క్రీడల అభివృద్ధికి సీఎం పెద్దపీట | - | Sakshi

క్రీడల అభివృద్ధికి సీఎం పెద్దపీట

Apr 13 2025 1:04 AM | Updated on Apr 13 2025 1:04 AM

క్రీడల అభివృద్ధికి సీఎం పెద్దపీట

క్రీడల అభివృద్ధికి సీఎం పెద్దపీట

ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి

వరంగల్‌ స్పోర్ట్స్‌: సీఎం రేవంత్‌రెడ్డి స్టేడియాల అభివృద్ధి, క్రీడాకారుల సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నారని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ పరిధి బాలసముద్రంలోని స్విమ్మింగ్‌పూల్‌, హనుమకొండ జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో గల జిమ్నాజియం హాల్‌, వామప్‌ట్రాక్‌, ఇండోర్‌ స్టేడియంలోని బ్యాడ్మింటన్‌ కోర్టు మరమ్మతులు, తదితర అభివృద్ధి పనులకు శనివారం ఆయన ఎంపీ డాక్టర్‌ కడియం కావ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో క్రీడలు, క్రీడాకారులు నిర్లక్ష్యానికి గురయ్యారని అన్నారు. రూ.2.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య మాట్లాడుతూ క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించినప్పుడే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారన్నారు. కార్యక్రమంలో హనుమకొండ కలెక్టర్‌ ప్రావీణ్య, మున్సిపల్‌ కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే, డీవైఎస్‌ఓ గుగులోత్‌ అశోక్‌కుమార్‌, ఒలింపిక్స్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు అజీజ్‌ఖాన్‌, తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం రాష్ట్ర అద్యక్షుడు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు డాక్టర్‌ పింగిళి రమేశ్‌రెడ్డి, వరద రాజేశ్వర్‌రావు, కార్పొరేటర్‌ వేముల శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ నాయకులు బంక సంపత్‌, బంక సరళా, ఎండీ జాఫర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement