే.. గ్యారెంటీలను గాలికి వదిలి లాభాలే లక్ష్యంగా పాలన చేస్తున్నారని తూర్పారబట్టారు. సమావేశంలో రత్నమాల, రమాదేవి, వెంగల్రెడ్డి, అంజనీ, విలాసిని, జ్యోతికరమణి పాల్గొన్నారు. ప్రసాద్ ఆలోచన విధానం ఆదర్శనీయం● కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నవీన్ విద్యారణ్యపురి: న్యాయవాది కేఎస్ఆర్ జి.ప్రసాద్ ఆలోచన విధానం ఆదర్శనీయమని ప్రముఖ నవలాకారుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ అన్నారు. శనివారం సాయంత్రం హనుమకొండలోని నవీన్ నివాసంలో మిత్రమండలి, రుద్రమ సాహిత్య సామాజిక అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ‘కేఎస్ఆర్ జి.ప్రసాద్ జీవితం, కృషి, వర్తమానం’ అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రసాద్ విలువలతో కూడిన జీవితాన్ని గడిపారన్నారు. కార్యక్రమంలో రచయిత, విమర్శకుడు మెట్టు రవీందర్, రుద్రమ సాహిత్య సామాజిక అధ్యయన వేదిక అధ్యక్షురాలు అనిశెట్టి రజిత, న్యాయవాది దివంగత కేఎస్ఆర్ జి.ప్రసాద్ కుమారుడు డాక్టర్ సతీశ్చంద్ర, మిత్ర మండలి కన్వీనర్ వీఆర్ విద్యార్థి, తెరసం అధ్యక్షుడు పొట్లపెల్లి శ్రీనివాస్రావు, రుద్రమ సాహిత్య సామాజిక వేదిక బాధ్యురాలు కొమర్రాజు రామలక్ష్మీప్రసాద్ జీవితాన్ని పరిచయం చేశారు. సాహితీవేత్తలు నాగిళ్ల రామశాస్త్రి, పి.చందు, బిల్ల మహేందర్, చందనాల సుమిత్రాదేవి, డి.శశికిరణ్, శ్యామల, అంజనీదేవి, సింగరాజు రమాదేవి పాల్గొన్నారు. -
క్రీడల అభివృద్ధికి సీఎం పెద్దపీట
ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి వరంగల్ స్పోర్ట్స్: సీఎం రేవంత్రెడ్డి స్టేడియాల అభివృద్ధి, క్రీడాకారుల సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ పరిధి బాలసముద్రంలోని స్విమ్మింగ్పూల్, హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో గల జిమ్నాజియం హాల్, వామప్ట్రాక్, ఇండోర్ స్టేడియంలోని బ్యాడ్మింటన్ కోర్టు మరమ్మతులు, తదితర అభివృద్ధి పనులకు శనివారం ఆయన ఎంపీ డాక్టర్ కడియం కావ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో క్రీడలు, క్రీడాకారులు నిర్లక్ష్యానికి గురయ్యారని అన్నారు. రూ.2.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించినప్పుడే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారన్నారు. కార్యక్రమంలో హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్, ఒలింపిక్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు అజీజ్ఖాన్, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం రాష్ట్ర అద్యక్షుడు బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు డాక్టర్ పింగిళి రమేశ్రెడ్డి, వరద రాజేశ్వర్రావు, కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు బంక సంపత్, బంక సరళా, ఎండీ జాఫర్ తదితరులు పాల్గొన్నారు. -
వనజీవికి ఘన నివాళి
నిట్లో మేడారం జాతరపై జరిగిన జాతీయ ఓరియంటేషన్లో రామయ్య దంపతులను సన్మానించిన కార్యక్రమ బాధ్యులు (ఫైల్) ● ఉమ్మడి జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రామయ్య ● ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్న జిల్లావాసులు 8 లోuఆదివారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025జీవన శైలి వ్యాధుల కారణంగా ప్రజల్లో అవగాహన పెరిగింది. ఆరోగ్యం కోసం పాతకాలపు రుచులకు జై కొడుతున్నారు. రాగి ముద్ద, కొర్రలు, అరికెలు, ఊదలు, సామలు, సజ్జలు ఇలాంటి వాటితో చేసే పదార్థాలే కాకుండా.. నువ్వులు, జొన్న కొర్రలతో చేసే చిరుతిళ్లూ తింటున్నారు. నిర్వాహకులు సైతం వీటినే వైరైటీ కాంబినేషన్లతో అందిస్తున్నారు. చిరుధాన్యాలతో చేసే అల్పాహారాన్ని అందించేందుకు చాలా ఫుడ్స్టాల్లు పుట్టుకొచ్చాయి. హైదరాబాద్ తర్వాత అంతటి రుచికరమైన ఆహారం దొరికేది వరంగల్లోనే అని రెస్టారెంట్ల నిర్వాహకులు చెబుతున్నారు. భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ ఏళ్లుగా హోటళ్లు, రెస్టారెంట్లు నడుపుతున్నారు. ప్రజల్లో పెరిగిన ఆరోగ్య రక్షణను దృష్టిలో ఉంచుకుని ‘మా రెస్టారెంట్లో అజినమోటో, ఆర్టిఫీషియల్ కలర్స్ కలపడం లేదు. నాణ్యమైన వంట సరుకులు వాడుతున్నాం’ అని బోర్డులు పెడుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే నగరంలోని రెస్టారెంట్లు.. వారాంతంలో మరింత రద్దీగా కనిపిస్తున్నాయి. టేస్టీ ఫుడ్.. కేరాఫ్ గ్రేటర్ వరంగల్ ● రెస్టారెంట్లకు బారులుదీరుతున్న జనం● తిన్నంత బిర్యానీ.. వచ్చి తినిపో.. ● ఇలాంటి కొత్త పేర్లు, వైరెటీ కాన్సెప్టులెన్నో.. మీరేం తినాలో వారే చెప్తారు.. ఏదైనా హోటల్కు వెళ్తే మెనూ మీ చేతిలో పెడతారు. కానీ.. ప్రస్తుతం నగరంలో కొత్త తరహా హోటళ్లు ఏర్పాటు చేశారు. మీ డైట్కు అనుగుణంగా తయారు చేసిన భోజనమే ఇక్కడ వడ్డిస్తారు. ఊబకాయం, బీపీ, షుగర్ వంటి వ్యాధులున్నవారు. కసరత్తులు చేసే వారు తినదగిన పదార్థాలను వడ్డిస్తారు. కొన్ని హోటళ్లలో సేంద్రియ పద్ధతిలో పండించిన వాటితోనే పదార్థాలు తయారు చేసి వడ్డిస్తున్నారు. ఇలాంటి వాటికి ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తోంది. పిల్లలతో కలిసి సరదాగా.. పిల్లలకు సెలవులు వస్తే కుటుంబ సమేతంగా సరదాగా బయటకు వెళ్తాం. షాపింగ్ చేసిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ఏదైనా రెస్టారెంట్కు వెళ్లి చికెన్ బిర్యానీ తింటాం. పిల్లల ఆనందం కోసం బయట భోజనం చేస్తుంటాం. పిల్లలతో కలిసి భోజనం చేస్తూ సంతోషంగా గడుపుతుంటాం. కె.మాధురిరెడ్డి, రంగశాయిపేట, వరంగల్ ఆకర్షిస్తున్న అన్ లిమిటెడ్ ఫుడ్.. ఒకప్పటిలా తిన్నామా.. బిల్లు కట్టామా.. వచ్చేశామా.. అన్నట్లు కాకుండా కొత్త కాన్సెప్టులతో కస్టమర్లను మెప్పిస్తున్నారు కొందరు రెస్టారెంట్ల నిర్వాహకులు. అన్ లిమిటెడ్ ఫుడ్ అంటూ ఓ ధర నిర్ణయించి నాన్ వెజ్, వెజ్ ఐటమ్స్ను అందుబాటులో ఉంచుతున్నారు. ఈహోటళ్లలో ఎంత పడితే అంత తినొచ్చు. ఒక్క క్లిక్తో ఇంటికే.. ఒక్క క్లిక్తో వేళాపాళా లేకుండా ఇంటికే భోజనం వచ్చేస్తుంది. అది కూడా నిమిషాల్లో. కొన్ని యాప్లు అయితే ఉచిత డెలివరీ ఆప్షన్లు ఇస్తున్నాయి. మరికొన్ని యాప్లకు నెలవారీగా, మూడు నెలలకు, ఏడాదికి సబ్స్క్రిప్షన్ చెల్లిస్తే చాలు పూర్తి స్థాయి ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తావా.. బుక్ చెయ్. మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ ఇలా.. నోటిఫికేషన్లనూ పంపిస్తూ ఇంటి వద్దకే సేవలందిస్తున్నాయి. రుచి, నాణ్యతకు ప్రాధాన్యమిస్తున్నాం.. హోటల్కు వచ్చే ప్రతీ భోజన ప్రియులకు రుచికరమైన శాఖాహారం, మాంసాహారం భోజనం, బిర్యానీ అందిస్తున్నాం. నాణ్యమైన ఆహారం అందించడం వల్ల హోటల్కు కుటుంబ సమేతంగా చేరుకుంటారు. శుచిశుభ్రతను పాటిస్తున్నాం. వారిచ్చే ఆర్డర్ ప్రకారం నోరూరించే వంటలు వేడి వేడిగా తయారు చేసి రుచిగా అందిస్తున్నాం. మంచి లాభాలు వస్తున్నాయి. – సాయి కిరణ్, అవంతి గ్రాండ్ హోటల్, వరంగల్ రుచికి ప్రాధాన్యమిస్తున్నాం.. మా సార్ ఉద్యోగరీత్యా పని వత్తిడి వల్ల కుటుంబానికి సమయం కేటాయించలేకపోతున్నారు. సండే వస్తే పిల్ల లతో కలిసి బయటకు వెళ్లి సరదాగా రెస్టారెంట్లో తింటుంటాం. రుమాలీ రోటీ, పన్నీర్ కర్రీతో తింటుంటాం. ప్రస్తుతం రుచికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. – ఇనుగాల శృతి, తిమ్మాపురం ఆరోగ్యానికి ప్రాధాన్యం -
అంబేడ్కర్ జయంతిని విజయవంతం చేయాలి
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతిని విజయవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య పిలుపునిచ్చారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో అంబేడ్కర్ జయంతి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈనెల 14న అంబేడ్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించాలన్నారు. అంబేడ్కర్ భవన్లో జరిగే సభకు అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, అంబేడ్కర్ ఉత్సవ కమిటీ చైర్మన్ అంకేశ్వరపు రాంచందర్రావు, వైస్ చైర్మన్ బండారి సురేందర్, ఎస్సీ, ఎస్టీ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పుట్ట రవి, చుంచు రాజేందర్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గద్దల సుకుమార్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శ్రీలత, అధికారి అనిల్ పాల్గొన్నారు. -
ఘనంగా హనుమత్ విజయోత్సవం
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో శనివారం చైత్రమాసం పౌర్ణమి తిథిని పురస్కరించుకుని హనుమత్ విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేద పండితుడు గంగు మణికంఠశర్మ, అర్చకులు సందీప్శర్మ, ప్రణవ్ ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నాట్యమండపంలో హనుమత్ జయంతిని పురస్కరించుకుని పంచలోహ పంచముఖ మహా హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేశారు. ఆలయ ఈఓ అనిల్కుమార్, సిబ్బంది మధుకర్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో హనుమన్ భక్తులు, సందర్శకులు పాల్గొన్నారు. సవాళ్లను అధిగమించాలి..కేయూ క్యాంపస్: ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపార నిర్వహణ విద్య అనేక సమస్యల్ని, సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కొంటోందని వాటిని నైపుణ్యాలతో అధిగమించాలని సౌత్ ఆఫ్రికా దర్బన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవీందర్ రేనా అన్నారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలో డైరెక్టర్, పాలక మండలి సభ్యుడు బి.సురేశ్లాల్ అధ్యక్షతన నిర్వహించిన విద్యార్థుల సమావేశంలో ఆయన వ్యాపార నిర్వహణ విద్యపై విస్తృతోపన్యాసం చేశారు. మేనేజ్మెంట్ విద్యతో బాధ్యతాయుతమైన నాయకులను తయారు చేయడం లక్ష్యమన్నారు. సంప్రదాయ మార్కెటింగ్, ఫైనాన్స్ మానవ వనరులకు మించిన క్రియాత్మక రంగాలపై విస్తృత అ వగాహన అవసరముందన్నారు. సమావేశంలో అధ్యాపకులు వీణ, సుమలత పాల్గొన్నారు. నకిలీ వైద్యుడిపై కేసుఎంజీఎం: వరంగల్ కాశిబుగ్గలోని సుహానా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో వైద్యం చేస్తున్న నకిలీ వైద్యుడు జి.సదానందంపై కేసు నమోదు చేసినట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు శనివారం తెలిపారు. అశాసీ్త్రయ పద్ధతిలో హై డోస్ యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇంజక్షన్లు ఇవ్వడంతో పాటు ఫార్మసీ లైసెన్స్ లేకుండా పెద్ద మొత్తంలో నిల్వ ఉంచినట్లు సభ్యులు గుర్తించారు. ఇంతేజార్ గంజ్ పోలీస్స్టేషన్లో రిజిస్టర్డ్ డాక్టర్ డి.లాలయ్య కుమార్, చైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్ఎంసీ చట్టం సెక్షన్ 34, 54, టీఎస్ఎంపీఆర్ చట్టం సెక్షన్ 22 ప్రకారం.. ఈకేసు నమోదు చేశారు. చట్ట ప్రకారం నకిలీ వైద్యుడికి జైలు శిక్ష రూ.5 లక్షలు జరిమానా విధించే అవకాశం ఉందని కౌన్సిల్ సభ్యులు నరేశ్ పేర్కొన్నారు. -
సన్న బియ్యం ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే..
వరంగల్: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ తూర్పులోని 12వ డివిజన్ దేశాయిపేటకు చెందిన పూర్ణచందర్ ఆహ్వానం మేరకు వారి ఇంట్లో మంత్రి సన్నబియ్యంతో వండిన ఆహారాన్ని వారి కుటుంబ సభ్యులు, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం మంత్రి కుటుంబంలోని మహిళలకు చీరలను బహుమతిగా అందించి ధన్యవాదాలు తెలిపారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద ప్రజలకు సన్న బియ్యం అందించాలన్నది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కల అని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెరవేర్చారన్నారు. రేషన్ డీలర్లు ఎలాంటి అక్రమాలకు పాల్ప డినా.. బియ్యాన్ని కల్తీ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా 19వ డివిజన్ భగత్సింగ్ నగర్లో ఎస్డీఎఫ్ నిధులు రూ.33 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లు, పైపులైన్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో మేయర్ సుధారాణి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ సంధ్యారాణి, కార్పొరేటర్లు కావేటి కవిత, బస్వరాజు కుమారస్వామి చింతాకుల అనిల్కుమార్, ఓని స్వర్ణలత, ఆర్డీఓ సత్యపాల్రెడ్డి తహసీల్దార్ ఇక్బాల్, భాస్కర్ పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ లబ్ధిదారుడి ఇంట్లో సహపంక్తి భోజనం -
అవసరమైతే బ్లాక్ లిస్టులోకి..
హన్మకొండ: అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణనీటి సరఫరా, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పంచాయతీరాజ్ శాఖ, మిషన్ భగీరథ శా ఖలపై శనివారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీతక్క మాట్లాడుతూ పనులు దక్కించుకోవడంలో చూపుతున్న శ్రద్ధ సకాలంలో పూర్తిచేయడంపై కాంట్రాక్టర్లు చూపడం లేదన్నారు. ఇప్పటికీ మొదలుపెట్టని పనులకు తిరిగి టెండర్లు పిలవాలని సూచించారు. ఏళ్లుగా పనులు మొదలు పెట్టని, పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్లిస్టులో పె ట్టాలన్నారు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా పనులు పూర్తి పూర్తిచేయించే బాధ్యత ఎస్ఈలదే అని, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి వా రికి సూచనలు చేయాలన్నారు. టెండర్లకు సిద్ధంగా ఉన్న రోడ్లకు వారంలోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి సకాలంలో పనులు పూర్తి చేయించాలని చెప్పా రు. నిధుల కొరత లేదని, పీఎంజీఎస్వై నిఽధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్లు ఇచ్చిందని వివరించారు. అంగన్వాడీ కేంద్రాలను బలోపే తం చేయాలని, తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడం లేదు.. అభివృద్ధి పనులు జరుగుతున్న తీరుపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినవి ఇప్పటికీ పూర్తి చేయలేదని, తన పదవి కాలంలోపైనా పూర్తి చేస్తారా అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులను ప్రశ్నించారు. తమ నియోజకవర్గాల్లో రోడ్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయని ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరి, రాంచంద్రునాయక్.. మంత్రి, ఈఎన్సీ కనకరత్నం దృష్టికి తీసుకెళ్లారు. పనులు పూర్తి చేయించడంలో అధికారులు వ్యవహరిస్తున్న వైఖరిపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లపై అధికా రులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం.. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలని, తాను ప్రతిపాదనలు పంపిన రోడ్లను మంజూరు చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఒక్కరే ఉన్నారని, అప్పుడు మీకు ప్రభుత్వం ఎంతగానో సహకరించిందని, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఒక్కడినే ఉన్నానని, నిష్పక్షపాతంగా నియోజకవర్గ అభివృద్ధికి సహకరించి నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఎంపీ బలరాంనాయక్ కలుగజేసుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేస్తే తాము చెల్లిస్తున్నామన్నారు. దీంతో పల్లా రాజేశ్వర్రెడ్డి ఇక్కడ రాజకీయాలు చేయడం మంచిది కాదని, రాజకీయాలు బయట చూసుకుందామన్నా రు. సమావేశంలో ఎంపీలు కడియం కావ్య, పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృపాకర్రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పంచాయతీరాజ్ శాఖ, మిషన్ భగీరథపై హనుమకొండ కలెక్టరేట్లో సమీక్ష అభివృద్ధి పనుల తీరుపై ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల అసంతృప్తి ఏళ్లుగా పెండింగ్లోనే ఉంటున్నాయని అధికారులపై అసహనం బాల్యవివాహాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలిబాల్య వివాహాల నిర్మూలనకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో మహిళా, శిశు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, కమిషనర్ కాంతి వెస్లీతో కలిసి ఉమ్మడి జిల్లాలోని జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, సీడీపీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాలోని మారుమూల గ్రామమైన రాయినిగూడెంలో పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఇష్టంగా తినే ఆహారంపై దృష్టి పెట్టాలన్నారు. బాల్య వివాహాలు జరుగకుండా చూడడమే అందరి లక్ష్యం కావాలన్నారు. అమ్మమాట – అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని వచ్చే ఏడాది కూడా నిర్వహిస్తామన్నారు. -
రాజరాజేశ్వరీదేవికి లక్ష తామర పూలతో అర్చన
హన్మకొండ కల్చరల్: వరంగల్ ఎంజీఎం ఎదురుగా ఉన్న రాజరాజేశ్వరీదేవి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీలలితా యాగంలో భాగంగా శనివారం అమ్మవారికి లక్ష తామరపూలతో అర్చన నిర్వహించారు. ఆలయ అర్చకుడు ఎల్లంభట్ల లక్ష్మణశర్మ ఆధ్వర్యంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి ఉదయం తామరపూలతో అర్చన నిర్వహించారు. సాయంత్రం పౌర్ణమి తిథిని పురస్కరించుకుని అమ్మవారికి లక్ష బిల్వార్చన నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని దీపారాధన నిర్వహించారు. దశవిధహారతులు జరిపిన అనంతరం అన్నప్రసాదాల వితరణ చేశారు. ఆలయ చైర్మన్ వద్దిరాజు వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. -
పాఠకులకు సదుపాయాలు కల్పించండి
● హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ● జిల్లా గ్రంథాలయంలో వసతుల పరిశీలనహన్మకొండ చౌరస్తా : జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, నిత్యం వచ్చే పాఠకుల కోసం ఏసీలు, చల్లటి తాగునీటి కోసం రిఫ్రిజిరేటర్లు తదితర సదుపాయాలు కల్పించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు సూచించారు. హనుమకొండ పబ్లిక్గార్డెన్ సమీపంలోని జిల్లా గ్రంథాలయాన్ని ఆమె శుక్రవారం సందర్శించి వసతులు, పెండింగ్ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా పాఠకులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులను సమస్యలు, అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. రూ.80లక్షలతో చేపట్టిన ఆడిటోరియం నిర్మాణం నిలిచిపోవడానికి కారణాలను లైబ్రరీ సిబ్బందిని అడగ్గా.. మరో రూ.13లక్షల వరకు నిధులు అవసరమని ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు అందించామని వివరించారు. కాగా లైబ్రరీకి వస్తున్న సెస్ నిధుల నుంచి ఆడిటోరియం పూర్తి చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ.అజీజ్ఖాన్, లైబ్రరీ సిబ్బంది మల్సూర్, పురుషోత్తంరాజు, సంతోశ్, గుడికందుల రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సమాజ మార్గదర్శకుడు పూలే
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ రామన్నపేట : సమాజంలోని రుగ్మతలను పారదో లడానికి ఉద్యమిస్తూ భవిష్యత్ తరాలకు మార్గం చూపిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. పూలే జయంతిని పురస్కరించుకొని నగరంలోని ములుగు రోడ్డు వద్ద ఉన్న పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపేందుకు, విద్య విషయంలో పూలే దంపతులు చేసిన కృషి ఎంతో గొప్పదన్నారు. మహిళలు విద్యావంతులు కావాలని చెప్పిన మొదటి వ్యక్తి జ్యోతిబా పూలే అని, ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సేవలందించడమే కాకుండా బాలికల కోసం విద్యాలయాన్ని స్థాపించినట్లు గుర్తు చేశారు. సమాజానికి జ్యోతిబాపూలే అందించిన సేవలను ఆదర్శంగా తీసుకొని అంబేడ్కర్ లాంటి వారు ముందుకు సాగారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్.నాగరాజు, ‘కుడా’ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, బల్దియా కమిషనర్ అశ్విని తానా జీ వాకడే, ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, సత్యపాల్ రెడ్డి, హనుమకొండ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం..
వరంగల్ అర్బన్ : రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపడానికి సీఎం రేవంత్రెడ్డి దృఢ సంకల్పంతో ఉన్నారు.. 2 లక్షల మందికి ఉద్యోగాల కల్పన తమ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం వరంగల్ రైల్వే, ఆర్టీసీ బస్స్టేషన్ సమీపాన ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్మేళా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగులు హాజరయ్యారు. మంత్రి సురేఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూర్య(సీతక్క)తో కలిసి జాబ్మేళాను ప్రారంభించారు. జాతీయ, రాష్ట్రస్థాయిలో సుమారు 65 కంపెనీల నిర్వాహకులు పాల్గొనగా 18 వేల మంది నిరుద్యోగులు హాజ రయ్యారు. తొలుత నిర్వహించిన ఇంటర్వ్యూలో 17 మంది నర్సింగ్ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులకు మంత్రులు, కలెక్టర్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడు తూ ఉద్యోగ ఖాళీలను గుర్తించి దశల వారీగా 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ సర్కారు ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ ఇక ఆగదు.. ఉద్యోగాల కల్పనలో నంబర్ వన్గా నిలిచామని చెప్పారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ జాబ్మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువత అందిపుచ్చుకోవాలని కోరారు. రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 14 వేల అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఈ జాబ్ మేళా ద్వారా సుమారు 11 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ఐదు వేల మందికి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, టాస్క్ సీఈఓ రెడ్డి, బల్దియా అదనపు కమిషనర్ జోనా, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఏ కౌసల్య, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, రాజేశ్వర్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్ పాల్గొన్నారు. అస్తవ్యస్తం.. ఆగమాగం జాబ్మేళా నిర్వహించిన ఫంక్షన్ హాల్ ఇరుకుగా ఉండడం.. అధిక సంఖ్యలో నిరుద్యోగులు రావడంతో నరక యాతన అనుభవించారు. నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పేరుకు సెంట్రల్ ఏసీ ఉన్నప్పటికీ లిఫ్టులు పనిచేయలేదు. అన్నపానీయాలు అందజేయడంలో జిల్లా యంత్రాంగం విఫలమైంది. క్యూలైన్లో గంటల తరబడి వేచిఉన్న నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అధికార పార్టీ నాయకులు మాత్రం తమ అనుచరులను పైరవీలతో ఆయా కంపెనీల ప్రతినిధులకు అప్పగించారు. హాల్ కిక్కిరిసిపోవడంతో తోపులాట కారణంగా గ్రౌండ్ ఫ్లోర్లోని కిటికీల అద్దాలు పగిలిపోయాయి. నలుగురు మహిళలకు గాయాలయ్యాయి. నిరుద్యోగ సమస్యను రూపుమాపుతాం ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ -
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించాలి
కేయూ క్యాంపస్: ఆర్థిక అసమానతలు లేకుండా ధనవంతులు పేదవర్గాలకు ఆర్థిక సహకారం అందించి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు దోహదపడాలని సౌత్ ఆఫ్రికా దర్బన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవీందర్ రేనా అన్నారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ ఆర్థిక శాస్త్ర విభాగంలో పాలకమండలి సభ్యులు, విభాగాధిపతి ప్రొఫెసర్ బి.సురేశ్లాల్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారతదేశంలో సోలార్ పవర్, విండ్ పవర్, ఎనర్జీలో అద్భుత ప్రగతి సాధిస్తున్నట్లు చెప్పారు. అనంతరం కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వికసిత భారత్ సాధనకు సమ్మిళిత వృద్ధి అత్యావశకమని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో కేడీసీ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.రాజారెడ్డి, అధ్యాపకులు రమేశ్, సత్యనారాయణ, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ రవీందర్, డాక్టర్ రమణ, మాలతీలత, ఎం.వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఒకరోజు శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానంకాజీపేట: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ ఆధ్వర్యంలో స్కిల్డ్ వర్కర్లకు ఒకరోజు శిక్షణ ఇచ్చి ప్రభుత్వ సర్టిఫికెట్ ఇవ్వడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ జి.రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, ప్లంబింగ్, బార్ బైండింగ్, పెయింటింగ్, టైల్స్ ఫ్లోరింగ్, కార్పెంటరీ, బిల్డింగ్, తదితర అంశాలపై ఒకరోజు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన యువత మరిన్ని వివరాల కోసం విక్టరీ ఐటీఐ కాజీపేట లేదా 79892 50779, 99496 84763 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. జాతీయ క్రీడల్లో కమిషనరేట్ పోలీసులువరంగల్ క్రైం: కేరళలోని కొచ్చిలో శుక్రవారం నుంచి ప్రారంభమైన ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్, టెన్నిస్ పోటీల్లో వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారులు ఏసీపీ జితేందర్రెడ్డి, మధుసూదన్, ఎస్సై సురేశ్కుమార్, హెడ్ కానిస్టేబుల్ గీత, కానిస్టేబుళ్లు వేణు, తులసి తెలంగాణ రాష్ట్ర పోలీస్ జట్టు తరఫున పాల్గొన్నారు. ఈపోటీల్లో విజేతలుగా నిలిచి కమిషనరేట్కు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సీపీ సన్ప్రీత్సింగ్, అధికారులు ఆకాంక్షించారు. అంబేడ్కర్ రచనల్ని అధ్యయనం చేయాలికేయూ క్యాంపస్: అంబేడ్కర్ రచనలను అధ్యయనం చేయాలని కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం విద్యార్థులను కోరారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కేయూలోని కేంద్ర గ్రంథాలయంలో అంబేడ్క ర్ జీవిత చరిత్ర, భారత రాజ్యాంగంతో పాటు సుమారు 60 పుస్తకాలను ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. ఈనెల 14 వరకు ఈపుస్తక ప్రదర్శన కొనసాగనుంది. పుస్తక ప్రదర్శనను రిజిస్ట్రార్ రామచంద్రం లైబ్రరీ మెంబర్ ఇన్చార్జ్, లైబ్రరీ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ బి.రాధికారాణితో కలిసి ప్రారంభించారు. కేయూ లైబ్రరీ ఇన్చార్జ్ ఇసాక్ప్రభాకర్, తేజావత్జావీర్, లైబ్రరీ ఉద్యోగులు విద్యార్థులు పాల్గొన్నారు. పోషణ పక్షోత్సవాలు నిర్వహించాలికాజీపేట అర్బన్: ప్రతీ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షోత్సవాలు నిర్వహించాలని హనుమకొండ జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమాధికారి జయంతి అన్నారు. కాజీపేట మండలం కడిపికొండలోని రైతు వేదికలో శుక్రవారం పోషణ పక్షోత్సవాలపై ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా సీ్త్ర, శిశు సంక్షేమాధికారి జయంతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈనెల 22వ తేదీ వరకు పోషణ మాసంపై అవగాహన కల్పించాలని, సంపూర్ణ ఆరోగ్యానికి సమతుల ఆహారంపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ పీఓఎంహెచ్డబ్ల్యూ మంజుల, డాక్టర్ శ్రీదేవి, డీఈఎంఓ అశోక్రెడ్డి, హెచ్ఈఓ రాజేశ్వర్రెడ్డి, ఐసీపీఎస్, ఐసీడీఎస్, పోషణ్ అభియాన్ అధికారులు, హనుమకొండ, కాజీపేట, ఐనవోలు సెక్టార్ సూపర్వైజర్లు, సీడీపీఓ, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ‘బార్ అసోసియేషన్’ ఎన్నికలు
వరంగల్ లీగల్ : వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ల 2025–26 నూతన కార్యవర్గం ఎన్నికలు శుక్రవారం ముగిశాయి. 9 నుంచి సా యంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగ్గా అనంతరం ఎన్నికల అధికారులు ఫలితాలు వెల్లడించారు. మొత్తం వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్లో 566 మంది ఓటర్లు ఉండగా 451 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధ్యక్షుడిగా వి.సుధీర్(231 ఓట్లు), ప్రధాన కార్యదర్శిగా డి.రమాకాంత్(172 ఓట్లు) ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు చిదంబర్నాఽథ్, శ్రీధర్ వెల్లడించారు. జాయింట్ సెక్రెటరీగా ఎం.శ్రీధర్(244 ఓట్లు), మహిళా జా యింట్ సెక్రెటరీగా ఆర్.శశిరేఖ(263 ఓట్లు), స్పో ర్ట్స్, కల్చరల్ జాయింట్ సెక్రెటరీగా ఎన్.శివప్రసాద్(270 ఓట్లు), కోశాధికారిగా ఎస్.అరుణ (242 ఓ ట్లు), కార్యవర్గ సభ్యులుగా ఎం.రాజు(340 ఓట్లు), జె.రాజు(306 ఓట్లు), ఎం.మేఘనాథ్(295 ఓట్లు), మహేందర్(275 ఓట్లు) ఎన్నికై నట్లు వివరించారు. హనుమకొండ అసోసియేషన్లో.. హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్లో మొత్తం 867 మంది ఓటర్లు ఉండగా 752 మంది పోలింగ్లో పాల్గొన్నట్లు ఎన్నికల అధికారులు కె.రమేష్బాబు, రవీందర్రావు తెలిపారు. అధ్యక్షుడిగా పి.సత్యనారాయణ(336 ఓట్లు), ప్రధాన కార్యదర్శిగా కె.రవి(294 ఓట్లు), ఉపాధ్యక్షడిగా సీహెచ్.రమేశ్(486 ఓట్లు), స్పోర్ట్స్, కల్చరల్ జాయింట్ సెక్రెటరీగా సి.మల్లేష్(291 ఓట్లు), లైబ్రరీ జాయింట్ సెక్రెటరీగా కె.వెంకటేశ్(406 ఓట్లు), కోశాధికారిగా సీహెచ్.సాంబశివరావు (484 ఓట్లు), కార్యవర్గ సభ్యులుగా బి.శివకుమార్యాదవ్(480 ఓట్లు), డి.సునిల్కుమార్(470 ఓట్లు), పి.కమలాకర్(449 ఓట్లు), సీహెచ్.నిఖిల్కుమార్(406 ఓట్లు) ఎన్నికై నట్లు వివరించారు. వరంగల్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వి.సుధీర్, డి.రమాకాంత్ హనుమకొండ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా పి.సత్యనారాయణ, కె.రవి -
కాంగ్రెస్ అంటేనే మోసం, వంచన
హన్మకొండ: కాంగ్రెస్ అంటేనే మోసం, వంచన అని బీఆర్ఎస్ శాసనమండలి పక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 16 నెలల రేవంత్రెడ్డి పాలనలో ప్రజల ఆహాకారాలు, ఆక్రందనలు వినిపిస్తున్నాయంటే పాలన ఎలా ఉందో అర్థమవుతున్నదని అన్నారు. కాంగ్రెస్ పాలన అంటేనే ‘స్కాంలు ఫుల్లు.. స్కీంలు నిల్’ అని విమర్శించారు. రాష్ట్రాన్ని ఢిల్లీకి, రాహుల్గాంధీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. తెలంగాణ సర్కారు భూముల వేట చేస్తోందని, ఇందుకు లగచర్ల, కంచ గచ్చిబౌలి ఘటనలే ఉదాహరణ అన్నారు. నాడు తెలంగాణ అభివృద్ధికి చిరునామా అయితే.. నేడు ప్రజల ఆక్రందనలకు కేంద్రమైందని, ఈక్రమంలో ప్రజలు తిరిగి కేసీఆర్ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ స్థాపించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈనెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపునేని నరేందర్, వొడితల సతీశ్బాబు, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, నాయకులు సాంబారి సమ్మారావు, ఏనుగుల రాకేశ్రెడ్డి, చింతం సదానందం, పులి రజినీకాంత్, వీరేందర్, చింతల యాదగిరి, జనార్దన్గౌడ్, ఎల్లావుల లలితాయాదవ్, రమేశ్, రామ్మూర్తి, నయీముద్దీన్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి -
సక్రమంగా పనులు పూర్తి చేయండి
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్లో కొనసాగుతున్న అమృత్ భారత్ అభివృద్ధి పనులు సక్రమంగా పూర్తి చేయాలని సికింద్రాబాద్ డివిజన్ డీఈఎన్ సెంట్రల్ అధికారి ప్రంజల్ కేసర్ వాణి అన్నారు. శుక్రవారం స్థానిక అధికారులతో కలిసి జంక్షన్లో కలియ తిరిగి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పనుల్లో లోపాలు గుర్తించి సక్రమంగా చేయాలని, ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా పనులు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. కాజీపేట జంక్షన్లో జరుగుతున్న అమృత్ భారత్ స్టేషన్ స్కీం అభివృద్ధి ఆధునికీకరణ పనులు శుక్రవారం సికింద్రాబాద్ డివిజన్ డీఈఎన్ సెంట్రల్ అధికారి ప్రంజల్ కేసర్ వాణి తనిఖీ చేశారు. రైల్వేస్టేషన్లో జరుగుతున్న అమృత్ భారత్ అభివృద్ధి పనులు స్థానిక అధికారులతో కలిసి కలియదిరిగి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా పనులు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం జనరల్ వెయింటింగ్ హాల్, బేబీ ఫీడింగ్ గది, టాయిలెట్స్ పనులు పరిశీలించి తనిఖీ పలు చోట్ల సలహాలిచ్చారు. అనంతరం రైల్వే స్టేషన్ బయట అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఈతనిఖీలో కాజీపేట రైల్వే ఏడీఈఎన్ రామకృష్ణంరాజు, ఐఓడబ్ల్యూ విజయ్కుమార్, సూపర్వైజర్లు పాల్గొన్నారు. రైల్వే డీఈఎన్ సెంట్రల్ అధికారి ప్రంజల్ కేసర్వాణి అమృత్ భారత్ పనుల తనిఖీ -
వేరుశనగ సాగుపై రైతులకు శిక్షణ
మామునూరు: ఖిలా వరంగల్ మండలం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అధిపతి కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత మిషన్ నేతృత్వంలో శుక్రవారం వేరుశనగ సాగుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కేవీకే సీనియర్ శాస్త్రవేత్త, కోఆర్డినేటర్ డాక్టర్ రాజన్న హాజరై వేరుశనగ సాగుపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి, మాట్లాడారు. రైతులకు టీసీజీఎస్–1694(విశిష్ట) వేరుశనగ సాగు వివరాలను రైతులకు వివరించారు. అనంతరం రైతులకు టీ సీజీఎస్ 1694 రకం వేరు శనగ విత్తనాలు అందజేశారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ సౌమ్య, రాజు, రైతు కోఆర్డినేటర్ రాజిరెడ్డి, హర్షరెడ్డి, సాయిచంద్, రైతులు పాల్గొన్నారు -
ధ్యానంతో మానసిక ఒత్తిడి దూరం
మామునూరు: ధ్యాన యోగాతో ప్రతిఒక్కరికీ మానసిక ప్రశాంతత లభిస్తుందని పీటీసీ ప్రిన్సిపాల్ ఇంజారపు పూజ అన్నారు. మామునూరు పోలీస్ శిక్షణ కళాశాలలోని ఆడిటోరియంలో ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బందికి శుక్రవారం మానసిక ప్రశాంతతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ప్రిన్సిపాల్ పూజ హాజరై మాట్లాడారు. పోలీస్ ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలని, ఎలాంటి మానసిక వత్తిడి గురికావొ ద్దని సూచించారు. ఉదయాన్నే వాకింగ్, ధ్యానయోగా చేస్తే ఆరోగ్యంతోపాటు మనసుకు ప్రశాంత త, రోజంతా సంతోషం లభిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, భిక్షపతి, ఏఓ కల్పనరెడ్డి, డాక్టర్ సుధీర్, ఆర్ఐలు చంద్రశేఖర్, నవీన్కుమార్, కాశీరామ్, మహేష్, సీఎల్ఐ అశోక్, సుధాకర్, ఏఎల్ఐ దేవేందర్రెడ్డి, దీపక్, సమ్మిరెడ్డి ఆర్ఎస్ఐ రాజేష్, సుధాకర్, దశరథం, అరుణ, అనిల్, సీసీ రామాంజన్రెడ్డి, పీఆర్ ఓ రామాచారి, తహేర్ అలీ, సిబ్బంది పాల్గొన్నారు. పీటీసీ ప్రిన్సిపాల్ ఇంజారపు పూజ -
సైక్లింగ్ రోడ్ పోటీలకు కేయూ జట్టు
కేయూ క్యాంపస్: బికనీర్లోని మహారా గంగాసింగ్ యూనివర్సిటీలో ఈనెల 10 నుంచి నిర్వహించే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ సైక్లింగ్ రోడ్(పురుషుల) పోటీలకు కేయూ జట్టును ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య శుక్రవారం తెలిపారు. జట్టులో ఎన్.రాకేష్(శ్రీఅరుణోదయం డిగ్రీ కాలేజీ హనుమకొండ), ఎండీ.రియాజ్(మాస్టర్జీ డిగ్రీ కాలేటీ హనుమకొండ), జె.సంజీవ్, జి.లోకేష్(వరంగల్ కిట్స్), ఎన్.మహేందర్యాదవ్(యూసీపీఈ కేయూ), కె.బాలమురుగన్ (ఎల్బీ కాలేజీ వరంగల్) ఉన్నారు. వీరికి హనుమకొండలోని జాగృతి డిగ్రీ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ ఎ.రాజేష్ మేనేజర్గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య పేర్కొన్నారు. సెలవు రోజుల్లో ప్రత్యేక టూర్ ప్యాకేజీ హన్మకొండ: పర్యాటక ప్రాంతాల సందర్శనకు సెలవు రోజుల్లో ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చినట్లు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ డిప్యూటీ మేనేజర్(మార్కెటింగ్) టి.శ్రీనివాస్ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండో శనివారం, ఆదివారం, అంబేడ్కర్ జయంతి రోజు సోమవారం వరంగల్, రామప్ప, లక్నవరం ప్రాంతాల పర్యటనకు ప్రత్యేక టూర్ ప్యాకేజీ అమలు చేస్తున్నట్లు వివరించారు. ఉదయం 8 నుంచి రాత్రి 7.30 వరకు పర్యాటక ప్రాంతాల సందర్శన ఉంటుందని పేర్కొన్నారు. ఏసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. చార్జీలు పెద్దలకు రూ.980, పిల్లలకు రూ.790గా నిర్ణయించినట్లు వివరించారు. భోజన చార్జీలు రూ.150, బోటింగ్ చార్జీలు రూ.50 అదనం అని తెలిపారు. పర్యాటకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అందుబాటులోకి టీజీ ఎన్పీడీసీఎల్ యాప్ హన్మకొండ: ఐఫోన్ వినియోగదారులకు టీజీ ఎన్పీడీసీఎల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, వరంగల్ సర్కిల్ ఎస్ఈ కె.గౌతం రెడ్డి తెలిపారు. మరిన్ని సాంకేతిక అంశాలు జోడించి టీజీ ఎన్పీడీసీఎల్ యాప్ను ఆధునీకరించినట్లు వారు వేర్వేరు ప్రకటనలో వెల్లడించారు. ఐఫోన్ యాప్ స్టోర్ నుంచి టీజీ ఎన్పీడీసీఎల్ యాప్ను డౌన్లోడు చేసుకోవచ్చన్నారు. ఈ యాప్లో 20 ఫీచర్లు ఉన్నాయని వివరించారు. రిపోర్ట్ ఆన్ ఇన్సిడెంట్, కనూ్స్య్మర్ గ్రీవెన్సెస్, న్యూ కంప్లైంట్, కంప్లైంట్ స్టేటస్, రీఓపెన్, సెల్ఫ్ రీడింగ్, పే బిల్స్, బిల్ హిస్టరీ, ఆన్ లైన్ పేమెంట్ హిస్టరీ, కొత్త సర్వీస్ స్థితి, లింక్ ఆధార్ – మొబైల్, డొమెస్టిక్ బిల్ క్యాలిక్కులెటర్, కొత్త కనెక్షన్ ఎ లా తీసుకోవాలి, పేరు– లోడ్ మార్పు, పవర్ క ంజమ్సన్ గైడ్లైన్స్, టారిఫ్ డీటెయిల్స్, ఎనర్జీ సేవింగ్ టిప్స్, సేఫ్టీ టిప్స్, ఫీడ్ బ్యాక్, మై అ కౌంట్, వినియోగదారుల బిల్లు సమాచారం, వినియోగదారుల పరిధిలోని అధికారి వివరా లు, కాంటాక్ట్ ఆజ్.. అనే ఫీచర్లు ఈ యాప్లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. కాలం చెల్లిన బేకరీ ఉత్పత్తులు స్వాధీనం ● కంపెనీ యజమానిపై కేసు గీసుకొండ: గ్రేటర్ వరంగల్ గొర్రెకుంట ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలోని కృప బేకరీ ప్రొడక్ట్స్ కంపెనీపై టాస్క్ఫోర్స్ పోలీసులు, ఫుడ్సేఫ్టీ ఆఫీసర్ శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కాలం చెల్లిన బేకరీ పదార్థాలతోపాటు బ్రెడ్, బిస్కట్లు, కేకుల్లో వాడేందుకు రూ.32,550 విలువైన 6,510 కుళ్లిన కోడిగుడ్లు, లిక్విడ్ను స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ యజమాని జడ్సన్ అబ్రహంను అదుపులోకి తీసుకుని విచారణ కోసం ఫుడ్సేఫ్టీ అధికారులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ జి.బాబూలాల్ తెలిపారు. ఈ సందర్భంగా బాబూలాల్ మాట్లాడుతూ ఆహార పదార్థాల విషయంలో నాణ్యత, పరిశుభ్రత, ప్రమాణాలు పాటించకుండా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న వ్యాపారులపై కఠినంగా వ్యవహరించనున్నట్లు స్పష్టం చేశారు. సీపీ సన్ప్రీత్సింగ్ ఆదేశాల మేరకు ఏసీపీ మధుసూధన్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఫుడ్సేఫ్టీ ఆఫీసర్ కృష్ణమూర్తి, టాస్క్ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
సరస్వతీ పుష్కర ఔషధ సేకరణపై సమీక్ష
ఎంజీఎం : కాళేశ్వరంలో మే 12వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 12 రోజుల పాటు జరిగే సరస్వతీ పుష్కరాల వైద్యశిబిరాలకు అవసరమైన ఔషధాల కోసం శుక్రవారం హనుమకొండ సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్లో భూపాలపల్లి డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్ సమీక్ష నిర్వహించారు. ఈ పుష్కరాలకు సుమారు 10లక్షల నుంచి 12 లక్షల వరకు భక్తులు రానున్నట్లు అంచనా వేశారు. కాళేశ్వరంతో తాత్కాలికంగా 30 పడకల ఆస్పత్రితోపాటు మహదేవపూర్లో 30 పడకల సీహెచ్సీ సేవలను వినియోగించుకోనున్నట్లు పేర్కొన్నారు. ఇవేకాకుండా 10 ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. గైనకాలజీ, సర్జరీ, అనస్తీషియా, పిడియాట్రిక్, అర్థోపెడిక్, జనరల్ మెడిసిన్ వంటి ప్రత్యేక వైద్యసేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. అవసరమైన మందులను సమకూర్చేందుకు డీహెచ్ రవీంద్రనాయక్, టీఎస్ఎంఎస్డీసీ రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లి పూర్తిస్థాయి ఔషధాలు అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. సమావేశంలో సీఎంఎస్ ఈఈ ప్రసాద్, ఫార్మసిస్టులు ఉప్పు భాస్కర్, నళిని, సదయ్య పాల్గొన్నారు. -
సన్న బియ్యం పథకం దేశానికే ఆదర్శం
కొత్తగూడ: సన్న బియ్యం పంపిణీ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పరిధి గుంజేడులో సన్న బియ్యం పథకాన్ని శుక్రవారం ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. నిరుపేదల కడుపు నింపాలనే లక్ష్యంతో సీఎం రేవంత్రెడ్డి సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యంతో వండిన ఆహారాన్ని చిన్నారులతో కలసి భుజించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన స్టాల్ను సందర్శించారు. చిన్న పాపకు ప్రభుత్వం సరఫరా చేసిన పౌష్టికాహర ఉగ్గును స్వయంగా తినిపించారు. గర్భిణులకు పౌష్టికాహర కిట్లు అందజేశారు. అనంతరం కలెక్టర్ అద్వైత్ కుమార్సింగ్, డీఎఫ్ఓ విశాల్తో కలిసి ముసలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గూర్చి అధికారులతో చర్చించారు. గుంజేడు ముసలమ్మ జాతరను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి సీతక్క హమీ ఇచ్చారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ..కొత్తగూడ, గంగారం మండలాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. 30 పడకల ఆస్పత్రి భవణ నిర్మాణం స్థల కేటాయింపులో జాప్యంపై సమీక్షించిన మంత్రి.. సమస్యలుంటే పరిష్కరించి ఆస్పత్రి నిర్మాణం జరిగేలా చూడాలని కలెక్టర్, డీఎఫ్ఓలకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణవేణి, డీడబ్ల్యూఓ ధనమ్మ, డీఆర్డీఓ మధుసూదన్రాజు, డీఎస్ఓ ప్రేమ్కుమార్, సీడీపీఓ షబానా అజ్మీ, తహసీల్దార్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్, సీ్త్రశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గుంజేడులో సన్న బియ్యం పథకం ప్రారంభం -
ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
దామెర: ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన హనుకొండ జిల్లా దామెర మండలంలోని తక్కళ్లపహాడ్లో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై అశోక్ తెలిపిక కథనం ప్రకారం.. నగరంలోని ఆరెపల్లికి చెందిన సుంకరి వీరేందర్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా శుక్రవారం పనినిమిత్తం తన అత్తగారి ఊరైన ఆగ్రంపహాడ్కు వెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తున్నాడు. ఈక్రమంలో తక్కళ్లపహాడ్ పాఠశాల సమీ పానికి రాగానే జాన్డీర్ ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో వాహనంపై ఉన్న వీరేందర్ ఎగిరిపడ్డాడు. అనంతరం ట్రాక్టర్ అతనిపై నుంచి వెళ్లడంతో తీవ్రగా యాలతో వీరేందర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ట్రైయినీ ఎస్పీ మనన్ భట్, ఎస్సై అశోక్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. వీరేందర్ భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానంవరంగల్: వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు ఆసక్తిగల పీడీ, పీఈటీలు, సీనియర్ జాతీయ క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి టీవీఎల్ సత్యవాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు పూర్తి వివరాలతోపాటు క్రీడా సర్టిఫికెట్లను జతపర్చాలని, దరఖాస్తుదారు ఎక్కడ ఉండి మే నెలలో ఉదయం సాయంత్రం శిక్షణను సక్రమంగా ఇవ్వగలరో దరఖాస్తులో స్పష్టం పేర్కొనాలని పేర్కొన్నారు. జీఓఎంఎస్ నంబర్ 74 ప్రకారం క్రీడాంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు.. మే 1 నుంచి 31 వరకు వివిధ క్రీడాంశాల్లో తర్ఫీదునివ్వాల్సి ఉంటుందని సూచించారు. ఆసక్తి గల క్రీడాకారులు ఓ సిటీ మినీ స్టేడియం లక్ష్మీపురం వరంగల్, జిల్లా యువజన, క్రీడల కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 77021 55096లో సంప్రదించాలని కోరారు. -
అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే కృషి
హన్మకొండ: అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త జ్యోతిబా పూలే అని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో జ్యోతిబా పూలే జయంతిని నిర్వహించారు. ఈసందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎండీ మాట్లాడుతూ.. కులం పేరుతో తరతరాలుగా అణిచివేతకు గురైన ప్రజలకు ధైర్యం కల్పించిన వ్యక్తి పూలే అని కొనియాడారు. సీ్త్రలు అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుందని, సీ్త్ర విద్య కోసం పోరాడిన గొప్పసంస్కర్త జ్యోతిబా పూలే అన్నారు. 1873 సెప్టెంబర్ 24న సత్యశోధన సమాజాన్ని స్థాపించారని, పూలే కేవలం కులవ్యవస్థ రూపు మాపడమే కాకుండా సామ్రాజ్యవాద వ్యతిరేక, కార్మికవర్గ, రైతాంగ పక్షంగా పోరాడారని వివరించారు. పూలే జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో ఇంచార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సీఈలు కె.తిరుమల్రావు, రాజుచౌహాన్, రవీంద్రనాథ్, బికంసింగ్, వెంకటరమణ, జాయింట్ సెక్రటరి కె.రమేష్, జీఎంలు అన్నపూర్ణ, వేణుబాబు, వాసుదేవ్, నాగ ప్రసాద్, శ్రీనివాస్, మల్లికార్జున్, దేవేందర్, కృష్ణ మోహన్, గిరిధర్, సత్యనారాయణ, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం పాల్గొన్నారు. గొప్పసామాజిక సంఘ సంస్కర్త కేయూ క్యాంపస్: మహాత్మాజ్యోతిబా పూలే గొప్ప సామాజిక సంఘసంస్కర్త అని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రతాప్రెడ్డి అన్నారు. శుక్రవారం పూలే జయంతిని యూనివర్సిటీలోని సెనెట్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్య ద్వారానే అసమానతలు తొలగిపోతాయని విద్యా ప్రాధాన్యతను పూలే ఆనాడే చాటిచెప్పారన్నారు. పూలేను స్ఫూర్తి, ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కాన్సిటిట్యూషన్ రెలవెన్స్ సోషియో ఎకనామిక్ పొలిటికల్ అండ్ ఎడ్యూకేషనల్ ఇంప్లికేషన్ ఆన్ బీసీస్ ఇన్ తెలంగాణ అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సీహెచ్ శ్రీనివాస్ కీలకోపన్యాసం చేశారు. తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు సిరికొండ సంజీవరావు, కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, బీసీ సెల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడారు. పాలకమండలి సభ్యులు ఆచార్య సురేష్లాల్, డాక్టర్ అనితారెడ్డి, మల్లం నవీన్, సుకుమారి, చిర్ర రాజు, పుల్లూరు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. తొలుత కేయూ దూరవిద్యా కేంద్రంలోని పూలే దంపతుల విగ్రహాలకు వీసీ, రిజిస్ట్రార్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బోధన, బోధనేతర సిబ్బంది, పలువురు పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తాం
రామన్నపేట : నగరంలోని వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రూ.28 కోట్ల నిధులతో నిర్మించనున్న నూతన భవన నిర్మాణానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నా యిని రాజేందర్రెడ్డి శుక్రవారం భూమి పూజ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. 70 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 2014 సంవత్సరం తెలంగాణ ఆవిర్భావం నాటికి అత్యంత శిథిలావస్థకు చేరుకుందని, ఈ విషయాన్ని నాటి విద్యార్థి నాయకులు, విద్యార్థులు సాంకేతిక విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఇటీవల పూర్వ విద్యార్థులు, కళాశాల ప్రిన్సిపాల్.. విషయం తెలియజేయడంతో నూతన భవన నిర్మాణానికి నిధుల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయగా సీఎం రేవంత్రెడ్డి స్పందించి రూ.28 కోట్లు విడుదల చేసి అభివృద్ధి పనులు ప్రారంభించాలని సూచించినట్లు తెలిపారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన ప్రభుత్వ ఇంజనీరింగ్ విద్య అందించడమే కాకుండా ప్రభుత్వ జాబ్ క్యాలెండర్, స్వయం ఉపాధి పథకాల ద్వారా వారికి ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగరాజు, ‘కుడా’ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్, రామ్ప్రసాద్, కళాశాల పూర్వ విద్యార్థి సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ.వి శ్రీనివాస్రావు, మేకల అక్షయ్కుమార్, శ్రీవిద్య, కుమ్మరి వేణు, బానోత్ వెంకన్న, రవితేజ, కుమార్, దయాకర్, శ్రీ లేఖ, కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ రామనారాయణ, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణానికి భూమి పూజ -
అంబేడ్కర్ స్టడీ సెంటర్ డైరెక్టర్గా రాజ్కుమార్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని డాక్టర్ బా బా సాహెబ్ అంబేడ్కర్ స్టడీ సెంటర్ డైరెక్టర్గా హిస్టరీ అండ్ టూ రిజం మేనేజ్మెంట్ విభాగాధిపతి, కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సీహెచ్.రాజ్కుమార్ నియమితులయ్యారు. ఈమేరకు రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్కుమార్ కామన్ మెస్ సంయుక్త సంచాలకులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పీఏసీఎస్లను బలోపేతం చేయాలిహన్మకొండ అర్బన్: జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) బలోపేతానికి, నూతన సహకార సంఘాల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల బలోపేతం, నూతన సంఘాల ఏర్పాటుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, కొత్తగా ఏర్పాటుకు వచ్చిన ప్రతిపాదనల గురించి జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి అదనపు కలెక్టర్కు వివరించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా సోలార్ పవర్ప్లాంట్, పెట్రోల్ బంకులు, సీఎస్సీ సెంటర్లు, జనరిక్ ఔషధ కేంద్రాల ఏర్పాటు గురించి సంజీవరెడ్డి వెల్లడించారు. సమావేశంలో వ్యవసాయ, పౌర సరఫరాలు, సహకార, మత్స్య, మార్కెటింగ్, పశుసంవర్థక శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో పనిచేయని లిఫ్ట్ హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లో పై అంతస్తులకు వెళ్లడానికి అధికారులు రెండు లిఫ్టులు అమర్చారు. అందులో ఒకటి కొద్ది రోజుల నుంచి పని చేయడం లేదు. ఇది కలెక్టర్ కార్యాలయానికి సమీపంలోనే ఉంటుంది. దీని వద్ద ‘లిఫ్టు పనిచేయడం లేదు’ అని అధికారులు బోర్డు అమర్చారు. కాగా.. లిఫ్టు పనిచేస్తున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా విద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తుందనే కారణంతో ఇలా చేస్తున్నారనే ఆరో పణలు కూడా వస్తున్నాయి. ఈవిషయంలో అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని పై అంతస్తులో ఉండే ఉద్యోగులు కోరుతున్నారు. సీపీని కలిసిన అటవీ, ఎకై ్సజ్ అధికారులువరంగల్ క్రైం: వరంగల్ జిల్లా అటవీశాఖ అధికారి అనోజ్ అగర్వాల్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలను అందించారు. ఈ సందర్భంగా అధికారులు వివిధ అంశాలపై చర్చించారు. -
ఉత్కంఠ
ఆశావహుల్లోహన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లో ఖాళీగా ఉన్న డైరెక్టర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. తీవ్రమైన పోటీ కారణంగా పదవులు ఎవరికి దక్కుతాయో అని ఆందోళన చెందుతున్నారు. మొత్తం పోస్టులు నాలుగు ఉండగా.. ఫైనాన్స్ డైరెక్టర్కు ప్రత్యేక అర్హతలు, మిగతా వాటికి అర్హతలు ఒకే మాదిరిగా ఉన్నాయి. ఫైనాన్స్ రంగంలో అనుభవం ఉండి సీజీఎం స్థాయిలో పని చేసిన వారు మాత్రమే ఫైనాన్స్ డైరెక్టర్ పదవికి అర్హులు. మిగతా మూడు పదవులకు ఇంజనీరింగ్ విభాగంలో సీఈ, సీజీఎంగా పని చేసిన వారు అర్హులు. డైరెక్టర్ పదవులకు ఈనెల 9న హైదరాబాద్లో ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా నేతృత్వంలోని కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఫైనాన్స్ డైరెక్టర్ పదవికి నలుగురు, మిగతా వాటికి 21 మంది హాజరయ్యారు. 17 జిల్లాలు.. 299 మండలాలు.. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలుండగా టీజీ ఎన్పీడీసీఎల్ 17 జిల్లాలు, 299 మండలాల్లో విస్తరించి ఉంది. 5,580 గ్రామాలు, 7,474 హామ్లెట్లకు విద్యుత్ పంపిణీ చేస్తున్నది. 68,62,858 విద్యుత్ సర్వీసులున్నాయి. 9 వేలకు పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే టీజీ ఎన్పీడీసీఎల్లో అప్పటి సీఎండీ అన్నమనేని గోపాల్రావు పదవికి రాజీనామా చేశారు. డైరెక్టర్లు కొనసాగుతుండగా ప్రభుత్వం వారిని 2024 జనవరి 29న తొలగించి, జనవరి 30న నూతన డైరెక్టర్ల భర్తీకి నోటిిఫికేషన్ జారీ చేసి మార్చి 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించింది. 25 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ప్రస్తుతం సీజీఎంలుగా పని చేస్తున్న అధికారులతో పాటు రిటైర్డ్ అధికారులు ఉన్నారు. నోటిఫికేషన్ విడుదల చేసిన 14 నెలలు, దరఖాస్తులు స్వీకరించిన 12 నెలల తర్వాత ఎట్టకేలకు డైరెక్టర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఒక్కో డైరెక్టర్ పోస్టుకు ముగ్గురిని ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిసింది. డైరెక్టర్ పోస్టుల భర్తీ ఇంటర్వ్యూలు పూర్తి టీజీ ఎన్పీడీసీఎల్లో నాలుగు పోస్టులకు గతేడాది జనవరిలో నోటిఫికేషన్ పోస్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక.. సర్కారుకు నివేదిక! తీవ్ర పోటీ టీజీ ఎన్పీడీసీఎల్లో డైరెక్టర్ పదవుల కోసం ప్రస్తుతం చీఫ్ ఇంజనీర్లు, సీజీఎంలతో పాటు ఇదే కంపెనీలో పని చేసి రిటైర్డ్ అయిన వారు, టీజీ ఎస్పీడీసీఎల్, జెన్కో, ట్రాన్స్కోలో పని చేస్తున్న సీజీఎంలు, చీఫ్ ఇంజనీర్లు, రిటైర్డ్ అయిన వారు దరఖాస్తు చేశారు. దీంతో డైరెక్టర్ పోస్టులకు తీవ్ర పోటీ నెలకొంది. ఇంటర్వ్యూలు పూర్తి కావడంతో వీరిలో ఎవరికి అదృష్టం వరిస్తుందోననే టెన్షన్ దరఖాస్తుదారుల్లో నెలకొంది. ఎలాగైనా పదవులు సాధించాలనే ఆలోచనతో ప్రయత్నాలు ఇప్పటి నుంచే మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. నోటిఫికేషన్ విడదల చేసి దరఖాస్తులు స్వీకరించిన ఏడాది తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహించడంతో వెంటనే భర్తీ చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్చార్జ్ డైరెక్టర్లతో అవాంతరాలు లేకుండా పనులైతే జరుగుతున్నాయి. డిస్కంలు నష్టాల్లో కొనసాగుతున్న క్రమంలో డైరెక్టర్ల నియామకం ద్వారా ఆర్థిక భారం పడనున్నందున.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. -
‘రాజ్యాంగం’ ఆడియో సీడీ ఆవిష్కరణ
విద్యారణ్యపురి: కవి, జాతీయ ఉపాధ్యాయ ఉత్తమ అవార్డు గ్రహీత డాక్టర్ వల్లంపట్ల నాగేశ్వర్రావు రచించి స్వరపరిచిన ‘మన భారత రాజ్యాంగం’ ఆడియో సీడీని వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆవిష్కరించారు. గురువారం హనుమకొండలోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీహరితో పాటు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్యనవీన్, డాక్టర్ వల్లంపట్ల నాగేశ్వర్రావు, వీఆర్విద్యార్ధి, పి.కృష్ణమాచారి, ప్రొఫెసర్ రతన్సింగ్ఠాకూర్, డోలి రాజలింగం, బండా కాళిదాస్, మండల పరశురాములు, సామాజిక కార్యకర్త నల్లమూరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు ప్రణాళికలు
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద వరంగల్: యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం వ్యవసాయ, సహకార శాఖల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, హార్వెస్టింగ్ యజమానులతో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సీజన్లో సుమారు 2.57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసి, జిల్లా వ్యాప్తంగా సుమారు 182 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా రవాణా అధికారి శోభన్బాబు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సంధ్యారాణి, జిల్లా పౌరసరఫరాల అధికారి కిష్టయ్య, జిల్లా సహకార అధికారి నీరజ, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, ఏఓలు, ఏఈఓలు, హార్వెస్టర్ల యజమానులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోuకాజీపేట అర్బన్/ఖిలావరంగల్ : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రిజిస్ట్రేషన్ నిమిత్తం వెళ్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాయాల్సి వచ్చేది. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న దస్తావేజులు చేతికందడానికి రెండు మూడు రోజులు పట్టేది. ఇలాంటి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం స్లాట్ బుకింగ్ పద్ధతికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేయగా అందులో ఉమ్మడి వరంగల్లోని వరంగల్ ఫోర్ట్, వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. గురువారం స్లాట్ బుకింగ్తో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను జిల్లా రిజిస్ట్రార్ ఫణీందర్ ప్రారంభించి మ్యుటేషన్, దస్తావేజులను యజమానులకు అందజేశారు. స్లాట్ బుకింగ్ షెడ్యూల్ ఇలా..ప్రతి రోజు ఉదయం 10.30 నుంచి 1.30 గంటల వరకు 24 స్లాట్స్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 24 స్లాట్స్ మెరుగైన సేవలు అందిస్తున్నాం.. ప్రభుత్వం ప్రవేశ పె ట్టిన స్లాట్ బుకింగ్ విధానంతో వినియోగదారులకు మె రుగైన సేవలు అందిస్తున్నాం. తొలి రోజు 48 స్లాట్స్ అందుబాటులో ఉండగా.. 26 మంది భూమి రిజిస్ట్రేషన్కు స్లాట్స్ బుక్ చేసుకున్నారు. వారు ఎంచుకున్న సమాయానికి కార్యాలయానికి రాగా 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఆన్లైన్లో ప్రింట్ తీసి దస్తావేజులు అందజేశాం.వృద్ధులు, దివ్యాంగులు, పేషంట్ల కోసం సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు 5 స్లాట్స్ 15 నిమిషాల్లో దస్తావేజులు.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ సదుపాయంతో భూక్రయవిక్రయదారులు తాము కోరుకున్న రోజు.. కోరుకున్న సమయానికి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి 53 స్లాట్ బుకింగ్స్ కల్పించారు. 15 నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి మరో 15 నిమిషాల్లో మ్యుటేషన్ కాపీతో పాటు దస్తావేజులు అందజేశారు. ● వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 36 ● వరంగల్ ఫోర్ట్ కార్యాలయంలో 25 దస్తావేజులకు తొలిరోజు రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రక్రియను ప్రారంభించిన జిల్లా రిజిస్ట్రార్ప్రతీరోజు రెండు కార్యాలయాల్లో 106– జి.నరేందర్ సబ్ రిజిస్ట్రార్, ఫోర్ట్ వరంగల్ -
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి
కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్: జిల్లాలో ప్రారంభం కాని ధాన్యం కొనుగోలు కేంద్రాలను రెండు, మూడు రోజుల్లో ప్రారంభించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పర్యవేక్షించాలని, గన్నీ సంచుల కొరత, ధాన్యం తరలింపులో ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కొమరయ్య, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ మేనేజర్ మహేందర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. మెరుగైన వైద్యం అందించాలి.. గ్రామీణులకు మరింత మెరుగైన వైద్య సేవలందించాలని హనుమకొండ కలెక్టర్ వైద్యులకు సూచించారు. జిల్లాలో ఇటీవల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో మిడ్ లెవెల్ హెల్త్ కేర్ ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ)లుగా నియమితులైన 11 మందికి కలెక్టరేట్లో నియామక పత్రాలు అందించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. టీబీ, నాన్ కమ్యునికేబుల్ వ్యాధులు, ఇతర ఆరోగ్య కార్యక్రమాలు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ స్థాయిలో అందిస్తున్నట్లు తెలిపారు. అవసరమైన సేవలను ఎంఎల్హెచ్పీలు సమర్థంగా, అంకితభావంతో అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ అప్పయ్య, డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయ్కుమార్, ప్రోగ్రాం అధికారులు కె.లలితాదేవి, డాక్టర్ హిమబిందు, డాక్టర్ ఇఫ్తాకర్ అహ్మద్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి రాజేశ్కుమార్, మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి, డీపీఓ రుక్ముద్దీన్, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. సుందరీమణుల పర్యటనకు ఏర్పాట్లు సిద్ధం చేయాలి.. ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనే వివిధ దేశాల సుందరీమణులు మే 14న వరంగల్కు రానున్నారని.. అన్ని ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో రెవెన్యూ, పర్యాటక, ఇతర శాఖల అధికారులతో ఆమె సమన్వయ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖ సెక్రటరీ స్మితా సబర్వాల్ మార్గనిర్దేశం మేరకు ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను అధికారులకు వెల్లడించారు. కాళోజీ కళాక్షేత్రం సందర్శించనున్న వారికి తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పేలా మహిళలు బతుకమ్మలతో ఘన స్వాగతం పలుకనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమం ప్రపంచ స్థాయిలో వరంగల్ పర్యాటక, వాణిజ్య అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. కాళోజీ కళాక్షేత్రం సందర్శన అనంతరం వారు ములుగులోని రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో డీటీఓ శ్రీనివాస్కుమార్, జిల్లా పర్యాటకశాఖ అధికారి శివాజీ, నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ అన్వేశ్, ‘కుడా’ పీఓ అజిత్రెడ్డి, పాల్గొన్నారు. -
కవి.. కష్టజీవి పక్షానే ఉండాలి
కవి ఎప్పుడూ కష్టజీవి పక్షానే ఉండాలని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ అన్నారు. వాతావరణం ఉదయం చల్లని వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశం అక్కడక్కడా మేఘావృతం అవుతుంది.– 8లోuత్వరలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా.. స్లాట్ బుకింగ్తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన వరంగల్ రూరల్, వరంగల్ఫోర్ట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 61 దస్తావేజులకు రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తి చేశాం. వారం పదిరోజుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మిగతా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభించుకునే అవకాశం ఉంది. భూక్రయవిక్రయదారులు స్లాట్ బుకింగ్పై ఆసక్తి కనబరిచారు. 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే ఆనందం వ్యక్తం చేశారు. -
జాతీయ ఎస్టీ కమిషన్ ఎదుట మహబూబాబాద్ కలెక్టర్
● కునాయికుంట కబ్జాపై విచారణకు ఢిల్లీలో హాజరు సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రత్తిరాంతండాలోని కునాయికుంట కబ్జా విషయంలో ఓ మాజీ ప్రజాప్రతినిధి జాతీయ ఎస్టీ కమిషన్ను ఆశ్రయించాడు. కమిషన్ ఆదేశాల మేరకు కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ బుధవారం ఢిల్లీలో కమిషన్ ఎదుట హాజరయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి.. రత్తిరాంతండా పరిధిలోని కునాయికుంటను గత ప్రభుత్వం హయాంలో కొంతమంది అక్రమంగా కబ్జా చేసి.. రెవెన్యూ అధికారుల మద్దతుతో పట్టాదారు పాస్బక్ పొందారు. ఈ విషయం అప్పటి కలెక్టర్, అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదు. 70 ఏళ్లు గిరిజన రైతులకు సాగునీరుకు ఉపయోగపడే కుంటను ఆక్రమించి పట్టాపొందారనే విషయాన్ని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ దృష్టికి మాజీ ఎంపీటీసీ మదన్ తీసుకెళ్లారు. ఫిర్యాదుపై స్పందించిన జాతీయ ఎస్టీ కమిషన్ ఢిల్లీలోని కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని కలెక్టర్ను ఆదేశించింది. ఈమేరకు ఆయన హాజరై కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు తెలిసింది. -
హెచ్సీయూ భూములను పరిరక్షించాలి
కేయూ క్యాంపస్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ అన్నారు. వర్సిటీల భూముల పరిరక్షణపై డెమొక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన బుధవారం కాకతీయ యూనివర్సిటీ దూరవిద్యాకేంద్రం సెమినార్హాల్లో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములపై ప్రైవేట్ పెట్టుబడీదారుల కన్నుపడిందని, నాటి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఐఎంజీ భారత్ అనే కంపెనీకి 400ల ఎకరాల భూమి కేటాయించగా.. తర్వాత పరిణామ క్రమంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో ఆ కేటాయింపును రద్దు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఉన్నత న్యాయ స్థానం 2024లో ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు ఇచ్చినట్లు వివరించారు. ఆ 400 ఎకరాల భూమిని విద్యారంగాభివృద్ధికి వినియోగించాలన్న ఆయన.. బాధ్యత కలిగిన ప్రభుత్వం మళ్లీ ప్రైవేటు కంపెనీలకు అప్పగించడానికి పూనుకోవటం సరికాదన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకట్దాస్ మాట్లాడుతూ హెచ్సీయూ విద్యార్థులు భూమి పరిరక్షణకు ఉద్యమిస్తే వారిపై అణిచివేత చర్యలు తగదన్నారు. సమావేశంలో డెమొక్రటిక్ స్టూడెంట్స్ రాష్ట్ర కన్వీనర్ శ్రవణ్, కోకన్వీనర్ గణేష్, ప్రజాసంఘాల బాధ్యులు లింగారెడ్డి, లక్ష్మయ్య, మొయీనుద్దీన్, ఓంబ్రహ్మం, వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు బి.నర్సింహారావు, వడ్డెపెల్లి మధు, సంతోష్, రాజేష్, నాగరాజు, స్టాలిన్, వెంకటేష్, శివ పాల్గొన్నారు. ఉమ్మడి ఏపీ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ -
మరోసారి మెరిసిన మరియపురం!
గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీ మరియపురం మరో సారి మెరిసింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో 2022–23 నాటికి గ్రామం రాష్ట్రంలోని టాప్ టెన్ పంచాయతీల్లో ఒకటిగా నిలిచింది. కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ రెండు రోజుల క్రితం విడుదల చేసిన ‘పంచాయతీ పురోగతి సూచిక‘లో గ్రామ మాజీ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి కృషి ఫలితంగా జిల్లాతో పాటు రాష్ట్రంలోనూ ప్రశంసనీయమైన సూచీ సాధిండం విశేషం. దేశంలో పురోగతి సూచిక కోసం 2.55 లక్షల పంచాయతీలు దరఖాస్తు చేసుకోగా అందులో మరియపురం టాప్ టెన్లో నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో 270 గ్రామాలు ‘ఫ్రంట్ రన్నర్’గా(75–90 శాతం) నిలువగా అందులో మరియపురం టాప్ టెన్లో 8వ స్థానంలో నిలిచింది. తెలంగాణలో టాప్ 25 గ్రామాల్లో జిల్లా నుంచి మరియపురం నిలవడం గొప్ప విజయంగా చెబుతున్నారు. మాజీ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి దూర దృష్టితో ఇప్పటికే గ్రామం సుమారు 25 మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు 25 దక్కించుకోవడం గమనార్హం.9 అంశాల్లో రాష్ట్రంలో టాప్ టెన్లో గ్రామం 80.71 ఇండెక్స్తో రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు జిల్లాలో అరుదైన రికార్డు సొంతం మాజీ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి కృషికి దక్కిన ఫలితంజిల్లా, రాష్ట్ర స్థాయిలో సాధించిన పంచాయతీ ఇండెక్స్(పీఏఐ) అంశం జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి సూచీ సూచీజీవనోపాధుల పెంపు 89.03 93.98 ఆరోగ్యం 96.88 99.91 చిన్నారులకు అనుకూలమైన సౌకర్యం 82.81 84.09 తాగునీరు 79.38 86.08 పారిశుద్ధ్యం, పచ్చదనం 83.74 85.86 మౌలిక వసతుల్లో స్వావలంబన 69.71 73.15 సామాజిక భద్రత 81.84 85.34 సుపరిపాలన 81.44 81.68 మహిళలకు అనుకూలమైన విధానం 85.74 89.88 -
తమ్ముడే కాలయముడయ్యాడు..
వాజేడు : సొంత తమ్ముడే కాల యముడయ్యాడు. మద్యం కోసం డబ్బు ఇవ్వలేదనే కారణంతో అన్నను హత్య చేశాడు. అనంతరం తనకేమీ తెలియదన్నట్లు మృతదేహం వద్ద తిరిగాడు. ఈ ఘటన ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని కొత్త టేకులగూడెంలో జరిగింది. వెంకటాపురం(కె) సీఐ బండారి కుమార్, పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వాసం అచ్చయ్య, లక్ష్మి దంపతులకు ముగ్గురు కొడుకులు విజయ్బాబు(30), బుల్లెబ్బాయి (ఆకాశ్), రాజేంద్రప్రసాద్ ఉన్నారు. ఇద్దరు తమ్ముళ్లకు పెళ్లిళ్లు కాగా పెద్ద కొడుకు విజయ్బాబు వివాహం చేసుకోలేదు. అతడు తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. రెండో కొడు కు బుల్లెబ్బాయి(ఆకాశ్) తన భార్య కాన్పు నిమిత్తం తన అత్తగారింటికి వెళ్లగా ఇతను కూడా తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. ఈ క్రమంలో విజయ్ బాబు పనికి వెళ్లాడు. మంగళవారం రాత్రి ఇంటికి వచ్చి భోజనం చేసిన అనంతరం నిద్రించాడు. అ ప్పటికే మద్యం మత్తులో ఉన్న బుల్లెబ్బాయి.. అన్న విజయ్బాబును మద్యానికి డబ్బు ఇవ్వాలని అడగా అతడు తన వద్ద లేవని చెప్పి నిద్రించాడు. దీంతో కోపోద్రెకుడైన బుల్లెబ్బాయి.. విజయ్బాబుతో గొడవ పడి పదునైన ఆయుధంతో ముఖంపై కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన విజయ్బా బు మృతి చెందాడు. దీనిపై సమాచారం అందుకు న్న పోలీసులు బుధవారం ఉదయం ఘటనా స్థలికి చేరకుని పరిశీలించారు. వివరాలను సేకరించే సమయంలో బుల్లెబ్బాయి అక్కడే ఉండి తనకు ఏమీ తెలియదనట్లు నటించాడు. ఈ ఘటనపై చిన్న తమ్ముడు రాజేంద్రప్రసాద్ ఫిర్యాదు మేరకు బుల్లెబ్బాయిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ, ఎస్సై తెలిపారు. కాగా, బుల్లెబ్బాయి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మద్యం కోసం డబ్బు ఇవ్వలేదని అన్నను చంపిన తమ్ముడు టేకులగూడెంలో ఘటన -
మిడ్కో కథలు చిరస్మరణీయం
దేవరుప్పుల : దేశంలో ప్రకృతి సంపదను కొల్లగొట్టే దోపిడీ వ్యవస్థ నిర్మూలన ఉద్యమవ్యాప్తిలో మిడ్కో కథలు ఆచరణాత్మకంగా చిరస్మరణీయమని పౌరహక్కుల సంఘం, ఏఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్, విమలక్క, వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్ పేర్కొన్నారు. ఇటీవల ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు, విప్లవ సాహితి సంపాదకులు గుమ్ముడవెల్లి రేణుక సంస్మరణ సభ బుధవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలో అమరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షురాలు బి.పద్మకుమారి అధ్యక్షతన జరిగింది. తొ లుత తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య స్మారక స్థూపం వద్ద ఏర్పాటు చేసిన రేణుక చిత్రపటానికి పలువురు విప్లవ జోహర్లు అర్పించారు. అనంతరం ‘అందరసొంటి సావు కాదు’ శీర్షికన రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ వామపక్ష పార్టీల సిద్ధాంతాలు నిర్వీర్యమయ్యే క్రమంలో ఆవిర్భవించిన నక్సల్స్ ఉద్యమాల వల్లే తెలుగు రాష్ట్రాల్లో భూస్వామ్య, పెట్టుబడిదారి వ్యవస్థ ని ర్మూలించే క్రమంలో గిట్టని పాలకవర్గాలు పోలీ సుల ఉక్కుపాదం మోపుతూ ప్రజాఉద్యమాలను అణిచివేశారని అన్నారు. ఈ క్రమంలోనే ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కుల సాధనకు రేణుక నమ్మిన సిద్ధాంతం, మహిళలను చైతన్యవంతుల్ని చేసే క్రమంలో బీజేపీ సర్కార్ ఆపరేషన్ కగార్లో అసువులు బాసిందని పేర్కొన్నారు. రేణు క రచనలు భావితరాల ఉద్యమాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. ఆపరేషన్ కగార్ను నిలిపివేసి వాస్తవికతపై అధ్యయనం చేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రేణుక తల్లిదండ్రులు జయమ్మ, సోమయ్య మా ట్లాడుతూ తన కూతురుకు మరణంలేదు.. అక్షర ఉ ద్యమం ఉన్నంత వరకూ జీవిస్తుందంటూ కంటతడి పెట్టారు. అనంతరం విమలక్క, పల్స నిర్మల, సురేష్ సాంస్కృతిక కళాప్రదర్శనలతో అమరులను స్మరించుకున్నారు. కార్యక్రమంలో రేణుక సోదరులు జీవీకే.ప్రసాద్, రాజశేఖర్, పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య, విరసం నాయకుడు అరుసువల్లి కృష్ణ, మాభూమి సంధ్య, బల్ల సావిత్రి, గాజర్ల అశోక్ అలియాస్ ఐతు, అమర్, ఏపీటీఎఫ్, టీవీవీ వేదిక, డీటీఎఫ్ రాష్ట్ర నాయకులు ఎర్రంరెడ్డి నర్సింహారెడ్డి, గురజాల రవీందర్, బి.గంగాధర్, ఓయూ జేఏసీ నాయకుడు ఇప్ప పృథ్వీరెడ్డి, సీపీఐ, ఎమ్మార్పీఎస్ నాయకులు బిల్లా తిరుపతిరెడ్డి, జీడి ఎల్లయ్య, పడమటింటి నర్సింహ తదితరులు పాల్గొన్నారు. పౌరహక్కుల సంఘం, ఏఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్, విమలక్క, వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్ కడవెండిలో మావోయిస్టు నేత గుమ్ముడవెల్లి రేణుక సంస్మరణ సభ -
పొలంలో వరి దులుపుతుండగా..
భూపాలపల్లి రూరల్: పొలంలో ఆడ, మగ విత్తన వరి పంటను దులుపుతున్న క్రమంలో కాలుకు విద్యుత్ తీగ చుట్టుకోవడంతో షాక్కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం భూపాలపల్లి మండలం పంబపూర్లో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని పంబాపూర్కు చెందిన పిట్టల అభిషేక్(25) అదే గ్రామానికి చెందిన పులి సలమాను అనే రైతుకు చెందిన ఆడ, మగ వరి పంటను దులపడానికి కూలీకి వెళ్లాడు. మంగళవారం సామంత్రం వీచిన గాలి దుమారానికి పొలంలో11 కేవీ విద్యుత్ తీగ తెగిపడింది. ఈ క్రమంలో అభిషేక్ పొలంలో వరి దులుపుతుండగా అతడి కాలుకు తీగ చుట్టుకుంది. దీంతో షాక్ తగిలి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సహ కూలీలు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు వెంటనే ప్రైవేట్ వాహనంలో భూపాలపల్లి ప్రభుత్వ వంద పడకల ఆస్పత్రికి తరలించారు. అయితే అభిషేక్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అభిషేక్కు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు, భార్య సుకన్య ఉంది. కాగా, విద్యుత్ అధికారులు, పులిసలమాను నిర్లక్ష్యం కారణంగానే తన భర్త మృతి చెందాడని వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, వృద్ధాప్యంలో తమను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కొడుకు మృతిచెందడంతో అభిషేక్ తల్లిదండ్రులు అనంతయ్య, కరుణమ్మ గుండెలవిసేలా రోదించారు. కాలుకు చుట్టుకున్న విద్యుత్ తీగ షాక్కు గురై యువకుడి మృతి గాలి దుమారానికి తెగి పొలంలో పడిన విద్యుత్ తీగ.. -
కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల ముందస్తు అరెస్ట్లు
కేయూ క్యాంపస్: తెలంగాణలోని 12 యూనివర్సి టీల్లోని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్తో హైదరాబాద్లోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ముట్టడికి కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవా రం ఉదయం వరకు కాకతీయ యూనివర్సిటీలోని వివిధ కళాశాలలు, విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను ముందస్తు అరెస్ట్లు చేసి వివిధ పోలీస్టేషన్లకు తరలించారు. ఇందులో మహిళా ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. ప్రధానంగా కేయూ, హనుమకొండ, సుబేదారి తదితర పోలీస్ స్టేషన్లలో ఉంచారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో సుమారు 50 నుంచి 60మంది వరకు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారని సమాచారం. యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, కేయూ బీసీసెల్ డైరెక్టర్ శ్రీనివాస్, కేయూపాలకమండలి సభ్యుడు చిర్రరాజు, కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం బాధ్యులు సదాశివ, గడ్డం కృష్ణ తదితరులు ఉన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ముట్టడికి కూడా కొందరు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు వెళ్లారు. అందులో కేయూ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు శ్రీధర్కుమార్లోథ్, పలువురు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను మిగతా యూనివర్సిటీల కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను అక్కడ పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలి రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న 1,270మంది కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజేషన్ చేశాక మిగతా పోస్టుల్లో నియామకాలు చేపట్టాలని, ఇటీవల తీసుకొచ్చిన జీఓ 21ని రద్దుచేయాలని డిమాండ్తో ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను అరెస్ట్ చేశారని, వారిని విడుదల చేయాలని కేయూ కోఆర్డినేషన్ కమిటీ బాధ్యులు సాధురాజేశ్, బి. సతీశ్, మాదాసి కనకయ్య డిమాండ్ చేశారు. అరెస్ట్లను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాగా, గురువారం బంద్ పాటించనున్నట్లు కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర కమిటీ తెలిపింది.ఇదేనా ప్రజాపాలన.. తెలంగాణ ఏర్పాటుకు కారణమైన యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను అరెస్ట్ చేయటం సిగ్గుచేటని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఇండ్ల నాగేశ్వర్రావు ఒక ప్రకటనలో విమర్శించారు. ఇదేనా ప్రజాపాలనా అని ప్రశ్నించారు. కాంట్రాక్టు అధ్యాపకుల సమస్య పరిష్కారం చూపాకే నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొందరు ఇక్కడే.. మరికొందరు హైదరాబాద్లో.. -
అదుపు తప్పిన బైక్..
చిట్యాల: బైక్ అదుపు తప్పి ఓ కారోబార్ మృతి చెందాడు. ఈ ఘటనలో మంగళవారం రాత్రి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని నవాబుపేటకు చెందిన జిల్లెల కుమార్(40) కై లాపూర్ కారోబార్గా పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా శాంతినగర్లో ఉపాధిహామీ పనులు జరుగుతున్న క్రమంలో అక్కడికి వెళ్లి కూలీల వివరాలు తీసుకుని ఎంపీడీఓ కార్యాలయంలో అందజేశాడు. అనంతరం నవాబుపేటకు వెళ్తున్న క్రమంలో మండల కేంద్రంలోని సివిల్ సప్లై గోదాం మలుపు సమీపంలో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. దీంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం తెల్లవారుజామున అటువైపు వెళ్తున్న స్థానికుడు బుర్ర రఘు గౌడ్ చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై శ్రవణ్కుమార్ ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య కృప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, కై లాపూర్ పంచాయితీ కార్యదర్శి అజీరాబేగం.. మృతుడి భార్యకు అంత్యక్రియల నిమిత్తం రూ. 10వేల ఆర్థిక సాయం అందించారు. ● కారోబార్ మృతి ● చిట్యాలలో ఘటన -
భర్త వేధింపులతో వివాహిత బలవన్మరణం
● మద్దులపల్లిలో ఘటనకాటారం: భర్త వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని మద్దులపల్లికి చెందిన పిట్టల శంకర్కు, మహాముత్తారం మండలం మహబూబ్పల్లికి చెందిన పిట్టల రజిత(25)కు ఏడున్నరేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వివాహం జరిగినప్పటి నుంచి శంకర్.. తల్లి లింగమ్మ, అన్న కిష్టస్వామి, అక్క లక్ష్మి చెప్పినట్లు వింటూ భార్య రజితపై అనుమానం పెంచుకున్నాడు. వివాహేతర సంబంధాలు అంటగడుతూ నిత్యం మద్యం తాగొచ్చి రజితను కొడుతున్నాడు. దీనిపై రజిత కుటుంబీకులు పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు నిర్వహించినా శంకర్లో మార్పు రాలేదు. రజిత తండ్రి మారయ్య ఆరోగ్యం బాగోలేదని ఇటీవల తమ్ముడు రఘుపతిని పంపించినప్పటికీ ఆమెను పుట్టింటికి పంపించకపోగా రజిత, ఆమె తమ్ముడిపై శంకర్ దాడి చేశాడు. ఈ క్రమంలో భర్త అనుమానం, వేధింపులతో మనస్తాపానికి గురైన రజిత బుధవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై–2 శ్రీనివాస్ తెలిపారు. ట్రేడింగ్ కంపెనీలో చోరీ.. ● రూ.9.60లక్షల అపహరణ కేసముద్రం: ఓ ట్రేడింగ్ కంపెనీలో చోరీ జరిగింది. రూ.9.60 లక్షలు అపహరణకు గురయ్యాయి. ఈ ఘటన మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై మురళీధర్రాజు కథనం ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ రోడ్లో గల మహాలక్ష్మి ట్రేడింగ్ కంపెనీ వ్యాపారి గార్లపాటి ప్రమోద్ మంగళవారం రాత్రి ఎప్పటిలాగే తన క్యాష్ కౌంటర్కు తాళం వేశాడు. అనంతరం వెనుక ఉన్న షెట్టర్ మూసి తాళం వేయకుండా భవనంపైనున్న తన ఇంట్లోకి వెళ్లాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఓ దుండగుడు షెట్టర్ను పైకి లేపి దుకాణంలోకి ప్రవేశించి కౌంటర్లోని రూ.9.60ల క్షలు తీసుకుని పరారయ్యాడు. ఉదయం షాపుకు వచ్చిన యజమాని చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై మురళీధర్రాజు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. చోరీకి పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదుకాగా, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. -
‘టెన్త్’ మూల్యాంకనంలో నిర్లక్ష్యం
ఉద్యోగ అవకాశాలు కల్పించాలి వరంగల్: మామునూరు ఎయిర్పోర్ట్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణాల్లో భూములు కోల్పోయిన తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని భూనిర్వాసితులు కలెక్టర్ డాక్టర్ సత్యశారదను కోరారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన జిల్లాస్థాయి సంప్రదింపుల సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, ఆర్డీఓ సత్యపాల్రెడ్డి పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్కు సంబంధించి ఖిలా వరంగల్ మండలంలోని నక్కలపల్లి, గుంటూరుపల్లి, గాడిపల్లి గ్రామాల భూనిర్వాసితులతో జనరల్ అవార్డు, కన్సర్న్ అవార్డులపై చర్చించారు. ఎయిర్పోర్ట్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమకు అధిక ధర కావాలని, రోడ్డు సౌకర్యం కావాలని నిర్వాసితులు కోరారు. నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న సంగెం మండలం చింతలపల్లి భూనిర్వాసితులతో ఆర్బిట్రేషన్ నిర్వహించారు. సమావేశంలో తహసీల్దార్లు నాగేశ్వరరావు, రాజ్కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
దరఖాస్తులు పరిష్కరించాలి
వరంగల్ అర్బన్ : టీఎస్ బీపాస్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని బల్దియా కమిషనర్ అశ్వి ని తానాజీ వాకడే ఆదేశించారు. బుధవారం బల్ది యా ప్రధాన కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికా రులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ నిర్దేశిత 21 రోజుల గడువులోగా ఫైల్ క్లియ ర్ చేయాలని, షార్ట్ ఫాల్ ఉంటే దరఖాస్తుదారుడికి సూచించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సమావేశంలో ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఏసీపీలు ఖలీల్, రజిత శ్రీనివాస్రెడ్డి, ఏర్షాద్ పాల్గొన్నారు. ఎర్లీ బర్డ్ స్కీమ్పై అవగాహన కల్పించాలి ఎర్లీ బర్డ్ స్కీమ్ను సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సీడీఎంఏ డాక్టర్ శ్రీదేవి అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి మున్సిప ల్ కమిషనర్లు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బల్దియా ప్రధాన కార్యాలయం నుంచి కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కమిషనర్ జోనా, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, రవీందర్ పాల్గొన్నారు. -
ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్కు స్థల పరిశీలన
కాజీపేట అర్బన్ : పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మాణానికి బుధవారం హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, కాజీపేట తహసీల్దార్ భావ్సింగ్ స్థలాన్ని పరిశీలించారు. కాజీపేట మండలం న్యూశాయంపేట పరిధి 23, 135, 389, 399, 579 సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూమిని సందర్శించిన వారు.. స్కూల్ నిర్మాణానికి 15 ఎకరాలు అవసరం ఉండగా.. తగిన స్థలం దొరకలేదని తెలిపారు. ఎన్సీసీని పటిష్టం చేస్తాం.. కేయూ క్యాంపస్: ఎన్సీసీ విభాగాన్ని రాబో యో రోజుల్లో మరింత పటిష్టం చేస్తామని ఎన్సీసీ గ్రూప్ కమాండర్ నింబాల్కర్ అన్నారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను బుధవారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా కళాశాలలో నిర్వహిస్తున్న ఎన్సీసీ కార్యక్రమాల గురించి ఆ కళాశా ల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి వివరించా రు. ఎన్సీసీ కార్యక్రమాలకు తమ వంతుగా సహకారమందిస్తామని నింబాల్కర్ తెలిపారు. ఈసందర్భంగా నింబాల్కర్ను ప్రిన్సిపాల్ ఆచార్య జ్యోతి సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ఎన్సీసీ ఆఫీసర్ డాక్టర్ స్వామిచాడ అధికారులు పాల్గొన్నారు. పోలీస్ కుటుంబానికి భద్రత చెక్కు అందజేతవరంగల్ క్రైం : కమిషనరేట్ పరిధి ధర్మసాగర్ పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2024 సెప్టెంబర్ 13న మరణించి న సదానందం కుటుంబానికి పోలీస్ భద్రత విభాగం రూ.7,89,920 చెక్కు మంజూరు చేసింది. బుధవారం కుటుంబ సభ్యులకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్సింగ్ అందజేశారు. మరణించిన హెడ్కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు ప్రస్తుత స్థితిగతులపై ఆయ న ఆరా తీశారు. ఏఓ రామకృష్ణ, సూపరింటెండెంట్ రమాదేవి పాల్గొన్నారు. జెడ్పీ వాహనాలకు వేలం హన్మకొండ: హనుమకొండ జిల్లా ప్రజాపరిష త్ ఆవరణలో తుప్పు పట్టిన వాహనాలకు ఎట్టకేలకు బుధవారం బహిరంగ వేలం నిర్వహించారు. వేలంలో 63 మంది పాల్గొనగా.. రూ.4,01,500 విలువైన 10 వాహనాలను నలుగురు దక్కించుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ విద్యాలత, డిప్యూటీ సీఈఓ రవి, డీటీఓ వేణుగోపాల్, ఆత్మరాం పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోuవసూళ్లు రూ.16.44 కోట్లుఆస్తి పన్ను బకాయి రూ.71.58 కోట్లు ● ప్రభుత్వ శాఖల నుంచి వసూలుకు వెనుకంజ ● ప్రజలపై పన్ను మోపడంలో ముందంజ ● నోరుమెదపని బల్దియారావాల్సిన బకాయిలు రూ.71.58 కోట్లుఆర్థిక సంక్షోభం, నిర్వహణ ఖర్చుల భారం పేరిట ప్రజల్ని ఎడాపెడా పన్నులతో బాదేస్తున్న గ్రేటర్ వరంగల్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సిన ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ శాఖ నుంచి మొదలుకొని బీఎస్ఎన్ఎల్, రైల్వే శాఖ వరకు రూ.లక్షల మేర బకాయిలున్నాయి. పారిశుద్ధ్యం, ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు, వీధి దీపాలు, తాగునీటి సరఫరా కోసం ప్రధాన ఆదాయ వనరు ఆస్తి పన్నే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసెస్మెంట్లు(భవనాలు) 1,551 ఉండగా.. గత పాత, కొత్త బకాయిలు రూ.88.02 కోట్లు అయ్యాయి. కాగా.. మార్చి వరకు కేవలం రూ.16.44 కోట్లు మాత్రమే వసూలు చేయగా.. ఇంకా రూ.71.58 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. వరంగల్ అర్బన్: ప్రతీనెల కరెంటు బిల్లు చెల్లించకపోతే విద్యుత్ సంస్థ బల్దియాకు కరెంట్ సరఫరా కట్ చేసిన ఘటనలున్నాయి. ఈఎస్ఐ, ఈపీఎఫ్ సొమ్ము చెల్లించకపోతే పెనాల్టీ లతోపాటు ఆస్తులు జప్తు చేస్తారు. వాహనాలకు ఇన్సూరెన్స్ చేయకపోతే ఆర్టీఏ వారు సీజ్ చేస్తారు. ఇలా.. గతంలో బల్దియా ఆస్తులను అటాచ్మెంట్ చేసిన సందర్భాలు కోకొల్లలు. కానీ.. గ్రేటర్ వరంగల్ అధికార యంత్రాంగం మాత్రం ఆస్తి పన్ను, నీటి చార్జీలు వసూలు చేయడంలో వెనుకబడింది. నిబంధనల పేరుతో సామాన్యులతో కఠినంగా వ్యవహరించే బల్దియాకు ప్రభుత్వ శాఖల విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు. ఏళ్ల తరబడి వాటి బకాయిల వసూలు లేకున్నా.. ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తున్నారు. పేదోడే నయం.. గ్రేటర్లో 2,17,585 అసెస్మెంట్లు (భవనాలు) ఉన్నాయి. 2024–25 గాను కమర్షియల్, రెసిడెన్షియల్ అసెస్మెంట్ల ద్వారా.. రూ.117.62 కోట్లు లక్ష్యం కాగా, రూ.74.90కోట్లు వసూలు చేశారు. ఇకపోతే ప్రభుత్వాలకు సంబంధించిన 1,551 అసెస్మెంట్లు ఉండగా.. కేవలం 30 శాఖలు మాత్రమే ఆస్తి పన్ను చెల్లించినట్లు అఽధికారులు వెల్లడించారు. గ్రేటర్ వరంగల్కు హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లతో పాటు నగర, పోలీస్ కమిషనర్, ఉన్నతాధికారులున్నారు. వీరి పర్యవేక్షణలో అన్ని శాఖలు కార్యకలాపాల్ని కొనసాగిస్తుంటాయి. ఇంత పెద్ద యంత్రాంగం ఉన్న ఆయా శాఖల ముఖ్య అధికారులతో సమావేశమై నగరంలో సుందరీకరణ, పరిశుభ్రత, రవాణా సౌకర్యం, విద్యుత్ వెలుగులు అందించే బల్దియాకు చెల్లించాల్సిన ఆస్తి, నీటి పన్నుల వసూళ్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఉంది. అందుకోసం బల్దియా మేయర్, కమిషనర్లు ఆ దిశగా చొరవ తీసుకోవాలి. కనీసం ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిల నివేదించలేకపోతున్నారు. ఇలా.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో పన్ను బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి. పన్నుల వసూళ్ల నిర్లక్ష్యంపై ఆ విభాగాధికారులను వివరణ కోరగా.. కమిషనర్ను సంప్రదించాలని దాటవేస్తుండడం గమనార్హం.బల్దియాలో ఇలా..న్యూస్రీల్బల్దియా మొద్దు నిద్ర వసూళ్ల్లు 18.68%ఉన్నతాధికారులు చొరవ చూపాలి! -
నెలాఖరులోగా భూ సేకరణ పూర్తి చేయాలి
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్ : జిల్లాలోని పరకాల నియోజకవర్గ పరిధి వివిధ గ్రామాల మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి–163 (జి) భూసేకరణ ప్రక్రియను ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ఈమేరకు బుధవారం కలెక్టరేట్లో పరకాల ఆర్డీఓ నారాయణ, ఆయా తహసీల్దార్లతో ఏర్పాటు చేసిన సమీక్షలో భూసేకరణ ప్రక్రియ, రైతుల భూములకు పరిహారం చెల్లింపు తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం అదనంగా కావాల్సిన 12.38 ఎకరాల భూ సేకరణ ప్రక్రియ, గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే భీమదేవరపల్లి, వేలేరు మండలాలకు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియపై హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, అధికారులు కలెక్టర్కు వివరించారు. భూ సేకరణకు అవసరమైన బడ్జెట్ అంచనా ప్రతిపాదనలను తయారు చేయాలని చెప్పారు. ఎల్కతుర్తి జంక్షన్ నుంచి ముల్కనూరు వైపు నిర్మిస్తున్న జాతీయ రహదారి పనుల పురోగతి గురించి సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ అడిగారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి పాల్గొన్నారు. -
పారా లీగల్ వలంటీర్లకు అభినందనలు
న్యాయమూర్తి వి.బి నిర్మలా గీతాంబ వరంగల్ లీగల్ : ప్రజలకు మేలు చేయాలనే దృక్పథంతో పనిచేయడానికి డీఆర్డీఏ, సీనియర్ సిటిజ న్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఆసక్తి చూపుతున్న పారా లీగల్ వలంటీర్లకు వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి నిర్మలా గీతాంబ అభినందనలు తెలిపారు. బుధవారం జిల్లా కోర్టులోని న్యాయసేవా సదన్ భవన్లో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్ ఆధ్వర్యాన డీఆర్డీఏకు చెందిన సోషల్ యాక్టివ్ మెంబర్స్, సీనియర్ సిటిజన్స్తో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. న్యాయ సేవాధికార సంస్థల విధులు, లక్ష్యాలను ప్రజలకు తెలియజేస్తూ ఏ పౌరుడూ న్యాయాన్ని కోల్పోకుండా పారా లీగల్ వలంటీర్లు బాధ్యత తీసుకోవాలని అన్నారు. సమావేశంలో వరంగల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తీగల జీవన్గౌడ్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సురేశ్, డీఆర్డీఏ కార్యాలయం నుంచి జి.అనిత, ఎ.సుధాకర్, వి.ప్రేమ్రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
‘టైలరింగ్ హబ్’లు ఏర్పాటు చేయాలి
నగర మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్ : ఇందిరా మహిళా శక్తి పథకం కింద గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో ‘టైలరింగ్ హబ్’ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో మెప్మా విభాగానికి చెందిన కమ్యూనిటీ ఆర్గనైజర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా దుస్తులు కుట్టడానికి వీలుగా కటింగ్ చేసి ఇవ్వడంతో పాటు కాజా బట్టన్స్ కుట్టే మిషన్లను బల్దియా పరిధి వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో ఒక్కొక్కటి చొప్పున టైలరింగ్ హబ్లను(యూనిట్కు రూ.20 లక్షల వ్యయం) ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ‘వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్‘ స్కీంలో భాగంగా ప్రభుత్వం వరంగల్ జిల్లాకు మిర్చి ప్రొడక్షన్ యూనిట్ కోసం రూ.కోటి మంజూరు చేసినందున మిర్చి పౌడర్ యూనిట్ స్థాపించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అలాగే స్ట్రీట్ ఫుడ్ యూనిట్ ఏర్పాటుకు రూ.కోటి మంజూరైనందున ఎన్ఐటీ వద్ద యూనిట్ ఏర్పాటు చర్యలు వేగంగా చేపట్టాలని చెప్పారు. సారీ రోలింగ్, టైలరింగ్, టై అండ్ డై మగ్గం వర్క్లు, హ్యాండ్ ఎంబ్రాయిడరీకి సంబంధించి బల్దియా పరిధి కమ్యూనిటీ హాళ్లలో వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలకు 10 చొప్పున, వర్ధన్నపేట 6, పరకాలకు 3 సెంటర్ల చొప్పున ఏర్పాటు చేయాలన్నారు. ఈ శిక్షణను నగర ప్రాంతాలు ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సెక్రటరీ అలివేలు, హార్టికల్చర్ అధికారులు రమేశ్, లక్ష్మారెడ్డి, టీఎంసీ రమేశ్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు శ్రీలత, సఫియా, రమ, సకినాల రమేశ్, నాగరాజు రాజ్కుమార్, అలీ, తదితరులు పాల్గొన్నారు. -
బదిలీల కలకలం!
వరంగల్ పోలీసు కమిషనరేట్లో మళ్లీ బదిలీల కలకలం మొదలైంది. వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని పలువురు ఏసీపీలు, ఎస్హెచ్ఓలు, ఇన్స్పెక్టర్లకు స్థానచలనం తప్పదన్న చర్చ జరుగుతోంది. ఇతర జిల్లాల్లో పని చేస్తున్న పలువురు అధికారులు ఇప్పటికే ప్రజాప్రతినిధుల ఆశీస్సులు పొందడంతో పాటు ఉన్నతాధికారులకు సిఫార్సు చేయించుకున్నారు. పోలీసుశాఖలో మళ్లీ ట్రాన్స్ఫర్లు ● త్వరలోనే కొందరు ఏసీపీలు, ఎస్హెచ్ఓలకు స్థానచలనం? ● కీలక ఠాణాల కోసం ఎవరికి వారుగా ప్రయత్నాలు ● పోస్టింగ్లకు ప్రజాప్రతినిధుల సిఫారసులే కీలకం.. ● పోలీసుశాఖపై పట్టు బిగిస్తున్న సీపీ.. తనిఖీలు, సమీక్షలతో బిజీబిజీ సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల క్రితం ఐపీఎస్ అధికారుల మూకుమ్మడి బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. ఈక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా రామగుండం కమిషనర్గా బదిలీ కాగా.. ఆయన స్థానంలో సన్ప్రీత్సింగ్ బాధ్యతలు చేపట్టారు. సమీక్షలు, సమావేశాలు, ఠాణాల ఆకస్మిక సందర్శనలతో బిజీబిజీగా ఉన్న పోలీస్ కమిషనర్.. కమిషనరేట్ పోలీసింగ్పై తనదైన మార్కు వేస్తున్నారు. ఇదే సమయంలో లాంగ్ స్టాండింగ్తో పాటు వివాదాస్పద పోలీసు అధికారులు కొందరికి స్థానచలనం తప్పదన్న ప్రచారంతో ఆశావహులు సిఫారసులకు పోటీపడడం చర్చనీయాంశం అవుతోంది. వివాదంగా పలు విభాగాలు.. పోలీసు కమిషనరేట్లో శాంతిభద్రతలతో పాటు స్పెషల్ బ్రాంచ్, టాస్క్ఫోర్స్, క్రైమ్స్ తదితర విభాగాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఈ విభాగాల్లో పని చేస్తున్న కొందరు తమ పనులు కాకుండా ఇతరుల విధుల్లో జోక్యం చేసుకుంటూ చికాకు కలిగిస్తున్నారన్న చర్చ ఉంది. వివిధ స్థాయిల్లోని అధికారులు కొందరు తమ సన్నిహితులతో బహిరంగంగానే చర్చిస్తున్నారు. ప్రధానంగా నగరంలో కాసులు కురిపించే ‘భూదందా’ల్లో మితిమీరిన జోక్యంపై ఆయా శాఖల అధికారులు నొచ్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న కొందరు ఏసీపీలు, ఎస్హెచ్ఓలపై సీపీ, డీజీపీల వరకు ఫిర్యాదులు వెళ్లాయన్న చర్చ జరుగుతోంది. కీలక ప్రజాప్రతినిధి, కుటుంబసభ్యుల అండదండలున్న ఓ ఏసీపీ తన పరిధిలోని ఠాణాలకు ఎస్హెచ్ఓలను రాకుండా జాగ్రత్త పడుతున్నారన్న ప్రచారం ఉంది. ఆ అధికారి పరిధి ఓ ఠాణా ఎస్హెచ్ఓ ఓ హోంగార్డుతోపాటు క్రైం హెడ్కానిస్టేబుళ్ల ద్వారా లావాదేవీలు జరుపుతున్నారన్న చర్చ బహిరంగంగా సాగుతోంది. కమిషనరేట్ పరిధిలోని మరో ఏసీపీ పెద్దమొత్తంలో డబ్బులు ముట్టజెప్పి పోస్టింగ్ పొందారన్న ప్రచారం పోలీసుశాఖలో హాట్టాపిక్గా మారింది. వరంగల్ నగరంలోని నాలుగు ఠాణాల్లో నిత్యం భూదందాలు, సెటిల్మెంట్లు జరుగుతున్నాయన్న ఫిర్యాదులు ఉన్నతాధికారుల వరకు వెళ్లగా.. ఓ ఠాణాలో 25 తులాలకుపైగా బంగారం రికవరీ కేసులో ‘ఖర్చు’ల కింద పెద్ద మొత్తంలో వసూలు చేయడంపై ఆరా తీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సిబ్బందిపై బూతు పురాణం.. ఫోన్ పే ద్వారా డబ్బుల స్వీకరణ.. ‘మీరేమన్న చేసుకోండి నాకింతివ్వండి’ అంటూ ఎస్సైలకు టార్గెట్ విధించారన్న ఆరోపణల్లో ముగ్గురు ఎస్హెచ్ఓలపైనా శాఖాపరమైన విచారణ చేపట్టినట్లు సమాచారం. గ్రేటర్ ఠాణాలపైనే అందరి గురి..గ్రేటర్ వరంగల్ కమిషనరేట్ పోలీస్టేషన్లలో పనిచేసేందుకు కొందరు అధికారులు.. త్వరలో జరిగే బదిలీల కోసం ఇప్పటి నుంచే ఖర్చీఫ్లు వేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులకు సన్ని హితులై ఉమ్మడి వరంగల్తో పాటు మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో పని చేస్తున్న వారు గ్రేటర్ వరంగల్ ఠాణాలపై గురి పెట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పని చేస్తున్న ఓ ఏసీపీ గ్రేటర్ పరిధిలో పోస్టింగ్ కోసం పొరుగు జిల్లాలోని ఓ సీనియర్ మంత్రితో స్థానిక ప్రజాప్రతినిధులకు సిఫారసు చేయించుకున్నట్లు తెలిసింది. వివిధ విభాగాల్లో పని చేస్తున్న కొందరు ఏసీపీలు సైతం ప్రధానమైన డివిజన్లపై గురిపెట్టినట్లు ప్రచారం జరుగుతుండగా, అందులో ఒక్కరిద్దరికి హామీ కూడా లభించినట్లు చెబుతున్నారు. కాగా హనుమకొండ, కేయూసీ, హసన్పర్తి, సుబేదారి, కాజీపేట, హసన్పర్తి, మట్టెవాడ.. నగరం చుట్టూ ఉన్న ధర్మసాగర్, ఆత్మకూరు, గీసుకొండ, వర్ధన్నపేట, ఎల్కతుర్తి తదితర ఠాణాల పోస్టింగ్లు పట్టేందుకు పోటాపోటీగా ఇన్స్పెక్టర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో కొన్ని ఠాణాలకు ఎస్హెచ్ఓలు చేరి ఏడాదైనా కాకపోయినప్పటికీ.. వివిధ కారణాలతో స్థానచలనం తప్పదన్న సమాచారంతో ఖర్చీఫ్లు వేసుకుంటుండడం పోలీసుశాఖలో చర్చనీయాంశంగా మారింది. -
సకాలంలో దుస్తులు కుట్టి ఇవ్వాలి
హన్మకొండ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సకాలంలో దుస్తులు కుట్టి ఇవ్వాలని హనుమకొండ డీఆర్ ఓ, మెప్మా పీడీ వైవీ.గణేశ్ అన్నారు. బుధవా రం కలెక్టరేట్లో పట్టణ పరిధి హనుమకొండ, కాజీపేట, పరకాల, హసన్పర్తి మండలాల్లోని 141 పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం స్టిచ్చింగ్ చేసే మహిళా సమాఖ్య సభ్యులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆయా స్కూళ్లలో చదువుతున్న 12 వేల మంది విద్యార్థులకు సంబంధించిన కొలతలు తీసుకొని సిద్ధంగా ఉండాలని, నిర్దేశించిన నమూనాలో నాణ్యంగా కుట్టి మే 31 వరకు ఇవ్వాలని చెప్పారు. ఈ సంవత్సరం నుంచి కుట్టు కూలి జతకు రూ.75 కేటాయించామన్నారు. జిల్లా విద్యాశాఖ కో–ఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి, మెప్మా జిల్లా బాధ్యులు రజిత, ఎంఈఓలు మనోజ్, నెహ్రూ, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు
డీఎంహెచ్ఓ అప్పయ్య ఎంజీఎం: వేసవిలో వడదెబ్బకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై సరైన జాగ్రత్తలు తీసుకోవాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య ప్రజలకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వేసవిలో వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అప్పయ్య మాట్లాడుతూ.. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని, వడదెబ్బకు గురవకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జరుగుతున్న ప్రదేశాల్లో ఓఆర్ఎస్ పాకెట్లు అందించేలా, షెడ్ నెట్ ఏర్పాటు చేయాలని సూచించారు. వడదెబ్బ తగలకుండా, తగిలితే తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కాజీపేట మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ.. బల్దియా కమిషనర్ ఆదేశాల మేరకు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల్లో భాగంగా నగరంలో ముఖ్యమైన 42 చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నగర పాలక సంస్థ పరిధిలో పనిచేసే కార్మికులకు వేసవి దష్ట్యా పనివేళల్లో మార్పు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఏడీ జీవీ.భానుప్రసాద్, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఇక్తేదార్ అహ్మద్, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి పాల్గొన్నారు. -
రాజ్యాంగ రక్షణకు ముందుకురావాలి
అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్ హన్మకొండ: కేంద్ర పాలకులు ప్రజావ్యతిరేక విధానాల ద్వారా భారత జాతిని, భారత రాజ్యాంగాన్ని, ప్రమాద పరిస్థితుల్లోకి తీసుకెళ్తున్నారు.. రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.. ప్రజాస్వామ్య వాదులంతా రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కే.వి.ఎల్. పిలుపునిచ్చారు. ‘రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. దేశాన్ని రక్షించుకుందాం’ అనే నినాదంతో బుధవారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద చేపట్టిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నాడు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, కమ్యూనిస్టులు, అభ్యుదయవాదులు, స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలు వృథా కాకూడదన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నేదునూరి రాజమౌళి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశంలో అంతరాలు పెరిగిపోతున్నాయని, పేదలు మరింత పేదలుగా మారుతున్నారన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి మేడిపల్లి శోభన్, నాయకులు దొమ్మాటి ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్, మంచాల రమాదేవి, వెంకటరాజం, సూర్యం, మద్దెల ఎల్లేశ్, నాగరాజు, పల్లేరు దామోదర్, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లేరు వీరస్వామి, ఉపాధ్యక్షుడు నిధి పాల్గొన్నారు. -
మంట వేడికి కోళ్లు మృత్యువాత
శాయంపేట : మండలంలోని ఆరెపల్లి శివారులో మొక్కజొన్న సొప్ప కాలుతూ పౌల్ట్రీ ఫామ్ పక్కకు అంటుకోగా ఆ మంట వేడికి లక్షలాది రూపాయల విలువైన కోళ్లు మృత్యువాత పడ్డాయి. పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన పరకాల రాజేందర్ ఆరెపల్లి గ్రామ శివారులో పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ ఫామ్ పక్కన గంగుల పులమ్మ వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిని శాయంపేటకు చెందిన దుంపల రాజిరెడ్డి కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేశాడు. పంట కోసిన తర్వాత ఎండిన సొప్పను మంగళవారం తగులబెట్టగా కాలుతూ పౌల్ట్రీ ఫామ్ పక్కకు అంటుకుంది. మంట వేడికి సుమారు 1,500 కోళ్లు మృత్యువాత పడ్డాయి. వీటి విలువ రూ.4లక్షల 50వేలు ఉంటుంది. ఈ ఘటనపై రాజేందర్.. రాజిరెడ్డిని పెద్దమనుషుల ద్వారా అడిగించగా.. ‘నా భూమిలో సొప్ప కాల్చుకున్నా.. మంట మీ దగ్గరకు వస్తే మీరే ఆర్పుకోవాలి.. నాకు సంబంధం లేదు’ అని సమాధానం ఇచ్చాడు. ఈ విషయంపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జక్కుల పరమేశ్ తెలిపారు. కాగా, రాజిరెడ్డికి తన చేనులోకి వెళ్లడానికి దారి లేదని, తాము కొన్నిసార్లు తమ పౌల్ట్రీ ఫామ్ నుంచి వెళ్లొద్దని చెప్పామని, దీంతో మనస్సులో పెట్టుకుని కావాలనే మక్క సొప్పను తగులబెట్టి కోళ్లు మృత్యువాత పడేలా చేశాడని రాజేందర్ ఆరోపించాడు. రూ. 4. 50 లక్షల నష్టం ఆరెపల్లి శివారులోని పౌల్ట్రీ ఫామ్లో ఘటన -
ఆర్టీసీ బస్సు బోల్తా..
