Hanamkonda District News
-
కుటుంబ కలహాలతో భార్యపై భర్త దాడి
ఎంజీఎం : కుటుంబ కలహాలతో భార్యపై భర్త కత్తితో దాడికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన అత్తామామలపై కూడా దాడి చేశాడు. ఈ ఘటన వరంగల్ పోచమ్మమైదాన్ సమీపంలోని వాసవీ కాలనీలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వాసవీ కాలనీ చెందిన జన్నుబాబు–అనిత దంపతుల కుమార్తె పల్లవి ఉర్సు ప్రాంతానికి చెందిన కోట చంద్రశేఖర్ను రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. కొన్ని రోజులు పాటు సాఫీగా సాగిన క్రమంలో గతేడాది నుంచి దంపతుల మధ్య వివాదాలు తలెత్తాయి. వీరికి కుమారుడు జన్మించాడు. చంద్రశేఖర్తో వివాదం కారణంగా పల్లవి తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. రెండ్రోజుల క్రితం చంద్రశేఖర్ కొడుకును తీసుకెళ్లడానికి అత్తగారి ఇంటి రాగా భార్య, అత్తామామ నిరాకరించారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం పల్లవి కొడుకుకు పాలు ఇస్తుండగా చంద్రశేఖర్ కత్తితో వచ్చి నేరుగా భార్య తలపై నరికాడు. ఈ ఘటనలో ఆమె అక్కడే రక్తపు మడుగులో పడిపోయింది. ఈ సమయంలో అత్తామామలు అడ్డుపడగా వారిపై కూడా దాడి చేసి వెళ్లిపోయాడు. తీవ్ర గాయాలపాలైన ముగ్గురిని స్థానికులు చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. కాగా, పల్లవి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అత్త అనిత, మామ బాబు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మట్టెవాడ పోలీసులు తెలిపారు.● అడ్డొచ్చిన అత్తామామలపై సైతం.. ● బాధితులకు ఎంజీఎంలో చికిత్స ● వాసవీ కాలనీలో దారుణం -
మాతృభాషకు ఓరుగల్లు మణిహారం..
భాషను విస్మరిస్తే తీవ్ర నష్టం.. మాతృభాష మాట్లాడే యువత సంఖ్య తగ్గిపోతోంది. దీనిని చూసి తల్లిదండ్రులు కూడా సంతోషిస్తున్నారు. కానీ ఒకజాతి సంస్కృతి ధ్వంసమవుతున్నదని వారికి తెలియడం లేదు. ఒక భాష అంతరిస్తే వారి సాహిత్యంతో పాటు, ఆ భాష మాట్లాడే జాతి కూడా అంతరించిపోతుంది. ప్రొఫెసర్ భూక్య బాబురావు, పీఠాధిపతి, జానపద గిరిజన విజ్ఞానపీఠం తెలుగు భాషను గుబాళింపజేసిన ఓరుగల్లు సాహితీవేత్తలు.. కాకతీయులు ఓరుగల్లును రాజధానిగా చేసుకుని యావత్ ఆంధ్రాదేశాన్ని పాలించారు. దీంతో పాటు ఓరుగల్లు నాటి నుంచే సారస్వత రంగంలోనూ ప్రముఖపాత్ర వహించింది. కాకతి గణపతిదేవచక్రవర్తి ఆ స్థానాన్ని సందర్శించిన తర్వాతే తిక్కన సోమయాజీ మహాభారత రచన చేపట్టినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 13వ శతాబ్దంలో పాలకుర్తిలో జన్మించిన సోమనాథుడు బసవపురాణాన్ని, 14వ శతాబ్దంలో పొతానామాత్యులు మహాభాగవతాన్ని రచించారు. ఎందరో కవులు పురాణాలను తెలుగులోకి అనువదించిన వారున్నారు. ఆధునిక కాలంలో రచనలు చేసిన వారిలో మాడపాటి హన్మంతరావు మొదటివారు. హన్మంతరావు 1911లో రాసిన నవనాగరికత మొదటికథగా చెప్పుకోవచ్చు. ఆ తరువాత 1927లో వద్దిరాజు రాఘవ రంగారావు, వద్దిరాజు సీతారామచంద్రరావులు, పెండ్యాల రాఘవరావు, కాళోజీ నారాయణరావు, పి.వి. నరసింహారావు, పొట్లపల్లి రామారావు, దాశరథి రంగాచార్యులు, టి. హైయగ్రీవాచారి, బండారు చంద్రమౌళీశ్వరరావు, అడ్లూరి అయోధ్యరామయ్య, బిరుదురాజు రామరాజు, పెండ్యాల శేషగిరిరావు, దేవులపల్లి రామానుజరావు, వాసుదేవరావు, తదితరులు కథలు రాశారు. ధూపాటివెంకటరమణాచార్యులు పి.వి. నరసింహారావు, కాళోజీ నారాయణరావు, బండారు సదాశివరావు, అంపశయ్య నవీన్ నుంచి ఇప్పటి వరకు రాస్తున్న కొత్త తరం కవిత్వం కథ నవల విమర్శనా రంగాల్లో జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేశారు. తెలుగుభాషను గుబాళింపజేస్తున్నారు. విజయవాడ తర్వాత తెలుగునాటకాన్ని రక్తికట్టించింది కూడా ఈ నేలపైనే. తెలుగులోనే పరిపాలన వ్యవహారాలు జరగాలని, ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే వెలువరించాలని, డిగ్రీలో కూడా తెలుగు ఒక పాఠ్యాంశంగా ఉండాలని, తెలుగు భాషను అభివృద్ధి చేయాలని కోరుతూ తెలుగుభాషోద్యమ సమాఖ్య ద్వారా కృషి చేశారు. ఓటరు వద్దకు వెళ్లి తెలుగులో ఓటు అడగడం తప్పు కానప్పుడు తెలుగులో పాలన వ్యవహరాలు ఎందుకు నిర్వహించరని ప్రశ్నించారు. ఆచార్య పేర్వారం జగన్నాథం, వడుగు గోపాల్రావు, ఆచార్య హైమావతి తదితరులు తెలుగుభాష అభివృద్ధి కృషిచేశారు. 2012 తరువాత తెలుగుభాషోద్యమం కనుమరుగైంది. తెలుగుభాషోద్యమ కేంద్రం ... హనుమకొండలోని శ్రీరాజరాజనరేంద్రాంధ్రభాషా నిలయానికి ఘనచరిత్ర ఉంది. నిజాం వ్యతిరేక స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించింది. నిజాంల కాలంలో మొదట అధికార భాషగా పర్షియన్ ఉండేది. తర్వాత ఉర్దూ అధికార భాషగా స్థానం పొందింది. పాఠశాలలో ఉర్దూ మీడియంలోనే చెప్పేవారు. 90 శాతం ప్రజల మాతృ భాషగా ఉన్న తెలుగులో చదువుకునే అవకాశం లేదు. అలాంటి పరిస్థితులలో నిజాం రాష్ట్రంలో పలుచోట్ల పౌరగ్రంథాలయాల స్థాపన ఉద్యమంగా జరిగింది. వీటిలో మొదటిది సెప్టెంబర్, 1, 1901లో స్థాపించబడిన శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషా నిలయం కాగా, రెండోది 1904 ఫిబ్రవరి 2 తేదీన శ్రీరాజరాజనరేంద్రాంధ్రభాషా నిలయం కావడం విశేషం. ధూపాటి వెంకటరమణచార్యులు సేకరించిన ఎన్నో అమూల్య తాళపత్రగ్రంథాలు, శాసనాల అచ్చులు, పురాతన నాణెలు ఈ గ్రంథాలయంలోనే భద్రపరిచారు. పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ, మహాకవి శ్రీశ్రీ, కవిసామ్రాట్ విశ్వనాథసత్యనారాయణ, గుర్రం జాషువా వంటి ఎందరో విభిన్న సాహితీవేత్తలు ఇక్కడే ఉపన్యాసాలు ఇచ్చారు. మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు, జాతీయాచార్యులు బిరుదురాజు రామరాజు వంటి ఎందరో ప్రముఖులు ఇక్కడే చదువుకున్నారు. తెలంగాణలో తెలుగుభాషా ఉద్యమానికి కృషి చేసిన ప్రముఖ కేంద్రాల్లో భాషానిలయం కూడా ఒకటి కావడం మనకు గర్వకారణం.– హన్మకొండ కల్చరల్ తెలుగు భాషను గుబాళింపజేసిన ఉమ్మడి జిల్లా సాహితీవేత్తలుపుట్టిన ప్రతీ ఒక్కరిది మొదట మాతృభాషనే. వారి తల్లిదండ్రులు, చుట్టూ సమాజం పెంచి పెద్ద చేస్తుంది. తల్లిమీద గౌరవం ఎంత ఉంటుందో మాతృభాషపై కూడా అంతే గౌరవం ఉండాలి. అందుకే ఏ దేశస్తుడికై నా మాతృభాషపై మమకారం ఉండాలన్నది పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు సిద్ధాంతం. పూర్తిగా తెలుగు రానివారి గురించి బాధలేదు. కానీ తెలుగు రాయడం.. చదవడం వచ్చిన వారు కూడా భాష రాదని ఫోజు కొట్టడం చూసి కాళోజీ తీవ్రంగా మందలించేవారు. కాగా, శుక్రవారం(21వ తేదీ) అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఇతర భాషల్లో ప్రావీణ్యం ఉండదు.. అమ్మ ఒడిలో ఉగ్గుపాలతో నేర్చుకున్న మాతృభాషలో విద్యను బోధించడం వల్ల విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. మాతృభాష రానివారికి ఇతరభాషల్లోనూ ప్రావీణ్యం ఉండదు. ప్రతిఒక్కరూ మాతృభాషలో పండితుడు కావాల్సిన అవసరం లేదు. కనీసం అర్థం చేసుకోగలిగితే, మాట్లాడగలిగితే చాలు. –రామారత్నమాల, అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగువిభాగం, పింగిళి కళాశాలఏ భాషరా నీది? యేమి వేషమురా? 1942లో నిజాం రాష్ట్రంలో ప్రజలు తమ మాతృభాష తెలుగుపై నిరాదరణతో ఉండడం చూసి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు స్పందించారు. ఏ భాషరా నీది? యేమి వేషమురా? /ఈ భాష ఈవేష మెవరి కోసమురా?/ ఆంగ్లమందున మాటలాడ గలుగగనే/ ఇంతగా గుల్కెదవు ఎందుకోసమురా?/ అన్యభాషలు నేర్చి ఆంధ్రంబురాదంచు/ సకిలించు ఆంధ్రుడా ! చావవెందుకురా? అంటూ అలాంటి వారిని అపహస్యం చేశారు. -
చోరీ కేసులో మహిళ అరెస్ట్
ఖిలా వరంగల్ : చోరీ కేసులో ఓ మహిళను అరెస్ట్ చేసి ఆమె వద్ద నుంచి రూ.5లక్షల విలువైన 61 గ్రాముల బంగారు, 120 గ్రాముల వెండి ఆభరణా లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు వరంగల్ మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం తెలిపారు. వరంగల్ శంభునిపేట విశ్వనాథ కాలనీలో నివాసముంటున్న గజ్జెల్లి ప్రశాంత్ తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతూ జనవరిలో చికిత్స నిమిత్తం హైదరాబాద్కు వెళ్లగా, చోరీ జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో ప్రశాంత్ బంధువు గజ్జెల్లి సుజాత చోరీకి పాల్పనట్లు గుర్తించారు. దొంగిలించిన సొమ్ము రికవరీ మడికొండ: మడికొండ పీఎస్ పరిధిలోని కడిపికొండ రాజీవ్ గృహకల్ప ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న కోట శ్రీనివాస్ ఇంటిలో ఈనెల 12వ తేదీన జరిగిన చోరీ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి సొమ్ము రికవరీ చేశారు. అయోధ్యపురం రైల్వే గేటు వద్ద మడికొండ ఇన్స్పెక్టర్ కిషన్ సిబ్బందితో కలిసి గురువారం వాహన తనిఖీ చేస్తున్నారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులు బానోతు ఉదయ్, బిర్రు ప్రణిత్ను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా బంగారం లభించింది. విచారించగా ఈనెల 12న రాజీవ్ గృహకల్ప ఇందిరమ్మ కాలనీలో కోట శ్రీనివాస్ ఇంట్లో చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో రూ.17 లక్షల విలువైన 240 గ్రాముల బంగారం, రూ.8,700 నగదు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. రూ.5లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం -
యూత్ ఫెస్టివల్తో నాయకత్వ లక్షణాలు
● ఎస్సార్ యూనివర్సిటీ వీసీ దీపక్ గార్గ్ హసన్పర్తి: యూత్ ఫెస్టివల్తో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని ఎస్సార్ యూనివర్సిటీ వీసీ దీపక్ గార్గ్ అన్నారు. ఎస్సార్ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో గురువారం యూత్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వీసీ దీపక్ గార్గ్ మాట్లాడారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మక శక్తులను వెలికి తీయడానికి ఈ వేదిక ఉపయోగపడుతోందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ అంశాల్లో తమ ప్రదర్శనలు ఇచ్చారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ అర్చనారెడ్డి, డాక్టర్ వి.మహేశ్, డాక్టర్ వి.వి.వి.సుధాకర్, ఎన్ఎస్ఎస్ కోర్డినేటర్ డాక్టర్ కె. రవీందర్ తదితరులు పాల్గొన్నారు. మెరుగైన వైద్యసేవలతోనే గుర్తింపు ఖమ్మంవైద్యవిభాగం: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడంతోనే ఆస్పత్రులకు గుర్తింపు లభిస్తుందని పలువురు వైద్యులు పేర్కొన్నారు. గురువారం ఖమ్మం నెహ్రూనగర్లోని ‘అఖిల’ కంటి ఆస్పత్రి ఏడో వార్షికోత్సవం నిర్వహించగా డాక్టర్ వాసిరెడ్డి రామనాథం ఓపీ చాంబర్ను ప్రారంభించారు. అనంతరం డాక్టర్ అఖిల మాట్లాడుతూ నెలలు నిండకుండా జన్మించిన చిన్నారుల్లో రెటీనా సంబంధిత సమస్యలు ఎదురైతే వైద్యం అందించడం సంతృప్తిగా ఉందని తెలిపారు. ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ మాధవి, మేనేజింగ్ డైరెక్టర్ కుతుంబాక మధు, డాక్టర్ సమత, శ్రీధర్, సతీశ్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల పునర్నియామకం హన్మకొండ: వివిధ కారణాలతో తొలగించిన ఆర్టీసీ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. గురువారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియ న్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నలు గురు డ్రైవర్లు, నలుగురు కండక్టర్లను పునర్నియామకం చేస్తూ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎం విజయభాను మాట్లాడుతూ ఉద్యోగులు అంకితభావం, నిబద్దత, నిజాయితీతో విధులు నిర్వర్తించాలన్నారు. కుటుంబ సభ్యులు విధులకు వచ్చే వారిని మానసిక ప్రశాంతతో పంపించా లన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. గతంలో జరిగిన తప్పులు, పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలన్నారు. డిప్యూటీ ఆర్ఎంలు కేశరాజు భా నుకిరణ్, మాధ వరావు, పర్సనల్ ఆఫీసర్ ఆర్పిత పాల్గొన్నారు. -
ఉమ్మడి గురుకులాల ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
● హనుమకొండ జిల్లా కోఆర్డినేటర్ దాసరి ఉమామహేశ్వరి మడికొండ: తెలంగాణ రాష్ట్ర గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసిన ట్లు హనుమకొండ జిల్లా కోఆర్డినేటర్, మడికొండ బాలికల పాఠశాల ప్రిన్సి పాల్ దాసరి ఉమామహేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు. హాల్ టికెట్లు సంబంధిత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. హనుమకొండ జిల్లా పరిధిలో మొత్తం 16 సెంటర్లు కేటాయించినట్లు తెలిపారు. 16 సెంటర్లలో 5వ తరగతిలో 2,548, 6లో 895, 7లో 451, 8లో 329, 9వ తరగతిలో 286 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నట్లు చెప్పారు. మొత్తం 4,509 మంది హనుమకొండ జిల్లాలో పరీక్ష రాయనున్నారు. పరీక్ష కేంద్రాన్ని ఒక రోజు ముందు చూసుకోవాలని సూచించారు. పరీక్ష రోజు కేంద్రం వద్దకు ఉదయం 9.30 గంటలకు చేరుకోవాలన్నారు. పరీక్ష ప్యాడ్, బ్లూ, బ్లాక్ పెన్, ఆధార్ కార్డు, హాల్ టికెట్ తప్పకుండా తీసుకుని రావాలన్నారు. -
క్లైమాక్స్కు రాజలింగమూర్తి హత్య కేసు
సాక్షిప్రతినిధి, వరంగల్/భూపాలపల్లి/భూపాలపల్లి అర్బన్: మాజీ కౌన్సిలర్ భర్త, సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగమూర్తి (49) హత్య కేసు క్లైమాక్స్కు చేరింది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం రాజలింగమూర్తి దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. మృతుడి భార్య సరళ ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసిన భూపాలపల్లి పోలీసులు మూడు ప్రత్యేక టీమ్లుగా ఏర్పడి విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఇద్దరు నిందితులను గురువారం ఉదయమే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రాథమిక విచారణలో హత్యకు గల కారణాలపై స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది. మరో ముగ్గురిని కూడా త్వరలోనే పట్టుకోగలమన్న ధీమాను పోలీసులు వ్యక్తం చేయగా.. శుక్రవారం నిందితులను మీడియా ముందు హాజరుపర్చి వాస్తవాలు వెల్లడించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.నాగవెళ్లి సరళ ఫిర్యాదులో ఏముంది..?భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట రాజలింగమూర్తి కుటుంబానికి భూమి ఉందని, ఆ భూమికి సంబంధించి రేణుకుంట్ల కొమురయ్య, రేణుకుంట్ల సంజీవ్ కుటుంబ సభ్యులతో తన భర్తకు గొడవ జరుగుతోందని, బెదిరింపులతో తమ భూమిని కాజేసే ప్రయత్నం చేయగా సివిల్ కోర్టును ఆశయ్రించారని రాజలింగమూర్తి భార్య సరళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. చాలా రోజులుగా ఈ కేసు నడుస్తున్నా.. త్వరలోనే తీర్పు రానుందని గమనించిన వారు తమ భూమిని ఎలాగైనా కాజేయాలనే ఉద్దేశంతో తన భర్త రాజలింగమూర్తిని చంపాలని పథకం వేశారని ఆరోపించింది. ఈ మేరకు రేణుకుంట్ల సంజీవ్, పింగిలి శమంత్ అలియాస్ బబ్లూ, మోరె కుమార్, కొత్తూరి కుమార్ అనే నలుగురు వ్యక్తులు బుధవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో పట్టణంలోని టీబీజీకేఎస్ ఆఫీసు దగ్గరలో రాజలింగమూర్తి వెళ్తుండగా, రెండు వాహనాల మీద వచ్చి ఇనుపరాడ్లతో తలమీద కొట్టి, కడుపు భాగంలో కత్తితో పొడిచి కిరాతకంగా తన భర్త రాజలింగమూర్తిని చంపారని సరళ ఆ ఫిర్యాదులో పేర్కొంది. తన భర్తకు హత్యకు గురయ్యారని తమకు తెలిసినవాళ్లు ఇచ్చిన సమాచారంతో భూపాలపల్లిలోని వంద పడకల ప్రభుత్వ ఆస్పకి వెళ్లేసరికి అప్పటికే తన భర్త చనిపోయి ఉన్నాడని పేర్కొన్నారు. తన భర్తను హత్యచేసిన వారిపై, ఈ హత్యకు వెనుక ఉండి వ్యూహరచన చేసి ప్రోత్సహించిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సరళ ఫిర్యాదులో పోలీసులను కోరారు.గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు..జిల్లా కేంద్రంలో అటవీ, ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై మృతుడు రాజలింగమూర్తి కోర్టుల్లో ప్రైవేట్ కేసులు వేసేవాడు. ఆ భూములను ఆయా శాఖలకు అప్పగించే వరకు పోరాడేది. గతంలో భూపాలపల్లిలో ఓపెన్కాస్ట్ ఏర్పాటుపై గ్రీన్ ట్రిబ్యునల్ను సైతం ఆశ్రయించాడు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, రాష్ట్రస్థాయి అధికారులు, కాంట్రాక్టర్పై జిల్లా కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. సామాజిక కార్యకర్తగా పని చేస్తున్న తనకు కొందరి నుంచి ముప్పు ఉందని, గన్ లైసెన్స్ కావాలని ఆరు నెలల క్రితం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించినట్లు సమాచారం. కలెక్టర్ ఆ లేఖను జిల్లా ఎస్పీకి పంపగా, పోలీసు అధికారులు విచారణ జరిపారు. రాజలింగమూర్తిపై పలు క్రిమినల్ కేసులు ఉన్నందున గన్ లైసెన్స్ ఇవ్వలేమని వెల్లడించినట్లు సమాచారం.బీఆర్ఎస్ నేతలపై ఆరోపణ.. రంగలోకి ఎస్పీతన భర్త రాజలింగమూర్తి హత్య వెనుక బీఆర్ఎస్ నాయకుల కుట్ర ఉందని ఆరోపిస్తూ మృతుడి భార్య సరళ, బంధువులు బుధవారం రాత్రి 2 గంటల వరకు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. సహకరించిన బీఆర్ఎస్ నేతల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం ఉదయం మృతదేహానికి పోస్ట్మార్టం చేసిన అనంతరం జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే తమకు హామీ ఇస్తేనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంటామని సరళ పట్టుబట్టింది. దీంతో ఎస్పీ స్థానిక పోలీస్స్టేషన్కు రాగా మృతుడి కుటుంబ సభ్యులు వెళ్లి మాట్లాడారు. అనంతరం మృతదేహాన్ని తీసుకుని దహన సంస్కారాలు నిర్వహించారు.రాజకీయ పార్టీలకు అంశంగా రాజలింగమూర్తి హత్య..భూపాలపల్లి ఘటనలో రాజలింగమూర్తి హత్య రాజ కీయ పార్టీలకు ఆరోపణలు, ప్రత్యారోపణలకు వేదికగా మారింది. ఈ హత్యపై పూర్తి వివరాలు కోసం హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం ఇంటెలిజె న్స్, స్పెషల్బ్రాంచ్ల ద్వారా ఆరా తీసింది. ఇదే సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ ఘటనపై చేసిన వ్యాఖ్యలు భూపాలపల్లి ప్రాంతంలో చర్చనీయాంశం కాగా.. మరోవైపు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ హత్యపై స్పందించి తగిన విచారణను కోరామన్నారు. బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి స్పందిస్తూ రాజలింగమూర్తి హత్యతో తనకు గానీ, బీఆర్ఎస్ పార్టీకి గాని ఎలాంటి సంబంధమూ లేదని ఖండించారు. ఐదుగురిపై ఎఫ్ఐఆర్.. పోలీసుల అదుపులో ఇద్దరు..రాజలింగమూర్తి హత్య కేసులో ఐదుగురిపై కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఏ–1గా రేణుకుంట్ల సంజీవ్, ఏ–2గా పింగిలి శ్రీమాంత్(శామంత్) (బబ్లూ), ఏ–3గా మోరె కుమార్, ఏ–4 గా కొత్తూరి కుమార్, ఏ–5గా రేణుకుంట్ల కొమురయ్యను ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. హత్యకేసులో పాల్గొన్న వారిపై తమకు అందిన ఫిర్యాదు ప్రకారం పోలీసులు క్రైంనంబర్ 117/2025 ద్వారా బీఎన్ఎస్ చట్టంలోని 191(20; 191(3), 61(2),103(2), రెడ్ విత్ 190 సెక్షన్ల కింద ప్రాథమికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ రాజలింగమూర్తి కోర్టును ఆశ్రయించినప్పటికీ స్థానిక భూ వివాదం కారణంగానే హత్యకు గురయ్యాడన్న చర్చ జరుగుతోంది. భూపాలపల్లి పోలీస్స్టేషన్ ఎదుట గల సర్వే నంబర్ 319లో మొత్తం 2.25 ఎకరాల భూమి ఉంది. అందులో 1.25 ఎకరాల భూమికి సంబంధించి రాజలింగమూర్తికి మరో కొంతమందికి వివాదం నెలకొన్న విషయం తెలిసింది.నిందితులెవరైనా వదలం : భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావుహత్యకు దారి తీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు చెప్పారు. నిందితులకు రాజలింగమూర్తితో భూ తగాదాలున్నట్లు పేర్కొంటూ, ఇతర కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ మీడియాకు చెప్పారు. హత్య వెనుక ఎవరున్నప్పటికీ వదిలిపెట్టబోమని, అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతోందని స్పష్టం చేశారు. కాగా, రాజలింగమూర్తి హత్య కేసులో తాము ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని తెలిపారు. -
నేటినుంచి ఎల్ఎల్బీ సెమిస్టర్ల పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి లో ఎల్ఎల్బీ మూడేళ్ల మొదటి సంవత్సరం మొద టి సెమిస్టర్ పరీక్షలు శుక్రవారం నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఆసిం ఇక్బాల్ గురువారం తెలిపారు. ఈనెల 21, 2 4, 28, మార్చి 3, 5వ తేదీల్లో పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతా యని తెలిపారు. ఎల్ఎల్బీ మూడేళ్ల లా కోర్సు ఐదో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 22 నుంచి నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఈనెల 22, 25, మా ర్చి 1,4, 6 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఐదేళ్ల లా కోర్సు 5వ సెమిస్టర్ పరీక్షలు ఐదేళ్ల లా కోర్సు ఐదో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 21 నుంచి నిర్వహించనున్నారు. ఈనెల 21, 24, 28, మార్చి3, 5తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయని పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. ఐదేళ్ల లా కోర్సు తొమ్మిదో సెమిస్టర్ పరీక్షలు ఐదేళ్ల లా కోర్సు తొమ్మిదో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 22 నుంచి నిర్వహించనున్నారు. ఈనెల 22, 25, మార్చి 1, 4, 6వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయని పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. దూరవిద్య పీజీ పరీక్షలు ప్రారంభం కాకతీయ యూనివర్సిటీ పరిధిలో దూరవిద్య పీజీ కోర్సుల ఎంఏ, ఎంకామ్ తదితర పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని రిజిస్ట్రార్ వి. రామచంద్రం, పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, దూరవిద్య కేంద్రం డైరెక్టర్ బి. సురేశ్లాల్ సందర్శంచి పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. వీరి వెంట ఆ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పుల్లారమేశ్ ఉన్నారు. -
రాజలింగమూర్తి కేసును సీబీఐకి అప్పగించాలి
హన్మకొండ: భూపాలపల్లిలో హత్యకు గురైన రాజ లింగమూర్తి కుటుంబానికి న్యాయం జరగాలంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె.ఎ.పాల్ డిమాండ్ చేశారు. గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజలింగమూర్తిని హత్య చేసిన దుండగులను ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలన్నారు. పోలీసులు, అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు భయపడొద్దన్నారు. రాష్ట్రంలో 13 నెలల్లో లెక్కలేనన్ని హత్యలు, లైంగికదాడులు జరుగుతుంటే సీఎం రేవంత్ ఎందుకు స్పందించడం లేదని, రాష్ట్రంలో హోం మంత్రిని ఎందుకు నియమించడం లేదని ప్రశ్నించారు. రాజలింగమూర్తి కుటుంబానికి రూ. కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్.కృష్ణయ్య రాజకీయ పార్టీలకు బానిసయ్యాడని, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో బానిసలుగా ఉన్న బీసీలు బయటకు రావాలని పిలుపునిచ్చారు.. తనను సీఎం చేయాలన్నారు. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె.ఎ.పాల్ -
మత్తు పదార్థాలను నియంత్రించాలి
వరంగల్: జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీ రవీందర్తో కలిసి మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 16 పీఎంశ్రీ ప్రభుత్వ పాఠశాలల్లో అవగాహన, చైతన్యం కల్పిస్తే సమాజంలో మార్పు తీసుకురావొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. డీసీపీ రవీందర్ మాట్లాడుతూ ప్రతీనెల నార్కొటిక్ కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్ఓ విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చందర్, ఎఫ్ఆర్ఓ సందీప్, నార్కొటిక్స్ డీఎస్పీ సైదులు, డ్రగ్ ఇన్స్పెక్టర్ అరవింద్ కుమార్ పాల్గొన్నారు. మార్చి 17వరకు సీఎంఆర్ పూర్తి చేయాలి జిల్లాలో 2023–24 రబీకి సంబంధించిన సీఎంఆర్ మార్చి 17 నాటికి పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులు, మిల్లర్లతో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడారు. 2024–25 రబీ సీజన్లో 2 లక్షల 10వేల మెట్రిట్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా ఉందని తెలిపారు. 2023–24 ఖరీఫ్ సీఎంఆర్ 100 శాతం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఏఓ అనురాధ, జిల్లా పౌర సరఫరాల అధికారి కిష్టయ్య , పౌరసరఫరాల సంస్థ మేనేజర్ సంధ్యారాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రానికి, జిల్లాకు పేరు తేవాలి లక్నోలోని కేడీ సింగ్బాబు స్టేడియంలో జరుగనున్న బ్లైండ్ పారా జోడో జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధించి తెలంగాణ రాష్ట్రంతోపాటు జిల్లాకు పేరు తేవాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. ఈనెల 18న హైదరాబాద్లో జరిగిన బ్లైండ్ పారా జోడో పోటీల్లో జిల్లా నుంచి పాల్గొని బంగారు పతకాలు సాధించి, జాతీయ పోటీలకు అర్హత పొందిన క్రీడాకారులను గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ టీవీఎల్.సత్యవాణి, క్రీడాకారులు జేశ్యనాథ్, రాంచరణ్, జీవన్, హరిహరణ్, శ్రీకాంత్, నాగరాజు, సతీశ్, వినోద్, గౌతం పాల్గొన్నారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద -
కత్తి, రాడ్ల దాడుల కలకలం
గ్రేటర్ వరంగల్ పరిధిలో గురువారం పలుచోట్ల కత్తుల దాడులు కలకలం రేపాయి. పోచమ్మమైదాన్ సమీపంలోని వాసవి కాలనీలో కుటుంబ కలహాలతో భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. అడ్డొచ్చిన అత్తామామలపై విరుచుకుపడ్డాడు. హసన్పర్తి మండలం మడిపల్లిలో జరిగిన పెళ్లిబరాత్లో ఇద్దరు కత్తిపోట్లకు గురికాగా, వారి పరిస్థితి విషమంగా ఉంది. భట్టుపల్లి రహదారిపై అమ్మవారిపేట క్రాస్ రోడ్డు సమీపాన కారును ఆపేసిన దుండగులు అందులోని ప్రయాణికుడిపై రాడ్లతో దాడి చేశారు. ఒకేరోజు మూడు ఘటనలు జరగడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. -
శుక్రవారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 202
విద్యారణ్యపురి: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం పాఠశాల విద్యాశాఖ, తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో సంయుక్తంగా పాఠశాలల్లో మాదక ద్రవ్యాల నివారణకు ప్రహరీక్లబ్లను ఏర్పాటు చేస్తున్నాయి. హనుమకొండ జిల్లాలో ఇప్పటికే 128 ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు సుమారు 4వేల మంది విద్యార్థులకు ఆరోగ్యశాఖ, పోలీస్శాఖవారితో డ్రగ్స్ నివారణపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల్లోనూ ప్రహరీక్లబ్ల ఏర్పాటుకు ఉపక్రమించినట్లు గురువారం హనుమకొండ డీఈఓ డి.వాసంతి, సమ్మిళిత విద్య కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి తెలిపారు. అన్ని ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ●ట్రోల్ఫ్రీ నంబర్ 1908పాఠశాలల్లోని ప్రహరీ క్లబ్ సభ్యులు వారి పాఠశాలల్లో కానీ, ఆవాస ప్రాంతాల్లో కానీ ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లు, విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1908కి కాల్ చేసి చెప్పాలి. లేదా గ్రామ పోలీస్ అధికారికి సమాచారం ఇవ్వాలి. వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు. దీనిద్వారా సులభంగా డ్రగ్స్ను కట్టడిచేయవచ్చనే భావన. తరగతి గదిలో ఇతర విద్యార్థులతో కలవకుండా ఒంటరిగా ఉండే పిల్లల మీద కూడా ప్రహరీక్లబ్ నిఘా ఉండాల్సిన అవసరం ఉందని సంబంధిత అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలోని 128 ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు క్లబ్లో 13మంది సభ్యులు అసాధారణ ప్రవర్తన కలిగిన పిల్లల గుర్తింపు.. నిఘా -
రెండు చోరీల్లో రికవరీ..
నగరంలోని మడికొండ, మిల్స్ కాలనీ స్టేషన్ల పరిధిలో జరిగిన వేర్వేరు చోరీల ఘటనలో నిందితులనుంచి పోలీసులు బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. కై ్లమాక్స్కు రాజలింగమూర్తి హత్య కేసు నాగవెళ్లి రాజలింగమూర్తి (49) హత్య కేసు క్లైమాక్స్కు చేరింది. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.– 8లోuచదువుతోపాటు క్రీడలు, కళారంగాలపై దృష్టి ఉన్నత పాఠశాలల విద్యార్థులు యుక్తవయస్సు ఆరంభ దశలో ఉంటారు. ప్రతి విషయంలోనూ ఆసక్తి చూపడం, తెలుసుకోవాలనే ఉత్సుకత ఉంటుంది. శారీరక, మానసిక పరిపక్వత రెండింటి మధ్య సందిగ్ధంలో ఉంటారు. ఈ వయస్సుగల పిల్లలకు వారికి గల నైపుణ్యాలకు అనుగుణంగా సరైన మార్గదర్శకత్వం చేసి క్రీడలు, కళారంగాలవైపు మళ్లిస్తే సృజనాత్మక శక్తి మరింతగా పెరుగుతుంది. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు వివరిస్తూ మంచి పౌరులుగా ఎదిగేలా కృషిచేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. – డి.వాసంతి, హనుమకొండ డీఈఓ -
బల్దియా ఖర్చు చేసిన ప్రజాధనం (రూ. కోట్లలో)
వరంగల్ అర్బన్: ప్రత్యేక రోజుల్లో భవనాలు, పండుగ సమయాల్లో భక్తుల సౌకర్యార్థం బల్దియా విద్యుత్ లైట్లు ఏర్పాటు చేస్తోంది. వీటి పేరిట ఏటా రూ.కోట్ల ప్రజాధనం వెచ్చిస్తోంది. వీటి కోసం బల్దియా వేలం నిర్వహిస్తోంది. ఇవి వెలిగినా వెలగకపోయినా.. అధికారులు పర్యవేక్షించరు. వారికొచ్చే వాటా ముడితే చాలు.. చూసీ చూడనట్లుగా వదిలేస్తారు. ఈతతంగమంతా ఏడాది పొడవునా నడిచినా.. తమకు బిల్లులు రావాలంటే మాత్రం పర్సంటేజీలు ఇవ్వాల్సిందేనని అధికారులు డిమాండ్ చేస్తున్నట్లు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు.. వెలుగుల కోసం రూ.5 కోట్లు.. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ ఇలంబర్తి పండుగలు, వేడుకల పేరిట ప్రతీ ఏటా రూ.500 కోట్లు నిధులు ఖర్చవుతున్నాయా? అని ఆశ్యర్యం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. ఇదే తరహాలో గ్రేటర్ వరంగల్ తక్కువేమీ కాదు. సివిల్ పనులకు లెక్కాపత్రం లేకుండా రూ.కోట్లు వెచ్చిస్తున్నారు. అందులో కేవలం విద్యుత్ లైట్ల ఏర్పాట్ల పేరిట ఏటా రూ.5 కోట్లు ఖర్చు చేస్తున్నారు. గతంలో కంటే భిన్నంగా 2024–25 బడ్జెట్లో రూ.10 కోట్లు కేటాయించడంపై అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. పంపకాలు.. అన్ని మతాల పండుగలకు భక్తుల సౌకర్యార్థం ఆయా వేడుకలు నిర్వహించే ప్రాంతాల్లో బల్దియా విద్యుత్ లైట్లను ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ కాంతులు జిగేల్మంటాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతీ ఏడాది రూ.5 కోట్లు వెచ్చించి విద్యుద్దీపాలను వేడుకలకు ముందే పేరుకు బహిరంగ ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్లకు ఆహ్వానిస్తోంది. గతంలో ప్రభుత్వ కార్యాలయాలకు, నిమజ్జన ప్రాంతాలకు, దేవాలయాలకు, మసీదులకు, చర్చిలకు, ఇతర వేడుకలకు లైట్లు వేసిన కాంట్రాక్టర్లు మాత్రమే టెండర్లు వేసుకోవాలని సలహాలిస్తున్నారు. 2 శాతం నుంచి 5 శాతం మాత్రమే లెస్ వేయాలని సూచనలిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా పోటీకి వెళ్లి టెండర్లు వేసినా.. సర్దుబాటు చేసి మరీ టెండర్లు కట్టబెడుతున్నారు. పర్సంటేజీ ఇస్తేనే సంతకాలు.. టెండర్ నిబంధనల ప్రకారం ఎన్ని లైట్లు ఏర్పాటు చేశారు? ఎన్ని ఏర్పాటు చేయాలి? తదితర లోటుపాట్లను క్షేత్రస్థాయిలో ఇంజనీర్లు పట్టించుకోరు. భక్తులు, ఈవెంట్ల వద్ద లైట్లు వెలిగినా, వెలగకపోయినా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుంటారు. ఏమాత్రం పర్యవేక్షణ ఉండదు. లైట్లు ఏర్పాటు చేసిన వెంటనే మెజర్మెంట్ బుక్(ఎంబీ)లో నమోదు చేయాలి. కానీ దాదాపు ఏడాది గడుస్తున్నా.. నమోదు మాత్రం చేయలేదనే విమర్శలున్నాయి. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు బల్దియా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండడంతో తమకు తీరిక ఉన్న సమయంలో ఏఈలు ఎంబీలు టెండర్ నిబంధనలకు మేరకు రూపకల్పన చేస్తున్నారు. సంతకం చేయాలంటే తమ వాటా సంగతేంటని ఇంజినీర్లు ప్రశ్నిస్తున్నారు. బిల్లు పాస్ అయితే వచ్చే సొమ్ము వాటాల వారీగా అందజేస్తామని బతిమాలినా ససేమిరా అంటున్నారు. దీంతో కాంట్రాక్టర్లు అడిగినంత సొమ్ము చెల్లించి ఏఈ నుంచి ఉన్నత ఇంజినీర్ వరకు ముట్టజెబుతున్నారు. తదుపరి ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్స్ సెక్షన్, ఇతర అధికారులకు అడిగినంత చెల్లిస్తే అగ్రిమెంట్ సొమ్ములో 30 శాతం ఖర్చవుతోందని కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ సకాలంలో బిల్లులు చేతికందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా.. వరంగల్ మహా నగర పాలక సంస్థ కొంత మంది అవినీతి అధికారులకు, కాంట్రాక్టర్లకు, అక్రమార్కులకు అడ్డాగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎలక్ట్రికల్ విభాగం ఇంజనీర్లను, అకౌంట్స్, ఇతర అధికారులను విద్యుత్ లైట్ల ఏర్పాటు, బిల్లుల చెల్లింపులపై ‘సాక్షి’ వివరణ కోరితే, దాటవేస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. సొంతగా కొనుక్కోవచ్చు కదా? విద్యుత్దీపాల పేరిట ఏటా బల్దియా ఖర్చు చేస్తున్న రూ. కోట్ల వ్యయంతో సొంతంగా లైట్లు కొనుక్కోవచ్చు. కానీ.. అలా కొంటే ప్రతీ సంవత్సరం పర్సంటేజీలు రావేమోనని అధికారులు ఆలోచిస్తున్నట్లు విమర్శలున్నాయి. టెండర్లు పిలిచి బిల్లులు మంజూరు చేస్తే పర్సంటేజీలు లాగొచ్చనే ఉద్దేశంతో అధికారులున్నట్లు బహిరంగంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. బల్దియా సొంతగా లైట్లను కొంటే.. ప్రతీ ఏటా రూ. కోట్లలో ప్రజాధనం ఆదా అవుతుందని.. ఆ డబ్బును అభివృద్ధి కోసం వినియోగించాలని నగర ప్రజలు కోరుతున్నారు. 2023–242021–222024–252022–23‘పర్వదినాలు, ఇతర సమయాల్లో విద్యుత్ లైట్లు వెలిగించాం. మా బిల్లు చాలా రోజుల నుంచి ఆగిపోయింది. ఇప్పటికై నా చెల్లించండి సార్’ అని ఓ కాంట్రాక్టర్ విజ్ఞప్తి. ‘మా వాటా మాకివ్వండి.. మీ బిల్లుపై సంతకం చేస్తాం’ అంటూ ఏఈ నుంచి మొదలు ఈఈ వరకు, ఎగ్జిమినర్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్స్ విభాగంలోని ఓ ఉన్నతాధికారి వరకు డిమాండ్. ‘సార్.. మేం నిబంధనల మేరకు లెస్తో టెండర్లు వేశాం. మీరు చెప్పినట్లుగా అధికంగా లైట్లు ఏర్పాటు చేశాం. ఇప్పటికే చాలా రోజులుగా బిల్లులు రాక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మీరు బిల్లు ఇస్తే ఆతర్వాత మీ వాటా ఇస్తాం’ అని కాంట్రాక్టర్లు అంటున్నారు. ‘మేం కూడా తర్వాతే ఎంబీలపై సంతకాలు చేస్తాం. తర్వాతే బిల్లు తయారు చేస్తాం’ అనే సమాధానాలు ఎదురవుతున్నాయని చోటా, మోటా ఎలక్ట్రికల్ విభాగం కాంట్రాక్టర్ల ఆందోళన. బల్దియాలో వేడుకల పేరిట ప్రజాధనం పక్కదారి నగరంలోని భవనాలు, ప్రార్థనా మందిరాల అలంకరణకు లైట్ల ఏర్పాటు బిల్లులివ్వాలని కాంట్రాక్టర్ల విజ్ఞప్తి.. వాటాశాతం చెల్లిస్తేనే సంతకం పెడతామని అధికారుల డిమాండ్ -
నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
వరంగల్ అర్బన్: అభివృద్ధి పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే అన్నారు. వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో కొనసాగుతున్న స్మార్ట్ సిటీ, ఇతర అభివృద్ధి పనులను గురువారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరంగల్ పరిధి సుందరయ్య నగర్లో సీసీ రోడ్డ్రెయిన్, 18వ డివిజన్ పరిధి క్రిస్టియన్ కాలనీలోని కమ్యూనిటీ హాల్, చింతల్లో సీసీరోడ్డు డ్రెయిన్, 33వ డివిజన్ శాంతినగర్లో కొనసాగుతున్న శ్మశానవాటిక అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. హనుమకొండ పరిధి హసన్పర్తి భీమారంలో సీసీరోడ్ డ్రెయిన్ పనులను కమిషనర్ కొలతల ద్వారా పరిశీలించారు. ఆమెవెంట ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, ఈఈలు శ్రీనివాస్, సంతోష్ బాబు, డీఈలు రవి కిరణ్, రాజ్ కుమార్, ఏఈలు ముజామిల్, సతీశ్, స్మార్ట్ సిటీ పీఎంసీ భాస్కర్రెడ్డి, శ్రీనివాసరాజు ఉన్నారు. తడి, పొడిచెత్తను వేరుగా అందించాలి తడి, పొడిచెత్తను వేరుగా అందించడంపై నగరవాసులకు అవగాహన కల్పించాలని కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్–2024 అవగాహన కార్యక్రమంలో భాగంగా 56వ డివిజన్ గోపాల్పూర్లో తడి పొడిచెత్తను వేరు చేసి అందించడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనపై శానిటరీ సిబ్బందికి ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తడి, పొడిచెత్తను కలిపి అందించడం వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ డా.రాజారెడ్డి, డిప్యూటీ కమిషనర్ రాజేశ్వర్, ఎంహెచ్ఓ రాజేశ్ , టీఏంసీ రమేశ్, సూపర్వైజర్లు నరేందర్, భాస్కర్, వావ్ ప్రతినిధి పవన్, తదితరులు పాల్గొన్నారు. నిబంధనలు పాటించకపోతే బిల్లుల్లో కోత బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే -
ఈజీఎస్లో నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేయాలి
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్: జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి నిర్దేశించిన వివిధ పనులను గడువులోగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అఽధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఈజీఎస్ పనులపై ఎంపీడీఓలు, పంచాయతీరాజ్ ఈఈ, డీఈ, ఏఈలతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఇప్పటివరకు చేపట్టిన పనులు, వాటి పురోగతి, రానున్న మార్చి నాటికి సంబంధించి ఉపాధి పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం నిర్దేశిత పనులను పూర్తిచేయాలని, అవెన్యూ ప్లాంటేషన్ కోసం అనువైన స్థలాలను గుర్తించాలన్నారు. మొక్కల పెంపకానికి సంబంధించి అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. ఉపాధి హామీలో వ్యవసాయ అనుబంధ పనులు పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ పనులు, కూలీలకు పనిదినాల సంఖ్యను పూర్తిస్థాయిలో కల్పించడం, నిర్దేశిత లక్ష్యాన్ని మార్చి నెల నాటికి పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ మేన శ్రీను, అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, డీఈ శ్రీనివాస్ రావు, ఎంపీడీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ప్రహరీ క్లబ్ల నిర్మాణం ఇలా..
ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులతో ప్రహరీ క్లబ్లు ఏర్పాటు చేయాలి. ● కమిటీ సభ్యులుగా ప్రతీ తరగతినుంచి ఒక బాలుడు, ఒక బాలిక చొప్పున మొత్తంగా పది మందితోపాటు ఒక ఉపాధ్యాయుడు, గ్రామ పోలీస్ అధికారి, విద్యార్థి తల్లి లేదా తండ్రి ఒకరు ఉంటారు. ● ఈ కమిటీ పాఠశాలలోని విద్యార్థుల అసాధారణ ప్రవర్తన తెలుసుకోవడం, క్రమశిక్షణ తప్పుతున్న వారిని గుర్తించి హెచ్ఎంలకు తెలియజేయాలి. ● పాఠశాలల ఆవరణలో, పరిసరాల్లో అనుమానాస్పదంగా అమ్ముతున్న తినుబండారాలను గుర్తించి ఉపాధ్యాయులకు తెలియజేయాలి. -
కత్తి, రాడ్ల దాడుల కలకలం
పెళ్లిబరాత్లో.. హసన్పర్తి: హసన్పర్తి మండలం మడిపల్లిలో గురువారం రాత్రి జరిగిన ఓ పెళ్లి బరాత్లో ఇరువర్గాల మధ్య జరిగిన వాగ్వాదం చివరికి కత్తిపోట్లకు దారితీసింది. కత్తిదాడిలో ఇద్దరికి తీవ్ర, మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. మడిపల్లికి చెందిన రమేశ్, జలేందర్ రక్తసంబంధీకులు. ఇళ్లు కూడా పక్కపక్కనే ఉంటాయి. కొంతకాలంగా వీరి మధ్య వైరం ఏర్పడింది.చివరికి హత్యాయత్నానికి దారి తీసింది. ఈక్రమంలో గ్రామానికి చెందిన గండికోట ఐలయ్య కూతురు వివాహానికి గురువారం రాత్రి ఇరువురు హాజరయ్యారు. పెళ్లి బరాత్ ప్రారంభం సందర్భంగా ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో జలేందర్తోపాటు అతడి సోదరుడు క్రాంతి కత్తులతో రమేశ్, అన్వేశ్పై దాడికి దిగారు. అడ్డుకోవడానికి వచ్చిన కనకయ్యతోపాటు నరేశ్పై కర్రలతో దాడి చేయగా గాయపడ్డారు.రమేశ్ పేగులు బయటికి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. అన్వేశ్ శరీరంపై పలుచోట్ల గాయాలైనట్లు చెప్పారు. వీరిని చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ చేరాలు ఘటనా స్థలిని పరిశీలించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కాగా, కత్తిపోటకు గురైన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.ప్రయాణికుడిపై రాడ్లతో దాడిఖిలా వరంగల్: నగరంలోని భట్టుపల్లి రహదారిపై అమ్మవారిపేట క్రాస్ రోడ్డు సమీపాన కారును ఆపేసిన దుండగులు అందులోని ప్రయాణికుడిపై రాడ్లతో దాడి చేశారు. ఈఘటన గురువారం రాత్రి 10.30 గంటలకు జరిగింది. పాత కక్షలా? లేదా దారి దోపిడీ చేసే దుండగులే ఈఘాతుకానికి ఒడిగట్టారా? అనేది తెలియాల్సి ఉంది. స్థానికుల కథనం ప్రకారం.. కాజీపేట నుంచి కడిపికొండ ఫ్లైఓవర్, భట్టుపల్లి మీదుగా వరంగల్ వైపునకు గాదె సిద్ధార్థరెడ్డి కారులో బయల్దేరాడు. అమ్మవారిపేట క్రాస్ రోడ్డు సమీపంలో ముగ్గురు వ్యక్తులు రోడ్డుకు అడ్డంగా నిలబడ్డారు. వారిని గమనించిన సిద్ధార్థరెడ్డి కారును ఆపగా, దుండగులు అతడిని కిందికి దింపి కర్రలు, రాడ్లతో తలపై బలంగా కొట్టారు. దీంతో తీవ్ర రక్తస్రావమై రోడ్డుపై పడిపోయాడు. చనిపోయి ఉంటాడని భావించిన దుండగులు అక్కడినుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఆ రోడ్డుగుండా వెళ్లే ప్రయాణికులు గమనించి డయల్ 100కు సమాచారం ఇవ్వగా.. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని 108లో అతడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. బాధితుడు గాదె సిద్ధార్థరెడ్డిది హనుమకొండ అని గుర్తించారు.మూడు స్టేషన్లలో ఎవరి పరిధి..ఘటన జరిగిన అమ్మవారిక్రాస్ రోడ్డు మడికొండ, హనుమకొండ సుబేదారి, మిల్స్కాలనీ స్టేషన్లలో ఎవరి పరిధికి వస్తుందో తెలియని పరిస్థితి. దీంతో మూడు స్టేషన్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
హనుమకొండ జిల్లా పశు వైద్యాధికారిగా విజయభాస్కర్
హన్మకొండ: హనుమకొండ జిల్లా పశు వైద్య, పశు సంవర్థక శాఖ అధికారిగా విజయభాస్కర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ పని చేస్తున్న కె.వెంకటనారాయణ జాయింట్ డైరెక్టర్గా పదోన్నతి పొంది ఖమ్మం జిల్లా పశు వైద్య, పశు సంవర్థక శాఖ అధికారిగా బదిలీ అయ్యారు. కాగా.. పరకాల ఏరియా పశు వైద్య కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్న విజయభాస్కర్కు పూర్తి అదనపు ఇన్చార్జ్ బాధ్యతలతో హనుమకొండ జిల్లా పశు వైద్య, పశు సంవర్థక శాఖ అధికారిగా నియమించగా.. గురువారం బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన విజయభాస్కర్ను పశువైద్యులు, కార్యాలయ ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. -
జిల్లాల వారీగా జీడీడీపీ (రూ.కోట్లలో)
23,86819,87717,68418,24516,18118,67716,31716,50912,90313,90111,48112,15711,84810,93912,24410,2987,58310,3536,1475,38213,09211,67213,8755,6952020–212019–202022–232021–22మహబూబాబాద్భూపాలపల్లివరంగల్ అర్బన్వరంగల్ రూరల్జనగామ -
చదువుతోనే సమాజంలో గుర్తింపు
● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద వరంగల్: చదువుతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని, విద్యార్థినులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివినప్పుడే అశించిన ఫలితాలు వస్తాయని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. హనుమకొండ రాంనగర్లోని ప్రభుత్వ ఎస్సీ బాలికల కళాశాల వసతిగృహాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకపోవడం, వార్డెన్ 24 గంటలు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ చేసి నివేదిక ఇవ్వాలని డీఎస్సీడీఓను ఆదేశించారు. వంటమనిషి ఆరు గంటలకే రాత్రి భోజనం వండుతుందని విద్యార్థినులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. కుక్పై చర్యలు తీసుకోవాలని సూచించారు. వసతిగృహాన్ని రాంనగర్ నుంచి వరంగల్కు మార్చాలని విద్యార్థులు కలెక్టర్ను కోరగా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి కలెక్టర్ రాత్రి భోజనం చేశారు. పరీక్ష ప్యాడ్లు అందజేశారు. తనిఖీల్లో జెడ్పీ డిప్యూటీ సీఈఓ వసుమతి, వార్డెన్ హరిత పాల్గొన్నారు. ఆరెల్లి బుచ్చయ్య ఉన్నత పాఠశాలలో.. ఖిలా వరంగల్: మధ్యకోటలోని ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయలక్ష్మి, తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
హనుమకొండలో చేతులకు సంకెళ్లతో నిరసన తెలుపుతున్న వామపక్ష నాయకులు పడుతూ లేస్తూ 14, 15 స్థానాల్లోనేతలసరి ఆదాయంలో భూపాలపల్లే బెటర్..ఉమ్మడి వరంగల్లో ఆరు జిల్లాలు ఉండగా.. 2022–23 సంవత్సరానికిఆర్థిక వృద్ధిలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పోటీ పడలేకపోయాయి. జిల్లా స్థూల దేశీయోత్పత్తిలో 14వ స్థానంలో హనుమకొండ, తలసరి ఆదాయంలో 15వ స్థానంలో జేఎస్ భూపాలపల్లి జిల్లాలు నిలిచాయి. మిగతా నాలుగు జిల్లాలు అ తరువాతి స్థానాలకే పరిమితమయ్యాయి. జీడీడీపీలో వరంగల్ 22, మహబూబాబాద్ 23, జనగామ 29, జేఎస్ భూపాలపల్లి 31 స్థానాల్లో నిలవగా.. రూ.7.583 కోట్లతో ములుగు జిల్లా అన్నింటికన్న చివరన నిలిచింది. జిల్లాల ఆర్థికాభివృద్ధికి సూచికగా జీడీడీపీని పరిగణించగా, అభివృద్ధి అంతా రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కేంద్రీకృతం కాగా, నగరాలు, పట్టణ ప్రాంతాల్లో కొద్దిగా మెరుగ్గా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. గ్రేటర్ వరంగల్ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి కారణంగా ఆర్థికవృద్ధిలో టాప్–2లో నిలిచినట్లు చెబుతున్నారు.2022–23లో రంగారెడ్డి జిల్లా రూ.9,54,949 తలసరి ఆదాయంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవగా.. రూ.2,28,655తో జయశంకర్ భూపాలపల్లి జిల్లా 15వ స్థానంలో నిలిచింది. అయితే 2021–22 ఇది రూ.2,34,132 కాగా ఈసారి రూ.5,477 తగ్గినా.. మిగతా జిల్లాలతో పోలిస్తే ఎక్కువై 15వ స్థానంలో ఉంది. వరంగల్ రూరల్ (వరంగల్) గతంలో రూ.1,94,317తో 16వ స్థానంలో ఉండగా.. ఈసారి రూ.2,20,174కు పెరిగినా 18వ స్థానంలో నిలిచింది. అలాగే, రూ.1,86,278 ఉన్న జనగామ ఈసారి రూ.2,21,424తో 16, రూ.1,79,222తో 20వ స్థానంలో ఉన్న మహబూబాబాద్ రూ.2,00,309తో 25వ స్థానం, రూ.1,77,316తో 21వ స్థానంలో ఉన్న ములుగు రూ.2,15,772తో 19 స్థానాల్లో నిలవగా, రూ.1,56,086తో చివరి స్థానంలో నిలిచిన వరంగల్ అర్బన్ (హనుమకొండ) ఈసారి రూ.1,86,618తో 31వ స్థానంలో ఉంది. సాక్షి ప్రతినిధి, వరంగల్: జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వెనకబాటు కనిపిస్తోంది. జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల అభివృద్ధి వృద్ధి రేటు రాష్ట్రంలోనే వెనుకబడి ఉంది. వరంగల్ అర్బన్ (హనుమకొండ) 14వ స్థానంలో ఉండగా.. వరంగల్ రూరల్ 22, (వరంగల్), మహబూబాబాద్ 23 స్థానాల్లో నిలిచాయి. 2021–22 సంవత్సరానికి ప్రస్తుత ధరల్లో జీడీడీపీ విలువ పెరుగుదల కనిపించినప్పటీకి రాష్ట్రస్థాయిలో మిగతా జిల్లాలతో పోలిస్తే ఆశించిన స్థాయిలో వృద్ధి సాధించలేదు. తలసరి ఆదాయం విషయానికి వస్తే జయశంకర్ భూపాలపల్లి 15వ స్థానంలో నిలిచింది. జాతీయ ధరల సూచీ ప్రకారం దీనిని గణిస్తారు. ఇదే సమయంలో మిగతా ఐదు జిల్లాలు తలసరి ఆదాయంలో తెలంగాణలోని మిగతా జిల్లాలతో వెనుకబడి ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక, గణాంకశాఖ ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ రాష్ట్ర గణాంకాల నివేదిక– అట్లాస్–2024’లో ఈ వివరాలు వెల్లడించారు. పట్నవాసం వద్దు.. పల్లె నివాసమే బెస్ట్ ఉమ్మడి వరంగల్లో 38,20,369 జనాభా ఉంది. ఇందులో 28,28,036 మంది పల్లెల్లో, 9,92,333 మంది పట్టణాల్లో జీవనం గడుపుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ప్రజలు నివాసం పట్టణం/నగరాలైన హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి తర్వాత స్థానంలో హనుమమకొండ నిలిచింది. ఉమ్మడి వరంగల్లో హనుమకొండ మినహా ఐదు జిల్లాల్లో జనం ఊళ్లలోనే ఉంటున్నారు. హనుమకొండ జిల్లాలో మాత్రమే 10,62,247 మంది జనాభాలో 5,63,629 (53.1 శాతం) మంది పట్నంలో ఉంటుండగా, 4,98,618 (46.9 శాతం) మంది గ్రామాల్లో ఉంటున్నారు. వరంగల్ జిల్లాలో 7,37,148 మంది 69.2 శాతం మంది పల్లెటూళ్లలో, 30.8 శాతం మంది పట్టణవాసం చేస్తున్నారు. జనగామలో 5,34,991 జనాభాకు 4,63,634 (86.7 శాతం) మంది గ్రామాల్లో, 71,357 (13.3 శాతం) పట్టణాల్లో, జేఎస్ భూపాలపల్లిలో 4,16,763 మందికి 3,74,376 ( 89.8 శాతం) గ్రామాల్లో, 42,387 (10.2 శాతం) పట్టణాల్లో ఉంటున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో 7,74,549 మందికి 6,98,173 (90.1 శాతం), పల్లెలు, తండాల్లో, 76,376 (9.9 శాతం) మందే పట్టణాల్లో ఉంటుండగా.. ములుగు జిల్లాలో 2,94,671కి 96.1 శాతం మంది పల్లెటూళ్లలో ఉంటుండగా.. కేవలం 11,493 (3.9 శాతం) మంది పట్నవాసం చేస్తున్నారు.జిల్లాల వారీగా మొత్తం జనాభా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇలా..జిల్లాల వారీగా తలసరి ఆదాయం...( రూ.లలో) జిల్లా 2019–20 2020–21 2021–22 2022–23 వరంగల్ అర్బన్ 1,40,994 1,26,594 1,55,055 1,86,618 వరంగల్ రూరల్ 1,55,802 1,65,549 1,95,115 2,20,877 జనగామ 1,79,229 1,66,392 1,86,244 2,21,424 మహబూబాబాద్ 1,37,562 1,44,479 1,79,057 2,00,309 జేఎస్.భూపాలపల్లి 2,42,945 2,03,564 2,34,132 2,28,655 ములుగు 1,68,702 1,55,821 1,75,527 2,15,772జిల్లా మొత్తం గ్రామీణం పట్టణ/నగరం హనుమకొండ 10,62,247 4,98,618 5,63,629 వరంగల్ 7,37,148 5,10,057 2,27,091 జనగామ 5,34,991 4,63,634 71,357 జేఎస్.భూపాలపల్లి 4,16,763 3,74,376 42,387 మహబూబాబాద్ 7,74,549 6,98,173 76,376 ములుగు 2,94,671 2,83,178 11,493 న్యూస్రీల్జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి జిల్లా వెనుకబాటురూ.7,583 కోట్లతో ఆఖరున ములుగు జేఎస్ భూపాలపల్లిలో తగ్గి.. ఐదు జిల్లాల్లో పెరిగిన ‘తలసరి’ 15వ స్థానంలో జేఎస్ భూపాలపల్లి హనుమకొండ జిల్లాలో అర్బన్ జనాభా.. మిగతా ఐదు జిల్లాల్లో పల్లెవాసమే ‘రాష్ట్ర గణాంకాల నివేదిక– అట్లాస్–2024’లో వెల్లడి -
పరిశోధన.. సృజనాత్మకత..
విద్యారణ్యపురి: ప్రభుత్వ యాజమాన్యాల పరిధి లోని ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైసింగ్ ఇండియా (పీఎంశ్రీ) హైస్కూల్ స్థాయి విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలను విస్తృతపరిచేలా, విద్య, పరిశోధనరంగాల పరంగా ఎలా ముందుకెళ్లాలో తెలిపేందుకు ప్రముఖ ఉన్నత విద్యాసంస్థల సందర్శన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి ట్విన్నింగ్ (జంటీకరణ) ఆఫ్ స్కూల్స్ నిధులు వినియోగించనున్నారు. ఈ మేరకు హనుమకొండ జిల్లాలోని పీఎంశ్రీ స్కూళ్ల విద్యార్థులను వరంగల్ నిట్కు అనుసంధానించారు. విద్యార్థులు ఆ విద్యాసంస్థను సందర్శించి వసతులు, ల్యాబ్స్, లైబ్రరీ పరిశోధనల పరంగా ఎలా ముందుకెళ్తున్నారనేది ప్రత్యక్షంగా తిలకించడంతోపాటు, అక్కడి అధ్యాపకులు, ఇంజనీరింగ్ విద్యార్థులతో ఇంటరాక్షన్ ఉండేలా కలెక్టర్ ప్రావీణ్య ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. దీనిపై నిట్ అధికారులతో సంప్రదించి ఒక ప్రోగ్రాంను డీఈఓ వాసంతి ద్వారా రూపొందించారు. విద్యార్థులు నేడు(గురువారం), రేపు వరంగల్ నిట్ను సందర్శించనున్నారు. జిల్లాలో 19 పీఎంశ్రీ స్కూళ్లు పీఎంశ్రీ కింద జిల్లాలో 19 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఆయా పాఠశాలల్లో కేంద్ర 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులను మౌలిక సదుపాయాల కల్పనతోపాటు విద్యార్థులకు అనేక విధాలుగా ప్రయోజనాలతో కూడిన విద్యాభివృద్ధికి కేటాయిస్తున్నారు. దీనిని సమగ్రశిక్ష ద్వారా అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా స్కూళ్లకు నిధులు మంజూరయ్యాయి. ప్రధానంగా సైన్స్ల్యాబ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్స్, ఐసీటీ ల్యాబ్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్, వృత్తి విద్యాకోర్సుల ల్యాబ్స్ను ఏర్పాటు చేస్తారు. విద్యార్థులకు సంబంధించి వివిధ రకాల ప్రోగ్రాంలు ఉన్నాయి. పీఎంశ్రీలో ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్స్ అనే పథకం ఒకటి. దీనికింద జిల్లాలోని 13 పాఠశాలలకు రూ.20వేల చొప్పున, మరో ఆరు పాఠశాలలకు రూ.35వేల చొప్పున నిధులు విడుదలయ్యాయి. నిట్కు 2వేల మంది విద్యార్థులు పీఎంశ్రీ కింద ఎంపికై న ప్రభుత్వ హైస్కూళ్లు, గురుకులాలు, మోడల్ స్కూళ్ల విద్యార్థులు కలిపి జిల్లాలో సుమారు 2వేలమంది ఉంటారు. షెడ్యూల్ ప్రకా రం నేడు (గురువారం) ఉదయం 9–30 నుంచి మ ధ్యాహ్నం 2గంటల వరకు ఒక సెషన్లో 500 మంది, మధ్యాహ్నం 2–10 నుంచి సాయంత్రం 5–45 గంటల వరకు మరో 500 మంది, 21వ తేదీన మరో 1000 మంది విద్యార్థులు వరంగల్ నిట్ను సందర్శించేలా ప్రణాళిక రూపొందించారు. వారిని ప్రత్యేక వాహనాల్లో తీసుకువస్తారు. భోజనం వసతి ఏర్పాటు చేశారు. నిట్తోపాటు హనుమకొండలోని రీజినల్ సైన్స్ సెంటర్, జూపార్కు, వేయిస్తంభాల గుడిని సందర్శించనున్నారు. హైస్కూల్ విద్యార్థుల్లో పెంపునకు శ్రీకారం హనుమకొండ జిల్లా పీఎంశ్రీ పాఠశాలలు నిట్తో అనుసంధానం ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్స్ నిధులు వినియోగం నేడు, రేపు ఆ విద్యాసంస్థను సందర్శించనున్న పిల్లలు ట్విన్నింగ్ (జంటీకరణ) స్కూల్స్ అంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు సమీపంలోని ఉన్నతవిద్యాసంస్థతో అనుసంధానం చేయడమే ట్విన్నింగ్. దీనివల్ల ప్రముఖ విద్యాసంస్థల్లోని అవకాశాలను భవిష్యత్లో అందిపుచ్చుకునేలా పిల్లలను ప్రోత్సహించడం, విద్యార్థులతో ముఖాముఖి ద్వారా స్ఫూర్తిని కలిగించేందుకు దోహదం చేస్తుంది. ఉన్నత విద్యాసంస్థల్లోని ల్యాబ్స్, లైబ్రరీలు, తరగతి గదులు, క్రీడా వసతులు ఎలా ఉన్నాయి, వర్క్షాప్ల పరిశీలన, విద్యాధిపతులు, అక్కడి అధ్యాపకులను కలిసి మాట్లాడే అవకాశం కల్పిస్తారు. పాఠశాలస్థాయిలోని భవిష్యత్లో ఉన్నత విద్యపట్ల ఆకర్షితులవుతారనేది భావన. విద్యార్థులతో కలిసి మాట్లాడటం ద్వారా సమూహ అభ్యసనం కలుగుతుంది. -
కులగణనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వరంగల్: కులగణనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ సీనియర్ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వరంగల్కు వచ్చిన ఆయన ఓసిటీలోని ఎర్రబెల్లి ప్రదీప్రావు ఇంట్లో మీడియాతో మాట్లాడారు. కులగణన రీసర్వే చేస్తామనడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. గ్రీన్ఫీల్డ్ రహదారుల నిర్మాణంలోని భూనిర్వాసితులకు మార్కెట్ ధరల ప్రకారం నష్ట పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీలను నియమించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మొత్తం బీఆర్ఎస్ పాలనను మరిపిస్తోందని, ప్రజ లకు, ఉద్యోగులకు సమస్యలపై పోరాటం చేసే వారికోసం ఎదురు చూస్తున్నారన్నారు. ప్రజల పక్షాన ఉంటూ సమస్యల పరిష్కారం కోసం నిత్యం కృషి చేసేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరోత్తంరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈటల పిలుపునిచ్చారు. సీపీఎస్ రద్దు చేసేందుకు కృషి.. నల్లగొండ ఖమ్మం, వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తంరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సీపీఎస్ రద్దుపై ఉద్యోగులకు ఇచ్చిన హామీని ఏడాది గడిచినా పట్టించుకోవడం లేదన్నారు. తాను సీపీఎస్ రద్దు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. బీజేపీ సహకారంతో పోటీ చేస్తున్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. సమావేశంలో మాజీ ఎంపీ సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, కొండేటి శ్రీధర్, నాయకులు ప్రదీప్ రావు, గంట రవికుమార్, రావు పద్మ, సతీష్షా, బాకం హరిశంకర్, సముద్రాల పరమేశ్వర్, మార్టిన్ లూధర్, రఘునారెడ్డి పాల్గొన్నారు. కేయూ, వివిధ కళాశాలల్లో ప్రచారం కేయూ క్యాంపస్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అభ్యర్థి పులి సరోత్తంరెడ్డితో కలిసి ఈటల రాజేందర్ కాకతీయ యూనివర్సిటీ, నగరంలోని పలు కళాశాలలు, పాఠశాలల్లో సందర్శించారు. ఎమ్మెల్సీగా పోటీలో నిలి చిన సరోత్తంరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కేడీసీ నూతన భవన నిర్మాణానికి రూ 15కోట్లు మంజూరు చేయాలని పీఎం ఉషా పథకం కింద ప్రతిపాదనలు పంపామని, చొరవ తీసుకొని మంజూరు చేయించాలని ప్రిన్సిపాల్ రాజారెడ్డి.. ఎంపీ ఈటల దృష్టికి తీసుకెళ్లగా, తనవంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. -
తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
● దేవాదుల నీటి పంపింగ్కు లేఖ రాయండి ● అధికారులకు నగర మేయర్ సుధారాణి సూచన వరంగల్ అర్బన్ : వేసవిలో నగరవాసులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. బుధవారం ఆమె ధర్మసాగర్ రిజర్వాయర్, ఫిల్టర్ బెడ్ను సందర్శించారు. ప్రస్తుత నీటి నిల్వ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో నగర అవసరాల కోసం 710 ఎంఎస్ఎఫ్టీల నీరు ధర్మసాగర్ రిజర్వాయర్లో అందుబాటులో ఉందన్నారు. ఈ నీటిని వచ్చే నాలుగు నెలలపాటు పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేవాదులనుంచి నీటి పంపింగ్ కోసం ఇరిగేషన్ అధికారులకు లేఖ రాయాలన్నారు. అనంతరం ధర్మసాగర్ 60ఎంఎల్డీ ఫిల్టర్ బెడ్ను తనిఖీ చేసి నీటి శుద్ధితీరును అడిగి తెలుసుకున్నారు. ఎల్బీ కళాశాలలో ఇంటర్ మూల్యాంకన క్యాంపుకాళోజీ సెంటర్: వరంగల్ జిల్లా కేంద్రంగా ఎల్బీ కళాశాలలో ఇంటర్ మూల్యాంకన క్యాంపు ఏర్పాటు చేసేందుకు ఇంటర్ బోర్డు అధికా రులు ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీధర్సుమన్ తెలిపారు. గతంలో హనుమకొండ కేంద్రంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, హనుమకొండ, భూపాలపల్లి, వరంగల్, ములుగు, మహబూబాబాద్ జిల్లాల ఇంటర్ మూల్యాంకన ప్రక్రియ కొనసాగిందని పేర్కొన్నారు. 6 జిల్లాలకు ఒక్క క్యాంపు అసౌకర్యంగా ఉందని గుర్తించిన అధికారులు జిల్లా కేంద్రంగా కొత్త మూల్యాంకన కేంద్రాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎల్బీ కళాశాలలో ఏర్పాటు కానున్న క్యాంపులో మహబూబా బాద్, ములుగు, వరంగల్ జిల్లాల కోడింగ్ వాల్యుయేషన్కు సంబంధించిన పనులు మార్చి నుంచి ప్రారంభించడానికి ఆదేశాలు జారీచేసినట్లు శ్రీధర్సుమన్ తెలిపారు. -
పీడీఎస్యూ నాయకుల నిరసన
కేయూ క్యాంపస్ : అమెరికాలోని భారతీయ వలసదారులను అక్రమంగా బంధించి వెనక్కి పంపుతున్న ఆ దేశాధ్యక్షుడి చర్యలను, అలాగే మోదీ నిర్లక్ష్యాన్ని నిరసిస్తు పీడీఎస్యూ ఆధ్వర్యంలో బుధవారం కేయూ మొదటి గేట్వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ, ఉపాధ్యక్షుడు బి.నర్సింహారావు మాట్లాడుతూ అగ్రరాజ్యమైన అమెరికా తన నూతన ఆర్థికవిధానాలు ఇతర దేశాలపై బలవంతంగా రుద్దారని దీంతో వివిధ దేశాల్లో వలసలు పెరిగాయన్నారు. విద్యా, ఉపాధి కోసం అమెరికాకు వెళ్లిన వారి మనుగడ అధ్యక్షుడి చర్యలతో జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయన్నారు. అక్రమ వలసదారులంటూ భారతీయులపై అమెరికా అధ్యక్షుడి చర్యలను మోదీ ప్రభుత్వం పట్టించుకోకపోవటం శోచనీయమన్నారు. కార్యక్రమంలో నాయకులు కావ్య, అనూష, కన్వీనర్ బాలు తదితరులు పాల్గొన్నారు. -
పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వీడాలి
వరంగల్ అర్బన్ : ఆస్తి, నీటిపన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం తగదని, పనితీరు మార్చుకోకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని గ్రేటర్ వరంగల్ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే హెచ్చరించారు. పన్ను వసూళ్లపై బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఆర్ఐల వారీగా సమీక్షించారు. ప్రతీ బిల్కలెక్టర్ రోజూ 100 రెసిడెన్షియల్లతోపాటు 20 కమర్షియల్ వసూళ్లు జరపాలని ఆదేశించారు. రెవెన్యూ సిబ్బంది వద్ద వసూళ్ల సంబంధిత అసెస్మెంట్ జాబితా, పెద్ద మొత్తంలో టాక్స్ చెల్లించాల్సిన వంద మంది జాబితా, 200 మంది డిఫాల్టర్ల జాబితాలు అందుబాటులో ఉంచుకొని వసూలు చేయాల్సిందేనన్నారు. ప్రాపర్టీ టాక్స్ వసూళ్ల లక్ష్యం రూ.11,731.84 లక్షలు కాగా, ఇప్పటివరకు రూ.5,030.29 లక్షలు (42.88శాతం) అధిగమించాచారని, నల్లా పన్ను లక్ష్యం రూ.6687.7 లక్షలు కాగా రూ.1207.38 లక్షలు (18.05శాతం) వసూళ్లు జరిగినట్లు అధికారులు తెలిపారు. మార్చి 31లోగా రూ.121.91కోట్లు వసూలు చేయాలని గుర్తు చే శారు. అదనపు కమిషనర్ జోనా,డిప్యూటీ కమిషనర్లు రవీందర్, ప్రసన్న రాణి, పన్నుల అధికారి రామకృష్ణ, ఆర్ఓలు యూసుపొద్దీన్, శ్రీనివాస్, షహజాదిబేగం, ఐటీ మేనేజర్ రమేష్ పాల్గొన్నారు. పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచండి పార్కుల పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచాలని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఉద్యాన వన విభాగ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో కమిషనర్ మాట్లాడారు. నగర వ్యాప్తంగా 38 పార్కులలో పునరుద్ధరణ పనులు చేపట్టడానికి ఇప్పటికే గుర్తించినట్లు తెలిపారు. ఏదైనా ఒక పార్క్ను ప్రయోగాత్మకంగా ఎంచుకొని డ్రిప్ ద్వారా నీటిని పిచికారీ చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో హార్టికల్చర్ అధికారులు రమేష్ ,లక్ష్మారెడ్డి, అసిస్టెంట్లు ప్రిన్సి, ప్రవల్లిక, ప్రియాంక, అనూహ పాల్గొన్నారు. సమీక్ష సమావేశంలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే -
స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి
వరంగల్ : నగరంలోని వెంకట్రామా జంక్షన్ నుంచి లేబర్ కాలనీ వరకు వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయించాలని టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్ కోరారు. ఈమేరకు బుధవారం మంత్రి కొండా సురేఖకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..లేబర్ కాలనీ నుంచి వెంకట్రామా జంక్షన్ వరకు ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయని, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ అధికారులకు తెలిపినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఈవిషయంపై స్పందించిన మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రకాశ్ తెలిపారు. రవీందర్రావును కలిసిన పీఏసీఎస్ చైర్మన్లువరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల పదవీ కాలం ఆరునెలలు పొడిగించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అపెక్స్ బ్యాంక్ (టీజీసీఏబీ) చైర్మన్ మార్నేని రవీందర్రావును బుధవారం వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని పీఏసీఎస్ చైర్మన్లు కలిసి పూలబొకేలు అందించి కృతజ్ఞతలు తెలిపారు. కాజీపేట దర్గా, వరంగల్, పర్వతగిరి, మల్లారెడ్డిపల్లి పీఏసీఎస్ల చైర్మన్లు ఉకంటి వనంరెడ్డి, ఇట్యాల హరికృష్ణ, మనోజ్గౌడ్, జక్కు రమేష్గౌడ్లు పాల్గొన్నారు. డిక్షనరీల పంపిణీ ఖిలా వరంగల్ : కరీమాబాద్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మీ నేస్తం హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు ఆంగ్ల డిక్షనరీలు పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయులు జయప్రకాశ్, సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు యాకోబు, ఉపాధ్యాయులు భిక్షపతి, ప్రసాద్, భాగ్యలక్ష్మి, ఉమాకుమారి, సంధ్యారాణి, సుకన్య, రేఖ పాల్గొన్నారు. మైనారిటీ గురుకులంలో ‘తఖ్మీల్ ఏ ఖురాన్’ న్యూశాయంపేట : కేయూ క్రాస్రోడ్లోని వరంగల్–1, మైనార్టీ గురుకులంలో బుధవారం తఖ్మీల్ ఏ ఖురాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గురుకు లంలో విద్యానభ్యసిస్తున్న 34 మంది మైనార్టీ వి ద్యార్థులు ఖురాన్ను పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి ప్రిన్సిపాల్ డి.కృష్ణకుమారి శాలువాలతో స న్మానించిసర్టిఫికెట్స్ అందజేశారు. అధ్యాపకులు, ఉపాధ్యా యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. చెన్నకేశవస్వామి కల్యాణంమడికొండ : కాజీపేట మండలంలోని మడికొండలో గల శ్రీ శివకేశవ ఆలయంలో బుధవారం వైభవంగా చెన్నకేశవ స్వామి కల్యాణం జరిపించారు. ఉదయం నుంచి అర్చకులు వంశీకృష్ణచార్యులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వైభవంగా శ్రీదేవి, భూదేవి, శ్రీలక్ష్మి సమేత శ్రీ చెన్నకేశవస్వామి కల్యాణతంతును చేపట్టారు. తౌటిరెడ్డి విద్యాసాగర్రెడ్డి, దొంతుల శంకర్ లింగం,ఆలయ కమిటీ సభ్యులు సుదర్శన్రెడ్డి, పింగిళి రఘునాథరావు, సురేష్కుమార్ పాల్గొన్నారు. -
డీజిల్ షెడ్లో రైల్వే హెల్త్ క్యాంప్
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే డీజిల్ లోకోషెడ్లో బుధవారం మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. రైల్వే ఆస్పత్రి డీఎంఓ డాక్టర్ ధీరజ్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్యాంపులో డాక్టర్లు నరేందర్హిర్వాని, ఉత్తమ్, ప్రవళిక, వైద్య సిబ్బంది 180 మంది రైల్వే ఎంప్లాయీస్కు పరీక్షలు నిర్వహించి సలహాలు, సూచనలు చేశారు. నేడు(గురువారం) కూడా కార్మికుల కోసం హెల్త్ చెకప్ క్యాంపును నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. రైల్వే మజ్దూర్ యూనియన్ డీజిల్ బ్రాంచ్ చైర్మన్ ఎస్కె. జానిమియా, ట్రెజరర్ గిరిమిట్ల రాజేశ్వర్రావు, సత్యనారాయణ, శివప్రసాద్, మాషుజాని, రాజయ్య, శ్రీధర్, రైల్వే వైద్య సిబ్బంది కవిత, రమాదేవి, ప్రసాద్, మల్లేష్, గోపి, కార్మికులు పాల్గొన్నారు. వైద్యశిబిరానికి అపూర్వ స్పందన ఖిలా వరంగల్ : వరంగల్ 32వ డివిజన్ బీఆర్ నగర్లో లయన్స్ క్లబ్ ఆఫ్ హనుమకొండ పద్మాక్షి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఉచిత వైద్యశిబిరానికి అపూర్వ స్పందన లభించింది. ముఖ్యఅతిథిగా లయన్క్లబ్ జిల్లా గవర్నర్ కుందూరు వెంకట్రెడ్డి, డాక్టర్ సిరికొండ భాస్కర్రావు, ధరణికొటి వీణావాణి హాజరై వైద్యశిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. అనంతరం వైద్యులు ప్రజలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. -
బాలల రక్షణలో పేరెంట్స్దే కీలకపాత్ర
● అడిషనల్ డీసీపీ ఎన్.రవిహన్మకొండ: బాలలను ఆన్లైన్ వేధింపుల నుంచి రక్షించడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని వరంగల్ పోలీసు కమిషనరేట్ అడిషనల్ డీసీపీ ఎన్.రవి అన్నారు. బుధవారం హనుమకొండ సుబేదారిలోని ‘అసుంత’ భవన్లో ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో వరంగల్, హనుమకొండ జిల్లాలోని ఎంపిక చేసిన తల్లిదండ్రులకు ‘ఆన్లైన్లో బాలలపై జరుగుతున్న లైంగిక వేధింపులు–దానిని నిరోధించడంలో తల్లిదండ్రుల పాత్ర’ అనే అంశంపై వర్క్షాపు జరిగింది. అడిషనల్ డీసీపీ ఎన్.రవి మాట్లాడుతూ మారుతున్న సమాజంలో ప్రతీ ఒక్కరికి ఇంటర్నెట్ జీవన విధానంలో భాగమైందని, వినియోగంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల కౌమార బాలలు దీని బారిన పడుతున్నారన్నారు. బాలలను వేధింపులకు గురి చేస్తే 1930, 100, 1098 నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్స్పెక్టర్ పి.వెంకన్న, మై చాయిస్ ఫౌండేషన్ స్టేట్ కో ఆర్డినేటర్ జె.క్రాంతి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తల్లిదండ్రులకు అర్థమయ్యేలా వివరించారు. ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ అధ్యక్షతన జరిగిన ఈ వర్క్షాప్లో వయోవృద్ధుల ట్రిబ్యునల్ సభ్యురాలు డాక్టర్ కరుకాల అనితారెడ్డి, హనుమకొండ జిల్లా బాలల సంరక్షణ అధికారి ఎస్.ప్రవీణ్ కుమార్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు డాక్టర్ పరికి సుధాకర్, చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డినేటర్ ఎస్.భాస్కర్, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీకాంత్, మేనేజర్ అజయ్ కుమార్, ఫీల్డ్ కోఆర్డినేటర్ ఈసంపల్లి సుదర్శన్ పాల్గొన్నారు. -
కాలనీలో సౌకర్యాలు కరువు
కాజీపేట అర్బన్ : కాజీపేట మండలం న్యూశాయంపేటలోని సుర్జీత్నగర్కాలనీలో స్థానికులు సమస్యలతో సతమతమవుతున్నారు. దీంతో కాలనీవాసులు అసౌకర్యాల నడుమ దుర్భారజీవితం కొనసాగిస్తున్నారు. 20ఏళ్ల క్రితం ప్రభుత్వ భూమిలో నిరుపేదలు నిర్మించుకున్న గుడిసెల్లో సుమారు 500 కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. కాగా అనేక పోరాటాలతో 2015లో 300 మందికి, 2024లో 58 జీఓ ప్రకారం 300 మందికి పట్టాలిచ్చారు. అయితే కాలనీలో కనీస వసతులు కల్పించడంలో అధికారులు అలసత్వం వహిస్తుండడంతో దుర్భార జీవితాన్ని గడుపుతున్నారు. సీసీ రోడ్లు, డ్రెయినేజీలు కరువు సుర్జీత్నగర్ కాలనీలో సీసీ రోడ్లు, డ్రెయినేజీల ఏర్పాటులో అధికారులు అలసత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. దీంతో మురుగునీరు ఇళ్లలోకి పారుతూ దుర్వాసనతో అనారోగ్యాల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి కాలనీ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.డ్రెయినేజీ ఏర్పాటు చేయాలి కాలనీ నుంచి బయట అడుగుపెట్టాలంటే ఇబ్బందిగా ఉంది, వెంటనే అధికారుల స్పందించి సీసీ రోడ్లు,సైడ్ డ్రెయినేజీల నిర్మాణం చేపట్టి అనారోగ్యాల బారిన పడకుండా కాపాడాలి. వర్షాకాలంలో సరైన రోడ్లు లేక బురదలో ప్రయాణం చేయడం ఇబ్బందిగా ఉంది. మురుగు నీటి దుర్వాసనతో దోమలు స్వైరవిహారం చేస్తు జ్వరాలబారిన పడుతున్నాం. – రజిత, సుర్జీత్నగర్ కాలనీఇళ్లు నిర్మించి ఇవ్వాలి.. సుర్జీత్నగర్ కాలనీలో నివాసం ఉంటున్న 500 కుటుంబాల్లో 300 మందికి పట్టాలిచ్చారు. మిగతా 200 కుటుంబీకులకు సైతం పట్టాలిచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. సొంత భూమిలేక 20ఏండ్లుగా కాలనీలో నివాసం ఉంటున్న నిరుపేదలను ఆదుకోవాలి. – కారు ఉపేందర్, సుర్జీత్నగర్ కాలనీ వ్యవస్థాపకుడు●సుర్జీత్నగర్కాలనీలో సమస్యల తిష్ట సీసీ రోడ్లు, డ్రెయిజీలు లేక స్థానికుల ఇబ్బందులు -
మంత్రికి ఆహ్వానం
హన్మకొండ కల్చరల్ : రాష్ట్ర దేవాదాయ మంత్రి కొండా సురేఖను రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ బుధవారం ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖకు ఈ నెల 26వ తేదీన జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఉపేంద్రశర్మ మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని, జాగరణలో ఉన్న భక్తులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రికి విజ్ఞప్తి చేయగా మంత్రి స్పందిస్తూ తగిన ఏర్పాట్లు చేయిస్తానని హామీ ఇచ్చారు. రూ.50వేల ఆర్థికసాయం వరంగల్ చౌరస్తా : నిరుపేద ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన వేముల సంతోష్ ఇటీవల మృతిచెందారు. కాగా బుధవారం వరంగల్ ఆర్ఎన్టీ రోడ్డులోని పట్టణ ఆర్యవైశ్య సంఘం కార్యాలయంలో కుటుంబ భద్రత పథకం ద్వారా సంఘం అధ్యక్షుడు, మాజీ మేయర్ గుండా ప్రకాశ్రావు రూ.50వేల నగదును సంతోష్ భార్య ప్రవీణకు అందజేశారు. చేయూత హసన్పర్తి : ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఓ విద్యార్థి కుటుంబానికి ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు చేయూతనిచ్చారు. 65వ డివిజన్ చింతగట్టు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువున్న షేక్ జహిరాబీ తల్లి, సోదరీ ఇటీవల కమలాపూర్ మండలం గూడూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి నడవలేని స్థితిలో ఉన్నారు. దీంతో జహిరాబీ వారి బాగోగులు చూస్తూ పాఠశాలకు దూరమైంది. విషయం తెలుసుకున్న ప్రధానోపాధ్యాయురాలు పద్మ, తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు బాధిత కుటుంబీలకు రూ.5,555ల నగదు అందజేసి మానవత్వం చాటుకున్నారు. చదువుపై దృష్టిసారించాలి కాజీపేట : విద్యార్థులు తమ విలువైన సమయాన్ని సెల్ఫోన్లతో గడపకుండా చదువుపై దృష్టి సారించాలని సీనియర్ సిటీజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి తేరాల యుగంధర్ సూచించారు. కాజీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం సంస్కార వికాస శిక్షణ సదస్సును నిర్వహించగా ఆయన మాట్లాడారు. సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర్, కొండబత్తిన రాజేందర్, మార్క రవీందర్, గంగారపు యాదగిరి, మూల ఐలయ్య, సునీత, విద్యావతి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. నోటిఫికేషన్ విడుదల చేయాలి కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని పలు సమస్యలను పరిష్కరించాలని, పార్ట్టైం లెక్చరర్ల నియమకానికి నోటిఫికేషన్ విడుదల చేయాలని వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు బుధవారం వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఎస్డీఎల్సీఈలో కౌన్సిలర్లను నియమించాలన్నారు. ప్రొఫెసర్ పి.మల్లారెడ్డిని ఓఎస్డీ పదవినుంచి తొలగించాలని విన్నవించారు. వినతిపత్రం అందజేసిన వారిలో బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కె.సుమన్, కేయూ ఇన్చార్జ్ జెట్టి రాజేందర్, జిల్లా కోఆర్డినేటర్ అరూరి రంజిత్, ఎంఎస్ఎఫ్ కేయూ ఇన్చార్జ్ డాక్టర్ వడ్డెపల్లి మధు, కేయూ డాక్టరేట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మద్దిరాల మోహన్రెడ్డి, కుర్సా బాధ్యులు సోమరాజు, విష్ణు, పరిశోధక విద్యార్ధులు కేతపాక ప్రసాద్, కందికొండ తిరుపతి పాల్గొన్నారు. -
కార్పొరేట్కు అనుకూలంగా బడ్జెట్
హన్మకొండ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్కు అనుకూలంగా ఉందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వివక్ష చూపడంపై బుధవారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల నాయకులు చేతికి సంకెళ్లతో వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల సవతి తల్లి వైఖరిని ప్రదర్శిస్తోందన్నారు. ఏపీ పునర్విభజన చట్టం అమలును బీజేపీ నిర్లక్ష్యం చేసిందని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించలేదన్నారు. లక్షలాదిమంది యువకులకు ఉపాధి కల్పించే బయ్యారం ఉక్కు పరిశ్రమ ప్రాజెక్టును మూలకు పడేయడం దారుణమన్నారు.బీమా రంగంలో 100 శాతం ఎఫ్డీఐలను ఆహ్వానించడం ద్వారా దేశీయ ఎల్ఐసీ, జీఐసీలపై ప్రభావం చూపనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎం హనుమకొండ జిల్లా కార్యదర్శి గాదె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, ఎన్.జ్యోతి, సదాలక్ష్మి, కె.శివాజీ, ఎస్.వాసుదేవ రెడ్డి, ఎ ం.చుక్కయ్య, బొట్ల చక్రపాణి, మద్దెల ఎల్లేష్, ఉ ట్కూరి రాములు, మునిగాల భిక్షపతి, కొట్టెపాక రవి, రాసమల్ల దీనా, బత్తిని సదానందం, మా లోతు శంకర్ నాయక్, సుదర్శన్, మెట్టు శ్యామ్ సుందర్ రెడ్డి, రొంటాల రమేష్, దేవా, కామెర వెంకటరమణ, గుంటి రాజేందర్, నిమ్మల మనోహర్, వీరన్న నాయక్, జి.రాములు, సాంబయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ హెడ్పోస్టాఫీస్ సెంటర్లో.. వరంగల్ చౌరస్తా : కేంద్ర బడ్జెట్ను సవరించాలని కమ్యూనిస్టు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. 10 కమ్యూనిస్టు, విప్లవ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం వరంగల్ హెడ్పోస్టాఫీస్ సెంటర్లో ధర్నా చేశారు. దీంతో అరగంట సేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా నాయకులు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యూడెమొక్రసీ నేత రాచర్ల బాలరాజు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, సీపీఎం జిల్లా నాయకురాలు నలిగంటి రత్నమాల, పలు పార్టీల నాయకులు గంగుల దయాకర్, అక్కెనపల్లి యాదగిరి, సుంచు జగదీశ్వర్, సత్యనారాయణ, ఎండీ బషీర్, ఆడెపు సదయ్య, పనాస ప్రసాద్, ఐతం నగేశ్, టి.భవాని, దుర్గయ్య, ఇనుముల శ్రీనివాస్, రంజిత్, గన్నారపు రమేశ్, గండ్రతి హరిబాబు, ప్రశాంత్, మాలి ప్రభాకర్, దేశెట్టి సమ్మయ్య, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు -
శ్రీచైతన్యలో ఘనంగా ఫ్యామిలీ ఫెస్ట్
వరంగల్ : వరంగల్ ఎల్బినగర్లోని శ్రీచైతన్య పాఠశాలలో బుధవారం స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఫ్యామిలీ ఫెస్ట్ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులు అతిథులుగా హాజరు కాగా వారికి సన్మానం నిర్వహించారు. అనంతరం ప్రిన్సిపాల్ బండారి కిరణ్ మాట్లాడుతూ..జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులను దూరం చేయొద్దని అన్నారు. చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ఏజీఎం రాజేశ్వర్రెడ్డి, కోఆర్డినేటర్ తిరుమల్రెడ్డి, డీన్ వెంకటేశ్, జనార్దన్, శ్వేత, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
‘బీసీ అభ్యర్థిని ఎమ్మెల్సీగా గెలిపించండి’
వరంగల్ : వరంగల్–నల్లగొండ–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బీసీ నాయీబ్రాహ్మణ(ఎంబీసీ) సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ కొలిపాక వెంకటస్వామికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని తెలంగాణ బీసీ బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాపగిరి విజయ్కుమార్ కోరారు. బుధవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాశిబుగ్గ 19వ డివిజన్లో రాష్ట్ర కార్యదర్శి గోగికార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించగా ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు బి.రామ్మోహన్, డి.శేఖర్, బేతి రాజు, బ్రహ్మచారి, రవి, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. ‘ఎమ్మెల్సీగా గెలిపించాలని ప్రచారం’ హసన్పర్తి : వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బలపరిచిన పులి సరోత్తంరెడ్డిని గెలిపించాలని బీజేపీ నాయకులు మండల కేంద్రంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సరోత్తంరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు రాంచంద్రారెడ్డి, మండల అధ్యక్షుడు తిరుపతి, చకిలం రాజేశ్వర్రావు, మట్టెడ సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వీడాలి
వరంగల్ అర్బన్ : ఆస్తి, నీటిపన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం తగదని, పనితీరు మార్చుకోకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని గ్రేటర్ వరంగల్ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే హెచ్చరించారు. పన్ను వసూళ్లపై బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఆర్ఐల వారీగా సమీక్షించారు. ప్రతీ బిల్కలెక్టర్ రోజూ 100 రెసిడెన్షియల్లతోపాటు 20 కమర్షియల్ వసూళ్లు జరపాలని ఆదేశించారు. రెవెన్యూ సిబ్బంది వద్ద వసూళ్ల సంబంధిత అసెస్మెంట్ జాబితా, పెద్ద మొత్తంలో టాక్స్ చెల్లించాల్సిన వంద మంది జాబితా, 200 మంది డిఫాల్టర్ల జాబితాలు అందుబాటులో ఉంచుకొని వసూలు చేయాల్సిందేనన్నారు. ప్రాపర్టీ టాక్స్ వసూళ్ల లక్ష్యం రూ.11,731.84 లక్షలు కాగా, ఇప్పటివరకు రూ.5,030.29 లక్షలు (42.88శాతం) అధిగమించాచారని, నల్లా పన్ను లక్ష్యం రూ.6687.7 లక్షలు కాగా రూ.1207.38 లక్షలు (18.05శాతం) వసూళ్లు జరిగినట్లు అధికారులు తెలిపారు. మార్చి 31లోగా రూ.121.91కోట్లు వసూలు చేయాలని గుర్తు చే శారు. అదనపు కమిషనర్ జోనా,డిప్యూటీ కమిషనర్లు రవీందర్, ప్రసన్న రాణి, పన్నుల అధికారి రామకృష్ణ, ఆర్ఓలు యూసుపొద్దీన్, శ్రీనివాస్, షహజాదిబేగం, ఐటీ మేనేజర్ రమేష్ పాల్గొన్నారు. పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచండి పార్కుల పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచాలని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఉద్యాన వన విభాగ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో కమిషనర్ మాట్లాడారు. నగర వ్యాప్తంగా 38 పార్కులలో పునరుద్ధరణ పనులు చేపట్టడానికి ఇప్పటికే గుర్తించినట్లు తెలిపారు. ఏదైనా ఒక పార్క్ను ప్రయోగాత్మకంగా ఎంచుకొని డ్రిప్ ద్వారా నీటిని పిచికారీ చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో హార్టికల్చర్ అధికారులు రమేష్ ,లక్ష్మారెడ్డి, అసిస్టెంట్లు ప్రిన్సి, ప్రవల్లిక, ప్రియాంక, అనూహ పాల్గొన్నారు. సమీక్ష సమావేశంలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే -
స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి
వరంగల్ : నగరంలోని వెంకట్రామా జంక్షన్ నుంచి లేబర్ కాలనీ వరకు వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయించాలని టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్ కోరారు. ఈమేరకు బుధవారం మంత్రి కొండా సురేఖకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..లేబర్ కాలనీ నుంచి వెంకట్రామా జంక్షన్ వరకు ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయని, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ అధికారులకు తెలిపినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఈవిషయంపై స్పందించిన మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రకాశ్ తెలిపారు. రవీందర్రావును కలిసిన పీఏసీఎస్ చైర్మన్లువరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల పదవీ కాలం ఆరునెలలు పొడిగించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అపెక్స్ బ్యాంక్ (టీజీసీఏబీ) చైర్మన్ మార్నేని రవీందర్రావును బుధవారం వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని పీఏసీఎస్ చైర్మన్లు కలిసి పూలబొకేలు అందించి కృతజ్ఞతలు తెలిపారు. కాజీపేట దర్గా, వరంగల్, పర్వతగిరి, మల్లారెడ్డిపల్లి పీఏసీఎస్ల చైర్మన్లు ఉకంటి వనంరెడ్డి, ఇట్యాల హరికృష్ణ, మనోజ్గౌడ్, జక్కు రమేష్గౌడ్లు పాల్గొన్నారు. డిక్షనరీల పంపిణీ ఖిలా వరంగల్ : కరీమాబాద్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మీ నేస్తం హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు ఆంగ్ల డిక్షనరీలు పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయులు జయప్రకాశ్, సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు యాకోబు, ఉపాధ్యాయులు భిక్షపతి, ప్రసాద్, భాగ్యలక్ష్మి, ఉమాకుమారి, సంధ్యారాణి, సుకన్య, రేఖ పాల్గొన్నారు. మైనారిటీ గురుకులంలో ‘తఖ్మీల్ ఏ ఖురాన్’ న్యూశాయంపేట : కేయూ క్రాస్రోడ్లోని వరంగల్–1, మైనార్టీ గురుకులంలో బుధవారం తఖ్మీల్ ఏ ఖురాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గురుకు లంలో విద్యానభ్యసిస్తున్న 34 మంది మైనార్టీ వి ద్యార్థులు ఖురాన్ను పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి ప్రిన్సిపాల్ డి.కృష్ణకుమారి శాలువాలతో స న్మానించిసర్టిఫికెట్స్ అందజేశారు. అధ్యాపకులు, ఉపాధ్యా యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. చెన్నకేశవస్వామి కల్యాణంమడికొండ : కాజీపేట మండలంలోని మడికొండలో గల శ్రీ శివకేశవ ఆలయంలో బుధవారం వైభవంగా చెన్నకేశవ స్వామి కల్యాణం జరిపించారు. ఉదయం నుంచి అర్చకులు వంశీకృష్ణచార్యులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వైభవంగా శ్రీదేవి, భూదేవి, శ్రీలక్ష్మి సమేత శ్రీ చెన్నకేశవస్వామి కల్యాణతంతును చేపట్టారు. తౌటిరెడ్డి విద్యాసాగర్రెడ్డి, దొంతుల శంకర్ లింగం,ఆలయ కమిటీ సభ్యులు సుదర్శన్రెడ్డి, పింగిళి రఘునాథరావు, సురేష్కుమార్ పాల్గొన్నారు. -
బాలల రక్షణలో పేరెంట్స్దే కీలకపాత్ర
● అడిషనల్ డీసీపీ ఎన్.రవిహన్మకొండ: బాలలను ఆన్లైన్ వేధింపుల నుంచి రక్షించడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని వరంగల్ పోలీసు కమిషనరేట్ అడిషనల్ డీసీపీ ఎన్.రవి అన్నారు. బుధవారం హనుమకొండ సుబేదారిలోని ‘అసుంత’ భవన్లో ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో వరంగల్, హనుమకొండ జిల్లాలోని ఎంపిక చేసిన తల్లిదండ్రులకు ‘ఆన్లైన్లో బాలలపై జరుగుతున్న లైంగిక వేధింపులు–దానిని నిరోధించడంలో తల్లిదండ్రుల పాత్ర’ అనే అంశంపై వర్క్షాపు జరిగింది. అడిషనల్ డీసీపీ ఎన్.రవి మాట్లాడుతూ మారుతున్న సమాజంలో ప్రతీ ఒక్కరికి ఇంటర్నెట్ జీవన విధానంలో భాగమైందని, వినియోగంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల కౌమార బాలలు దీని బారిన పడుతున్నారన్నారు. బాలలను వేధింపులకు గురి చేస్తే 1930, 100, 1098 నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్స్పెక్టర్ పి.వెంకన్న, మై చాయిస్ ఫౌండేషన్ స్టేట్ కో ఆర్డినేటర్ జె.క్రాంతి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తల్లిదండ్రులకు అర్థమయ్యేలా వివరించారు. ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ అధ్యక్షతన జరిగిన ఈ వర్క్షాప్లో వయోవృద్ధుల ట్రిబ్యునల్ సభ్యురాలు డాక్టర్ కరుకాల అనితారెడ్డి, హనుమకొండ జిల్లా బాలల సంరక్షణ అధికారి ఎస్.ప్రవీణ్ కుమార్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు డాక్టర్ పరికి సుధాకర్, చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డినేటర్ ఎస్.భాస్కర్, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీకాంత్, మేనేజర్ అజయ్ కుమార్, ఫీల్డ్ కోఆర్డినేటర్ ఈసంపల్లి సుదర్శన్ పాల్గొన్నారు. -
వినియోగదారుల హక్కుల రక్షణే ధ్యేయం
ఖిలా వరంగల్ : వినియోగదారుల హక్కుల రక్షణే ధ్యేయమని వినియోగదారుల జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి అన్నారు. ఈమేరకు బుధవారం శివనగర్లో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 15లోపు 33 జిల్లాలో నూతన కమిటీలను ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అనంతరం జిల్లా, మండల కమిటీలను ఆయన ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా గన్నోజు నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా ఆరెబెల్లి సందీప్, సిటీ అధ్యక్షుడిగా మురహరి కార్తీక్, ప్రధాన కార్యదర్శిగా బేతి రాజేష్, వర్ధన్నపేట మండల అధ్యక్షుడిగా దుగ్యాల తరుణ్, కార్యదర్శిగా బత్తిని అనిల్కుమార్, హనుమకొండ మండల అధ్యక్షుడిగా గంగరాజు, సతీష్, ప్రధాన కార్యదర్శిగా రామోజు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
ఆధునిక సాగుపై అవగాహన ఉండాలి
ఖిలా వరంగల్ : ఆధునిక వ్యవసాయ సాగు విధానంపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రాజన్న, శాస్త్రవేత్త సౌమ్య సూచించారు. ఈమేరకు బుధవారం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఎస్ఆర్ యూనివర్సిటీ విద్యార్థులు సందర్శించారు. ఈసందర్భంగా నూతన సాగువిధానం, పంటలను విద్యార్థులు పరిశీలించారు. అనంతరం చేపలు, నాటుకోళ్ల పెంపకం వల్ల వచ్చే లాభాలను వివరించారు. ఎస్ఆర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సాయి కృష్ణారెడ్డి, శ్రీను, శ్రావ్య, పూజ, శ్రీవాత్సవ్, మానస, అమిత్, రవితేజ పాల్గొన్నారు -
పింఛన్.. ఇప్పించండి
కాజీపేట : కాజీపేటలోని డీజిల్కాలనీకి చెందిన కొరవి గణేష్కు ఐదేళ్ల క్రితం పక్షవాతం రావడంతో దాతల సాయంతో ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ప్రస్తుతం బంధువుల ఇంట్లో తల దాచుకుంటున్నాడు. అయితే గణేష్ పక్షవాతానికి గురికావడంతో సరిగ్గా నడవలేని పరిస్థితి ఏర్పడింది. మిత్రుల సహకారంతో ఎంజీఎం ఆస్పత్రి నుంచి సదరం ధ్రువీకరణ పత్రం తెచ్చుకున్నాడు. తనకు పింఛన్ మంజూరు చేయాలని రెండేళ్లుగా ఎదురు చూస్తున్నట్లు గణేష్ కన్నీటి పర్యంతమవుతున్నాడు. దీనస్థితిలో ఉన్న గణేష్ను కుటుంబీకులు భారంగా భావిస్తుండటంతో మనసులోని బాధను ఎవరితో చెప్పుకోలేక కుమిలి పోతున్నాడు. ఇప్పటికై నా పింఛన్ అందించి ఆదుకోవాలని గణేష్ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. కలెక్టర్ స్పందించి పింఛన్ ఇప్పించి ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. -
పీడీఎస్యూ నాయకుల నిరసన
కేయూ క్యాంపస్ : అమెరికాలోని భారతీయ వలసదారులను అక్రమంగా బంధించి వెనక్కి పంపుతున్న ఆ దేశాధ్యక్షుడి చర్యలను, అలాగే మోదీ నిర్లక్ష్యాన్ని నిరసిస్తు పీడీఎస్యూ ఆధ్వర్యంలో బుధవారం కేయూ మొదటి గేట్వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ, ఉపాధ్యక్షుడు బి.నర్సింహారావు మాట్లాడుతూ అగ్రరాజ్యమైన అమెరికా తన నూతన ఆర్థికవిధానాలు ఇతర దేశాలపై బలవంతంగా రుద్దారని దీంతో వివిధ దేశాల్లో వలసలు పెరిగాయన్నారు. విద్యా, ఉపాధి కోసం అమెరికాకు వెళ్లిన వారి మనుగడ అధ్యక్షుడి చర్యలతో జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయన్నారు. అక్రమ వలసదారులంటూ భారతీయులపై అమెరికా అధ్యక్షుడి చర్యలను మోదీ ప్రభుత్వం పట్టించుకోకపోవటం శోచనీయమన్నారు. కార్యక్రమంలో నాయకులు కావ్య, అనూష, కన్వీనర్ బాలు తదితరులు పాల్గొన్నారు. -
డీజిల్ షెడ్లో రైల్వే హెల్త్ క్యాంప్
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే డీజిల్ లోకోషెడ్లో బుధవారం మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. రైల్వే ఆస్పత్రి డీఎంఓ డాక్టర్ ధీరజ్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్యాంపులో డాక్టర్లు నరేందర్హిర్వాని, ఉత్తమ్, ప్రవళిక, వైద్య సిబ్బంది 180 మంది రైల్వే ఎంప్లాయీస్కు పరీక్షలు నిర్వహించి సలహాలు, సూచనలు చేశారు. నేడు(గురువారం) కూడా కార్మికుల కోసం హెల్త్ చెకప్ క్యాంపును నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. రైల్వే మజ్దూర్ యూనియన్ డీజిల్ బ్రాంచ్ చైర్మన్ ఎస్కె. జానిమియా, ట్రెజరర్ గిరిమిట్ల రాజేశ్వర్రావు, సత్యనారాయణ, శివప్రసాద్, మాషుజాని, రాజయ్య, శ్రీధర్, రైల్వే వైద్య సిబ్బంది కవిత, రమాదేవి, ప్రసాద్, మల్లేష్, గోపి, కార్మికులు పాల్గొన్నారు. వైద్యశిబిరానికి అపూర్వ స్పందన ఖిలా వరంగల్ : వరంగల్ 32వ డివిజన్ బీఆర్ నగర్లో లయన్స్ క్లబ్ ఆఫ్ హనుమకొండ పద్మాక్షి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఉచిత వైద్యశిబిరానికి అపూర్వ స్పందన లభించింది. ముఖ్యఅతిథిగా లయన్క్లబ్ జిల్లా గవర్నర్ కుందూరు వెంకట్రెడ్డి, డాక్టర్ సిరికొండ భాస్కర్రావు, ధరణికొటి వీణావాణి హాజరై వైద్యశిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. అనంతరం వైద్యులు ప్రజలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. -
తడి, పొడిచెత్తను వేరు చేయాలి
నగర మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరు చేసి అందించాలని నగర ప్రజలకు మేయర్ గుండు సుధారాణి విజ్ఞప్తి చేశారు. బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలోని బయోగ్యాస్ ప్లాంట్ను మంగళవారం మేయర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ కాలనీల్లో తిరుగుతున్న స్వచ్ఛ ఆటోలకు చెత్తను అందించి నగర పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. తడి చెత్తతో తయారైన కంపోస్టు ఎరువును ఉద్యాన శాఖ ద్వారా మొక్కల పెంపకానికి ఉపయోగించాలని సూచించారు. కార్పొరేషన్లో బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేసిన గ్యాస్ నుంచి వచ్చే విద్యుత్ను ప్రతిరోజూ 2 గంటలపాటు వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. పొడిచెత్తను నగరంలోని డీఆర్సీసీ కేంద్రాలకు, అక్కడ నుంచి దేశంలోని వివిధ రీసైక్లింగ్ కేంద్రాలకు పంపించనున్నట్లు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో నగర ప్రజలు ముందుండాలని మేయర్ గుండు సుధారాణి కోరారు. -
నాలా నిర్మాణానికి సహకరించండి
వరంగల్ అర్బన్: నాలా నిర్మాణానికి సహకరిస్తే కాలనీవాసులకు న్యాయం చేస్తామని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పేర్కొన్నారు. వరంగల్ 42 వ డివిజన్లోని తెలంగాణ కాలనీని టౌన్ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో కమిషనర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్థానిక ప్రజల సౌకర్యార్థం నాలా నిర్మాణానికి భూ యజమానులు ముందుకురావాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఈ ప్రవీణ్చంద్ర, ఇన్చార్జ్ సీపీ రవీంద్రరాడేకర్, ఈఈ శ్రీనివాస్, టీపీఎస్ అనిల్, ఏఈ మోజామిల్ తదితరులు పాల్గొన్నారు. -
సాక్షిప్రతినిధి, వరంగల్
●● పలు పట్టణ, జిల్లా కేంద్రాలు అడ్డాగా బియ్యం దందా సాగుతోంది. ఇటీవల రేషన్ బియ్యం అ క్రమ రవాణాకు హసన్పర్తి, హనుమకొండ, పరకాల, నర్సంపేట ప్రధాన కేంద్రాలుగా మారాయి. ● తరచూ పీడీఎస్ బియ్యం పట్టుబడుతున్నా హనుమకొండ, హసన్పర్తి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాలకు సంబంధించిన బియ్యం పరకాల కేంద్రంగా మార్పిడి, రవాణా ఆగడం లేదు. ఈ బియ్యం దందా వెనుక గతంలో హనుమకొండలో గుట్కా, బెల్లం దందాతో సంబంధం ఉన్న ఒకరు బ్యాచ్తో ‘శివ’మెత్తుతున్నట్లు ఇటీవల నమోదైన కేసుల ద్వారా స్పష్టమవుతోంది. ● గూడూరు, ఖానాపురం, కొత్తగూడ, చెన్నారావుపేట తదితర ప్రాంతాల నుంచి సేకరిస్తున్న రేషన్ బియ్యం నర్సంపేట కేంద్రంగా పాలిష్ చేసి సంచుల మార్పిడి, అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇక్కడి నుంచి తరలిస్తున్న బియ్యంపై ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో గతంలో కేసులు నమోదు అయ్యాయి. ఆ సమయంలో రేషన్ బియ్యం మాఫియా, ఇతరుల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరగ్గా.. అప్పటి ఓ ప్రతినిధి జోక్యంతో సద్దుమణిగినట్లు తెలిసింది. ● ఈ దందాలో రూ. లక్షలు గడిస్తున్న బియ్యం వ్యాపారులు మాఫియా డాన్లుగా మారుతున్నారు. రేషన్ బియ్యం వ్యాపారులపై పీడీ యాక్టు పెడతామని బెదిరించినా.. 6ఏ కేసులు పెట్టినా ఫలితం ఉండటం లేదు. దీంతో రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యానికి పాలిష్ పెట్టి దారి మళ్లించి రూ.లక్షలు గడిస్తున్నారు. మార్కెట్లో ఆ నాణ్యత ఉన్న బియ్యం ధర రూ.35 నుంచి రూ.45 పైగా ధర ఉండడంతో అక్రమార్కులకు ఉచిత బియ్యం పథకం వరంలా మారింది. ● పీడీఎస్ దందాపై ఎక్కడికక్కడ చెక్పోస్టుల్లో కట్టడి చేస్తున్నామని, ఇటీవల కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తమ బృందాలు తనిఖీలు ఉధృతం చేశాయని పౌరసరఫరాల శాఖకు చెందిన అధికారి ఒకరు చెప్పారు. పీడీఎస్ బియ్యం దందా చేసే వారిపై ఇకపై మరింత తీవ్రంగా వ్యవహరిస్తామని పోలీసులు కూడా ప్రకటించారు. వరంగల్ -
పూడికతీత పనులు వేగవంతం చేయండి
నయీంనగర్/హన్మకొండ కల్చరల్: భద్రకాళి చెరువు పూడికతీత పనులు వేగవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం భద్రకాళి చెరువు పూడకతీత పనులను కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. పూడికమట్టిని వాహనాల్లో తరలించడానికి అంతర్గత రోడ్డు నిర్మించాలని సూచించారు. పనులు జరుగుతున్న చోట రాత్రి సమయంలో విద్యుత్ బల్బులు ఏర్పాటుచేయాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. మట్టి తరలించే వాహనాల నమోదు కోసం చెక్పోస్ట్ ఏర్పాటుచేసి రెవెన్యూ, పోలీస్, సాగునీటి పారుదల, మున్సిపల్ శాఖల సిబ్బందితో 24 గంటలు పర్యవేక్షణ, తనిఖీ ఉండేవిధంగా చూడాలని పేర్కొన్నారు. పూడికమట్టి కావాలనుకునే వారు క్యూబిక్ మీటరుకు రూ.72 చెల్లించి తీసుకోవచ్చని తెలిపారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, మున్సిపల్, కుడా, సాగునీటిపారుదల శాఖల అధికారులు ఉన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం హన్మకొండ అర్బన్: వేసవిని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో ప్రత్యేకంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసినట్లు హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. తాగునీటి సరఫరా, రబీపంటలకు సాగు నీరు, డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా, రేషన్కార్డుల దరఖాస్తుల ధ్రువీకరణ, రైతు భరోసా పథకాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు తాగునీటి సమస్య లేదని, సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా చేతిపంపులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రేటర్ పరిధిలో డివిజన్లకు ధర్మసాగర్ తాగునీటిని సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 24 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని, రానున్న రోజుల్లో అదనంగా మరో 21 ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయనున్నట్లు వివరించారు. సమావేశంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులతో కలిసి భద్రకాళి చెరువు పరిశీలన -
నేడు వెలవెల..
హసన్పర్తి పోలీస్స్టేషన్ పరిధిలోని దేవన్నపేట శివారులో ఈ నెల 14న ఓ రైస్మిల్లులో అక్రమంగా నిల్వచేసిన రూ.8.06 లక్షల విలువైన 310 క్వింటాళ్ల రేషన్ బియ్యం, ఓ లారీ, బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైస్మిల్లు లీజుదారుడు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం బోర్నపల్లికి చెందిన కేశబోయిన మొగిలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేయూసీ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ నెల 15న రూ.82,500 విలువ చేసే 33 క్వింటాళ్లు, 16న కాజీపేట పోలీస్స్టేషన్ పరిధిలో రూ.32,500 విలువైన 13 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. బత్తుల దుర్గమ్మ, గంట సారయ్య, తూర్పాటి కుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం కార్డులు 11,05,543 -
తడి, పొడిచెత్తను వేరు చేయాలి
నగర మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరు చేసి అందించాలని నగర ప్రజలకు మేయర్ గుండు సుధారాణి విజ్ఞప్తి చేశారు. బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలోని బయోగ్యాస్ ప్లాంట్ను మంగళవారం మేయర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ కాలనీల్లో తిరుగుతున్న స్వచ్ఛ ఆటోలకు చెత్తను అందించి నగర పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. తడి చెత్తతో తయారైన కంపోస్టు ఎరువును ఉద్యాన శాఖ ద్వారా మొక్కల పెంపకానికి ఉపయోగించాలని సూచించారు. కార్పొరేషన్లో బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేసిన గ్యాస్ నుంచి వచ్చే విద్యుత్ను ప్రతిరోజూ 2 గంటలపాటు వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. పొడిచెత్తను నగరంలోని డీఆర్సీసీ కేంద్రాలకు, అక్కడ నుంచి దేశంలోని వివిధ రీసైక్లింగ్ కేంద్రాలకు పంపించనున్నట్లు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో నగర ప్రజలు ముందుండాలని మేయర్ గుండు సుధారాణి కోరారు. -
పురాతన కట్టడాలను కాపాడుకోవాలి
హన్మకొండ కల్చరల్ : పురాతన దేవాలయాలు, కట్టడాలను కాపాడుకుంటే చరిత్రకు ఆధారాలుగా నిలుస్తాయని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా పేర్కొన్నారు. హనుమకొండలోని శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయాన్ని సౌమ్యమిశ్రా మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు ఆమెను ఆలయమర్యాదలతో స్వాగతించారు. స్వామివారికి బిల్వార్చన, పూజలు చేసిన అనంతరం ఉపేంద్రశర్మ తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో జైళ్ల శాఖ అధికారులు, డీసీపీ దేవేందర్రెడ్డి, హనుమకొండ సీఐ సతీశ్ పాల్గొన్నారు. -
మండల స్థాయి స్టాక్ పాయింట్లు
మొత్తం రేషన్ దుకాణాలు 2,364ప్రతినెల రేషన్ బియ్యం పంపిణీ 33,153.976మెట్రిక్ టన్నులుమొత్తం యూనిట్లు (కుటుంబ సభ్యులు) 32,55,776..ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వారం రోజుల వ్యవధిలో 1,024 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 560 క్వింటాళ్లకు పైగా పీడీఎస్ రైస్ను స్వాధీనం చేసుకోవడం గమనార్హం. రోజుకు వందల క్వింటాళ్ల రేషన్ బియ్యం వయా హుజూరాబాద్, కాళేశ్వరం ద్వారా మహారాష్ట్రకు అక్రమంగా తరలుతున్నాయి. మామూలు తనిఖీల్లోనే ఇంత పెద్దమొత్తంలో రేషన్ బియ్యం పట్టుబడ్డాయంటే ‘రేషన్’ దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. వరంగల్, హనుమకొండ, పరకాల, జనగామ, నర్సంపేట, ములుగు, భూపాలపల్లి తదితర ప్రాంతాల నుంచి సాగుతున్న రేషన్ బియ్యం దందా ఎల్లలు దాటుతోంది. వరంగల్ ఈ దందా వెనుక కొందరు రైస్మిల్లర్లే కీలకం కాగా.. భీమదేవరపల్లి మండలానికి చెందిన ఒకరు హసన్పర్తికి మకాం మార్చి ‘మేనేజ్’ చేస్తూ ‘కోటి’కి పడగెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. ఇతడికి సంబంధించిన రేషన్ బియ్యం వందల క్వింటాళ్లు పోలీసులకు దొరుకుతున్నా.. ఎఫ్ఐఆర్ నమోదైనా.. ఆ సమయంలో ‘పరారీ’లోనే ఉంటాడు. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత తాపీగా పోలీసులకు చిక్కే ఆ వ్యక్తికి అన్ని వర్గాల మద్దతు ఉందన్న చర్చ ఉంది. 18కమిషనరేట్ పరిధిలో ప్రధాన కేంద్రాలు.. -
టీచర్లు, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి
కేయూ క్యాంపస్: వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బరి లో నిలిచిన తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్రెడ్డి అభ్యర్థించారు. మంగళవారం హనుమకొండలోని ఆర్ట్స్అండ్ సైన్స్ కాలేజీలో తొలుత ప్రిన్సి పాల్ జ్యోతిని కలిశారు. అనంతరం పలువురు అధ్యాపకులతో మాట్లాడారు. తనను టీచర్ ఎమ్మెల్సీగా గెలిపిస్తే మండలిలో గళమెత్తుతానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయన వెంట యూనియన్ బాధ్యులు డాక్టర్ కుందూరు సుధాకర్, ఎస్కే మీరుద్దీన్, రవీందర్రెడ్డి ఉన్నారు. విద్యార్థులకు కంటి పరీక్షలు చేయించాలి : డీఈఓవిద్యారణ్యపురి: జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులకు కంటి పరీక్షలు చేయించాలని డీఈఓ వాసంతి కోరారు. గత సంవత్సరం 968 పాఠశాలల్లోని విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. దృష్టి లోపం ఉన్న 137 పాఠశాలల్లోని 2,357 మంది విద్యార్థులకు ఈనెల 17 నుంచి 28 వరకు వరంగల్ ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు 300 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు, ఇతర ఉపకరణాలు అందజేస్తారని తెలిపారు. ప్రతి మండలంలో ఎంపికచేసిన విద్యార్థులు కంటి పరీక్షలకు వెళ్లేవిధంగా మండల విద్యాశాఖాధికారులు మార్గనిర్దేశనం చేయాలని సూచించారు. అదనపు సమాచారం కోసం సమగ్రశిక్ష సమ్మిళిత విద్య కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి ఫోన్నంబర్ 9603672289ను సంప్రదించాలని డీఈఓ కోరారు. ఉపాధ్యాయుల గొంతు వినిపిస్తా.. నయీంనగర్: ఉపాధ్యాయుల గొంతుకనై వారి సమస్యలు పరిష్కరిస్తానని, తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వరంగల్–నల్లగొండ–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. మంగళవారం హనుమకొండ ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల మద్దతుతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానన్నారు. ఆరేళ్లుగా ఉపాధ్యాయుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి సమస్యల సాధనకు కృషి చేశానన్నారు. ప్రభుత్వ విద్యారంగం, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను రక్షించడానికి పాటుపడుతానన్నారు. 20 నుంచి దూరవిద్య సెమిస్టర్ పరీక్షలుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య ఎంఏ, ఎంకాం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ మంగళవారం తెలిపారు. ఈనెల 20, 22, 24, 27, మార్చి 1తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటలవరకు పరీక్షలు జరుగుతాయని వారు పేర్కొన్నారు. ఎంఏ జర్నలిజం,హెచ్ఆర్ఎం పరీక్షలు కేయూ దూరవిద్య ఎంఏ జర్నలిజం, ఎంఏ హెచ్ఆర్ఎం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల ఈనెల 20, 22, 24, 27, మార్చి 1, 3వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని అధికారులు తెలిపారు. -
ఫిర్యాదుల పెట్టెలతో సమస్యల పరిష్కారం
వరంగల్ కలెక్టర్ సత్యశారద వరంగల్: జిల్లాలోని 75 ప్రభుత్వ సంక్షేమ శాఖల గురుకులాలు, వసతి గృహాల్లోని డార్మెటరీల్లో ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేయడం వల్ల సమస్యలు పరిష్కారమవుతున్నాయని వరంగల్ కలెక్టర్ సత్యశారద.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి వివరించారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ సత్యశారద కలెక్టరేట్ నుంచి వీసీలో పాల్గొని మాట్లాడుతూ.. వసతి గృహాల్లో ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేయడం ద్వారా సత్ఫలితాలు వస్తున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్య, మెనూ ప్రకారం పోషకాహారం, మౌలిక వసతులు కల్పిస్తున్నారని, గురుకులాల సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. దీంతో సీఎస్ శాంతికుమారి అభినందించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, విద్యుత్ శాఖ ఎస్ఈ మధుసూదన్రావు, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా పౌరసరఫరాల అధికారి కిష్టయ్య, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
హనుమకొండ డీవీఏహెచ్ఓ ఎవరు?
సాక్షిప్రతినిధి, వరంగల్ : హనుమకొండ జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి (డీవీఏహెచ్ఓ)గా కొత్తగా ఎవరిని నియమించనున్నారు? అన్న అంశం ఆ శాఖలో హాట్టాపిక్గా మారింది. ఇప్పటి వరకు డీవీఏహెచ్ఓగా ఉన్న వెంకటనారాయణ పదవీ విరమణకు కొద్ది నెలలే గడువున్నా.. సొంత జిల్లా ఖమ్మం జిల్లాకు మంగళవారం బదిలీ అయ్యారు. వెటర్నరీ, పశుసంవర్థకశాఖలో సంయుక్త సంచాలకులుగా పదోన్నతి పొందిన ఐదుగురు అధికారులను ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబసాచి ఘోష్ బదిలీ చేశారు. అందులో భాగంగా సిద్దిపేటకు అశోక్కుమార్, మంచిర్యాలకు కృష్ణ, కరీంనగర్కు సుధాకర్, నల్లగొండకు రమేష్ను నియమించిన ప్రధాన కార్యదర్శి ఘోష్.. హనుమకొండ డీవీఏహెచ్ఓ నుంచి ఏడీగా పదో న్నతి పొందిన వెంకటనారా యణను ఖమ్మం జిల్లాకు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో అన్ని రకా లుగా అనుకూలం.. హాట్కేక్లాంటి హనుమకొండ డీవీఏహెచ్ఓ పోస్టు కోసం పలువురు లాబీయింగ్ చేస్తున్నారు. హైదరాబాద్ స్థాయిలో పావులు ప్రధానంగా ఈ సీటుపై ఐదుగురు కన్నేయగా, పదో న్నతులు, ఫారిన్ సర్వీస్ల పేరిట సుమారు మూడు నెలల నుంచి కాచుకు కూర్చున్న సదరు వ్యక్తులు ఇప్పటికే వివిధ రూపాల్లో సమీప ప్రాంతాలు, కార్యాలయాల్లో డిప్యుటేషన్లపై పనిచేస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి జిల్లా వెటర్నరీ, పశుసంవర్థకశాఖ అధికారులుగా పదోన్నతులు కలిగిన కొందరు ఫారిన్ సర్వీస్ల పేరిట డిప్యుటేషన్ పొందారు. ఐదారు నెలల్లో పదవీ విరమణ పొందే హనుమకొండ ‘బాస్’ సీటుకు కొందరు స్కెచ్ వేయగా.. వివిధ రూపాల్లో హనుమకొండ, వరంగల్, జనగామ, మంచిర్యాల జిల్లాల్లో పనిచేస్తున్న మరికొందరు ఇప్పటికే హైదరాబాద్ స్థాయిలో పావులు కదుపుతున్నారన్న ప్రచారం ఉంది. హనుమకొండ డీవీఏహెచ్ఓ పోస్టు కోసం ముందస్తు వ్యూహాంతో పావులు కదపడం.. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఎడాపెడా సాగిన ‘డిప్యుటేషన్’ల దందాపై ‘సాక్షి’ లో ప్రచురితమైన కథనాలు కలకలం రేపాయి. ఉన్నతాధికారులు విచారణ జరిపించి షోకాజ్లు జారీ చేయడంతో కొంత సద్దుమణిగినా.. ఆ వ్యవహారంలో కీలకంగా ఉన్న వ్యక్తులు హనుమకొండ డీవీఏహెచ్ఓ పోస్టు కోసం పైరవీలు చేస్తున్న విష యం ఆ శాఖలో మళ్లీ హాట్టాపిక్గా మారింది. సొంత జిల్లా ఖమ్మానికి వెంకటనారాయణ బదిలీ డీవీఏహెచ్ఓ కోసం పోటాపోటీగా ప్రయత్నాలు, పైరవీలు హనుమకొండ సీటుపై ఐదుగురి కన్ను ఇప్పటికే డిప్యుటేషన్లపై ఉన్న కొందరు పశుసంవర్థకశాఖలో హాట్టాపిక్ -
నిబంధనలు పాటిస్తేనే నిర్మాణ అనుమతులు
వరంగల్ అర్బన్ : భవన నిర్మాణ నిబంధనలు పాటిస్తేనే అనుమతులు జారీ చేస్తామని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే స్పష్టం చేశారు. నూతన భవన నిర్మాణాలకు అనుమతుల మంజూరు.. పెద్ద భవన నిర్మాణాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ కోసం ఆమె సోమవారం నగర పరిధి సుబేదారి ప్రాంతంలోని పోస్టల్కాలనీ, ప్రకాశ్రెడ్డిపేట, లోటస్కాలనీ, కాజీపేట ప్రాంతాల్లో పర్యటించి ఫిర్యాదులను, మ్యాపులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ టీఎస్–బీపాస్ ద్వారా భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసిన నేపథ్యంలో సూచించిన ధ్రువీకరణ పత్రాలు నమోదు చేసి నిబంధనలు పాటిస్తే చట్టానికి లోబడి అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే వారికి అనుమతులు ఇవ్వమని స్పష్టం చేశారు. కమిషనర్ వెంట ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఏసీపీలు ఉన్నారు. బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే -
24 కిలోల గంజాయి స్వాధీనం
వరంగల్: వరంగల్ రైల్వేస్టేషన్లో హరప్రసాద్ సాహూ అనే వ్యక్తి వద్ద సుమారు రూ.6లక్షల విలువైన 24 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేసినట్లు ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ షుకూర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా కోదల గ్రామానికి చెందిన హరప్రసాద్ సాహూ సోమవారం గంజాయితో వరంగల్ రైల్వేస్టేషన్లో దిగి క్రయవిక్రయదారుల కోసం వేచి ఉన్నాడు. పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో అతడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ షుకూర్ తెలిపారు. డోర్నకల్లో 19.68 కేజీలు.. డోర్నకల్ : డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ క్రాస్ వద్ద సోమవారం పోలీసులు ఎండు గంజాయి పట్టుకున్నారు. ఎస్సై గడ్డం ఉమ కథనం ప్రకారం.. ఉయ్యాలవాడ క్రాస్ వద్ద వాహన తనిఖీ నిర్వహిస్తుండగా రెండు ద్విచక్ర వాహనాలపై నలుగురు వ్యక్తులు వస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని ఆపి తనిఖీ చేయగా 19.68 కేజీల ఎండు గంజాయి లభించింది. దీంతో ఒడిశాకు చెందిన సమర భూమియా, సీసీఎల్, మహదేవ్ మండల, ఉమేశ్ మండలను అరెస్ట్ చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.4,92,000 ఉంటుందని ఎస్సై తెలిపారు. -
తహసీల్దార్ గారూ.. ఏది నిజం?
సాక్షి, వరంగల్: జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైన ‘అన్న, తమ్ముడు.. ఓ తహసీల్దార్’ కథనంపై వరంగల్ తహసీల్దార్ మహమ్మద్ ఇక్బాల్ సాక్షి పత్రికకు ఇచ్చిన ‘రిజైండర్’ మరెన్నో అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి వరంగల్ మండలం కొత్తపేటలోని సర్వే నంబర్ 73లో ఒక ఎకరం భూమి మహమ్మద్ అఫ్జల్ నుంచి 1998 జనవరి 9న సాదాబైనామా ద్వారా కొనుగోలు చేశానని మోకాపై వ్యవసాయం సాగు చేసుకుంటున్న అంకేశ్వరపు కొమురయ్య వాదిస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన సాదాబైనామా అప్లికేషన్ నంబర్ టీటీఆర్వోఎస్ 022003406759 పరిష్కరించాలంటూ 23614 ఆఫ్ 2024 రిట్ పిటిషన్ ప్రకారం అంకేశ్వరపు కొమురయ్యది సర్వే నంబర్ 73/ఏ/3 అని అందులో ఒక ఎకరం ఒక గుంట భూమి అని.. అది రెవెన్యూ రికార్డుల ప్రకారం పట్టా భూమి అని.. సింపుల్ సేల్ డీడ్ ద్వారా ఎండీ ఖాజా పాషా దగ్గర కొనుగోలు చేశాడని సాక్షికి ఇచ్చిన రిజైండర్లో తహసీల్దార్ మహమ్మద్ ఇక్బాల్ పేర్కొన్నారు. దీంతో అసలు ఈ విచారణ సజావుగా సాగిందా అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం 73/ఏ/3లోని ఒక ఎకరం ఒక గుంట ధరణిలో అంకేశ్వరపు ఎల్ల స్వామి పేరున ఉన్నట్టు నిర్ధారించిన తహసీల్దార్ రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ భూమి ఎండీ ఖాజా పాషాదని పేర్కొనడమే ఇప్పుడు ఈ వివాదానికి కేంద్ర బిందువు అవుతోంది. ఇప్పుడు ఇదే అంశం కలెక్టర్ డాక్టర్ సత్యశారదకు సవాల్గా మారిందనే చర్చ కలెక్టరేట్ వర్గాల్లో వినబడుతోంది. నిజం తేల్చాలని బాధితుల వేడుకోలు వరంగల్ మండలం కొత్తపేటలోని 73/ఏ/3లోని ఒక ఎకరం ఒక గుంట భూమి ధరణిలో అంకేశ్వరపు ఎల్లస్వామి పేరున ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ భూమిని మహమ్మద్ ఖాజాపాషా నుంచి అంకేశ్వరపు కొమురయ్య కొనుగోలు చేశారని తహసీల్దార్ ఇక్బాల్ సాక్షితో పేర్కొన్నారు. ఇది లోతుగా పరిశీలిస్తే ధరణిలో అంకేశ్వరపు ఎల్లస్వామి పేరున పట్టా ఉండడం నిజమే. కానీ ఆ భూమిని మహమ్మద్ అఫ్జల్ సోదరుడైన మహమ్మద్ జాఫర్ హుస్సేన్ ద్వారా డాక్యుమెంట్ నంబర్ 2780/2007తో సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ ద్వారా అంకేశ్వరపు ఎల్ల స్వామి పేరు మీదకు మారింది. మహమ్మద్ ఖాజాపాషా నుంచి అంకేశ్వరపు కొమురయ్య కొనుగోలు చేశారని తహసీల్దార్ చెబుతుంటే.. ఎండీ జాఫర్ హుస్సేన్ నుంచి అంకేశ్వరపు ఎల్లస్వామి కొనుగోలు చేసినట్టుగా రెవెన్యూ రికార్డులు చెబుతుండడం గమనార్హం. మరీ ఇందులో ఏది నిజమనేది ఉన్నతాధికారులు తేల్చాలని బాధితులు కోరుతున్నారు. ఇప్పటికై నా తహసీల్దార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా తన పట్టా 73/ఏ/3 క్రయ విక్రయాలు జరగకుండా కోర్టు కేసు ఉందని అప్డేట్ చేసినదాన్ని తొలగించాలని అంకేశ్వరపు ఎల్లస్వామి రెవెన్యూ ఉన్నతాధికారులను కోరుతున్నారు. అలాగే తన అన్న కొమురయ్య భూమి కొన్న సమయంలో బై సర్వే నంబర్లు లేవని, రెవెన్యూ రికార్డులు పరిశీలిస్తే ఇది తెలుస్తుందని చెబుతున్నాడు. సర్వే నంబర్ 73లో 12.6ఎకరాల భూమి ఉండేదని వివరించారు.కలెక్టర్కు సవాల్గా మారిన కొత్తపేట సర్వే నంబర్ 73 భూ వివాదం ఒకే సర్వే నంబర్లో వింత సమాధానాలతో విచారణపై మరిన్ని అనుమానాలు క్షేత్రస్థాయిలో విచారణచేస్తేనే బాధితులకు సరైన న్యాయం -
ముగిసిన చదరంగం పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి బాలబాలికల ఓపెన్ టు ఆల్ చదరంగం పోటీలు సోమవా రం ముగిశాయి. హోరాహోరీగా సాగిన పోటీల్లో విజేతగా అల్లాడి శ్రీవాత్సవ్, తర్వాతి స్థానా ల్లో మ్యాకల శ్రీకాంత్, తుర్క రాజు, రవీంద్రనాథ్ , తిరుపతిచారి, ఆద్య, సుదీప నిలిచారు. విజేతలకు నిర్వాహకుడు పి. కన్నా సర్టిఫికెట్లు, పతకాలు అందజేశారు. కార్యక్రమంలో చీఫ్ ఆర్బి టర్లు శ్రీనివాస్, ప్రేమ్సాగర్, రజనీకాంత్, శ్రీకాంత్, రవీందర్ పాల్గొన్నారు. చోరీకి యత్నించిన కేసులో వ్యక్తికి ఏడాది జైలు చిన్నగూడూరు: మండలంలోని ఉగ్గంపల్లి శివారు దేవోజీతండాలో ఓ ఇంట్లో చోరీకి యత్నించిన కేసులో నిందితుడికి తొర్రూరు మేజిస్ట్రేట్ మట్ట సరిత ఏడాది జైలు శిక్ష, జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు వెల్లడించినట్లు ఎస్సై ఝాన్సీ తెలిపారు. నల్లగొండ జిల్లా గుర్రంపాడు మండలం తేనెపల్లికి చెందిన శివర్ల కోటేశ్ 2023లో దేవోజీతండాకు చెందిన ధర్మసోత్ భూపాల్ నాయక్ ఇంటిలో చోరీకి యత్నించాడు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కోటేశ్పై కేసు నమోదు చేశారు. సోమవారం కేసు విచారణ అనంతరం తొర్రూరు మేజిస్ట్రేట్ మట్ట సరిత.. నిందితుడికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ. వెయ్యి జరిమానా విధించారు. కాగా, నిందితుడికి శిక్షపడేలా విధులు నిర్వర్తించిన కోర్టు పీసీ మధును తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్, మరి పెడ సీఐ రాజ్కుమార్, చిన్నగూడూరు ఎస్సై ఝాన్సీ అభినందించారు. రూ.38,720 విలువైన గుట్కాలు స్వాధీనంఖిలా వరంగల్: అక్రమంగా గుట్కాలు విక్రయిస్తున్న కిరాణా వ్యాపారిపై కేసు నమోదు చేసి రూ. 38,720ల విలువైన ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.పవన్కుమార్ తెలిపారు. వరంగల్ 36వ డివిజన్ చింతల్కు చెందిన కిరాణా షాపు నిర్వాహకుడు చిదిరాల సుమన్ అక్రమంగా గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో సోమవారం టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.పవన్కుమార్ ఆధ్వర్యంలో షాపుపై దాడి చేశారు. ఇందులో రూ. 38,720 విలువైన గుట్కాప్యాకెట్లు లభించగా స్వాధీనం చేసుకుని సుమన్పై కేసు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం కేసును మిల్స్కాలనీ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.పవన్కుమార్ తెలిపారు. ఈకార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
రామప్ప శిల్పాకళా సంపద అద్భుతం
వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పాకళా సంపద అద్భుతమని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా పేర్కొన్నారు. సోమవారం మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామి వారికి పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా, ఆలయ ఆర్చకులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తించిన సమయంలో రామప్ప ఆలయాన్ని సందర్శించినట్లు తెలిపారు. యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత ప్రస్తుతం రామప్ప ఆలయాన్ని మళ్లీ సందర్శించినట్లు వెల్లడించారు. ఆమె వెంట ఓఎస్డీ మహేశ్ భగవత్ గీతె, ములుగు డీఎస్పీ రవీందర్, జైళ్ల శాఖ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా -
స్వాగత తోరణాల పనులు పూర్తి చేయాలి
వరంగల్ అర్బన్ : నగర పరిధి ప్రధాన రహదారుల్లో చేపట్టిన స్వాగత తోరణాల పనులను 20 రోజుల్లోగా పూర్తి చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. నర్సంపేట రహదారి ధర్మారం వద్ద, ఖమ్మం రోడ్డు పున్నేలు వద్ద నిర్మిస్తున్న స్వాగత తోరణాల అభివృద్ధి పనులను ఆమె సోమవారం సందర్శించారు. వాటిని పర్యవేక్షిస్తున్న ఇంజినీర్లకు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య● వనమాల కనపర్తిలో ఘటన ఐనవోలు: అప్పుల బాధతో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని వనమాల కనపర్తి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై పస్తం శ్రీనివాస్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గట్టు రాజేశ్(41) డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రెండు సంవత్సరాల క్రితం గ్రామంలో ఇంటి నిర్మాణం మొదలు పెట్టాడు. కాగా, చిట్టీలు ఎత్తుకోవడంతోపాటు కొంతమంది వద్ద సుమారు రూ.8లక్షల వరకు అప్పులు చేశాడు. అదే విధంగా భార్య సునీత బంగారం సుమారు 7 తులాల వరకు బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం పొందాడు. ఇటీవల అనారోగ్యానికి గురై ఇంట్లోనే ఉంటున్నాడు. అప్పులు ఎలా తీర్చాలని తరచూ బాధ పడేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో ఒక్కడే నిద్రించాడు. సోమవారం ఉదయం భార్య సునీత కొత్త ఇంటికి వెళ్లి చూడగా ఉరేసుకుని చనిపోయి కనిపించాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. కాగా, మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఐశ్వర్య, సంజన ఉన్నారు. -
నేడు అగ్రిహబ్ రీజినల్ సెంటర్ ప్రారంభం
హన్మకొండ: వరంగల్ పైడిపల్లిలోని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఏర్పాటు చే సిన అగ్రిహబ్ రీజినల్ సెంటర్ను మంగళవారం ప్రారంభించనున్నట్లు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు ఆర్.ఉమారెడ్డి తెలిపారు. ఉదయం 10.30 గంటలకు వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ఎ.జానయ్య ప్రారంభిస్తారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయంలో స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించడానికి ఈ అగ్రిహబ్ను ఇక్కడ స్థాపించినట్లు వివరించారు. వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత చెన్నారావుపేట: అక్రమంగా నిల్వ చేసి వంద క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం మండలంలోని పాత మగ్దుంపురం గ్రామంలోని ననుమాస పవన్కుమార్ ఇంటిలో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఇందులో వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం లభ్యంకాగా స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు పేర్కొన్నారు. నిల్వ చేసిన రేషన్ బియ్యం విలువ సుమారు రూ. 2 లక్షల 50 వేలు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ సీఐ బాబులాల్, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
విన్నపాలకు స్పందనేది..?
