చిల్పూరు: భూనీల సమేత శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామిని శుక్రవారం పుష్ప, తులసీ దళాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రధాన అర్చకులు రవీందర్శర్మ, అర్చకులు రంగాచార్యులు, కృష్ణమాచార్యుల ఆధ్వర్యాన శ్రీవారికి పంచామృత చందన హరిద్ర కుంకుమాది విలేపనములు, బహువిధ ఫల రసాదులతో అభిషేకం నిర్వహించారు. ఏర్పాట్లను ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్ శ్రీధర్రావు పర్యవేక్షించారు.
టెన్త్ పరీక్షలకు ఐదుగురు విద్యార్థుల గైర్హాజరు
జనగామ రూరల్: జిల్లాలో శుక్రవారం నిర్వహించిన పదో తరగతి భౌతిక రసాయన శాస్త్రం పరీక్షకు ఐదుగురు విద్యార్థులు గైర్హాజరయ్యా రు. మొత్తం 6,238 మంది విద్యార్థులకు 6,233 పరీక్ష రాసినట్లు డీఈఓ రమేశ్ తెలిపా రు. రఘునాథపల్లిలోని నిడిగొండ పాఠశాల సెంటర్ను రాష్ట్ర పరీక్షల అధికారి టి.రవికుమార్తో కలిసి డీఈఓ సందర్శించారు.
దూరవిద్య పరీక్షల్లో
8 మంది డీబార్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు 11 కేంద్రాల్లో కొనసాగుతున్నాయి. శుక్రవారం నిర్వహించిన డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో జనగామ జిల్లా కేంద్రంలోని ఏబీవీ డిగ్రీ కాలేజీ పరీక్ష కేంద్రంలో కాపీయింగ్ చేస్తూ 8 మంది పట్టుబడ్డారు. వారిని డీబార్ చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ తెలిపారు.
రిజిస్ట్రేషన్ శాఖలో బదిలీలు
కాజీపేట అర్బన్: రిజిస్ట్రేషన్ శాఖలోని ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి వరంగల్ ఆర్వో, జనగా మ, భూపాలపల్లి, పరకాలలో విధులు నిర్వహిస్తున్న పలువురు జూనియర్ అసిస్టెంట్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను బదిలీ చేస్తూ జిల్లా రిజిస్ట్రార్ ఫణీందర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ ఆర్వోలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ను జనగామకు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని పరకాలకు, పరకాలలో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని వరంగల్ ఆర్వోకు, భూపాలపల్లిలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ను వరంగల్ ఆర్వోకు, జనగామలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ను భూపాలపల్లికి బదిలీ చేశారు.