హసన్పర్తి: హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిపై చింతగట్టు క్యాంప్ ఓఆర్ఆర్ వద్ద ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్తోపాటు ఆరుగురికి గాయాలయ్యాయి. పోలీ సుల కథనం ప్రకారం..ఆదిలాబాద్ డిపోనకు చెందిన లహరి ఏసీ డీలక్స్ ఆర్టీసీ బస్సు సోమవారం సాయంత్రం ఒంగోలు నుంచి ఆదిలాబాద్కు బయల్దేరి, హనుమకొండ బస్స్టేషన్కు చేరుకుంది. ప్ర యాణికులు ఎక్కిన అనంతరం మంగళవారం తెల్ల వారు జామున 3:15గంటల ఆదిలాబాద్కు బయల్దేరింది. 3.30గంటలకు చింతగట్టు క్యాంప్ సమీపంలోకి రాగానే, అదే సమయంలో మోటార్ గ్రేడర్ వాహనం అజాగ్రత్తగా రోడ్డుపై రివర్స్గా వచ్చి బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తా పడింది. ఒక్కసారి భారీ శబ్దం రావడంతో బస్సునుంచి మంటలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురై అరుపులు చేయగా, వాహనదారులు, స్థానికులు అక్కడికి చేరుకుని వారిని బయటికి తీశారు. ఏడుగురికి గాయాలు ఈ ప్రమాదంలో బస్సు, డ్రైవర్ వైపు బోల్తా పడింది. దీంతో నిద్ర మత్తులో ఉన్న ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడ్డారు. బస్సు డ్రైవర్ మారపల్లి సుభాష్చంద్రతో పాటు బత్తుల వెంకటేశ్, గంప శ్రీకాంత్, ఎండీ జాకీర్ హుస్సేన్, కోటేశ్వర్ రావు, ఎస్కే మోజీ, కళ్లెం రత్నంరాజు గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై శ్రీకాంత్ ఘటన స్థలాన్ని చేరుకున్నారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. బస్సు బోల్తా పడడంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు నిలిచిపోవడంతో సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఘటనకు కారకుడైన మోటార్ గ్రేడర్ డ్రైవర్ వినోద్సింగ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. డ్రైవర్తో పాటు ఆరుగురికి గాయాలు తెల్లవారు జామున ఘటన -
కబ్జా నిరూపిస్తే రాజీనామా చేస్తా
హన్మకొండ చౌరస్తా: తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడైనా ఒక్క గుంట భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండలోని జి ల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చి మ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డితో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేవునూరు గుట్టల అటవీభూమిలో తాను రెండు వేల ఎకరాలని ఓసారి, 50 ఎకరాలు కబ్జా చేశానని మరో సారి పల్లా రాజేశ్వర్రెడ్డి, తాటికొండ రాజయ్యలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాను కబ్జా చేసినట్లు సాక్ష్యాలు, ఆధారాలతో ప్రజల ముందుంచితే వారి ఇద్దరి ఇళ్లలో గులాం చేయడానికి సిద్ధమని, లేదంటే వారిద్దరు నా ఇంట్లో గులాంగా పని చేయాలని సవాల్ విసిరారు. ఆరోపణలు చేసిన నా యకులు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే న్యాయపరంగా చర్యలు వెనుకాడేది లేదని హెచ్చరించారు. వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాసరావు, ఈవీ శ్రీనివాసరావు, బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా అధ్యక్షుడు పెరుమాండ్ల రామకృష్ణ, బీసీ సెల్ జిల్లా చైర్మన్ బొమ్మతి విక్రమ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అజీజ్ఖాన్, పల్ల కొండ సతీశ్, నాయకులు పాల్గొన్నారు. పల్లా, తాటికొండలు క్షమాపణ చెప్పాలి ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
ఇండోర్ సబ్స్టేషన్ల నిర్మాణానికి ప్రణాళికలు
హన్మకొండ : పట్టణ ప్రాంతాల్లో సబ్ స్టేషన్ల ఏర్పాటుకు సరిపడా స్థలాలు లేవని, ఇండోర్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి పేర్కొన్నారు. హనుమకొండ, వరంగల్, కరీంనగర్లో ఇండోర్ సబ్ స్టేషన్ల నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరముందని ఆయన తెలిపారు. మంగళవారం నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో హనుమకొండ సర్కిల్(జిల్లా) అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డివిజన్, సెక్షన్ల వారీగా ప్రగతిని సమీక్షించారు. దేవునూరు, క్యాతంపల్లి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న 11 కేవీ లైన్ల వివరాలు అడిగి తెలుసుకుని, పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతీ పనిలో సాంకేతికను వినియోగించాలని సూచించారు. డ్రోన్ ద్వారా పోల్ టు పోల్ సర్వే చేయించి గుర్తించిన సమస్యను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. భవిష్యత్లో ఎక్కడైనా విద్యుత్ లైన్ వేసేందుకు అనుకూలం లేని ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ కేబుల్ వేస్తామని వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాలతో అంతరాయాలు ఏర్పడినప్పడు ఒక సబ్ స్టేషన్ నుంచి మరో సబ్ స్టేషన్కు విధిగా ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందించేలా చర్యలు తీసుకోవాలని వివరించారు. ట్రాన్స్ఫార్మర్ల ఫెయిల్యూర్లు కాకుండా విధిగా టాంగ్ టెస్టర్ రీడింగ్ తీసుకోవాలని, 60శాతం కంటే లోడ్ పెరిగే అవకాశం ఉన్న ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచాలన్నారు. జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యంగా డీఈలను (టెక్నికల్) సెఫ్టీ అధికారులుగా నియమించామన్నారు. సమావేశంలో ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్లాల్, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సీఈలు రాజు చౌహాన్, తిరుమల్ రావు, హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, ఎస్ఈలు, డీఈలు,ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు. ఉద్యోగుల భద్రతకు ప్రాధ్యాన్యం విద్యుత్ ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళా క్షేత్రంలో హనుమకొండ జిల్లాలోని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగులు, ఆర్టిజన్ సిబ్బందితో నేరుగా ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ఉద్యోగుల భద్రతకు పెద్దపీట వేసి సర్కిల్ కార్యాలయం టెక్నికల్ డీఈలను సేఫ్టీ అధికారులుగా నియమించినట్లు తెలిపారు. అదే విధంగా రూ.కోటి బీమా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. డ్రోన్ ద్వారా పోల్ సర్వే చేయాలి టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
అంకితభావంతో ఆర్టీసీ డ్రైవర్ల విధులు
హన్మకొండ: ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తూ ఆర్టీసీ డ్రైవర్లు అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్నారని వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను కొనియాడారు. మంగళవారం హనుమకొండలోని వరంగల్–1 డిపోలో జరిగిన కార్యక్రమంలో రీజియన్లో 2024 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో వృత్తిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రగతి చక్ర అవార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం విజయ భాను ముఖ్య అతిథిగా పాల్గొని రీజియన్లోని 9 డిపోలలో ఎంపిక చేసిన ఉత్తమ ఉద్యోగులకు జ్ఞాపిక, ప్రశంస పత్రం అందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ రద్దీలోనూ ఆర్టీసీ ఉద్యోగులు సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ఉత్తమ ఉద్యోగులను స్ఫూర్తిగా తీసుకుని మిగతా వారు పోటీ పడాలన్నారు. ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లాలని సూచించారు. మరింత ఆదాయం తీసుకురావాలన్నారు. ప్రయాణికుల పట్ల మర్యాదగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎంలు కేశరాజు భాను కిరణ్, మహేశ్, డిపో మేనేజర్లు, సూపర్ వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం విజయభాను -
ఉద్విగ్న క్షణాలు..
యువ వైద్యులు సేవాభావంతో ముందుకు సాగాలిఎంజీఎం : ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని వైద్య వృత్తిలోకి ప్రవేశిస్తున్న యువ వైద్యులు వృత్తిని సేవాభావంతో కొనసాగిస్తూ పేదలకు బాసటగా నిలవాలని కాళోజీ హెల్త్ వర్సిటీ వైస్ చాన్స్లర్ నందకుమార్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి కాకతీయ మెడికల్ కళాశాల 61 గ్రాడ్యుయేషన్ డే కనుల పండువగా నిర్వహించారు. విద్యార్థుల పట్టాల ప్రదానోత్సవానికి తల్లిదండ్రులతోపాటుబంధుమిత్రులు పెద్ద ఎత్తున రావడంతో కళాశాల ప్రాంగణమంతా పండుగ వాతావ రణం నెలకొంది. వైద్యవిద్యలో ఓ ఘట్టం పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ బంధుమిత్రులతో సెల్పీలు దిగుతూ సందడి చేశారు. 2019లో ఎంబీబీఎస్ అడ్మిషన్ పొందిన 230 మంది విద్యార్థులు ఈ సందర్భంగా పట్టాలు పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పరుగులు పెట్టాలి.. వైద్యవిద్యలో ఎంబీబీఎస్ మొదటి ఘట్టం మాత్రమేనని, వైద్యులు నిరంతర విద్యార్థులని వీసీ పేర్కొన్నారు. ఎంబీబీఎస్ అనంతరం తమ లక్ష్యాల మేరకు పోస్టు గ్రాడ్యుయేషన్ సాధించి ఉన్నత వైద్యులుగా ఎదగాలని ఆశించారు. ప్రస్తుతం వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పరుగులు పెడుతూ వైద్యవిద్యనభ్యసించాలని వర్సిటీ రిజిస్ట్రార్ సంధ్యాఅనిల్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కేఎంసీ ప్రిన్సిపాల్ రాంకుమార్రెడ్డి, రాజేశ్వరి, విజయలక్ష్మి, మధుసూదన్, మురళి, తదితరులు పాల్గొన్నారు. కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీ నందకుమార్రెడ్డి కేఎంసీలో విద్యార్థులకు పట్టాల ప్రదానోత్సవం -
బీఆర్ఎస్ రజతోత్సవ సభాస్థలి పరిశీలన
ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రం శివారు, చింతలపల్లి గ్రామ సమీపంలోని సుమారు 1200 ఎకరాల్లో ఈనెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, జిల్లా కార్యదర్శి దాస్యం వినయ్భాస్కర్, ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు వేర్వేరుగా సభా స్థలాన్ని పరిశీలించారు. సభా స్థలి ప్రాంగణంలో అక్కడడక్కడ కొంత వరిపంట కోతదశలో ఉన్నందున ఆ పాంత్రాన్ని బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. మిగతా స్థల ప్రాంగణం పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. మరో వారం రోజుల్లో సభా స్థలం పనులు పూర్తి కానున్నాయని అంచనా వేశారు. నాయకులు పిట్టల మహేందర్, కడారి రాజు, తంగెడ నగేశ్, డుకిరె రాజేశ్వర్రావు తదితరులు ఉన్నారు. దూరవిద్య ఎమ్మెస్సీ సైకాలజీ పరీక్షలు వాయిదా కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరి ధిలోని దూరవిద్య కేంద్రం ఎమ్మెస్సీ సైకాలజీ ఫైనలియర్ విద్యార్థులు, ఎక్స్ అభ్యర్థులకు థియరీ, ప్రాక్టికల్స్, డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్ పరీక్షలు ఈనెల 24 నుంచి నిర్వహించాల్సిండగా ఆయా పరీక్షలు వాయిదావేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మళ్లీ ఆయా పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తర్వాత వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. యాంటీ బయాటిక్స్తో పశువులకు ముప్పు ● కేవీకే శాస్త్రవేత్త రాజన్న మామునూరు: అధిక పాల దిగుబడి కోసం విచక్షణారహితంగా యాంటీ బయాటిక్స్ వినియోగిస్తే పశువులు, ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిళ్లుతుందని మామునూరు కేవీకే సీనియర్ శాస్త్రవేత్త, కోఆర్డి నేటర్ రాజన్న అన్నారు. ఖిలా వరంగల్ మండలం మామునూరు పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వ విద్యాలయంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కేవీకే, సద్గురు మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ‘యాంటీ మెక్రోబియల్ నిరోధకత– పరిష్కారాలు’ అనే అంశంపై పాడి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం డాక్టర్ వంశీకృష్ణ యాంటీ బయాటిక్స్ వినియోగం, వాటి మోతాదు, ఎక్కువ వాడితే కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. అంతకు ముందు పశువుల పాకల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, షెడ్డు నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన విషయాలపై డాక్టర్ అమృత్కుమార్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వరప్రసాద్, కై లాశ్, సాయికిరణ్, శాస్త్రవేత్తలు, పాడి రైతులు పాల్గొన్నారు -
‘యూత్ పార్లమెంట్’లో కేయూ విద్యార్థిని ప్రతిభ
కేయూ క్యాంపస్ : ఢిల్లీలోని పార్లమెంట్లో ఈనెల 1నుంచి 3వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ యూత్ పార్లమెంట్ వన్ నేషన్, వన్ ఎలక్షన్పై కేయూ బయోటెక్నాలజీ ఫైనలియర్ విద్యార్థిని శ్రీజాజాదవ్ పాల్గొని అనర్గలంగా ప్రసంగించారు. ‘ట్రాన్సిషనల్ మోడల్స్ ఇంప్లిమెంటేషన్ మార్గాలు’ అనే అంశంపై ప్రసంగించి ప్రతిభ చాటారు. మంగళవారం శ్రీజాజాదవ్ కాకతీయ యూనివర్సిటీకి రాగా ఆమెకు విద్యార్థులు, కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రాధిక, పలువురు అధ్యాపకులు మొదటిగేట్వద్ద స్వాగతం పలికి బయోటెక్నాలజీ విభాగం వరకు ర్యాలీ నిర్వహించారు. గజమాలతో సన్మానించారు. అనంతరం వీసీ కె. ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం.. శ్రీజాజాదవ్ను పరిపాలనాభవనంలో అభినందించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్, వైస్ ప్రిన్సిపాల్ కె. మమత, బయోటెక్నాలజీ విభాగం అధ్యాపకులు టి.శాసి్త్ర, శ్రీనివాస్, కేయూఅభివృద్ధి అధికారి వాసుదేవరెడ్డి, ఆర్ట్స్కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ, తదితరులు పాల్గొన్నారు. అభినందించిన వీసీ, రిజిస్ట్రార్ -
అదుపు తప్పి ఆటో బోల్తా..
● ముగ్గురు విద్యార్థులు, రౖడైవర్కు తీవ్ర గాయాలు ● కాచికల్ శివారులో ఘటన నెల్లికుదురు: విద్యార్థులను తీసుకెళ్తున్న ఓ ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కాచికల్ శివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని ఎర్రబెల్లిగూడెం గ్రామానికి చెందిన 14 మంది విద్యార్థులు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో చదువుకుంటున్నారు. గతంలో తొర్రూరు నుంచి నెక్కొండ వరకు వయా కాచికల్, ఎర్రబెల్లిగూడెం, మేచరాజుపల్లి, బూర్గుమళ్ల, కల్లెడ, పర్వతగిరి మీదుగా నడిచిన ఆర్టీసీ బస్సులు ప్రస్తుతం రద్దు అయ్యాయి. దీంతో ఆర్టీసీ బస్సులు లేని కారణంగా తల్లిదండ్రులు ప్రైవేట్ వాహనాల్లో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పాఠశాలకు ఆటోలో వెళ్లిన విద్యార్థులు మధ్యాహ్నం తిరిగి అదే ఆటోలో ఇంటికి వెళ్తున్నారు. ఆటో కాచికల్ శివారులోని ప్రధాన రహదారిపై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు ముద్రాల అక్షిత్, యాటగాని హర్షిత్, సాయి చరణ్తో పాటు ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఆర్టీసీ బస్సులు పునరుద్ధరించి ఇలాంటి ప్రమాదాలను నివారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
20నుంచి ‘ఓపెన్’ పరీక్షలు
విద్యారణ్యపురి : జిల్లా వ్యాప్తంగా ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలు ఈనెల 20నుంచి 26వ తేదీవరకు జరగనున్నాయి. ఈ మేరకు పరీక్షలపై మంగళవారం డీఆర్ఓ గణేశ్.. డీఈఓ వాసంతి, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అనగోని సదానందం పాటు వివిధ శాఖల అధికారులు, డీఐఈఓ తదితరులతో సమీక్షించారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2:30నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు రెండు విడతల్లో జరుగుతాయని కోఆర్డినేటర్ పేర్కొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కాజీపేట అర్బన్ : హనుమకొండ జిల్లాలోని బీసీ, ఈబీసీ విద్యార్థుల నుంచి మహాత్మా జ్యోతిరావు పూలే విదేశీ విద్యానిధి బీసీ ఓవర్సీస్ పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ వెల్ఫేర్ డీడీ రామ్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 30వ తేదీలోపు www.telangana epass.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికవరంగల్ స్పోర్ట్స్ : సికింద్రాబాద్లోని లాలాపేట మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 11, 12 తేదీల్లో జరిగే అండర్–19 రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారులను మంగళవారం ఎంపిక చేశారు. బి.నితిన్ 50 కేజీల కేటగిరీలో, ఎన్.రాజర్శి 80 కేజీలు, జి.భరత్ 65 కేజీల విభాగాల్లో ఎంపికై నట్లు కార్యదర్శి పోతరాజు రాజేందర్ తెలిపారు. ‘కై టెక్స్’లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ షురూ..గీసుకొండ: వరంగల్ జిల్లాలోని గీసుకొండ–సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు(కేఎంటీపీ)లో కేరళకు చెందిన చిన్న పిల్లల దుస్తుల తయారీ కై టెక్స్ కంపెనీ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఈ మేరకు 25,500 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లు, ఇన్చార్జ్లు తదితర విభాగాల్లోని ఉద్యోగాలను భర్తీచేయనుంది. రెండు రోజుల నుంచి పలువురు నిరుద్యోగులు కంపెనీ వద్దకు వచ్చి తమ బయోడేటాలు అధికారులకు సమర్పిస్తున్నారు. -
పరిశ్రమల స్థాపనతోనే ఆర్థిక ప్రగతి
వరంగల్: పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థిక ప్రగతి సాధ్యమని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ (డీఐపీసీ) సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో టీజీఐపాస్ కింద వివిధ శాఖలకు సంబంధించి పరిశ్రమలు నెలకొల్పేందుకు 1,365 యూనిట్ల మంజూరుకు ప్రతిపాదనలు చేయగా.. 1,076 దరఖాస్తులకు అనుమతి మంజూరు చేసినట్లు తెలిపారు. 180 ప్రతిపాదనలు అసంపూర్తిగా ఉన్నందున తిరస్కరించామని, పూర్తి సమాచారంతో తిరిగి సమర్పించాలని కోరినట్లు పేర్కొన్నారు. సమావేశంలో పరిశ్రమలశాఖ జీఎం రమేశ్, లీడ్ బ్యాంకు మేనేజర్, జిల్లా రవాణా శాఖ అధికారి శోభన్ బాబు, అధికారులు పాల్గొన్నారు. 15 వరకు ఇంటర్న్షిప్ రెండో దశ దరఖాస్తుకు గడువు భారత ప్రభుత్వం, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం రెండో దశ దరఖాస్తుల గడువును ఈనెల 15 వరకు పొడిగించినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఇప్పటికే దాదాపు మూడు లక్షల పైగా దరఖాస్తులు సమర్పించారని తెలిపారు. సాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 11 6090ను సంప్రదించాలని ఆమె కోరారు. సహకార శాఖ అభివృద్ధిపై సమావేశం.. జిల్లా సహకార శాఖ అభివృద్ధి, జన ఔషధిపై కలెక్టర్ సత్యశారద అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. డీసీఓ నీరజ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, మత్స్యశాఖ అధికారి నాగమణి తదితరులు పాల్గొన్నారు. పోషణ పక్షం వాల్పోస్టర్ ఆవిష్కరణ.. కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో మంగళవారం పోషణ పక్షం వాల్పోస్టర్ను కలెక్టర్ సత్యశారద, అధికారులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోషణ్ అభియాన్లో భాగంగా ఈనెల 8 నుంచి 22 వరకు పోషణ పక్షం నిర్వహించనున్నట్లు తెలిపారు. -
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితం
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య హసన్పర్తి : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక, మొరం అందజేస్తామని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇంటి నిర్మాణాలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. ఇందిరమ్మ పైలెట్ ప్రాజెక్ట్ కింద పెంబర్తి గ్రామంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ మంగళవారంపరిశీలించారు. మండల పరిధిలో ఉంటే తహసీల్దార్, పక్క మండలంలో ఉంటే ఆర్డీఓ ద్వారా ఇసుక కూపన్లు అందజేస్తామన్నారు. అనంతరం గ్రామంలోని రేషన్షాపును కలెక్టర్ తనిఖీ చేసి, సన్న బియ్యం పంపిణీ తీరును పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ చల్లా ప్రసాద్, ఎంపీడీఓ కర్ణాకర్ రెడ్డి, హౌజింగ్ పీడీ రవీందర్ నాయక్, డీఈఈ సిద్ధార్థ నాయక్, గ్రామ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, హౌజింగ్ ఏఈ నరేందర్ రాజ్, మాజీ సర్పంచ్ పూల, కారోబార్ సదానందం పాల్గొన్నారు. ఆసరా మార్ట్ ప్రారంభం హసన్పర్తి మండలం వంగపహాడ్లో మహిళా సంఘం సభ్యుల కోసం ఏర్పాటుచేసిన ఆసరా మార్ట్ను కలెక్టర్ ప్రారంభించారు. ఓమిని మార్ట్ కేంద్ర ప్రభుత్వ ఆర్గనైజ్ సంస్థ సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు. మహిళలు మార్ట్ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మేన శ్రీను, జీఎం ఇండస్ట్రీస్ నవీన్కుమార్, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి బాలరాజు, డీడబ్ల్యూఓ జయంతి, ఓమిని మార్ట్ ఎండీ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. 1నుంచి సమ్మర్ కోచింగ్ క్యాంపులుహన్మకొండ అర్బన్ : మే 1నుంచి జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలో సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, విజయవంతం చేసేందుకు సహకరించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణపై సంబంధిత అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మే 1నుంచి 31వరకు పలు రకాల క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారు ఈ నెల 9 (బుధవారం) నుంచి 25వ తేదీవరకు తమ పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. మొత్తం 22 అంశాల్లో శిక్షణ ఇస్తున్నామని ఎక్కువ మంది సద్వినియోగం చేసుకునే విధంగా క్రీడా సంఘాలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అజీజ్ఖాన్, జిల్లా క్రీడలు, యువజన శాఖ అధికారి గుగులోత్ అశోక్ మాట్లాడుతూ అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్ బాల్, బ్యాడ్మింటిన్, వాలీబాల్, బాస్కెట్ బాల్, రెజ్లింగ్, కబడ్డీ, క్రికెట్, లాన్టెన్నీస్, సాఫ్ట్బాల్, హాకీ, ఖోఖో, బాల్ బ్యాడ్మింటిన్ తదితర క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 4వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చని వివరించారు. డీఆర్ఓ వైవీ గణేశ్, డీఈఓ వాసంతి, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, క్రీడా అసోసియేషన్ల ప్రతినిధులు శ్యామల పవన్కుమార్, మహ్మద్ కరీం, పింగిళి రమేశ్ రెడ్డి, తోట శ్యాంప్రసాద్ తదితరులు ఉన్నారు. -
బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోuముందే హెచ్చరించిన సాక్షి ఐపీఎల్ సీజన్ ప్రారంభసమయంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొదలైన బెట్టింగ్ తీరుపై సాక్షి ప్రత్యేక కథనం ప్రచురించింది. యువత ఏ యాప్లను వాడుతున్నారు.. బెట్టింగ్ జరుగుతున్న తీరు, యువత నష్టపోతున్న వైనంపై సవివరంగా పేర్కొంది. దీంతో పోలీసులు సైతం అప్రమత్తమై బెట్టింగ్రాయుళ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నెల 4వ తేదీన వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రంలో ఐపీఎల్ టీ–20 మ్యాచ్ల బెట్టింగ్ క్యాంపుపై టాస్క్ఫోర్స్ మెరుపుదాడి చేసింది. నలుగురు నిందితులనుంచి రూ.10,500, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 5వ తేదీన కాజీపేటలోని వివిధ ప్రాంతాలకు చెందిన కొంతమంది ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నట్లు అందిన సమాచారం మేరకు దాడి చేసి గోదాగు శ్రీనివాస్, గొడుగు రమేశ్, సముద్రాల శ్రీనివాస్, బోకరి సంతోశ్ను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.20 వేల నగదుతో పాటు నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 5న వరంగల్ కరీమాబాద్లోని ఓ ఇంటి ఆవరణలో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్నారనే సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి కరీంనగర్కు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి రూ.20వేల నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 5న హనుమకొండ పీఎస్ పరిధిలో ఇటీవల పట్టుకున్న క్రికెట్ బెట్టింగ్ ఏజెంట్ హైదరాబాద్కు చెందిన చింతపండు కృష్ణ, మేడిశెట్టి నరేశ్తోపాటు ఆటగాళ్లు పులి ఓంకార్, పల్లపు సుకేశ్ను అరెస్ట్ చేసి వారినుంచి రూ. 1.58 లక్షలు రికవరీ చేశారు. క్రికెట్ బుకీ అయిన కాకినాడకు చెందిన గడ్డం వీరమణి కుమార్ను అదుపులోకి తీసుకుని రూ.1.50 లక్షల నగదు, 2 సెల్ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జోరుగా ‘ఐపీఎల్’ జూదం ...వారం రోజుల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్రాయుళ్లపై పోలీసులు, టాస్క్ఫోర్స్ విసిరిన పంజా ఇది. ఐపీఎల్ సీజన్ మొదలైనప్పటినుంచి ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో బెట్టింగ్ జడలు విప్పింది.పోలీసులు సైతం బెట్టింగ్లను కట్టడి చేసేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టారు., ఇందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోవడంతో పాటు, టాస్క్ఫోర్స్, ఇతర ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగడంతో ఉక్కుపాదం మోపుతున్నారు. కానీ వెలుగులోకిరాని ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. దొరికిన బెట్టింగ్ రాయుళ్ల అకౌంట్లలో నగదు లావాదేవీల లెక్క తేల్చే పనిలో ఉన్నారు. – వరంగల్ క్రైం● ఈ సీజన్లో నాలుగు కేసులు నమోదు ●● ముందే అప్రమత్తం చేసిన ‘సాక్షి’ ● వెలుగులోకి రాని ఎన్నో ఘటనలు ●● ఆంధ్రప్రదేశ్కు చెందిన బుకీ అరెస్ట్ ● అతని అకౌంట్లలో భారీగా లావాదేవీలుబెట్టింగ్లపై కఠినంగా వ్యవహరిస్తాం.. ఎవరైనా క్రికెట్, ఇతర బెట్టింగ్లకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠినంగా వ్యవహరిస్తాం. ఈ భూతాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. సులభంగా వచ్చే డబ్బు వల్ల మంచికంటే చెడు ఎక్కువ చేస్తుంది. దీని మోజులో పడి యువత తమ బంగారు భవిష్యత్ను అంధకారం చేసుకోవద్దు. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడినట్లుగా తెలిస్తే తక్షణమే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలి. వివరాలు గోప్యంగా ఉంచుతాం. – సన్ ప్రీత్ సింగ్, వరంగల్ పోలీస్ కమిషనర్ సులభంగా డబ్బు సంపాదించాలనే..‘సాక్షి’లో ప్రచురితమైన కథనంసులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో కొంతమంది యువత క్రికెట్ బెట్టింగ్ను ఎంచుకుంటున్నారు. యాప్ల మోజులో పడిలో బంగారు భవిష్యత్ను అంధకారం చేసుకోవడమే కాకుండా ఆప్పుల పాలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతోపాటు, సోషల్ మీడియా సైతం యువతకు మరింత చేరువ కావడంతో మోసపూరితమైన ప్రకటనలు, సందేశాలకు యువత ఆకర్షితులవుతున్నారు. ఇంటి సభ్యులకు తెలియకుండా వీటిలో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా నష్టపోవడంతోపాటు యువత బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ సీజన్లో ఇప్పటివరకు బెట్టింగ్కు పాల్పడుతున్న నాలుగు కేసుల్లో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వీరి బ్యాంక్ ఖాతాల్లో సుమారు రూ.42,68,300 వరకు లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. తొలిసారిగా క్రికెట్ బెట్టింగ్ బుకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడకు చెందిన వీరమణికుమార్ను అరెస్టు చేసి, అతని బ్యాంక్ ఖాతాల్లో సుమారు రూ.3.50 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. వీటి లెక్క తేలాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ సీజన్లో నాలుగు కేసులు..u -
పౌరులెవరో.. అటెండర్లు ఎవరో?