వరంగల్ అర్బన్: ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా సమస్యలు పరిష్కారం కావడం లేదు.. ప్లీజ్ మేడం.. క్షేత్ర స్థాయిలో సందర్శించి తమ బాధలు తెలుసుకోవాలని పలు కాలనీలకు చెందిన ప్రజలు గ్రేటర్ వరంగల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేను వేడుకున్నారు. బల్దియా కౌన్సిల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన వరంగల్ గ్రేటర్ గ్రీవెన్స్లో ప్రజల నుంచి వినతులను కమిషనర్ స్వీకరించారు. నగర పరిధిలోని పలు కాలనీల్లో కనీస వసతులు లేవని, ఆక్రమణలు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయని, తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలపై మొత్తం 76 అర్జీలు అందాయి. అందులో టౌన్ ప్లానింగ్కు 31, ఇంజినీరింగ్ విభాగానికి 22, తాగునీటి సరఫరా 10, ప్రజారోగ్యానికి 7, పన్నుల సెక్షన్ 4, ఉద్యానవన విభాగానికి 2 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా, ఎస్ఈ ప్రవీణ్చంద్ర, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, హెచ్ఓలు రమేశ్, లకా్ష్మ్రెడ్డి, ఇన్చార్జ్ సీపీ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, రాజేశ్వర్, పన్నుల అధికారి రామకృష్ణ పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని ఇలా.. ● వడ్డేపల్లి విజయ్పాల్ కాలనీలో డ్రెయినేజీలు వ్యర్థాలతో నిండి పోయాయని శ్యామల ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. ● 43వ డివిజన్ గణేష్నగర్లో నివాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న ఓయో రూమ్ను రద్దు చేయాలని సంక్షేమ సంస్థ ప్రతినిధులు వేడుకున్నారు. ● కేయూసీ రోడ్డులోని 3 – 14 – 542/2 వద్ద ప్రధాన రహదారిపై తాగునీటి పైపులైన్ లీకేజీ కారణంగా ధ్వంసమైన రోడ్డుకు మరమ్మతు చేయాలని కూచన సురేష్ కోరారు. ● మడికొండ వెస్ట్సిటీలో 400 కుటుంబాలు నివా సముంటున్నాయని, అక్కడ కనీసం సౌకర్యాలు కల్పించాలని సొసైటీ ప్రతినిధులు పేర్కొన్నారు. ● 11వ డివిజన్ కాపువాడ రాణా సిద్ధిఖీ ఆస్పత్రి లైన్లో సీసీ రోడ్డు, డ్రెయినేజీ సౌకర్యాల కల్పించాలని కాలనీ ప్రతినిధులు విన్నవించారు. ● హనుమకొండ దీన్దయాళ్ కాలనీ ‘కుడా’ ఆధ్వర్యంలో చేపట్టిన అంతర్గత డ్రెయినేజీలు పూర్తి చేయాలని ఎమ్మార్పీఎస్ నేత మంద కుమార్ మాదిగ ఫిర్యాదు చేశారు. ● నక్కలగుట్ట సునీత రెసిడెన్సీ అపార్టుమెంట్ సెల్లార్లో అక్రమంగా నిర్మించిన 4 షెట్టర్లను తొలగించాలని స్థానికులు దరఖాస్తు చేశారు. ● 64వ డివిజన్ మడికొండలో 30 ఫీట్ట రోడ్డును 7 ఫీట్ల మేర ఆక్రమించి నిర్మాణం చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. ● హంటర్ రోడ్డు ట్యాంక్ బండ్ వద్ద టిఫిన్ సెంటర్లు, ఇతర షాపుల కారణంగా వాహనాల రద్దీ పెరుగుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని పలువురు ఫిర్యాదు చేశారు. ● కాశిబుగ్గ సాయిగణేష్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా పరిష్కారం కాని సమస్యలు గ్రేటర్ గ్రీవెన్స్లో ప్రజల అసహనం దరఖాస్తులు స్వీకరించిన కమిషనర్ అశ్విని తానాజీ వాకడే -
ఆన్లైన్.. ఆగమాగం!
ట్రైన్ పాస్లు, పీటీఓలు, లీవ్లు ఆన్లైన్లో మంజూరు ● వినియోగించుకోలేకపోతున్న 70 శాతం మంది రైల్వే కార్మికులు ● ఆఫ్లైన్లోనూ అందుబాటులో ఉంచాలని విన్నపం ● రైల్వే నాయకులు పట్టించుకోవాలని మొరకాజీపేట రూరల్: ఎన్నో ఏళ్లు ఎందరో త్యాగాలు, ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న రైల్వే కార్మికుల హక్కులు పూర్తి స్థాయిలో కార్మికులు అందుకోలేకపోతున్నారు. ఇప్పటికే రైల్వే కార్మికుల హక్కులు చాలా వరకు కనుమరుగవ్వగా.. కొన్నింటి కోసం ఇప్పటికీ కార్మికులు, నాయకులు ఉద్యమిస్తూనే ఉన్నారు. ఈక్రమంలో కొంత కాలంగా రైల్వే శాఖలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల కనీస హక్కులను ఆన్లైన్ చేయడంతో వాటిని సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నామని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సక్రమంగా స్మార్ట్ఫోన్ ఆపరేట్ చేయడం తెలియని 70 శాతం మంది రైల్వే కార్మికులు ఆన్లైన్లో తమ హక్కులను ఎలా వినియోగించుకోవాలో తెలియక ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. రైల్వే కార్మికులకు తమ కుటుంబసభ్యులతో కలిసి ప్రయాణించేందుకు సంవత్సరానికి మూడు ఉచిత ప్రివిలేజ్ ట్రైన్ పాస్లు ఇచ్చేది. అత్యవసర పరిస్థితులున్నప్పుడు, సెలవుల కోసం అర్జీ పెట్టుకుంటే సెలవులు ఇస్తారు. అదేవిధంగా క్యాజువల్ లీవ్ (సీఎల్) మంజూరు, ప్రివిలేజ్ టికెట్ ఆర్డర్ (పీటీఓ) మంజూరు ఇవన్నీ... రైల్వే ఆన్లైన్ చేయడం వల్ల చాలా వరకు రైల్వే కార్మికులు తమ హక్కులను పొందలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ సిస్టంలో అప్లయ్, ఆప్లోడ్, ఓటీపీ, ఫార్వర్డ్, డౌన్లోడ్ విధానం తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రివిలేజ్ పాస్ తీసుకునే విధానం తెలియక కొందరు కొంత కాలం నుంచి ట్రైన్పాస్లు తీసుకోవడం లేదని కార్మికులు చెబుతున్నారు ఆన్లైన్లో ట్రైన్ పాస్ ద్వారా ఒక సారి ప్రయాణం చేస్తే మరొకసారి ప్రయాణం చేసే అవకాశం లేకుండా పోయిందని, గతంలో సంవత్సరానికి మూడు ప్రివిలేజ్ ట్రైన్ పాస్లు ఇచ్చేవారని, ఈ పాస్లపై ఎన్నిసార్లు అయిన ప్రయాణించే అవకాశం ఉండేదని అంటున్నారు. ముఖ్యంగా కింది స్థాయి గ్రూప్ డి, నాలుగో తరగతి రైల్వే కార్మికులు గ్యాంగ్మెన్లు, గ్యాంగ్ ఉమెన్లు, గేట్మెన్లు, కీ మెన్లు, అటెండర్లు, డీజిల్షెడ్, ఎలక్ట్రిక్లోషెడ్, ట్రైన్లైటింగ్, సిఅండ్డబ్ల్యూ స్టాప్, టీటీ మిషన్ స్టాప్ తదితర కార్మికులు ఆన్లైన్లో తమ హక్కులను పొందలేకపోతున్నట్లు పేర్కొంటున్నారు. రిటైర్డ్ రైల్వే వారికి ఇస్తున్న మాదిరిగానే సర్వీస్లో ఉన్న వారికి కూడా మ్యాన్యుల్గా ఇస్తే ఇబ్బంది ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా రైల్వే ట్రేడ్ యూనియన్ల నాయకులు రైల్వే కార్మికుల కనీస హక్కులను ఆన్లైన్లో కాకుండా పాత పద్ధతిలో అమలు చేసేలా రైల్వే బోర్డు, జీఎం దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆన్లైన్ పాస్లు ఎత్తివేయాలి.. కార్మికులు తమ ఇంటిల్లిపాదితో కలిసి ఉచిత ట్రైన్పాస్తో ప్రయాణించేవారు. ఇప్పుడు ఆన్లైన్ చేయడం వల్ల ఆ అవకాశం లేకుండాపోయింది. అత్యవసర సెలవులకు సీఎల్ కార్డు చూపిస్తే లీవ్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ సిస్టం లేదు. రైల్వే కార్మికుల ఇబ్బందులు గుర్తించి అధికారులు ఆన్లైన్ సిస్టం ఎత్తివేసి మ్యాన్యువల్ అమలు చేస్తే బాగుంటుంది. – దేవులపల్లి రాఘవేందర్, తెలంగాణ రైల్వే జేఏసీ కన్వీనర్●ఆన్లైన్ చేసినవి ఇవే..ఆన్లైన్ తెలియక.. -
పర్యాటకులకు గుడ్న్యూస్..
హన్మకొండ : పర్యాటకులను ప్రోత్సహించేందుకు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఒక్క రోజు పర్యాటక ప్రాంతాల సందర్శన టూర్ను ఏర్పాటు చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను కలుపుతూ ఈ టూర్ ప్యాకేజీ రూపొందించారు. మినీ ఏసీ బస్సులో పర్యాటకులను తీసుకెళ్లేలా టూర్ ప్యాకేజీ తీసుకొచ్చారు. ఈ నెల 20 ఉదయం 8 నుంచి రాత్రి 7.45 గంటల వరకు సాగుతోంది. గురువారం ఉదయం 8 గంటలకు హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్ నుంచి ఈ పర్యాటక ప్రాంతాల సందర్శన ప్రారంభమవుతుంది. ముందు వేయిస్తంభాల దేవాలయానికి చేరుకుంటారు. 9 గంటలకు వేయి స్తంభాల దేవాలయం నుంచి భద్రకాళి దేవస్థానానికి, ఇక్కడి నుంచి రామప్పకు చేరుకుంటుంది. రామప్పలో మధ్యాహ్న భోజన అనంతరం లక్నవరం నుంచి నేరుగా సాయంత్రం 5.30 గంటలకు హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్కు చేరుకుంటారు. తేనీరు తీసుకున్న తర్వాత ఖిలావరంగల్కు చేరుకుని సౌండ్ లైటింగ్ కార్యక్రమాన్ని వీక్షించడంతో పాటు, ఖిలావరంగల్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించి తిరిగి రాత్రి 7.45 గంటలకు హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్కు చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది. వివరాల కోసం 9010007261 ఫోన్ నంబర్లో సంప్రదించాలని పర్యాటకాభివృద్ధి సంస్థ ఒక ప్రకటనలో కోరింది. సంస్థ వెబ్ సైట్లోనూ వివరాలు పొందుపరిచినట్లు తెలిపింది. చార్జీలు పెద్దలకు రూ.980, పిల్లలకు రూ.790గా నిర్ణయించారు. ఒక్క రోజు పర్యాటక ప్రాంతాల సందర్శన టూర్ ఏర్పాటు చేసిన తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ -
జాతీయవాద రచనలకు కేంద్రబిందువు సదాశివరావు
● ప్రముఖ రచయిత వరిగొండ కాంతారావు హన్మకొండ కల్చరల్ : జాతీయవాద రచనలకు కేంద్రబిందువుగా స్వర్గీయ భండారు సదాశివరావు అని ప్రముఖ రచయిత వరిగొండ కాంతారావు అన్నారు. జాతీయ సాహిత్య పరిషత్ పూర్వ అధ్యక్షుడు భండారు సదాశివరావు స్మారకగా ఆదివారం హంటర్రోడ్లోని శ్రీవ్యాస ఆవాసంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ప్రముఖ కవి, రచయిత డాక్టర్ భండారు ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ‘హిందువుగా జీవించు–హిందువునని గర్వించు’ అనే అంశంపై నిర్వహించిన కవితా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. భండారు సదాశివరావు రచనలు ‘అగ్నిమూర్తులపై’ న్రముఖ రచయిత ఐత చంద్రయ్య, ‘పృథ్వీసూక్తం’పై వరిగొండ కాంతారావు ప్రసంగించారు. కార్యక్రమంలో శ్రీవ్యాస ప్రతిష్టాన్ సంఘం ప్రధాన బూర రాయచందర్, జాతీయ సాహిత్య పరిషత్ హనుమకొండ శాఖ ప్రధాన కార్యదర్శి తాడిచెర్ల రవి, ప్రముఖ వైద్యులు డాక్టర్ బీఎస్ శివసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
ఘనంగా ‘స్వయంవర్’ దశాబ్ది ఉత్సవాలు
హన్మకొండ : హనుమకొండ నక్కలగుట్టలోని ‘ది స్వయంవర్’లో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరి గాయి. ది స్వయంవర్ స్థాపించి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం 11వ ఆవిర్భావ వే డుకలు నిర్వహించారు. ప్రముఖ వస్త్రవ్యాపారి కాసం నమఃశివాయ జ్యోతి వెలిగించి ఉత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ప్రథమంగా ఎత్నిక్వేర్ స్టోర్ ది స్వయంవర్ను స్థాపించామని చెప్పారు. ఈ స్టోర్ దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు 47 నగరాల్లో 85 బ్రాంచ్లుగా విస్తరించినట్లు పేర్కొన్నారు. వివాహాది శు భాకార్యాలకు, పిల్లలకు, యువకులకు, పెద్దలకు అందుబాటులో కలెక్షన్స్ ఉన్నాయని తెలిపారు. అందుబాటు ధరల్లో షేర్వాణి, ఇండో వెస్ట్రన్, జోద్పురి బ్లాజర్స్, సెమీ ఇండో వెస్ట్రన్ కుర్తా, పైజామా, మో దీ సెట్, పట్టు పంచె, పగిడి, పెర్ఫ్యూమ్స్, దుపట్టా, లెనిన్ కుర్తాలు, షర్ట్లు తమ ప్రత్యేకత అని వి వరించారు. డైరెక్టర్లు కాసం మల్లి కార్జున్, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పీఎన్.మూర్తి, పుల్లూరు అరుణ్కుమార్ పాల్గొన్నారు. -
26న ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనం
● భద్రకాళి దేవాలయం ప్రధాన అర్చకుడు శేషు హన్మకొండ: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 26న ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు భద్రకాళి దేవాలయం ప్రధాన అర్చకుడు శేషు తెలిపారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోట ల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓరుగల్లు వైభవాన్ని, శివతత్వాన్ని చాటేలా ఆధ్యాత్మిక నిలయమైన ఓరుగల్లు గడ్డ మీద ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యాన ప్రతి సంవత్సరం మాదిరిగానే మహా శివరాత్రి సందర్భంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేశ్రెడ్డి ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యక్రమంలో ఓరుగల్లు ప్రజలంతా భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాకేశ్రెడ్డితోపాటు గేయ రచయిత వెన్నెల శ్రీనాథ్, శాసీ్త్రయ నృత్య కళాకారిణి చిరంజీవి హిమాన్సీ కాట్రగడ్డ, ఇండస్ ఫౌండేషన్ మహా శివరాత్రి కార్యక్రమ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
ప్రజాప్రభుత్వంలో సోషల్ మీడియా పాత్ర కీలకం
హన్మకొండ చౌరస్తా: పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి సోషల్ మీడియా కార్యకర్తలు శక్తివంచన లేకుండా పనిచేశారని, ప్రజాప్రభుత్వ ఏర్పాటులో సోషల్ మీడియా పాత్ర కీలకమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్చార్జ్ నేహాల్ ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండలోని డీసీసీ భవన్లో ‘సోషల్ మీడియా వారియర్స్– కాఫీ విత్ ఎమ్మెల్యే’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సోషల్మీడియా విశేష కృషి చేసిందన్నారు. పదేళ్లలో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసిన కార్యకర్తల పై అప్పటి ప్రభుత్వం కేసులు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. సోషల్మీడియా వారియర్స్ శ్రమను గుర్తించి తగిన ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో తొలిసారి ‘కాఫీవిత్ ఎమ్మెల్యే కార్యక్రమం’ చేపట్టడం అభినందనీయమన్నారు. సమావేశంలో టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాసరావు, ఈవీ శ్రీనివాసరావు, డాక్టర్ నాయి ని గోదావిష్ణువర్ధన్రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షరాలు బంక సరళ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణ, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి రమేశ్, నాయకులు తిరుపతిరెడ్డి, జీవన్రెడ్డి, హుస్సేన్, లక్ష్మి, భరత్, చందు, రమేశ్ పాల్గొన్నారు.● ‘కాఫీ విత్ ఎమ్మెల్యే’ కార్యక్రమంలో నాయిని -
తగ్గని భక్తుల జోరు
జాతర ముగిసినా..ఎస్ఎస్ తాడ్వాయి : మేడారం సమ్మక్క, సారలమ్మ మినీజాతర ముగిసినా భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. జంపన్న వాగు స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించి పుట్ట వెంట్రుకలు సమర్పించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మేడారం పరిసరాల్లో వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. ముందస్తు అంచనాతో అధికారుల ఏర్పాట్లు.. మినీ జాతర అనంతరం ఆదివారం కూడా భక్తులు అధిక సంఖ్యలో మేడారానికి వస్తారని ముందస్తు అంచనాతో జిల్లా అధికారులు, పోలీస్ శాఖ తరఫున ఏర్పాట్లు చేశారు. డీఎస్పీ రవీందర్ పర్యవేక్షణలో భారీ బందోబస్తు నిర్వహించారు. శనివారం రాత్రి నుంచి ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా భక్తుల ప్రైవేట్ వాహనాలను పార్కింగ్ స్థలాల్లోకి మళ్లించారు. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి భద్రత కట్టుదిట్టం చేశారు. పస్రా సీఐ రవీందర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్రెడ్డి.. సిబ్బందిని సమన్వయ చేస్తూ బందోబస్తు నిర్వహించారు. సరైన సమయంలో బస్సులు లేక భక్తుల ఇబ్బందులు అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆదివారం వేలాదిగా తరలివచ్చిన భక్తులు సరైన సమయంలో ఆర్టీసీ బస్సులు లేక ఇబ్బందులు పడ్డారు. బస్టాండ్లోనే పడిగాపులు కాశారు. తీరా ఒక్క బస్సు రాగానే ఎక్కేందుకు పోటీ పడ్డారు. ఈ సమయంలో మహిళలు, పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడాల్సి వచ్చింది.సమన్వయంతో జాతర విజయవంతంజిల్లా అధికారులు, పోలీస్ శాఖ, పూజారుల సమన్వయంతో మినీ జాతర విజయవంతమైందని మేడారం జాతర కమిటీ చైర్మన్ ఆరెం లచ్చుపటేల్ అన్నారు. ఈమేరకు ఆదివారం పూజారులతో కలిసి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు సమర్పించారు. గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినీజాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంత్రి సీతక్క, జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేసి జాతర విజయవంతానికి కృషి చేశారన్నారు. ఈ సందర్భంగా జాతర విజయవంతానికి సహకరించిన అధికారులు, సిబ్బంది, పూజారులకు కృతజ్ఞతలు తెలిపారు.19న తిరుగువారం పూజలు ఈనెల 19న (బుధవారం) తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. మినీజాతర (మండమెలిగె) పండుగ ముగిసిన అనంతరం మరోసారి అమ్మవార్లకు పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు తిరుగువారం పండుగ చేయడం ఆనవాయితీ. తిరుగు వారం పండుగ రోజున మేడారం, కన్నెపల్లిలో పూజారులు, ఆదివాసీ కుటుంబాలు అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మేడారానికి తరలివచ్చిన వేలాది మంది ట్రాఫిక్ నియంత్రణకు కట్టదిట్ట చర్యలు 19న తిరుగువారం పండుగ -
సీనియార్టీ తేల్చడంలో జాప్యమెందుకు?