వరంగల్ అర్బన్ : బల్దియా ప్రధాన కార్యాలయానికి వస్తే పౌరులెవరో...అటెండర్లు ఎవరో అర్థం కాని పరిస్థితి ఉందని నగర మేయర్ గుండు సుధారాణి అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో ఆమె అకస్మికంగా తనిఖీలు చేశారు. అటెండర్లు అందరూ డ్రెస్ కోడ్ పాటించాలని ఆదేశించారు. ఒక్కో చాంబర్కు ఇద్దరు, ముగ్గురు చొప్పన విధులు నిర్వహిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అంతర్గత బదిలీలు చేయాలన్నారు. పౌరసేవ కేంద్రంలో ఎల్ఆర్ఎస్, యువ వికాసం, తదితర ఫిర్యాదులు, వాటి నివృత్తి చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున క్యూలో నిల్చున్నారు. గమనించిన మేయర్ ఆ హెల్ప్డెస్క్ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. అకౌంట్స్ సెక్షన్లో ఇటీవల కొంతమంది ఉద్యోగులు విధుల్లో చేరినందున వారికి శిక్షణ ఇప్పించి, సేవలను వినియోగించుకోవాలన్నారు. పబ్లిక్ హెల్త్, సీ 1 సెక్షన్, పింఛన్ సెక్షన్లను పరిశీలించారు. ఇన్వార్డ్, కంట్రోల్ రూమ్, జనన మరణ ధ్రువీకరణ విభాగాలను తనిఖీ చేసి జాబ్ నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఇష్టారాజ్యంగా వాహనాల పార్కింగ్ పట్ల మేయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. క్యాంటిన్ వైపు మాత్రమే పార్కింగ్ చేయాలన్నారు. బల్దియా పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ప్రజారోగ్యం అధికారిని ఆదేశించారు. కౌన్సిల్ హాల్ పునరుద్ధరణ, నవీకరణ పనులను మేయర్ పరిశీలించారు. తనిఖీల్లో అడినషల్ కమిషనర్ జోనా, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, ఎంహెచ్ఓ రాజేష్, హెచ్ఓలు రమేష్, లక్ష్మారెడ్డి, జేఏఓ జగదీశ్వరి, సూపరింటెండెంట్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అటెండర్లు డ్రెస్ కోడ్ పాటించాల్సిందే మేయర్ గుండు సుధారాణి ఆదేశం బల్దియా ప్రధాన కార్యాలయంలో అకస్మిక తనిఖీలు -
అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి
హన్మకొండ చౌరస్తా: అభివృద్ధే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం నడుస్తోందని, అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి కోరారు. హనుమకొండ 5వ డివిజన్ పరిధిలోని కొత్తూరు బ్రిడ్జి వద్ద రూ.25 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశలవారీగా అన్ని డివిజన్లలో సైడ్ డ్రెయినేజీలు, సీసీ రోడ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. త్వరలో అర్హులందరికీ రేషన్కార్డులు, డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి ప్రభుత్వం సన్నద్ధం అవుతోందన్నారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, స్థానిక కార్పొరేటర్ పోతుల శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి -
ఎర్త్ సైన్సెస్ వర్సిటీగా కొత్తగూడెం ఇంజనీరింగ్ కాలేజీ
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కొత్తగూడెం మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీని ఎర్త్సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఉత్తర్వులు జారీ చేశారు. సహజవనరులు పుష్కలంగా ఉన్న ఈ ప్రాంతంలో వర్సిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా వర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీనిని అమలులోకి తీసుకొస్తూ ఎర్త్సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ పేరుతో జీఓ జారీ అయ్యింది. ఇందుకు అనుగుణంగా తెలంగాణ యూనివర్సిటీల చట్టం 1991కు సవరణ చేసింది.దీంతో కొత్తగూడెం ప్రాంతవాసులు, విద్యార్థులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేయూ నుంచి బోధన, బోధనేతర, ఆస్తుల బదలాయింపు! కొత్తగూడెంలో 1978లో స్కూల్ఆఫ్మైన్స్ ఓయూ పరిధిలోని పీజీ సెంటర్గా ఏర్పాటు అయింది. కాకతీయ యూనివర్సిటీ ఏర్పాటైన అనంతరం 1996 నుంచి కొత్తగూడెం స్కూల్ ఆఫ్మైన్స్ కేయూ పరిధిలోకి కొత్తగూడెం మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీగా ఆవిర్భవించింది. అప్గ్రేడ్ నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో బోధన, బోధనేతర పోస్టులతో సహా ప్రస్తుతం ఉన్న ఆ కాలేజీ ఆస్తులు కూడా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి బదలాయింపు జరగబోతుంది. ఇంజనీరింగ్కాలేజీలో 41అధ్యాపకుల పోస్టులకుగాను ప్రస్తుతం 16మంది పనిచేస్తున్నారు. పలువురు కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు.అధ్యాపకుల కొరత ఉంది. 106 నాన్టీచింగ్పోస్టులు ఉంటే 60 మంది వరకు పనిచేస్తున్నారు. వర్సిటీగా అప్గ్రేడ్తో పోస్టులు పెరిగే అవకాశాలున్నాయి. ఆ నలుగురి డిప్యుటేషన్లు రద్దువుతాయా? కాకతీయ యూనిర్సిటీ పరిధిలోని కొత్తగూడెం మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీలో గతంలో నియామకమై అక్కడ కొంత కాలం పనిచేసి కేయూలోని ఇంజనీరింగ్ కళాశాలలకు డిప్యుటేషన్పై వచ్చిన వారిలో ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు భిక్షాలు, వెంకటరమణ, ఇద్దరు అ సిస్టెంట్ ప్రొఫెసర్లు రాధిక, సుమలత ఉన్నా రు. ఇప్పుడు కొత్తగూడెం మైనింగ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ అయిన నేపథ్యంలో వీరి డిప్యుటేషన్లు రద్దవుతాయా అనే అంశం చర్చగా మారింది. ఎందుకంటే వారి పోస్టులు అక్కడే. అందుకే ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి బదలాయింపు జరగనున్న నేపథ్యంలో వీరు అక్కడికి వెళ్లాల్సింటుందనే అంశం యూనివర్సిటీలో చర్చగా ఉంది. లేదా వారికి ఏమైనా ఆప్షన్ ఇస్తారా లేదా వేచి చూడాల్సిందే. అప్గ్రేడ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కేయూ నుంచి విడిపోనున్న కళాశాల బోధన, బోధనేతర పోస్టులు, ఆస్తుల బదలాయింపు కూడా.. ఆ నలుగురి అధ్యాపకుల డిప్యుటేషన్లు రద్దయ్యే అవకాశం? -
స్మార్ట్ సిటీ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి ఆరా
● వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు ● గడువు పొడిగింపు స్పష్టత లేదు వరంగల్ అర్బన్: కేంద్ర హౌసింగ్–అర్బన్ ఎఫైర్స్ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ గ్రేటర్ వరంగల్లో కొనసాగుతున్న స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల పురోగతిపై ఆరా తీశారు. సోమవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తదితరులు పాల్గొన్నారు. వరంగల్ స్మార్ట్సిటీ కింద చేపట్టిన ప్రాజెక్టులు, పూర్తయిన పనులు, పురోగతిలో ఉన్న వాటిని అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. చాలా మేరకు పనులు పూర్తయ్యాయని, మరికొన్ని పనులు పురోగతిలో ఉన్నట్లు కమిషనర్ వెల్లడించారు. పురోగతిలో ఉన్న పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు. స్మార్ట్సిటీ ప్రాజెక్ట్ గడువు గత నెల 31తో ముగిసింది. కానీ మళ్లీ గడువు పొడిగింపుపై ఎలాంటి ప్రకటన చేయలేదని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈ ప్రవీణ్చంద్ర, స్మార్ట్ సిటీ పీఎం సి.భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. చెత్త తరలించే వాహనాల అడ్డగింత మడికొండ: మడికొండ – రాంపూర్ గ్రామాల మధ్య ఉ న్న డంపింగ్ యార్డుతో సు మారు చుట్టుపక్కల ఉన్న పది గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అడ్హక్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈమేరకు డంపింగ్ యార్డ్ను అక్కడ నుంచి తొలగించాలని కోరుతూ 64వ డివిజన్ కార్పొరేటర్ ఆవాల రాధికరెడ్డి ఆధ్వర్యంలో డంపింగ్ యార్డుకు వస్తున్న వాహనాలను మడికొండ చౌరస్తాలో సోమవారం అడ్డుకున్నారు. దాంతో ట్రాఫిక్ స్తంభించగా, ఇన్స్పెక్టర్ కిషన్.. తన సిబ్బందితో అక్కడకు చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని పోలీసు స్టేసన్కు తరలించారు. కార్పొరేటర్ రాధికారెడ్డి మాట్లాడుతూ డంపింగ్ యార్డ్తో పలు గ్రామాల ప్రజలు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారన్నారు. గడ్డం మహేందర్, పల్లపు యాదగిరి, నర్సింగరావు, బుర్ర రాజ్కుమార్, తండా శంకర్, కట్ట వెంకట్రాంనర్సయ్య, ఆవాల నరోత్తంరెడ్డి, బరిగల కృష్ణమూర్తి, బోగి దేవేందర్, గడ్డం అశోక్, అరూరి తిరుపతి, మాచర్ల శ్రీధర్, బత్తి కిరణ్, వెన్నమల్ల రమేశ్, గడ్డం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
స్వరూపకు న్యాయం జరిగేదెప్పుడో..?
సాక్షి, వరంగల్: అడవుల్లో తుపాకీ పట్టి ఆ తరువాత జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టు.. తనకు లొంగుబాటు సమయంలో ప్రకటించిన పునరావాస ఫలాల కోసం అధికారుల చుట్టూ 13 ఏళ్లుగా ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుత సిద్దిపేట జిల్లా చేర్యాల (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా) మండలం కొమురవెల్లి గ్రామానికి చెందిన పాశం స్వరూప అడవిలో దాదాపు తొమ్మిదేళ్లు కరీంనగర్, నిజామాబాద్, ఆది లాబాద్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో చివరగా సి రొంచ కమాండర్గా పనిచేస్తూ 2012లో పోలీసుల కు లొంగిపోయింది. ఆ సమయంలో పునరావాసం కింద 500 గజాల ఇంటిస్థలం, ఐదెకరాల వ్యవసా య భూమి ఇస్తామని పోలీసు అధికారులు ప్రకటించారు. రెవెన్యూ భూమి కేటాయించి నివేదిక సైతం ఇచ్చారు. కానీ అలాట్మెంట్ చేయలేదు. ఆమె కు టుంబపోషణ కోసం కొమురవెల్లి దేవస్థానం ప్రాంగణంలో కట్టెలు, పూలు అమ్ముకుంటూనే, జనజీవ న స్రవంతిలో తనకు ప్రభుత్వం పునరావాసం కింద ఇస్తానన్న భూమి కోసం ఇంకా పోరాటం సాగి స్తూనే ఉంది. ఈ క్రమంలో వరంగల్ కలెక్టరేట్లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ సెల్కు వచ్చి మరోసారి కలెక్టర్ సత్యశారదకు తన బాధను ఏకరువు పెట్టుకున్నారు. అప్పటి ఉమ్మడి వరంగల్ కలెక్టరేట్ అధికారులు 2012 జూన్ తొమ్మిదిన ఇచ్చిన ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకొని న్యాయం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆమెను ‘సాక్షి’పలకరించగా తన సమస్యను చెప్పుకుంది. ‘అప్పటి చేర్యాల తహసీల్దార్ వెంకటేశ్వర్లు కొమురవెల్లి గ్రామంలో సర్వే నంబర్లు 199, 223లో ప్రభుత్వ భూమి ఉందని 500 గజాల స్థలం కేటాయించారు. ఐదెకరాల వ్యవసాయ భూమి విషయంలోనూ నివేదికిచ్చారు. 2012 నుంచి 2016 వరకు అధికారుల చుట్టూ తిరిగా. మధ్యలో కాలి బుల్లెట్ గాయం తిరగదోడడంతో కొన్ని నెలలు విశ్రాంతి తీసుకున్నా. ఇప్పటికే సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లా. అక్కడా పోలీసులను కలిశా. వారు వరంగల్కు వెళ్లాలని చెబితే మూడు నెలల నుంచి ఇక్కడి ఐదుసార్లు వచ్చా. మూడుమార్లు పోలీసులను కలిశా. రెండుసార్లు వరంగల్ కలెక్టర్ను కలిశా. ఇప్పటికై నా సంబంధిత పత్రాలు నాకు ఇచ్చి భూమి కేటాయించి నా కుటుంబానికి భరోసాను ఇవ్వాలి’అని స్వరూప కన్నీటి పర్యంతమయ్యారు. 13 ఏళ్లుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు తొమ్మిదేళ్లు సీపీఐఎంఎల్ మావోయిస్టుగా కార్యకలాపాలు 2012లోనే లొంగుబాటు, పునరావాసం కింద అందని సహాయం -
రక్తనిధి.. హతవిధీ!
ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రికి నిత్యం ప్రాణాపాయ స్థితిలో వచ్చేవారు అనేకం. రోగులకు వైద్య సేవలందించడంలో రక్తనిధి పాత్ర కీలకం. అలాంటి బ్లడ్ బ్యాంక్ నిర్వహణను నిర్వాహకులు, ఎంజీఎం పరిపాలనాధికారులు గాలికి వదిలేశారు. పేదలకు రక్తం అందించేందుకు వచ్చిన దాతలకు కనీస సౌకర్యాలు అందడం లేదు. రక్త నిధి కేంద్రాన్ని పర్యవేక్షించే అధికారులు వివిధ పనులంటూ ఎప్పుడు.. ఎక్కడికి వెళ్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. రక్త నిధి కేంద్రంలో ఎన్ని నిల్వలున్నాయి? రిజర్వ్ చేసిన బ్లడ్ ఎంత? సమాచారం తెలుసుకునేందుకు బ్లడ్ బ్యాంక్ నంబర్ సైతం కొన్నేళ్ల నుంచి పనిచేయడం లేదు. ఈక్రమంలో ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఏకంగా 55సార్లు రక్తదానం చేసిన వ్యక్తి ఎంజీఎం రక్త నిధి కేంద్రానికి సౌకర్యాలు కల్పించాలంటూ సోమవారం గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన రక్త నిధికేంద్ర నిర్వహణ పనితీరుకు నిదర్శనంగా చెప్పొచ్చు. పని చేయని ఫోన్ నంబర్ ఎంజీఎం ఆస్పత్రిలో రక్త నిల్వల కోసం ప్రభుత్వం ఎంజీఎం సూపరిండెంట్ కోసం అధికారికంగా ఎలాగైతే నంబర్ కేటాయించారో.. సేవల్లో కీలకంగా ఉండే రక్త నిధి కేంద్రానికి సైతం 94906 1947 అనే నంబర్ను కేటాయించారు. ఈనంబర్ను ఉపయోగిస్తే విధులను కచ్చితంగా నిర్వర్తించాల్సి వస్తుందని తెలిసి కొన్నేళ్లుగా ఈ నంబర్ను వాడకుండా వదిలివేసినట్లు తెలుస్తోంది.కలెక్టర్కు ఫిర్యాదు చేశాం.. నేను ఇప్పటి వరకు 55 సార్లు రక్తదానం చేశా. 2017లో అప్పటి ఆర్ఎంఓకు బెడ్స్ గురించి తెలుపగా నామమాత్రంగా మరమ్మతులు చేశారు. ప్రస్తుతం రక్త నిధి కేంద్రానికి దాతలను తీసుకొస్తే చిరిగిపోయిన బెడ్స్ ఉన్నాయని, నిర్వహణ సరిగ్గా లేదని రక్తం ఇచ్చేందుకు వెనుకడుడు వేస్తున్నారు. ఎంజీఎం అఽధికారులకు తెలిపినా స్పందన లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజావాణిలో కలెక్టర్ ఫిర్యాదు చేశాం. – అయిత ఉషాభాస్కర్రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చేవారికి అండగా నిలవాలి. కానీ వారికి కనీస అవసరాలను కూడా అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కనీనం రక్తం సేకరించే క్రమంలో దాతలు పడుకునే బెడ్స్ను సైతం సమకూర్చలేని దుస్థితి ఎంజీఎంలో నెలకొంది. కాగా.. సమస్యలపై ఆస్పత్రి నిర్వాహకులు, అధికారులను ప్రశ్నిస్తే అన్నింటికీ వారు ఒకే సమాధానం చెబుతున్నారు. ‘వ్యవస్థను ఒక్క రోజులో గాడిన పెట్టలేం’ అంటూ దాటవేస్తున్నారు. జేబులు నింపుకునే ఫైళ్లపై చూపిస్తున్న ఆసక్తి సేవల మెరుగుదలకు చూపించడం లేదని కొన్ని నెలలుగా తీవ్రస్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్నాయి.చిరిగిన బెడ్నిండుకుంటున్న నిల్వలు.. ఎంజీఎం ఆస్పత్రికి ప్రతీరోజు ప్రాణాపాయ స్థితిలో 10 నుంచి 20 మంది క్షతగాత్రులు వస్తుంటారు. వీరికి అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎక్కిస్తూ చికిత్సలు అందించాల్సి ఉంటుంది. ఇలాంటి రక్త నిధి కేంద్రంలో రోగులు ఎప్పుడు రక్తం కావాలని అడిగినా నిల్వలు నిండుకున్నాయని చెప్పడం పరిపాటిగా మారింది. అసలు ఎంజీఎం ఆస్పత్రిలో రక్తనిధి కేంద్ర సిబ్బంది పనితీరుపై దృష్టి సారించకపోవడంతోనే ఈ కేంద్రం అధ్వానంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఎంజీఎం రక్తనిధి కేంద్రంలో నిండుకున్న నిల్వలు చిరిగిన బెడ్స్.. కనీస వసతులు కరువు కీలక విభాగాన్ని పట్టించుకోని అధికారులు పనిచేయని బ్లడ్బ్యాంక్ ఫోన్ నంబర్ సేవలు మెరుగుపర్చాలని గ్రీవెన్స్లో కలెక్టర్కు ఫిర్యాదు -
బదిలీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
హన్మకొండ అర్బన్: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేయాలని చూడడం సరికాదని, వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని టీఎన్జీఓస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన టీఎన్జీఓస్ నాయకులు, పంచాయతీ కార్యదర్శులతో కలిసి హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్యను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. 8 నెలల క్రితమే సాధారణ బదిలీల్లో భాగంగా పెద్ద సంఖ్యలో పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేశారని, తిరిగి ఇప్పుడు మళ్లీ బదిలీలు చేయడం వల్ల కార్యదర్శులు అనేక ఇబ్బందులకు గురవుతారని పేర్కొన్నారు. గ్రామాల్లో పాలకవర్గం ముగిసి ఏడాది గడిచినా పంచాయతీ ఎన్నికలు కాకపోవడంతో చాలాచోట్ల గ్రామాల అభివృద్ధి పనులకు ఆయా గ్రామాల కార్యదర్శులే పెద్ద మొత్తంలో సొంత డబ్బులు ఖర్చు చేశారని, ఇప్పుడు వేరే ప్రాంతానికి వెళ్తే వారు ఖర్చు పెట్టిన సొమ్ము వారికి అందడం కష్టమవుతుందన్నారు. వారు ఖర్చు చేసిన డబ్బులను వెంటనే ప్రభుత్వం నుంచి ఇప్పించేలా చూడాలని కలెక్టర్ను కోరారు. పంచాయతీ కార్యదర్శుల బదిలీలను టీఎన్జీఓస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీఓస్ జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, అసోసియేట్ అధ్యక్షుడు పుల్లూరు వేణుగోపాల్, కోశాధికారి పనికెల రాజేశ్, గౌరవ అధ్యక్షుడు శ్యాంసుందర్, పంచాయతీ కార్యదర్శుల ఫోరం కార్యదర్శి ఇంజపల్లి నరేశ్, నాయకులు ఎండీ రఫీ, వెంకన్న, సురేశ్, కృష్ణంరాజు, సౌజన్య, అంజలి, వెంకటేశం, ప్రవళిక, లావణ్య, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ -
లోకోపైలెట్ల సమస్యలు పరిష్కరించాలి
కాజీపేట రూరల్ : రైల్వే లోకోపైలెట్ల సమస్యలు పరిష్కరించాలని రైల్వేమజ్దూర్ యూనియన్ లోకో రన్నింగ్ బ్రాంచ్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మే రకు సోమవారం కాజీపేట రైల్వే క్రూ లాబీ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే రన్నింగ్ స్టాప్ సమస్యలపై రైల్వే బోర్డుతో చర్చలు జరిగాయన్నారు. ఇందుకు రైల్వే బోర్డు మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేసిందని తెలిపారు. అయితే ఆ కమిటీ ఈ నెల 4వ తేదీ న బోర్డుకు సమర్పించిన నివేదిక రన్నింగ్స్టాప్కు వ్యతిరేకంగా ఉందన్నారు. ఆ రిపోర్టును అమలు చేయొద్దని డిమాండ్తో దేశ వ్యాప్తంగా అన్ని క్రూ లాబీల వద్ద చేస్తున్న నిరసనలో భాగంగా కాజీపేట లాబీ వద్ద కూడా నిరసన చేపట్టామని తెలిపారు. బ్రాంచ్ చైర్మన్ సంగ రమేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ సాయికుమార్, రమేశ్, ఎన్.కుమారస్వామి, ఎ.కుమారస్వామి, ఎం. ప్రవీణ్, ధనరాజ్, వలీఅహ్మద్, ఎన్.శ్రీనివాస్, వి.ప్రసాద్, భరత్లోకోశ్, రమణాచారి, ఆంజనేయులు, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు. రైల్వే మజ్దూర్ యూనియన్ నేతల డిమాండ్ -
హనుమకొండ కలెక్టరేట్ పార్కుకు ఉత్తమ అవార్డు
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లోని పార్కుకు రాష్ట్ర ఉద్యానశాఖ ద్వారా నిర్వహించిన 8వ గార్డెన్ ఫెస్టివల్లో ఉత్తమ గార్డెన్గా అవార్డు ల భించినట్లు జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధి కారి వెంకటేశం తెలిపారు. సంబంధిత గోల్డెన్ ట్రో ఫీ, సర్టిఫికెట్ను కలెక్టర్ ప్రావీణ్య అధికారుల సమక్షంలో ప్రదర్శించారు. సుమారు 114 రకాల పూలు, నీడనిచ్చే మొక్కలను నాటి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడమేకాకుండా వాటి రక్షణ చర్యలు చేపడుతూ రాష్ట్రస్థాయి అవార్డు పొందడంపై అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్ ఓ వై.వి గణేష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కరపత్రాల ఆవిష్కరణ.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన వేసవిలో జాగ్రత్తలు (ఎండ వేడి తీవ్రత నుంచి ఉపశమనం, ఉపాయాలు), కృత్రిమ రసాయన శీతల పానీయాలు నివారించాలనే కరపత్రాలను సోమవారం కలెక్టర్ ప్రావీణ్య ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆచార్య లక్ష్మారెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కాజీపేట పురుషోత్తం, ఉపాధ్యక్షులు రాములు, ఉమామహేశ్వర్ రావు, కోశాధికారి పరికిపండ్ల వేణు, కార్యవర్గ సభ్యులు వకుళాభరణం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
గోదావరి పరీవాహక ప్రాంత అధికారులు అప్రమత్తంగా ఉండాలి
● టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి హన్మకొండ: వాతావరణ శాఖ ఈదురు గాలులు, భారీ వర్షాలు ఉన్నాయని హెచ్చరించిన నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతాల విద్యుత్ అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి సూచించారు. సోమవారం హనుమకొండలోని టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్రెడ్డి మాట్లాడుతూ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం పరిధిలో ఎప్పటికప్పుడు విద్యుత్ సరఫరా మానిటర్ చేస్తూ ఏదైనా అంతరాయం జరిగితే వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. చెట్లు విరిగి విద్యుత్ లైన్లపై పడితే, ట్రిప్పింగ్స్, బ్రేడౌన్లు సంభవిస్తే త్వరితగతిన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సూచించారు. పంటల కోతలు జరుగుతున్నందున పెండింగ్లో ఉన్న వ్యవసాయ సర్వీస్ల మంజూరు వేగవంతం చేయాలన్నారు. అత్యవసర సమయంలో కావాల్సిన మెటీరియల్ను సమకూర్చుతామన్నారు. వ్యవసాయానికి అవసరమైన చోట 63 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతీ సర్కిల్లో ఎల్సీ యాప్పై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్ టి.సదర్లాల్, జీఎంలు, ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు. సిక్కిం గవర్నర్ను కలిసిన మౌంటైనర్ యశ్వంత్ మరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యతండా గ్రామ పంచాయతీకి చెందిన మౌంటైనర్ భూక్య యశ్వంత్ సోమవారం సిక్కిం గవర్నర్ ఓమ్ ప్రకాశ్ మాథూర్ని ఆ రాష్ట్ర రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన వంతు సహకారం, ఆశీస్సులు ఉంటాయని, విజయం వైపు దూసుకెళ్లాలని యశ్వంత్కు గవర్నర్ సూచించారు. పట్టుదలతో ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతాలను అధిరోహించి భారత దేశ ఖ్యాతి విశ్వవ్యాప్తం చేయాలని యశ్వంత్ను గవర్నర్ దీవించారు. -
రోడ్డు వేసిన మరుసటి రోజే తవ్వారు
దశాబ్దాలుగా మారెమ్మ చెట్టు నుంచి అలంకార్ వరకు అద్వానంగా ఉన్న రోడ్డును ఇప్పుడు వేస్తుండడం సంతోషంగా ఉంది. కానీ, రోడ్డును నిర్మించిన కాంట్రాక్టర్ రాత్రికి రాత్రే తవ్వి డ్రెయినేజీని దారి మళ్లించి తిరిగి కల్వర్టు నిర్మించాడు. ఇదేంటని మా కాలనీ వారందరం పరిశీలిస్తే పక్కనే నిర్మిస్తున్న బడాషాపింగ్ కాంప్లెక్స్ ఎదుట డ్రెయినేజీ లేకుండా చేయడం కోసమని తెలిసింది. అశాసీ్త్రయ డ్రెయినేజీ నిర్మాణంతో మా కాలనీలకు వరద ముంపును తెచ్చినట్లే. ఇప్పటికై నా అధికారులు స్పందించి వరదనీరు సాఫీగా వెళ్లేలా డ్రెయినేజీ నేరుగా నిర్మించాలి. – నరసింహస్వామి, రాజ్పుత్కాలనీ -
పద్మశాలీల సంక్షేమానికి పెద్దపీట
మేయర్ గుండు సుధారాణి హసన్పర్తి: కాంగ్రెస్ సర్కార్ పద్మశాలీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని మేయర్ గుండు సుధారాణి అన్నారు. చింతగట్టు క్యాంప్ సమీపంలో కోటి రూపాయల నిధులతో నిర్మిస్తున్న పద్మశాలీ కమ్యూనిటీ భవనానికి సోమవారం స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి మేయర్ సుధారాణి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి జీవం పోసిందన్నారు. కమ్యూనిటీ హాల్ భవనానికి ప్రభుత్వం కోటి రూపాయలు విడుదల చేసినట్లు చెప్పారు. ఈనిధులతో కమ్యూనిటీ హాల్ భవనాన్ని అధునాతనంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పద్మశాలీల అభ్యున్నతికి కృషి చేస్తూ.. వారి అభివృద్ధికి పాటుపడుతోందన్నారు. కార్యక్రమంలో కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, కార్పొరేటర్ అరుణకుమారి, కమలాపూర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఝాన్సీరాణి, అఖిల భారత పద్మశాలీ సంఽఘం జాతీయ ఉపాధ్యక్షుడు ప్రభాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వడ్నాల నరేందర్, కార్యదర్శులు వైద్యం రాజగోపాల్, రవీందర్, జిల్లా అధ్యక్షుడు ఆడెపు రవీందర్, కార్యదర్శి గోరంటా రాజు, ప్రెస్క్లబ్ అధ్యక్షుడు నాగరాజు, నాయకులు గడ్డం భాస్కర్, కేశవమూర్తి, సతీశ్, వేముల సదానందం, దీకొండ భిక్షపతి, మాజీ సర్పంచ్ అనిల్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వీసం సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
11న పోలింగ్.. అనంతరం ఫలితాలు వరంగల్ లీగల్: వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాలు 2025–26 ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ సోమవారం ముగిసింది. ఈమేరకు బరిలో ఉన్న అభ్యర్థులు ఈనెల 11న జరిగే ఎన్నికల్లో తలబడనున్నారు. కాగా.. నామినేషన్ల స్వీకరణ రోజునే కొన్ని పోస్టులు ఏకగ్రీవం కాగా నామినేషన్ల ఉపసంహరణతో మరికొన్ని కూడా ఏకగ్రీవమయ్యాయి. బరిలో ఉన్న అభ్యర్థులు వీరే... వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్ష స్థానా నికి ఈ.ఆనంద్మోహన్, వి.కోటేశ్వర్రావు, వి.సుధీర్, ప్రధాన కార్యదర్శి స్థానానికి బి.అనిల్కుమార్, ఆర్.నాగేంద్రచారి, పి.ప్రవీణ్ కుమార్, డి.రమాకాంత్, జి.శివ బరిలో నిలిచినట్లు ఎన్నికల అధికారులు సీహెచ్ చిదంబర్నాథ్, టి.శ్రీధర్ తెలిపారు. జాయింట్ సెక్రటరీ స్థానానికి ఎ.కమలాకర్, ఎం.శ్రీధర్, వి.విష్ణుప్రసాద్, జాయింట్ సెక్రటరీ (మహిళా) కె.గోపికారాణి, ఆర్.శశిరేఖ, జాయింట్ సెక్రటరీ (స్పోర్ట్స్/కల్చరల్) ఎన్.శివప్రసాద్, జి.వెంకటరమణ, కోశాధికారి ఎస్.అరుణ, ఆర్.ప్రభాకర్, జాయింట్ సెక్రెటరీ స్పోర్ట్స్/కల్చరల్కు సి.మల్లేశ్, వి.రమేశ్, ఎ.సందీప్కుమార్, జాయింట్ సెక్రటరీ లైబ్రరీ మహ్మద్ అజార్ పాషా, కోశాధికారి నాగభూషణం, పి.ప్రవీణ్కుమార్, సీహెచ్ సాంబశివరావు బరిలో నిలిచినట్లు పేర్కొన్నారు. హనుమకొండలో.. హనుమకొండ బార్ అసోసియేషన్ అధ్యక్ష స్థానానికి టి.కృష్ణమూర్తి, ఎ.మార్కండేయ, టి.నరేందర్, ఎం.రంజిత్, పి.సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి స్థానానికి వి.నరేందర్, పి.నవీన్కుమార్, కె.రవి, బి.శంకర్ బరిలో నిలిచినట్లు ప్రధాన ఎన్నికల అధికారి కె.రమేశ్బాబు తెలిపారు. ఉపాధ్యక్ష స్థానానికి ఎస్.రాజన్బాబు, సీహెచ్ రమేశ్, కార్యవర్గ సభ్యులుగా పి.కమలాకర్, సీహెచ్ నిఖిల్కుమార్, కె.ప్రదీప్, ఆర్.ప్రవీణ్కుమార్, బి.శివకుమార్ యాదవ్, బి.సునీల్కుమార్ బరిలో నిలిచారు. కాగా.. జాయింట్ సెక్రటరీగా ఎంకే భీంరావ్జీ అంబేద్కర్, జాయింట్ సెక్రటరీ (మహిళా) ఆర్.నాగేంద్ర, 30 సంవత్సరాల సీనియర్ కార్యవర్గ సభ్యుడిగా కె.రాజేశ్వర్, 20 సంవత్సరాల సీనియర్ కార్యవర్గ సభ్యుడిగా కె.ఆశీర్వాదం, సీనియర్ మహిళా కార్యవర్గ సభ్యురాలిగా ఇందిరా వేదకుమారి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. 11వ తేదీ (శుక్రవారం) ఎన్నికల అనంతరం ఫలితాలు వెలువరించనున్నట్లు ఎన్నికల అధికారుల పేర్కొన్నారు. -
‘పోషణ పక్షం’ వాల్పోస్టర్ ఆవిష్కరణ
హన్మకొండ అర్బన్: జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘పోషణ పక్షం–25 ’ కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్ను సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో కలెక్టర్ ప్రావీణ్య అధికారులతో కలిసి ఆవిష్కరించారు. పోషణ్ అభియాన్లో భాగంగా జిల్లాలో నేటి(మంగళవారం) నుంచి 22వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్ఓ వైవీ.గణేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, డీడబ్ల్యూఓ జయంతి, ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, నారాయణ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంవిద్యారణ్యపురి: రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ శిక్షణ కోర్సులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ డి.వాసంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 17 నుంచి 29 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. ఈనెల 17 నాటికి 18 ఏళ్ల నుంచి 45 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు. సంబంధిత టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ కోర్సుల్లో లోయర్ గ్రేడ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. ఆయా దరఖాస్తులు డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. అర్హులైన అభ్యర్థులకు మే 1 నుంచి జూన్ 11 వరకు 42 రోజుల శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ.తెలంగాణ.గౌట్.ఇన్ వెబ్సైట్లో చూడాలని సూచించారు. రేపు జెడ్పీలో పాత వాహనాల వేలంహన్మకొండ: జిల్లా ప్రజాపరిషత్లో తుప్పు పట్టిపోతున్న పాత వాహనాల్ని వేలం వేయాలని అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. ‘సాక్షి’లో ఫిబ్రవరి 25న ప్రచురితమైన ‘మట్టిలో కలవాల్సిందేనా’ ఫొటో ఫీచర్కు జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. తుప్పు పడుతున్న 10 పాత వాహనాలను వేలం వేయాలని నిర్ణయించింది. ఈనెల 9న ఉదయం 11 గంటలకు హనుమకొండ జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో వేలం నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆసక్తి ఉన్న వారు వేలంలో పాల్గొనాలని హనుమకొండ జెడ్పీ సీఈఓ ఎం. విద్యాలత కోరారు. శిక్షణ సంస్థలనుంచి దరఖాస్తుల ఆహ్వానంన్యూశాయంపేట: నిరుద్యోగ క్రిస్టియన్ మైనార్టీ యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ జిల్లా మైనార్టీల సంక్షేమాధికారి టి.రమేశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్ఎస్డీసీ, టాస్క్, ఈజీఎంఎం, మెప్మా, ఎంఎస్ఎంఈ, అనుసంధానం కలిగిన అర్హత ఉన్న శిక్షణా సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సంస్థలు పూర్తి వివరాలతో హనుమకొండ సుబేదారిలోని షరీఫన్ మసీదు ఎదురుగా ఉన్న కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 12లోగా గడువు ఉందని పేర్కొన్నారు. మావోయిస్టులు అజ్ఞాతం వీడాలివరంగల్ క్రైం: మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసి సాధారణ జీవితం గడపాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 21న వరంగల్ పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోయిన నిషేధిత మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యురాలు వంజం కేశే అలియాస్ జెన్నీకి ప్రభుత్వం ప్రకటించిన రూ.4 లక్షల రివార్డును సోమవారం సీపీ సన్ ప్రీత్ సింగ్ అందజేశారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏసీపీలు జితేందర్ రెడ్డి, తిరుమల్, ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. కౌన్సెలింగ్ పూర్తిఎంజీఎం: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న మిడ్ లెవెల్ హెల్త్ కేర్ ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ) పోస్టులకు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించినట్లు హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. ఈ కౌన్సెలింగ్కు 11 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్కు సంబంధించి ఒక్క అభ్యర్థీ హాజరు కాలేదని, అలాగే దివ్యాంగుల కోటాకు సంబంధించి అర్హులైన అభ్యర్థులు లేనందుకు ఖాళీగా ఉంచినట్లు పేర్కొన్నారు. -
‘ఎండాకాలం’ అప్రమత్తంగా ఉండాలి
అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి హన్మకొండ అర్బన్: వేసవి దృష్ట్యా సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎ.వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వేసవికాలానికి సంబంధించిన ఆయా శాఖలు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వేసవిలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసేలా బ్యానర్ల ఏర్పాటు, కరపత్రాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్లు పాఠశాలలు, పని ప్రదేశాల వద్ద అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. నగరంలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతీ తరగతి గది వద్ద నీటి కుండను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులకు తెలియజేశారు. వేసవిలో విద్యుత్ అంతరాయం లేకుండా ఆ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ చర్యలు తీసుకోవాలన్నారు. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి 87126 99150, హనుమకొండ ఫైర్ స్టేషన్ 87126 99304, పరకాల ఫైర్ స్టేషన్ 87126 99306 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్సింగ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వినతులు వెంటనే పరిష్కరించండి
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో వివిధ రకాల సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించిన వినతులను ఆయా శాఖల అధికారులు జాప్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను అదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావా ణిలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. ప్రజలు అందించిన వినతులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజావాణిలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ 12, తహసీల్దార్ హసన్పర్తి 7, డబుల్ బెడ్రూం నోడల్ ఆఫీసర్ 6, ఆర్డీఓ హనుమకొండ 6తో పాటు వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 106 దరఖాస్తులు స్వీ కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అ దనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్ఓ వైవీ.గణేశ్, డీ ఆర్డీ ఓ మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆ ర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ నారాయణ, జిల్లా అ ధికారులు, పలువురు తహసీల్దార్లు పాల్గొన్నారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.. వేసవి నేపథ్యంలో జిల్లాలోని చెరువులు, కుంటలు, బావులు, జలాశయాల వద్ద ఈతకు వెళ్లి మృత్యువాత పడకుండా రక్షణ చర్యల్లో భాగంగా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సీనియర్ సిటీజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కలెక్టర్ను కోరారు. ఈమేరకు సోమవారం ప్రజవాణిలో కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించారు. వీలైతే జలాశయాల చుట్టూ రక్షిత కంచె ఏర్పాటుతో పాటు గ్రామాల్లో చిన్న పిల్లలు, పెద్దలు సంరక్షకులు లేకుండా బావులు, జలాశయాల్లోకి ఈతకు వెళ్లవద్దని డప్పు చాటింపు చేసి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి తేరాల యుగంధర్, కార్యవర్గ సభ్యులు కొండబత్తిని రాజేందర్, సీతారామారావు, తాడూరి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో ఫిర్యాదులను పరిశీలించండి: వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద వరంగల్: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణితో కలిసి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలన్నారు. పెండింగ్ దరఖాస్తులను పరిష్కరిస్తే బాధితులు పదే పదే ప్రజావాణికి వచ్చే అవకాశం ఉండదన్నారు. గ్రీవెన్స్లో మొత్తం 93 వినతులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. శ్మశానవాటికకు హద్దులు నిర్ణయించాలి.. వరంగల్ దేశాయిపేట గ్రామశివారులోని సర్వే నంబర్ 308లోని ప్రభుత్వ భూమిలో ది పెంతెకొస్తు మిషన్ చర్చి క్రైస్తవులకు సంబంధించిన (సమాధుల స్థలం) శ్మశానవాటికకు హద్దులు పెట్టాలి. 1.35 ఎకరాలు ఉన్న భూమి ప్రస్తుతం 17 గుంటలు మాత్రమే మిగిలింది. స్థలాన్ని ఆక్రమించేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. హద్దులు పెట్టాలని రెండేళ్ల క్రితం ల్యాండ్ సర్వే అధికారులకు ఆదేశాలు జారీ అయినా ఇప్పటి వరకు హద్దులు ఏర్పాటు చేయలేదు. అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రావీణ్య ప్రజావాణిలో అర్జీల స్వీకరణ -
మౌలిక వసతుల సంగతేంటి?
వరంగల్ అర్బన్: ‘కాలనీల్లో చాలా సమస్యలున్నాయి. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. దోమలు విజృంభిస్తున్నాయి. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. భవన నిర్మాణాల అతిక్రమణలు, అనధికారిక కట్టడాలు, డ్రెయినేజీలు, సీసీ రోడ్లు తదితర మౌలిక వసతుల సంగతేంటి’ అని సోమవారం బల్దియా కార్యాలయంలో నిర్వహించిన గ్రేటర్ గ్రీవెన్స్లో ప్రజలు కమిషనర్ అశ్విని తానాజీ వాకడేను ప్రశ్నించారు. మహా నగరంలోని పలు కాలనీల ప్రజలు సమస్యలపై గ్రేటర్ గ్రీవెన్స్లో గళమెత్తారు. గతంలో ఎన్నడూ రాని విధంగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి. ప్రజలు బారులుదీరడంతో కార్యాలయం ఆవరణంతా కిటకిటలాడింది. పలుమార్లు వినతులు ఇచ్చినా ఇంత వరకు సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదని వాపోయారు. ట్రైసిటీతోపాటు శివారు ప్రాంతాల ప్రజల నుంచి ఫిర్యాదులు అధికంగా వచ్చాయి. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయం కౌన్సిల్ హాల్లో గ్రీవెన్ సెల్కు 120 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో టౌన్ ప్లానింగ్కు అత్యధికంగా 60 వినతులు అందాయి. అంటే ఆ విభాగాధికారుల పనితీరు ఎలా ఉందో స్పష్టమవుతోంది. మౌలిక వసతుల కోసం ఇంజినీరింగ్ సెక్షన్కు 32, ప్రజారోగానికి 3, పన్నుల విధింపులో తేడాలు, ఫిర్యాదులపై 17, తాగునీటి సరఫరా కోసం 6 వినతులు అందినట్లు బల్దియా అధికారులు వెల్లడించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి సారించాలని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, డీఎఫ్ఓ శంకర్ లింగం, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, హెచ్ఓలు రమేశ్, లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● హనుమకొండ రాజాజీనగర్ నుంచి డబ్బాల వరకు చేపట్టిన సీసీ రోడ్డు పనుల్లో అక్రమాల తొలగింపులో అవకతవకలు జరిగాయని చర్యలు తీసుకోవాలని కాలనీ సొసైటీ ప్రతినిధులు కోరారు. ● వరంగల్ విశ్వకర్మ వీధిలో 9–10–168 రోడ్డుపై ర్యాంపు నిర్మిస్తున్నారని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ● గిర్మాజీపేట 8–7–67 రోడ్డు సెట్ బ్యాక్ లేకుండా ఇళ్లు నిర్మిస్తున్నారని చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ● హంటర్ రోడ్డు గాయత్రి దేవాలయం వద్ద భద్రకాళి ట్యాంక్ బండ్కు వెళ్లే రోడ్డుపై ఇష్టారాజ్యంగా వాహనాలు పార్కింగ్ చేస్తున్నారని కాలనీలకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని కాలనీవాసులు మూడుసార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ● హనుమకొండ అలంకార్ జంక్షన్లో సర్ అలామా ఇక్బాల్ స్మారకార్థం విగ్రహం నిర్మించాలని బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు నయీమొద్దీన్ కోరారు. ● హంటర్ రోడ్డు దుర్గా కాలనీ త్రివీ స్కూల్ ఎదురుగా పార్కు స్థలాన్ని 14 ప్లాట్లు చేసి విక్రయించారని చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు విన్నవించారు. ● మడికొండ వెస్ట్ సిటీ చిల్డ్రన్స్ పార్కులో ఓపెన్ జిమ్, ఇతర పరికరాలు ఏర్పాటు చేయాలని అభివృద్ధి కమిటీ ప్రతినిధులు కోరారు. ● వరంగల్ 35వ డివిజన్ పుప్పాలగుట్టలో అసంపూర్తిగా ఉన్న డ్రెయినేజీలను పూర్తి చేయాలని అభివృద్ధి కమిటీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ● హంటర్ రోడ్డు జేఎస్ఎం స్కూల్ నుంచి బ్లూ డైమాండ్ బార్ వరకు డ్రెయినేజీ సదుపాయం లేదని నిర్మించాలని దివాన్ చంద్రకాంత్ విన్నవించారు. ● మడికొండలో ఇళ్ల నడుమ స్క్రాప్ దుకాణాలు, వెల్డింగ్ పనులు చేస్తూ కాలనీవాసులకు అసౌకర్యానికి గురిచేస్తున్నారని చర్యలు తీసుకోవాలని పలుమార్లు కోరినట్లు స్థానికులు ఫిర్యాదు చేశారు. ● 31వ డివిజన్ న్యూశాయంపేట డాక్టర్స్ కాలనీలో తాగునీటి పైపులైన్లు నిర్మించాలని కాలనీవాసులు కోరారు. ● భీమారం సదానంద కాలనీలో వీధిలైట్లు వెలగడం లేదని పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. ● ఉర్సుగుట్టలో నా సొంత స్థలాన్ని ఆక్రమించారని ఫిర్యాదు చేస్తే తన పెంట్ హౌజ్ను కూల్చేస్తామని బిల్డింగ్ ఇన్స్పెక్టర్ నోటీసు జారీ చేశారని, 16 సార్లు ఫిర్యాదు చేసినట్లు ఎం.సంధ్య ఫిర్యాదు చేశారు. ● న్యూ శాయంపేట 31వ డివిజన్ నుంచి రైల్వే గేట్ భట్టుపల్లి మీదుగా సీసీ రోడ్డు నిర్మించాలని పలు కాలనీల ప్రజలు గ్రీవెన్స్లో విన్నవించారు. గ్రేటర్ గ్రీవెన్స్లో కమిషనర్ను ప్రశ్నించిన నగరవాసులు సగానికిపైగా ఆక్రమణలు, అతిక్రమణలపై ఫిర్యాదులు వెల్లువెత్తిన ఫిర్యాదులు -
కాజీపేట టు వరంగల్ ‘విజయ యాత్ర’
కాజీపేట రూరల్: శ్రీ రామనవమిని పురస్కరించుకొని హిందూ విజయ యాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ నాగపురి వెంకటేశ్గౌడ్ ఆధ్వర్యాన ఆదివారం రాత్రి రాముడి విగ్రహంతో ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక వాహనంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి కాజీపేట బాపూజీనగర్ సెంటర్–కడిపికొండ బ్రిడ్జి వద్ద వరంగల్ దుర్గేశ్వర స్వామి ఆలయం వరకు చేపట్టిన ఈ ర్యాలీని విజయవాడ సనాతన భారతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీకృష్ణ శరణానంద భారతీస్వామి, శ్రీరామ్ఉదయ్ విశ్వహిందూ పరిషత్ మహానగర కార్యదర్శి రానా యాదవ్ తదితరులు ప్రారంభించారు. ద్విచక్రవాహనాలు, కాషాయ జెండాలతో విజయయాత్ర సాగింది. కార్యక్రమంలో వెలగందుల రాజు, బీజేపీ మాజీ కార్పొరేటర్ నార్లగిరి రామలింగం, శ్రీరాముడి విగ్రహదాత డాక్టర్ తరుణ్రెడ్డి, బజరంగ్దళ్ మహానగర కన్వీనర్ అల్లకట్ల పాల్గొన్నారు. -
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
సన్న బియ్యం ప్రారంభోత్సవంలో నిరసన వరంగల్ చౌరస్తా : వరంగల్ 27వ డివిజన్ అబ్బనికుంటలో ఆదివారం ఓ రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్, టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్ ప్రారంభించారు. బీజేపీ నాయకులు కనుకుంట్ల రంజిత్ తదితరులు అక్కడికి చేరుకొని రేషన్ షాపు ఎదుట ప్రధాని మోదీ ఫొటో ప్రదర్శించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. కొద్ది సమయం తర్వాత సద్దుమణిగింది. నేడు వరంగల్ ప్రజావాణివరంగల్: వరంగల్ కలెక్టరేట్లో సోమవారం(నేడు)ఉదయం 11 గంటలకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతులు సమర్పించేందుకు రావాలని సూచించారు. నేడు గ్రేటర్ గ్రీవెన్స్ వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ కార్యక్రమం సోమవారం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులను స్వీకరిస్తామని, సమస్యల పరిష్కారానికి ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లీకేజీల గుర్తింపు ● టన్నెల్లోకి దిగిన ఇంజినీర్లు ధర్మసాగర్: హనుమకొండ జిల్లా ధర్మసాగర్లోని రిజర్వాయర్ సమీపాన ఇటీవల జరిగిన టన్నెల్ లీకేజీలను ఎట్టకేలకు ఇంజనీర్లు గుర్తించారు. దేవాదుల పథకంలో భాగంగా 3వ ప్యాకేజీ కింద దేవన్నపేట పంపుహౌస్ నుంచి రిజర్వాయర్ సమీపం వరకు పైపులైన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి సుమారు 200 మీటర్లు రిజర్వాయర్ వరకు టన్నెల్ నిర్మించారు. ఈ క్రమంలో గత నెల 27న రిజర్వాయర్లోకి నీటిని పంపింగ్ చేయగా వారం రోజుల క్రితం టన్నెల్ లీకేజీ అయ్యింది. పంపులు ఆపివేసి టన్నెల్ నుంచి డీ వాటరింగ్ చేశారు. ఆదివారం పైపు నుంచి టన్నెల్లోకి దిగిన మెగా ఇంజినీర్లు, సిబ్బంది లీకేజీలను కనుక్కు ని పరిశీలించారు. బీజేపీతోనే దేశాభివృద్ధిఖిలా వరంగల్/హన్మకొండ: బీజేపీతోనే దేశ అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షులు గంట రవికుమార్, కొలను సంతోశ్రెడ్డి అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా కార్యాలయాలతో పాటు శివనగర్, రంగశాయిపేటలో వేర్వేరుగా బీజేపీ జెండాలు ఆవి ష్కరించి మాట్లాడారు. దేశానికి పునర్వైభవం తెచ్చే దిశగా మోదీ పని చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు, మాజీ జిల్లా అధ్యక్షురా లు రావు పద్మ, పులి సరోత్తంరెడ్డి, రావు అమరేందర్రెడ్డి, కొల్లూరి యోగానంద్, రాణాప్రతాప్, కపిల్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ వైఫల్యంతోనే జాప్యం
నగరాభివృద్ధికి కేంద్రం మంజూరు చేసిన నిధులను సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. స్మార్ట్సిటీ నిధులు సగానికి పైగా వెనక్కి వెళ్లే పరిస్థితులు వచ్చాయంటే పాలకుల అవగాహనా రాహిత్యం, అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది. ప్రణాళికలేమి కారణంగా అనేక పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికై నా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు అధికారులను సమన్వయం చేసుకుంటూ స్మార్ట్సిటీ పనులను వేగవంతం చేయాలి. అప్పుడే మరిన్ని నిధులు నగరానికి మంజూరయ్యే అవకాశం ఉంటుంది. – డాక్టర్ కంజర్ల మనోజ్, పెద్దమ్మగడ్డ, హనుమకొండ స్మార్ట్ సిటీ పనుల్లో వేగం పెంచాలి నగరంలో స్మార్ట్ సిటీ పనులు పదేళ్లుగా నత్తనడకనే కొనసాగుతున్నాయి. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం వల్ల స్మార్ట్ సిటీ పనులు ఆలస్యమవుతున్నాయి. పనుల్లో వేగం పెంచితే నగరం సర్వాంగసుందరంగా మారుతుంది. అధికారులు ఇప్పటికై నా దృష్టి సారించాలి. – బోరిగం నాగరాజు, తోట్లవాడ వరంగల్ -
‘ఎల్సీ’కి సాంకేతికత జోడింపు
హన్మకొండ: విద్యుత్ వినియోగదారులకు మెరుగై న, నాణ్యమైన సేవలందించేందుకు టీజీ ఎన్పీడీసీ ఎల్ ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంబిస్తోంది. ఈక్రమంలో లైన్ క్లియరెన్స్(ఎల్సీ) మరింత బాధ్యతగా, సులభంగా ఉండేలా చర్యలు చేపట్టింది. ఫోన్కాల్ ద్వారా ఎల్సీ తీసుకోవడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. విద్యుత్ ప్రమాదాలతో ప్రాణ నష్టం జరుగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఎల్సీ(ఫీడర్లలో విద్యుత్ సరఫ రా నిలిపివేత, పునరుద్ధరణ) తీసుకోవడానికి ప్రత్యే క యాప్ను ఎన్పీడీసీఎల్ యాజమాన్యం రూపొందించింది. ఇప్పటి వరకు ఎల్సీ తీసుకుంటే తీసుకు న్న ఉద్యోగికి, సబ్స్టేషన్ ఆపరేటర్కు మాత్రమే తెలిసేది. ఈయాప్ ద్వారా ఏఈ, ఏడీఈ, డీఈలు కూడా తెలుసుకునే వీలు కలగడంతోపాటు పర్యవేక్షణ పెరుగుతుంది. ఫీడర్ల ఎంపికలోనూ కచ్చితత్వం ఉంటుంది. పొరపాట్లకు తావులేకుండా.. ఎల్సీ(లైన్ క్లియర్) తీసుకోవాలనుకున్న లైన్మెన్ యాప్ ఓపెన్ చేసి అందులో సంబంధిత ఫీడర్లో ఎల్సీ కావాలని సంబంధిత ఏఈకి విన్నవించుంటే అతను పరిశీలించి ఆ ఫీడర్లో ఎల్సీ ఇవ్వొచ్చా లేదా? అత్యవసరాలు ఏమైనా ఉన్నాయా.. అప్పటికే షెడ్యూల్ చేయబడిన పనులు ఉన్నాయా.. మరే ఇతర షెడ్యూల్ చేసిన పనులు ఉన్నాయా? అని పరిశీలిస్తాడు. ఏఈ నిర్ణయం మేరకు ఎల్సీ అనుమతి ఆధారపడి ఉంటుంది. ఎల్సీకి అనుమతిస్తే లైన్మెన్, సబ్స్టేషన్ ఆపరేటర్కు యాప్ ద్వారా సమాచారం అందుతుంది. దీని ఆధారంగా సబ్ స్టేషన్ యాప్లో నిర్దిష్టంగా పేర్కొన్న ఫీడర్లో ఎల్సీ ఇస్తారు. దీని ద్వారా పొరపాటు జరగుకుండా ఉంటుంది. సూచనలిస్తూ.. పొరపాట్లను నివారించేందుకు తగు సూచనల్ని యాప్ ఇస్తుంది. హెల్మెట్ ధరించాలని, హ్యాండ్ గ్లౌజ్లు వేసుకోవాలని, ఎర్త్ రాడ్ వాడాలని, ఏబీ స్విచ్ ఓపెన్ చేశారా? లేదా అనే జాగ్రత్తలను యాప్ గుర్తు చేస్తుంది. ఎక్కడైనా డబుల్ ఫీడింగ్ ఉందా? ఈ ఫీడర్కు వేరే ఫీడర్తో అనుసంధానం ఉందా? వంటి సమాచారాన్ని తెలియజేస్తుంది. దీని ద్వారా జాగ్రత్త పడుతూ ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. డబుల్ ఫీడరింగ్ ఉంటే రెండు ఫీడర్లలో ఎల్సీ తీసుకోవడమా? లేదా ఇతరత్రా జాగ్రత్తలు తీసుకువచ్చా? అని బేరీజు వేసుకుని పనులు చక్కదిద్దుతారు. ఎల్సీ తీసుకున్న ఫీడర్లో పనులు పూర్తి కాగానే యాప్లో ఆ సమాచారాన్ని లైన్మెన్ పొందుపర్చి విద్యుత్ సరఫరలా పునరుద్ధరించవచ్చనే సంకేతాన్ని, సమాచారాన్ని యాప్ ద్వారా చేరవేస్తారు. దీన్ని సంబంధిత సెక్షన్ ఏఈ పరిశీలించి సబ్స్టేషన్ ఆపరేటర్కు చేరవేస్తారు. దీంతో ఎల్సీ తీసుకున్న ఫీడర్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తారు. భద్రతా ప్రమాణాలు పెంచడానికి యాప్.. విద్యుత్ వినియోగదారులకు మరింత ఉత్తమ సేవలు అందించడంలో భాగంగా భద్రతా ప్రమాణాలను పెంచడానికి ప్రత్యేకంగా ఎల్సీ యాప్ను టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం రూపొందించింది. ఎల్సీ యాప్ ద్వారా విద్యుత్ అంతరాయాల సమయాలు, మానవ తప్పిదాలను అరికట్టవచ్చు. విద్యుత్ ప్రమాదాలు, ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. – పి.మధుసూదన్రావు, ఎస్ఈ, హనుమకొండ ఆన్లైన్లో సులభంగా విద్యుత్ లైన్ క్లియరెన్స్ నూతన యాప్ రూపొందించిన టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం అధికారులు, ఉద్యోగులకు శిక్షణ -
ముగిసిన వసంత నవరాత్రోత్సవాలు
● భద్రకాళి అమ్మవారికి లక్ష పుష్పార్చన హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో జరుగుతున్న వసంత నవరాత్రి ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఇందులో భాగంగా లిల్లీపూలతో అమ్మవారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు అమ్మవారికి పూర్ణాభిషేకం, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం వేదపండితులు, వేదపాఠశాల విద్యార్థులు లిల్లీపూలకు సంప్రోక్షణ నిర్వహించి వాటితో అమ్మవారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. పుష్పార్చన కార్యక్రమానికి ఓదెల సంపత్ ఉభయదాతలుగా వ్యవహరించారు. రాత్రి 8గంటలకు సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈఓ శేషుభారతి, దేవాలయ సిబ్బంది పర్యవేక్షించారు. నేడు వీరాంజనేయుడి కల్యాణంకాజీపేట రూరల్: కాజీపేట రైల్వే దేవాలయ సముదాయంలో సోమవారం శ్రీవీరాంజనేయస్వామి సువర్చలదేవి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తున్న ట్లు ఆలయ కమిటీ సెక్రటరీ పెసరు భాస్కర్రావు, కార్యక్రమ నిర్వాహకులు ఏఎస్ఆర్.ప్రసాదరావు తెలిపారు. అనంతరం సత్యనారాయణస్వామి వారి సామూహిక వ్రతం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 1,500 మందికి మహా అన్నదానం చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. నేడు విద్యుత్ లోకల్ కోర్టుహన్మకొండ: నాగారం సబ్స్టేషన్లో ఈనెల 7న విద్యుత్ లోకల్ కోర్టు నిర్వహించనున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ హసన్పర్తి డీఈ అశోక్ తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చేపట్టే లోకల్ కోర్టులో విద్యుత్ వినియోగదా రుల సమస్యల పరిష్కార వేదిక(సీజీఆర్ఎఫ్) చైర్మ న్ ఎన్.వి.వేణుగోపాలచారి పాల్గొంటారన్నారు. -
సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోuహనుమకొండ రెవెన్యూకాలనీ రామాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని తిలకిస్తున్న భక్తులు, తాళి బొట్టు చూపిస్తున్న పూజారి కల్యాణ వైభోగమే..గ్రేటర్ వరంగల్ నగరంలో ఆదివారం రామనామం మార్మోగింది. శ్రీసీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. రామాలయాలు, హనుమాన్ మందిరాల్లో భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచి ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం సీతారాముల కల్యాణాన్ని వేదపండితులు ఘనంగా నిర్వహించారు. లక్ష్మణ, ఆంజనేయ సమేత సీతారాములను దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించారు. ఆలయాల్లో వడపప్పు, మిర్యాల పానకం ప్రసాదాలను పంచిపెట్టారు. ఆలయ ఆవరణల్లో అన్నదానాలు జరిగాయి. స్థానిక ప్రజాప్రతినిధులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి కల్యాణంలో పాల్గొన్నారు. – సాక్షి, నెట్వర్క్– మరిన్ని చిత్రాలు 9లోu -
ఆగుతూ..
సాగుతూ..సాక్షిప్రతినిధి, వరంగల్ : గ్రేటర్ వరంగల్లో స్మార్ట్సిటి మిషన్(ఎస్సీఎం) లక్ష్యం నెరవేరలేదు. తొమ్మిదేళ్లలో 60.51 శాతం పనులే పూర్తయ్యాయి. సుమారు రూ.436 కోట్ల విలువైన 47 పనులు ఇంకా ఆన్గోయింగ్లోనే ఉన్నాయి. మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం, ఆర్థిక వృద్ధిని పెంచడం.. తద్వారా సుందరనగరాలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో కేంద్రం 2015 జూన్లో దేశ వ్యాప్తంగా 100 నగరాలను ఎస్సీఎం కింద ఎంపిక చేసింది. రెండో విడతలో 2016 మే నెలలో తెలంగాణ నుంచి గ్రేటర్ వరంగల్తో పాటు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లను చేర్చారు. వరంగల్లో స్మార్ట్సిటీ కింద మొత్తం 119 ప్రాజెక్టులకు రూ.1,800 కోట్లు కేటాయించింది. పదేళ్ల పాటు కొనసాగిన ఈ పథకం గత నెల 31వ తేదీతో ముగియగా.. రూ.1,364 కోట్లు ఖర్చు చేసి 72 ప్రాజెక్టులు పూర్తి చేశారు. అదిగో.. ఇదిగో అంటూ.. 2016 మే నెలలో స్మార్ట్సిటీ నగరాల జాబితాలో ఎంపికయ్యాక 119 ప్రాజెక్టులకు రూ.2,106 కోట్లతో డీపీఆర్లు పంపించగా రూ.1,800 కోట్లకు పరిపాలన ఆమోదం లభించింది. అయితే 2019 వరకు 20 పనులకు సంబంధించిన రూ.23.09 కోట్ల పనులే జరిగాయి. అందులో పెద్దమ్మగడ్డ–కేయూ 100 ఫీట్ల రోడ్డు, ఉర్సుగుట్ట–నాయుడు పంపు, పోతనరోడ్డు, హనుమకొండ అదాలత్ సెంటర్–హంటర్రోడ్డు మీదుగా వరంగల్ అండర్బ్రిడ్జి వరకు సెంట్రల్ లైటింగ్ తదతర పనులు ఉన్నాయి. 2019లో మొదలైన నాలుగు స్మార్ట్రోడ్లలో హనుమకొండ కాపువాడ, పద్మాక్షిగుట్ట రోడ్డు పనులు, రూ.82.50 కోట్లతో వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో 11 స్మార్ట్ రోడ్లు, రూ.20.54 కోట్లతో నాలుగు స్వాగత ద్వారాలు, కూడళ్ల అభివృద్ధి, రూ.72.50 కోట్లతో వరంగల్ భద్రకాళి బండ్ రెండో దశ, రూ.12.50 కోట్లతో హనుమకొండ వడ్డేపల్లి బండ్, స్మార్ట్రోడ్లు.. తదితర పనులు ఆగుతూ.. సాగాయి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను స్మార్ట్గా తీర్చిదిద్దడం, కాకతీయ జూపార్కులో ఆధునికీకరణ పనులు, భారీ సోలార్ పార్కు, సోలార్ పీవీ కెనాల్ బ్యాంకు, కాజీపేటలోని బంధం చెరువు సుందరీకరణ, దేశాయిపేట చిన్నవడ్డేపల్లి సుందరీకరణ, హనుమకొండ చౌరస్తాలో జంక్షన్ ప్లాజా, హనుమకొండ, వరంగల్ ఆర్టీసీ బస్ టెర్మినల్, 150 ఎంఎల్డీల సివరేజీ ప్లాంటు, పర్యాటక కేంద్రంగా ఉర్సుగుట్ట, కేఎంజీ గార్డెన్ నాలా ఆధునికీకరణ, భద్రకాళి చెరువు ప్రక్షాళన, స్మార్ట్వాటర్ మీటర్లు, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్, వరంగల్ మహానగరంలోని ప్రధాన కూడళ్లలో ఉచిత వైఫై కేంద్రాలు.. తదితర ప్రాజెక్టులు స్మార్ట్సిటీ డీపీఆర్లో ఉన్నాయి. ఆన్గోయింగ్లో అతి ముఖ్యమైన పనులు స్మార్ట్సిటీలో భాగంగా చేపట్టే పనుల వ్యయంతో కేంద్రం వాటా 50 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం, ఆయా మున్సిపల్ కార్పొరేషన్ వాటా 25శాతం భరించాల్సి ఉంటుంది. కార్పొరేషన్ వాటా కలిపి 50 శాతం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తూ వచ్చింది. వాస్తవానికి స్మార్ట్సిటీ పథకం గడువు 2024 జూన్ 30న ముగియాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు 2025 మార్చి 31 వరకు పొడిగించారు. ఈసమయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిధులు విడుదల చేసి ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంది. తొమ్మిది నెలలు పొడిగించినా.. గ్రేటర్ వరంగల్ స్మార్ట్సిటీ పనుల్లో పురోగతి లేకపోగా రూ.436 కోట్ల వ్యయం అయ్యే 47 పనులు(39.49 శాతం) అసంపూర్తిగా ఉన్నాయి. ఇందులో ఆధునిక సాంకేతికతతో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ కమాండ్ సెంటర్, భద్రకాళి బండ్ రెండోదశ సుందరీకరణ, వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, బయోమైనింగ్, ప్రధాన రహదారుల అభివృద్ధి, ఎస్టీపీ, నగరం నలువైపులా జాతీయ రహదారులపై గ్రాండ్ ఎంట్రెన్స్ తదితర అతి ముఖ్యమైన పనులు ఉన్నాయి. కాగా స్మార్ట్సిటీ గడువు ముగిసినా.. ఆన్గోయింగ్ పనులకు చెల్లింపులు ఉంటాయని అధికారులు చెబుతుండగా.. వేగం పెంచితేనే పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. నత్తనడకన ‘స్మార్ట్సిటీ మిషన్’ 119 ప్రాజెక్టులకు రూ.1800 కోట్లు పది సంవత్సరాల్లో ఖర్చు చేసింది రూ.1,364 కోట్లు పెండింగ్లో రూ.436 కోట్ల విలువైన 47 పనులు గత నెల 31వ తేదీతో ముగిసిన స్మార్ట్సిటీ గడువు పొడిగించే అవకాశం లేదన్న కేంద్రం.. త్వరపడితేనే నూరుశాతం -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
● డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి విద్యారణ్యపురి: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం నిర్వహిచిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న ఐదు డీఏలు విడుదల చేయాలని, మొదటి పీఆర్సీ గడు వు 2023తోనే ముగిసినందున నివేదికను తెప్పించుకొని వేతనాలను సవరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, ఉద్యోగ విరమణ పొందినవారికి బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాస్, ఉపాధ్యక్షురాలు ఎస్.సుభాషిని, డి.రమేశ్, కార్యదర్శి ఎన్.భాస్కర్, రాష్ట్ర కౌన్సిలర్లు జి.ఉప్పలయ్య, ఎం.సారంగపాణి, గంగాధర్ పాల్గొన్నారు. -
భూముల కబ్జా!
ఆగని ఎస్సారెస్పీహసన్పర్తి: ఎస్సారెస్పీ భూముల్లో రోజురోజుకూ కొత్త నిర్మాణాలు వెలుస్తున్నాయి. కబ్జాదారులు దర్జాగా ఎస్సారెస్పీ భూముల్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అన్నాసాగరం నుంచి మొదలుకుని పైడిపల్లి వరకు వందలాది నిర్మాణాలు వెలిశాయి. సుమారు 360 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు ఆరేళ్ల క్రితమే అప్పటి అధికారులు సర్వే నిర్వహించి నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. నివేదిక మేరకు అప్పటి కమిషనర్, కలెక్టర్లు అక్రమ నిర్మాణాలు తొలగించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు చోద్యం చేస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దర్జాగా షెడ్లు.. తాజాగా ఓ క్వారీ నిర్వాహకుడు హసన్పర్తి–జయగిరి మార్గమధ్యలోని ఎస్సారెస్పీ భూమిని కబ్జా చేశాడు. దర్జాగా షెడ్లు ఏర్పాటు చేసుకున్నాడు. కబ్జా చేసుకున్న భూమి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ప్రధాన రహదారి పక్కనే ఈవ్యవహారం జరిగినప్పటికీ ఎస్సారెస్పీ అధికారుల మౌనంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిగా ఇక్కడ షెడ్లు కంటైనర్లు ఏర్పాటు చేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై స్థానికులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు మాత్రం వాటిని బుట్టదాఖలు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించకపోవడంపై రాజకీయ ఒత్తిడే కారణమా లేక మామూళ్లు అందుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలగింపునకు చర్యలు ఎస్సారెస్పీ భూములు ఆక్రమించుకుని షెడ్, కంటైనర్లు ఏర్పాటు చేసుకున్న విషయం నా దృష్టికి వచ్చింది. వాటిని తొలగించాలని క్వారీ నిర్వాహకుడికి సూచించాం. లేకపోతే సదరు కబ్జాదారులపైచర్యలు తీసుకుంటాం. – రవీందర్, డీఈఈ క్వారీ నిర్వహణ కోసం కార్యాలయం చోద్యం చూస్తున్న అధికారులు ఫిర్యాదులు బుట్టదాఖలు -
కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 30 రోజుల పాటు సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఆదివారం నుంచి మే 5 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కమిషనరేట్ పరిధిలో పోలీస్ అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి మైకులు, డీజేలు వినియోగించరాదని హెచ్చరించారు. సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులను నిషేధించినట్లు పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మద్యం సేవించినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శబ్ద కాలుష్య నియంత్రణలో భాగంగా డీజే సౌండ్ను నిషేధించామని, ఆస్పత్రులు, విద్యాలయాలకు 100 మీటర్ల దూరం వరకు వినియోగించరాదని, మైకులు వినియోగించాల్సి వస్తే స్థానిక ఏసీపీల అనుమతి తప్పనిసరని వివరించారు. మైకులకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సమయంలో అనుమతి తీసుకుని వినియోగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సిటీ పోలీస్ యాక్ట్ ఉత్తర్వులను కమిషనరేట్ పరిధిలో ఎవరు అతిక్రమించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేటినుంచి నెల రోజులపాటు అమలు పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వెల్లడి -
చామంతులతో లక్షపుష్పార్చన
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా శనివారం పసుపురంగు చామంతులతో అమ్మవారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు అమ్మవారికి పూర్ణాభిషేకం, నిత్యాహ్నికం జరిపారు. అనంతరం వేద పండితులు, వేద పాఠశాల విద్యార్థులు పసుపు రంగు చామంతిపూలకు సంప్రోక్షణ నిర్వహించి వాటితో అమ్మవారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. పుష్పార్చనకు కరీంనగర్కు చెందిన బాలజనని ఉభయదాతలుగా వ్యవహరించారు. ఆలయ ఈఓ శేషుభారతి, దేవాలయ సిబ్బంది పర్యవేక్షించారు. నేడు హజ్ యాత్రికులకు శిక్షణన్యూశాయంపేట: రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం (నేడు) హజ్ యాత్రికులకు శిక్షణ నిర్వహిస్తున్నట్లు మైనార్టీ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు డాక్టర్ అనీస్ సిద్ధిఖీ శనివారం తెలిపారు. వరంగల్ ఇస్లామియా కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. యాత్రికులు సకాలంలో వచ్చి శిక్షణలో పాల్గొనాలని కోరారు. డీఈఈసెట్కు దరఖాస్తు చేసుకోవాలివిద్యారణ్యపురి: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) డీఈఈసెట్– 2025కు నోటిఫికేషన్ విడుదలైందని, అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎండీ అబ్దుల్హై శనివారం ఒక ప్రకటనలో కోరారు. మే 15వ తేదీ వరకు గడువు ఉందని పేర్కొన్నారు. ప్రవేశపరీక్ష మే 25న ఉంటుందని తెలి పారు. ఇంటర్లో 50 శాతం మార్కులు సాధించినవారు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45శాతం మా ర్కులు సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. వేసవిలో జాగ్రత్తలు పాటించాలికాజీపేట అర్బన్: ఇటుక బట్టీల్లో పని చేస్తున్న కార్మికులు వేసవిలో తప్పకుండా జాగ్రత్తలు పాటించి పనులు చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య తెలిపారు. కాజీపేట మండల పరిధి కడిపికొండ, భట్టుపల్లి, కొత్తపల్లి గ్రామ శివార్లలో ఇటుకబట్టీల్లో నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ఆకస్మికంగా శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య సందర్శించి పలు సూచనలు చేశారు. ఓఆర్ఎస్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యులు తదితరులు పాల్గొన్నారు. కవి రామా చంద్రమౌళికి సాహిత్య పురస్కారంహన్మకొండ కల్చరల్: హైదరాబాద్ వంశీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రదానం చేయనున్న డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి సాహిత్య పురస్కారానికి వరంగల్కు చెందిన కవి, రచయిత రామా చంద్రమౌళి ఎంపికయ్యారు. ఈమేరకు ఉగాది సంబరాల్లో భాగంగా ఏప్రిల్ 12, 13 తేదీల్లో హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, వంశీ ఇంటర్నేషనల్ ఇండియా సంయుక్తంగా నిర్వహించే కార్యక్రమంలో రామాచంద్రమౌళికి ఈపురస్కారం అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వేతనాలు పెంచాలి.. గీసుకొండ: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ ఉద్యోగులకు రూ.26 వేల వేతనం ఇవ్వాలని ఎన్హెచ్ఎం కాంట్రా క్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐఎన్టీయూసీ అనుబంధ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేశ్ కోరారు. వరంగల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఆయుష్ ఉద్యోగులకు నెలకు రూ.13,800 చెల్లిస్తోందని, ఇందులో కటింగ్ పోను రూ.10,200 చేతికి వస్తున్నాయన్నారు. ఈ జీతం చాలక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవాలని కోరారు. -
నేడు రాములోరి కల్యాణం
నేడు (ఆదివారం) జరగనున్న సీతారాముల కల్యాణానికి నగరంలోని పలు రామాలయాలు, హనుమాన్ మందిరాలు ముస్తాబయ్యాయి. ఎండాకాలం కావడంతో భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు షామీయానాలు, పందిళ్లు వేశారు. మామిడి తోరణాలు, విద్యుద్దీపాలతో అలంకరించారు. వరంగల్ శివనగర్ రామాలయం, ఎల్లంబజార్లోని శ్రీసీతారామచంద్రస్వామి అలయం, హనుమకొండ రెవెన్యూ కాలనీలోని రామాలయం, వేయిస్తంభాల దేవాలయంతోపాటు పలు దేవస్థానాల్లో కల్యాణోత్సవాలు నిర్వహించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా వేయిస్తంభాల ఆలయంలో శనివారం ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు రుద్రాభిషేం చేశారు. రాములవారిని అయోధ్య రాముడిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. సీతారాముల కల్యాణం సందర్భంగా ద్వజారోహణం నిర్వహించారు. యాగశాలలో సుదర్శన హోమం జరిపారు. సీతారాముల కల్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని గంగు ఉపేంద్రశర్మ కోరారు. – హన్మకొండ కల్చరల్ -
సరస్వతీ పుష్కరాల్లో ‘జ్ఞానతీర్థం’ శోభ
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మే 15 నుంచి 26 వరకు సరస్వతీ పుష్కరాలు జరగనున్నాయి. ఇందులో జ్ఞానతీర్థం (ఆహ్వాన విగ్రహం) ఏర్పాటు చేయనున్నారు. పుష్కరాల అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్ల నిధులు మంజూరు చేసి విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యార్ పలుమార్లు సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలతో పనులు ఊపందుకున్నాయి. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక దృష్టి సారించడంతో పనుల్లో వేగం పెరిగింది. సరస్వతీ పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం రూ.20 లక్షలతో ‘జ్ఞాన తీర్థం’ ఎఫ్ఆర్పీ ఫైబర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తాళపత్ర గ్రంథాలతో రెండు చేతుల్లో దీపం వెలిగి ప్రకాశించేలా ఫైబర్ విగ్రహం నిర్మాణం చేయనున్నారు. దీని నమూనా చిత్రాలను అర్కిటెక్టులు, ఇంజినీర్లు తయారు చేశారు. ఈ విగ్రహం ఉద్దేశం ఏంటంటే.. పూర్వం ఓ కాకి.. నదిలో స్నానం చేసి హంసలా మారి జ్ఞానం పొందింది. అలా ఇక్కడి నదిలో స్నానం చేసిన భక్తులు జ్ఞానాన్ని పొందుతారని సారంశంగా, భక్తులను ఆహ్వానించేలా ఉండేలా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. అదేవిధంగా జ్ఞానతీర్థం (వీఐపీ) ఘాట్ రెయిలింగ్కు కాకి, హంస, మకరం చిత్రాలను రాతిపై చెక్కి అమర్చనున్నారు. -
తూర్పులో ‘ఫొటో’ రాజకీయం
సాక్షి, వరంగల్: వరంగల్ తూర్పులో రాజకీయం రాజుకుంటోంది. సన్న బియ్యం పంపిణీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. సన్న బియ్యంలో కేంద్రం వాటా ఎక్కువని, రాష్ట్రం వాటా చాలా తక్కువ అంటూ.. ఎక్కువ వాటా ఇస్తున్న ప్రధాని మోదీ చిత్రపటం లేకుండా, తక్కువ వాటా ఇచ్చే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటో ఎలా పెడతారంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. వరంగల్ నగరంలోని 27వ డివిజన్ గోవిందరాజులగుట్ట, 32వ డివిజన్లోని ఎస్ఆర్ఆర్ తోట, 37వ డివిజన్ తూర్పుకోటలోని కొత్తగడ్డ, 18వ డివిజన్ లేబర్ కాలనీలోని గాంధీనగర్ రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని శనివారం స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ఆయా రేషన్ షాపుల వద్ద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చిత్రపటాలు ఏర్పాటు చేశారు. ఒక్కో లబ్ధిదారుడికి ఇచ్చే ఆరు కిలోల బియ్యంలో ఐదు కిలోలు కేంద్రం నుంచే వస్తున్నాయని, కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందంటూ బీజేపీ నాయకులు వివిధ రేషన్ షాపుల వద్ద ఆందోళనకు దిగి ప్రధాని మోదీ చిత్రపటం పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంటా రవికుమార్, సీనియర్ నేత ఎర్రబెల్లి ప్రదీప్రావు, ఇతర నేతలు గిర్మాజీపేటలోని గోవిందరాజుల గుట్ట ప్రాంతంలోని ఓ రేషన్ దుకాణం వద్ద ప్రధాని మోదీ చిత్రపటం పట్టుకొని ఆందోళనకు దిగారు. ఆ సమయంలో కాంగ్రెస్ నేతల రాకతో కాస్త గొడవ జరిగినా.. ఆ తర్వాత పోలీసుల రాకతో సద్దుమణిగింది. ఓవైపు కాంగ్రెస్ సన్న బియ్యం క్రెడిట్ తమదేనని చెప్పుకుంటుంటే.. రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ ఫొటో ఏర్పాటు చేయాలని ఇంకోవైపు బీజేపీ డిమాండ్ చేస్తుండడం గమనార్హం. రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ చిత్రపటం పెట్టాలి.. కమలం వర్సెస్ కాంగ్రెస్గా మారిన సన్నబియ్యం పంపిణీ -
జగ్జీవన్ రామ్ను ఆదర్శంగా తీసుకోవాలి
హన్మకొండ: మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ను ఆదర్శంగా తీసుకోవాలని.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థి, యువత నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం శిక్షణ ఇస్తోందని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. శనివారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్ని నిర్వహించారు. ముందుగా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి కలెక్టర్ పి.ప్రావీణ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్.నాగరాజు, ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. నైపుణ్యాలు పెంపొందించేలా శిక్షణాభివృద్ధి కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. జిల్లాలో ఎస్బీఐ వారి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్తో పాటు స్టెప్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, టాస్క్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందని, దీంతో పాటు పరకాలలో టాస్క్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా ఉద్యోగావకాశాల కోసం శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, ఆర్.నాగరాజు మాట్లాడుతూ.. బాబూ జగ్జీవన్రామ్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమమన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి శ్రీలత, ఆర్డీఓ రమేశ్ రాథోడ్, బాబు జగ్జీవన్రామ్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ అంకేశ్వరపు రాంచందర్ రావు, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పుట్ట రవి, చుంచు రాజేందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, ఎస్టీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కొంగర జగన్మోహన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
టెక్స్టైల్ పార్క్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
పరకాల: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అన్నారు. టెక్స్టైల్ పార్కులో మంజూరు చేసిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి శ్రీధర్బాబు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి ఆదేశించారు. పరకాల మున్సిపల్ సమావేశమంది రంలో పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి అధ్యక్షతన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మెగా టెక్స్టైల్ పార్క్లోని ఇండస్ట్రీలో స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్య త ఇవ్వాలని, అందుకు స్కిల్ ట్రైనింగ్ సెంటర్ల ద్వా రా స్థానికులకు నైపుణ్యం కల్పించి నియమించుకో వాలని సూచించారు. ఆర్అండ్బీ లే అవుట్లో పట్టాలిచ్చిన 863 మంది రైతులకు వారి అభ్యర్థన మేరకు 50 గజాల నుంచి 75 గజాలు అందించేందుకు టీజీఐఐసీ ద్వారా అదనంగా రెండు ఎకరాల భూమి కేటాయించినట్లు తెలిపారు. తిరిగి లేఅవుట్ ప్లాట్లు చేసి రాజీవ్ గాంధీ టౌన్ షిప్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎంఎస్ఎంఈ జీడీపీ పథకం ద్వారా రూ.10.10 కోట్ల వ్యయంతో చేపట్టిన కనీస మౌలిక వసతులైన రోడ్లు, డ్రైన్స్, మంచినీటి సరఫరా, సంప్, పరిపాలన భవన నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయని, జూలై 2025 నాటికి పూర్తవుతాయని అధికారులు మంత్రికి వివరించారు. గంజాయి, గుడుంబా నివారణకు చర్యలు టెక్స్టైల్ పార్క్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కూలీలు గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం ఉందని అలాంటి కార్యకలాపాలపై పోలీసులు దృష్టిసారించాలని ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి కోరారు. ఒక్కో ఉద్యోగానికి 3వేల మంది పోటీ రాష్ట్రంలో ఒక్కో ఉద్యోగానికి 3వేల మంది ఉద్యోగులు పోటీ పడుతున్నారు.. గత ప్రభుత్వం ఖాళీ అయిన ఉద్యోగాలనే భర్తీ చేయకపోవడంతో నిరుదోగుల సంఖ్య పెరిగిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల పురపాలక శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. పరకాల పట్టణంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి చొరవతో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ప్రారంభించి, ఉద్యోగాలు దక్కించుకున్న అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్లను మంత్రి అందజేసి మా ట్లాడారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో స్కిల్ యూనివర్సిటీ, అన్ని జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పరకాల, హనుమకొండ, వర్ధన్నపేట, భూపాలపల్లి ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, నాయిని రాజేందర్రెడ్డి, నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే, డీఎఫ్ఓ అనుజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్లు వెంకట్రెడ్డి, సంధ్యారాణి, డీఆర్డీఓ శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ది పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశంకుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం పరకాల నియోజకవర్గ కేంద్రానికి మంజూరైన కుట్టు శిక్షణ కేంద్రాన్ని మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గంలో ని నాలుగు మండలాల్లో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాల ద్వారా 51 బ్యాచ్లలో 1,717 మంది మహిళలకు శిక్షణ ఇచ్చి, శిక్షణ పూర్తి చేసుకున్న 82 మంది మహిళలకు మంత్రి చేతుల మీదుగా అపాయింట్మెంట్ పత్రాలు అందజేశారు.