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో తెలు గు విభాగం అధిపతిగా, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రొఫెసర్ ఏటూరి జ్యోతి ఈఏడాది జనవరి 9న మృతి చెందిన విషయం వి ధితమే. అయితే ఆ విభాగంలో రెగ్యులర్ ప్రొఫెస ర్లు లేరు. నలుగురు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెస ర్లు మామిడి లింగయ్య, మంథిని శంకర్, చిర్రరాజు , కర్రె సదాశివ్ ఉన్నారు. ఆ నలుగురిలో సీనియార్టీ ప్రాతిపదికన ఒకరిని విభాగం అధిపతిగా, మరొకరిని బోర్డు ఆఫ్స్టడీస్ చైర్మన్గా నియమించాల్సింటుంది. అయితే ఆ నలుగురు కూడా ఆ పదవులు ఆశిస్తున్నారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేస్తూ వీసీ కె. ప్రతాప్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వీరిలో ఎవరిని విభాగం అధిపతిగా, బోర్డు ఆఫ్స్టడీస్ చైర్మన్గా నియమించడానికి సీనియార్టీ తేల్చాలని వీసీ ఓ కమిటీని నియమించాలని నిర్ణయించారు. దీంతో ఈ ఏడాది జనవరి నెలాఖరులో అ ప్పటి రిజిస్ట్రార్ పి. మల్లారెడ్డి ఈ కమిటీని నియమి స్తూ వారం రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కమిటీని నియమించి రెండు వారాలు గడిచినా ఇప్పటివరకూ రిపోర్టు ఇవ్వలేదు. దీంతో ఈ కమిటీని నియమించింది కాలయాపనకేనా? ఇంకెప్పుడు సీనియార్టీని తేలుస్తారని ఆ నలు గురు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రశ్నిస్తున్నా రు. జాప్యం చేయడంలో ఆంతర్యమేమిటీని యూ నివర్సిటీలో చర్చ సాగుతోంది. అయితే కమిటీ మాత్రం ఆరోపణలు పట్టించుకోదని, తాము ఆ నలుగురిలో సీనియార్టీని మాత్రమే పరిశీలించి త్వరలోనే రిపోర్టు అందజేస్తామని కమిటీలో ఉన్న ఓ ప్రొఫెసర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈనెల 17న కమిటీ సమావేశమై సీనియార్టీని తేల్చి రిపోర్టు ఇవ్వాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాగా, ఆ నలుగురిలో ఎవరు విభాగం అధిపతి, బీఓఎస్గా నియామకం అవుతారనే అంశం యూనివర్సిటీలో ఆసక్తికరంగా మారింది. కమిటీని నియమించి రెండువారాలు ఇంకా సమర్పించని నివేదిక తెలుగు అధిపతి, బీఓఎస్ నియామకమెప్పుడు? నేడు కమిటీ సమావేశమయ్యే అవకాశం! -
జ్వరంతో విద్యార్థి మృతి
● ఆశ్రమ పాఠశాల వార్డెన్, హెచ్ఎం నిర్లక్ష్యమే కారణం: బంధువులు ● హాస్టల్ ఎదుట బంధువుల ఆందోళన వాజేడు: జ్వరంతో బాధపడుతూ వాజేడు మండల పరిధి పేరూరు బాలుర ఆశ్రమ హాస్టల్ విద్యార్థి సోయం వినీత్(13) శనివారం రాత్రి మృతి చెందాడు. పేరూరు గ్రామానికి చెందిన వినీత్ ఊళ్లోని ఆశ్రమ హాస్టల్లో ఉంటూ అదే పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. వినీత్కు మూడు రోజులక్రితం జ్వరం వచ్చింది. హాస్టల్లో ఒక మాత్ర ఇవ్వగా జ్వరం తగ్గింది. దీంతో ఇంటికి వచ్చాడు. ఇంటి వద్ద నీరసంగా ఉండడంతో అతడి మేన మామ ధర్మవరంలో ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించాడు. ఆర్ఎంపీ.. బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. వెంటనే మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్లాలని సూచించాడు. దీంతో కారులో శుక్రవారం సాయంత్రం వినీత్ను ఏటూరు నాగారం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యం చేస్తుండగానే మృతి చెందాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులు వినీత్ మృతి చెందడానికి హాస్టల్ వార్డెన్, పాఠశాల హెచ్ఎం నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. జ్వరమొస్తే కుటుంబ సభ్యులకు తెలపకుండా మాత్ర వేసి పంపించడం ఏంటని ప్రశ్నించారు? అనంతరం బంధువులు, ఆదివాసీ నవ నిర్మాణ సేన రాష్ట్ర నాయకుడు కొర్స నర్సిమూర్తి, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర నాయకుడు ఉయిక శంకర్తో కలిసి ఆశ్రమ పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. విద్యార్థి మృతికి కారణమైన వార్డెన్ శ్రీను, హెచ్ఎం నాగరాజుపై చర్యలు తీసుకోవాలని, వినీత్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ నినదించారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన కొనసాగింది. వినీత్ కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు బాలుడి తల్లి శైల కుమారికి ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని వార్డెన్, హెచ్ఎం హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సర్వేను సద్వినియోగం చేసుకోవాలి అదనపు కలెక్టర్ సంధ్యారాణి వరంగల్: కులగణన సర్వేను ప్ర జలు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి కోరారు. వరంగల్ నగరంలోని పోచమ్మమైదాన్, కాశీబుగ్గ సర్కిల్ కార్యాలయం, కరీమాబాద్ మీసేవ కేంద్రాల్లో ఏర్పాటుచేసిన ప్రజాపాలన సేవా కేంద్రాలను అదనపు కలెక్టర్ ఆదివారం తనిఖీ చేశారు. ఆ యా కేంద్రాల్లో రీసర్వేలో నమోదు వివరాల తీరు, రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనవు కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 28 వరకు సర్వే నిర్వహిస్తారని, ఇప్పటివరకు నమోదు కాని కుటుంబ సభ్యులు మాత్రమే సర్వేలో వివరాలు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం తిరిగి అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. వరంగల్లోని పోచమ్మమైదాన్ ఈసేవ కేంద్రం, కాశీబుగ్గ సర్కిల్ ఆఫీస్ కేంద్రం, కరీమాబాద్ మీసేవ కేంద్రం, నర్సంపేట తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా పాలన కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రతీరోజు ఉద యం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040–21111 1111 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి కూడా నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా https://seeepcsurvey.cgg.gov.in నుంచి దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకుని వివరాలు నింపి ప్రజాపాలన కేంద్రాల్లో అందించొచ్చన్నారు. ప్రజలు సర్వేకు సహకరించి పూర్తి వివరాలను ఇ వ్వాలని కోరారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, బల్దియా రెవెన్యూ అధికారి షా జాదీబేగం, పర్యవేక్షకులు హబీబుద్దీన్, ఆర్ఐ సోహైల్ పాల్గొన్నారు. -
చెస్తో మేధస్సు పెంపు
వరంగల్ స్పోర్ట్స్: చదరంగంతో మేధస్సు పెరుగుతుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జి ల్లా స్థాయి ఓపెన్ టు ఆల్ చదరంగ పోటీలను ఆది వారం ఎమ్మెల్యే నాయిని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. మానసికంగా ధైర్యంగా ఉన్నప్పుడే జీవితంలో వచ్చే ఆటుపోట్లను ఎదుర్కొంటామన్నారు. టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి కన్నా మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 170 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు నాలుగు రౌండ్లు ముగియగా అందులో అల్లాడి శ్రీవాట్సన్, రజనీకాంత్, కొమురవెల్లి, వివేక్, ఆధ్య, రవీంద్రనాథ్ ముందంజలో ఉన్నారని తెలిపారు. టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాసరావు, ఈవీ శ్రీనివాసరావు, ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, ఆర్బిటర్లు పాల్గొన్నారు.● ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ● జిల్లా స్థాయి చెస్ పోటీలు ప్రారంభం -
అర్ధశతాబ్దపు అపూర్వ కలయిక..
కురవి: ఆ విద్యార్థులు అర్ధ శతాబ్దం తరువాత కలు సుకున్నారు. 54 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఒకచోట కలిసి ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఒకరి యోగక్షేమాలు మరొకరు తెలుసుకున్నారు. అనంతరం జ్ఞాపకాలను నెమరువేసుకుని రోజంతా ఉల్లాసం, ఉత్సాహంగా గడిపారు. ఈ అపురూప ఘట్టానికి మండలంలోని బలపాల జెడ్పీ హైస్కూ ల్ వేదికై ంది. పాఠశాలకు చెందిన 1971–1972 టెన్త్ బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో కలియ తిరిగారు. తరగతి గదులను పరిశీలిస్తూ జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకున్నారు. అనంతరం తమతో చదువుకుని చనిపోయిన స్నేహితులకు శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కిలారి అశోక్బాబు, చింతలమోహన్రావు, చిక్కా వెంకటేశ్వర్లు, తాటికొండ మల్లారెడ్డి, రావూరి విమల, దార నర్సింహరావు, రావూరి రమేశ్, ఈడిగిరాల ఐలయ్య, బొల్ల వసంత, గరక వెంకటేశ్వర్లు, కె.పద్మ , నామా సైదులు, రావూరి ప్రభాకర్రావు, అంబటి వెంకటనారాయణ పాల్గొన్నారు. 54 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు -
టీఆర్ల జారీలో ‘విజిలెన్స్’ విచారణ!
వరంగల్: సీసీఐ పత్తి కొనుగోలు చేసేందుకు టీఆర్ (టెంపరరీ రిజిస్ట్రేషన్)ల జారీలో పెద్ద మొత్తంలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు గుర్తించిన మార్కెటింగ్శాఖ రాష్ట్రంలోని ఏడుగురు మార్కెట్ కమిటీ కార్యదర్శులను సస్పెండ్ చేసిన విషయం విధితమే. వ్యవసాయ శాఖ అధికారులు జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలతోనే కార్యదర్శులు టీఆర్లు జారీ చేసినట్లు గుర్తించిన మార్కెటింగ్ శాఖ మొత్తం ఈ వ్యవహారంపై నిజనిజాలను నిర్ధారించేందుకు విజిలెన్స్, ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్కు అప్పగించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విచారణలో టీఆర్ల జారీలో ప్రమేయం ఉన్న వ్యవసాయ అధికారులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లతో పాటు మరికొంత మంది మార్కెట్ కార్యదర్శుల వ్యవహారం బహిర్గతమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏఓల ఇష్టారాజ్యం.. రైతుల నుంచి పత్తిని సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోలు చేసేందుకు టీఆర్ల కోసం ధ్రువీకరణ పత్రాల జారీలో కొంత మంది వ్యవసాయ శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహారించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పత్రాలు క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) మాత్రమే క్షేత్రస్థాయి పరిశీలన జరిపి జారీ చేయాలని వ్యవసాయ శాఖ నుంచి స్పష్టంగా నిబంధన ఉంది. అయినప్పటికీ కొంత మంది ఏఓలు అడ్డగోలుగా ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఓ జిల్లాలో ఏకంగా ధ్రువీకరణ పుస్తకాన్ని ప్రింట్ చేయించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోలు చేసే 80 మార్కెట్ కమిటీల్లో టీఆర్ల జారీపై మార్కెటింగ్ శాఖ అధికారులు విచారణ చేపట్టగా నిబంధనల పట్టించుకోకుండా సుమారు 46 వేలకు పైగా టీఆర్లు జారీ అయినట్లు అధికారులు గుర్తించారు. 20 మార్కెట్ కమిటీల్లో ఈ వ్యవహారం జరిగినట్లు గుర్తించినప్పటికీ ఫిర్యాదు వచ్చిన మార్కెట్ కమిటీ కార్యదర్శులను మొదటి విడతగా సస్పెండ్ చేశారు. రెండో విడత మరికొంత మందిపై వేటు పడే అవకాశలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విచారణలో వ్యవసాయ అధికారుల ప్రమేయం బహిర్గతమైతే వారిపై చర్యలు తప్పవన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే ఏడుగురిపై వేటు, త్వరలో మరికొందరిపై.. వ్యవసాయశాఖ ప్రమేయంపై ఆరా ఉమ్మడి జిల్లాలో మరికొందరిపై వేటుకు మల్లగుల్లాలు -
అమెరికా అమ్మాయి.. నీరుకుళ్ల అబ్బాయి
హన్మకొండ చౌరస్తా: అమెరికా దేశంలోని టొరంటోకు చెందిన జెస్సికా, హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామానికి చెందిన సతీష్ వివాహం ఆదివారం హనుమకొండలోని పెద్దమ్మగడ్డ సమీప ఏఆర్ఆర్ గార్డెన్లో అంగరంగ వైభవంగా జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించిన ఈ వివాహానికి అమ్మాయి తల్లి, సోదరి మరో ఇద్దరు బంధువులు, వరుడి తరఫు బంధువులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన సతీష్కు 2021 సంవత్సరం కరోనా సమయంలో నిర్వహించిన పలు సామాజిక కార్యక్రమాల్లో జెస్సికా పరిచయం అయింది. అది కాస్త పెళ్లి వరకు వెళ్లింది. ఇద్దరి మనసులను అర్థం చేసుకున్న ఇరువురి తల్లిదండ్రులు వేదమంత్రా ల సాక్షిగా వివాహతంతు జరిపించి ఒక్కటి చే శారు. ఈ వివాహ వేడుకను చూసిన బంధువులు, స్నేహితులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. -
ప్రజాసమస్యలపై పోరాడేందుకే పోటీ
హన్మకొండ: ‘ప్రజాసమస్యలపై పోరాడేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం.. బీజేపీకి సానుకూల వాతావరణం ఉంది.. గెలుస్తాం’ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నా రు. ఆదివారం హనుమకొండ హంటర్ రోడ్డులోని వేద బాంక్వెట్ హాల్లో విలేకరులతో, సత్యం కన్వెన్షన్లో జరిగిన మీట్ అండ్ గ్రీట్ విత్ టీచర్స్ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో ఈనెల 27న జరిగే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల్లో మూడు స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్నదని, పార్టీకి అనుకూలమైన వాతావరణం కనిపిస్తున్నదని చెప్పా రు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్పై పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో అసంతృప్తిని మూటగట్టుకుంటే.. కాంగ్రెస్ ఏడాది కాలంలోనే ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నదని అన్నారు. గ్యారంటీలు, హామీల అమలులో.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. శాసనమండలి ప్రాధాన్యతను తగ్గించేలా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సభ్యులందరినీ మూకుమ్మడిగా తమ పార్టీలో చేర్చుకుని శాసన మండలి ఉద్దేశాలను దెబ్బతీశారని అన్నారు. నల్ల గొండ–వరంగల్–ఖమ్మం ఉపాధ్యాయ స్థానం నుంచి పులి సరోత్తంరెడ్డి, మెదక్–కరీంనగర్–నిజా మాబాద్–ఆదిలాబాద్ ఉపాధ్యాయ స్థానం నుంచి కొమురయ్య, పట్టభద్రుల స్థానం నుంచి అంజిరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారని, అందరూ విజ యం సాధించి తీరుతారని పేర్కొన్నారు. సరోత్తంరెడ్డికి ఉపాధ్యాయుల సమస్యలపై సంపూర్ణ అవగా హన ఉందని, అన్ని సంఘాలు అభిమానించే వ్యక్తి ఆయన అని చెప్పారు. జేఏసీలోని సంఘాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయని తెలిపా రు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్రెడ్డి, అభ్యర్థి పులి సరోత్తంరెడ్డి, నాయకులు వన్నాల శ్రీరాములు, ఆర్.పి.జయంత్లాల్, డాక్టర్ పెసరు విజయ్చందర్రెడ్డి, డాక్టర్ కాళీప్రసాద్, గుజ్జ సత్యనారాయణ, చాడా శ్రీనివాస్రెడ్డి, చాడా సరిత, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రం నుంచి నిధులు ఇప్పించాలి : ఎమ్మెల్యే నాయిని ఇదిలా ఉండగా.. వరంగల్ మహానగర అభివృద్ధి కి కేంద్రం నుంచి నిధులు ఇప్పించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి.. కేంద్రమంత్రి కిషన్రెడ్డిని కోరారు. ఈ మేరకు వేద బాంక్వెట్ హాల్ వద్ద ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు. కేంద్ర నుంచి వరంగల్ మహానగరానికి వివిధ పథకాల కింద రావాల్సిన నిధులను విడుదల చేయించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. కేంద్ర పురావస్తు శాఖలో ఉన్న వేయిస్తంభాల ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటా యించాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కిషన్రెడ్డి నిధుల విడుదలకు సహకరిస్తానని తెలిపారు. పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్రావు, ఈవీ శ్రీనివాస్రావు, కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ హనుమకొండ జిల్లా అధ్యక్షు డు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తాం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి -
సేవలు మరింత చేరువ
హన్మకొండ: విద్యుత్ వినియోగదారులకు అత్యుత్త మ సేవలందించడంలో టీజీ ఎన్పీడీసీఎల్ పారదర్శకంగా, జవాబుదారీతనంతో వ్యవహరిస్తోంది. అందులో భాగంగా విద్యుత్ సర్వీసుల మంజూరు ను మరింత సులభతరం చేసింది. వినియోగదారు లకు కొత్త సర్వీసుల మంజూరులో డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకుంటే ఇప్పటి వరకు తిరస్కరిస్తూ వచ్చా రు. ఇకపై ఏదైనా కారణంచేత దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశముంటే దాన్ని తిరస్కరించకుండా మంజూరుకు అవసరమైన ప్రక్రియను పూర్తి స్థాయిలో అందించేలా విద్యుత్ శాఖ మరో అవకా శం కల్పించింది. దరఖాస్తు చేసినప్పటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునే వెసులుబాటును అందుబాటులోకి వచ్చింది. ఇదివరకు అప్లికేషన్ ఎక్కడి వరకు వచ్చిందో తెలి యక దరఖాస్తుదారులు కార్యాలయం చుట్టూ తిరిగే వారు. ట్రాకింగ్ సిస్టం అందుబాటులోకి వచ్చాక కార్యాలయం చుట్టూ తిరిగాల్సిన అవసరమే లేదని అధికారులు చెబుతున్నారు. వినియోగదారుడు సులభంగా తన అప్లికేషన్ నంబర్తో టీజీ ఎన్పీడీసీఎల్ వెబ్సైట్ నుంచి లేదా టీజీ ఎన్పీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా వివిధ దశల్లో ఉన్న అప్లికేష న్ స్థితిని తెలుసుకోగలుగుతారు. అయినప్పటికీ సంతృప్తి చెందకపోతే 1912 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అందుబాటులోకి అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టం విద్యుత్ వినియోగదారులకు తప్పిన తిప్పలు -
‘సంకటహర’ పూజలు
హన్మకొండ కల్చరల్ : శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో ఆదివారం సంకటహరచతుర్థి పూజలు ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యాన వేదపండితులు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి ప్రభాతపూజలు, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషే కం, సాయంత్రం 7 గంటలకు ఉత్తిష్టగణపతికి జల, క్షీర, పంచామృతం, నవరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేపట్టారు. ఇష్టమైన గరికతో షోఢశోపచార పూజలు చేశారు. 21 నుంచి మూడేళ్ల ‘లా’ మొదటి సెమిస్టర్ పరీక్షలుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎల్ఎల్బీ మూడేళ్ల కోర్సు మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు(రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) ఈనెల 21 నుంచి నిర్వహిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణా ధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసిమ్ ఇక్బాల్ తెలిపారు. ఈనెల 21, 24, 28, మార్చి 3, 5 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నా రు. అలాగే ఎల్ఎల్బీ మూడేళ్ల కోర్సు ఐదవ సెమిస్టర్ పరీక్షలు(రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) ఈనెల 22, 25, మార్చి 1, 4, 6 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని పరీక్షల నియంత్రణాధికారులు తెలిపారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు మరో అవకాశంవిద్యారణ్యపురి: ఇంటర్మీడియట్ సైన్స్, ఒకేషన ల్ కోర్సుల విద్యార్థులకు ఈనెల 3 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించిన ప్రాక్టికల్ పరీక్షలకు వివిధ కారణాలతో హాజరుకాని విద్యార్థులకు ఇంటర్బోర్డు మరో అవకాశం కల్పించింది. ఈ మేరకు హనుమకొండ డీఐఈఓ ఎ.గోపాల్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పింగిళి బాలికల జూనియర్ కళాశాలలో ఈ ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని, ఇప్పటివరకు పరీక్షలకు హాజరుకాలేని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేలా సంబంధి త కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు సహకరించాలని కోరారు. ముగిసిన ‘ఇన్నోథాన్–2.0’ కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లో నిర్వహిస్తున్న ‘ఇన్నోథాన్–2.0’ కార్యక్రమం ఆదివా రం ముగిసింది. నిట్ వరంగల్, హిటాచీ ఎనర్జీ సంయుక్తంగా నిర్వహించిన 30 గంటల ఎనర్జీ ఇన్నోవేషన్ ఇన్నోథాన్లో వివిధ కళాశాలల నుంచి 120 మంది విద్యార్థులు పాల్గొని నూత న ఆవిష్కరణలకు పోటీపడ్డారు. ముగింపులో భాగంగా నిర్వాహకులు విజేతలకు బహుమతులు, నగదు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో నిట్ ఇన్చార్జ్ డైరెక్టర్ వేణువినోద్ తదితరులు పాల్గొన్నారు. నిట్లో ‘చిగురు–24’ వేడుకలుకాజీపేట అర్బన్ : నిట్ వరంగల్, యూత్ ఫర్ సేవా, యూత్ రెడ్క్రాస్ ఆధ్వర్యాన వరంగల్ నిట్లో ‘చిగురు–24’ వేడుకలు ఆదివారం జరిగాయి. నగరానికి చెందిన 12 ప్రభుత్వ పాఠశాలల నుంచి 1,200 మంది విద్యార్థులు పాల్గొని కళలు, క్రీడలు, సాహిత్య రంగాల్లో 15 రకాల పోటీల్లో ప్రతిభ చాటారు. ఇందులో విద్యార్థులు రూపొందించిన అయోధ్య రామమందిర నమూనా విశేషంగా ఆకట్టుకుంది. నేడు గ్రేటర్ గ్రీవెన్స్వరంగల్: వరంగల్ మహా నగరపాలక సంస్థ కౌన్సిల్హాల్లో గ్రేటర్ గ్రీవెన్స్ కార్యక్రమం సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఒక ప్రకటనలో తెలిపారు. నగర పరిధి ప్రజలు తమ సమస్యలపై విజ్ఞప్తులను కార్యాలయంలో అందజేయాలని సూచించారు. నేడు వరంగల్ ప్రజావాణివరంగల్ కలెక్టరేట్లో సోమవారం ఉదయం 11 గంటలకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఒక ప్రకట నలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలపై వినతులను కార్యాలయంలో అందజేయాలని సూచించారు. -
టీచర్ ఎమ్మెల్సీగా గెలిపించాలి
కేయూ క్యాంపస్: వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ది పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్రెడ్డి కోరారు. ఆదివారం కాకతీయ యూనివర్సిటీ క్రీడామైదానంలో మార్నింగ్ వాకర్స్, అధ్యాపకులను కలిసిన ఆయన.. తనను గెలిపిస్తే ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. శాసనమండలిలో గళమెత్తి పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. వర్సిటీలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల భర్తీకి కృషిచేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేశారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మంద తిరుపతిరెడ్డి, బాధ్యులు దేవిరెడ్డి, కొండారెడ్డి, డాక్టర్ కుందూరు సుధాకర్, మహేందర్రెడ్డి, విజయ్పాల్ పాల్గొన్నారు. మార్నింగ్ వాకర్స్ను కోరిన అభ్యర్థి పింగిళి శ్రీపాల్రెడ్డి -
నేడు, రేపు యువజన క్రీడోత్సవాలు
వరంగల్ స్పోర్ట్స్: నెహ్రూయువ కేంద్రం ఆధ్వర్యాన ఈనెల 17, 18వ తేదీల్లో సుబేదారిలోని ఆర్ట్స్ కాలే జీ మైదానంలో వరంగల్ జిల్లా స్థాయి యువజన క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎన్వైకే జిల్లా అధికా రి చింతల అన్వేష్ ఒక ప్రకటనలో తెలిపారు. తా లూకా స్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలు పొందిన క్రీడాకారులు జిల్లా స్థాయిలో పాల్గొనేందు కు అర్హులుగా పేర్కొన్నారు. యువకులకు వాలీ బాల్, అథ్లెటిక్స్, షటిల్బ్యాడ్మింటన్, యువతులకు కబడ్డీ, షటిల్, అథ్లెటిక్స్ పోటీలు ఉంటాయన్నారు. రెండు రోజులపాటు జరిగే ఈపోటీల్లో పాల్గొనే క్రీ డాకారుల వయస్సు 15 నుంచి 29 ఏళ్ల మధ్య ఉండాలని తెలిపారు. పూర్తి వివరాలకు 93908 31502 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
మెరుగైన సేవలతో వైద్య ఖర్చులు తగ్గించొచ్చు
ఎంజీఎం/దామెర: ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు ప్రజలకు మెరుగ్గా అందించడం వల్ల వారిపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించవచ్చని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాయక్ అన్నా రు. ఆదివారం ఆయన దామెర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ల్యాబ్, ఫార్మసీ, వ్యాక్సిన్ స్టోర్, ఆయుష్, ఎన్సీడీ, ఇతర విభాగాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం రవీంద్రనాయక్ మాట్లాడు తూ ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో ప్రజలకు వివిధ ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించడం, పీహెచ్సీ సేవలు అందించడం ద్వారా వారు ఉన్నత స్థాయి వైద్య సేవలకు వెళ్లకుండా కాపాడవచ్చన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లోని 12 రకాల వైద్య సేవలు సక్రమంగా అందించాలని చెప్పారు. టీబీ, లెప్రసీ, ఎన్సీడీ కార్యక్రమాల్లో గుర్తించిన వారికి తగిన చికిత్సతో పాటు ఫాలోఆప్ సేవలు ముఖ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో హనుమకొండ డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, పీఓడీటీటీ డాక్టర్ కె.లలితాదేవి, ప్రో గ్రాం అధికారులు డాక్టర్ హిమబిందు, డాక్టర్ ఇస్తేదార్ అహ్మద్, డాక్టర్ మంజుల, వైద్యాధికారి డాక్టర్ మహేంద్ర, డాక్టర్ ప్రమోద్కుమార్, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్రెడ్డి, సీహెచ్ఎన్ లీల, సూపర్వైజర్లు శ్రీకాంత్, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాయక్