Jangaon District Latest News
-
మంటలు
మార్చిలోనే..నిర్మానుష్యంగా ఫ్లై ఓవర్● 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు ● దాహంతో అల్లాడుతున్న ప్రజలు ● మధ్యాహ్నం 12 దాటితే రహదారులు నిర్మానుష్యం ● ఏప్రిల్, మే నెలల్లో రికార్డు బ్రేక్ చేసే అవకాశంజనగామ: ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతూ ఎండలు మండుతున్నాయి. వేడి గాలులతో ప్రజలు డీ హైడ్రేషన్కు గురవుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. మార్చిలోనే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని మండలాలతోపాటు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ.. పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వచ్చే వేలాది మందికి ఇవి సరిపోవడం లేదు. దీంతో దాహంతో అల్లాడిపోతూ.. వాటర్ బాటిళ్లు కొనుగోలు చేస్తున్నారు. కొబ్బరి నీళ్లు, సోడా, మజ్జిక, జ్యూస్, ఇతర పానీ యాలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముంజలు, కొబ్బరి బొండాలకు గిరాకీ పెరిగింది. ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలు పిల్లలు, వృద్ధులపై కొంత ప్రభావం చూపుతున్నా యి. బయటకు వచ్చే సమయంలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిరు వ్యాపారులు, కూలీలకు కష్టాలు రెక్కాడితే గాని పూటగడవని ఫుట్పాత్, చిరు వ్యాపారులు, కూలీలు, కార్మికులకు వేసవి కష్టాలు తప్పడం లేదు. రోజువారీ పనులకు వెళ్లేవారు ఇంటిపట్టున ఉంటే పూట గడవని పరిస్థితి నెలకొంది. దీంతో మండుటెండల్లోనూ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. నిప్పుల కొలిమి గురువారం ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల సెల్సీఎ్స్ నమో దు కావడంతో జిల్లా నిప్పుల కొలిమిని తలపించింది. ఉదయం 9 గంటలకే ఉక్కపోత మొదలైంది. ఏప్రిల్ మొదటి వారం నుంచి మరో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతా వరణ శాఖ హెచ్చరిస్తోంది. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పెరిగిన ఏసీ, కూలర్ల వినియోగం ఎండల తీవ్రతతో మధ్య తరగతి కుటుంబాల నుంచి సంపన్నుల వరకు చల్లని వాతావరణం కోసం తపించిపోతున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఏసీ, కూలర్ల వినియోగం పెరిగింది. ఇప్పటి వరకు ఫ్యాన్, కూలర్లతో సరిపెట్టుకున్న చాలా కుటుంబాలు ఉక్కపోత భరింత లేక అప్పుచేసైనా ఏసీ కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రిఫ్రిజిరేటర్లకు సైతం డిమాండ్ పెరుగుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి వేడిగాలులు, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వాతావరణంలో తేమశాతం పడిపోతున్నది. లవణాలు చెమటల రూపంలో బయటకు వెళ్తుండడంతో శరీరంలోని నీటి శాతం తగ్గుతోంది. ఈ సమయంలో బయటకు వెళ్లక పోవడమే ఉత్తమం. ఇంట్లో ఉన్నా వేడిగాలి వస్తుంది. కిటికీల వద్ద కాటన్ దుస్తులు లేదా గడ్డి ఏర్పాటు చేసుకు ని నీటిని చల్లాలి. ఇలా చేస్తే వృద్ధులు, పిల్లలకు వడదెబ్బ తగలకుండా నివారించవచ్చు. వడదెబ్బ తగిలితే నీరసం, కండరాలు, తలనొప్పి ఉంటుంది. ఈ సమయంలో మజ్జికలో ఉప్పు, చెక్కర కలుపుకుని తాగాలి. అలాగే ఓఆర్ఎస్, కొబ్బరినీళ్లు తీసుకోవచ్చు. పుచ్చ, నిమ్మరసం, సంత్రా రసం తీసుకో వాలి. మట్టికుండలోని తాగునీరు శ్రేయస్కరం. – డాక్టర్ అశోక్కుమార్, జనగామతేదీ కనిష్టం గరిష్టం 20 28 36 21 27 35 22 26 35 23 27 33 24 28 33 25 26 34 26 28 38 27 29 39 -
అలుమ్ని స్మారక గోల్డ్ మెడల్ అందజేత
కాజీపేట అర్బన్: నిట్ అలుమ్ని ఆధ్వర్యంలో గురువారం మెటలార్జికల్, మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ బీటెక్ విద్యార్థిని హర్షిత ఆర్.సజ్జన్కు గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు. నిట్ వరంగల్ మెటలార్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగం దివంగత ప్రొఫెసర్ ఏవీ.రమణారావు స్మారక గోల్డ్ మెడళ్లను అలుమ్ని ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులకు అందజేస్తున్నారు. ఈ నూతన ఒరవడికి నాంది పలికిన పూర్వ విద్యార్థులకు నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ ఆన్లైన్లో అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఏవీ.శేషగిరిరావు, రాజు దట్ల, శుక్లా మండోల్ తదితరులు పాల్గొన్నారు. -
వినియోగించుకోవాలి
పునరుత్పాదక వనరులనుజనగామ రూరల్: పునరుత్పాదక వనరులను విని యోగించుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నా రు. గురువారం ఓబుల్కేశ్వాపూర్ జెడ్పీహెచ్ఎస్లో యూత్ ఆఫ్ ఇండియా ఎన్జీవోస్ సంస్థ ఆధ్వర్యాన మైక్రోగ్రిడ్ సౌర ప్రాజెక్టును ప్రారంభించిన అనంత రం ఆయన మాట్లాడారు. యూత్ ఆఫ్ ఇండియా ఎన్జీఓస్ సంస్థ సహకారంతో సేల్స్ ఫోర్స్ సాఫ్ట్ వేర్ కంపెనీ చేయూతతో రూ.1.6కోట్ల వ్యయంతో గ్రామంలో 100 ఇళ్లకు సౌర ప్యానళ్లు, 100 సౌర వీధి దీపాలు, పాఠశాలలో పది సౌర ప్యానళ్లు అమర్చినట్లు చెప్పారు. మరిన్ని గ్రామాలను దత్తత తీసుకుని ఈ ప్రాజెక్టును కొనసాగించాలని కోరారు. అలాగే ‘పీఎం సూర్య ఘర్’ పథకం కింద గృహాల కు కనెక్షన్ తీసుకోవచ్చని, బ్యాంకు రుణ సదుపా యం, రాయితీ లభిస్తుందన్నారు. గ్రామాలు, స్కూళ్లు, పాఠశాలలు, పొలాల వద్ద కూడా ఈ సౌర ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చని, ఈ పీఎం సూర్య ఘర్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించా రు. ఈ సందర్భంగా 9వ తరగతి విద్యార్థులు రూపొందించిన సౌర శక్తి ప్రాజెక్టు నమూనాను కలెక్టర్ పరిశీలించి అభినందించారు. డీఈఓ రమేశ్, పాఠశాల హెచ్ఎం వీరాంజని, ఆయా సంస్థల సభ్యులు శైలేష్, సాయి, రాజు, చంద్రశేఖర్, సంకే త్, కిరణ్, కోమ్మురాజు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
చివరి తేదీ : 29–03–2025
Iవసంతాలకు అనాది. శుభాలకు పునాది. తెలుగు సంవత్సరాది.. ఉగాది. కోయిలమ్మ కమ్మని స్వరాల నడుమ, షడ్రుచుల మేళవింపులో కోటి ఆశలకు రెక్కలు తొడుగుతూ వచ్చే వేడుక ఇది. తెలుగుదనం ఉట్టిపడేలా.. సంప్రదాయానికి జీవం పోసేలా సాగే పర్వదినమిది. కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే వేళ కవుల భావాలకు ‘సాక్షి’ అక్షరరూపం ఇస్తోంది. మరింకెందుకాలస్యం.. కలాలు కదిలించండి.. ఉగాదిపై కవితలు రాయండి. జనగామశుక్రవారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2025 -
విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి
● సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్ జనగామ రూరల్: ప్రస్తుత సమాజంలో విద్యార్థుల కు చట్టాలపై అవగాహన ఉండాలని సీనియర్ సివి ల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. పట్టణంలోని బాలికల బాల సదనంను ఆయన గురువారం సందర్శించా రు. ఈ సందర్భంగా జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ రూపొందించిన చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ ఫర్ చిల్డ్రన్స్ స్కీం–2024(ఎల్ఎస్యూసీ) చట్టంపై పిల్లలకు అవగాహన కల్పించారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ పిల్లలకు అండగా ఉటుందని, లెటర్ ద్వారా తమ సమస్యలు తెలియజేయాలని సూచించారు. వసతులు, భోజనం, టిఫిన్, స్నాక్స్ గురించి బాలికలను అడిగి తెలుసుకున్నారు. చదువుతో పాటు ఆటల్లో రాణించాలని అన్నారు. -
ఎట్టకేలకు నీటి విడుదల
● దేవాదుల మూడో దశ మోటార్ ఆన్ చేసిన మంత్రులు ఉత్తమ్, పొంగులేటి ● ధర్మసాగర్ రిజర్వాయర్లోకి 600 క్యూసెక్కులు ● దేవన్నపేట పంప్హౌస్తో 5,22,522 ఎకరాలకు సాగు నీరు ● వరంగల్, కాజీపేట, హనుమకొండతోపాటు జనగామకు తాగునీరుహసన్పర్తి/ధర్మసాగర్: దేవాదుల ప్రాజెక్ట్ మూడవ దశలో భాగంగా దేవన్నపేట వద్ద నిర్మించిన పంస్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన మూడు మోటార్లలో ఒక మోటార్ను ఎట్టకేలకు గురువారం సాయంత్రం మంత్రులు నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలు ప్రారంభించారు. 600 క్యూసెక్కుల నీటిని ధర్మసాగర్ రిజర్వాయర్లోకి వదిలారు. అరగంటపాటు వెయిటింగ్.. వారం రోజుల క్రితం ధర్మసాగర్ చెరువులోకి నీటిని విడుదల చేయడానికి వచ్చిన మంత్రులు మోటార్లలో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా ఆన్ కాకపోవడంతో తిరిగి వెళ్లారు. రెండు రోజుల క్రితం ట్రయల్ రన్ చేస్తున్న క్రమంలో గేట్వాల్వ్లు పడిపోయాయి. ప్రత్యేక నిపుణులతో వాటికి మరమ్మతు చేయించారు. రెండోసారి గురువారం సాయంత్రం మోటార్లు ఆన్ చేయడానికి వచ్చినా... మళ్లీ సాంకేతిక సమస్య కారణంగా అరగంట పాటు వెయిట్ చేశారు. టెక్నీషియన్లు సమస్య పరిష్కరించిన తర్వాత మంత్రులు లాంఛనంగా మోటార్ ఆన్ చేశారు. పూజలు.. సన్మానాలు మొదట దేవన్నపేటకు చేరుకున్న మంత్రులకు కలెక్టర్ ప్రావీణ్య, నాయకులు పూలబొకేలు ఇచ్చి స్వాగతం పలికారు. వారు తొలుత శిలాఫలకాన్ని సందర్శించారు. అనంతరం పంప్హౌస్ వద్దకు చేరుకోగా, వారికి ఇంజనీర్లు నీటిపంపింగ్ విధానాన్ని కంప్యూటర్లో చూపించారు. నీరు ఎక్కడినుంచి ఎలా వెళ్తుందో వివరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి మూడో దశ ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ప్రారంభించారు. అక్కడినుంచి ధర్మసాగర్ రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే నీరు రిజర్వాయర్లోకి వస్తుండగా పసుపు, కుంకుమ, పూలు చల్లి పూజలు చేశారు. నీటిలోకి సారె వదిలారు. ఈ సందర్భంగా మంత్రులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి శాలువాలు కప్పి సన్మానించారు. అక్కడే మంత్రులు రెండు నిమిషాలు మాట్లాడి హైదరాబాద్కు వెళ్లిపోయారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, యశస్వినిరెడ్డి, మేయర్ గుండు సుధారాణి, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, నగర కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్ నర్సింహారెడ్డి, ఈఎన్సీ అనిల్కుమార్, సీఈ అశోక్కుమార్, ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈ సీతారాంనాయక్, డీఈఈ రాజు, ఏఈ శ్రీనివాస్తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.. రెండు భాగాలుగా నీటి పంపిణీ : మంత్రి ఉత్తమ్ దేవాదుల పంప్హౌస్నుంచి వచ్చే నీటిని రెండు భాగాలుగా పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ధర్మసాగర్ రిజర్వాయర్ కేంద్రంగా ప్రారంభించిన దేవన్నపేట పంప్హౌస్తో 5,22,522 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందన్నారు. స్టేషన్ఘన్పూర్, వరంగల్ వెస్ట్, వర్ధన్నపేట, పరకా ల నియోజకవర్గాల పరిధిలోని 17,545 ఎకరాలకు ఉత్తర భాగం ప్రధాన కాలువ ద్వారా, అదే విధంగా దక్షిణభాగం కాలువ గుండా స్టేషన్ఘన్పూర్, వరంగల్ వెస్ట్, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల పరిధిలోని 1,58,948 ఎకరాలతోపాటు ధర్మసాగర్ తరువాత బొమ్మకూర్, తపాస్పల్లి, గండిరామారం, అశ్వారావుపల్లి పరిధిలోని 3,46,029 ఎకరాలకు నీరు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. అదే సమయంలో వరంగల్, హనుమకొండ, కాజీపేట మూడునగరాలతోపాటు జనగామ పట్టణానికి తాగునీరు అందించేందుకు దోహదపడుతుందని వివరించారు. -
ఎల్ఆర్ఎస్ రాయితీకి మిగిలింది 4 రోజులే..
జనగామ: ఎల్ఆర్ఎస్ ఫీజులో 25 శాతం రాయితీకి ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉంది. ఎల్ఆర్ఎస్కు సంబంధించి గ్రామ పంచా యతీ పరిధిలో 35,615 దరఖాస్తులు రాగా, 3,713 మంది ఫీజు చెల్లించారు. ‘జనగామ, స్టేషన్ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలో 22,553 దరఖాస్తులు రాగా 1,013 మంది ఎల్ఆర్ఎస్ డబ్బులు చెల్లించగా పలువురికి ప్రొసీ డింగ్ కాపీలు ఇచ్చాం. మిగతా వారికి త్వ్రలో ఇస్తాం’. అని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. జనగామ బార్ అసోసియేషన్ కమిటీ ఎన్నికజనగామ రూరల్: జనగామ బార్ అసోసియేషన్ పూర్తి కమిటీకి గురువారం ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షుడిగా దండెబోయిన హరిప్రసాద్యాదవ్తో పాటు పలు పదవులు ఏకగ్రీ వం అయిన విషయం విధితమే. ప్రధాన కార్యదర్శి పదవికి పాలకుర్తి రామకృష్ణ, మన్నె సత్తయ్య పోటీపడగా.. రామకృష్ణ 28 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కార్యవర్గ సభ్యులు గా బి.చరణ్, ఎన్.శ్రీమాన్, ఇ.జోష్ణ, రవికుమార్, కె.దాసు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి శ్రీరామ్ శ్రీనివాస్, అసిస్టెంట్ ఎన్నికల అధికారులు దొమ్మాటి సురేష్, జి.రాజశేఖర్యాదవ్ తెలిపారు. ఘన్పూర్ బార్ అసోసియేషన్ కమిటీ ఏకగ్రీవంస్టేషన్ఘన్పూర్: స్టేషన్ఘన్పూర్ బార్ అసోసియేషన్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ మేరకు గురువారం స్థానిక కోర్టులో ఎన్నికల అధికారి, చీఫ్ టెల్లర్ పసునూటి రమేశ్ ఆధ్వర్యాన ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కనకం రమే శ్, ఉపాధ్యక్షుడిగా మునిగాల రవీందర్, ప్రధా న కార్యదర్శిగా ఎస్కే.షన్మకుమారి, మహిళా జాయింట్ సెక్రటరీగా పార్వతి శ్రీలత, లైబ్రరీ సెక్రటరీగా అమరోజు శ్రీనివాస్, కోశాధికారిగా టీఆర్.సాల్మన్రాజ్, కార్యవర్గ సభ్యులుగా గుర్రపు బాబు, మారపాక లక్ష్మణ్, తాడూరి వనిత, సిద్దం శ్వేత ఎన్నికయ్యారు. అనంతరం అధ్యక్షుడిని పలువురు సత్కరించారు. మోర్ సూపర్ మార్కెట్కు రూ.10వేల జరిమానాజనగామ: జిల్లా కేంద్రం సిద్దిపేటరోడ్డులోని మోర్ సూపర్ మార్కెట్కు రూ.10వేల జరిమానా విధించినట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఫుడ్ సేఫ్టీ అధికారి కృష్ణమూర్తి తెలిపా రు. ట్రాన్స్పోర్టు ఆఫీసర్ పులి శేఖర్తో కలిసి వారు గురువారం మార్టులో మూడు గంటల పాటు సోదా చేశారు. కాలపరిమితి పూర్తయిన సరుకులను ఇప్పటికే రెండు సార్లు విక్రయించి పట్టుబడిన మార్టులో ఇంకా ఏమైనా ఉన్నాయా అనే విషయమై తనిఖీ చేశారు. మరోసారి పట్టుబడితో సూపర్ మార్కెట్ను శాశ్వతంగా మూసి వేయిస్తామన్నారు. మేనేజర్తో అధికారులు లిఖిత పూర్వకంగా లెటర్ తీసుకున్నారు. రేపు ఒడిబాల బియ్యం వేలం హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో భక్తులు అమ్మవారికి సమర్పించిన 20 క్వింటాళ్ల ఒడిబాల బియ్యాన్ని ఈనెల 29న శనివా రం ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు ఈఓ శేషుభారతి ఒక ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనాలనుకునే వారు రూ.5 వేలు దరావత్ సొమ్ము డీడీ రూపంలో చెల్లించి పాల్గొనాలని పేర్కొన్నా రు. పూర్తి వివరాల కోసం దేవస్థాన కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. -
ఐలమ్మ డాక్యుమెంటరీ చిత్రీకరణ ప్రారంభం
పాలకుర్తిటౌన్: తెలంగాణ సాయుధ పోరాట యో ధురాలు చాకలి ఐలమ్మ డాక్యుమెంటరీని బుధవా రం స్థానిక ఐలమ్మ విగ్రహం వద్ద చిత్రీకరించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ.. వచ్చే నెల 2న హైదరాబాద్ ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ఆవరణంలో ఐలమ్మ కాంస్య విగ్రహం ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఐలమ్మ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చేలా ప్రభుత్వం ఆలోచించాలని, ట్యాంక్ బండ్పై విగ్రహం ఏర్పాటు చేయడంతోపాటు జనగామ జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలని అన్నారు. కార్యక్రమంలో డాక్యుమెంటరీ నిర్మాత డాక్టర్ రవి కాంత్, దర్శకురాలు డాక్టర్ సంధ్య, ఐలమ్మ కుటుంబ సభ్యులు చిట్యాల సంపత్, శ్వేత, యాకయ్య, మంజుల, సోమనాథ కళాపీఠం అధ్యక్షుడు డాక్టర్ రాపోలు సత్యనారాయణ, మార్గం లక్ష్మీనారాయణ, గుమ్మడిరాజు సాంబయ్య, పుస్కూరి శ్రీనివాస్ రావు, మాచర్ల సారయ్య పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ప్రాంగణంలో మంటలు
● నర్సరీ దగ్ధం.. కాలిపోయిన బోరుమోటారు ● తృటిలో తప్పిన పెను ప్రమాదంజనగామ: జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రాంగణం హెలీప్యాడ్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సెక్యూరిటీ గార్డు గమనించి అధికారులను అప్రమత్తం చేశారు. అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ ఆదేశాల మేరకు కలెక్టరేట్ ఎస్టేట్ ఆఫీసర్ డి.మౌనిక, అదనపు కలెక్టర్ సహాయకులు సత్యపాల్, సూపర్వైజర్ రాజశేఖర్ అగ్ని మాపక శాఖకు సమాచారం ఇచ్చారు. అప్పటికే సీఐ దామోదర్రెడ్డి అక్కడికి చేరుకున్నా రు. హెలీప్యాడ్ ప్రాంతం నుంచి మంటలు వ్యాపించి అటవీశాఖ నర్సరీని చుట్టేసాయి. దీంతో మొక్కలు, డ్రిప్ పరికరాలు, పైపులు, బోరు, కరెంటు వైర్లు కాలిపోయాయి. మంటలు 33/11కేవీ సబ్స్టేషన్ వైపు దూసుకు వచ్చాయి. డీఎఫ్ఓ రేమండ్బాబు పర్యవేక్షణలో ఎల్ఎఫ్ వి.సుధాకర్, ఫైర్మెన్లు కరుణాకర్, రాజశేఖర్రెడ్డి, డ్రైవర్ ఆపరేటర్ ఎస్కే.రఫీ చేరుకుని గంట పాటు కష్టపడి మంటలను అదుపులోకి తేవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మందు బాబులకు అడ్డాగా మారిన హెలీప్యాడ్ ఏరియాలో ఎవరైనా సిగరేట్ అంటించే క్రమంలో నిప్పు రవ్వ పడి మంటలు చెలరేగవచ్చని భావిస్తున్నారు. -
సాధారణ ప్రసవాలు పెంచాలి
● జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్రావు పాలకుర్తి టౌన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచి మాతా శిశు మరణాలు తగ్గించేలా వైద్య సిబ్బంది పనిచేయాలని జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్రావు అన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత శ్రేణి ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం మా ట్లాడుతూ వేసవిలో ఎండ దెబ్బకు గురికాకుండా ప్రతీ సెంటర్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవా లన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో భాగంగా ప్రజలందరికీ వైద్య సేవలు అందేలా పనిచేయాలని చెప్పారు. ఆర్యోగ సిబ్బంది ఇచ్చిన వ్యక్తిగత టార్గెట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. డాక్టర్ సిద్ధార్థ్ధరెడ్డి, సంధ్య, ఉష, ప్రభాకర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఐదుగురు విద్యార్థుల గైర్హాజరుజనగామ రూరల్: జిల్లాలో బుధవారం నిర్వమించిన పదో తరగతి గణితం పరీక్షకు ఐదుగురు విద్యార్థులు గైర్హాజర్ అయ్యారని డీఈఓ రమేశ్ తెలిపారు. మొత్తం 6,238 మంది విద్యార్థులకు 6,233 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. జఫర్గఢ్, పాలకుర్తి సెంటర్లను రాష్ట్ర పరిశీలకులు ఎస్.శ్రీనివాసాచారి, జనగా మలో పరీక్షల విభాగం అధికారి టి.రవికుమా ర్ పరిశీలించారు. అంగడి వేలం రూ.8లక్షలుబచ్చన్నపేట: మండలకేంద్రంలో ఆదివారం నిర్వహించే వారాంతపు సంత వేలం పాట పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక అధికా రి, డీఏఓ రామారావు, ఎంపీడీఓ వెంకట మల్లికార్జున్ ఆధ్వర్యాన కార్యదర్శి నర్సింహా చారి బుధవారం నిర్వహించారు. వేలంలో 20 మంది పాల్గొనగా పశువుల సంతను మంచా ల వినయ్ రూ.5.18 లక్షలకు, తైబజార్ను దేవిని నాగేష్ రూ.2.55 లక్షలకు, డెక్కను (నాడెలు) మంచాల వివేక్ రూ.27వేలకు దక్కించుకున్నట్లు అధికారులు తెలిపారు. పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్ పాల్గొన్నారు. యునిక్ ఐడీ క్యాంపుజనగామ రూరల్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ప్రభుత్వ ఆస్పత్రి ఆధ్వర్యాన బుధవారం దివ్యాంగులకు సదరం క్యాంపునకు బదులు యునిక్ ఐడీ క్యాంపు నిర్వహించారు. దివ్యాంగులతోపాటు దృష్టిలోపం ఉన్నవారు హాజరయ్యారని, నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించి డిజబులిటీ కార్డులు అందజేస్తామని అసుపత్రి సూపరెంటెండెంట్ గోపాల్రావు తెలిపారు. కార్యక్రమంలో డాక్లర్లు ప్రొఫెసర్ పద్మ, ఈవీ రాజు, డాక్టర్ సృజన్కుమార్, డీపీఎం వినీత, ఏపీఎం సురేందర్, రమేశ్, భవానీ తదితరులు పాల్గొన్నారు. రూ.4.89 లక్షల విలువైన గుట్కాల పట్టివేతజనగామ: జిల్లా కేంద్రం కురుమవాడలో గుట్కాలు అక్రమంగా నిల్వ చేశారనే విశ్వసనీ య సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ ఆధ్వర్యాన బుధవారం దాడులు చేపట్టారు. రూ.4,89,650 విలువైన గుట్కాలను పట్టుకుని విక్రయిస్తున్న రాజస్థా న్కు చెందిన వ్యాపారి మల్రామ్ను అదుపులోకి తీసుకున్నారు. పట్టణానికి చెందిన మరో వ్యాపారి గామ్నారాం పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. గుట్కాలను జనగామ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేటినుంచి మూల్యాంకనం విద్యారణ్యపురి: ఈనెల 28 నుంచి నిర్వహించాల్సిన ఇంటర్ బాటనీ, జువాలజీ జవాబుపత్రాల మూల్యాంకనాన్ని గురువారం(నేడు) నుంచి చేపడుతున్నట్లు స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ ఆఫీసర్, డీఐఈఓ గోపాల్ ఒక ప్రకట నలో తెలిపారు. అన్ని కాలేజీ యాజమాన్యాల అధ్యాపకులను రిలీవ్ చేసి మూల్యాంకనానికి విధిగా పంపాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. -
ఓరుగల్లే ఫైనల్..!
డ్రోన్ల ద్వారా సభావేదిక మ్యాపింగ్.. ఎల్కతుర్తి మండల కేంద్రంలో అనువైన ప్రదేశాన్ని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్కుమార్, దాస్యం వినయ్భాస్కర్, పెద్ది సుదర్శన్రెడ్డిలు బుధవారం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ముల్కనూర్ రోడ్డు, చింతలపల్లి రోడ్డు సమీపంలో గల అనువైన ప్రదేశాన్ని చూసి అనువుగా భావించిన వారు.. డ్రోన్ కెమెరా ద్వారా ఆ ప్రాంతాన్ని మ్యాపింగ్ చేయించారు. ఈ భూమికి సంబంధించిన రైతులతో మాట్లాడగా వారు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా ఎల్కతుర్తికి వచ్చే దారులవెంట కిలోమీటర్ దూరంలో గల ప్రదేశాలను వాహనాల పార్కింగ్ కోసం చూశారు. వారి వెంట పార్టీ మండల అధ్యక్షుడు పిట్టల మహేందర్, మాజీ వైస్ఎంపీపీ తంగెడ నగేష్, మాజీ ఎంపీటీసీ కడారి రాజు, శేషగిరి, రవిందర్, చిట్టిగౌడ్ ఉన్నారు.ఇక్కడే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కేసీఆర్ సై ● తాజాగా ఎల్కతుర్తిలో స్థల పరిశీలన చేసిన నేతలు ● డ్రోన్ కెమెరాలతో సభాస్థలి, పార్కింగ్ స్థలాల మ్యాపింగ్ ● కేసీఆర్ దృష్టికి మ్యాప్లతో సహా అన్ని వివరాలు.. ● వేదిక దేవన్నపేటా? ఎల్కతుర్తా?.. నేడో, రేపో తేల్చనున్న అధినేతసాక్షిప్రతినిధి, వరంగల్/ఎల్కతుర్తి : బీఆర్ఎస్ ఉద్యమాలకు సెంటిమెంట్గా భావించే ఓరుగల్లులోనే ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రజతోత్సవ భారీ సభను నిర్వహించాలన్న తుది నిర్ణయానికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ వచ్చారు. ఆయన ఆదేశాల మేరకు బుధవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నాయకులు స్థల పరిశీలన చేశారు. మొదట గ్రేటర్ వరంగల్ పరిధిలోని హంటర్రోడ్డు, లేదా ఉనికిచర్లలో నిర్వహించాలని ఈ నెల 10న మాజీ మంత్రి, సభ ఇన్చార్జ్ టి.హరీశ్రావు స్థల పరిశీలన చేశారు. ఆ తర్వాత హసన్పర్తి మండలం దేవన్నపేట అయితే ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ఉంటుందని భావించి అక్కడ కూడా పర్యటించారు. ఇదే సమయంలో ఈసారి సభను వరంగల్ కాకుండా హైదరాబాద్ శివారులో పెట్టాలన్న చర్చ పార్టీలో జరిగినట్లు ప్రచారం జరిగింది. వేసవి ఎండలు తీవ్రమయ్యే సమయంలో వరంగల్ కంటే హైదరాబాద్ శివారు ప్రాంతమైతే బాగుంటుందని భావించినట్లు సమాచారం. ఘటకేసర్లో సభావేదికను ఎంచుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. తాజాగా కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, వొడితెల సతీష్కుమార్, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు హస్నాబాద్ నియోజకవర్గ పరిధి ఎల్కతుర్తిలో స్థల పరిశీలన చేశారు. ఎల్కతుర్తి మండల కేంద్రంతోపాటు గోపాల్పూర్, మడిపల్లి, చింతలపల్లి శివార్లు.. ఎల్కతుర్తి – భీమదేవరపల్లి మధ్యన కుడి, ఎడమల స్థలాలను కూడా పరిశీలించారు. ఈ మేరకు రైతులనుంచి అంగీకారపత్రాలు కూడా తీసుకున్నారు. ఎల్కతుర్తి సభాస్థలిపై కేసీఆర్కు నివేదిక.. నేడో, రేపో నిర్ణయం.. సభావేదిక వివరాలను గురువారం పార్టీ అధినేత కేసీఆర్కు అందజేయనున్నట్లు బీఆర్ఎస్ నాయకులు చెప్పారు. సుమారు 15లక్షల మంది వరకు హాజరయ్యే రజతోత్సవ సభ కోసం భారీ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇదే విషయమై ఎల్కతుర్తి మండలంలో నిర్వహించేందుకు పరిశీలించిన రెండు, మూడు స్థలాల వివరాలు, మ్యాప్లను పార్టీ అధినేత కేసీఆర్ సమర్పించినట్లు ఆ పార్టీ నేతలు చెప్పారు. కేసీఆర్తో చర్చించి ఆయన నిర్ణయం మేరకు సభావేదికపై స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్కుమార్ తెలిపారు. ఇదిలా ఉండగా.. రజతోత్సవ సభపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్.. నేడో, రేపో ఉమ్మడి వరంగల్ నేతలతో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. -
సీటీ స్కాన్ వచ్చేసింది
నెల రోజుల్లో సేవలు ప్రారంభం జిల్లా ఆస్పత్రికి చేరిన యంత్రం జనగామ: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(డీహెచ్)కి బుధవారం సీటీ స్కాన్ యంత్రం చేరుకుంది. సీటీ స్కాన్ సేవలు లేక పేద ప్రజలు వైద్య పరంగా ఇబ్బందులు పడుతున్న తీరుపై ‘పేరుకే పెద్దాస్పత్రి–ఎనిమిదేళ్లుగా మూలన పడిన సేవలు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలకు ప్రభుత్వం స్పందించింది. ఆరోగ్య, వైద్య, కుటుంబ సక్షేమ, సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశంతో.. సీటీ స్కాన్ కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్(డీఎంఈ) డాక్టర్ వాణి గత ఏడాది జూన్లోనే ప్రాసెస్ ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న డీఎంఈ.. సదరు కంపెనీకి ముందస్తు డబ్బులు చెల్లించా రు. ఈ విషయమై మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్రావుకు సమాచారం ఇవ్వగా స్కానింగ్ యంత్రం ఏర్పాటు, విద్యుత్ సరఫరా సామర్థ్యం పెంపు తదితర ఏర్పాట్లు చేశారు. నెలరోజుల్లో సేవలు ప్రారంభం.. సీటీ స్కాన్ సేవలు నెలరోజుల వ్యవధిలో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం మూలన పడిన యంత్రాన్ని రూం నుంచి తొలగించిన తర్వాత నూతన యంత్రాన్ని బిగించనున్నారు. అనంతరం టెక్నీషియన్లు ఇన్స్టాలేషన్ చేస్తారు. ఎనిమిదేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత జిల్లా ఆస్పత్రిలో సీటీ స్కానింగ్ సేవలు ప్రారంభం కాబోతున్నాయి. ‘సాక్షి’ కథనాలను అమ్మ ఫౌండేషన్ ప్రతినిధులు మంతెన మణి, వంగభీమ్రాజ్, జేఏసీ, ఇతర పార్టీల నాయకులు సీఎంఓ, మంత్రులకు ఎప్పటికప్పడు ట్విట్టర్ వేదికగా పోస్టు చేస్తూ తమవంతు సహకారం అందించారు. ఈ సందర్భంగా ప్రజలు ‘సాక్షి’ చొరవకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
మోరీ తీయరు.. చెత్త ఎత్తరు
జనగామ: ‘రోడ్లు శుభ్రం చేయడం లేదు.. డ్రెయినేజీలు చెత్తతో నిండిపోయాయి.. వీధిలైట్లు వెలగడం లేదు.. మిషన్ భగీరథ పైపులైన్ కోసం నాలుగేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవడం లేదు.. కోతులు, కుక్కల బెడదతో ఇబ్బంది పడుతున్నం’.. ఇలా అనేక సమస్యలను జనగామ పట్టణ ప్రజలు ఏకరువు పెట్టారు. ‘సాక్షి’ ఆధ్వర్యాన బుధవారం నిర్వహించిన ఫోన్ఇన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు గంటన్నర పాటు 70 మందికి జవాబివ్వగా.. మరో 153 మిస్డ్కాల్స్ ఉన్నాయి. సమస్యలు ఇలా.. సమస్య: బాలాజీనగర్ న్యూ వెంచర్ నిర్మాణంలో డ్రెయినేజీ లేదు. కనీస సదుపాయాలు లేవు. – యాదగిరి, దివ్యాంగుడు, బాలాజీనగర్ కమిషనర్ : నిధుల రాబడి ఆధారంగా అభివృద్ధి పనులు చేపడుతునాం. సమస్య: రుద్రమదేవి ఆఫీస్ పక్కన బావిలో చెత్త డంపు చేస్తున్నారు. సెయింట్ పాల్స్ స్కూల్ నుంచి తెచ్చిన చెత్త ఇక్కడే వేస్తున్నారు. – పన్నీరు రవీందర్, మోహిన్బాయ్, రిటైర్డ్ టీచర్, అన్నెబోయిన సత్యం, బీరప్పగడ్డ కమిషనర్ : సమస్య పరిష్కరిస్తాం. సమస్య: చలి వేంద్రాలు, మూగ జీవాల దాహార్తి తీర్చేందుకు కుళాయిలు పెట్టాలి. ఫ్లైఓవర్పై పూల కుండీలను తొలగించాలి. – మంతెన మణి, వంగ భీమ్రాజ్ అమ్మ ఫౌండేషన్ కమిషనర్ : ఆలోచిస్తాం. సమస్య: వీధిలైట్లు లేక రాత్రి కాలనీలోకి వెళ్లాలంటే భయమేస్తోంది. మహిళలు ఇబ్బంది పడుతున్నారు. – సాంబారి నాగార్జున, బాలాజీనగర్ కమిషనర్ : త్వరలోనే వేయిస్తాం. సమస్య: సిద్ధిపేటరోడ్డుపై పండ్ల వ్యాపారాలతో వాహన పార్కింగ్ లేకుండా చేస్తున్నారు. ట్యాక్స్ చెల్లిస్తూ.. షాపులు రెంట్కు ఇస్తే వాహనాలు నిలిపే పరిస్థితి లేదు. పోలీసులు నో పార్కింగ్తో చలాన్ వేస్తున్నారు. పండ్ల వ్యాపారం తొలగించాలి. – అల్లాడి ప్రభాకర్, నెహ్రూపార్కు కమిషనర్ : ఫుట్పాత్ వ్యాపారాన్ని తొలగిస్తాం. సమస్య: గల్లీలో 25 ఫీట్ల రోడ్డు ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. రాకపోలకు ఇబ్బందులు తప్పడం లేదు. – వాణి, బాలాజీనగర్, ఎల్లమ్మటెంపుల్ కమిషనర్ : విచారణ చేపడతాం. సమస్య: సీసీరోడ్డు లేదు. కనీసం డ్రెయినేజీ పనుల న్నా చేపట్టి మురికి బాధ తొలగించాలి. – ఎం.కనకలక్ష్మి, బీరప్పగడ్డ కమిషనర్ : డ్రెయినేజీ నిర్మాణానికి పరిశీలిస్తాం. సమస్య: మంగళ, ఆదివారం రోజుల్లో ఎల్లమ్మ టెంపుల్ వద్ద జాతర జరుగుతుంది. వాహనదారులు ప్రధాన రహదారిపై పార్కింగ్ చేస్తున్నారు. స్కూల్ బస్సు కాలనీకి వచ్చే పరిస్థితి లేదు. విస్తరాకులు రోడ్డుపైనే వేస్తున్నారు. – సుల్తాన్ శ్రీనివాస్రెడ్డి, ప్రభాకర్, వేణుగోపాల్రెడ్డి, రేణుకానగర్ ఎల్లమ్మగుడి, యశ్వంతాపూర్ కమిషనర్ : వచ్చి పరిశీలిస్తాం. పార్కింగ్ సమస్య పోలీసులకు చెప్పండి సమస్య: నెహ్రూపార్కు జంక్షన్ వద్ద రౌండ్ సర్కిల్ నిర్మించాలి. స్కూళ్లు, కాలేజీలు ఉండడంతో విద్యార్థులకు ఇబ్బందిగా ఉంది. డివైడర్, జంక్షన్, సెంట్ర ల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి. – ఎండీ.రియాజ్, 25వ వార్డు కమిషనర్ : పైఅధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. సమస్య: ట్యాక్స్లు చెల్లిస్తున్నాం. అయినా పారిశుద్ధ్య పనుల నిర్వహణ సక్రమంగా లేదు. చెత్త కుండీలు ఏర్పాటు చేయలేదు. – కె.వెంకటేశ్వర్రావు, గ్రేయిన్ మార్కెట్ ఏరియా కమిషనర్:ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. సమస్య: వడ్లకొండ బైపాస్లోని కాలనీ పట్టణంలో విలీనమై ఎనిమిదేళ్లు గడిచింది. మిషన్ భగీరథ వాటర్ పైపులైన్కు దరఖాస్తు చేసి నాలుగేళ్లు అవుతోంది. ప్రస్తుతం బోర్లు వట్టిపోయి వాటర్ సమస్య ఉంది. – అశోక్కుమార్, వడ్లకొండ బైపాస్రోడ్డు, 8వ వార్డు కమిషనర్ : పైపులైన్ ఏర్పాటు, వాటర్ సమస్య పరిష్కరిస్తాం. సమస్య: మాది కొత్తగా ఏర్పడిన కాలనీ. సీసీరోడ్లు, డ్రెయినేజీ నిర్మించలేదు. కనీసం వీధి దీపాలు ఏర్పాటు చేయడం లేదు. – రవిప్రసాద్, వికాస్నగర్కాలనీ. కమిషనర్ : కాలనీకి వచ్చి పరిశీలిస్తాం. సమస్య: నైన్డైన్ హోటల్ సమీపంలో డ్రెయినేజీ ఒక్కరోజు క్లీన్ చేస్తే.. వారం వరకు రావడంలేదు. ఈ దారిలో గుంతలు ఏర్పాడ్డాయి. – కాసుల శ్రీనివాస్, శ్రీనగర్కాలనీ కమిషనర్ : ఇబ్బంది లేకుండా చేస్తాం. సమస్య: మోడల్ మార్కెట్ పనులు సత్వరమే పూర్తి చేయాలి. దేవీ థియేటర్ నుంచి యశ్వంతాపూర్ వరకు నిర్మిస్తున్న అండర్ డ్రెయినేజీ పనులు మధ్యలో ఆపేశారు. – ఎండీ.రఫీక్, 26వ వార్డు, గణేష్ స్ట్రీట్ కమిషనర్ : ప్రభుత్వం నుంచి నిధులు రాగానే మోడల్ మార్కెట్ పనులు పూర్తి చేస్తాం. సమస్య: కాలనీరోడ్లపై పరుపులు, చెత్త వేసి తగుల బెడుతున్నారు. పెద్దమోరీ వెనుక లైన్లో డ్రెయినేజీ నీరు ప్లాట్లలో నిలుస్తున్నది. – శ్రీహరి, భాస్కర్, కాకతీయకాలనీ, 17వ వార్డు, దండ్యాల వరలక్ష్మి, వెంకన్నకుంట కమిషనర్ : చర్యలు తీసుకుంటాం సమస్య: వార్డులో రోడ్డుకు అడ్డంగా నిర్మించిన గోడ తొలగించి రాకపోలకు ఇబ్బంది లేకుండా చూడాలి. – కృష్ణ, వెంకన్నకుంట కమిషనర్ : విచారణ చేపడతాం. సమస్య: కుక్కలకు రేబిస్ వ్యాధి వచ్చినట్టు ఉంది. శరీరమంతా గాయాలు, రక్తంతో వార్డులో తిరుగుతున్నాయి. భయంగా ఉంది. – ఉదయ్కిరణ్, 9వ వార్డు కమిషనర్ : సమస్య పరిష్కరిస్తాం. సమస్య: సిద్దిపేట ప్రధాన రహదారి సూపర్ మార్కెట్ వద్ద తెల్లవారుజామున చెత్త డంపు చేస్తున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. – అబ్బాస్, 21వ వార్డు కమిషనర్ : చెత్త వేయకుండా చర్య తీసుకుంటాం. సమస్య: కోనోకార్పస్ మొక్కలను తొలగించాలి. కలెక్టరేట్ వద్ద నిరసన, ధర్నాల సమయంలో మజ్జిక ప్యాకెట్లు, పూలదండలు అక్కడే పడేస్తున్నరు. – శ్రీనివాసరావు, దుర్గాకాలనీనగర్ కమిషనర్ : పైఅధికారులకు చెబుతాం. సమస్య: మూడు రోజుల క్రితం హైదరాబాద్కు బయలుదేరే సమయంలో కోతుల గుంపు వెంబ డించింది. తప్పించుకున్నాను. బయటకుళ్లి పని చేయలేని పరిస్థితి. కోతుల నుంచి కాపాడండి. – గణేష్బాబు అంబేడ్కర్నగర్, కందుకూరి శ్రీనివాస్ లక్ష్మీబాయ్కుంట, రేవతి, మేకల సమ్మయ్య అంబేడ్కర్నగర్, చెరుకు శ్రీనివాస్రెడ్డి ధర్మకంచ ఏరియా కమిషనర్ : కోతుల గురించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇస్తాం. కంపుకొడుతున్న కాలనీలు.. కోతులు, కుక్కల స్వైర విహారం వెలగని వీధిదీపాలు.. సీసీరోడ్లకు నోచుకోని కాలనీలు ‘సాక్షి’ ఫోన్ ఇన్లో సమస్యలు ఏకరువు పెట్టిన పట్టణ ప్రజలు 70 కాల్స్కు సమాధానం ఇచ్చిన కమిషనర్ వెంకటేశ్వర్లుసమస్య: రోడ్లపై చెత్త, మురికి కాల్వలు నెలల తరబడి తీయడం లేదు. వీధి లైట్లు ఆర్నెళ్ల నుంచి వెలగ డం లేదు. మసీదు ఎదురుగా 15 రోజులకోసారి కూడా డ్రెయినేజీ క్లీన్ చేయడం లేదు. కోతులు, కుక్కల బెడద అధికంగా ఉంది. సీసీరోడ్ల నిర్మాణం అడ్డదిడ్డంగా చేపట్టడంతో ఇళ్ల ఎదుట నీరు ఆగుతోంది. రైల్వే అండర్ పాస్ కింద మురికి నీరు నిలుస్తున్నది. – సముద్రాల సందీప్ బాణాపురం, సీవీఎల్ఎన్.రెడ్డి బాలాజీనగర్, మారోజు నాగరాజు, జబ్బార్ అంబేడ్కర్నగర్, జమాల్ షరీఫ్, అడ్వకేట్ శోభారాణి, బాలాజీనగర్ ఎల్లమ్మగుడి, శ్రవన్బాబు దేవి థియేటర్ వెనకాల, ఎంఏ.అలీ, రిటైర్డ్ హెచ్ఎం కాకతీయకాలనీ, అజ్మీరా వంశీ, అనిల్ దుర్గానగర్కాలనీ, బొల్లం ఉదయ్కుమార్, బిర్రు రామలింగం, వీవర్స్కాలనీ, బండోజు ఆంజ నేయులు బాలాజీనగర్.కమిషనర్ : శానిటేసన్ నిర్వహణ బాగుపడేలా చర్యలు చేపడతాం. -
మత సామరస్యానికి ప్రతీక రంజాన్
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్: మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ నిలుస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని స్థానిక ఈఆర్ఎల్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్లో కలెక్టర్ రిజ్వాన్బాషాతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి నమాజ్ నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ము స్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే గొ ప్ప పండుగ రంజాన్ అన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి న ముస్లింలను ప్రోత్సహించేలా ప్రభుత్వం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి నా ణ్యమైన విద్యను అందిస్తుందన్నారు. అనంతరం ముస్లింలు, ఇఫ్తార్ కమిటీ బాధ్యులు ఎమ్మెల్యేను, క లెక్టర్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ డీఎస్ వెంకన్న, ఏసీపీ భీమ్శర్మ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్య, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు జూ లుకుంట్ల శిరీష్రెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ.యాకుభ్పాషా, మత పెద్దలు మహమూద్అలీ, షేక్ జానీ, కలీమ్, ఎండీ.రహ్మతుల్లా, ఖదీర్కురేషి, ఫయాజ్, యూనస్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి
రఘునాథపల్లి: ఉపాధి పనుల్లో కూలీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, కొలతల ప్రకారం పనులు చేసి గిట్టుబాటు కూలి పొందాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా సూచించారు. మంగళవారం రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి శివారులో ఈజీఎస్ పథకంలో భాగంగా చేపట్టిన ఆర్సీబీ రోడ్డు పనులను కలెక్టర్ పరిశీలించారు. జాబ్కార్డులు, మస్టర్ రోల్, రిజిస్టర్లను ఎంత మంది కూలీలు పనిచేస్తున్నారు? వారి పనివేళలు ఎప్పటి వరకు? రోజుకు ఎంత మేర కొలతతో పనులు చేస్తున్నారని ఆరా తీశారు. 143 మంది కూలీలు పనులకు వచ్చారని, ఉదయం 7 నుంచి 11 గంటల వరకు పని చేస్తున్నారని, ప్రతీ కూలీ రోజు మీటరు లోతుగా రెండు మీటర్ల వెడల్పుతో పనులు చేస్తున్నారని అధికారులు కలెక్టర్కు వివరించారు. కూలీలు ఓఆర్ఎస్ నీటిని క్రమం తప్పకుండా తాగాలని కలెక్టర్ సూచించారు. అధికారులు పనులను పరిశీలిస్తూ కొలతల పుస్తకం, జాబ్కార్డులు, మస్టర్ రోల్ను పర్యవేక్షించి, అన్ని రిజిస్టర్లను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేలా, పనుల పురోగతికి సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కూలీలకు కలెక్టర్ ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. ఆయన వెంట డీఆర్డీఓ వసంత, ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు, ఏపీఓ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి త్రివేణి, టెక్నికల్ అసిస్టెంట్ విజయలక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్ కుంట రవి, కూలీలు ఉన్నారు. రాయితీ సద్వినియోగం చేసుకోవాలి జనగామ: రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకంలో అందిస్తున్న 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. మంగళవారం జనగామ పురపాలిక పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను కలెక్టర్ పర్యవేక్షించారు. ఎల్ఆర్ఎస్ ప్లాట్ల క్రమబద్ధీకరణ ఆన్లైన్ విధానం పరిశీలించి, పలు సూచనలు అందించారు. ఎల్ఆర్ఎస్ పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరు వందశాతం ఫీజు చెల్లించి, ప్లాట్ల ను క్రమబద్ధీకరించు కోవాలన్నారు. అనంతరం 3వ వార్డులో ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ కింద ప్లాట్ ఫీజు చెల్లించిన దరఖాస్తుదారుడికి ప్రొసిడింగ్ కాపీని అందించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, అధికారులు తదితరులు ఉన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
జనగామ: దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవడంతో పాటు ప్రజాస్వామ్య పాలనకు సంఘటితం కా వాలని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి పిలు పునిచ్చారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ పిలుపు మేరకు పట్టణంలోని గాయత్రి గార్డెన్లో మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొ మ్మూరి, కార్యక్రమ ఇన్చార్జ్ ఉమ్మడి జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ లకావత్ ధన్వంతి, జ్ఞానేశ్వర్లు ముఖ్యఅతిథుగా పాల్గొన్నారు. అనంతరం కొమ్మూరి మాట్లాడుతూ రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాల్సిన కేంద్రం నాశనం చేసే విధంగా నడుచుకుంటున్నారని ఆరోపించారు. అంతకు ముందు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు లక్ష్మి నా రాయణనాయక్, జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, నాయకులు డాక్టర్ రాజమౌళి, నరసింహరెడ్డి పాల్గొన్నారు. సంవిధాన్ సన్నాహక సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి -
జిల్లాలో ఏసీబీకి పట్టుబడిన కొందరు అధికారులు
డిమాండ్ చేస్తున్నారు.. రిమాండ్కు వెళ్తున్నారు ● జిల్లాలో చేతులు తడపందే కదలని ఫైళ్లు ● ఏసీబీకి పట్టుబడుతున్నా.. మారని మామూళ్ల బాగోతం ● వృత్తి ధర్మాన్ని మరచిపోతున్న ఉద్యోగులు ● కాచుకుని చూస్తున్న ‘మూడోకన్ను’ ● డబ్బులు అడిగితే 9154388912 నంబర్కు ఫోన్ చేయండి ● ఉమ్మడి వరంగల్ జిల్లా ఏసీబీ డీఎస్పీ సాంబయ్యఏసీబీ ప్రత్యేక నిఘా జిల్లాలో ఏసీబీ కేసులు అత్యధికంగా నమోదు కావడంతో ఈ ప్రాంతంపై నిఘా రెట్టింపు చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రజా సంబంధాలకు దగ్గరగా ఉన్న ఓ ప్రధాన కార్యాలయంతో పాటు సమీకృత కలెక్టరేట్లోని కొన్ని శాఖల పరిధిలో ఏసీబీ ఫిర్యాదు అందినట్టు విశ్వసనీయ సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక ఏసీబీ కేసులుగా జనగామకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పుకోవచ్చు. ఏసీబీకి ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగులు పట్టుబడుతున్నా.. కొన్ని శాఖల్లో మాత్రం మామూళ్ల డిమాండ్ ఆగడం లేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.జనగామ: వేలకు వేలు వేతనాలు వస్తున్న ఉద్యోగులు, అధికారులు వృత్తి ధర్మాన్ని మరు స్తున్నారు. అంకితభావంతో పని చేస్తూ అటు ప్రభుత్వం.. ఇటు ప్రజలకు వారధిగా నిలవాల్సిన ఉద్యోగులు అడ్డదారి సంపాదనకు అలవాటు పడిపోతున్నారు. పని ఏదైన పైసలు లేనిదే ఫైల్ కదలని పరిస్థితి. ప్రతీ పనికి ఒక రేటు ఫిక్స్ చేసి.. కింది స్థాయి సిబ్బంది.. మధ్యదళారులను ఏర్పాటు చేసుకుని టేబుల్ కింద నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. భూ సంబంధింత పనుల నుంచి ఇంటి అనుమతుల వరకు.. లక్షల్లో డిమాండ్ చేస్తూ.. అడ్డదారి సంపాదనకు ఆశపడుతూ ఏసీబీకి పట్టుబడుతూ డైరెక్టుగా చర్లపల్లి జైలుకుపోతున్నారు. జిల్లాలో పుష్కర కాలంగా ఏసీబీకి పట్టుబడిన ఉద్యోగులు, అధికారులు, ఉన్నతాధికారుల బాగోతంపై సాక్షి ప్రత్యేక కథనం. లంచాలకు అలవాటు పడి.. ఏసీబీ రోజురోజుకు దూకుడు పెంచేస్తోంది. లంచాలకు అలవాటు పడి.. జలగలా పట్టి పీడిస్తున్నా ఉద్యోగులు, అధికారుల తాట తీస్తోంది. లంచం డిమాండ్ చేస్తూ వల వేసి పట్టేస్తూ... జైలుకు పంపిస్తున్నారు. అయినా వారిలో మార్పు రావడం లేదు. మామూళ్లు డిమాండ్ చేస్తే సమాచారం అందించాలని ఏసీబీ ఫోన్ నంబర్లతో మారుమూల పల్లె వరకు విస్తృత ప్రచారం చేస్తున్నా.. అడ్డదారిలో వసూళ్ల దందా ఆగడం లేదు. జిల్లాలో గడిచిన పుష్కర కాలంలో 34 మంది వరకు అధికారులు, ఉన్నతాధికారులు, సిబ్బంది, ప్రైవేట్ వ్యక్తులు పట్టుబడగా.. ఇటీవల వరుసగా నమోదవుతున్న కేసులతో ఆయా శాఖల్లోని అవినీతి పరుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఈ మధ్య కాలంలో మున్సిపల్ కమిషనర్ రజిత, షెడ్యూల్డ్ కులాల జిల్లా అధికారి గట్టుమల్లు, డీఎంహెచ్ఓ ప్రశాంత్, స్టేషన్ఘన్పూర్ సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణ, ఇరిగేషన్ డీఈ రవీందర్ రెడ్డి, ఎన్పీడీసీఎల్ డీఈ హుస్సేన్ నాయక్, ఆర్అండ్బీ ఈఈ హుస్సేన్ మంచి పొజిషియన్లో ఉండి, సరిపడా వేతనాలు వస్తున్నా.. లంచం డిమాండ్ చేసి ఉద్యోగం ఊడిపోయి జైలు పాలయ్యారు. ఒక్కసారి ఏసీబీకి పట్టుబడితే సర్వీస్లో అనేకం నష్టపోవడంతో పాటు మానసికంగా కుంగిపోతారు. అయినప్పటికీ వేతనాలు చాలనట్టుగా.. టేబులు కింద చేయి చాస్తూ... కడుపుమండిన వినియోగదారుడి ఒక్క ఫిర్యాదుతో జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. లంచం అడిగితే సమాచారం ఇవ్వండి ప్రభుత్వ శాఖల్లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం అందించాలి. టోల్ ఫ్రీ నంబర్ 1064, ఫోన్ నంబర్ 91543 88912కు సమాచారం చేరవేయాలి. పనుల కోసం వెళ్లే ఎవరైన సరే ఒక్కపైసా లంచం రూపంలో ఇవ్వొద్దు. పైసలు డిమాండ్ చేసే సమయంలో వారి వివరాలను తమకు తెలియజేస్తే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాం. – సాంబయ్య, డీఎస్పీ, ఏసీబీ, ఉమ్మడి వరంగల్ జిల్లా -
తరాలపల్లి నుంచి దండకారణ్యం వరకు..
ముగిసిన అంకేశ్వరపు సారయ్య ఉద్యమ ప్రస్థానంసాక్షిప్రతినిధి, వరంగల్/కాజీపేట అర్బన్ : అంకేశ్వరపు సారయ్య అలి యాస్ సుధీర్, ఎల్ల న్న, సుధాకర్.. హనుమకొండ జిల్లా తరాలపల్లి ము ద్దుబిడ్డ.. రెండు పదుల వయస్సులో ఆయిడిసి, బాయిడిసి అడవిబాట పట్టిన మావోయిస్టు నే త. దళసభ్యుడినుంచి దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడి వరకు ఎదిగిన సారయ్య అలియాస్ సుధీర్ 35 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ముగిసింది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందా డు. దంతెవాడ జిల్లా బీజాపూర్ ప్రాంతంలోని గీడం పోలీస్స్టేషన్ పరిధిలోని గిర్సాపర, నెల్గోడ, బోడ్గా, ఇకెలి గ్రామాల సరిహద్దు ప్రాంతాల్లో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు ఎస్పీ గౌరవ్రాయ్ మంగళవారం ప్రకటించారు. ఈ ఎన్కౌంటర్లో మొత్తం ముగ్గురు మృతిచెందగా.. మృతుల్లో సారయ్య ఉన్నట్లు వెల్ల డించారు. బీజాపూర్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో సారయ్య మృతి చెందాడన్న వార్తతో తరాలపల్లిలో విషాధఛాయలు అలుముకున్నాయి. విద్యార్థిదశ నుంచే ఉద్యమాలు.. తరాలపల్లి గ్రామానికి చెందిన సారయ్య కొండపర్తి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు. 1982లో 10వ తరగతి చదువుతున్న తరుణంలోనే నాడు మావోయిస్టులు ఇచ్చిన ‘గ్రామాలకు తరలండి’ పిలుపుకు ఆకర్షితుడై, తరాలపల్లి విలేజ్ ఆర్గనైజర్ బండి ఆశాలు, హనుమకొండ సిటీ ఆర్గనైజర్ తిప్పారపు రాములు అలియాస్ తాత సారథ్యంలో తరాలపల్లి గ్రామ అధ్యక్షుడిగా తన ప్రస్థానం ప్రారంభించాడు. అంచెలంచెలుగా మావోయిస్టు పార్టీలో ఎదుగుతున్న తరుణంలో 1990లో బీఎస్ఎఫ్ సిబ్బంది గ్రామాల్లో రావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 1993లో జరిగిన ఎన్కౌంటర్లో సిటీ ఆర్గనైజర్ తాత చనిపోవడంతో.. అజ్ఞాతంలోకి వెళ్లిన సారయ్య నేటి వరకు గ్రామానికి తిరిగి రాలేదు. ముగిసిన 35 ఏళ్ల ప్రస్థానం.. సుమారు 35 ఏళ్లపాటు మావోయిస్టు పార్టీలో తన ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించిన సారయ్య మంగళవారం ఎన్కౌంటర్లో అమరుడయ్యాడు. హనుమకొండ, ఖమ్మం జిల్లాల్లో వివిధ స్థాయిల్లో పనిచేసి 1995లో దండకారణ్యానికి వెళ్లిన ఆయన దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా ఎదిగారు. ప్రస్తుతం ఈస్ట్ బస్తర్ డీకేఎస్జడ్సీ సభ్యుడిగా, మాస్ మొబైల్ అకడమిక్ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నారు. ఈయనపై రూ.25 లక్షల రివార్డు ఉంది. అమరుల పల్లె తరాలపల్లి.. కాజీపేట మండలం తరాలపల్లి ఉద్యమాలకు కేరాఫ్. ఎందరో ఈ గ్రామం నుంచి విప్లవోద్యమాల వైపు ఆకర్షితులై ఎన్కౌంటర్లలో అసువులు బాశారు. 1991లో వేల్పుల జగదీష్ అలియాస్ ఉప్పలన్న, 1992లో బండి ఆశాలు అలియాస్ శ్రీను పగిడేరు ఎన్కౌంటర్లో చనిపోయారు. 1998 నుంచి గాజుల శ్రీకాంత్ అలియాస్ శ్రీనాథ్, ముప్పిడి నాగేశ్వర్రావు అలియాస్ విశ్వనాథ్, చిరబోయిన సదానందం అలియాస్ కౌముదీ, సంపత్, కొత్తపల్లి సాంబయ్య అలియాస్ ఉప్పలన్నలు మృతిచెందగా.. మంగళవారం ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో అంకేశ్వరపు సారయ్య చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా నేడు (బుధవారం) సారయ్య మృతదేహం తరాలపల్లికి రానుంది. 35 ఏళ్ల అజ్ఞాతవాసం... దళసభ్యుడినుంచి డీకేఎస్జడ్సీ వరకు దంతెవాడ ఎన్కౌంటర్లో అసువులు బాసిన సుధీర్ విషాదంలో తరాలపల్లి.. నేడు గ్రామానికి మృతదేహం -
ఏడాది జైలుపాలే..
బుధవారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2025– 8లోuవరంగల్ క్రైం: తీవ్రమైన నేరాలకు పదేపదే పాల్పడే అక్రమార్కులు, నేరస్తులపై పీడీయాక్టులతో పోలీసులు ఉక్కుపాదం మోపుతారు. ప్రజల ఆస్తులకు, ప్రాణాలకు ఇబ్బందిగా పరిణమించే వారిపట్ల ఇదో చట్టపరమైన ఆయుధం. కానీ, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండేళ్లుగా పీడీయాక్టుల కేసు నమోదు అంతంతమాత్రమే. గత ఏడాది కేవలం రెండు కేసులు నమోదు చేయగా, ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్కకేసు కూడా పెట్టలేదు. కానీ, అక్రమార్కుల ఆగడాలు, కబ్జాదారులు, గంజాయి, డ్రగ్స్ సరఫరాకు అడ్డుకట్ట పడిందంటే లేదనే చెప్పాలి. వరంగల్ పోలీస్ కమిషనర్గా సుధీర్బాబు, రవీంద్రకుమార్, తరుణ్జోషి హయాంలో ఎక్కువగా పీడీ యాక్టులు నమోదు చేశారు. ఏవీ రంగనాఽథ్ పనిచేసిన సమయంలో అక్రమార్కులు, భూకబ్జాదారులపై ఉక్కపాదం మోపారు. పేదల భూముల్లో అడుగు పెట్టాలంటే ఒంట్లో వణుకు పుట్టించారు. ఆ తర్వాత వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాలు, ఉదాసీనతతో అక్రమార్కులు పనులు యథాతథమయ్యాయి. మళ్లీ భూకబ్జాలు అక్కడక్కడా వెలుగు చూస్తూనే ఉన్నాయి. రోజుకు ఎక్కడో ఒకచోట గంజాయి లభిస్తూనే ఉంది. దొంగలు పగలు, రాత్రి తేడా లేకుండా చోరీల మీద చోరీలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు.● తీవ్రమైన నేరాలకు పాల్పడే వారిపట్ల పోలీస్ అధికారులు కేసుల తీవ్రతను బట్టి పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తారు. ● సంచలనం కలిగించే హత్య కేసులు ఒక్కటి, మూడు నెలల్లో రెండు కేసులు, 20 కిలోల గంజాయి, డ్రగ్స్ వంటి కేసుల్లోని నిందితులపై పీడీయాక్టు నమోదు చేశారు. ● ఈ కేసులో సంవత్సరం వరకు బెయిల్ మంజురు కాదు. ● నిందితులను జైల్లోనే ఉంచి వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని, వారివల్ల ప్రజలు ఇబ్బందులకు గురి కావొద్దు అనే ఆలోచనలతో పీడీయాక్టు నమోదు చేస్తారు. ● పోలీస్ కమిషనరేట్లో ఇప్పటివరకు మొత్తం 254 మందిపై పీడీయాక్టు పెట్టారు.హద్దుమీరితే పీడీ యాక్టు నమోదు హద్దుమీరి నేరాలకు పాల్పడే వారిపై కచ్చితంగా పీడీ యాక్టు నమోదు చేస్తాం. ఈ కేసులతో నేరస్తుల్లో భయంతోపాటు వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిదిలో నేరాలకు పాల్పడే అంతర్రాష్ట్ట్ర దొంగల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. భూకబ్జాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతాం. – సన్ప్రీత్సింగ్, వరంగల్ సీపీ కోర్టు ఇబ్బందులతో వెనుకడుగు..వివిధ రకాల నేరాలకు పాల్పడే అంతర్రాష్ట్ర నేరస్తులపై పీడీయాక్టు కేసులు నమోదు చేస్తున్న క్రమంలో పోలీసు అధికారులకు కోర్టుల్లో చేదు అనుభవం ఎదురవుతుంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్ద నేరాలు ఒక్కటి చేసినప్పటికి వారిపై పీడీయాక్టు నమోదు చేసే నిబంధనలు అడ్డొస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నిందితులకు పీడీయాక్టు నివేదికలను వారి సొంత భాషలో ఇవ్వడంలో అధికారులు ఇబ్బంది పడుతున్నారు. దీని వల్ల పీడీయాక్టు కేసులు నమోదైనప్పటికీ అన్ని కేసులు చివరి వరకు నిలవడం లేదు. హత్యలు చేసిన వారు8పీడీఎస్ బియ్యం రవాణా4డెకాయిట్, రాబరీ22భూకబ్జాదారులు4సీ్త్రల అక్రమ రవాణా1దొంగలు87మోసాలు22గంజాయి, డ్రగ్స్ సరఫరా104అత్యాచారాలకు పాల్పడే వారు2వరంగల్ కమిషనరేట్లో ఈ ఏడాది సున్నా -
హనుమాన్ విజయయాత్రను జయప్రదం చేయాలి
జనగామ: జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 12వ తేదీన తలపెట్టిన వీర హనుమాన్ విజయ యాత్ర (హిందూ ఏక్తా యాత్ర)లో హిందువులు అధిక సంఖ్యలో పాల్గొనాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు మంచాల రవీందర్ పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని ధర్మశాల శ్రీ వాసవీమాత దేవాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హిందువుల సంగటిత శక్తిని చాటి చెప్పేందుకు వీర హనుమాన్ విజయ యాత్రను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వజిల్లా కార్యదర్శి మోహన్ కృష్ణ భార్గవ, రంగ నరసింహరావు, శ్రీశైలం, బాల నారాయణ, గునిగంటి రా మకృష్ణ, చంద్రశేఖర్, పజ్జూరి లక్ష్మీ నర్సయ్య, లక్ష్మ ణ్, సోమిరెడ్డి, శివరామకృష్ణ, నరేందర్, మధు, రా జు, అభిషేక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
చెప్పకుండా కాల్వ పనులు చేస్తుండ్రు..
పక్క ఫొటోలోని వ్యక్తులు రఘునాథపల్లి మండలం కంచెనపల్లికి చెందిన అమృతం, దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన నల్ల మధు, గుమ్మడవెల్లి భిక్షపతి. జిల్లా కేంద్రం హైదరాబాద్రోడ్డున 1990 ప్రాంతంలో 70 మంది ప్లాట్లు కొనుగోలు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అధికారులు సమాచారం లేకుండా ప్లాట్లలో కాల్వ పనులు చేస్తుండగా తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా పనులు ఎలా చేస్తారని అడగ్గా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో న్యాయం చేయాలని కలెక్టర్కు అర్జీ పెట్టుకున్నట్లు బాధితులు తెలిపారు. -
ఒక్కొక్కరిది ఒక్కో సమస్య
పరిష్కరించాలని గ్రీవెన్స్కు వచ్చిన ప్రజలు ● వివిధ సమస్యలపై 66 అర్జీల అందజేత ● సమస్యలపై దృష్టి సారించండి : ● ఆదేశించిన కలెక్టర్ రిజ్వాన్ బాషాజనగామ/జనగామ రూరల్: ‘ఎస్సై కొట్టాడు. స్టేష న్కు రమంటున్నారని ఓ బాధితుడు.. నోటీసులు ఇవ్వకుండానే కాల్వ పనులు చేస్తున్నారని రైతులు.. బై నంబర్లతో భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని పలువురు’.. ఇలా అనేక సమస్యలతో గ్రీవెన్స్కు వచ్చిన ప్రజలు అధికారుల ఎదు ట తమ గోడు చెప్పుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి వివిధ సమస్యలపై 66 అర్జీలు రాగా.. వాటిని కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు పింకేష్కుమార్, రోహిత్సింగ్ స్వీకరించారు. ప్రజలు ఇచ్చిన వినతులపై సంబంధిత శాఖల అధికారులు దృష్టి సారించి ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని ఆదేశించారు. మండల స్థాయి గ్రీవెన్స్పై విస్త్రృ ప్రచారం చేపట్టడంతో పాటు దరఖాస్తులను వేగంగా పరిశీలించాలని చెప్పారు. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ ఈనెల 31లోగా పూర్తి చేయాలని, తాగునీటి ఎద్దడి నివారణకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎంపిక చేసిన 12 గ్రా మాల్లో మార్కింగ్ త్వరగా పూర్తిచేయాలని చెప్పా రు. గ్రీవెన్స్లో డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, జెడ్పీ డిప్యూటీ సీఈఓ సరిత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.బైపాస్–2ను పరిగణనలోకి తీసుకోవాలి బచ్చన్నపేట మండలం మొండికుంట శివారు తుమ్మబాల స్కూల్ ఏరియా నుంచి బైపాస్–2ను పరిగణనలోకి తీసుకోవాలని ప్లాట్ల బాధితులు బియ్య లింగయ్య, వడ్డెపల్లి వెంకటరెడ్డి, కరికె కిష్టయ్య, సందెల మల్లయ్య, బాలరాజు, బూరుగు భాస్కర్, గుర్రపు రమేష్, కరీముల్లా, కృష్ణ కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఎన్హెచ్–365బి బైపాస్ రోడ్డు నిర్మాణ సమయంలో ప్రతిపాదిత 3ఏ భూసేకరణ ఆపాలని హైకోర్టుకు వెళ్లగా పనుల్లో యధాస్థితిని పాటించాలని కోర్టు ఆదేశించిందని చెప్పారు. అయితే ప్రతిపాదిత బైపాస్ నిర్మాణం ఊరి మధ్య నుంచి పోతుండడంతో ప్రమాదాలు జరిగే అవకా శం ఉందనీ.. కోర్టు ఆదేశాలున్నా సంబంధిత అధికారి వినతులపై పేషీ నిర్వహించకుండా కొట్టివేసి ప్రొసీడింగ్ ఇచ్చారని పేర్కొన్నారు. సంబంధిత అధికారిపై చర్య తీసుకుని బైపాస్ ఆప్షన్–2ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. వినతుల్లో కొన్ని.. ● స్టేషన్ఘన్పూర్ రిజర్వాయర్ కోసం 2008 సంవత్సరం చేపట్టిన భూసేకరణలో రైతు చింతకుంట నర్సింహారెడ్డికి చెందిన నాలుగెకరాల భూమి తీసుకోగా రూ.9,52,768 నష్టపరిహా రం వచ్చింది. ఆ డబ్బు తీసుకోకుండా ఫారం–ఈ ద్వారా సరెండర్ చేశారు. సమస్య పరిష్కరించి డబ్బులు ఇప్పించాలని నర్సింహారెడ్డి అర్జీ పెట్టుకున్నాడు. ● దేవరుప్పుల మండలం కోలుకొండకు చెందిన జూకంటి ఐలయ్యకు సంబంధించిన 3.04 ఎకరాల భూమికి పట్టా పాసు బుక్కులు మంజూరయ్యాయి. అవి తనకు ఇప్పించాలని ఐలయ్య దరఖాస్తు చేసుకున్నాడు. భూమి ఎక్కువ ఎలా వచ్చింది..? రఘునాథపల్లి మండలం కుర్చపల్లిలోని ఓ సర్వే నంబర్ పరిధిలో 11.18 ఎకరాల భూమి ఉండగా.. 12.34 ఎకరాల భూమి ఎలా వచ్చిందని రైతులు ముచ్చ వాసుదేవరెడ్డి, నల్ల శ్యామ్, బానోతు గోపా ల్, లక్య, జోగ్య, మినుకూరి విజేందర్రెడ్డి గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. ఎకరం 16 గుంటల భూమి పెంచి, ఆ సర్వే నంబర్పై బై వేసి రిజిస్టర్ చేయించుకున్నారని తెలిపారు. సమగ్ర విచారణ చేపట్టి భవిష్యత్లో తమకు ఇబ్బందులు కలుకుండా చూడాలని వారు వినతిపత్రం ఇచ్చారు.స్టేషన్కు రమంటున్నారు.. గత నవంబర్ 11న పాలకుర్తి నుంచి తండాకు బైక్పై లిఫ్టు తీ సుకుని వెళ్తున్నాను. పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా బైక్ యజమాని తనను దింపి వెనక్కి వెళ్లిపోయాడు. కాలినడకన తండాకు వెళ్తుండగా పోలీసులు ఆపి బైక్ ఎటు వెళ్లిందని అడగ్గా లిఫ్టుతో వస్తున్నాను.. నాకు తెలి యదని చెప్పగా ఇష్టం వచ్చినట్టు కొట్టారు. పాలకుర్తి ఆస్పత్రిలో వైద్యం చేసుకుని హనుమకొండ పెద్దాస్పత్రికి పోయిన. తర్వాత సీపీ, డీసీపీ, సీఐకి ఫోన్లో చెప్పిన. అయితే ఎస్సై ఫోన్చేసి ఆధార్ తీసుకు ని స్టేషన్కు రమ్మంటున్నారు. న్యాయం చేయాలి. – జరుపుల భిక్షపతి, చీమలబాయి తండా12 మండలాలు.. మూడే అర్జీలు● తహసీల్ గ్రీవెన్స్కు స్పందన కరువు– వివరాలు 9లోu -
క్షయ నివారణ అందరి బాధ్యత
● అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ జనగామ రూరల్: క్షయ వ్యాధి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, దీనిని అంద రూ బాధ్యతగా తీసుకుని సహకరించాలని అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా సోమవా రం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన పట్టణంలో ని అంబేడ్కర్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు చేపట్టిన ర్యాలీని ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. క్షయ అనేది టీబీ రోగి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే జబ్బు అని, దీనిపై సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డీఎంహెచ్ ఓ మల్లికార్జున్రావు మాట్లాడుతూ.. వ్యాధిని తొలి దశలోనే గుర్తిస్తే నివారణతో పాటు నియంత్రణ సులభతరం అవుతుందని చెప్పారు. రెండు గంట ల్లోనే టీబీని గుర్తించే పరికరాలు జిల్లా ఆస్పత్రిలో ఉన్నాయని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం నిమిత్తం నెలకు రూ.1,000 చొప్పున చికిత్స పూర్తయ్యే వరకు, మందులు ఉచితంగా ప్రభుత్వం ఇస్తోందని చెప్పారు. గత ఏడాది 1,051 మంది టీబీ బాధితులను గుర్తించగా 525 మందికి నగదు అందజేశామ ని, మిగతా వారికి త్వరలోనే ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం క్షయ నివారణకు ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంస పత్రాలతో పాటు జ్ఞాపికలు అందజేశారు. -
గేటు మూస్తే రాకపోకలు కష్టమే..
రఘునాథపల్లి మండలం నిడిగొండ–ఫతేషాపూర్ మధ్యలో రైల్వేగేటు ఉంది. రాకపోకలకు ఇబ్బంది కలుగకుండా అండర్ బ్రిడ్జి(ఆర్యూబీ) నిర్మిస్తున్నారు. ఆర్యూబీ నిర్మాణ దశలో ఉండగానే గేటు మూసి వేస్తామనడంతో ప్రయాణానికి ఇబ్బంది అవుతుందని ఆందోళన చెందిన గొట్టం కరుణాకర్రెడ్డి, గాజులపాటి మహేందర్, హయత్అలీ, మొహన్, నాగరాజు, షబ్బీర్ మియా, గాజులపాటి నేతాజీ, హింగె మోహన్, వీరోజు, సత్యనారాయణ, మనోహర్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గేటు మూసి వేస్తే 8 గ్రామాల ప్రజలు అదనంగా 15 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి ఉంటుంద ని పేర్కొన్నారు. ఆర్యూబీ పూర్తయ్యే వరకు గేటు తెరిచి ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ● -
భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలి
స్టేషన్ఘన్పూర్: వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతతో కృషి చేయాలని కలెక్టర్ రిజ్వాన్బాషా అన్నా రు. ‘పీఎం కృషి సించాయి యోజన 2.0’ పథకంలో భాగంగా సోమవారం తాటికొండ గ్రామంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యాన చేపట్టిన వాటర్షెడ్ యాత్రను ప్రారంభించిన అనంతరం రైతు వేదికలో మాట్లాడారు. భూగర్భ జలాలు పెరిగితే సాగునీరు సమృద్ధిగా ఉండి పంటల విస్తీర్ణం, వృక్షసంపద, పచ్చదనం పెరుగుతుందన్నా రు. రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 35 ప్రాజెక్టుల ద్వారా 248 గ్రామాలు వాటర్షెడ్ పథకం కింద ఎంపికయ్యాయని, అందులో జిల్లాలోని తాటికొండ గ్రామం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పండ్ల తోటలు, అడవి మొక్కల పెంపకం పనులకు ఈజీఎస్ పథకం ద్వారా నిధులు మంజూరు చేస్తామ ని చెప్పారు. ఉపాధి పనులకు రోజుకు రూ.300 ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. వాటర్ షెడ్ పథకం కింద స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.50వేల రుణ సదుపా యం కల్పిస్తున్నట్లు వివరించా రు. కార్యక్రమంలో డీఆర్డీఏ వసంత, డీఏఓ రామారావునాయక్, డీవైఎస్ఓ వెంకట్రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ చల్లా సుధీర్రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ మారపాక రాములు, తహసీ ల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ విజయశ్రీ, ఏఓ చంద్రన్కుమార్, వాటర్షెడ్ పీఓ వీరన్న, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, టీఏ జాంబ, నరేష్, సలీమ్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. మీదికొండ గ్రామంలో వాటర్షెడ్ యాత్ర ప్రారంభించారు. డీఏఓ రామారావునాయక్, పీఆర్ ఏఈ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తాటికొండలో వాటర్షెడ్ యాత్ర -
చేతి రాతతో మంచి మార్కులు
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ రూరల్: చేతి రాతతోనే విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. అక్షర హ్యాండ్రైటింగ్ అకాడమీ ఎండీ.మేరాజ్ అహ్మద్ ఆధ్వర్యాన సోమవారం హైదరా బాద్లో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నిర్వహించిన రాష్ట్ర స్థాయి చేతి రాత పోటీల్లో 12వేల మంది పాల్గొన్నారు. పట్టణంలోని ఎస్ఆర్ ట్యూషన్ అకాడమీ విద్యార్థులు స్టేట్ బెస్ట్ పర్ఫెక్ట్ హ్యాండ్ రైటింగ్ అవార్డ్, స్పార్క్ అవార్డ్ దక్కించుకున్నారు. మరో 10 మంది విద్యార్థులు స్టేట్ విన్ అవార్డ్ సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. -
బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా హరిప్రసాద్ యాదవ్
జనగామ రూరల్: జనగామ బార్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం నామినేషన్ పత్రాల ఉపసంహరణ, పోటీదారుల తుది జాబితా ను ఎన్నికల అధికారి శ్రీరాం శ్రీనివాస్ వెల్లడించారు. అధ్యక్ష పదవికి హరిప్రసాద్ యాదవ్, కూరెళ్ల శ్రీనివాస్రెడ్డి, బి.దయాకర్రెడ్డి నామినేషన్లు వేయగా.. శ్రీనివాస్ రెడ్డి, దయాకర్రెడ్డి తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో దండేబోయిన హరిప్రసాద్యాదవ్ ఎన్నిక ఏకగ్రీవం అయిందని ఎన్నికల అధికారి శ్రీరాం శ్రీనివాస్, అసిస్టెంట్ ఎన్నికల అధికారి జి.రాజశేఖర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఉపాధ్య క్ష పదవికి ఇర్రి అశోక్, స్పోర్ట్స్–సాంస్కృతిక కార్యదర్శిగా రెడ్డబోయిన రాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన తెలిపారు. ప్రధాన కార్యదర్శి, కార్యవర్గ సభ్యుల ఎన్నిక అనివార్యమైనందున ఈనెల 27న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. -
చట్టాలపై అవగాహన అవసరం
● సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ జనగామ రూరల్: ఖైదీలకు చట్టాలపై అవగాహన అవసరమని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నా రు. సోమవారం జిల్లా కేంద్రంలోని సబ్జైలును సందర్శించిన ఆయన.. ఖైదీలకు కల్పించిన వసతులు, భోజనం, ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకున్నా రు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేస్తున్నారా లేదా.. జైలు సిబ్బందితో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగారు. ప్రతీ ఖైదీకి న్యాయవాదులు ఉండాలని, ములాఖత్ ఫిర్యాదులుంటే చెప్పాలని సూచించారు. కంప్లైట్ బాక్స్లో సమస్యలు రాసి వేయాలని చెప్పా రు. బెయిల్ గ్రాంట్ అయి విడుదల కానివారుంటే జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ దృష్టికి తీసుకురావాలి ఈ సందర్భంగా సూపరింటెండెంట్ కృష్ణ కాంత్కు సూచించారు. -
ఆస్పత్రి వర్కర్ల వేతనాలు చెల్లించాలి
జనగామ రూరల్: మెడికల్, ఎంసీహెచ్ ఆస్పత్రి వర్కర్లకు వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల హాస్టల్ వర్కర్స్కు ఐదు నెలలుగా, ఎంసీహెచ్ వర్కర్స్కు రెండు నెలల నుంచి వేతనాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. కొత్త కాంట్రాక్టర్ను త్వరగా నియమించి కార్మికులకు రెగ్యులర్గా వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు ఏనుగుల రఘు, గండి అజయ్ పాల్గొన్నారు. -
చెప్పకుండా కాల్వ పనులు చేస్తుండ్రు..
పక్క ఫొటోలోని వ్యక్తులు రఘునాథపల్లి మండలం కంచెనపల్లికి చెందిన అమృతం, దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన నల్ల మధు, గుమ్మడవెల్లి భిక్షపతి. జిల్లా కేంద్రం హైదరాబాద్రోడ్డున 1990 ప్రాంతంలో 70 మంది ప్లాట్లు కొనుగోలు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అధికారులు సమాచారం లేకుండా ప్లాట్లలో కాల్వ పనులు చేస్తుండగా తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా పనులు ఎలా చేస్తారని అడగ్గా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో న్యాయం చేయాలని కలెక్టర్కు అర్జీ పెట్టుకున్నట్లు బాధితులు తెలిపారు. -
డీఏలు, పీఆర్సీ ఇవ్వలేమనడం సరికాదు
జనగామ రూరల్: ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డీఏలు, పీఆర్సీ ఇవ్వలేమనడం సరికాదని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు ఎన్ఎన్ రాజు విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఉమాపతి భవన్లో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు నాలుగు వాయిదాల డీఏను, జులై 2023 నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీని అడగొద్దని, అవి కావాలంటే నెలనెలా జీతాలే ఇవ్వలేమని ముఖ్యమంత్రి ప్రకటించటాన్ని తీవ్రంగా ఖండించారు. సగం మంది ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మాత్రమే నెల మొదటి తేదీన వేతనాలు ఇవ్వడం మినహా మరే సమస్య పరిష్కారం కాలేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంకుశావలి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కుర్రేముల యాదగిరి, బి. లక్ష్మయ్య, వజ్రయ్య, రాజా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ -
సామాజిక సేవలో ఆర్యవైశ్యులు ముందంజ
రఘునాథపల్లి: వ్యాపారానికే పరిమితం కాకుండా సామాజిక సేవలో ఆర్యవైశ్యులు ముందుంటారని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత అన్నారు. మండల ఆర్యవైశ్య మహాసభ నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి సుజాత ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. మండల కేంద్రంలోని ఎల్ఎల్బి గార్డెన్లో ఆదివారం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా తుమ్మలపల్లి సోమేశ్వర్, ప్రధాన కార్యదర్శిగా బచ్చు శ్రీనివాస్, కోశాధికారిగా పోకల హరిప్రసాద్తో పాటు కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జరిగిన సమావేశంలో సుజాత మాట్లాడుతూ ఆర్యవైశ్యులు ఐక్యతగా ముందుకు సాగాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కౌన్సిల్ సభ్యుడు పోకల శివకుమార్, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఉప్పల శారద, జిల్లా అధ్యక్షుడు గంగిశెట్టి ప్రమోద్కుమార్, ఉపాధ్యక్షుడు కూరెల్ల పెద్ద ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్పొరేషన్ చైర్పర్సన్ సుజాత -
అండర్పాస్ ఏర్పాటు చేసి ఆదుకోవాలి
జనగామ రూరల్: పట్టణంలోని ఇందిరమ్మ బాణాపురం కాలనీ వద్ద నిర్మిస్తున్న బైపాస్ రోడ్డులో అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటుకు కృషి చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని సీపీఎం బృందం ఆదివారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి మాట్లాడుతూ జనగామ పట్టణంలోని నేషనల్ హైవే 163 నంబర్ హైదరాబాద్ రోడ్డు నుంచి హనుమకొండ రోడ్డును దుద్దేడ రోడ్డును లింక్ చేస్తూ నిర్మిస్తున్న నేషనల్ హైవే 365 బీ బైపాస్ రోడ్డు బాణాపురం వద్ద నుంచి రైల్వే ట్రాక్ నుంచి వస్తున్న బ్రిడ్జి నిర్మాణం అండర్ పాస్ బ్రిడ్జిని నిర్మించకుండా దారి మళ్లించడంతో జనగామ పట్టణంలోని పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతారన్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, విద్యార్థులు రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అండర్పాస్ బ్రిడ్జి ఏర్పాటుకు కృషి చేయాలని ఎంపీని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నేషనల్ హైవే అథారిటీ అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లి బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బూడిద గోపి, పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజేందర్, కనకచారి పోశెట్టి తదితరులు పాల్గొన్నారు. -
దేవాదుల పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలం
జఫర్గఢ్ : దేవాదుల నిర్మాణ పనులు పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి విమర్శించారు. పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని మగ్ధుంతండా గ్రామం నుంచి చేపట్టిన రెండు రోజుల పాదయాత్రను సీహెచ్ రాజారెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేవాదుల ద్వారా ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలని రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టినప్పటికీ కాల్వల నిర్మాణ పనులు చేపట్టలేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కాల్వల నిర్మాణ పనులు పూర్తి చేయడంతో పాటు సాగునీరు అందించి రైతులను ఆదుకుంటారని అనుకుంటే మెండిచేయి చూపడం తప్ప చేసిందేమి లేదన్నారు. జఫర్గఢ్ మండలంలో ఉప్పుగల్లు రిజర్వాయర్లో నీళ్లు ఉన్న కాల్వల నిర్మాణ పనులు పూర్తి చేయకపోవడంతో రైతులకు నీరందకుండాపోయిందన్నారు. ఎండిన పంటలకు ప్రభుత్వం ఎకరాకు రూ.50వేల పరిహారం చెల్లించాలన్నారు. అనంతరం పాదయాత్ర మగ్ధుంతండా నుంచి ప్రారంభమై ఓబులాపూర్, తమ్మడపల్లి (జి), జఫర్గఢ్, రేగడితండా మీదుగా తమ్మడపల్లి (ఐ) గ్రామం వరకు సాగింది. జిల్లా నాయకులు ఆది సాయన్న, ఆకుల శ్రీనివాస్, చొప్పరి సోమయ్య, రైతు సంఘం మండల అధ్యక్షుడు ఎండీ యాకూబ్పాష, పెండ్యాల సమ్మయ్య, మండల గట్టుమల్లు, కూరపాటి చంద్రమౌళి, అన్నెపు అజయ్, మంద బుచ్చయ్య, కుక్కల శోభ, జువారి భద్రమ్మ, అరుణ, కలకోట ప్రభాకర్, విష్ణు, పెద్ద రాజు, ఎర్ర సతీష్, మోడెం శంకర్తో పాటు తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రాజారెడ్డి -
పరిష్కారం అంతంతే!
పెండింగ్లో ప్రజావాణి దరఖాస్తులు కలెక్టరేట్లో 350, మండలాల్లో 82 పెండింగ్ రెవెన్యూ అర్జీలే ఎక్కువ.. కోర్టు కేసులు.. వివాదాలతో జాప్యం మండలాల గ్రీవెన్స్కు ప్రచారం కరువు నేడు కలెక్టరేట్లో గ్రీవెన్స్జనగామ: పెద్ద సార్ను కలిసి తమ సమస్యను మొరపెట్టుకుంటే ఆ సమస్య ఇట్టే పరిష్కారమైపోతుందనే నమ్మకం కొందరిది. అధికారిని కలిసి వినతి చేసుకున్నా... నెలల తరబడి పరిష్కారానికి నోచుకోక అమ్మో అంటూ నీరసించిన వారు ఎందరో. ప్రజల సమస్యలకు దారి చూపించేందుకు ప్రతి సోమవారం కలెక్టరేట్తో పాటు మండలాల పరిధిలోని తహసీల్దార్, విద్యుత్ శాఖ కార్యాలయాల్లో గ్రీవెన్స్ (దరఖాస్తుల స్వీకరణ) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ప్రజావాణికి వచ్చే దరఖాస్తులు.. వాటి పరిష్కారం ఎలా ఉందనే దానిపై సాక్షి ప్రత్యేక కథనం. రెవెన్యూ దరఖాస్తులే ఎక్కువ జిల్లా సమీకృత కలెక్టరేట్లో ప్రతి సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు. అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్సింగ్, ఆర్డీఓలు గోపిరామ్, వెంకన్న, జెడ్పీ సీఈఓ, అన్ని శాఖల ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషాతో గ్రీవెన్స్లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారు. ప్రతివారం జరిగే గ్రీవెన్స్కు 60 నుంచి 70 దరఖాస్తుల వరకు రాగా.. ఇందులో 45కు పైగా రెవెన్యూ సంబంధిత సమస్యలే ఉండడం గమనార్హం. కోర్టు కేసులు, భూ వివాదాలు, గెట్టు పంచాయితీ, కాస్తులో పేరు ఉండి.. పట్టా బుక్కు రాకపోవడం ఇలా అనేక సమస్యలతో గ్రీవెన్స్కు వస్తుంటారు. చిన్న చిన్న పంచాయితీలను తెగదెంపు చేసేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నించినా.. ఎదుటి వ్యక్తులు ససేమిరా అనడంతో పెండింగ్లో ఉన్న దరఖాస్తులే ఎక్కువగా ఉంటున్నాయి. గతేడాది ఆగస్టు నుంచి మార్చి వరకు 1,089 దరఖాస్తులు గ్రీవెన్స్ రాగా, ఇందులో 646 పరిష్కరించారు. 350 పెండింగ్లో ఉండగా, 73 అండర్ ఎంక్వరీలో ఉన్నాయి. ఈ మొత్తంలో 80 వరకు రెవెన్యూ అర్జీలు పెండింగ్లో ఉన్నాయి. ప్రచారం లేని మండల గ్రీవెన్స్ గ్రీవెన్స్ దరఖాస్తులపై అధికారులు మరింత ఫోకస్ సారించాలి. తహసీల్దార్ కార్యాలయాల్లో పరిష్కారానికి నోచుకునే సమస్యలు సైతం కలెక్టరేట్ మెట్లు ఎక్కుతున్నాయి. తహసీల్ కార్యాలయంలో గ్రీవెన్స్ జరుగుతున్నా... పెద్దగా ప్రచారం లేకపోవడంతో చాలామంది శ్రమకు ఓర్చి కలెక్టరేట్కు వస్తున్నారు. రెవెన్యూ సంబంధింత సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తుండగా.. మండలాలకు రెఫర్ చేసిన అర్జీల్లో కొన్నింటికి మోక్షం కలగడం లేదనే ఆరోపణలు లేకపోలేదు. రేషన్ కార్డులు, సదరం సర్టిఫికెట్, ఇందిరమ్మ ఇల్లు, పంట రుణ మాఫీ, రైతు భరోసా, జనగామ పట్టణంలోని ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలపై వచ్చే అర్జీల్లో చాలా వరకు బుట్టదాఖలై పోతున్నాయనే బహిరంగ చర్చ వినిపిస్తుంది. మండలాల వారీగా జరిగే గ్రీవెన్స్కు విస్తృత ప్రచారం కల్పించి, ప్రతి దరఖాస్తుకు పరిష్కారం లభిస్తుందనే భరోసా కల్పిస్తే కలెక్టరేట్ వరకు ప్రదక్షిణ చేసే బాధ, కష్టం తప్పుతుంది. గడిచిన ఆరు నెలల కాలంలో నర్మెట తహసీల్దార్కు రెండు మాత్రమే దరఖాస్తులు రావడం గమనార్హం. అలాగే లింగాలఘణపురం, రఘునాథపల్లి, పాలకుర్తి, తరిగొప్పులలో దరఖాస్తుల సంఖ్య చాలా తక్కువ.మండలాల వారీగా గ్రీవెన్స్ వివరాలుమండలం దరఖాస్తులు పెండింగ్ నర్మెట 02 – స్టేషన్ఘన్పూర్ 357 11 కొడకండ్ల 268 03 చిల్పూరు 300 02 జనగామ రూరల్ 127 03 జఫర్గఢ్ 393 03 పాలకుర్తి 25 03 బచ్చన్నపేట 135 15 తరిగొప్పుల 16 03 రఘునాథపల్లి 29 01 లింగాఘణపురం 30 05 దేవరుప్పుల 84 33 మొత్తం 1,766 82శాఖల వారీగా పెండింగ్ దరఖాస్తులు 2024 సంవత్సరం ఆగస్టు నుంచి ఈ ఏడాది మార్చి వరకు జిల్లాలోని వివిధ శాఖల వారీగా 646 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అందులో ఏడీ మైనింగ్, జిల్లా పరిశ్రమలు, జిల్లా ఇంటర్మీడియట్ విద్య, మార్కెటింగ్ అధికారి, ఆర్అండ్బీ, జిల్లా రవాణా అధికారి, ఈఓ పీఆర్డీ, మత్స్య శాఖ, ఫారెస్ట్ ఆఫీసర్, మైనార్టీ సంక్షేమ అధికారి, ఎకై ్సజ్ శాఖ, గిరిజన సంక్షేమం, జెడ్పీ సీఈఓ శాఖలకు ఒక్కొక్కటి, బీసీ సంక్షేమం, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, జిల్లా ఆస్పత్రి, జిల్లా విద్యా అధికారి, విద్యుత్ ఎస్ఈ, భూగర్భ జల శాఖ, చేనేత శాఖ, మిషన్ భగీరథ శాఖలకు రెండేసి, పశుసంవర్ధక, జిల్లా పౌర సరఫరా, జిల్లా కోఆపరేటివ్, న్యాయ సహాయ మండలి శాఖలకు మూడు చొప్పున, ఏడీ సర్వే 4, జిల్లా వ్యవసాయాధికారి 7, జిల్లా పంచాయతీ అధికారి 11, జిల్లా గ్రామీణాభివృద్ధి 5, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి 6, నీటిపారుదల శాఖ 18, వైద్య ఆరోగ్య అధికారి 4, మెప్మా 24, జనగామ మున్సిపాలిటీ 70, ఎంపీడీఓలు 17, పీడీ హౌసింగ్ 6, పీడీ మహిళా శిశు సంక్షేమం 5, పోలీసు శాఖ 34, ఆదాయం శాఖలో 98 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. -
కేజీబీవీలకు ‘ఇన్సినేరేటర్లు’
జనగామ: జిల్లాలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో శానిటరీ సమస్యకు పరిష్కారం చూపించారు. శానిటరీ నాప్కిన్స్ సక్రమమైన పద్ధతిలో నిర్వీర్యం చేసేందుకు కలెక్టర్ రిజ్వాన్ బాషా ప్రత్యేక దృష్టి సారించారు. బాలికల సంపూర్ణ ఆరోగ్యం దృష్ట్యా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నాప్కిన్స్ను బర్న్ చేసే యంత్రాలను మంజూరీ చేశారు. ఇందుకు సంబంధించి డీడబ్ల్యూఓ శాఖ నుంచి ఒక్కో యంత్రానికి రూ.21వేలు ఖర్చు చేస్తూ రూ.2.52లక్షల నిధులు వెచ్చించారు. జనగామ జిల్లాలోని 12 కేజీబీవీల్లో ఇన్సినేరేటర్లను ఏర్పాటు చేయడంతో పాటు సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చారు. గతంలో నాప్కిన్స్ను డస్ట్బిన్లో వేయడంతో క్లీనింగ్ ప్రక్రియలో కొంత ఇబ్బందులు ఎదురయ్యేవి. వ్యర్థ పదార్థాలను కాల్చి వేయడంతో పాటు ఘన వ్యర్థాల పరిమాణాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతాయి. గాలి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుని, నాప్కిన్స్ను బర్న్ చేయాల్సి ఉంటుంది. బాలికలకు ఇన్సినేరేటర్లను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై అవగాహన కల్పించగా, వాటిని భస్మం చేసేందుకు స్కావెంజర్లు రోజువారీగా దృష్టి సారించాలి. బాలికలకు నా ణ్యమైన విద్యతో పాటు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు కలెక్టర్ చొరవ తీసుకుంటున్నారు. బర్న్ చేసిన వ్యర్థ పదార్థాలను (బూడిద) ఎక్కడ వేయాలనే దానిపై పలు సూచనలు చేసినట్లు జీసీడీఓ గౌసియా బేగం తెలిపారు. కలెక్టర్ చొరవ తీసుకుని ఇన్సినేరేటర్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. బాలికలకు ఉపయోగకరంగా యంత్రాలు శానిటరీ నాప్కిన్స్ తొలగించేందుకు చర్యలు జిల్లాలోని 12 కేజీబీవీలకు రూ.2.52 లక్షలు మంజూరు -
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి
● ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి ఖిలా వరంగల్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి అన్నారు. విజయోత్సవ ర్యాలీలో భాగంగా ఆయన ఆదివారం వరంగల్ రంగశాయిపేటకు చేరుకోగా ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు ఘన స్వాగతం పలికారు. శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నాక బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ దేవతకు కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. అనంతరంత దామోర కొండ సదా నందం అధ్యక్షతన జరిగన సమావేశంలో శ్రీపాల్రెడ్డి మాట్లాడుతూ.. మండలిలో ఉపాధ్యాయుల గొంతుకనై ఉంటానని అన్నారు. తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతులు తెలిపారు. కార్యక్రమంలో రవీందర్రెడ్డి, సతీష్, తిరుపతిరెడ్డి, అబ్దుల్ గోపాల్, విజయపాల్రెడ్డి, వెంకటేశ్వర్లు, నరసింహస్వామి, దయాకర్ పాల్గొన్నారు. -
మత సామరస్యానికి ప్రతీక రంజాన్
జనగామ: మతసామరస్యానికి ప్రతీకగా రంజాన్ జరుపుకుంటారని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్లో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు పండ్లు తినిపించి దీక్ష విడిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ ఇఫ్తార్లో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. హిందూ, ముస్లిం తేడా లేకుండా అందరం కలిసికట్టుగా ఉండాలన్ని, మతాలు చెప్పే సందేశం కూడా ఇదేఅన్నారు. పట్టణంలో ఇల్లులేని నిరుపేదలకు సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వంతో కొట్లాడుతామన్నారు. జిల్లా కేంద్రంలోని ముస్లిం కుటుంబాల ఏరియాలో సీసీరోడ్లు, ఇందిరమ్మ ఇళ్లు, నిధులు బరాబర్ రావాల్సిందేనన్నారు. పేద కుటుంబాల్లోని పిల్లల చదువు విషయంలో అండగా ఉంటామన్నారు. రంజాన్న్ పండుగ త్యాగానికి చిహ్నమని, పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమునలింగయ్య, నాయకులు మసిఉర్ రెహమాన్, ఎండీ సమ్మద్, ఎజాజ్, సలీం, యాకు బ్, ముస్త్యాల దయాకర్, జూకంటి శ్రీశైలం, సేవెల్లి మధు, దేవునూరి సతీష్, తదితరులు ఉన్నారు. సోదరభావానికి ప్రతీక రంజాన్: కలెక్టర్ రిజ్వాన్ బాషా జనగామ రూరల్: రంజాన్ మాసం సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివారం రాత్రి పట్టణంలోని ఏక్ మినార్ మజీద్ వద్ద ముస్లిం డెవలప్మెంట్ కమిటీ జిల్లా అధ్యక్షుడు జమాల్ షరీఫ్, ఇంజనీర్ మొహమ్మద్ రజా అహ్సన్ ఆధ్వర్యంలో సామూహిక ఇ ఫ్తార్ ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్లో కలెక్టర్ పా ల్గొని మాట్లాడుతూ రంజాన్ మాసంలో ప్రేమ, సో దరభావం, శాంతి, స్నేహం ఎక్కువగా కనిపిస్తాయన్నారు. హిందూ, ముస్లింల భాగస్వామ్యం సోదరభావానికి నిదర్శనమన్నారు. అనంతరం కలెక్టర్ను ముస్లింలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ అబ్దుల్ మన్నన్ రజీ, జమియత్, జిల్లా అధ్యక్షుడు మౌలానా అబ్దుల్ హఫీజ్ ఖాస్మి, తదితరులు పాల్గొన్నారు. ఇఫ్తార్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
పరిమితికి మించి ప్రయాణించొద్దు
● విజిలెన్స్ ఏఎంవీఐ అపర్ణ పాలకుర్తి టౌన్: స్కూల్ బస్సులు, ప్రైవేట్ వాహనా ల్లో పరిమితికి మించి ప్రయాణికులను తరలించ వద్దు.. నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేస్తామని విజిలెన్స్ ఏఎంవీఐ అపర్ణ స్పష్టం చేశారు. శనివారం మండల కేంద్రంలో వాహనాల తనిఖీ చేపట్టారు. సకాలంలో ట్యాక్స్ చెల్లించని రెండు వాహనాలను ఈ సందర్భంగా సీజ్ చేశారు. అనంతరం స్థానిక ప్రైవేట్ పాఠశాల బస్సులను తనిఖీ చేశారు. విద్యార్థుల తరలింపునకు కాకుండా ప్రైవేట్ కార్యక్రమాలకు బస్సులు వినియోగిస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు. -
వీఆర్వోలు మళ్లొస్తుండ్రు
జనగామ: రెవెన్యూ వ్యవస్థలో అవనీతి పేరుకుపోయిందనే కారణం చేత గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీర్వోల వ్యవస్థను రద్దు చేసి.. ఉద్యోగుల అర్హత ఆధారంగా ఇరత శాఖల్లో విలీనం చేసింది. దీంతో రెవెన్యూ పరంగా గ్రామాల్లో కొంతమేర ఇబ్బందులు తలెత్తినప్పటికీ.. ఆ బాధ్యతలను వీఆర్ఏలకు అప్పగించారు. దీనిపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనా అప్పటి సర్కా రు వెనక్కి తగ్గలేదు. అధికారంలోకి రాగానే వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరిస్తామని సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ జీఓ జారీ చేశారు. రెవెన్యూ శాఖలో గ్రామ పరి పాలనా వ్యవస్థను బలోపేతం చేసేందుకు వీఆర్వో వ్యవస్థను తిరిగి తీసుకువచ్చే క్రమంలో వీఆర్వో, వీఆర్ఏలను రిటన్ బ్యాక్ తీసుకునేందుకు ‘గ్రామ పాలనా అధికారి’(జీపీఓ)గా పేరు మార్చారు. ఇందుకు సంబంధించి స్పష్టమైన విధివిధానాలు రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ధ్రువీకరణ పత్రాల జారీ, భూ వివాదాల విషయంలో సత్వర పరిష్కారం, విలువైన భూములను కాపాడడంతో పాటు రెవెన్యూ పరంగా వీఆర్వోల నియామకంతో తహసీల్దార్లపై కొంతమేర ఒత్తిడి తగ్గనుంది. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన తర్వాత ఐదేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత పేరు మార్చుకుని జీపీఓ గా ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరనున్నారు. జిల్లాలో 116 మంది వీఆర్వోల అంగీకారం మేరకు అదే హోదాలో ఉద్యోగంలో చేరునుండగా.. ఇంటర్, డిగ్రీ ఆధారంగా వీఆర్ఏలను తీసుకోనున్నారు. గత అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవాలి రద్ధయిన గ్రామ రెవెన్యూ అధికారిని ఎలాంటి షరతులు లేకుండా.. గత అనుభ వం, సీనియారిటీని పరిగణలోకి తీసుకుని ప్రమోష న్లు కల్పించేలా చూడాలి. గడిచిన ఐదేళ్ల నుంచి పదోన్నతులు, ఇంక్రిమెంట్లు లేక ఇబ్బందులకు గురైన వీర్వోలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఎప్పుడూ.. ఎవరూ తీసుకోని గొప్ప నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. – పెండెల శ్రీనివాస్, గ్రామ రెవెన్యూ అధికారుల జిల్లా జేఏసీ చైర్మన్ గ్రామ పాలనాధికారిగా పేరు మార్పు త్వరలో వెలువడనున్న విధి విధానాలు -
భక్తుల ఇంటికే భద్రాద్రి తలంబ్రాలు
జనగామ రూరల్: ఆర్టీసీ జనగామ డిపో లాజిస్టిక్(కార్గో) ద్వారా భక్తుల ఇంటికే శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలు అందించనున్నట్లు డిపో మేనేజర్ ఎస్.స్వాతి తెలిపారు. శనివారం ఆమె డిపోలో సీతారామ చంద్రస్వామి కల్యాణ పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. భక్తులు జనగామ బస్టాండ్ ఆవరణలోని కార్గో లాజిస్టిక్ ద్వారా బుక్ చేసుకోవచ్చ ని, మరిన్ని వివరాలకు 9154298762 నంబర్లో సంప్రదించాలని కోరారు. మహిళా రైతులకు చేయూతజనగామ రూరల్: వ్యసాయ యాంత్రీకరణకు 50 శాతం రాయితీతో మహిళా రైతులకు ప్రభుత్వం చేయూత అందిస్తున్నదని డీఏఓ రామారా వు నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు బ్యాటరీ పంపులు, తైవాన్ పంపులు, రొటోవేట ర్లు, విత్తనాలు నాటే మిషన్లు, కేజ్వీల్స్, కలుపు తీసే యంత్రాలు, గడ్డికట్టె యంత్రాలు, డ్రోన్లు, ట్రాక్టర్లు, నాగలి, పవర్ టిల్లర్ తదితర 289 యూనిట్ల వ్యవసాయ యంత్రాలు(రూ.69.89 లక్షలు) మంజూరయ్యాయని పేర్కొన్నారు. దరఖాస్తులను ఈనెల 25వ తేదీలోగా మండల వ్యవసాయాధికారులకు లేదా ఏఈఓలకు అందజేయాలని సూచించారు. ఎంపికైన రైతులు సంబంధిత కంపెనీలకు రాయితీ పోను మిగతా డబ్బులు డీడీ తీసి చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. నలుగురు విద్యార్థుల గైర్హాజరు జనగామ రూరల్: జిల్లాలో శనివారం రెండో రోజు జరిగిన పదో తరగతి హిందీ పరీక్షకు నలుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. 6,202 మంది విద్యార్థులకు 6,198 మంది పరీక్ష రాసినట్లు డీఈఓ రమేశ్ తెలిపారు. పట్టణంలోని ధర్మకంచ, సెయింట్ మేరీస్ సెంటర్లను కలెక్టర్ రిజ్వాన్ బాషా, కొడకండ్ల, పాలకుర్తి సెంటర్లను డీఈఓ సందర్శించారు. డాక్టర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం జనగామ: జిల్లాలోని వైద్య విధాన పరిషత్ పరిధిలోని స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి, జఫర్గఢ్, బచ్చన్నపేట సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కాంట్రాక్టు పద్ధతిన వైద్యుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరాంజనేయులు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గైనకాలజీ, పిల్లల వైద్య నిపుణులు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అనస్తీషియా, నేత్ర వైద్యులకు సంబంధించి ఎంబీబీఎస్ అర్హతగా పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 26న సాయంత్రం 5 గంటలలోపు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితో పాటు కలెక్టరేట్ రూం నంబర్–16లో దరఖాస్తు అందజేయాలన్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్(స్పెషలిస్టు)కు రూ.లక్ష, సివిల్ అసిస్టెంట్ సర్జన్(జీడీఎంఓ)కు నెలవారీ వేతనం రూ.52,351 ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు https://jangaon.telangana.gov.in వెబ్సైట్లో చూడవచ్చని పేర్కొన్నారు. ‘పీఎం కుసం’ స్కీం రైతులకు ఉపయోగం జనగామ రూరల్: ‘పీఎం కుసం’ స్కీం రైతుల కు ఎంతో ఉపయోగమని జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ వేణుమాధవ్ అన్నారు. శనివా రం జనగామ సర్కిల్ పరిధిలో టీజీ ఎన్పీడీసీ ఎల్, టీజీ రెడ్కో ఆధ్వర్యాన ిపీఎం కుసుం స్కీంపై రైతు సమూహాలు, సహకార సంఘాలకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ పథకం కింద జిల్లాలో 179 మంది రైతులు 242 మెగావాట్ల సోలార్ విద్యు త్ ఉత్పత్తి ప్లాంట్లకు రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. సదస్సులో డివిజనల్ ఇంజనీర్(టెక్నికల్) గణేష్, జనగామ డివిజనల్ ఇంజనీర్ లక్ష్మీనారాయణరెడ్డి, స్టేషన్ఘన్పూర్ డీఈ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం సేకరణ పక్కాగా చేపట్టాలి
జనగామ రూరల్: రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ పక్కాగా చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. రబీ ధాన్యం కొనుగోలుపై శనివారం కలెక్టరెట్లో అదనపు కలెక్టర్ రోహిత్సింగ్తో కలిసి వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. 3,75,453 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని, అందులో 2,35,954 మెట్రిక్ టన్నులు కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఇందులో 62,013 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం, 1,73,941 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం సేకరించనున్నట్లు తెలి పారు. ఈసారి జిల్లాలో 300 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో సన్న ధాన్యం సేకరణకు 119, దొడ్డు ధాన్యం సేకరణకు 181 సెంటర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇందులో సహకార సంఘాల ఆధ్వర్యాన 134 కేంద్రాలు, ఐకేపీ 164, డీసీఎంఎస్ 2 కేటాయించామన్నారు. నాణ్యతా ప్రమాణాలకు లోబడిన ధాన్యం తీసుకువచ్చి ఎ–గ్రేడ్ రకం క్వింటాకు రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధర పొందేలా రైతుల కు అవగాహన కల్పించాలని సూచించారు. మద్దతు ధరతో పాటు సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్ చెల్లించనున్నట్లు వివరించారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ గోపీరాం, డీఆర్డీఓ వసంత, సివిల్ సప్లయీస్ డీఎం హతీరామ్, డీఏఓ రామారావునాయ క్, కోఆపరేటివ్, మార్కెటింగ్ అధికారులు రాజేందర్రెడ్డి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సదుపాయలు కల్పించాలి కలెక్టర్ రిజ్వాన్ బాషా -
ఈజీఎస్ పనులను సద్వినియోగం చేసుకోవాలి
స్టేషన్ఘన్పూర్: ఈజీఎస్ పనులను సద్వినియోగం చేసుకోవాలని రాంచీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్, ఉపాధి హామీ పథకం డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్ జాన్డ్రీజ్ అన్నారు. మండల పరిధి అక్కపెల్లిగూడెంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన పనులను ఆయన శనివారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు ఈజీఎస్ పనులను బాగా వినియోగించుకుంటున్నారని తెలిపారు. సాగులో లేని భూమిని సాగులో కి తేవడం, వ్యవసాయ భూముల వద్దకు రోడ్లు వేయడం, పొలం గట్లపై కొబ్బరి, టేకు, నిమ్మ చెట్లు పెంచడం బాగుందని అభినందించారు. ఉపాధి హామీ పథకం డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్ జాన్డ్రీజ్ -
అకాల వర్షం.. మక్క రైతు ఆగం
జనగామ: కరువుతో పంటల దిగుబడి కోల్పోయి నష్టపోయిన రైతులు.. అకాల వర్షాలతో మరింత ఆగమై పోతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఆకస్మికంగా కురిసిన వాన మక్క రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. జిల్లాలో యాసంగి సీజన్ సాగు చేసిన మక్కజొన్న పంటను రైతులు అమ్ముకునేందుకు జనగామ వ్యవసాయ మార్కెట్కు వస్తున్నారు. గింజలు పచ్చిగా ఉండి తేమ శాతం ఎక్కువ చూపిస్తోంది. గిట్టుబిటు ధర పొందడానికి కాటన్ యార్డులో ఆరబోసుకుని రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వారం రోజుల నుంచి చెబుతున్నారు. అయితే శుక్రవారం అర్ధరాత్రి రైతులు గాఢనిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా కుండపోతగా వాన పడింది. రైతులు మేల్కొని చూసేసరికి గింజలు నీటిలో మునిగిపోవడమే కాకుండా వరదలో కొట్టుకుపోతుండగా కాపాడుకోవడానికి విశ్వప్రయత్నం చేశారు. మక్కల కుప్పల వద్ద పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. నీటిలో మునిగిన మక్కలను వేరు చేయగా.. కొంతమేర గింజలు నలుపురంగుకు వచ్చాయి. మరో రెండురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. పడిపోయిన ధర మార్కెట్లో శనివారం మక్కలకు ధర పడిపోయింది. అకాల వర్షాల భయంతో రైతులు తక్కువ ధరకు అమ్ముకున్నారు. మక్కలు తడిసి పోవడంతో వ్యాపారులు తేమ సాకుతో క్వింటాకు రూ.150 నుంచి రూ.250 వరకు తగ్గించారు. ప్రైవేట్లో రూ.2,400 నుంచి రూ.2,500 వరకు ధర పలుకుతుండగా.. మార్కెట్లో రూ.1,855, రూ.1,925, రూ.2,066 ధరతో కొనుగోలు చేశారు. మక్కలకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ ధర తగ్గించడంపై రైతులు మండి పడుతున్నారు. మార్కెట్లో తడిసిన మొక్కజొన్నలు నిద్రలేచే సరికి నీళ్లలో గింజలు.. లబోదిబోమంటున్న అన్నదాతలు -
డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు నిర్వహించలేం
● కేయూ రిజిస్ట్రార్కు ప్రైవేట్ యాజమాన్యాల వినతి కేయూ క్యాంపస్: ‘కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం విడుదల చేయడంలేదు.. దీంతో ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నాం.. అందుకే రాబోయే రోజుల్లో యూనివర్సిటీ డిగ్రీ కోర్సుల 2,4,6 సెమిస్టర్ల పరీక్షలు నిర్వహించలేం’ అని ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ బాధ్యులు స్పష్టం చేశారు. ఈమేరకు శుక్రవారం రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రాన్ని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్రావు మాట్లాడుతూ గత 20 నెలలకు సంబంధించిన ఫీజులు చెల్లించకపోవడంతో కళాశాలల యాజ మాన్యాలు ఇబ్బందులకు గురవుతున్నాయన్నారు. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దని, ఆర్టీఎఫ్ ద్వారా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పడంతో నిరీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కొన్ని యాజమాన్యాలు అప్పులు చేసి కళాశాలలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కళాశాలలు నిర్వహించే పరిస్థితి లేదని, ఈనెల 25 వరకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సుమారు రూ.2,500 కోట్లు చెల్లించని పక్షంలో ఏప్రిల్లో డిగ్రీకోర్సుల 2,4,6 సెమి స్టర్ల పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. రిజిస్ట్రార్ను కలిసిన వారిలో అసోసియేషన్ కేయూ అధ్యక్షుడు ఉపేందర్రెడ్డి, కార్యదర్శి ప్రభాకర్రెడ్డి, ఆర్థిక కార్యదర్శి జి.వేణుమాధవ్, ఇతర బాధ్యులు ఉన్నారు. -
ప్రైవేట్ అప్పులు తీర్చేందుకు అదనపు రుణాలు
వరంగల్ లీగల్ : రైతుల ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం బ్యాంకుల నుంచి పంట రుణాలకు అదనంగా దీర్ఘకాలిక రుణాలు పొందేందుకు రైతులు దరఖాస్తులు చేసుకోవాలని హనుమకొండ, వరంగల్ జిల్లాల న్యాయసేవాధికార సంస్థల కార్యదర్శులు జడ్జి క్షమాదేశ్ పాండే, ఎం.సాయికుమార్ సూచించారు. శుక్రవారం తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు అధ్యక్షతన జిల్లా కోర్టు ఆవరణలో బ్యాంకర్లు, రెవెన్యూ అధికారులు, వ్యవసాయాధికారులు, రైతులతో హనుమకొండ, వరంగల్ న్యాయసేవాధికారి కార్యదర్శులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరిరావు మాట్లాడుతూ.. జిల్లా న్యాయసేవాధికార సంస్థల కార్యదర్శుల సూచన మేరకు అర్హులైన రైతులందరికీ ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి అదనపు రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. సమావేశంలో తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కిషన్రావు, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్, తిరుపతి, రాజు, బాపురావు, సీఐఎస్ఎఫ్ కోఆర్డినేటర్ తోకల్ ఆదిరెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి రవికుమార్, బ్యాంకర్లు, వ్యవసాధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
పంటను తరలిస్తూ పరలోకాలకు..
దంతాలపల్లి: ఆరుగాలం కష్టం చేసి చేతికొచ్చిన పంటను తరలిస్తూ.. ఓ రైతు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రామ శివారులో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామ శివారు దుబ్బతండాకు చెందిన జాటోత్ రమేష్(35)కు బొడ్లాడ గ్రామ శివారులో వ్యవసాయ భూమి ఉంది. తన చేనులో పండిన మొక్కజొన్న కంకులను ట్రాక్టర్ సాయంతో స్వయంగా ఒకచోటుకు తరలిస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్లో పోసిన కంకులను అన్లోడ్ చేసిన అనంతరం ట్రాలీ కిందకు దిగలేదు. దీంతో సరిచేసే క్రమంలో ట్రాలీ ఒక్కసారిగా రమేష్పై పడడంతో మృతి చెందాడు. మృతుడికి భార్య లీల, ఇద్దరు కుమారులు చేతన్, రంజిత్ ఉన్నారు. లీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై రాజు తెలిపారు. అప్పుల బాధతో మొక్కజొన్న రైతు ఆత్మహత్యవెంకటాపురం (కె): అప్పులబాధతో మొక్కజొన్న రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండలం బర్లగూడెం పంచాయతీ పరిధి చిరుతపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. చిరుతపల్లి గ్రామానికి చెందిన లుక మధుకృష్ణ (29) అనే రైతు రెండెకరాల్లో బాండ్ మొక్కజొన్న సాగు చేశాడు. చేను దిగుబడి రాక పోవడంతో పెట్టిన పెట్టుబడి రాక రూ.లక్ష మేర అప్పుల పాలయ్యాడు. దీంతో మనస్తాపానికి గురై గురువారం ఉదయం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే వెంకటాపురం వైద్యశాలకు తరలించి చికిత్స నిర్వహించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎంకు తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. -
సాగునీరు అందించాలని రైతుల ఆందోళన
బచ్చన్నపేట : నీరు లేక వరి పొలాలు ఎండిపోతున్నాయి.. సాగునీరు అందించి పంటలు కాపాడాలని డిమాండ్ చేస్తూ మండలంలోని వంగ సుదర్శన్రెడ్డినగర్ గ్రామం వద్ద జనగామ– సిద్దిపేట రహదారిపై కట్కూర్, వీఎస్ఆర్నగర్ గ్రామాల రైతులు శుక్రవా రం ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గత ఏడాది మాదిరిగా గోదావరి జలాలు వస్తాయని ఆశించి పంటలు సాగు చేయగా.. నీరు రాక 45 శాతం వరకు వరి పొలాలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిన పంటలను వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి ఎకరాకు రూ. 50వేల పరిహారంచెల్లించాలని డిమాండ్ చేశారు. మాజీ సర్పంచ్లు కోనేటి స్వామి, మూసిని సునీత, నాయకులు ఓరుగంటి శ్రీనివాస్, ఎల్లయ్య, రాజు, శ్రీశైలం, గొడుగు శ్రీనివాస్, బుల్లి అయిలయ్య, యాదయ్య, రవి, మహేష్, బాల్నర్సయ్య, సిద్దిరాజయ్య, సాయిలు, ప్రశాంత్ తదితరులుపాల్గొన్నారు. -
వంటల్లో నూనె తగ్గించండి
అధిక నూనెతో అనర్థాలుఅధిక నూనె వినియోగంతో ఊబకాయం, గుండె జబ్బు, జీర్ణ సమస్యలు వస్తున్నాయి. విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంతో పాటు తక్కువ నూనెతో తాజా, పోషకమైన భోజనం తయారు చేసి వడ్డించేలా చూడాలి. విద్యార్థులకు అందించే ఫోర్టిఫైడ్ ఎడిబుల్ ఆయిల్లో విటమిన్ ఏ, డీ సమృద్ధిగా ఉంటుందని గమనించాలి. అలాగే పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన న్యూట్రిషన్ గార్డెన్ కూరగాయలను వినియోగించడం ద్వారా విద్యార్థులు గార్డెన్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు పౌష్టికాహారంపై అవగాహన, ప్రకృతితో కనెక్టివిటీ పెరుగుతుంది. తక్కువ నూనె ఆహారంపై హోమ్ సైన్స్ కళాశాల, వైద్యులు, పోషకాహార నిపుణులచే తరగతి గదిలో సెమినార్లు నిర్వహించాలి.జనగామ: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. చిన్న తనంలోనే ఊబకాయం, జీర్ణకోశ సంబంధిత సమస్యలు, గుండె జబ్బుల బారిన పడుతుండంతో మధ్యాహ్న భోజనం తయారీలో స్వల్ప మార్పులు తీసుకువస్తూ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రోజువారీగా మధ్యాహ్న భోజనంలో కూరల్లో 10 శాతం వంట నూనె తగ్గించాలని పేర్కొనడంతో పాటు.. ఆరోగ్యకరమైన పలు సూచనలు చేసింది. బాల్యంలోనే ఆరోగ్య సమస్యలు బాల్యంలోనే ఊబకాయం సమస్య తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శ్రీపరీక్షా పే చర్చా–2025, మన్ కీ బాత్శ్రీ కార్యక్రమాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. 1990 సంవత్సరంలో అధిక బరువుతో 0.4 మిలియన్ల ప్రజలు ఉండగా.. ప్రస్తుతం 15 నుంచి 19 ఏళ్ల వయసు మధ్య 12.5 మిలియన్లకు చేరుకుందని లాన్సెట్ జర్నల్ లెక్కల ప్రకారం నివేదించారు. ఇందులో అమ్మాయిల కంటే అబ్బాయిలే అధికంగా ఉన్నారని అందులో పేర్కొన్నారు. జీవన శైలి, ఆహార అలవాట్లలో మార్పులు రావడంతో అనేక రోగాల బారిన పడుతున్నారని గుర్తించారు. దీంతో బడిలో వడ్డించే మధ్యాహ్న భోజనంలో 10 శాతం వంట నూనె వినియోగాన్ని తగ్గించడంతో పాటు ఆచరణాత్మక సలహాలను సూచిస్తూ రాష్ట్రాలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వంట నూనె వినియోగంపై ఎస్ఎంసీల ఆధ్వర్యాన ప్రత్యేక సమావేశాలు, డిబేట్లు, వ్యాసరచన పోటీల ద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవగాహన కల్పించాలి. అలాగే కుక్, హెల్పర్లలకు శిక్షణ ఇవ్వాలి. అదనపు కేలరీలను ఖర్చు చేయడానికి విద్యార్థులకు వ్యాయామం, యోగా ప్రాముఖ్యతను వివరించాలి. నూనెతో డీప్ ఫ్రై చేయడానికి బదులు గ్రిల్లింగ్, స్టీమింగ్, బేకింగ్ వంటి ఆరోగ్యకరమైన వంట పద్ధతులను అవలంభిస్తే మేలని కేంద్రం సూచించింది. ఆహారపు అలవాట్లపై పోటీలు.. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై పాఠశాల స్థాయి క్విజ్, వ్యాసరచన, ఏకో క్లబ్ కార్యకలాపాలు, సమూహంగా చర్చలు, తదితర పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందించాలి. వ్యాయామం, యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ.. విద్యార్థులు ఆరోగ్యకరమైన జీవనశైలిని పొందే విధంగా ఉపాధ్యాయులు చొరవ చూపించాలి. ప్రతి విద్యార్థి శారీరక శ్రమను పెంచేందుకు తల్లిదండ్రులకు మార్గనిర్దేశం చేస్తూ శిక్షణ ఇవ్వాలి. ఇంట్లోనూ తక్కువ నూనె వాడకాన్ని ప్రోత్సహించేలా సోషల్ మీడియాలో చిత్రాల ద్వారా ప్రచారం చేపట్టాలి. 10శాతం తగ్గించిన నూనెతో కూడిన ఆహార పదార్థాలను అందించేందుకు పాఠశాల క్యాంటీన్లను ప్రోత్సహించాలని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను మరింత బలోపేతం చేసేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తూ పాఠశాల నిర్వహణ కమిటీల ఆధ్వర్యాన సమావేశాలు నిర్వహించాలి.బాల్యంలోనే ఊబకాయం సమస్య విద్యార్థుల్లో ఆరోగ్య అలవాట్లు పెంపొందించాలి న్యూట్రిషన్ గార్డెన్ కూరగాయలు వాడాలి కేంద్ర ఉత్తర్వులు.. డీఈఓలకు ఆదేశాలు -
బడుగులపైకి దూసుకొచ్చిన లారీ
రోడ్డుపక్కనే గుంతలోకి దూసుకెళ్లిన ఆటోఅప్రమత్తమైన ఆటోడ్రైవర్మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చెర్లపాలెంకు చెందిన ఆటోలో అదే గ్రామానికి చెందిన 14 మంది, పక్కనే ఉన్న ఫత్తేపురానికి చెందిన ముగ్గురు.. మొత్తం 17 మంది కూలీలు మిరపతోటలను ఏరడానికి శుక్రవారం ఉదయం మరిపెడ మీదుగా ఖమ్మం జిల్లాలోని తిరుమలా యపాలెం మండలానికి ఆటోలో బయల్దేరారు. ఈక్రమంలో పెద్దనాగారం స్టేజీ సమీపంలోని ఇటుక బట్టీల సమీపంలో మరిపెడ వైపునకు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి లారీ అతివేగంతో వస్తూ ఢీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న దర్మారపు సోమక్క, దర్మారపు సునీత, దర్మారపు ఉప్పలమ్మ, గూడెల్లి దుర్గ, గూడెల్లి అరుణ, డ్రైవర్ దర్మారపు పవన్కు తీవ్ర గాయాలు, మిగతా వారి స్వల్ప గాయాలు కావడంతో క్షతగాత్రులను మూడు అంబులెన్స్లలో మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చెర్లపాలెంకు చెందిన గూడెల్లి అరుణ(40)మృతి చెందింది. ప్రమాదానికి మూలమలుపే కారణమా.. వరంగల్– ఖమ్మం హైవేపై పెద్దనాగారం స్టేజీ సమీపంలో ఇటుక బట్టీల వద్ద గతంలో సైతం ప్రమాదాలు జరిగాయి. దీంతో ప్రమాదాలకు మూలమలుపే కారణమని, మూలమలుపు వద్ద లారీ అతివేగంతో నియంత్రణ కోల్పోయి వెనుకనుంచి కూలీల ఆటోను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఉలిక్కిపడ్డ చర్లపాలెం.. మిరపతోటలను ఏరడానికి వెళ్తున్న కూలీల ఆటో ప్రమాదా నికి గురికావడంతో చెర్లపాలెం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కూలీల బంధువులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఎస్సై సురేష్ ఘటన స్థలాన్ని సందర్శించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదంలో ముళ్ల పొదల్లోకి వెళ్లిన ఆటో వాళ్లందరు రోజువారీ కూలీలు.. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి.. స్వగ్రామంలో పనిదొరక్క.. పనిని వెతుక్కుంటూ.. ప్రతీ రోజు యాబై కిలోమీటర్లు ఆటోలో వెళ్లి పనిచేసి తిరిగి ఇంటికొస్తారు.. రోజువారీ మాదిరిగానే.. శుక్రవారం కోడికూత వేళకు లేచి మధ్యాహ్నానికి సద్దిమూట పెట్టుకొని కూలీకోసం ఆటోలో బయల్దేరారు. ఈక్రమంలో మూలమలుపు వద్ద లారీ.. వీరి ఆటోమీదకు దూసుకొచ్చింది. దీంతో డ్రైవర్ రోడ్డు పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి ఆటోని తిప్పాడు.. రోడ్డుపక్కనే వేసిన సిమెంట్ దిమ్మెకు తాకి ఆటో బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. – నర్సింహులపేటఆటోడ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం కూలీల ఆటో పెద్దనాగారం సమీపంలోని మూలమలుపు వద్దకు రాగానే లారీ ఒక్కసారిగా ఆటోవైపు దూసుకొచ్చింది.. అంతా లారీ కింద పడిపోయామని భావించగా.. ఆటో నడుపుతున్న దర్మారపు పవన్ అప్రమత్తమై.. పక్కనే ఉన్న చెట్లపొదల్లోకి ఆటోను తిప్పాడు. అప్పటికే వేగంతో ఉన్న ఆటో అదుపుతప్పి పొదల్లోని సిమెంట్ దిమ్మెను తగిలి పల్టీ కొట్టింది. లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయేకంటే గాయపడడం మేలనే ఉద్దేశంతో ఆటోను రోడ్డు పక్కకు తిప్పనట్టు డ్రైవర్ పవన్ ఏడుస్తూ చెప్పడం అందరిని కంటతడి పెట్టించింది. -
ఉత్సాహంగా రూబిజెస్ట్ – 2025
ర్యాంప్ వాక్, నృత్యం చేస్తున్న విద్యార్థినులు● కేయూ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహణ ● ఆకట్టుకున్న విద్యార్థినుల ర్యాంప్ వాక్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో రూబిజెస్ట్– 2025లో భాగంగా శుక్రవారం థిమ్ డే వేడుకలను ఉత్సాహంగా కొనసాగాయి. ప్రోగ్రాం కన్వీనర్ సాయి తరుణ్, వివిధ ఆర్గనైజర్ల ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఆడిటోరియంలో కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయా ఉత్సవాలను ప్రారంభించారు. ఈ వేడుకల్లో కేరళ సంప్రదాయ దుస్తులు ధరించి మహిళా అధ్యాపకులు చేసిన ర్యాంప్ వాక్ ఆకట్టుకుంది. అంతే కాకుండా వారు ఇచ్చిన సోలో, గ్రూప్ డ్యాన్స్లు ఆకర్షణగా నిలిచాయి. జాతీయ స్థాయిలో ఉన్న వివిధ ప్రాంతాల, సంప్రదాయ నత్య రీతులవారు ధరించే దుస్తులను ధరించి కళాశాల విద్యార్థినులు చేసిన ర్యాంప్ వాక్ ఆకట్టుకుంది. వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ర్యాంప్ వాక్ ప్రదర్శనలో నిలిచిన బీటెక్ ఈసీఈ విభాగం ప్రథమ సంవత్సరం విద్యార్థిని సుదూప్తికి ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ వేణుగోపాల్రెడ్డి బహుమతి అందజేశారు. -
పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలి
ఖిలా వరంగల్: అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కొనసాగుతున్న వరంగల్ రైల్వేస్టేషన్ పునరుద్ధరణ పనులను శరవేంగా పూర్తి చేయాలని దక్షణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం వరంగల్ రైల్వేస్టేషన్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అమృత్ భారత్ స్టేషన్ స్కిమ్ (ఎబీఎస్ఎస్) కింద రూ.25.41కోట్లలో జరుగుతున్న పాదచారుల వంతెన(ఫుట్ ఓవర్ బ్రిడ్జి), 3 లిఫ్టులు, 4 ఎస్కలేటర్లు, లిఫ్ట్లు, గ్రీనరీ పనులను పరిశీలించారు. అంతకు ముందుగా రైల్వే కోచ్ రెస్టారెంట్ను తిలకించారు. అనంతరం జీర్పీ పోలీసులకు నూతన భవనం నిర్మించాలని జీఎంకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఎం భరతేష్కుమార్, సీనియర్ డీసీఎం బాలాజీ కిరణ్, స్టేషన్ మేనేజర్ బాలరాజ్నాయక్, సీసీఐ రాజగోపాల్, ఆర్పీఎఫ్ సీఐ సీఎస్ ఆర్ కృష్ణ, జీర్పీ సీఐ సురేందర్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. జీఎం అరుణ్కుమార్ జైన్ -
ఆస్పత్రిలో ఆర్తనాదాలు..
నెహ్రూసెంటర్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురావడంతో వారి ఆర్తనాదాలతో ఆస్పత్రి మార్మోగింది. చేతులు, కాళ్లు, మెడ, తల ఇలా.. శరీరమంతా గాయాలతో వచ్చిన ప్రమా ద బాధితులతో ఆస్పత్రిలో ఎక్కడ చూసినా రక్తం కనిపించింది. బాధితుల్లో ఒకరు మృతి చెందగా మిగిలిన కూలీలు చికిత్స పొందుతున్నారు. బాధితులకు వైద్యం అందుతున్న విధానాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఆర్ఎంఓ డాక్టర్ జగదీశ్వర్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకట్ పర్యవేక్షించారు. కాగా, తీవ్రంగా గాయపడిన గూడెల్లి మంగమ్మ, దర్మారపు సాలమ్మ, దర్మారపు యాకమ్మను వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్పార్టీ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్ గుగ్గిళ్ల పీరయ్య, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుడ్డెల రాంమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వీరయ్య, గణేష్, తదితరులు గాయపడినవారిని పరామర్శించారు. -
ఒకే దేశం, ఒకే ఎన్నిక నష్టమే..
కేయూ క్యాంపస్: భిన్నత్వంలో ఏకత్వంతో కూడిన భారతీయ సమాజానికి ‘ఒకే దేశం– ఒకే ఎన్నిక’ నష్టదాయకమని ప్రముఖ సామాజిక వేత్త హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ హరగోపాల్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ సెనెట్ హాల్లో రాజనీతిశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘భారత సమాజంలో సంకీర్ణ ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు ఓటర్లను ఆకర్షించడానికి ఉపయోగపడుతున్నప్పటికీ వాటి అమలులో మాత్రం చిత్తశుద్ధి లోపిస్తోదన్నారు. దేశంలోని విభిన్న జాతులు, కులాలు, మతాలు, బహుళ సంస్కతి, సంప్రదాయాలతో కలిసిమెలిసి జీవిస్తున్న ప్రజల హక్కులు, ప్రజాస్వామ్యానికి సంకీర్ణ ప్రభుత్వాలతోనే రక్షణ సాధ్యమని ఆయన అన్నారు. నిత్యం ప్రజలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరిస్తూ.. ప్రజల జీవితాల్లో మెరుగైన మార్పులు తెచ్చి సమాజాన్ని శాసీ్త్రయంగా విశ్లేషిస్తూ ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడమే రాజకీయ పార్టీల ప్రధాన కర్తవ్యంగా ఉండాలన్నారు. నేటి రాజకీయ పార్టీలు కార్పొరేట్ శక్తుల ధన ప్రలోభాలకు లోనై ఓటర్లను ప్రభావితం చేయడం ప్రజాస్వామ్య ఉనికికి ప్రమాదకరమన్నారు. 1960 దశకం చివరి నుంచి దేశంలో ప్రభుత్వాల ఏర్పాటులో ప్రాంతీయ పార్టీల ప్రభావం పెరిగిందన్నారు. 1991లో దేశంలో నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు, గ్లోబలైజేషన్ ప్రభావంతో సమాజంలో మానవీయ సంబంధాలు కనుమరుగై, మార్కెట్ సంబంధాలు పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాద సంస్థల్లో మార్పు తీసుకొచ్చేందుకు కార్పొరేట్ శక్తులతో ఏర్పడిన అసమాన సమాజాన్ని తొలగించేందుకు మానవీయ శాస్త్రాలు, రాజనీతి శాస్త్ర ప్రాముఖ్యత అవసరమన్నారు. నేటితరం విద్యార్థులు సమాజ అభివృద్ధి కోసం ప్రశ్నించేతత్వాన్ని, ప్రజాస్వామిక లక్షణాలను పెంపొందించుకోవాలని హరగోపాల్ సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. ప్రాంతీయ పార్టీలతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉంటాయని గుల్బర్గా యూనివర్సిటీ యాక్టింగ్ వీసీ ప్రొఫెసర్ శ్రీరాములు అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణమైన పాలన అందిస్తేనే ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు, సంకీర్ణ ప్రభుత్వాలకు మనుగడ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, ముంబాయి యూనివర్సిటీ ప్రొఫెసర్ జోష్ జార్జ్, సోషల్ సైన్స్ డీన్ మనోహర్, రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సంకినేని వెంకటయ్య, బీఓఎస్ చైర్మన్ డాక్టర్ గడ్డం కృష్ణ, అధ్యాపకులు సత్యనారాయణ, నాగరాజు, లక్ష్మీనారాయణ, సంజీవ్, భాగ్యమ్మ, లలిత కుమారి, విజయ్, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను రిజిస్ట్రార్ రామచంద్రం ప్రారంభించారు. సంకీర్ణ ప్రభుత్వాలతోనే ప్రజాస్వామ్యానికి రక్షణ ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్ హరగోపాల్ -
ఆస్పత్రుల్లో ఎన్క్వాస్
జనగామ: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు ఆరోగ్య సంరక్షణ సేవల నాణ్యతను మెరుగు పరిచేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్(ఎన్క్యూఏఎస్) అమలు చేస్తోంది. మెటర్నిటీ, జిల్లా ఆస్పత్రులు, సీహెచ్సీ, పీహెచ్సీ, సబ్సెంటర్ల పరిధిలో నాణ్యమైన సేవలకు గాను ‘ఎన్క్వాస్’ అర్హత సర్టిఫికెట్ జారీ చేస్తారు. అర్హత సాధించిన తర్వాత మూడేళ్ల పాటు ఆస్పత్రులకు కేటగిరీల వారీగా కేంద్రం నిధులు ఇస్తుంది. 2024–25, 26, 27 సంవత్సరాలకు గాను మొదటి విడతలో జిల్లాలోని పీహెచ్సీ, సీహెచ్సీలను ఎంపిక చేశారు. దేవరుప్పుల మండలం చిన్నమడూరు సబ్సెంటర్ సేవలకు సంబంధించి ఎన్క్వాస్ బృందం ఆన్లైన్లో వివరాలను సేకరించింది. 4 పీహెచ్సీలు.. 8 సబ్సెంటర్ల ఎంపికజిల్లాలో 16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 104 సబ్ సెంటర్లు, 62 పల్లె దవాఖానలు, ఒక బస్తీ దవాఖాన, 4 సీహెచ్సీలు, ఒక జిల్లా ఆస్పత్రి, ఒక ఎంసీహెచ్ ఉన్నాయి. కాగా పీహెచ్సీల పరిధిలో 20 స్టాఫ్నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ కోసం జిల్లాలోని 4 పీహెచ్సీలు, 8 సబ్ సెంటర్లను ఎంపిక చేశారు. ఇందులో ఇప్పగూడెం, తాటికొండ, ఓబుల్కేశ్వాపూర్, కొడకండ్ల పీహెచ్సీలు, చిన్నమడూరు, ఆలీంపూర్, గూడూరు, సిద్ధెంకి, వడ్లకొండ, కుందారం, కోమటిగూడెం, ఉప్పుగళ్లు సబ్ సెంటర్లు ఉన్నాయి. నిర్వహణ అంశాలుఆస్పత్రిలో ఆరోగ్య సంరక్షణ, నాణ్యతా ప్రమాణాలు, మౌలిక వసతులు, సిబ్బంది పనితీరు, రోగి సంరక్షణ, ఆస్పత్రి నిర్వహణ, ఇన్ఫెక్షన్స్ నియంత్రణ, మార్గదర్శకాలను పాటించడం, అత్యవసర సేవలు, ఖచ్చితమైన రోగ నిర్థారణ, శస్త్ర చికిత్స విధానంలో భద్రత, నైపుణ్యం, సమర్థవంతంగా ఫార్మసీ నిర్వహణ, పరిశుభ్రమైన శానిటేషన్, సపోర్ట్ సర్వీసెస్, క్లినికల్ కేర్, ఓపీ సేవలు, వైద్య పరికరాల నిర్వహణ తదితరాలకు సంబంధించి నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ నిబంధనల ప్రకారం మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. అర్హత అనంతరం నిధులు ఇలా..ఎన్క్వాస్కు అర్హత సాధించిన సబ్ సెంటర్లకు మూడేళ్ల పాటు ఏడాదికి రూ.50 వేల చొప్పున కేంద్రం బడ్జెట్ రిలీజ్ చేస్తుంది. గత ఏడాది ఉప్పుగల్, మల్కపూర్, రఘునాథపల్లి, స్టేషన్ఘన్పూర్, లింగాలఘణపురం, దేవరుప్పుల పీహెచ్సీలు ఎన్క్వాస్కు ఎంపిక కాగా.. ఏడాదికి ఒకసారి నిధులు వస్తున్నాయి. ఆరోగ్య సంరక్షణ.. వైద్యసేవల పరిశీలన నాణ్యతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి అర్హత సాధిస్తే మూడేళ్ల పాటు నిధులు 4 పీహెచ్సీలు.. 8 సబ్సెంటర్ల ఎంపిక‘ఎన్క్వాస్’ పరిశీలించే కేటగిరీలు ఆస్పత్రిలో తగిన మౌలిక సదుపాయాలు, శుభ్రమైన వాతావరణం, అవసరమైన వైద్య పరికరాల నిర్థారణ అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వరకు రోగి సంరక్షణ, వైద్య సేవల నాణ్యత, పర్యవేక్షణ ఆస్పత్రిలో సంక్రమించే ఇన్ఫెక్షన్లను నివారించడానికి ప్రొటోకాల్ అమలు ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి క్రమంతప్పకుండా శిక్షణ, మూల్యాంకనం రోగి రికార్డుల నిర్వహణ పేషెంట్ల పట్ల గౌరవ మర్యాదలుఆన్లైన్, ఆఫ్లైన్ పరిశీలన.. జిల్లాలో ఎన్క్వాస్ కోసం 4 పీహెచ్సీలు, 8 సబ్ సెంటర్లు ఎంపిక చేశాం. మొదటి విడతలో దేవరుప్పుల మండలం చిన్నమడూరు సబ్సెంటర్లో రోగులకు అందజేస్తున్న సేవలను ఎన్క్వాస్ బృందం ఆన్లైన్ ద్వారా తెలుసుకుంది. గుర్తించిన సబ్ సెంటర్లను విడతల వారీగా ఆన్లైన్ ద్వారా పరిశీలిస్తారు. పీహెచ్సీలను మాత్రం నేరుగా సందర్శిస్తున్నారు. – మల్లికార్జున్రావు, జిల్లా వైద్యాధికారి -
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
జనగామ రూరల్: ఈ–కుబేర్లో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల అన్ని రకాల బిల్లులు ఈనెల 31లోగా చెల్లించా లని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారిందని, పిల్లల చదువులు, వైద్యం తదితర అవసరాల కు ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. గతంలో అన్ని రకాల బిల్లులు వారం రోజుల లోపు చెల్లించే వారని, ఇప్పుడు సంవత్సరాలు గడిచినా చెల్లింపులు జరగడం లేదని ఒక ప్రకటనలో విమర్శించారు. నేడు ‘డయల్ యువర్ డీఎం’జనగామ రూరల్: ఆర్టీసీ జనగామ డిపోలో శనివారం ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్ర మం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ స్వాతి ఒక ప్రకటనలో తెలిపారు. డిపో పరిధిలోని బచ్చన్నపేట, దేవరుప్పుల, లింగాలఘణపు రం, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లి, మద్దూర్, పాలకుర్తి మండలాల గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సు సర్వీస్ సేవలకు సంబంధించి సమస్యలతో పాటుగా సూచనలు సలహాలను ఉదయం 11.00 నుంచి 12.00 గంట ల వరకు 9959226050 నంబర్లో తెలియజేయాలని సూచించారు. బచ్చన్నపేటలో వర్షంజనగామ: కొద్ది రోజులుగా మండుతున్న ఎండలతో అల్లాడి పోతున్న ప్రజలకు చల్లని వర్షం కాసింత ఉపశమనం కలిగించింది. శుక్రవారం రాత్రి మండలంలో అరగంట పాటు కురిసిన వానతో వాతావరణం చల్లబడింది. ఎండుతు న్న వరి పంటకు స్వల్పంగా ఊపిరి పోసినట్ల యింది. మరో రెండు రోజులపాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో పొట్టదశలో ఉన్న వరి గింజలు రాలిపోతాయని ఓ పక్క రైతులు ఆందోళన చెందుతుండగా.. నీటి తడి అవసరమ య్యే పంటలకు కొంత మేలు జరుగుతుందని మరికొంతమంది భావిస్తున్నారు. ‘యువ వికాస’ పథకానికి దరఖాస్తు చేసుకోవాలిజనగామ రూరల్: రాజీవ్ యువ వికాసం పథకానికి నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమాధికారి రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన నిరుద్యోగ యువత స్వయం ఉపాధికి ఈ పథకం ఉపయోగపడుతుందని, అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో obmms పోర్టల్ ద్వారా ఏప్రిల్ 5వ తేదీలోగా నమోదు చేసుకో వాలని సూచించారు. మరిన్ని వివరాలకు కలెక్టరేట్లోని కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. సోమేశ్వరాలయ హుండీ ఆదాయం రూ.14,79,121పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.14,79,121 వచ్చినట్లు ఈఓ మోహన్బాబు తెలిపారు. ఈ ఏడాది జనవరి 18 నుంచి ఈనెల 21 వరకు భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను శుక్రవారం ఆలయ కల్యాణ మండపంలో దేవా దాయ ధర్మాదాయ శాఖ భువనగిరి ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి పర్యవేక్షణలో లెక్కించారు. -
సమస్యల పరిష్కారమే ధ్యేయం
● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి జనగామ రూరల్: ఉపాధ్యాయుల సమస్యల పరి ష్కారమే ధ్యేయమని నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుడు పింగిలి శ్రీపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో ఎన్ఆర్ గార్డెన్లో పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు మహిపాల్రెడ్డి ఆధ్వర్యాన అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొదట నెహ్రూ పార్కు నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాల్రెడ్డి మాట్లాడుతూ.. నిలిచి పోయిన ఉపాధ్యాయ పదో న్నతులు, బదిలీల పునరుద్ధరణ, అందరికీ నగదు రహిత ఆరోగ్య కార్డులు అందించడమే లక్ష్యమన్నా రు. అందరికీ అందుబా టులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర సంఘం అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్రెడ్డి, నాయకుడు నూకల ఎల్లారెడ్డి, వివిధ సంఘాల జిల్లాల బాధ్యులు మిర్యాల సతీష్రెడ్డి, మంద తిరుపతిరెడ్డి, శ్రీహరి, రవీందర్రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గంగిశెట్టి మనోజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాకు పాపన్న పేరు పెట్టాలి
● గౌడ సంఘాల నాయకులు జనగామ: జిల్లాకు పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాల ని తెలంగాణ గౌడ సంఘాల సమన్వ య వేదిక నాయకులు అంబాల నారా యణగౌడ్, వంగ సదానందంగౌడ్, పంజాల జైహింద్గౌడ్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో వేదిక సమన్వయర్త కన్న పరశురాములు గౌడ్ అధ్యక్షతన హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యా ల, సిద్దిపేట, యాదాద్రి, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాల గౌడ సంఘాల వేదిక ఆధ్వర్యాన చేపట్టిన దీక్షలో వారు మాట్లాడారు. అంతకు ముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీగా తరలివచ్చారు. బహుజన కులాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. చీపురు మల్లేశ్ యాదవ్, చల్లా సుధీర్రెడ్డి, అంకెనపల్లి వేంకటేశ్వర్లు, సానాడి రాజు, గిద్ద రాంనర్సయ్య, గొలుసుల దుర్గాచలం, బొమ్మెణ రాజుగౌడ్, మిట్టపల్లి విజయ్కుమార్గౌడ్, యాదగిరి, నామాల శ్రీనివాసు పాల్గొన్నారు. పేరు మార్చితే మరో పోరాటం● జిల్లా జేఏసీ కన్వీనర్ రాజు జనగామ: జనగామ పేరు మార్చితే మరో పోరాటం తప్పదని జిల్లా జేఏసీ కన్వీనర్ మంగళ్లపల్లి రాజు హెచ్చరించా రు. శుక్రవారం ఆర్టీసీ చౌరస్తాలోని ఉద్యమ స్ఫూర్తి(జైన) స్తూపానికి జేఏసీ ఆధ్వర్యాన పాలాభిషేకం చేశారు. అనంతరం రాజు మాట్లాడుతూ పేరు మార్చడమంటే ఇక్కడి మహనీయులను అవమానించడమే అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీనారాయణనాయక్, మల్లిగారి రాజు, గండి నాగరాజు, ఆకుల సతీష్, పిట్టల సురేష్, గంగా భవాని, మీసాల వెంకన్న, గన్ను కార్తీక్, ఆసర్ల సుభాష్, నర్ర నవీన్, తిరుమల్రెడ్డి, ప్రణీత్ రెడ్డి, నల్ల రాహుల్, మద్దెల కార్తీక్, అజయ్, ఇమ్రాన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
శనివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2025
హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు ఆర్టీసీ ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుంటోంది. ప్రయాణికులకు సౌకర్యవంతంగా టికెట్ జారీకి ఇ–టిమ్స్ను ప్రవేశ పెట్టింది. దీనిలో భాగంగా ఆర్టీసీ వరంగల్ రీజియన్లోని ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈమేరకు కండకర్లు, డ్రైవర్లకు శిక్షణ ఇస్తూ క్రమంగా ఇ–టిమ్స్ను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటివరకు ఉపయోగించిన టిమ్స్తో చూసుకుంటే మరిన్ని ఫీచర్లతో వీటిని రూపొందించారు. వరంగల్ రీజియన్లో ప్రతిరోజూ 936 బస్సులు వివిధ రూట్లలో తిరుగుతుంటాయి. 3.76 లక్షల కిలోమీటర్లు తిరిగి సగటున రోజుకు రూ.2.20 కోట్ల ఆదాయాన్ని సంస్థ రాబట్టుకుంటుంది. 936 బస్సులకుగాను ప్రస్తుతం 750 ఇ–టిమ్స్ మాత్రమే చేరుకున్నాయి. అన్ని బస్సుల్లో అమలుచేయాలంటే మరో 186 అవసరం. ఎప్పుడైనా టిమ్ మొరాయిస్తే బాగు చేసే వరకు వినియోగించుకునేలా అదనంగా మరికొన్ని అవసరం. ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపులతో టికెట్ల జారీ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న సంస్థ వరంగల్ రీజియన్కు చేరుకున్న 750 ఇ–టిమ్స్ టికెట్ జారీపై మరింత స్పష్టత ప్రతి స్టేజీ వారీగా వివరాలు తెలుసుకునే సౌకర్యం -
ప్రాధాన్యత రంగాలకు రుణాలివ్వాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా జనగామ రూరల్: ప్రాధాన్యత కలిగిన రంగాలకు అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి తోడ్పాటునందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో డీసీసీ, డీఎల్ఆర్సీ బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ రుణాలపై సమీక్షించా రు. వార్షిక ప్రణాళికకు సంబంధించి 2024–25 ఆర్థిక సంవత్సరం లక్ష్యం రూ.4569.48 కోట్లు కాగా మూడో త్రైమాసికానికి రూ.3040.59 కోట్లు(66.54 శాతం) పూర్తి చేశామని, వ్యవసాయానికి 70.89 శాతం, దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలకు 71.35 శాతం, ప్రాధాన్యత రంగాలకు 59.31 శాతం రుణా లు ఇచ్చినట్లు బ్యాంకర్లు తెలిపారు. ఈ ఏడాది లక్ష్యం రూ.4045.72 కోట్లకు రూ.2399.62కోట్లు ప్రాధాన్యత రంగాలకు మంజూరు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ రుణాలపై విస్తృత ప్రచారం చేపట్టాలని, మైక్రో, స్మాల్, మీడి యం ఎంటర్ప్రైజెస్ వ్యాపార విస్తరణ, కొత్త ఎంట ర్ ప్రైజెస్ల ఏర్పాటుకు రుణాలు ఇవ్వడానికి మేళా లు ఏర్పాటు చేయాలని చెప్పారు. వీధి వ్యాపారుల కు విరివిగా ముద్ర రుణాలతో పాటు స్టాండ్ అప్ ఇండియా కింద రుణాలు అందించాలన్నారు. అనంతరం నాబార్డు 2025–26 పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో ఆర్బీఐ, నాబార్డ్ ఏజీఎంలు శ్రావ్య, చంద్రశేఖర్, ఎల్డీఎం శ్రీధర్, ఏఓ రామారావునాయక్, వివిధ శాఖల అధికారులు, బ్యాంకుల కంట్రోలర్లు, మేనేజర్లు పాల్గొన్నారు.ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగవంతం జనగామ: జిల్లాలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. పురపాలక ముఖ్య కార్యదర్శి దాన కోషోర్ శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఈనెల 31వ తేదీ వరకు రుసుము చెల్లించి 25 శాతం రాయితీ పొందడానికి చొరవ చూపుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 2,415 మంది దరఖాస్తు చేసుకోగా ఒకేరోజు 200 ప్రొసీడింగ్ కాపీలు అందజేసినట్లు చెప్పారు. మిగతా దరఖాస్తుల వెరిఫికేషన్ త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. సందేహాల నివృత్తికి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సహాయకేంద్రం–9948187334, పురపాలక సహాయ కేంద్రం–8978207205 నంబర్లలో సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. -
ఆర్థికాభివృద్ధివైపు అడుగులు పడట్లే!
జీడీడీపీలో వెనుకబడిన ఓరుగల్లు..అట్టడుగున ఆరు జిల్లాలు.. ● తలసరి ఆదాయంలో పుంజుకున్న భూపాలపల్లి ● 15 నుంచి 12 స్థానానికి పెరిగిన వైనం.. గతంతో పోలిస్తే పరవాలేదు ● అడవుల విస్తీర్ణంలో ములుగు ఫస్ట్.. మూడో స్థానంలో భూపాలపల్లి ● తెలంగాణ సోషియో ఎకనామిక్ ఔట్లుక్ – 2025లో వెల్లడి -
తాగునీటి ఎద్దడి రావొద్దు
జనగామ: ప్రస్తుత వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్తో కలిసి వివిధ అంశాలపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా తగిన రక్షణ చర్యలు తీసుకో వాలనే అంశంపై ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. దాహార్తి తీర్చేందుకు జిల్లా, మండల స్థాయి కార్యాలయాలు, బస్స్టాప్లు, రైల్వేస్టేషన్, రద్దీ ప్రాంతాల్లో సిబ్బందిని నియమించి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. వడగాలులతో ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించా రు. ఉపాధి హామీ పనులు ఉదయం 11 గంటల వరకు పూర్తి చేసేలా ప్లాన్ చేసుకోవాలని, జీపీలు, ఉపాధి పనుల ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను సరిపడా అందుబాటులో ఉంచాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వాలని చెప్పారు. తహసీ ల్దార్లు, ఎంపీడీఓలు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియను సజావుగా నిర్వహించి త్వరితగతిన పూర్తి చేయాలని, 25 శాతం రాయితీని వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మార్కింగ్ ప్రక్రియ సత్వరమే పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా సీసీరోడ్ల నిర్మాణ పనులు సత్వరమే పూర్తి చేయాలని చెప్పారు. జీపీల్లో 97 శాతం పన్నులు వసూలయ్యాయని, ఈనెల 30 వరకు 100 శాతం లక్ష్యం చేరుకోవాలని సూచించారు. అంతకు ముందు హీట్ స్ట్రోక్పై తీసుకునే జాగ్రత్తలపై డీఎంహెచ్ ఓ మల్లికార్జునరావు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఇందుకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. డీపీఓ స్వరూప, డీఏఓ రామారావునాయక్, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్, ఏసీపీలు భీం శర్మ, నర్సయ్య పాల్గొన్నారు. బూత్లెవల్ ఏజెంట్లను నియమించాలి రాజకీయ పార్టీలు బూత్లెవల్లో తమ ఏజెంట్లను నియమించుకోవాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పింకేష్కుమార్తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ న మాట్లారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 865 పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ అధికారులను నియమించాలని చెప్పారు. జనవరి 6వ తేదీన ప్రకటించిన ఓటరు జాబితా అన్ని పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉందని, 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో కలెక్టరేట్ ఏఓ మన్సూరి, ఎలక్షన్ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీకాంత్, రాజకీయ పార్టీల నాయకులు భాస్కర్, రవి, విజయభాస్కర్, రమేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలి సమీక్షలో కలెక్టర్ రిజ్వాన్ బాషా -
ప్రకృతికి హాని తలపెట్టొద్దు
జనగామ: ప్రకృతికి హాని తలపెట్టకుండా జీవనం సాగించాలని జనగామ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్ పిలుపునిచ్చారు. ‘పర్యావరణ పరిరక్షణ’ అనే అంశంపై గురువారం జిల్లా కేంద్రంలోని సుభా ష్ చంద్రబోస్ అర్బన్ రెసిడెన్షియల్లో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన సదస్సులో జడ్జి మాట్లాడారు. మానవ జీవితంలో ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ బ్యాగులు, బాటిల్స్కు స్వస్తి పలకాలన్నారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటి ని సంరక్షించాలని, నీటిని పొందుపుగా వినియోగించాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని, పిల్లలు ఇబ్బందులకు గురై తే లెటర్ లేదా జిల్లా లీగల్ సెల్కు సమాచారం ఇస్తే చట్టపరంగా న్యాయం చేస్తామని పేర్కొన్నారు. అనంతరం జడ్జి చేతలు మీదుగా పిల్లలకు జ్యూట్ బ్యాగులు పంపిణీ చేశారు. వివేకానంద ట్రస్టు ప్రధాన కార్యదర్శి దొంతుల శేఖర్, పాఠశాల అధికారి శ్రీనివాస్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, జిల్లా న్యాయవాది మంచాల రవీందర్, అన్నబోయిన సత్యం తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్ -
నేటినుంచి టెన్త్ పరీక్షలు
జనగామ రూరల్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను కలెక్టర్ రిజ్వాన్ బాషా పర్యవేక్షణ లో డీఈఓ రమేశ్ నేతృత్వాన విద్యాశాఖ అధికారులు పూర్తి చేశారు. శాంతి భద్రతల విషయమై డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆధ్వర్యాన ఏసీపీ, సీఐ, ఎస్సైలు, పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పా టు చేస్తున్నారు. జిల్లాలో 180 పాఠశాలకు చెందిన 6,238 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నా రు. ఇందుకు 41 సెంటర్లను కేటాయించారు. ఉద యం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అయితే ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ పరీక్షలకు మాత్రం ఉదయం 9.30 నుంచి 11 గంటల సమయం ఇచ్చారు. సెంటర్ల వద్ద సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ యాక్టు–2023(144 సెక్షన్) అమలులో ఉంటుంద ని డీసీపీ తెలిపారు. పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో ర్యాలీలు, మైకులు, ధర్నాలు, ప్రచార కార్యక్రమాలు నిషేధమని, ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్లను మూసి వేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా.. పదో తరగతి పరీక్షలకు మొదటి సారిగా ప్రభుత్వం క్యూర్కోడ్ విధానంతో 24 పేజీల ఆన్సర్ షీట్లను తీసుకు వచ్చింది. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల సమయంలో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా పారదర్శకంగా జరిగేలా దృష్టి సారించింది. 6,238 మంది విద్యార్థులు.. 41 పరీక్ష కేంద్రాలు క్యూఆర్ కోడ్తో 24 పేజీల ఆన్సర్ షీట్ -
ఏఐ పాఠాలు
శుక్రవారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2025– IIలోu● ప్రాథమిక విద్యార్థుల పఠన సామర్థ్యం పెంపుపై దృష్టి ● సాంకేతికతను అందిపుచ్చుకుని సబ్జెక్టులపై బోధన ● ఉన్నత పాఠశాలలకు ప్రాథమిక స్కూళ్ల అనుసంధానం ● జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద 17 పాఠశాలల ఎంపిక ● సి, డి–గ్రేడ్లో 196 మంది విద్యార్థుల గుర్తింపుజనగామ: చదువులో వెనుకబడిన ప్రాథమి క స్థాయి విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్కా రు స్కూళ్లలో సాంకేతిక విద్య(ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ/ఏఐ)ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వం జిల్లాలో 12 పాఠశాలలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయగా.. జిల్లా విద్యాశాఖ మరో ఐదు స్కూళ్లను కలిపి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా ఈకే స్టెప్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో విద్యా బోధన అమలు చేస్తోంది. కంప్యూటర్ల సహాయంతో తెలుగు, ఇంగ్లిష్, గణితంలో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు దృష్టి సారించారు. హైస్కూళ్లకు అనుబంధంగా.. జిల్లాలో కంప్యూటర్లు అందుబాటులో ఉండి.. ఉన్నత పాఠశాలలకు అనుబంధంగా ఉన్న 17 ప్రాథమిక పాఠశాలలను పైలట్ ప్రాజెక్టు కింద ఏఐ బోధనకు ఎంపిక చేశారు. అందులో బచ్చన్నపేట మండలంలోని ఇటుకాలపల్లి, దబ్బగుంటపల్లి, చిల్పూరు మండలం లింగంపల్లి, శ్రీపతిపల్లి, దేవరుప్పుల మండలం నీర్మాల, జనగా మ మండలం మరిగడి, కొడకండ్ల మండలం పాకాల, లింగాలఘణపురం మండలం కళ్లెం, నేలపోగుల, పాలకుర్తి మండలం బొమ్మెర, తొర్రూరు(జె), చెన్నూరు, తరిగొప్పుల మండలం అబ్దుల్నాగారం, జఫర్గఢ్ మండలం ఉప్పుగల్, తిడుగు, హిమ్మత్నగర్ పాఠశాలల్లో సి, డి–గ్రేడ్లో ఉన్న 3, 4, 5 తరగతులకు చెందిన 196 మంది విద్యార్థులకు ఏఐ విద్య అందిస్తున్నారు. సాంకేతికతతో సబ్జెక్టులపై బోధన ప్రాథమిక పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాం అమలువుతోంది. ప్రాథమిక స్థాయిలో అక్షరాస్యత, సంఖ్యా శాస్త్రం, పిల్లల సమగ్రాభివృద్ధి, రాయండం, చదవడం, గణితంలో ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించడమే ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం. వెనుకబడిన విద్యార్థులను సి, డి–గ్రేడ్లుగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారిలో విద్యాప్రమాణాలు పెంపొందించేందుకు ఏఐ బోధనతో కృషి చేస్తోంది. అసిస్టెట్ ల్యాంగ్వేజ్ లర్నింగ్(ఏఎల్ఎల్/తెలుగు, ఇంగ్లిష్ నేర్చుకోవడం), అసిస్టెట్ మ్యాథమెటిక్స్ లర్నింగ్(గణితం నేర్చుకోవడం) యాప్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. విద్యార్థులు హెడ్సెట్ను ఉపయోగించి కంప్యూటర్ ఓపెన్ చేసిన తర్వాత భాషను ఎంచుకుని క్లిక్ చేస్తే పదాలు కనిపిస్తాయి. వాటిని అర్థం చేసుకుని చదవాలి. ఒకటికి రెండు సార్లు ప్రయత్నించినా చెప్పలేని సమయంలో ఓ వీడియో ఓపెన్ అవుతుంది. అందులో టీచర్ తెలుగు అక్షరాలకు సంబంధించి ఒత్తులతో సహా విద్యార్థికి వివరిస్తూ పదాలను కరెక్టుగా చదివిచేలా బోధిస్తారు. ఇలా గణితంలోనూ ఏఐ టెక్నాలజీని రూపుదిద్దారు. ఇందుకు సంబంధించి కంప్యూటర్లు, హెడ్ సెట్లు, సౌండ్ సిస్టం, నెట్ సౌకర్యం విషయంలో ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. బడికి రెగ్యులర్గా రాకుండా ఉన్న పిల్లలను ఏఐ బోధనకు వచ్చేలా వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. భవిష్యత్లో జిల్లాలోని అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఏఐ బోధన అమలు చేయనున్నారు.17 స్కూళ్లలో ఏఐ విద్య అమలు జిల్లాలోని 17 ప్రాథమిక పాఠశాలల్లో ఏఐ విద్య అమలు చేస్తున్నాం. కంప్యూటర్లు అందుబాటులో ఉండి, ఉన్నత పాఠశాలలకు అనుబంధంగా కొనసాగుతున్న పీఎస్లో అందుబాటులోకి తెచ్చాం. 3, 4, 5 తరగతుల్లో సి, డి–గ్రేడ్ విద్యార్థులు 196 మంది ఉన్నట్లు గుర్తించి వారి విద్యాప్రమాణాలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. – బొమ్మనబోయిన శ్రీనివాస్గౌడ్, ఏఎంఓ, జనగామన్యూస్రీల్నేర్చుకోవడం ఇలా.. -
అన్నదాతల సమస్యలు పట్టని ప్రభుత్వం
దేవరుప్పుల : కల్లబొల్లి హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల సమస్యలు పట్టించుకోవడంలేదు.. ఇందుకు ఎండిన పొలాల ను చూస్తే అర్థమవుతోంది.. మూడు రోజుల్లో సాగు నీరు అందించకుంటే అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఎండిపోయిన వరి పొలాలకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించా లనే డిమాండ్తో బీఆర్ఎస్ ఆధ్వర్యాన గురువారం స్థానిక చౌరస్తా సమీపాన పల్ల సుందర్రామిరెడ్డి అధ్యక్షతన చేపట్టిన రైతు నిరసన దీక్షలో ఆయన మాట్లాడారు. టీడీపీ హయాంలో దేవాదుల పనులు ప్రారంభిస్తే పదేళ్లు పండబెట్టింది కాంగ్రెస్ ప్రభు త్వం కాదా అని ప్రశ్నించారు. తిరిగి కేసీఆర్ ఆ పనులను పునరుద్ధరిస్తే పదిహేను నెలలు దాటినా ఈ సర్కారు వాటి జోలికి వెళ్లలేదన్నారు. రైతులపై చిత్తశుద్ధి లేకనే పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపిందని చెప్పారు. జిల్లాలోని యశ్వంతపూర్, బయ్యన్న, ఆకేరు వాగులు ఎందుకు ఎడారిగా మారాయని ప్రశ్నించారు. రైతుల సంక్షేమానికి రైతుబంధు ప్రవేశపెట్టి ఏడాదికి రెండుసార్లు ఇస్తే.. మూడో పంటకి ఎందుకియ్యరని అన్న వాళ్లు ఇప్పు డు సమాధానం చెప్పాలన్నారు. వరి సన్నరకానికి బోనస్, రైతుబంధు, పంట రుణమాపీ అంతా బోగస్ హామీలుగా మారాయని విమర్శించారు. పాలకుర్తి రిజర్వాయర్, కాల్వ మరమ్మతులకు రూ.300 కోట్లతో పనులు ప్రారంభిస్తే ఆపింది మీరు కాదా? అని అన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కొత్తగా నిధులు తేకున్నా పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు కొనసాగిస్తూ ఓట్లు వేసి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవాలని సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకూ ప్రదర్శనగా వెళ్లి వినతి పత్రం అందజేశారు. తర్వాత కామారెడ్డిగూడెంలో ఎండిన పొలాలను పరిశీలించారు. కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి మిగిలిన వరి పంటల ను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తీగల దయాకర్, చింత రవి, రామ్సింగ్, బబ్బూరి శ్రీకాంత్గౌడ్, బస్వ మల్లేషం, ఈదునూరి నర్సింహారెడ్డి, సాయిలు, కొల్లూరి సోమన్న, ప్రవీణ్, అర్జున్, గాంధీనాయక్, మంగళపల్లి శ్రీనివాస్, సీతారాం శ్రీనివాస్, సోమనర్సయ్య, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. రైతు నిరసన దీక్షలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు -
సొమ్మసిల్లిన వృద్ధుడికి చేయూత
జనగామ: నిలువ నీడలేక.. వారం రోజులుగా జిల్లా కేంద్రంలో సంచార జీవనం సాగిస్తున్న ఓ వృద్ధుడు ఎండ వేడికి తట్టుకో లేక గురువారం మున్సిపల్ కార్యాలయం సమీపంలో సొమ్మసిల్లి పడిపోయాడు. గమనించిన సాంబరాజు లక్ష్మి అనే మహిళ వీడియో తీసి అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణికుమార్కు పంపించారు.. ఆయన ‘సాక్షి’ ప్రతినిధికి చేరవేయగా.. కలెక్టర్ రిజ్వాన్ బాషా దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించారు. శక్తి టీంతో పాటు అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేయడంతో అమ్మ ఫౌండేషన్ ప్రతినిధులు మద్దెల కార్తీక్, ఎండీ.అఫ్రోజ్ వృద్ధుడు ఉన్న ప్రాంతానికి చేరుకుని ప్రాథమిక చికిత్స చేసి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, ఎఫ్ఆర్ఓ రాజు ఆధ్వర్యాన జనగామ మండలం శామీర్పేట శివారులోని కోమటిరెడ్డి సుశీలమ్మ–రుద్రమదేవి అనాథ వృద్ధాశ్రమంలో చేర్పించి ఆశ్ర మ బాధ్యులు తల్క లక్ష్మణ్, సుంకర దేవేందర్కు అప్పగించా రు. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మణికుమార్, ముఖ్య సలహాదారు వంగ భీమ్రాజు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వృద్ధుడి విషయమై స్పందించిన సాక్షి, కలెక్టర్తో పాటు మానవతా దృక్పథంతో వ్యవహరించిన సాంబరాజు లక్ష్మి సేవలను కొనియాడారు. ‘సాక్షి’, అమ్మఫౌండేషన్ సమాచారంతో స్పందించిన కలెక్టర్ రిజ్వాన్ బాషా -
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025
IIలోuబడ్జెట్లో ఉమ్మడి వరంగల్కు నిధుల ప్రతిపాదనలు ఇలా.. ● బడ్జెట్ కేటాయింపుల్లో ప్రత్యక్షంగా ఉమ్మడి వరంగల్కు ప్రతిపాదించిన నిధుల వివరాలు ఇలా ఉన్నాయి. సాగునీటిరంగం కేటాయింపుల్లో జేఎస్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ నుంచి ఉమ్మడి ఏడు జిల్లాలకు విస్తరించి ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.2,685 కోట్లు ప్రతిపాదించింది. ఇందులో పనుల కంటే పెండింగ్ బిల్లుల చెల్లింపులకే ఎక్కువ ప్రాధాన్యం ఉండే అవకాశం ఉంది. ● ప్రస్తుతం 91 శాతం పనులు పూర్తయి.. భూసేకరణ జరగక అసంపూర్తిగా ఉన్న దేవాదుల ప్రాజెక్టు కోసం రూ.245 కోట్లు ఇచ్చారు. ఏఐబీపీ కింద రెండు పద్దుల్లో మరో రూ.58 కోట్లను పేర్కొన్నారు. ● స్మార్ట్సిటీ పనుల కోసం రూ.179.09 కోట్లు, ఎస్సారెస్పీ స్టేజ్–2కు రూ.25 కోట్లు, కాకతీయ యూనివర్సిటీకి రూ.50 కోట్లు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు రూ.50 కోట్లు కేటాయించారు. మామునూరు వెటర్నరీ సైన్స్ కళాశాలకు రూ.25 కోట్లు, కాళేశ్వరం టూరిజం సర్క్యూట్కు రూ.10 కోట్లు, టీఎస్ స్పోర్ట్స్ స్కూల్స్ కోసం వరంగల్, కరీంనగర్కు కలిపి రూ.41 కోట్లు ప్రతిపాదించారు. ● రామప్ప, పాకాలకు ఐదేసి కోట్ల రూపాయలు, లక్నవరానికి రూ.2 కోట్లు, మల్లూరువాగుకు రూ.కోటి, కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి రూ.2 కోట్లు బడ్జెట్లో ప్రకటించారు. విద్యారంగానికి మంచి రోజులు..ఆరు గ్యారంటీలకు బడ్జెట్లో ప్రాధాన్యం.. మహిళా పథకాలకు పెద్దపీట ● విద్య, వైద్య రంగాలకు కేటాయింపులపై భిన్నస్వరాలు ● అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ఎయిర్పోర్టు, ‘సూపర్’ ప్రస్తావన లేదు ● కాళేశ్వరానికి రూ.2,685 కోట్లు.. దేవాదులకు రూ.245 కోట్లు ● స్మార్ట్సిటీకి రూ.179కోట్లు, కేయూసీ, జీడబ్ల్యూఎంసీకి రూ.100 కోట్లు ● రామప్ప, పాకాలకు రూ.ఐదేసి కోట్లు.. ‘కాళోజీ’కి రూ.రెండు కోట్లే ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఊతం ● ఎకో టూరిజం ప్రస్తావన.. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఆశలుప్రభుత్వం విద్యారంగాన్ని ప్రోత్సహించడానికి ఈసారి రూ.23,108 కోట్లు కేటాయించింది. దీంతో సర్కారు చదువులకు ఇంకా మంచి జరగనుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. 20–25 ఎకరా ల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించ తలపెట్టిన ప్రభుత్వం ఇటీవల ఉమ్మడి జిల్లాకు రూ.1400 కోట్లతో ఏడింటిని మంజూరు చేసింది. ఈ బడ్జెట్తో ఈసారి ఆ స్కూళ్లు పూ ర్తయ్యే అవకాశం ఉంటుంది. వరంగల్లో మొత్తం 3,331 ప్రభుత్వ బడులు ఉండగా, అందులో 4,67,011 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరీలతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు వెచ్చించే అవకాశం ఉంది. 2025–26 బడ్జెట్సాక్షి ప్రతినిధి, వరంగల్: అసెంబ్లీలో ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన 2025–26 రాష్ట్ర బడ్జెట్లో ఉమ్మడి వరంగల్కు దక్కిన ప్రాధాన్యంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. రెండో రాజధానిగా హైదరాబాద్కు పోటీగా అభివృద్ధి చేస్తామంటున్న ప్రభుత్వం.. బడ్జెట్లో ఆ మేరకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో అభివృద్ధి, సంక్షేమ రంగాలకు చేసిన కేటాయింపుల్లోనే ఉమ్మడి వరంగల్కు ప్రయోజనాలు కలుగుతాయన్న మరో వాదన కూడా వినిపిస్తోంది. ముఖ్యమంత్రిగా మొదటిసారి వరంగల్ నగరంలో పర్యటించిన రేవంత్రెడ్డి.. నగరం అభివృద్ధి కోసం 8 అంశాలు ప్రాధాన్యంగా రూ.6,115 కోట్ల విడుదలకు ఉత్తర్వులు జారీ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఇన్నర్, ఔటర్ రింగు రోడ్లు, మామునూరు ఎయిర్పోర్టు తదితర అంశాలు అందులో ఉన్నాయి. వీటికి నేరుగా నిధులు ఇచ్చేలా ప్రతిపాదనలు చేసినట్లు బడ్జెట్లో కనిపించ లేదు. కాగా, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనిపించిందన్న చర్చ ఉంది. సంక్షేమం, ఐటీ, అభివృద్ధిపైన ఆశలు.. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మహిళా సంక్షేమం కోసం ఈసారి భారీ కేటాయింపులే జరిగాయి. అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా కలిగిన జిల్లాలో ఆ వర్గాలకు మేలు జరుగనుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎస్సీ సంక్షేమం కోసం రూ.40,232, ఎస్టీలకు రూ.17,169 కోట్లు కేటాయించడంతో ఉమ్మడి వరంగల్కు ప్రాధాన్యం ఉంటుందంటున్నారు. ఐటీ, పరిశ్రమల రంగంపైన దృష్టి సారించిన నేపథ్యంలో రెండో నగరంగా వరంగల్ వృద్ధి చెందుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. పీఎం మి త్ర నిధులతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉండగా, ఐటీ హబ్, టెక్స్టైల్ పార్కు, మడికొండ పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలపై ఆశలు రేకెత్తుతున్నాయి. ఎకో టూరిజానికి ప్రాధాన్యం ఇచ్చిన నేపథ్యంలో ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు మహర్దశ రానుంది.కాంగ్రెస్ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చేర్చిన ఆరు గ్యారంటీ పథకాలకు ఈ బడ్జెట్లోనూ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో 8,77,173 మంది రైతులకు రైతుభరోసా పథకం ఈ ఏడాది కూడా అమలు కానుంది. ఒక కార్పొరేషన్, 9 మున్సిపాలిటీలు, 1,708 గ్రామపంచాయతీలుండగా మహాలక్ష్మి పథకం కింద సుమారు ప్రతి మహిళకు రూ.2.500 చొప్పున సుమారు 7.21 లక్షల మందికి అందే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సుల్లో వరంగల్ రీజియన్లో రోజుకు సగటున సుమారు 55 వేల మంది మహిళలు ఉచితంగా రాకపోకలు సాగించేందుకు ఢోకా లేదు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్లపై రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకంలో 6,10,220 మంది లబ్ధిదారులకు కొనసాగనుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే 2.50 లక్షల మందిని రెవెన్యూ అధికారులు అర్హులుగా గుర్తించగా, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల లోపు కరెంట్ వాడిన 6,12,901 మందికి ఉచిత విద్యుత్ సౌకర్యం కలగనుంది. ప్రతి మండలంలో మహిళలతో రైస్ మిల్లులు, మినీ గోదాముల ఏర్పాటు.. ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మహిళా రైస్ మిల్లుల్లో మిల్లింగ్ చేయిస్తాం మహిళా స్వయం సహాయక సంఘాలకు మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎఫ్సీఐకి సరఫరా చేసే బాధ్యత అప్పగిస్తామని ప్రకటించారు. దీంతో ఉమ్మడి వరంగల్లోని 48,717 మహిళా స్వయం సహాయక సంఘాల్లోని 8,76,906 మందికి లబ్ధి చేకూరనుంది. రైతులు, రైతుకూలీలకు బీమా.. ఉమ్మడి వరంగల్లో 15,01,109 ఎకరాల్లో 4,33,229 మంది రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో 4,09,098 మంది రైతులకు బీమా సౌకర్యం కొనసాగనుంది. 9,02,099 ఎకరాలకు పంటల బీమా వర్తించనుంది. అలాగే, రైతు కూలీలకు బీమా వర్తింపజేసే ప్రతిపాదనలు తక్షణమే అమల్లోకి వస్తే.. ఉమ్మడి జిల్లాలో 18,45,326 మందికి ప్రయోజనం కలుగుతుంది.బడ్జెట్పై వివిధ వర్గాల అభిప్రాయాలున్యూస్రీల్అందరినోటా ఆరు గ్యారంటీలు.. -
బడ్జెట్లో విద్యారంగానికి అన్యాయం
జనగామ రూరల్: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తీరని అన్యాయం జరిగిందని సాదిక్ ఫౌండేషన్ చై ర్మన్, హైకోర్టు న్యాయవాది సాదిక్ అలీ అన్నారు. బుధవారం జనగామ చౌరస్తాలో డిగ్రీ విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు విద్యారంగానికి మొత్తం బడ్జెట్లో 15 శాతం నిధులు కేటాయింపు చే స్తామని చెప్పి రెండుసార్లు మొత్తం బడ్జెట్లో 7.5% కేటాయించి మొండి చేయి చూపారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ విద్యార్థులు, సాధిక్ ఫౌండేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు న్యాయవాది సాదిక్ అలీ -
సీజేఐటీలో ముగిసిన సదస్సు
జనగామ: జనగామ మండలం యశ్వంతాపూర్ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో రెండు రో జులుగా జరుగుతున్న గిజైనింగ్ ఆఫ్ సోలార్ పీపీ సి స్టం సదస్సు బుధవారంతో ముగిసింది. కళాశాల డై రెక్టర్ విజయపాల్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో గ్రీన్ వియాన్ వర్కింగ్ మేనేజర్ పురుషోత్తమ చారి విద్యార్థులకు సోలార్ ఎనర్జీ ప్రాముఖ్యత, ఉపయోగంపై అవగాహన కల్పించారు. సహజ సిద్ధంగా లభించే సౌరశక్తిని ఉపయోగించడం ద్వారా అ నేక వనరులను కాపాడే అవకాశం ఉందన్నారు. ఈ సదస్సులో ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖర్, నిర్వాహకులు జి.సరిత, పి.కర్ణాకర్ తదితరులు ఉన్నారు. -
గేట్లో ఆల్ ఇండియా 123వ ర్యాంకు
జనగామ: జాతీయ స్థాయిలో బుధవారం విడుదల చేసిన గేట్ (బీటెక్/సివిల్ ఇంజనీర్) పరీక్షలో జనగామ జిల్లా కేంద్రం బాలాజీనగర్కు చెందిన అక్కినెపల్లి సాత్విక్చంద్రకు గేట్ పరీక్ష ఫలితాల్లో ఆల్ ఇండియా ర్యాంకు 123 సాధించి సత్తా చాటాడు. పట్టణానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ యాదగిరి, గీతారాణిల పెద్ద కుమారుడు ఐఐటీ మద్రాసులో ఎంటెక్ (జియో టెక్నికల్ ఇంజనీరింగ్) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన బీటెక్ బేసిక్పై గేట్ పరీక్ష రాశాడు. ఆల్ ఇండియాలో 123వ ర్యాంకు సాధించడంతో కుటుంబ సభ్యులు, పలువురు అభినందించారు. 13శాతం హెచ్ఆర్ఏ వర్తింపజేయాలిజనగామ: స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఉద్యోగులకు 13 శాతం హెచ్ఆర్ఏ వర్తింప జేయాలని కోరుతూ టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మడూరి వెంకటేశ్ బుధవారం కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్టేషన్ఘన్పూర్ను మున్సిపల్గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, నిబంధనల మేరకు హెడ్ క్వాటర్తో పాటు 8 కిలో మీటర్ల పరిధిలో పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెచ్ఆర్ఏను అమలు చేయాలన్నారు. మెరుగైన వైద్యసేవలు అందించాలిస్టేషన్ఘన్పూర్: 108 అంబులెన్స్ సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా ప్రోగ్రాం మేనేజర్ నసీరుద్దీన్, జిల్లా మేనేజర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో 108, 102, 1962 అంబులెన్స్ సిబ్బంది, పరికరాల పనితీరును బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు. ప్రస్తుత వేసవికాలంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రధానంగా 108 సిబ్బంది అందుబాటులో ఉంటూ సరైన సమయంలో సేవలు అందేలా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ హరికృష్ణ, పైలట్ దోమ రాజురెడ్డి, రాజన్న తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్రలో సమ్మయ్య బృందం ప్రదర్శనదేవరుప్పుల: మహారాష్ట్రలోని సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ నాగపూర్ ఆధ్వర్యంలో అమరావతి విశ్వవిద్యాలయంలో బుధవారం తలపెట్టిన లోక్ మాన్య సమరోత్సాహం–2025లో పద్మశ్రీ గ్రహీత గడ్డం సమ్మయ్య బృందం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూకై లాస్ యక్షగాన నాటకం వేసి తెలంగాణ గ్రామీణ ప్రాంత సాంస్కృతిక కళా ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సమ్మయ్యను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో గడ్డం రఘుపతి, శ్రీపతి, సోమరాజు, ప్రభాకర్, ముకుందం, మురళీకృష్ణ, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం
జనగామ రూరల్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం చేశారు. ఈ నెల 21 (శుక్రవారం) నుంచి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులు కలిపి 6,238 మంది ఉండగా వారికి 41 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో మాదిరిగా ఏడు పేపర్లు పరీక్ష రాయాల్సి ఉండగా ప్రత్యేకంగా సైన్స్లో రెండు పేపర్లు పార్ట్ 1 బయోలాజికల్ సైన్స్, పార్ట్ 2 ఫిజికల్ సైన్స్ ఉన్నాయి. 24 పేజీల బుక్లెట్ పద్ధతిన పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఉదయం 9.30 నుంచి 12.30గంటల వరకు పరీక్ష జరగనుంది. ఐదు నిమిషాలు ఆలస్యమైన విద్యార్థులను అనుమతించనున్నారు. మొత్తం 6,238 మంది విద్యార్థులు.. జిల్లాలో 180 పాఠశాలల నుంచి మొత్తం 6,238మంది పరీక్షకు హాజరు కానుండగా వారిలో 2,996 బాలురు, 3,242 బాలికలు పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్లకు ప్రశ్న పత్రాలు చేరుకోగా బార్కోడింగ్ పద్ధతిలో పరీక్షలు ఉన్నందున ముందుగా పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాల్సి ఉంది. ఆయా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని అధికారులను కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. అలాగే వైద్యసిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. అధికారుల నియామకం పరీక్షల నిర్వహణకు సంబంధిత అధికారులు, సిబ్బందిని కలెక్టర్ నియమించారు. మొత్తం 41 మంది కస్టోడియన్ అధికారులు, 41 డిపార్ట్మెంట్ అధికారులు, ఒకరు అదనపు డిపార్ట్మెంట్ అధికారి, 3 రూట్ అధికారులు, 380 మంది ఇన్విజిలెటర్స్, 2 ప్లయింగ్ స్క్వాడ్లు, హైపర్ కమిటీ కూడా పర్యవేక్షిస్తుంది. అన్ని ఏర్పాట్లు చేశాం రేపటి నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. గతంలో నిమిషం నిబంధన అమలులో ఉండగా ఈసారి ఐదు నిమిషాలు ఆలస్యమైన అనుమతించాలని ప్రభుత్వ నిర్ధేశించింది. సెంటర్ల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాం. ఆందోళనకు గురికాకుండా పరీక్షలు రాయాలి. – రమేశ్, డీఈఓ రేపటి నుంచి టెన్త్ పరీక్షలు హాజరుకానున్న 6,238 మంది విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా 41 పరీక్ష కేంద్రాల ఏర్పాట్లు ఏడు పేపర్లకు బుక్ లెట్ పద్ధతిన పరీక్షల నిర్వహణ పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు -
యాదవులు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలి
● జాతీయ అధ్యక్షుడు రాములు యాదవ్ జనగామ రూరల్: యాదవులు సామాజిక, ఆర్థిక రా జకీయ రంగాల్లో అభివృద్ధి చెందాలని యాదవ హ క్కుల పోరాట సమతి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఎన్ఎంఆర్ గార్డెన్లో జిల్లా అధ్యక్షుడు తాటికొండ వెంకటేశ్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో యాదవుల సంక్షేమంపై పట్టింపులేదని విమర్శించారు. ఈ నెల 28న ఎన్ఎంఆర్ గార్డెన్లో నిర్వహించే యాదవ శంఖారావంకు యావులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరా రు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గంగుల అంజలి, రాష్ట్ర అధికార ప్రతినిధి గుడిగే శ్రీనివాస్, భాస్కర్, శ్రీనివాస్, మల్లేష్, ఐలేష్, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
జనగామ రూరల్: ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. చివరి రోజు 4,214 మందికి గాను 4,069 మంది విద్యార్థులు హాజరు కాగా 141 మంది గైర్హాజరయ్యారని ఇంటర్ విద్యాధికారి జితేందర్రెడ్డి తెలిపారు. కాగా కలెక్టర్ రిజ్వాన్ బాషా సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలలో పరీక్ష సరళిని పరిశీలించారు. కళాశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు మౌలిక వసతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఐఈఓ జితేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు. -
వందశాతం పన్ను వసూలు చేయాలి
జనగామ: జనగామ మున్సిపల్ పరిధిలో వందశాతం ఆస్తిపన్ను వసూలు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. ప్రాపర్టీ టాక్స్ వసూళ్లపై అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో కలిసి మున్సిపల్ కమిషనర్, ఆర్ఓ, బిల్ కలెక్టర్, వార్డ్ ఆఫీసర్స్లతో కలెక్టర్ బుధవారం జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రోజువారి టార్గెట్, వసూళ్లకు సంబంధించి ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలన్నారు. పన్నుల బకాయిదారులకు జారీ చేసిన నోటీసులకు సంబంధించి పన్నులు ఎన్ని వచ్చాయనే విషయమై అడిగి తెలుసుకున్నారు. పన్నులు చెల్లించకుండా జాప్యం చేసే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. నేటి నుంచి (గురువారం) పన్నుల వసూళ్లలో పురోగతి సాధించక పోతే సహించేది లేదన్నారు. అలాగే నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజుల బకాయి, వసూళ్లపై ఆరా తీశారు. జూమ్ మీటింగ్లో కలెక్టర్ రిజ్వాన్బాషా -
ఓటరుగా నమోదు చేసుకోవాలి
స్టేషన్ఘన్పూర్: అర్హులైన ప్రతీఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఈ దిశగా గ్రామాల్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు యువతను చైతన్యం చేయాలని ఆర్డీఓ డీఎస్ వెంకన్న అన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం అఖిల పక్ష పార్టీల నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ నిరంతర ప్రక్రియగా ఉంటుందన్నారు. ఓటర్ల జాబితాలో ఏమైనా సవరణలు ఉంటే బీఎల్ఓలను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, నాయబ్ తహసీల్దార్ సదానందం, ఆర్ఐలు శ్రీకాంత్, సతీష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
హెల్త్ యూనివర్సిటీ వీసీ బాధ్యతల స్వీకరణ
ఎంజీఎం: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నూతన వైస్ చాన్స్లర్గా డాక్టర్ పీవీ నందకుమార్రెడ్డి బుధవారం అధికారికంగా తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్సిటీ ప్రతిష్టను పెంచేందుకు అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. అనంతరం వర్సిటీలోని పలు విభాగాలను పరిశీలించి సిబ్బందితో ముచ్చటించారు. నూతన వీసీగా బాధ్యతలు చేపట్టిన నందకుమార్రెడ్డికి రిజిస్ట్రార్ డాక్టర్ సంధ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ మల్లేశ్వర్, జాయింట్ రిజిస్ట్రార్ డాక్టర్ రమేశ్, అడ్మిషన్ కమిటీ మెంబర్ డాక్టర్ ప్రవీణ్కుమార్, డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ హేమంత్కుమార్, ఫైనాన్స్ ఆఫీసర్ ఖాలీద్, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. -
ఈఆర్సీ చైర్మన్కు సమస్యలు విన్నవించిన వినియోగదారులు
బహిరంగ విచారణకు అధ్యక్షత వహించిన ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 17 జిల్లాల నుంచి వినియోగదారులు హనుకొండ కలెక్టరేట్కు చేరుకుని తమ సమస్యలను ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్కు సమస్యలు వివరించారు. వీరితో భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు వినియోగదారులకు జరుగుతున్న ఇబ్బందులు, కంపెనీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు అందించారు. ఆగ్రో బేస్డ్ పరిశ్రమలకు విద్యుత్ టారిఫ్లో రాయితీ ఇవ్వాలని వినియోగదారులు కోరారు. రాయితీ లేక ఈ రంగంలో పరిశ్రమలు రావడం లేదన్నారు. అదే విధంగా 2011లో ట్రాన్స్కో రాతపూర్వకంగా ఇచ్చిన ఆదేశాల మేరకు కాటన్ ఇండస్ట్రీస్ నడిపిస్తే ఆ తర్వాత జరిమానా విధించారని వాపోయారు. వడ్డీ విధిస్తూ ఎరియర్స్గా చూపిస్తున్నారని, 18 ఇండస్ట్రీస్కు రూ.15 నుంచి 30 లక్షల వరకు జరిమానా విధించారని, వీటిని రద్దు చేయాలని కోరారు. రైతులు తమ వ్యవసాయ మోటార్ల వద్ద ఓల్టేజీ తెలుసుకోవడానికి 20 ఆంప్స్ విద్యుత్ బల్బులు వాడుకునేందుకు అనుమతి ఉందని, అయితే న్యూట్రల్ వైర్ లేక వినియోగించుకోలేక పోతున్నామని, వ్యవసాయ సర్వీస్ లైన్లకు న్యూటల్ వైన్ వేయాలని కోరారు. అదే విధంగా పంట పొలాల మద్యన ఉన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను రోడ్డు సౌకర్యం ప్రాంతానికి తరలించడానికి రైతులను డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని, దీనికి స్వస్తి పలికి సంస్థనే ఉచింతంగా తరలించాలని కోరారు. రైతులు మారినప్పుడు వ్యవసాయ సర్వీస్లో పేర్లు మార్చే విధానం సులభతరం చేయాలని కోరారు. చాలా గ్రామాలకు జూనియన్ లైన్మెన్లు, లైన్మెన్లు లేరని, వెంటనే నియమించాలని కోరారు. ఇళలపై నుంచి వెళ్తున్న విద్యుత్ లైన్లను ఎలాంటి చార్జీలు విధించకుండా మార్చాలని కోరారు. వినియోగదారులు ఇంకా చాలా సమస్యలు ఈఆర్సీ దృష్టికి తీసుకెళ్లగా వాటిని పరిష్కరించాలని ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్..టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిని ఆదేశించారు.టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 17 జిల్లాల నుంచి వినియోగదారులు హనుకొండ కలెక్టరేట్కు చేరుకుని తమ సమస్యలను ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్కు వివరించారు. వీరితో భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు వినియోగదారులకు జరుగుతున్న ఇబ్బందులు, కంపెనీ అభివృద్ధికి తీసుకోవాల్సి న చర్యలపై సలహాలు, సూచనలు అందించారు. ఆగ్రో బేస్డ్ పరిశ్రమలకు విద్యుత్ టారిఫ్లో రాయితీ ఇవ్వాలని వినియోగదారులు కోరారు. రాయితీ లేక ఈ రంగంలో పరిశ్రమలు రావడం లేదన్నారు. అదే విధంగా 2011లో ట్రాన్స్కో రాతపూర్వకంగా ఇచ్చిన ఆదేశాల మేరకు కాటన్ ఇండస్ట్రీస్ నడిపిస్తే ఆ తర్వాత జరిమానా విధించారని వాపోయారు. వడ్డీ విధిస్తూ ఎరియర్స్గా చూపిస్తున్నారని, 18 ఇండస్ట్రీస్కు రూ.15 నుంచి రూ.30 లక్షల వరకు జరిమానా విధించారని, వీటిని రద్దు చేయాలని కోరారు. రైతులు తమ వ్యవసాయ మోటార్ల వద్ద ఓల్టేజీ తెలుసుకోవడానికి 20 ఆంప్స్ విద్యుత్ బల్బులు వాడుకునేందుకు అనుమతి ఉందని, అయితే న్యూట్రల్ వైర్ లేక వినియోగించుకోలేక పోతున్నామని, వ్యవసాయ సర్వీస్ లైన్లకు న్యూటల్ ౖలైన్ వేయాలని కోరారు. అదే విధంగా పంట పొలాల మధ్య ఉన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను రోడ్డు సౌకర్యం ఉన్న ప్రాంతానికి తరలించడానికి రైతులను డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని, దీనికి స్వస్తి పలికి సంస్థనే ఉచితంగా తరలించాలని కోరారు. రైతులు మారినప్పుడు వ్యవసాయ సర్వీస్లో పేర్లు మార్చే విధానం సులభతరం చేయాలని కోరారు. చాలా గ్రామాలకు జూనియన్ లైన్మెన్లు, లైన్మెన్లు లేరని, వెంటనే నియమించాలని కోరారు. ఇళ్ల పైనుంచి వెళ్తున్న విద్యుత్ లైన్లను ఎలాంటి చార్జీలు విధించకుండా మార్చాలని కోరారు. వినియోగదారులు ఇంకా చాలా సమస్యలు ఈఆర్సీ దృష్టికి తీసుకెళ్లగా వాటిని పరిష్కరించాలని ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్..టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిని ఆదేశించారు. -
సంక్షేమ బడ్జెట్..
కేయూ క్యాంపస్: 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఇందులో రాజీవ్ యువ వికాస్ పథకానికి రూ. ఆరువేల కోట్లు కేటాయించారు. దీని వల్ల యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. యంగ్ స్కిల్ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిటీ ఏర్పాటుతో సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. ఈ బడ్జెట్తో బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి సాధించడానికి అవకాశం కలుగుతుంది. –సురేశ్లాల్, ప్రొఫెసర్, కేయూ ఎకనామిక్స్ విభాగం -
నీటిపారుదల రంగానికి మరిన్ని నిధులు కేటాయించాలి
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నీటి పారుదల రంగానికి మరిన్ని నిధులు కేటాయిస్తే బాగుండేది. ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాల్వల నిర్మాణం, భూసేకరణ వందశాతం జరగాలంటే నీటి పారుదల రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. 70 శాతం వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నింపాలంటే ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టు సాగు పెంచాలంటే నిధుల కేటాయింపు అధికంగా ఉండాలి. –గోపు బాలశౌరెడ్డి, గుంటూరుపల్లి, నర్మెట, జనగామ జిల్లా -
విద్యారంగానికి 7.57 శాతమే
కేయూ క్యాంపస్: ఈ సారి బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపుల్లో 1,816 కోట్లు పెరిగినా మొత్తం బడ్జెట్లో రూ. 3 లక్షల కో ట్లలో చూసినప్పుడు రూ. 23 వేల కోట్లు వర కు కేటాయించారు. 7.57 శాతమే కేటాయింపులు జరిగాయి. ఇందులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు అధి క నిధులు కేటాయించారు. స్వాగించాల్సిందే. కానీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మౌలిక సదుపాయాలు అమలు చేయాలంటే 15 శాతం నిధులు కేటాయించాల్సిండేది. –భీమళ్ల సారయ్య, విద్యావారధి సంస్థ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు -
సునీతావిలియమ్స్ భావితరాలకు స్ఫూర్తి..
టెక్నాలజీకి హ్యుమన్ స్పిరిట్ తోడు టెక్నాలజీకి హ్యుమన్ స్పిరిట్ తోడవడంతోనే సునీతా విలియమ్స్ ధైర్యంగా పరిశోధనలకు అంతరిక్షంలోకి వెళ్లింది. ఎనిమిది రోజుల కోసం అంతరిక్షం వెళ్లి అక్కడే చిక్కుకుంది. 9 నెలలు వివిధ ప్రయోగాలు నిర్వహించింది. బుధవారం తెల్లవారుజామున క్షేమంగా భూమిపై ల్యాండ్ అయ్యింది. సునీతా విలియమ్స్ అంతరిక్ష పరిశోధనలు చేపట్టేందుకు యువ శాస్త్రవేత్తలకు దిక్సూచిగా నిలుస్తారు. –అబ్దుల్ అజిమ్, ఫిజిక్స్ ప్రొఫెసర్, నిట్భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతావిలియమ్స్ భావితరాలకు స్ఫూర్తి అని పలువురు సైన్స్ మాజీ అధికారులు, ప్రొఫెసర్లు అన్నారు. ప్రయోగాల నిమిత్తం 9 నెలల క్రితం అంతర్జాతీయ అంతరిక్షంలోకి వెళ్లిన సునీతావిలియమ్స్ బుధవారం తెల్లవారుజామున భూమిపై సురక్షింతగా ల్యాండ్ అయ్యారు. దీనిపై భారత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కాగా, సునీతావిలియమ్స్ 9 నెలల సమయంలో అంతరిక్షంలో 150కి పైగా ప్రయోగాలు నిర్వహించారు. –కాజీపేట అర్బన్ -
ఈఆర్సీకి సమస్యల గోడు
హన్మకొండ: విద్యుత్ నియంత్రణ మండలికి వినియోగదారులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్లో 2025–2026 ఆర్థిక సంవత్సరానికి సవరణ చేయబడిన రిటైల్ సప్లయ్ వ్యాపారానికి సమగ్ర ఆదాయ ఆవశ్యకత, ధరలు, క్రాస్ సబ్సిడీ సర్ చార్జీల ప్రతిపాదనలపై విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ ఆధ్యక్షతన బహిరంగ విచారణ జరిగింది. ఈ విచారణలో టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి.. సంస్థ ద్వారా వినియోగాదారులకు అందిస్తున్న సేవలు వివరించారు. విద్యుత్ చార్జీలు పెంచడం లేదని చెప్పారు. ఆధునిక సాంకేతికను వినియోగించి వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఎన్పీడీసీఎల్లో అమలు చేస్తున్న సాంకేతిక పద్ధతులు, సంస్థను వినియోగదారులకు చేరువ చేసిన విధానాన్ని పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బాధితులకు ఈఆర్సీ చైర్మన్ చేతుల మీదుగా చెక్కు అందజేత.. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఈదురుగడ్డకు చెందిన అంగిడి అనిత, రాజ్ కుమార్ దంపతుల ఇల్లు విద్యుదాఘాతంతో దగ్ధమైందని, ఈ ఘటనలో వారి కుమారుడు సాయి కుమార్(07) చనిపోయాడని, ఇంటి పైనుంచి విద్యుత్ లైన్ వెళ్లడం ద్వారానే ఈ ఘటన జరిగిందని భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధి జోగినిపల్లి సంపత్రావు ఈఆర్సీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. బాధితులను ఈఆర్సీ ముందుంచి వారి బాధను వివరించారు. ఈ ఘటన జరిగి 5 నెలలవుతున్నా ఎలాంటి పరిహారం చెల్లించలేదని తెలిపారు. స్పందించిన ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ పరిహారం చెల్లించాలని సూచించారు. దీంతో బహిరంగా విచారణ సభలోనే ఈఆర్సీ చైర్మన్ చేతుల మీదుగా బాధితులు అనితా, రాజ్కుమార్ దంపతులకు రూ.5 లక్షల చెక్కు అందించారు. సీజీఆర్ఎఫ్ సేవలు విస్తృతం చేయాలి.. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్) సేవలను మరింత విస్తృతం చేయాలని ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ అధికారులకు సూచించారు. దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. విద్యుత్ వినియోగదారులకు అందిస్తున్న సేవలకు ఎన్పీడీసీఎల్ యాజమాన్యాన్ని అభినందించారు. విద్యుత్ చార్జీలు పెరగవు.. టీజీ ఎన్పీడీసీఎల్ రెవెన్యూ లోటు రూ.10,393 కోట్లు. 2025–2026 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నిర్వహణకు రూ.19,814 కోట్ల ఆదాయం అవసరం కాగా, రూ.9,421 కోట్లు మాత్రమే ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీంతో రెవెన్యూ భారీ లోటు ఏర్పడనుంది. ప్రభుత్వం ఈ మేరకు రీయింబర్స్ చేయాల్సిన అవసరముంది. అదే విధంగా ఈ సంవత్సరం విద్యుత్ చార్జీల టారిఫ్ పెంపుపై ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు. దీంతో విద్యుత్ చార్జీలు పెరగవు. విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి భారం పడదు.చైర్మన్కు వివరించిన విద్యుత్ వినియోగదారులు సీజీఆర్ఎఫ్ సేవలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజ్ నాగార్జున్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
విద్యకు ప్రాధాన్యమివ్వని బడ్జెట్
కేయూ క్యాంపస్: ప్రభుత్వ బడుల వసతుల కల్పనలో జాతీయ స్థాయిలో తెలంగాణ 32వ స్థానంలో ఉండగా.. నాణ్యమైన విద్య, సమర్థంగా బడుల నిర్వహణలో 27వ స్థానంలో ఉందని తెలంగాణ విద్యా కమిషన్తెలిపింది. అయితే ఆ స్థితిని మెరుగు పరిచేలా ప్రభుత్వం రెండో బడ్జెట్లో విద్యకు ప్రాధాన్యమివ్వలేదు. రూ. 3,04,965 కోట్లలో విద్యకు రూ.23,108 కోట్లు కేటాయించారు. ( 7.57 శాతం ) ప్రభుత్వ విద్యా సంస్థల అభిృద్ధికి ఏ మాత్రం సరిపోవు. –కడారి భోగేశ్వర్, టీపీటీఎఫ్ పూర్వ కార్యదర్శి -
భారత రాజ్యాంగం.. సెక్యులర్ వ్యవస్థ
రాజ్యాంగ విలువలకు తిలోదకాలు రాజ్యాంగ వ్యవస్థను గత 75 సంవత్సరాలుగా ప్రజలు గౌరవిస్తున్నారని, రాజ్యాంగానికి లోబడి రాజ్య పాలన నిర్వహించాలని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త, హెచ్సీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ జి. హరగోపాల్ అన్నారు. కానీ నేడు పాలకులు రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య వ్యవస్థకు తిలోదకాలు ఇచ్చి సొంత ఎజెండాతో పాలన కొనసాగిస్తున్నారన్నారు.కేయూ క్యాంపస్ : భారత రాజ్యాంగం సెక్యులర్ భావాలతో కూడిన వ్యవస్థని, రాజ్యాంగం ఒక వ ర్గానిదో.. ఒక కులానిదో కాదని, దేశ ప్రజలందరిద ని తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రయ్య అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఎస్సీ, ఎస్టీ అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో ‘ 75 సంవత్సరాల భారత రాజ్యాంగం– మైలురా ళ్లు– సమస్యలు– సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు బుధవారం సాయంత్రం ముగిసింది. ఈ ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజంలో ప్రతీ వ్యక్తి భగవద్గీత, ఖురాన్, బైబిల్తోపాటు రాజ్యాంగాన్ని కూడా అధ్యయనం చేయాలన్నారు. అప్పుడే రాజ్యాంగం విలువలు, తమ హ క్కులేమిటో తెలుస్తాయన్నారు. సమసమాజ ని ర్మాణం కోసం రాజ్యాంగం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. దేశ ప్రజల హక్కులను రక్షించేది రా జ్యాంగమేనని, రాజ్యాంగాన్ని సమగ్రంగా రచించి న గొప్ప వ్యక్తి బి.ఆర్ అంబేడ్కర్ అన్నారు. దేశ ప్రజలు అంబేడ్కర్కు రుణపడి ఉండాలన్నారు. రాజ్యాంగం వైరుధ్యాలను పరిష్కరిస్తుందన్నారు. రాజ్యాంగానికి లోబడే వ్యవహరించాలి.. భారత రాజ్యాంగం ప్రపంచంలో గొప్పదని మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యుడు అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. చట్టసభల్లో అట్టడుగు వర్గాల వారు ప్రవేశించడానికి రాజ్యాంగంలో పే ర్కొన్న రిజర్వేషన్ విధానమే కారణమన్నారు. రా జ్యాంగానికి లోబడే ఎవరైనా వ్యవహరించాలేగాని రాజ్యాంగ పరిధి దాటి వ్యవహరిస్తే ప్రతికూల ప్ర భావాలు చూపుతాయన్నారు. అనంతరం కేయూ యూజీసీ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ ఆర్. మల్లికార్జున్ రెడ్డి, కేయూ ఎస్సీ,ఎస్టీ సెల్డైరెక్టర్, ఈ సెమినార్ డైరెక్టర్ తుమ్మల రాజమణి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్. నారాయణ మాట్లాడారు. లైబ్రరీ సైన్స్విభాగం అధిపతి రాధిక రాణి, వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రయ్య కేయూలో ముగిసిన జాతీయ సదస్సు -
ఆటో డ్రైవర్కు ఏడాది జైలు
జనగామ: ఆటోను అజాగ్రత్తగా నడిపి ఇద్దరి మృతికి కారణమైన డ్రైవర్కు జనగామ కోర్టు ఏడాది కఠిన కారాగార శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. సీఐ దామోదర్రెడ్డి కథనం ప్రకారం.. 2016లో నర్మెట మండలం కన్నెబోయినగూడెం నుంచి అదే గ్రామానికి చెందిన ధారావత్ టీక్యా, నర్మెటకు చెందిన శిరీష, ఆమె తల్లి కనకలక్ష్మితో పాటు మరో ఐదుగురు ఆటోలో జనగామకు బయలుదేరారు. లింగాలఘనపురం మండలం నెల్లుట్లకు చెందిన ఆటో డ్రైవర్ యోహాన్ అజాగ్రత్త, అతివేగం నడపడం వల్ల జనగామ మండలం గానుగుపహాడ్ దాటిన తర్వాత వాహనం పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో టీక్యా అక్కడికక్కడే మృతి చెందగా, కనకలక్ష్మికి తీవ్ర గాయాలు కావడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం తరలించే క్రమంలో మార్గమధ్యలో మృతి చెందింది. అప్పటి సీఐ ముస్కె శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా, అసిస్టెంట్ పీపీ కిరణ్ కుమార్ వాదించారు. కోర్టు కానిస్టేబుల్ టి.రవికుమార్, హెడ్ కానిస్టేబుల్ యాదగిరి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా, ఇరువురి వాదనలు విన్న జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జి.శశి.. నిందితుడు యోహాన్కు ఏడాది కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించినట్లు సీఐ తెలిపారు. నేడు మామిడి మార్కెట్ ప్రారంభంవరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్ పరిధి లక్ష్మీపురం ఫ్రూట్ మార్కెట్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తున్నందున ఈ ఏడాది మామిడి సీజన్ నిర్వహణ కోసం ఏనుమాముల ముసలమ్మకుంట పక్కనే మార్కెట్ స్థలంలో మామిడి మార్కెట్ను ఏర్పాటు చేస్తున్నారు. గురువారం ఉదయం రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు ఈమార్కెట్ను ప్రారంభించనున్నట్లు వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి గుగులోతు రెడ్డి తెలిపారు. కాగా.. కరోనా సాకుతో నాలుగేళ్ల క్రితం ధర్మారంలోని ఓ ప్రైవేట్ గోదాంలో మామిడి మార్కెట్ను ఓపెన్ చేసి ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా వ్యాపారులు ఇన్నాళ్లు కొనసాగించారు. దీంతో మార్కెట్ కమిటీ పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోయింది. ముసలమ్మకుంట పక్కన మార్కెట్కు సంబంధించిన 10 ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు అధికారుల నుంచి అనుమతులు రావడంతో మంత్రి చేతుల మీదుగా మామిడి మార్కెట్ను ప్రారంభిస్తున్నట్లు సమాచారం. -
‘దేవాదుల’ గట్టెక్కించేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్/హసన్పర్తి/ధర్మసాగర్: వేసవి ఎండల తీవ్రత.. అడుగంటుతున్న భూగర్భజలాలు.. దీంతో జనగామ, హనుమకొండ జిల్లాల్లోని నాలుగు నియోజకవర్గాల్లో అక్కడక్కడ పంటలు ఎండుతున్నాయి. చేతికందే దశలో దేవాదుల ప్రాజెక్టు పరిధిలో వరి పంటలు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టు కింద 50 నుంచి 60వేల ఎకరాలకు సాగునీరందించేలా దేవాదుల ప్రాజెక్టు మూడవ దశలో భాగంగా దేవన్నపేటలో నిర్మించిన పంప్హౌస్ మోటార్లను జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రారంభించేందుకు మంగళవారం సాయంత్రం పంపుహౌజ్కు చేరుకున్నారు. కానీ, మోటారు మరమ్మతుకు రావడం, ఆస్ట్రియానుంచి వచ్చిన బృందం చేపట్టిన రిపేర్లు పూర్తి కాకపోవడంతో మంత్రులు రాత్రి ఎన్ఐటీ గెస్టుహౌస్లో ఉన్నారు. అసెంబ్లీలో బుధవారం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో రాత్రి 11.30 గంటలకు హైదరాబాద్కు వెళ్లిపోయారు. ఫేజ్–3 పనులపైనే దృష్టి... చేతికందే పంటలను కాపాడేందుకు మూడో ఫేజ్ పనులపై అధికారులు దృష్టి సారించారు. దేవన్నపేట పంపుహౌజ్లో ప్రస్తుతం ఒక్కో మోటారు 800 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఇక్కడ మూడు మోటార్లు ఏర్పాటు చేయగా.. అందులో ఒక్కటి ఆన్చేసి జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో సుమారు 60వేల నుంచి 65వేల ఎకరాల వరకు సాగునీరు అందించడంపై దృష్టి పెట్టారు. మంగళవారం రాత్రి వరకు మోటారు మొరాయించడంతో ఈ యాసంగి పంట చేతికందే వరకు నీటి సరఫరా అవుతుందా? అన్న ఆందోళన ఆ నాలుగు నియోజకవర్గాల్లోని రైతుల్లో వ్యక్తమవుతోంది. హడావుడిగా సాగిన మంత్రుల పర్యటన.. దేవాదుల చివరి ఆయకట్టుకు సాగునీరందిచేందుకు యుద్ధప్రాతిపదికన ఖరారైన మంత్రుల టూర్ హడావిడిగా సాగింది. మొదట మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా హసన్పర్తి మండలం దేవన్నపేటకు పంప్హౌస్కు చేరుకున్నారు. అక్కడినుంచి ధర్మసాగర్ రిజర్వాయర్లో నీరు పంపింగ్ అయ్యేలా మోటార్ ఆన్ చేయాల్సి ఉంది. అనంతరం ధర్మసాగర్ రిజర్వాయర్కు చేరుకుని అక్కడ పూజలు చేసి.. మీడియా సమావేశంలో మాట్లాడుతారనేది షెడ్యూల్. కానీ, అనుకున్న ప్రకారం దేవన్నపేటకు మంత్రులు చేరుకున్నప్పటికీ మోటార్ మొరాయించడంతో స్విచాన్ చేయకుండా అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద వేసిన టెంట్లు, కుర్చీల వద్దే ప్రజలు, కార్యకర్తలు ఉండిపోయారు. చివరి నిమిషంలో మీడియా సమావేశం దేవన్నపేటలోనే ఉంటుందనడంతో ధర్మసాగర్ నుంచి దేవన్నపేటకు మీడియాతోపాటు నాయకులు, కార్యకర్తలు, అధికారులు వెళ్లాల్సి వచ్చింది. కాగా దేవన్నపే ట పంపుహౌస్, ధర్మసాగర్ రిజర్వాయర్తోపాటు పలుచోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల పక్కన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, మామిడాల యశస్విని రెడ్డి తదితరుల ఫొటోలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అధికారులపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం దేవాదుల ప్రాజెక్టు దశలు ఎప్పుడు ప్రారంభమయ్యాయని, ఇతర అంశాలపై మంత్రులు అడిగిన ప్రశ్నలకు నీటిపారుదల శాఖ అధికారుల నుంచి సరైన సమాధానం లేదు. దీంతో వారిపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్షకు సమాచారం లేకుండా ఉత్త చేతులతో వస్తారా అని మండిపడ్డారు. చిన్న చిన్న సమస్యలతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, బల్దియా కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి, మేయర్ గుండు సుధారాణి, అధికారులు పాల్గొన్నారు. రాత్రి వరకు కాని మోటార్ మరమ్మతు చివరి ఆయకట్టు రైతుల్లో ఆందోళన హడావుడిగా సాగిన మంత్రుల పర్యటన ‘ధర్మసాగర్ రిజర్వాయర్’ కార్యక్రమం రద్దు దేవన్నపేట పంపుహౌస్కు హుటాహుటిన అధికారులు -
టెన్త్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
జనగామ రూరల్: జిల్లాలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్లతో కలిసి టెన్త్ వార్షిక పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు, సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగే పరీక్షలకు 41 సెంటర్లలో 6,238 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, బెంచీలు, కుర్చీలు, మూత్రశాలల సౌకర్యం కల్పించాలన్నారు. పోలీస్ ఎస్కార్ట్తో ప్రభుత్వ వాహనంలో నిర్ధేశించిన ఆయా రూట్లలో మాత్రమే పరీక్ష పేపర్లను ఆయా కేంద్రాలకు తరలించాలన్నారు. విద్యార్థులు తమ సందేహాల నివృత్తికి 6304062768 కంట్రోల్ రూం నంబర్లో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రమేశ్, డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏసీజీఈ రవి కుమార్, డీసీఈబీ అసిస్టెంట్ సెక్రటరీ రామరాజు, జీసీడీఓ గౌసియా బేగం, ఏఎంఓ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. దివ్యాంగులను ప్రోత్సహించాలి దివ్యాంగులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పింకేష్ కుమార్తో కలిసి దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగులకు అనేక పథకాలను ప్రవేశపెట్టిందని, దానిలో భాగంగానే ఈ సహాయ ఉపకరణాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని 66 మంది దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన సహాయ ఉపకరణాలను అందించి వారి ఆప్యాయంగా పలకరించి ముచ్చటించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా జిల్లాలో 41 పరీక్ష కేంద్రాల ఏర్పాటు హాజరుకానున్న 6,238 మంది విద్యార్థులు -
ఆర్యూబీ నిర్మాణంపై ఆందోళన
రఘునాథపల్లి: నిడిగొండ రైల్వే ట్రాక్ వద్ద కొనసాగుతున్న రోడ్డు అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) ఓ వైపు ఇరుకుగా నిర్మాణం చేయడంపై పలు గ్రామాల ప్రజలు మంగళవారం ఆందోళనకు దిగారు. ఫతేషాపూర్ వైపు అండర్గ్రౌండ్లో 32 ఫీట్ల వెడల్పుతో నిర్మిస్తుండగా, నిడిగొండ వైపు మాత్రం 20 ఫీట్లకే పరిమితం చేయడంపై పతేషాపూర్, ఇబ్రహీంపూర్, లక్ష్మీతండా, రామచంద్రగూడెం, మాధారం గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఆర్యూబీ వద్దకు తరలి వచ్చి నిరసన చేపట్టారు. స్పందించిన కాంట్రాక్టర్ నిడిగొండ వైపు 24 ఫీట్ల వెడల్పుతో పనులు చేపట్టడంతో నిరసన కార్యక్రమాన్ని విరమించుకున్నారు. ఈ ఆందోళనలో మాజీ సర్పంచ్లు గాజులపాటి మహేందర్, ఎండీ హయతలి, శాగ నాగరాజు, ఎండీ షబ్బీర్, గొట్టం కర్ణాకర్రెడ్డి, లక్ష్మారెడ్డి, పోకల శ్రీనివాస్, దొరగొల్ల యాదగిరి, మేకల శంకరయ్య, ఎండీ గౌస్, నేతాజీ, వీరోజి, మేడిపల్లి నరేష్, శ్యామల ర ఘు, లోడె నర్సయ్య, పోతులూరి తదితరులు ఉన్నారు. -
భూ సమస్యలు పరిష్కరించాలి
అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ బచ్చన్నపేట: జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల్లో భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ అన్నారు. మంగళవారం మండలంలోని కొడవటూర్ గ్రామంలోని శ్రీ సిద్ధేశ్వరాలయంలో ప్రత్యేక పూ జలను నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో పలు భూ రికార్డులను పరిశీలించారు. త్వరలోనే దేవాదుల మూడో దశ పైప్ లైన్ నీరు వస్తాయని, రైతులు అధైర్యపడొద్దన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రకాష్రావు, డీటీ ఫణికిషోర్, ఏఆర్ఐ మున్వర్, అధికారులు పాల్గొన్నారు. సోమేశ్వరాలయానికి వెండి హారతుల బహూకరణ పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తుడు వెండితో తయారు చేసిన 8 రకాల హారతులను మంగళవారం బహూకరించినట్లు ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు తెలిపారు. ఆలయ అర్చకుడు దేవగిరి లక్ష్మన్న సూచనల మేరకు స్వామివారి పూజ కార్యక్రమాల్లో హారతులు ఇచ్చేందుకు నల్లగొండకు చెందిన ఎన్ఆర్ఐ భక్తుడు సోమ కార్తీక్, తేజశ్రీ దంపతులు రూ.2,26,900 విలువైన 2 కేజీల292 గ్రాముల మిశ్రమ వెండితో తయారు చేసిన 8 హారతులను అందించినట్లు ఈఓ తెలిపారు. విద్యారంగానికి నిధులు కేటాయించాలి జనగామ రూరల్: రాష్ట్ర బడ్జెట్లో విద్యకు మొత్తం బడ్జెట్లో 15శాతం నిధులు కేటాయించాలని సాధిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఏకశిల డిగ్రీ కళాశాల నుంచి జనగామ చౌరస్తా వరకు చేరుకుని నిధులు పెంచాలని కోరుతూ ప్లకార్డులతో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సాధిక్ ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది సాధిక్ అలీ మాట్లాడుతూ విద్యకు బడ్జెట్ నిధులు పెంచే వరకు విద్యా మహోద్యమం కొనసాగుతుందన్నారు. యూనివర్సిటీల పేరు మారిస్తే విద్యా ప్రమాణాలు పెరగవని, వాటిని అన్ని స్థాయిల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అధ్యాపకులను నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాలల విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భక్తుల ఇంటికే భద్రాద్రి తలంబ్రాలు ● డీఎం స్వాతి జనగామ: జనగామ ఆర్టీసీ డిపో లాజిస్టిక్స్ (కార్గో) ద్వారా భక్తుల ఇంటి వద్దకే సీతారాముల కల్యాణ తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు డిపో మేనేజర్ స్వాతి తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ సీతారామ చంద్రస్వామి కల్యాణ తలంబ్రాలు అవసరమున్న భక్తులు జనగామ బస్టాండ్ ఆవరణలోని కార్గో లాజిస్టిక్స్ ఆఫీస్లో డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అవినాష్, సంబంధిత ఏజెంట్ను సంప్రదించి, రూ.151తో ముందస్తు బుకింగ్ చేసుకుని, రశీదు పొందాలన్నారు. కల్యాణ మహోత్సవం అనంతరం, తలంబ్రాలను కార్గో ఏజెంట్ ద్వారా ఇంటికి పంపిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 9154 298762 నంబర్ను సంప్రదించాలన్నారు. -
15 మంది ట్రేడర్లకు నోటీసులు
జనగామ: జనగామ మార్కెట్ అధికారులు ఫీజు వసూళ్లపై ప్రత్యేక ఫోకస్ సారించారు. మొండి బకాయిదారులపై నోటీసు అస్త్రాలతో రంగంలోకి దిగారు. ఈ నెల 31వ తేదీ వరకు చివరి అవకాశం ఇచ్చిన అధికారులు... ఆ తర్వాత 1 శాతం ఫీజుపై 12 శాతం వడ్డీ (ఫెనాల్టీ) వసూలు చేయనున్నారు. అప్పటికీ బకాయిలపై స్పందించకుంటే లైసెన్స్ రద్దుతో పాటు రెవెన్యూ రికవరీ యాక్టు సైతం అమలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్ పరిధిలో 54 ట్రేడ్ లైసెన్స్లు ఉన్నాయి. ఇందులో 20 మంది వరకు మార్కెట్ పరిధిలో కొనుగోళ్లు చేస్తుండగా, మిగతా ట్రేడర్లు రైస్మిల్లు వద్దనే సరుకులను తీసుకుంటారు. సుమారు 15 మంది ట్రేడర్లు రూ.30 లక్షలకు పైగా ఫీజు బకాయి ఉన్నారు. వందశాతం ఫీజు వసూళ్లే లక్ష్యంగా మార్కెట్ అధికారులు నడుంబిగించారు. 15 మందికి నోటీసులు జారీ చేసి, ఈ నెల 31వ తేదీ లోపు బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ఈ విషయమై మార్కెట్ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, డీఎంఓ, ఇన్చార్జ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి నరేంద్ర మాట్లాడుతూ 15 మంది ట్రేడర్లకు నోటీసులు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. -
ఇంటి నంబర్లు కేటాయించాలి
జనగామ రూరల్: పట్టణంలోని మూడో విడత ఇందిరమ్మ ఇళ్లకు ఇంటి నంబర్లు కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశా రు. మంగళవారం జనగామ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట సీపీఎం జనగామ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఎం అనేక పోరాటాలతో ఇల్లు లేని నిరుపేదలకు అధికారులతో స్థలా లను లేఅవుట్ చేయించి అందజేశామన్నారు. ఆ స్థలంలో పేదలు ఇల్లు నిర్మించుకున్నారన్నారు. వా టికి ఇంటి నంబర్లు కేటాయించాలని అధికారులను కోరినా ఫలితం లేదన్నారు. ఇప్పటికై న ఇంటినంబ ర్లు కేటాయించి, విద్యుత్, తాగునీరు, రోడ్లు, డ్రెయినేజీలు ఏర్పాటు చేయించాలని కమిషనర్కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, జిల్లా కార్యదర్శి వర్గ స భ్యుడు ఈర్రి అహల్య, బొట్ల శేఖర్, బూడిది గోపి, గణేష్, కళ్యాణం లింగం, నాయకులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి -
చింతపండు @
బుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 202512,700– 8లోuజనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్లో చింతపండు గిట్టుబాటు ధరకు మించిపలుకుతుంది. జిల్లాలో ఈసారి చింత దిగుబడి తగ్గడంతో గతేడాదితో పోలిస్తే రకాన్ని బట్టి 70 నుంచి 100 శాతం పెరిగింది. ఒకింత రైతులు సంతోషంగా ఉన్నప్పటికీ... ఆశించిన మేర దిగుబడి లేకపోవడంతో సరాసరి మిగులు బాటుతోనే సరి పుచ్చుకుంటున్నారు. హోల్సెల్ మార్కెట్లో కిలో చింతపండు రూ.90 నుంచి రూ.127 పలుకుతుంది. రిటైల్గా రూ.150కి కూడా అమ్ముతున్నారు. జనగామ మార్కెట్కు యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, జనగామ, సిద్ధిపేట జిల్లాలకు చెందిన రైతులు నిత్యం జిల్లా కేంద్రంలోని ఏఎంసీకి చింతపండును తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. జిల్లాలో ఒకశాతమే అటవీ ప్రాంతం.. జిల్లాలో అటవీ ప్రాంతం ఒక శాతం మాత్రమే ఉంది. బచ్చన్నపేట మండలం సాల్వాపూర్, మన్సాన్పల్లి, నర్మెట, జనగామ మండలం తదితర ప్రాంతాల్లో కొంత మేర అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. అటవీ ప్రాంతం ఉన్నప్పటికీ, పెద్దగా చింత చెట్లు లేవు. రైతుల వ్యవసాయ పొలాలతో పాటు గ్రామాల్లో సొంతంగా పెంచుకున్న చెట్లు మాత్రమే ఉంటాయి. ఆ చెట్లను గుత్తేదారులకు ఒక్కో చెట్టుకు రూ.3వేల నుంచి రూ.5వేలకు కుల్లుగుత్తగా ఇచ్చేశారు. గత కొంత కాలంగా గుత్తేదారులు చింత పూతను కాపాడుకుంటూ, దిగుబడి తగ్గిపోకుండా రాత్రింబవళ్లు అక్కడే కాపలా ఉన్నారు. అయినప్పటికీ ఆశించిన మేర దిగుబడి రాలేదు. ఒక్కో చెట్టుపై కాయలు రాల్చేందుకు రూ.1000, కాయలను కొట్టి చింతపండు తయారు చేసేందుకు గంపకు రూ.150 నుంచి రూ.200 చెల్లించారు. చెట్టుకు అద్దె, కూలీల ఖర్చు తడిసి మోపెడు కావడంతో గుత్తేదారులకు మిగులుబాటు అవుతుందా? అనే సందేహంలో ఉన్నారు. మార్కెట్లో 170 క్వింటాళ్లు కొనుగోళ్లు.. ఈసారి చింతపండు దిగుబడి తగ్గడంతో మార్కెట్లో ఒక్కసారిగా ధర పెరిగింది. గతేడాది క్వింటా చింతపండు ధర రూ.6,180, రూ.6వేలు, రూ.6,150 మూడు ధరలు పలుకగా.. ఈ సారి ఊహించని విధంగా ధర పలుకుతుంది. ప్రస్తుత సీజన్లో ఏ గ్రేడ్ చింతపండు క్వింటాకు రూ.12,700, బీ, సీ, రకానికి రూ.9 వేలు, రూ.8వేల మేర ధర పలికింది. ఇప్పటి వరకు మార్కెట్లో 170 క్వింటాళ్ల చింతపండు కొనుగోలు చేయగా, ప్రైవేట్ మార్కెట్లో 500 క్వింటాళ్ల వరకు అమ్మకాలు జరిగినట్లు సమాచారం. న్యూస్రీల్జనగామ ఏఎంసీలో మూడు కేటగిరీల్లో కొనుగోళ్లు వేలం పాటతోనే కొనుగోళ్లు చేయాలని రైతుల డిమాండ్ జిల్లాలో తగ్గిన దిగుబడి -
రైతు ఉత్పత్తి సంస్థలతోనే బలోపేతం
చిల్పూరు: రైతు ఉత్పత్తి సంస్థలతోనే రైతులను భలోపేతం చేయాలని నాబార్డు రీజినల్ ఆఫీస్ అసిస్టెంట్ మేనేజర్ వినోద్ దేశ్ముఖ్ అన్నారు. మండలంలోని రాజవరం గ్రామంలో నాబార్డు సౌజన్యంతో జనవికాస గ్రామీణ అబివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 522 మంది రైతులతో ఏర్పాటు చేసిన రాజవరం రైతు ఉత్పత్తి దారుల సంస్థను మంగళవారం ఆయన సందర్శించారు. ముందుగా రికార్డులను పరిశీలించారు. ఏపీఓ చేస్తున్న బిజినెస్ గురించి సంస్థ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జనవికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ సీఈఓ పెండ్లి సంపత్కుమార్, సంస్థ చైర్మన్ కాల్వ కృష్ణారెడ్డి, డైరెక్టర్లు కుమారస్వామి, రమాదేవి, గట్టయ్య, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. నాబార్డు రీజినల్ ఆఫీస్ అసిస్టెంట్ మేనేజర్ వినోద్ దేశ్ముఖ్ -
సోమేశ్వరాలయంలో భక్తుల సందడి
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో సోమవారం భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ ఈఓ సల్వా ది మోహన్బాబు ఏర్పాట్లును పర్యవేక్షించారు. ఇంటర్ పరీక్ష కేంద్రం తనిఖీ జనగామ రూరల్: జిల్లా కేంద్రంలోని ధర్మకంటలోని కోఎడ్యుకేషన్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని సోమవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, సీసీ కెమెరాల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి వసతి, మెడికల్ సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట డీఐఈఓ జితేందర్రెడ్డి, అధికారులు ఉన్నారు. కాగా సోమవారం జరిగిన పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 4,678 మంది విద్యార్థులకు గాను 4,440 మంది హాజరు కాగా 238 మంది గైర్హాజరయ్యారని ఇంటర్ విద్యాధికారి జితేందర్రెడ్డి తెలిపారు. ‘దేశాభివృద్ధికి జమిలి ఎన్నికలే మేలు’ జనగామ రూరల్: దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలంటే జమిలి ఎన్నికల నిర్వహణతోనే సాధ్యం అవుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా ప్రోగ్రాం కన్వీనర్ ప్రజ్జురి లక్ష్మీనర్సయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యం పటిష్టంగా క్షేత్రస్థాయి నుంచి బలపడాలంటే జమిలి ఎన్నికలే శరణ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేవీఎల్ఎన్ రెడ్డి, శోభనబోయిన శివరాజ్ యాదవ్, దుబ్బ రాజశేఖర్, కొంతం శ్రీనివాస్, పూసాల శ్రీమాన్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు. -
ఒత్తిడితో తలొగ్గిన ప్రభుత్వం
జనగామ: ఎండుతున్న పంటలకు సాగునీరు అందించి ఆదుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి ఫలితంగానే దేవాదుల థర్డ్ ఫేజ్ బటన్ను ఆన్ చేయనున్నట్లు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి ఆయన మాట్లాడుతూ దేవన్నపేట నుంచి ధర్మసాగర్కు వచ్చే థర్డ్ ఫేజ్ను ఈ నెల 19న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆన్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా తపాస్పల్లి, గండిరామారం, బొమ్మకూరు, కన్నెబోయినగూడెం, వెల్దండ, లద్నూర్ రిజర్వాయర్లను నింపి జనగామ నియోజకవర్గంలోని ఆయకట్టు ప్రాంతానికి సాగునీరు ఇవ్వాల్సిన ప్రభుత్వం, పంట కోత దశకు వచ్చి ఎండుతున్నా.. పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజన్లో 60 రోజుల్లో కేవలం 40 రోజులు మాత్రమే పంపులను నడిపించడం బాధాకరమన్నారు. జనగామ నియోజకవర్గంలోని దేవాదుల ఆయకట్టు పరిధిలో 50 శాతం మేర పంట పూర్తిగా ఎండిపోయిందన్నారు. పంటల పరిస్థితిపై రైతులు ప్రతిరోజు తన దృష్టికి తీసుకువచ్చారని, ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు జిల్లా ఇరిగేషన్ అధికారుల నుంచి ఉన్నతాధికారులు, మంత్రి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందన్నారు. అసెంబ్లీ వేదికగా ఇక్కడి దయనీయ పరిస్థితులను వివరించడం జరిగిందన్నారు. జనగామ నియోజకవర్గంలోని రిజర్వాయర్లు, చెరువులను నింపి భూగర్భ జలాల పెంపుపై దృష్టి సారించాలన్నారు. కరువు నేపథ్యంలో ఎండిన ప్రతీ ఎకరాకు ప్రభుత్వం తరఫున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. రేపు దేవాదుల మూడో ఫేజ్ బటన్ ఆన్ చేయనున్న మంత్రి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
ప్రతిభతోనే ఉజ్వల భవిష్యత్
కేయూ క్యాంపస్ : ప్రతిభతోనే ఇంజినీరింగ్లో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులు నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ను కూడా పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. సోమవారం రాత్రి కాకతీయ యూనివర్సిటీలోని కో ఎడ్యుకేషన్ ఇంజినీరింగ్ కాలేజీ వార్షికోత్సవం సందర్భంగా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డేను ఘనంగా నిర్వహించారు. అతిథులు జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలో ఇంజినీరింగ్ యువత 40శాతం మంది ఉద్యోగ, ఉపాధి రంగాల్లో దూసుకుపోతున్నారని తెలిపారు. జాతీయ హాకీ జట్టు రిటైర్డ్ కోచ్ మధుచరణ్ మాట్లాడుతూ యువత సక్సెస్కు చదువుతోపాటు క్రీడలు కూడా అత్యంత ప్రాధాన్యత వహిస్తాయని తెలిపారు. పాలక మండలి సభ్యులు డాక్టర్ చిర్ర రాజు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.రమణ మాట్లాడారు. వివిధ క్రీడల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. కల్చరల్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలతోపాటుగా ఆధునిక డ్యాన్స్లతో హోరెత్తించారు. అధ్యాపకులు సీహెచ్ రాధిక, ఆసిం ఇక్బాల్, వి.మహేందర్, శ్రీధర్ కుమార్, సుమలత, దాసరి శైలజ, రాజేశ్వరి, పర్వీన్,శిరీష బోధన, బోధనేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. కేయూ వీసీ ప్రొఫెసర్ ప్రతాప్రెడ్డి ఘనంగా ఇంజనీరింగ్ కాలేజీ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డే -
ఖాళీ బిందెలతో నిరసన
తరిగొప్పుల: మండలంలోని అంకుషాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో బంజరుపల్లిలో నీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ గత 15 రోజులుగా నల్లాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా.. స్పందించడం లేదని, కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా నీరు లేదన్నారు. సమీప వ్యవసాయ, బోరు బావుల వద్ద నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికై న సంబంధిత అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. -
మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025
ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెన్త్ విద్యార్థుల వివరాలు– 8లోuఏడాదంతా చదివింది ఒక ఎత్తయితే.. దాన్ని పరీక్షల్లో ప్రజెంట్ చేయడం మరో ఎత్తు.. కొందరు విద్యార్థులు బాగా చదువుతారు. తీరా పరీక్ష సమయానికి మరిచిపోతుంటారు.. మరికొందరేమో ఎంత చదివినా హ్యాండ్ రైటింగ్ బాగోలేక మార్కులు కోల్పోతారు.. ఇంకొందరైతే పరీక్ష అంటే గాబరా పడిపోయి ప్రశ్నల కు సమాధానం తెలిసినా నిర్ణీత సమయంలో రాయలేకపోతారు.. ఇలా చాలా మంది విద్యార్థులు ఏదో ఒక సమస్యతో బాధపడేవారే. వీరంతా మంచి మార్కులు సాధించేందుకు, పరీక్షలను ఈజీగా రాసేందుకు సబ్జెక్టు నిపుణులు సూచనలిస్తున్నారు. ఈనెల 21 నుంచి పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. మంచి మార్కులు సాధించడానికి ఆయా సబ్జెక్టుల నిపుణులను ‘సాక్షి’ పలకరించింది. విద్యార్థుల కోసం వారు తమ సూచనలు, సలహాలు వెల్లడించారు. – మహబూబాబాద్ అర్బన్ మొత్తం విద్యార్థులు 42,262బాలికలు 20,600బాలురు 21,662ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలిపదో తరగతి వార్షిక పరీక్షలు మరో మూడ్రోజుల్లో ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలి. బాగా చదివాను.. పరీక్షలు బాగా రాస్తాను.. అనే భావనతో వెళ్లాలి. నెగెటివ్ ఆలోచనలను దరిచేర నీయొద్దు. గతంలో సాధించిన విజయాలను గుర్తు చేసుకోవాలి. టీవీ, సెల్ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు వహించాలి. ఫాస్ట్ఫుడ్, జంక్ఫుడ్ జోలికి వెళ్లొద్దు. సాత్విక ఆహారం తీసుకుంటే తొందరగా జీర్ణమవుతుంది. తగినంతగా నీరు తాగాలి. ఎవరైనా ఒత్తిడికి లోనైనా.. పరీక్షలంటే భయం కలిగినా 93911 17100, 94408 90073 నంబర్లకు ఫోన్ చేస్తే తగిన సూచనలిస్తాం. – పోగు అశోక్, తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వివరాలు 8లోu -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
పాలకుర్తి టౌన్: ఈ నెల 23న హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు పాలకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు పీడీ మామిండ్ల సోంమల్లు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ పాఠశాలకు చెందిన గుంజె శ్రీవల్లి, లకావత్ నిఖిల్ ఈ నెల 13న జిల్లా కేంద్రంలోని ధర్మకంచలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు తెలిపారు. ఈ మేరకు హెచ్ఎం పాయం శోభారాణి, ఉపాధ్యాయులు ఓరుగంటి రమేశ్, గుగులోతు బలరాం, అశోక్కుమార్, మరియా, జతృత, రవి, నరసింహమూర్తి, గ్రామస్తులు విద్యార్థులను అభినందించారు. వర్గీకరణ ప్రకారమే నియామకాలు చేపట్టాలి జనగామ రూరల్: ఎస్సీ వర్గీకరణ ప్రకారమే ఉద్యోగ నియామకాలు చేపట్టేలా మార్గదర్శకాలు విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగళ్ల ఉపేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హక్కుల సాధనకు కలెక్టరేట్ వద్ద చేట్టిన దీక్షలు సోమవారం ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బోట్ల మహేశ్, గద్దల కిశోర్, రాజశేఖర్, గువ్వల రవి, శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిభతోనే ఉజ్వల భవిష్యత్
కేయూ క్యాంపస్ : ప్రతిభతోనే ఇంజినీరింగ్లో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులు నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ను కూడా పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. సోమవారం రాత్రి కాకతీయ యూనివర్సిటీలోని కో ఎడ్యుకేషన్ ఇంజినీరింగ్ కాలేజీ వార్షికోత్సవం సందర్భంగా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డేను ఘనంగా నిర్వహించారు. అతిథులు జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలో ఇంజినీరింగ్ యువత 40శాతం మంది ఉద్యోగ, ఉపాధి రంగాల్లో దూసుకుపోతున్నారని తెలిపారు. జాతీయ హాకీ జట్టు రిటైర్డ్ కోచ్ మధుచరణ్ మాట్లాడుతూ యువత సక్సెస్కు చదువుతోపాటు క్రీడలు కూడా అత్యంత ప్రాధాన్యత వహిస్తాయని తెలిపారు. పాలక మండలి సభ్యులు డాక్టర్ చిర్ర రాజు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.రమణ మాట్లాడారు. వివిధ క్రీడల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. కల్చరల్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలతోపాటుగా ఆధునిక డ్యాన్స్లతో హోరెత్తించారు. అధ్యాపకులు సీహెచ్ రాధిక, ఆసిం ఇక్బాల్, వి.మహేందర్, శ్రీధర్ కుమార్, సుమలత, దాసరి శైలజ, రాజేశ్వరి, పర్వీన్,శిరీష బోధన, బోధనేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. కేయూ వీసీ ప్రొఫెసర్ ప్రతాప్రెడ్డి ఘనంగా ఇంజనీరింగ్ కాలేజీ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డే -
ఆందోళనకు గురికావొద్దు
జనగామ రూరల్: రానున్న పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు ఆందోళనకు గురికావొద్దని, ప్రశాంతంగా రాయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించనున్న టెన్త్ పరీక్ష నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా జిల్లాలోని పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలకు ప్రతీ విద్యార్థి హాజరయ్యేలా ఉపాధ్యాయులు తగిన జాగ్రత్తలు వహించాలన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఆరోగ్యంపై కూడా తగిన శ్రద్ధ వహించాలని, తగినంత వ్యాయామం, మంచి పోషకాహారం, నిద్ర కూడా తగినంత ఉండేవిధంగా చూసుకోవాలన్నారు. పరీక్షలకు వెళ్లబోయే చివరి వారం రోజుల్లో కొత్త విషయాలు చదవకుండా చదివిన విషయాలని మళ్లీ రివిజన్ చేసుకోవాలన్నారు. ప్రతీ విద్యార్థి పరీక్షకు హాజరు అయ్యేలా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లా, మండలాల్లో టాప్ స్కోర్ సాధించిన విద్యార్థికి సైకిల్ బహుమతిగా ఇస్తామన్నారు. వందశాతం ఫలితాలు సాధించిన పాఠశాలలకు కూడా ప్రత్యేక అవార్డులు ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డీఈఓ రమేశ్, ఏసీజీ రవికుమార్, గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా పరీక్షలు రాయాలి జిల్లా, మండల టాపర్లకు బహుమతులు కలెక్టర్ రిజ్వాన్ బాషా -
ప్రజలను మోసం చేసేందుకు కుట్ర
స్టేషన్ఘన్పూర్: నియోజకవర్గ ప్రజలను మరోసారి దగా చేసేందుకు సీఎంతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుట్ర చేస్తూ అభివృద్ధి పనులు అంటూ ప్ర జలను మభ్యపెడుతున్నాడని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పెరుమాండ్ల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశా రు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం శివునిపల్లిలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పచ్చి అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. బీఆర్ఎస్లో ఎంపీ, ఎమ్మెల్సీ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనిపించలేదా అని ప్రశ్నించారు. మామునూరు ఎయిర్పోర్టు గురించి మాట్లాడుతున్నారని, గతంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం నిధులు మంజూరు చే స్తుందని గుర్తించాలన్నారు. మండల ప్రధాన కార్యదర్శి గోనెల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రడపాక ప్రదీప్, నాయకులు ఇల్లందుల సారయ్య, కుమ్మం సతీష్, గోనెల శివకృష్ణ, తాళ్లపెల్లి శ్రీనివాస్, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వెంకటేశ్వర్లు -
సోమేశ్వరాలయంలో భక్తుల సందడి
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో సోమవారం భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ ఈఓ సల్వా ది మోహన్బాబు ఏర్పాట్లును పర్యవేక్షించారు. ఇంటర్ పరీక్ష కేంద్రం తనిఖీ జనగామ రూరల్: జిల్లా కేంద్రంలోని ధర్మకంటలోని కోఎడ్యుకేషన్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని సోమవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, సీసీ కెమెరాల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి వసతి, మెడికల్ సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట డీఐఈఓ జితేందర్రెడ్డి, అధికారులు ఉన్నారు. కాగా సోమవారం జరిగిన పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 4,678 మంది విద్యార్థులకు గాను 4,440 మంది హాజరు కాగా 238 మంది గైర్హాజరయ్యారని ఇంటర్ విద్యాధికారి జితేందర్రెడ్డి తెలిపారు. ‘దేశాభివృద్ధికి జమిలి ఎన్నికలే మేలు’ జనగామ రూరల్: దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలంటే జమిలి ఎన్నికల నిర్వహణతోనే సాధ్యం అవుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా ప్రోగ్రాం కన్వీనర్ ప్రజ్జురి లక్ష్మీనర్సయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యం పటిష్టంగా క్షేత్రస్థాయి నుంచి బలపడాలంటే జమిలి ఎన్నికలే శరణ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేవీఎల్ఎన్ రెడ్డి, శోభనబోయిన శివరాజ్ యాదవ్, దుబ్బ రాజశేఖర్, కొంతం శ్రీనివాస్, పూసాల శ్రీమాన్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు. -
తగ్గిన ధాన్యం దిగుబడి
● కరువు కాటేసింది.. పంట తగ్గింది ● వానాకాలంలో 55 వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంట ● లక్ష్యం 20 లక్షల క్వింటాళ్లు.. సేకరణ 9.10 లక్షలే.. ● బోనస్ కోసం అన్నదాతల ఎదురుచూపులు ● యాసంగి సీజన్కు యాక్షన్ ప్లాన్కు సన్నద్ధంజనగామ: వానాకాలం సీజన్లో ప్రకృతి వైపరీత్యాలతో ధాన్యం దిగుబడి తగ్గింది. సాగునీటి కొరత రైతులను వెంటాడింది. దీంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపించింది. 25 లక్షల క్వింటాళ్ల మేర దిగుబడి వస్తుందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. పొట్టదశలో చీడపీడలు, కోత దశలో వడగళ్లు, అకాల వర్షాలు 40 శాతం పంటను నాశనం చేసింది. జిల్లాలో 2 లక్షల ఎకరాలకు పైగా వరి సాగు చేయగా, 55 వేల పైచిలుకు ఎకరాల పరిధిలో పంట దెబ్బతింది. అకాల వర్షాల భయంతో చాలా మంది రైతులు పచ్చి మీదనే కోతలు మొదలు పెట్టి, 30, 40 శాతానికి పైగా తేమతో ధాన్యం గింజలను మార్కెట్కు తరలించారు. ప్రభుత్వం అప్పటి వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో క్వింటాకు మద్దతు ధర కంటే రూ.200 నుంచి రూ.400 వరకు తక్కువకు అమ్ముకున్నారు. కోతలు మొదలైన 20 రోజుల తర్వాత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను అందుబాటులో తీసుకురాగా, అప్పటికే ప్రైవేట్లో 6 లక్షల క్వింటాళ్లకు పైగా ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. 25 లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా.. జిల్లాలో వానాకాలం సీజన్లో ఽ20 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రకృతి వైపరీత్యాలతో 55 వేల ఎకరాలకు పైగా పంటపై తీవ్ర ప్రభావం చూపించింది. మొత్తంగా 25 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేయగా, సుమారు 5 లక్షల క్వింటాళ్ల మేర దిగుబడి తగ్గగా, ప్రైవేట్తో పాటు ఎక్స్పోర్టులో 8 లక్షల వరకు కొనుగోళ్లు జరిగాయి. దిగుబడి అంచనా మేరకు 20 లక్షల క్వింటాళ్ల ధాన్యం సేకరణ లక్ష్యంగా రంగంలోకి దిగారు. సుమారు నెల రోజులకు పైగా కొనుగోళ్లు జరిగాయి. జిల్లాలో 17,391 మంది రైతుల వద్ద దొడ్డు, సన్న రకానికి చెందిన ధాన్యం 9.10లక్షల (9,10,043 మెట్రిక్ టన్నులు) క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో దొడ్డురకం 6,22,061 క్వింటాళ్లు, సన్నరకం 2,87,082 క్వింటాళ్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ మొత్తానికి రూ.211.21 కోట్లకు గాను వందశాతం చెల్లింపులు పూర్తయ్యాయి. సన్న ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ చొప్పున రూ.14.39 కోట్లు ఇవ్వాల్సి ఉంది. దీంట్లో ఇప్పటి వరకు రూ.14.18 కోట్లు ఇవ్వగా, ఇంకా రూ.21.21 లక్షలు పెండింగ్లో ఉన్నాయి. దీంతో రైతులకు బోనస్ డబ్బుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. రైతుల వద్ద కొనుగోలు చేసిన సన్న, దొడ్డు రకం ధాన్యాన్ని సీఎంఆర్ కోసం రైస్మిల్లులకు తరలించారు. -
ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి
జనగామ రూరల్: జిల్లాలో ఎండిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో అహల్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతోనే యాసంగి పంటలు ఎండిపోయాయన్నారు. ఇప్పటికై నా జిల్లాలోని ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకుపోయి పంటలు ఎండిన రైతులకు ఎకరాలకు రూ.50వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాపర్తి రాజు, సాంబరాజు యాదగిరి, సింగారపు రమేశ్, రాపర్తి సోమయ్య బొట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, జోగు ప్రకాష్, ఉపేందర్ బెల్లంకొండ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి -
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి●
● ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పాలకుర్తి టౌన్ : ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాలకు చెందిన 76 మంది లబ్ధిదారులకు రూ.26.80 లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారన్నారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మంజుల, రాపాక సత్యనారాయణ, కుమారస్వామి, సురేష్నాయక్, ఎండీ మదార్, యాకాంతరావు తదితరులు పాల్గొన్నారు. -
దేవాదుల మూడో ఫేజ్ ఆన్ చేయండి
జనగామ: నియోజకవర్గంలో దేవాదుల ఆయకట్టు పరిధిలో యాసంగి సీజన్లో సాగు చేసిన వరి, ఇతర పంటలను కాపాడేందుకు వెంటనే దేవాదుల మూడో ఫేజ్ బటన్ ఆన్చేసి సాగునీరు అందించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. చేర్యాల రెవెన్యూ డివిజన్, తపాస్పల్లి రిజర్వాయర్లో నీటిని నింపేందుకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డిని ఆదివారం కలిసి సహకారాన్ని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం ప్రాజెక్టుకు నీరు వస్తున్న క్రమంలో అత్యవసరంగా విడుదల చేసి, ఎండుతున్న వేలాది ఎకరాలను బతికించాలని విజ్ఞప్తి చేశారు. ఆలేరు ప్రాంతం ఆయకట్టు, కాల్వల పరిధిలో లేకున్నా, విప్ బీర్ల అయిలయ్య తపాస్పల్లి రిజర్వాయర్ వద్దకు వచ్చి నీళ్లన్నీ జులుం చేసి తీసుకుపోయారన్నారు. తపాస్పల్లి రిజర్వాయర్ నింపేందుకు ఎంపీ సహకారం అందించాలన్నారు. ముందస్తు అరెస్ట్లు అప్రజాస్వామికం జనగామ రూరల్: స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జనగామలో బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్నారు. స్టేషన్ ఘన్ఫూర్లో పర్యటన ఉంటే జనగామ నేతలు ఎందుకు అరెస్ట్ చేశారో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికై నా నియోజకవర్గంలో ప్రజలు, రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. అలాగే సీపీఎం నాయకులను, ప్రజాసంఘాల నాయకులు, ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసి సభ నిర్వహించడం సిగ్గుచేటని సీపీఎం జిల్లా కార్యదర్శి కనకారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఎంపీ సహకారం కోరిన ఎమ్మెల్యే పల్లా -
హైదరాబాద్తో
సోమవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2025– 8లోuసభలో అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డిబహిరంగ సభకు హాజరైన ప్రజలు, రిమోట్ ద్వారా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి, చిత్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య, ప్రజాప్రతినిధులుసాక్షి ప్రతినిధి, వరంగల్/జనగామ/స్టేషన్ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ శివారు శివునిపల్లిలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఓరుగల్లుపై వరాల జల్లు కురిపించారు. మరోవైపు బీఆర్ఎస్, కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులపై విమర్శలు గుప్పించారు. శివునిపల్లిలో ఈ కార్యక్రమం రాజకీయ పార్టీగా ఏర్పాటు చేసింది కాదని, ఓట్ల కోసం రాలేదన్న ఆయన.. స్టేషన్ఘన్పూర్ అభివృద్ధిలో భాగంగా రూ.800 కోట్ల నిధులతో ప్రగతి కోసం తలపెట్టిన బహిరంగ సభ అని స్పష్టం చేశారు. వరంగల్ నగరాన్ని హైదరాబాద్తో పోటీ పడేలా అభివృద్ధి చేస్తామని, ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ ఇందుకోసం ఎన్ని నిధులైనా కేటాయిస్తామని ప్రకటించారు. మరోవైపు వరంగల్ అంటే తనకు ప్రత్యేక అభిమానమన్న ముఖ్యమంత్రి.. ఉమ్మడి జిల్లాను విద్య, వైద్యం, పర్యాటక, ఐటీ హబ్లుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందన్నారు. సీఎం సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. కడియం శ్రీహరిని నేనే రమ్మన్నా.. ఈ ప్రభుత్వం వచ్చాకే వరంగల్కు ఎయిర్పోర్టు, కాజీపేటకు రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, వరంగల్కు రింగ్రోడ్డు వచ్చాయని రేవంత్రెడ్డి గుర్తు చేశారు. ఎంపీ కడియం కావ్య ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా జీఎంఆర్ నుంచి క్లియరెన్స్ తీసుకుని కేంద్ర మంత్రులను కలిసి ఎయిర్పోర్టు సాధించామని తెలిపారు. అలాగే, రైల్వే కోచ్ఫ్యాక్టరీని సాధించామని, కాజీపేట రైల్వే డివిజన్ చేయడం కోసం ఎంపీ కావ్యతోపాటు తన కృషి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. వరంగల్ నగరంలో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, ఔటర్ రింగ్రోడ్డు, ఇన్నర్ రింగ్రోడ్డుతోపాటు పలు అభివృద్ధి పథకాల కోసం రూ.6,500 కోట్లు మంజూరు చేశామని, త్వరలోనే ఆ పనులు మొదలవుతాయన్నారు. జయశంకర్ సర్ స్వగ్రామం అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా చేసింది ఈ ప్రభుత్వమేనన్న ఆయన.. మహిళలకు వెయ్యి బస్సులు ఇచ్చి ఆర్టీసీలో అద్దెకు తీసుకున్నామని చెప్పారు. మహిళల చేత వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయించడం ద్వారా ఉమ్మడి వరంగల్కు చెందిన మహిళలకు మేలు జరిగిందని తెలిపారు. అభివృద్ధిలో భాగంగా ఇంటిగ్రేటెడ్ హాస్టల్, వంద పడకల ఆస్పత్రి, ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు వంటి శాశ్వత ప్రాతిపదికన స్టేషన్ఘన్పూర్ అభివృద్ధికి రూ.800 కోట్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక కడియం శ్రీహరి సేవలు గుర్తెరిగి ఆయన నిజాయితీ, అనుభవం కావాలని, తానే అక్కున చేర్చుకొని పార్టీలో చేరాలని కోరినట్లు రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. మా కోరిక మేరకు ఆయన పార్టీలో చేరగా.. చెల్లెలు డాక్టర్ కావ్యను ఎంపీగా గెలిపించారన్నారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తికావాలంటే శ్రీహరి నాయకత్వాన్ని బలపర్చాలని ప్రజలను కోరారు. కేసీఆర్, ఆయన కుటుంబంపై ఘాటైన విమర్శలు.. జనగామ జిల్లా శివునిపల్లి వేదికగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబంపై సీఎం రేవంత్రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, టి.హరీశ్రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపైన ఆయన కామెంట్స్ చేశారు. ‘అధికారం ఉంటే తప్ప కేసీఆర్ ప్రజల్లోకి రాలేరా? ఆయన బయటకు రాకుండా కొడుకు, అల్లుడిని ఊరు మీదకు వదులుతున్నారు. బయటకు రానప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా ఎందుకు? జీతభత్యాలు ఎందుకు?.. ఇలా చేస్తేనే కదా కాంగ్రెస్ దెబ్బ ఎలా ఉంటుందో 2023లో ప్రజలు చూపించారు’ అంటూ విమర్శలు చేశారు. ‘క్యాప్సికం పండిస్తే రూ.కోట్లు వస్తాయన్న కేసీఆర్.. ఆ టెక్నిక్ ఏంటో ప్రజలకు చెప్పండి.. నీ లక్ష కోట్ల సంపాదన నైపుణ్యం ఏంటో ప్రజలకు చెప్పండి.. వెయ్యి మంది యువకులను నీ ఫామ్ హౌస్కు పంపిస్తాం. ఆ టెక్నిక్ ఏంటో వారికి నేర్పించండి’ అంటూ ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్ము దోచుకుని పేపర్, టీవీ చానళ్లు పెట్టుకున్న వ్యక్తి జాతిపిత ఎలా అవుతారని ప్రశ్నించిన సీఎం రేవంత్రెడ్డి.. ఆయనతోపాటు కేటీఆర్, హరీశ్రావు, కవితకు ఫామ్హౌస్లు ఎక్కడినుంచి వచ్చాయని ప్రశ్నించారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి సీతక్క, కొండా సురేఖ, ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్కుమార్రెడ్డి, పోరిక బలరాంనాయక్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్.నాగరాజు, యశస్వినిరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, తెలంగాణ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్, కలెక్టర్ షేక్ రిజ్వాన్బాషా, అదనపు కలెక్టర్లు పింకేష్కుమార్, రోహిత్సింగ్, నాయకులు ఝాన్సీరెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్య పాల్గొన్నారు. న్యూస్రీల్ పక్కాగా సంక్షేమ పథకాల అమలు మామునూరు ఎయిర్ పోర్ట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాంగ్రెస్ ఘనతే.. ప్రతిష్టాత్మకంగా విమానాశ్రయాన్ని నిర్మిస్తామని స్పష్టీకరణ విద్య, వైద్యం, పర్యాటక, ఐటీ హబ్గా ఓరుగల్లుకు ప్రాధాన్యం.. ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభ విజయవంతం -
రేవంత్ టీ–20 మ్యాచ్ ఆడుతున్నారు..
● సవాళ్లు, ప్రతి సవాళ్లు ఎదుర్కొంటూ ప్రజాపాలన సాగిస్తున్నారు ● స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రూ.630.27 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు సీఎం సభలో తెలంగాణ ఉద్యమ కళాకారుల నిరసన –8లో -
నేడు ‘సీఎం కృతజ్ఞత సభ’
సీఎం టూర్ షెడ్యూల్ ఇలా.. మధ్యాహ్నంగంటలకు ఇంటినుంచి (హైదరాబాద్లో) బయలుదేరి బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు గంటకు స్టేషన్ఘన్పూర్ మండలం శివునిపల్లి హెలిపాడ్కు చేరుకుంటారు. నుంచి 1.20 గంటల వరకు ఇందిర మహిళశక్తి స్టాళ్లను పరిశీలించి, వివిధ గ్రూపులకు కేటాయించిన బస్సులను ప్రారంభిస్తారు నుంచి 3 గంటల వరకు శివునిపల్ల్లిలో ప్రజాపాలన కార్యక్రమాలు, కృతజ్ఞత సభలో పాల్గొంటారు. గంటలకు శివునిపల్లి హెలిపాడ్ నుంచి బయలుదేరి 3.45 గంటలకు హెలికాప్టర్లో బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు.స్టేషన్ఘన్పూర్లో ఏర్పాట్లు పూర్తి● రూ.700 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ● మహిళా సంఘాలకు రూ.100 కోట్ల రుణాలు.. ● వ్యవసాయ మార్కెట్ సమీపంలో బహిరంగ సభ ● రెండు రూట్లు.. 50వేల మంది జనసమీకరణ ● 850 మంది పోలీసు బలగాలతో బందోబస్తు ● ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే కడియం, ఎంపీ కావ్య, కలెక్టర్, సీపీ అధికారులు 12:1012:2501:0001:1001:2503:10 -
ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ స్టేషన్ఘన్పూర్: సీఎం రేవంత్రెడ్డి సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకో వాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అన్నారు. శనివారం ఆయన స్థానిక పోలీస్స్టేషన్ను సందర్శించారు. పరిసరాలు, పోలీసు సిబ్బంది గృహ సముదాయం, అలాగే స్టేషన్లోని రికార్డులు, సీసీ కెమెరాలను పరిశీలించారు. శాంతిభద్రతల పరిస్థితి, ఫిర్యాదుల వివరా లను సీఐ వేణును అడిగి తెలుసుకున్నారు. అనంతరం శివునిపల్లిలో ఆదివా రం జరిగే సీఎం రేవంత్రెడ్డి పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లు, బందోబస్తుపై పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సభాస్థలి, హెలిప్యాడ్ వద్ద పోలీసు బందోబస్తు, వాహనా ల పార్కింగ్, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీలు భీమ్శర్మ, నర్సయ్య, సీఐ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్వయం అభ్యసనతో విద్యాభివృద్ధి
● అదనపు కలెక్టర్ పింకేశ్కుమార్ లింగాలఘణపురం: విద్యార్థులు స్వయం అభ్యసనతో విద్యాభివృద్ధి సాధించాలని అదనపు కలెక్టర్ పింకేశ్కుమార్ అన్నారు. పీఎం శ్రీ పథకం కింద ఎంపి కైన నేలపోగుల యూపీఎస్, కళ్లెం పీఎస్లలో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఆధారిత బోధనకు సంబంధించిన కంప్యూటర్ ల్యాబ్ను శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చదువులో వెనుకబడిన 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఈ–ల్యాబ్లో బోధన చేసి వారిని అభివృద్ధి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో డీఈఓ రమేశ్, ఏఎంఓ శ్రీనివాసు, జీసీడీఓ గౌసియా, ఎంఈఓ విష్ణుమూర్తి, కాంప్లెక్ హెడ్మాస్టర్, శ్రీలత, నేలపోగుల హెడ్మాస్టర్ నవీన్కుమార్ పాల్గొన్నారు. -
జీవన విధానంలో మార్పులు అవసరం
● హైకోర్టు న్యాయవాది సాధిక్ అలీ జనగామ రూరల్: సుస్థిర జీవన విధానానికి సరళమైన మార్పులు అవసరమని హైకోర్టు న్యాయవాది సాధిక్ అలీ అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా శనివారం సమాచార కేంద్రం, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యాన పట్టణంలోని గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత విధానానికి అనేక మార్పులు చేసుకుంటే తప్ప సుస్థిర జీవనం సాధ్యం కాదన్నారు. ఒక వైపు ప్రకృతిని విధ్వంసం చేస్తూ మనం మంచి జీవితాన్ని పొందలేమని పేర్కొన్నారు. సమాజ మార్పును యువతే తేగలదని, ఇందుకు డిగ్రీ, పీజీ విద్యార్థినీ విద్యార్థులు నడుం బిగించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ డిఫెన్స్ కౌన్సిల్ మంచాల రవీందర్, కళాశాల ప్రిన్సిపాల్ సంధ్యారాణి, జిల్లా పౌరసరఫరాల శాఖ డీటీ భీమా తదితరులు పాల్గొన్నారు. -
టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్కు ఎంపిక
చిల్పూరు: పల్ల గుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు సురేష్ జాతీయ స్థాయి సివిల్ సర్వీసెస్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్కు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సురేష్ను హెచ్ఎం కేతిడి నరసింహారెడ్డి అభినందించిన అనంతరం మాట్లాడారు. ఈ ఏడాది జనవరి 23, 24 తేదీల్లో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన స్టేట్ లెవల్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన సురేష్.. ఢిల్లీలో ఈనెల 16 నుంచి జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. చిల్పూరు ఆలయ చైర్మన్ శ్రీధర్రావు, చిర్ర సుమన్గౌడ్, చిర్ర నాగరాజు, శ్యాంసుందర్, రత్నాకర్రెడ్డి, జీడి ఆనందం పాల్గొన్నారు. స్కాలర్షిప్ విడుదల చేయాలి జనగామ రూరల్: తమ చదువులకు స్కాలర్ షిప్ విడుదల చేయాలి.. ప్రభుత్వం దగ్గర నిధులు లేవనడం సరికాదు.. తామే ప్రభుత్వానికి నిధులు పంపిస్తాం.. అంటూ వందేమాతరం స్టూడెంట్ ఫెడరేషన్(వీఎస్ఎఫ్) ఆధ్వర్యాన శనివారం జనగామలో విద్యార్థులు పలు దుకాణాల వద్దకు వెళ్లి భిక్షాటన చేసి నిరసన తెలిపారు. స్కాలర్షిప్ విడుదల చేయక తమ చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సర్కారు పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా భిక్షాటన చేసి నిధులు సేకరిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నల్ల రాహుల్, పట్టణ అధ్యక్షు డు మహ్మద్ ఇమ్రాన్ పాల్గొన్నారు. హామీలు నెరవేర్చాకే జిల్లాలో అడుగుపెట్టాలి..జనగామ రూరల్: సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతే జిల్లాలో అడుగు పెట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలో ని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ పరిధి శివునిపల్లిలో 117 ఎకరాల్లో రూ. 275 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో లెదర్ పార్క్ నిర్మాణం చేపట్టాలని 1999లో ప్రతిపాదనలు చేశారని, రెండు విడతల్లో 120 మందికిపైగా లెదర్ ఉత్పత్తుల తయారీపై చైన్నెలో శిక్షణ తీసుకున్నా ఇప్పటివరకు పార్క్ ఏర్పాటు కాలేదన్నారు. అలాగే 2009లో పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ల పనులకు రూ.370 కోట్లతో ప్రతిపాదనలు చేసి 2021లో ప్రారంభించినా.. నిధుల కొరతతో అసంపుర్ణంగా వదిలేశారని చెప్పారు. జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ ఏర్పాటు హామీ కలగానే మిగిలిందని.. వీటి సాధనకు తమ పార్టీ ఆందోళనలు చేపడుతున్నదని పేర్కొన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు కేవీఎల్ఎన్.రెడ్డి, ఉడుగుల రమేశ్, శివరాజ్, ఎల్లయ్య, శ్రీనివాస్, లక్ష్మీనరసయ్య, మహిపా ల్, నవీన్రెడ్డి, రవి, జగదీష్ పాల్గొన్నారు. ‘ముసాయిదాను వెనక్కి తీసుకోవాలి’కేయూ క్యాంపస్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి న యూజీసీ నూతన ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని టీపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి కడారి భోగేశ్వర్ డిమాండ్ చేశారు. శనివా రం పీడీఎస్యూ ఆధ్వర్యంలో.. కేయూ దూర విద్యాకేంద్రంలో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్సిటీల కు నిధులు సమకూర్చేందుకు ఏర్పడిన(యూజీసీ) యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా నూతన నిబంధనలతో ముసాయి దాను రూపొందించిందన్నారు. పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ, బీసీ విద్యార్థి సంఘం నాయకులు పి.మహేశ్, శ్రీకాంత్, నాగరాజు పాల్గొన్నారు. -
రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలి
● సీపీఎం ఆధ్వర్యాన రాస్తోరోకో జనగామ రూరల్: జిల్లాలో ఎండిన వరి, ఇతర పంటలకు నష్టపరిహారం కింద ఎకరాకు రూ.50 వేల చొప్పున చెల్లించడానికి సీఎం రేవంత్రెడ్డి రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలి.. ఈ మేరకు డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యాన పట్టణంలో నెహ్రూపార్క్ వద్ద శనివారం రాస్తోరోకో చేశారు. ఈసందర్భంగా జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి మాట్లాడుతూ.. భూగర్భ జలాలు తగ్గడంతో యాసంగిలో నీటి వనరుల ఆధారంగానే రైతులు తక్కువ ఎకరాల్లో పంట లు వేశారని, ప్రభుత్వం చెరువులు, కుంటలు నింపకపోవడంతో పంటలు ఎండిపోయాయన్నారు. రైతులందరికీ బ్యాంకు రుణాలు మాఫీ కాకపోవడంతో ‘రైతు భరోసా’ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదని, దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల సర్వే చేపట్టి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఇర్రి అహల్య, బోట్ల శేఖర్, బూడిద గోపి, అజారుద్ధీన్, వెంకటమల్లయ్య, కుర్ర ఉప్పలయ్య, మహేందర్, సురేష్, బాలరాజు, బీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి ● సభాస్థలి వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్ స్టేషన్ఘన్పూర్: ఈనెల 16న స్టేషన్ఘన్పూర్లో నిర్వహించనున్న సీఎం సభకు సంబంఽధించిన ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలో శివునిపల్లిలో వ్యవసాయ మార్కెట్ సమీపాన నిర్వహించనున్న సీఎం రేవంత్రెడ్డి సభకు సంబంధించిన సభాస్థలాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ రిజ్వాన్ బాషా శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడుతూ పార్కింగ్ స్థలాలు, తాగునీటి సౌకర్యం తదితర అంశాలపై చర్చించారు. ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, సరిపడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇతర మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సీఎం సభను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రోహిత్సింగ్, పింకేష్కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాపై సీఎంకు ప్రత్యేక అభిమానం● డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి జనగామ: జిల్లా అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డికి ప్రత్యేక అ భిమానం ఉందని డీసీపీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడు తూ ఈ నెల 16న స్టేషన్ఘన్పూర్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమా ల కోసం సీఎం రానున్నట్లు తెలిపారు. దోపిడీకి గు రైన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం మొక్కవోని దీక్షతో పని చేస్తున్నారన్నారు. అ భివృద్ధిలో వెనకబడి ఉన్న ప్రాంతాలపై సీఎం ఫోకస్ సారిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం నియోజకవర్గాల్లో కనీస మౌలిక వసతులు కల్పించ లేకపోయిందన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి నాయకత్వంలో స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధికి బాటలు వేసుకుంటుందన్నారు. సీఎం పర్యటన నేపధ్యంలో అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించి, ప్రజాపాలనకు మద్దతు పలకాలన్నారు. -
సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలి
దేవరుప్పుల: ఆధ్యాత్మిక చింతనతోనే సంస్కృతీ సంప్రదాయాలు పరిరక్షించబడుతాయని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కడవెండి శివారులో గుట్టపై ఉన్న లక్ష్మీనర్సింహ్మస్వామి కల్యాణం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తలంబ్రాలను వారు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు ట్రాక్టర్పై ఏర్పాటు చేసిన మగ్గంపై నూతన వస్త్రాల తయారీని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మూలవిరాట్ కల్యాణానికి తలంబ్రాలు, వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే ఏడాది నాటికి జాతర అభివృద్ధి పెండింగ్ పనులు పూర్తి చేయిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణనాయక్, కొడకండ్ల మార్కెట్ చైర్పర్సన్ నల్ల అండాలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నల్ల శ్రీరాములు, ఉత్సవ కమిటీ చైర్మన్ పెద్ది రమేష్, ఆలయ పూజారులు బీట్కూరి సంపత్కుమారచార్యులు తదితరులు పాల్గొన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన పెద్ది కృష్ణమూర్తి ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు ఆలయానికి ముందుగానే చేరుకున్నారు. ఎమ్మెల్యే తలంబ్రాలు తీసుకెళ్తున్న క్రమంలో ఉత్సవ ప్రదర్శనలో పాల్గొనేందుకు వస్తున్న కృష్ణమూర్తిని పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టడి చేసే యత్నం చేశారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి గోవిందా నామస్మరణతో మూలవిరాట్కు తలంబ్రాలు ఉత్సవాల్లో వెలుగు చూసిన కాంగ్రెస్ విభేదాలు -
సభా వేదిక దేవన్నపేట!
సాక్షిప్రతినిధి, వరంగల్ : బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తలపెట్టిన రజతోత్సవ సభకు గ్రేటర్ వరంగల్ పరిధి దేవన్నపేట శివారును నాయకులు ఎంపిక చేశారు. 14 ఏళ్ల అవిశ్రాంత పోరాటాన్ని, పదేండ్ల పరిపాలనపై ఏడాది పాటు వేడుకలు నిర్వహించాలని భావించిన బీఆర్ఎస్.. వరంగల్ సభ ద్వారా ప్రారంభించాలని తలపెట్టింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ పరిధి ఉనికిచర్ల, బట్టుపల్లి, దేవన్నపేట ప్రాంతాల్లో మాజీ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో ముఖ్యనేతలు ఈనెల 10న స్థలపరిశీలన చేశారు. అయితే ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా.. సభకు హాజరయ్యే జనం ఈజీగా వచ్చిపోయేలా ఉండాలని భావించి శుక్రవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, దాస్యం వినయభాస్కర్, పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపనేని నరేందర్, బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ తదితరులతో కలిసి హరీశ్రావు స్థల పరిశీలన చేశారు. జాతీయ రహదారి పక్కన ఉండటంతో పాటు నలుమూలల నుంచి వాహనాల ద్వారా వచ్చిపోయేందుకు దేవన్నపేట అనువుగా ఉంటుందని భావించి అధినేత కేసీఆర్ సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. చివరకు దేవన్నపేటను ఫైనల్ చేసినట్లుగా చెప్పారు. స్థలపరిశీలన అనంతరం హరీశ్రావు సుమారు గంటపాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో మాట్లాడారు. సుమారు 15 లక్షల మందితో భారీ సభ నిర్వహించడానికి నాయకత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇదే సమయంలో సభ సక్సెస్ కోసం ఉమ్మడి వరంగల్కు చెందిన ముఖ్యనేతలతో కేసీఆర్ భేటీ కానున్నారని సమాచారం. బీఆర్ఎస్ రజతోత్సవ సభ స్థలం పరిశీలించిన మాజీ మంత్రి హరీశ్రావు తదితరులు సభ సక్సెస్కు త్వరలో కమిటీలు.. ఉమ్మడి జిల్లా నేతలతో కేసీఆర్ బేటీ? -
మార్కెట్లో మాయ!
రంగుల కేళీకొలతలు, తూకాల్లో మోసం నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టు ఉండాలి జిల్లాలో అంబరాన్నంటిన సంబురాలు సహజసిద్ధమైన రంగులతో హోలీ వేడుకలు ప్రజల జీవితాల్లో రంగుల వెలుగులు నింపాలి కలెక్టర్ రిజ్వాన్ బాషాఏ ఫిర్యాదు ఎక్కడ.. ఎంత నగదు? జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కన్జూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ (వినియోగదారుల కమిషన్) పని చేస్తుంది. జిల్లా స్థాయి ఫోరం వస్తువులు/సేవల విలువ రూ.50 లక్షల్లోపు ఫిర్యాదులు పరిష్కరిస్తుంది. రూ.కోటి నుంచి రూ.2 కోట్ల మధ్య రాష్ట్ర స్థాయి, రూ.2 కోట్లకు మించిన విలువైన ఫిర్యాదులను జాతీయ స్థాయి ఫోరం పరిష్కరిస్తుంది. వస్తు సేవల్లో నష్టపోయి పరిహారం కోరాలనుకుంటే.. వివరాలను నాలుగు ప్రతులతో దరఖాస్తు చేయాలి. వస్తువుసేవల కొనుగోలు రుజువులు జతపర్చాలి. ఫోరం ఫీజు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రూ.200, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రూ.400, రూ.10 లక్షలు ఆపైన పరిహారం కోసం రూ.500 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఫిర్యాదును పరిశీలించిన తర్వాత ఫోరం స్వీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. వివిధ కారణాలతో తిరస్కరిస్తే ఫిర్యాదుదారుడు తనవాదన వినిపించవచ్చు. ఫోరంలో వినియోగదారుడే తన కేసును వాదించుకోవచ్చు. లేదా న్యాయవాదిని నియమించుకోవచ్చు.సాక్షి, వరంగల్: మార్కెట్లో కొందరు వ్యాపారులు తూకాలు, కొలతల్లో వినియోగదారులను మోసం చేస్తున్నారు. కూరగాయలు, నిత్యావసారాలతోపాటు అన్నింటిలోనూ చేతివా టం ప్రదర్శిస్తూనే ఉన్నారు. అక్రమాలను అరికట్టాల్సిన తూనికలు, కొలతలు, ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడం.. వినియోగదారుల హక్కులపై ప్రచారం చేయడంలోనూ విఫలమవడం ఇందుకు కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. మోసం.. కల్తీ ఇలా.. ● నిత్యావసరాలు, ఇతర ఆహార పదార్థాలు, పండ్ల తూకాల్లో మోసాల సంగతి చెప్పనక్కర్లేదు. కిలోకు 200 గ్రాముల వరకూ కోతపెట్టి అమ్ముతున్నారు. కొన్ని వస్తువులను ప్రామాణిక ముద్రతో విక్రయించాల్సి ఉన్నా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వార సంతలు, మార్కెట్లు, రైతు బజార్లలో సైతం రాళ్లనే తూనికలకు వినియోగిస్తున్నారు. పాలు, వంట నూనెలు, ఉప్పు, మిరప పొడి, ఐస్ క్రీం, బేకరీ ఫుడ్స్, ఫ్రైడ్ చికెన్, మసాలా దినుసులు, అన్ని రకాల స్వీట్లలో కల్తీ జరుగుతోంది. ● జనరిక్ మందుల పేరిట అధిక ధరలకు అమ్ముతున్నారు. డాక్టర్ అటాచ్డ్ కౌంటర్లలో చెప్పనక్కరలేదు. ప్లాస్టిక్ బాటిళ్లలో దగ్గు మందులు విక్రయించొద్దు. కాలపరిమితి ముగిసిన మందులు సైతం విక్రయిస్తున్న మెడికల్ దుకాణాలు ఉండడం గమనార్హం. ● కొన్ని పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రికల్ రీడింగ్ మిషన్లను ట్యాంపరింగ్ చేస్తున్నారు. లీటరు పెట్రోల్కు 100 నుంచి 200 మిల్లీలీటర్ల వరకూ తక్కువగా వస్తోంది. ఏరోజుకారోజు పెట్రోల్, డీజిల్ ధరలను ప్రదర్శించాల్సి ఉన్నా.. ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. ● గృహ నిర్మాణ సామగ్రి అమ్మకాల్లోనూ మోసాలు జరుగుతున్నాయి. 25 కేజీల సిమెంట్ బస్తాకు కే జీ, కేజీన్నర తరుగు వస్తోంది. కొంతమంది దళారులు బస్తాల్లోని సిమెంట్ తీసి రీ ప్యాక్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇనుము కేజీల లెక్కన విక్రయించాల్సి ఉన్నా.. చాలామంది విడి పరికరాల కింద అమ్ముతూ కొలతల్లో మోసం చేస్తున్నారు. ●బంగారు ఆభరణాలు విక్రయించే కొన్ని షాపుల్లో తూకాల్లో తేడా ఉంటోంది. పండుగల రాయితీలు.. గ్రాము రూ.200 తక్కువ అంటూ ప్రకటనలతో ఆకర్షిస్తూ మోసం చేస్తున్నారు. ఈవిషయమై తూనికలు.. కొలతల శాఖ అధికారులకు ఫిర్యాదులు అందడంతో డిజిటల్ త్రాసుల్లో లోపాలను గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. బంగారం, వెండి అమ్మకాల్లో రశీదుపై నాణ్యతా ప్రమాణాలు, హెచ్యూఐడీ నంబర్ తప్పనిసరిగా రాయాలి. చాలా వరకు ఇవి పాటించడం లేదనే ఫిర్యాదులున్నాయి. కమిషన్ను ఎప్పుడు ఆశ్రయించాలంటే.. ఆన్లైన్ సేవలు విస్తృతం కావడంతో ఇంటి నుంచి వివిధ వస్తువుల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈనేపథ్యంలో ఆన్లైన్ వ్యాపార లావాదేవీలను కూడా వినియోగదారుల రక్షణ చట్టం–2019 పరిధిలోకి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కొనుగోలు చేసిన వస్తువుల్లో నాణ్యత లోపించినా.. వాటి వల్ల నష్టం జరిగినా.. తూకాల్లో మోసాలకు పాల్పడినా పరిహారం కోరే హక్కు వినియోగదారుడికి ఉంటుంది. నాణ్యతలేని, కల్తీ సరుకులు విక్రయించినప్పుడు.. కాలం చెల్లిన ఔషధాలు అమ్మినా.. గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువకు విక్రయించినా.. ప్రైవేట్ వైద్యుల నిర్లక్ష్యం, సేవల్లో లోపం కారణంగా నష్టం వాటిల్లినా.. ఎలక్టాన్రిక్ పరికరాలు సక్రమంగా పని చేయకపోయినా.. విత్తనాలు, ఎరువులు, పురుగు ముందులు కల్తీ జరిగినా.. బ్యాంకులు, విద్యుత్ సంస్థలు, విమానయాన సంస్థలు, బీమా సంస్థలు అందించే సేవల్లో లోపాలు ఉంటే వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించి న్యాయం పొందవచ్చు. ● సాక్షి ఇంటర్వ్యూలో వినియోగదారుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు, హైకోర్టు అడ్వకేట్ సాధిక్ అలీ జనగామ: వినియోగదారుల పరిరక్షణకు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 23 జిల్లాల్లో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని వినియోగదారుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు, హైకోర్టు అడ్వకేట్ ఎండీ సాధిక్ అలీ అన్నారు. నేడు (శనివారం) ప్రపంచ వినియోగదారుల దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో సాధిక్ అలీ మాట్లాడారు. ప్రశ్న: ముప్పై ఏళ్లుగా వినియోగదారుల కోసం చేసిన అనుభవాలు ఏంటి! జవాబు: పట్టణం నుంచి మారుమూల పల్లె వరకు ప్రతీ వ్యక్తిని కలిసి వినియోగదారుల హక్కుల చట్టాలపై అవగాహన కల్పించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ప్రశ్న: వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? జవాబు: ప్రతీ దుకాణంలో తూకం విషయంలో మోసం జరుగుతోంది. డిజిటల్ తూకం విషయానికి వస్తే, ఇందులో కూడా అనేక అమరికలు చేస్తూ మోసం చేస్తున్నారు. టీ పొడిలో కల్తీ, మిర్చి పౌడర్లో రంపపు పొడి, పప్పు దాన్యాల్లో కూడా నాసిరకం వస్తుంది. ప్రజలు మేల్కొంటేనే కల్లీని అరికట్టవచ్చు, ప్రశ్న: వినియోగదారులు వారి సమస్యలను ఫిర్యాదు చేయకపోవడానికి కారణం ఏమిటి? జవాబు: చట్టాల్లో లొసుగులతో తప్పించుకోవడం, చట్టాలను అమలు చేసేందుకు సరైన యంత్రాంగం లేకపోవడం ప్రధాన కారణం. ఫిర్యాదు చేసినా.. ఒరిగింది ఏమీ లేదని భావిస్తున్నారు. ప్రశ్న: సాధారణ ప్రజలు వినియోగదారుల హక్కులను ఏ విధంగా ఉంపయోగించుకోచ్చు? జవాబు: కల్తీని ప్రశ్నించాలి. చట్టాలను తెలుసుకోవాలి. నలుగురితో షేర్ చేసుకోవాలి. కూరగాయల మార్కెట్లో తక్కువ తూకాన్ని నిలదీయాలి. ప్రతీఒక్కరిలో నిలదీసేతత్వం కలగాలి. పాలలో కల్తీని ఎండగట్టినప్పుడే ఇలాంటి మోసాలను అరికట్టగలుగుతాము. కలెక్టరేట్ ప్రాంగణం సెల్లార్లో వినియోగుదారుల సమాచార కేంద్రం ఏర్పాటు చేసి, సేవలు అందిస్తున్నాం. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సేవలు అందుబాటులో ఉంటాయి. వినియోగదారులకు అండగా..వినియోగదారుల మండలి రాష్ట్ర కమిటీ తెలంగాణ రాష్ట్రంలో ‘ఈట్ రైట్ ఫుడ్’ అనే అంశంపై వినియోగదారుల్లో చైతన్యం కల్పిస్తూ అండగా నిలుస్తున్నాం. కల్తీ పాల అమ్మకందారులపై నాలుగు ప్రైవేట్ డెయిరీలపై ఫిర్యాదు చేశాం. దగ్గు మందుల్లో హానికారకాలు, బాటిళ్లపై సమాచారం లేకపోవడం, ప్లాస్టిక్ బాటిళ్లలో విక్రయంపై జాతీయ వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేశాం. అమ్మాయిలను ఆకర్షించి మోసగిస్తున్న స్లిమ్మింగ్ సెంటర్లపై కేంద్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ అథారిటీలో ఫిర్యాదు చేశాం. – సాంబరాజు చక్రపాణి, వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సంబంధిత అధికారుల్లో నిర్లిప్తత నష్టపోతున్న వినియోగదారులు ప్రశ్నించి పోరాడితేనే దగాకు చెక్ -
ఆధునిక యంత్రాలు ఉపయోగించాలి
జనగామ రూరల్: కుమ్మరులు ఆధునిక యంత్రాలను ఉపయోగించాలని అఖిల భారతీయ కుమ్మర శాలివాహన ప్రజాపతి కుంభకార్ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మిరుదొడ్డి శివనంద్ ప్రజాపతి అన్నారు. శుక్రవారం పట్టణంలోని జూబ్లీ ఫంక్షన్హాల్లో మొల్లబాంబ 585వ జయంతిని హిందూ కుమ్మర శాలివాహన ప్రజాపతి ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ, అభివృద్ధి సంఘం జిల్లా కమిటీ ఽఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో విద్యను అభ్యిసిస్తూ అని రంగాల్లో ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో జివిలికపల్లి నరహరి ప్రజాపతి, దాసారం కృష్ణమూర్తి, కాసర్ల పరుశరాములు, ఎలిశాల యదగిరి, కొలిపాక సంపత్, దామెర యాదగిరి, నర్సంహరావు, కట్కూరి సిద్దులు విష్ణు, చల్ల నర్సయ్య, ఎల్లయ్య, తాడూరి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన బ్రహ్మోత్సవాలు
చిల్పూరు: శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 6న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఉదయం అర్చకులు స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించగా భక్తులు దర్శించుకున్నారు. అనంతరం చక్రస్నానం నిర్వహించారు. ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్ శ్రీధర్రావు–కిరణ్మయి దంపతులు, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి కృషికొడకండ్ల: ఆర్యవైశ్యులంతా సమస్యల పరిష్కారానికి సంఘటితమై ముందడుగు వేయాలని ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండలకేంద్రంలోని రామాలయంలో నిర్వహించిన మండల ఆర్యవైశ్య నూతన కమిటీ ఎన్నిక నామినేషన్ల స్వీకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఆర్యవైశ్యులంతా ఐక్యమత్యంతో ముందుకు సాగాలని, ఆర్యవైశ్యుల సంక్షేమమే లక్ష్యంగా జిల్లా మహాసభ నిరంతరం తోడుంటుందన్నారు. మండల అధ్యక్ష పదవికి కొడకండ్లకు చెందిన దామెర శ్రీనివాస్ ఒక్కరే ఎన్నికల అధికారి మాధంశెట్టి వరూధినికి నామినేషన్ దాఖలు చేయగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గన్ను నర్సింహులు, ఉపాధ్యక్షుడు ఈరంటి సాయికృష్ణ, కోశాధికారి బెజుగం భిక్షపతి, మహిళ జిల్లా ప్రధాన కార్యదర్శి బెజుగం అనుజ, పడకంటి రవీందర్ పాల్గొన్నారు. నేటి నుంచి ఒంటిపూట బడులు విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేట్, ఎయిడెడ్ అన్ని పాఠశాలల్లోనూ ఈనెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమై కొనసాగనున్నాయి. ప్రతీ రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలను నిర్వహిస్తారు. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో విద్యార్థులకు తప్పనిసరిగా తరగతులు అయిపోయాక మధ్యాహ్న భోజనం పెట్టాల్సి ఉంటుంది. ఈనెల 21 నుంచి టెన్త్ విద్యార్థులకు వార్షిక పరీక్షలు ఉన్నందున.. పరీక్ష కేంద్రాలుగా ఉన్న హైస్కూళ్లను మధ్యాహ్నం ఒంటి గంటనుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలి. విద్యార్థులకు ముందే మధ్యాహ్న భోజనం అందించి తర్వాత క్లాస్లు నిర్వహించాలని విద్యాశాఖాఽధికారులు తెలిపారు. నేడు, రేపు రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ పోటీలు వరంగల్ స్పోర్ట్స్: తెలంగాణ రాష్ట్ర 10వ టెన్నికాయిట్ మెన్ అండ్ ఉమెన్ చాంపియన్షిప్ ఈ నెల 15, 16వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు టెన్నీకాయిట్ అసోసియేషన్ హనుమకొండ, వరంగల్ జిల్లాల కార్యదర్శులు అలువాల రాజ్కుమార్, గోకారపు శ్యాంకుమార్ తెలిపారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు 300 మంది క్రీడాకారులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఇందులో గెలుపొందిన జట్లు ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. శనివారం సాయంత్రం ప్రారంభంకానున్న పోటీలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, ఇనుగాల వెంకట్రాంరెడ్డి తదితరులు హాజరవుతారని వారు వివరించారు. -
రంగుల హోలీకి స్వాగతం
జనగామ: కాముని పున్నమిని పురస్కరించుకుని గురువారం పలు కూడళ్లలో కామదహనం నిర్వహించారు. అర్ధరాత్రి వరకు కాముని మంటల చుట్టూ ఆడిపాడుతూ అల్లరిచేశారు. జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పరిధితోపాటు పట్టణంలోని కుర్మవాడ, బాలాజీనగర్, చమన్, గుండ్లగడ్డ, గోకుల్నగర్ తదితర ప్రాంతాల్లో ప్రజలు కాముని దహనం నిర్వహించారు. శుక్రవారం హోలీ పండుగను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు గురువారం హోలీకి సంబంధిత సామగ్రి విక్రయాలతో వీధులు, చౌరస్తాల్లో సందడి నెలకొంది. రంగులు, చిన్నారుల వాటర్ గన్స్ కొనుగోళ్లతో రోడ్లు, కూడళ్లు రద్దీగా కనిపించాయి. పండగకు ఏర్పాట్లు రంగుల పండగను ఘనంగా జరుపుకునేందుకు పిల్లలు, పెద్దలు సిద్ధమవుతున్నారు. హోలీకి ముందు రోజు కాముడి దహనం.. హోలీ రోజున ఆత్మీ యంగా రంగులు చల్లుకోవడంతో చిన్నాపెద్ద ఆనందంగా గడుపుతారు. సహజ సిద్ధంగా చల్లుకునే రంగులతో ఎలాంటి ఇబ్బంది ఉండదని, రసాయనిక రంగులతో చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. నేడు పలుచోట్ల ఉట్టి కొట్టే ఏర్పాట్లు సైతం చేసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో మహిళలు హోలీ రోజున ప్రత్యేకంగా తయారు చేసిన పిండి వంటలతో దేవుడికి నైవేధ్యం సమర్పిస్తారు. వాటర్ గన్స్, రంగుల కొనుగోళ్లు సందడిగా మారిన మార్కెట్ ఘనంగా కాముడి దహనం -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
జనగామ: స్టేషన్ఘన్పూర్లో సీఎం పర్యటన నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్లతో కలిసి కలెక్టర్ గురువారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 16న సీఎం రేవంత్రెడ్డి రాక సందర్భంగా, ఆ యా శాఖల అధికారులకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రితో పాటు వీవీఐపీలకు అన్ని వసతులను సమకూర్చాలని సూచించారు. బహిరంగ సభ కు హాజరయ్యే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి కంపాట్మెంట్లో ఇద్ద రు ఏఎన్ఎంల పర్యవేక్షణ ఉండాలన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్ నాయక్, ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, జెడ్పీ సీఈఓ మాధురీ కిరణ్ చంద్ర షా, డిప్యూటీ జెడ్పీ సీఈఓ సరిత, డీపీఓ స్వరూప, డీఆర్డీఏ వసంత పాల్గొన్నారు. సమావేశాలు పూర్తి చేయాలిజనగామ రూరల్: మార్చి 19లోపు ఓటరు జాబితా సవరణ, ఇతర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి ఆదేశించా రు. హైదరాబాద్ నుంచి ఆయన గురువారం ఎన్ని కల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీ క్షించారు. జిల్లాలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బా షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణ జిల్లాలో ప్రతి 3 నెలలకోసారి పకడ్బందీగా నిర్వహించాల న్నారు. ఓటరు జాబితా సవరణ, పోటీ చేసిన అభ్యర్థుల వివరాల సమర్పణ, బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం, తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధి కారులు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి, మార్చి 27 లోపు ఎన్నికల కమిషన్కు వివరాలు సమర్పించాలన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసీల్దార్తో సమావేశాలు నిర్వహించాలన్నారు. నూతన ఓటర్ల నమోదు, ఓటు బదిలీ, మరణించిన వారి ఓటర్ల వివరాల తొలగింపు వివరాలు క్షుణ్ణంగా నమోదు చేయాలని తెలిపారు. ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. కృత్రిమ మేథతో సామర్థ్యాల మెరుగు ఈనెల 15వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేథ ద్వారా బోధన ప్రారంభించి, విద్యార్థు ల సామర్థ్యాలను మెరుగుపర్చనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా తెలిపారు. హైదరా బాద్ నుంచి రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, కమిషనర్ ఈవీ నర్సింహారెడ్డి గురువారం విద్యాశాఖ బలోపే తం, నూతన విద్యా విధానంపై కలెక్టర్, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి మాట్లాడు తూ.. ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో సమగ్ర శిక్షా తెలంగాణ విద్యాశాఖ మౌలిక భాషా గణిత సామర్థ్యాల సాధన కార్యక్రమంలో భాగంగా కృత్రిమ మేథను ఉపయోగించి బోధనను మెరుగుపరిచేందుకు ఏ ఎక్స్ఎల్ ఏక్ స్టెప్ ఫౌండేషన్ సహకారంతో మొదటి దశలో పైలట్ ప్రాజెక్టుగా (6) జిల్లాల్లో ప్రారంభించినట్లు తెలిపారు. మెరుగైన ఫలితాలు సాధించడంతో జిల్లా నుంచి నలుగురికి రాష్ట్రస్థాయిలో శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. కృత్రిమ మేథతో ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విద్యార్థుల్లో మెరుగైన అభ్యసన సామర్థ్యాలను సాధించడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో మొత్తం 17 పాఠశాలలు ఎంపికయ్యాయని వెల్లడించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి సమీక్షలో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
వల్మిడి ఆదాయం రూ.4,91,000
పాలకుర్తి టౌన్: వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో 2025–2026 సంవత్సరం కొబ్బరికాయలు పూజా సామగ్రి, లడ్డు, పులి హోర, కొబ్బరి చిప్పలు పోగు చేసుకునే హక్కు కోసం బహిరంగ వేలం ద్వారా రూ.4,91,000 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ సల్వాది మోహన్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో సీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించారు. కొబ్బరికాయలు పూజా సామగ్రి అమ్ముకునే హక్కు పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన ముద్రబోయిన సంతోష్కుమార్ రూ.2 లక్షలకు దక్కుంచుకోగా, లడ్డు పులిహోర అమ్ముకునే హక్కు వల్మిడి గ్రామానికి చెందిన తాళ్ల నవీన్ రూ.2,60,000కు దక్కించుకున్నారు. కొబ్బరి చిప్పలు పోగు చేసుకునే హక్కు రాయపర్తి మండలం కొండూరు గ్రామా నికి చెందిన పల్లు ఎల్లగౌడ్ రూ.31,000కు పొందినట్లు వెల్లడించారు. దేవాదాయ దర్శాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికచిల్పూరు: మండలంలోని పల్లగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఆర్యన, చిర్ర వరుణ్, సాదం హాసిని, జీడి ప్రీతి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్కు ఎంపికై నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి మనోజ్కుమార్ గురువారం తెలిపారు. జిల్లా కేంద్రంలో 100, 400 మీటర్ల పరుగు, జావలిన్ త్రో లో నిర్వహించిన ఎంపికల్లో విద్యార్థలు ప్రతిభ కనబరిచినట్లు తెలిపా రు. ఈనెల 23న హైదరాబాద్ గచ్చిబౌళిలోని గార్డియన్ స్పోర్ట్స్లో నిర్వహించే పోటీల్లో వీరు పాల్గొంటారని తెలిపారు. హెచ్ఎం కేతిడి నర్సింహారెడ్డి, పీడీ దేవ్సింగ్, చిల్పూరు ఆలయ చైర్మన్ శ్రీధర్రావు, పీఏసీ ఎస్ వైస్ చైర్మన్ చిర్ర నాగరాజు అభినందించారు. ఘనంగా రథోత్సవం చిల్పూరు: ఈనెల 06 నుంచి 15వ తేదీవరకు నిర్వహించే బుగులు వేంకటేశ్వరస్వామి బ్ర హ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం హోమం, బలిహరణం కార్యక్రమాలను అర్చకుల వేద మంత్రాల నడుమ నిర్వహించారు. సాయంత్రం స్వామివారి రథోత్సవాన్ని ఆలయ ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు, అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేదమంత్రాల నడుమ ప్రారంభించారు. భక్తుల కోలాటాల నడుమ స్వామివారి రథయాత్ర సాగింది. కార్యక్రమంలో కుర్రెంల మోహన్, వీరన్న, మల్ల్లికార్జున్, మహేశ్, హరి శంకర్, రాజేశ్, విశాల్, మూల నాగరాజు, నారగోని రాజు, గోలి రాజశేఖర్, గనగోని రమేష్, తాళ్లపల్లి బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలిజనగామ: జిల్లాలో హోలీ పండగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని డీసీపీ రాజ మహేంద్ర నాయక్ పిలుపునిచ్చారు. పట్టణ పోలీస్టేషన్లో సీఐ దామోదర్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ హోలీ రో జు స్నేహభావాన్ని పంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై రాజన్బాబు, లక్ష్మీనర్సయ్య, కీర్తి నర్సయ్య, మహంకాళి హరిచంద్రగుప్త, పెద్దోజు జగదీష్, శ్రీనివాస్, సంతోష్, నవీన్, న్యాయవాది జమాల్షరీఫ్, మసిఉర్ రెహమాన్, అబ్దుల్ ఖాదర్ అజర్, స్కైలాష్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
అధికారులు చర్య తీసుకోవాలి..
రంగప్ప చెరువులో కూల్చేసిన మట్టిని తీసుకొచ్చి నింపేస్తున్నారు. కాలనీ మీదుగా ట్రాక్టర్ల ద్వారా మట్టిని చెరువులోకి తీసుకొస్తూ.. కుంటను లెవల్ చేస్తున్నారు. వ రద నీరు వస్తే మేం ఎటెళ్లాలని అడిగితే సమాధానం చెప్పడం లేదు. ఉన్నతాధికారులు చెరువును పరిరక్షించి విచారణ జరిపించాలి. – సుధాకర్, గోకుల్నగర్, జనగామ మట్టి నింపితే నీరంతా ఇళ్లలోకే.. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో మట్టిని నింపితే వర్షాకాలం, గోదావరి జలాలతో నింపిన సమయంలో ఆనీరంతా మా ఇళ్లలోకి వస్తుంది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేసినం. చెరువును పరిరక్షించడంతో పాటు మట్టి పోయకుండా చర్యలు తీసుకోవాలి. – ఎన్.ప్రభాకర్, గోకుల్నగర్, జనగామ -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
స్టేషన్ఘన్పూర్: ఈనెల 16న స్టేషన్ ఘన్పూర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటనకు సంబందించి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్పూర్కు జంట పట్టణమైన శివునిపల్లిలో వ్యవసాయ మార్కెట్కు సమీపాన ఉన్న సీఎం సభాస్థలిని కలెక్టర్ షేక్ రిజ్వాన్బాషా, అడిషనల్ కలెక్టర్లు, డీసీపీతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి బుధవారం పరిశీలించారు. ముందుగా హెలిపాడ్, సభాస్థలికి సంబంధించిన మ్యాప్ను పరిశీలించారు. అనంతరం హెలిపాడ్ స్థలాన్ని, సభ నిర్వహించే స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. అనంతరం సభాస్థలి వద్ద కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, డీసీపీ, వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. సభాస్థలి వద్ద ఇరువైపులా మెట్లు ఏర్పాటు చేయాలని, రేలింగ్లు, పోడియంలు ఏర్పాటు చేయాలన్నారు. సభాస్థలి, పార్కింగ్ స్థలం వద్ద తాగునీరు, టాయిలెట్స్ సౌకర్యాలు కల్పించాలని సూచించారు. వేసవికాలం ఎండను దృష్టిలో ఉంచుకుని జనాలకు నీడ కోసం షామియానాలు ఏర్పాటు చేయాలని, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇతర మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సభాస్థలి సమీపంలో ప్రజలకు తాగునీరు, మజ్జిగ ఏర్పాటు చేయాలని సూచించారు. అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాల్లేకుండా చూడాలన్నారు. 15వ తేదీ మధ్యాహ్నం వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. పోలీసుశాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ సీఎం పర్యటనను, సభను విజయవంతం చేసేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రోహిత్సింగ్, పింకేశ్కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్, ట్రాన్స్కో ఎస్ఈ వేణుమాధవ్, ఏసీపీలు భీమ్శర్మ, నర్సయ్య, డీఆర్డీఏ వసంత, డీపీఓ స్వరూపరాణి, ఆర్డీఓలు వెంకన్న, గోపీరామ్, సీఐలు జి.వేణు, శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్, జీసీడీఓ గౌసియా, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల ఎస్ఈలు, డీఈలు, అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సభాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్ -
రంగప్ప చెరువుకు ముంచుకొస్తున్న ముప్పు
మరికొద్ది రోజుల్లో తన ఉనికిని కోల్పోతా నేమోనని.. రంగప్ప చెరువు చెమ్మగిల్లుతోంది. సమీప కాలనీల ప్రజలకు ముప్పు ముంచుకొస్తోంది. పట్టణంలో కూల్చిన భవనాల మట్టితో చెరువును పూడ్చే పనులు శరవేగంగా సాగుతున్నాయి. రోజురోజుకూ చెరువు విస్తీర్ణం తగ్గిపోతోంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ప్లాట్ల అమ్మకాలకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.– జనగామహద్దురాళ్ల తొలగింపు..రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చెరువుల అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల కబ్జాలపై ఉక్కుపాదం మోపింది. ప్రత్యేకంగా హైడ్రాను ఏర్పాటు చేసి, ఎఫ్టీఎల్ నిర్మాణాల్ని కూల్చేయడంతో రంగప్ప చెరువులో ప్లాట్ల అమ్మకాలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. అందులో ప్లాట్ అంటేనే వెనకడుగు వేసే పరిస్థితికి వెళ్లింది. ఏడాది పాటు స్తబ్ధంగా ఉన్న రంగప్ప చెరువు ప్లాట్ల అమ్మకాలు మళ్లీ మొదలయ్యాయి. ఇటీవల ఇళ్ల కూల్చివేత మట్టిని వందలాది ట్రాక్టర్లలో రంగప్ప చెరువుకు తరలిస్తున్నారు. గతంలో చెరువు పరిధిలో ఏర్పాటు చేసిన ఎఫ్టీఎల్ హద్దురాళ్లను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించి, డోజర్లతో మొక్కలను క్లీన్ చేయిస్తున్నారు. భారీ వర్షాలొస్తే జనావాసాల్లోకి నీరు వస్తుందని జనగామ ప్రజలకు టెన్షన్ పట్టుకుంది. సమీప కాలనీల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ట్రాక్టర్లతో మట్టిని పోస్తున్న వారిని నిలదీస్తే బెదిరింపులకు దిగుతున్నట్లు కాలనీలవాసులు చెబుతున్నారు. కలెక్టర్ నివాసముండే ప్రాంతంలో ఓ చెరువును మాయం చేయాలని చూస్తున్నా.. కబ్జా కోరుల వెనుక ఉండి నడిపించే శక్తి ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది. ఇటీవల కాలనీకి చెందిన పలువురు కలెక్టర్, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప ట్టణంలో కూల్చేసిన ఇంటి మట్టిని తీసుకొచ్చి చెరువులో నింపేస్తున్నట్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.జనగామ పట్టణ నడిబొడ్డున ఉన్న రంగప్ప చెరువుకు ముప్పు ముంచుకొస్తోంది. గతంలో ఎఫ్టీఎల్, బఫర్జోన్లోని ప్లాట్ల అమ్మకాలతో చెరువు మాయం కాగా... నేడు పట్టణంలో కూల్చేసిన భవనాల మట్టితో చెరువును పూడ్చేస్తున్నారు. చెరువు కబ్జాకు గురి కాకుండా.. అప్పటి ఇరిగేషన్ అధికారుల నివేదికతో ఆక్ర మణదారులపై అప్పటి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఉక్కుపాదం మోపారు. ఎఫ్టీఎల్ హద్దులు ఏర్పాటు చేసి.. పాట్ల క్రయవిక్రయాలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు. మూడేళ్ల తర్వాత చెరువులోని ప్లాట్ల విక్రయాల్లో మళ్లీ కదలిక మొ దలైంది. ఎఫ్టీఎల్ పరిధిని ఆక్రమించి, ప్లాట్లను విక్రయించినట్లు గుర్తించిన ఇరిగేషన్ అధికారులు సదరు యజమానులకు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. హైడ్రా తర్వాత క్రయవిక్రయాలు బ్రేక్ పడ్డాయి. కానీ.. కొందరు అడ్డదారిలో అమ్మకాలకు పావులు కదుపుతున్నారు. -
నెలాఖరులోగా క్రమబద్ధీకరించుకోవాలి
జనగామ రూరల్/రఘునాథపల్లి: ఈనెలాఖరులోగా ఎల్ఆర్ఎస్ ద్వారా ప్లాట్లను క్రమబద్ధీకరించుకుని 25 శాతం రాయితీని పొందాలని కలెక్టర్ షేక్ రిజ్వన్ బాషా అన్నారు. బుధవారం జిల్లాలోని మున్సిపల్ కార్యాలయం, రఘునాథపల్లి మండలం గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు రుసుము చెల్లించిన దరఖాస్తుదారులకు 25 శాతం రాయితీనిస్తూ, వెంటనే భూమి క్రమబద్ధీకరణకు సంబంధించిన ప్రొసీడింగ్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. స్థలాల క్రమబద్ధీకరణ పారదర్శకంగా చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే ప్రతీ రోజు రూ. 8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆస్తి పన్నులు వసూలు చేయాలని, పన్ను ఎగవేతదారులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ –1864 ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటివరకు మున్సిపల్ పరిధిలో 113 మందికి నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. సందేహాల నివృత్తికి కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రం నంబర్ 99481 87334, అలాగే.. జనగామ పురపాలక సహాయ కేంద్రం నంబర్ 8978 207205లో సంప్రదించవచ్చని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ అదికారులు, ఎంపీడీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలకు 96 మంది గైర్హాజరుబుధవారం నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు 96 మంది గైర్హాజరైనట్లు ఇంటర్ విద్యాధికారి జితేందర్రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,287 మంది విద్యార్థులకు గాను 4,191 మంది హాజరు కాగా.. 96 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 3,201 మందికి 3,155 హాజరు కాగా.. 46 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్లో 1,086 మందికి 1,036 హాజరు కాగా.. 50 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ గోపీరామ్, డీఐఈఓ జితేందర్రెడ్డి, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 25 శాతం రాయితీని వినియోగించుకోవాలి కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలి
జనగామ: విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అ న్నారు. జిల్లా కేంద్రంలోని ఏబీవీ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్షల తీరును మంగళవారం ప ర్యవేక్షించారు. పరీక్షకు ఎంత మంది విద్యార్థులు హాజరయ్యారని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాలు, తాగునీటి వసతి, మెడికల్ సిబ్బందితో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబి రంలో మందులను తనిఖీ చేశారు. ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా పరీక్షలను సజావుగా నిర్వహించాలని, జవాబు పత్రాలను వెంటనే పోలీసు బందోబస్తు మధ్య నిర్దేఽశిత ప్రాంతాలకు తరలించా లని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జితేందర్రెడ్డి తదితరులు ఉన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలి
స్టేషన్ఘన్పూర్: బహుజన పోరాట వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ పేరును జిల్లాకు పెట్టాలని తెలంగాణ గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్, మాజీ వైస్ ఎంపీపీ చల్లా సుధీర్రెడ్డి కోరారు. మంగళవారం మండలంలోని తాటికొండ గ్రామంలో బహుజన ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 21న కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న ఒక్కరోజు దీక్షకు బహుజనులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సానాది రాజు, బహుజన సంఘం అధ్యక్షుడు అక్కనపెల్లి వెంకటయ్య, ఉబ్బని భిక్షపతి, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి ఐలోని సుధాకర్, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. 19 కిలోల ఎండుగంజాయి పట్టివేత నర్మెట: మండలంలోని హన్మంతాపురం–బొమ్మకూరు క్రాస్ రోడ్డు వద్ద 19 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ టాస్క్ఫోర్స్ అధికారులు ఇచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ ముసుగు అబ్బయ్య, ఎస్సై నగేష్ తమ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా బొమ్మకూర్ క్రాస్ రోడ్డు వద్ద బ్యాగ్తో ఉన్న అనుమానిత వ్యక్తిని తనిఖీ చేయగా రూ. 10 లక్షల విలువ చేసే 19 కిలోల ఎండుగంజాయి పట్టుబడింది. జార్ఖండ్ రాష్ట్రం కొడెర్మా జిల్లా జుంరి తేలాయియాకు చెందిన ఎండీ మోక్తార్ వర్శి ఒరిస్సా రాష్ట్రంలో కొనుగోలు చేసిన గంజాయిని హైదరాబాద్కు తరలిస్తున్నాడు. ఈ క్రమంలో ట్రైన్లో పోలీసులు తారస పడటంతో జనగామ స్టేషన్లో దిగి ఆటోలో హన్మంతాపురం చేరుకున్నాడు. అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నీరులేక ఎండుతున్న పంటలు బచ్చన్నపేట: మండలంలోని పలు గ్రామాల్లో సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. మంగళవారం మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని తమ్మడపల్లి, చిన్నరామన్చర్ల గ్రామాల్లో పర్యటించి ఎండిన పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో అన్నదాతలు వరి పంటను రైతులు సాగు చేశారని వీటికి ప్రధాన జీవనాధారం బోరు బావులేనన్నారు. వెంటనే గోదావరి జలాలతో చెరువులు, కుంటలను నింపాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉడుగుల రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు దేవరాయ ఎల్లయ్య, నాయకులు మైపాల్, నవీన్, రైతులు పాల్గొన్నారు. జనగామ రూరల్: పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు లద్దునూరి మహేశ్ యాదవ్ ఆధ్వర్యంలో మండలంలోని ఓబుల్కేశవపూర్, పెద్దరామన్చర్ల గ్రామాల్లో నీరందక ఎండిన పంటలను పార్టీ బృందంతో కలిసి క్షేత్ర స్థాయిలో మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉడుగుల రమేష్, మార్క ఉపేందర్, దేవరాయి ఎల్లయ్య, సిరికొండ విజయ్ భాస్కర్రెడ్డి, జనార్దన్రెడ్డి, బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పసిపాప దొరికింది..
జనగామ: కుటుంబంలో ఒక్కరిగా నమ్మించి పది నెలల పాపను ఎత్తుకెళ్లిన నిందితులు జనగామ పోలీసులకు పట్టుబడ్డారు. పదిహేను రోజుల తర్వా త బిడ్డను చూసిన తల్లి.. ఒడిలోకి తీసుకుని కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ మేరకు మంగళవా రం జనగామ పోలీస్స్టేషన్లో ఏసీపీ పండేరి చేతన్ నితిన్.. సీఐ దామోదర్రెడ్డితో కలిసి వివరాలు వెల్ల డించారు. జనగామ జిల్లా కేంద్రం కళ్లెం రోడ్డులో పీఎల్జీ కన్వెన్షన్ నిర్మాణ పనుల కోసం ఛత్తీస్గఢ్ నుంచి రాంజుల్ రజాక్ కుటుంబంతో పాటు మరి కొంత మంది కూలీలు వచ్చారు. అక్కడే నివాసం ఏర్పరుచుకుని పనులు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా అల్లీపురం కొత్తగూడెంకు చెందిన పతంగి సురేశ్, ఏపీలోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నియోజకవర్గం కోనూరుకు చెందిన తన రెండో భార్య తిరుపతమ్మ విజయవాడలో భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ సమయంలో వీరికి విజయవాడకు చెందిన చంద్రమ్మ పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల పాటు అక్కడే కూలీ పనులు చేసుకుంటూ లక్షలు సంపాదించాలనే దురాశతో పిల్లల కిడ్నాప్నకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో చంద్రమ్మ ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన గరిక ముక్కు విజయలక్ష్మిని రంగంలోకి దింపింది. అనంతరం సురేశ్, తిరుపతమ్మ దంపతులు విజయవాడ నుంచి వరంగల్కు లేబర్ అడ్డాకు చేరుకున్నారు. అక్కడ జనగామకు చెందిన మేసీ్త్ర అజయ్తో పరిచయం ఏర్పరుచుకుని కళ్లెం రోడ్డులోని పీఎల్జీ కన్వెన్షన్లో పని చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఛత్తీస్గఢ్కు చెందిన కార్మికుల గుడారం పక్కనే వీరు నివాసమున్నారు. ఈ క్రమంలో రాంజుల్ రజాక్ పది నెలల పాప(బిడ్డ) శివానీని వారు సొంత బిడ్డలా చూసుకున్నారు. దీంతో రాంజుల్ కుటుంబం సైతం వారిని నమ్మారు. పథకం ప్రకారమే.. గత నెల 25వ తేదీన పథకం ప్రకారం మేస్త్రీ అజయ్ బైక్పై మార్కెట్కు వెళ్తున్నామని చెప్పి పాప శివానీని ఎత్తుకెళ్లారు. వారు ఎంతకూ రాకపోవడంతో బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీపీ పండేరి చేతన్ నితిన్ పర్యవేక్షణలో సీఐ దామోర్రెడ్డి, ఎస్సై చెన్నకేశవులు ఆధ్వర్యంలో సీసీ ఫుటేజీ పరిశీలనతోపాటు గాలింపు ముమ్మరం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు వరంగల్–హైదరాబాద్ హైవే పెంబర్తి క్రాస్ వద్ద తనిఖీ చేసే క్రమంలో బైక్పై వస్తున్న వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా చిన్నారిని ఎత్తుకెళ్లినట్లు ఒప్పుకున్నారు. దీంతో పాప శివానీ తీసుకుని ముగ్గురు నిందితులు సురేశ్, తిరుపతమ్మ, గరికముక్కు విజయలక్ష్మిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. చంద్రమ్మ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల చెంతకు.. పెంబర్తి క్రాస్ వద్ద పట్టుబడిన నిందితులు ముగ్గురి అరెస్ట్, రిమాండ్ వివరాలు వెల్లడించిన ఏసీపీ పండేరి చేతన్ నితిన్ -
బుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025
కొందరు ఒకపక్క ఉద్యోగం చేస్తూనే ఉన్నతస్థాయికి వెళ్లాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడ్డారు. అనుకున్న లక్ష్యం సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గ్రూప్–2 ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు ర్యాంకులు సాధించారు. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఉన్న సమయంలోనే ప్రణాళికాబద్ధంగా చదవడం, విషయాన్ని అర్థం చేసుకుని పోటీ పరీక్షల్లో రాయడం ద్వారా ర్యాంకులు సాధించవచ్చని ఆయా అభ్యర్థులు అంటున్నారు. – సాక్షి నెట్వర్క్ న్యూస్రీల్ -
రాయితీని సద్వినియోగం చేసుకోవాలి
జనగామ: ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వం అందిస్తున్న 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ తెలిపారు. మంగళవారం జనగామ మున్సిపల్ కార్యాలయంలో చేపట్టిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఏసీ వెంట మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీపీఓ స్వరూప, డీఏఓ రామారావు నాయక్ తదితరులు ఉన్నారు. బచ్చన్నపేటలో.. బచ్చన్నపేట: రాయితీని వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని పలువురు లబ్ధిదారుల వద్దకు వెళ్లి వారి పాట్లను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. ఎల్ఆర్ఎస కోసం ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వారి జాబితా ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శుల వద్ద ఉంటుందని, ఈ నెల 31లోపు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి నాగపురి స్వరూపారాణి, జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్, ఎంపీడీఓ వెంకట మల్లికార్జున్, పంచాయతీ కార్యదర్శి నర్సింహచారి, తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ -
పులకించిన కొండపర్తి
సభకు హాజరైన మహిళలు,ఎస్ఎస్తాడ్వాయి: మండల పరిధిలోని దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ మంగళవారం రావడంతో గిరిజనుల్లో ఆనందం వెల్లివెరిసింది. ఆయన కూడా ఆదివాసీలత మేమకమయ్యారు. రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి గవర్నర్ కొండపర్తికి రావడంతో ఆదివాసీల నృత్యాలు, డోలువాయిద్యాలు, మంగళహారతులతో మహిళలు ఘనస్వాగతం పలికారు. ముందుగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి సీతక్కతో కలిసి గ్రామంలో ఏర్పాటు చేసిన కొమురంభీం, బిర్సాముండా విగ్రహాలను ఆవిష్కరించారు. పాఠశాలలోని డిజిటల్ క్లాస్ ప్రొజెక్టర్, కారంపొడి, మసాలా యూనిట్లతోపాటు కుట్టు మిషన్ కేంద్రాలను ప్రారంభించారు. మధ్యాహ్నం 12.10 గంటలకు కొండపర్తికి వచ్చిన గవర్నర్ 1.40 గంటల వరకు గ్రామస్తులతో గడిపారు. అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామానికి గవర్నర్ రావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు గవర్నర్ చేతుల మీదుగా బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం గవర్నర్ను మేడారం జాతర చైర్మన్ అరెం లచ్చుపటేల్, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, తాడ్వాయి మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్దొర గజమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్జీ, ఆర్డీఓ వెంకటేశ్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వీరభద్రం, అధికారులు పాల్గొన్నారు. గవర్నర్కు సన్మానం.. జిల్లా పర్యటనకు వచ్చిన గవర్నర్ ఆర్అండ్బీ గెస్ట్హౌస్కు చేరుకుని విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్కు మంత్రి సీతక్క కలెక్టర్ దివాకర పూలమొక్క అందించి శాలువాలతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. కొండపర్తిని దత్తత తీసుకోవడం గొప్ప విషయం: మంత్రి సీతక్క దట్టమైన అటవీ ప్రాంతంలోని కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకోవడం గొప్ప విషయం అన్నారు. ఆ గ్రామాన్ని బయట ప్రపంచంతో సంబంధం లేకుండా అనుసంధానం చేస్తూ స్థానిక ఉత్పత్తులను అందించడం ద్వారా మహిళలు వ్యాపారవేతలుగా ఎదగాలన్నారు. 40 కంపెనీలు దిశ స్వచ్ఛంద సంస్థ సహకారంతో జిల్లాలోని వంద పాఠశాలలను దత్తత తీసుకున్నట్లు వివరించారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి: దాన కిశోర్, గవర్నర్ కార్యాలయ ప్రధాన కార్యదర్శి కొండపర్తిని అభివృద్ధి చేసి పర్యావరణ పరిరక్షణ గ్రామంగా తీర్చిదిద్ధాలనే లక్ష్యంతోనే గవర్నర్ కార్యాలయ ప్రధాన కార్యదర్శి దాన కిశోర్ అన్నారు. ప్రతీ కుటుంబానికి ఆదాయం చేకూరేలా ఐకమత్యంతో ముందుకుసాగాలని సూచించారు. మిర్చి, పసుపు, మసాలా యూనిట్లకు మార్కెటింగ్ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆదివాసీలతో మమేకమైన గవర్నర్ జిష్ణుదేవ్వర్మకు ఘనస్వాగతం పలు ఉపాధి యూనిట్ల ప్రారంభోత్సవం భారీ పోలీసు భద్రత నడుమ సాగిన పర్యటనఅమ్మవార్లకు మొక్కుల చెల్లింపు కొండపర్తికి వచ్చిన గవర్నర్ మంత్రి సీతక్కతో కలిసి వనదేవతలను దర్శించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు, గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకున్నారు. గవర్నర్ 74 కిలోల ఎత్తు బంగారం (బెల్లం) అమ్మవార్ల మొక్కుగా సమర్పించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ డాక్టర్ శబరీశ్, రిజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి, అసిస్టెంట్ కమిషనర్ రావుల సునిత, మేడారం ఈఓ రాజేంద్రం, సూపరింటెండెంట్ క్రాంతికుమార్, సిబ్బంది ఉన్నారు. -
లక్ష్యం చేరారు..!
కష్టపడ్డారు..గ్రూప్– 2 ఫలితాల్లో ఓరుగల్లు అభ్యర్థుల ప్రతిభ ● పలువురికి మెరుగైన ర్యాంకులు ● ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షకు సన్నద్ధం ● హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా వాసులుభూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాసింపల్లి గ్రామానికి చెందిన శనిగరపు ప్రవీణ్కుమార్ రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు సాధించారు. నిరుపేద కుటుంబానికి చెందిన శనిగరపు రాధ–భద్రయ్య దంపతుల రెండో కుమారుడు ప్రవీణ్కుమార్. తల్లి రాధ అంగన్వాడీ హెల్పర్గా, తండ్రి భద్రయ్య సింగరేణి సంస్థలో కాంట్రాక్టు స్వీపర్గా పనిచేస్తున్నారు. ప్రవీణ్కుమార్ బీటెక్ పూర్తి చేసి 2019లో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించి గణపురం మండలంలోని కర్కపల్లిలో విధులు నిర్వహించారు. 2021లో వీఆర్ఓ ఉద్యోగం సాధించి 6 నెలలపాటు మహదేవపూర్ మండలంలోని అంబటిపల్లిలో పనిచేశారు. ఆ సంవత్సరంలోనే గ్రూప్–4 పరీక్షలో ప్రతిభ కనబరిచి హైదరాబాద్లోని జీఎస్టీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేశారు. అదేశాఖలో సీనియర్ అసిస్టెంట్గా ప దోన్నతి పొంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఓవై పు ఉద్యోగం చేస్తూనే 2024 డిసెంబర్లో జరి గిన గ్రూప్–2 పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు, కాళేశ్వరం జోన్ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. ఈ మేరకు ప్రవీణ్ కుమార్ను గ్రామస్తులు అభినందించారు. ముల్కలపల్లి యువకుడు ఉపేందర్..డోర్నకల్: గ్రూప్–2 ఫలి తాల్లో ముల్కలపల్లికి చెందిన మేకల ఉపేందర్ ప్రతిభ కనబరిచారు. గ్రామానికి చెందిన మేకల రమణయ్య–రమణమ్మ దంపతుల కుమారుడు ఉపేందర్ ప్రస్తుతం మహబూబాబాద్ కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్గా విదులు నిర్వర్తిస్తూ గ్రూప్–2 పరీక్షలు రాశారు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో ఉపేందర్ 423.119 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 9వ స్థానంలో నిలిచారు. ప్రతిభ చాటిన ఉపేందర్ను గ్రామస్తులు అభినందించారు.కొడకండ్ల: మండల కేంద్రంలోని నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన ప్రణీత్ 388 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 138వ ర్యాంకు సాధించారు. సోమనారాయణ–నాగలక్ష్మి మూడో కుమారుడు ప్రణీత్ 2019 హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తిచేసిన తర్వాత హైదరాబాద్లోని కోచింగ్ తీసుకుని గ్రూప్స్ పరీక్షలు రాశారు. డిసెంబర్లో వెలువడిన గ్రూప్–4 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 58వ ర్యాంకు సాధించి ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. గ్రూప్–1 పరీక్షలో 380 మార్కులు సాధించగా.. గ్రూప్–2 ఫలితాల్లో 388 మార్కులతో రాష్ట్రస్థాయిలో 138వ ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా ప్రణీత్కు స్థానిక పద్మశాలి సంఘం నాయకులతోపాటు మిత్రులు అభినందనలు తెలిపారు. ప్రణీత్ ప్రతిభ.. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
● సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు జనగామ రూరల్: జిల్లాకేంద్రంలోని మెడికల్ కళాశాల హాస్టల్ వర్కర్స్కు పెండింగ్ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మెడికల్, ఎంసీహెచ్ ఆస్పత్రి కార్మికుల వేతనాలు చెల్లించాలని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారన్నారు. తక్షణమే వేతనాలు చెల్లించకుంటే సీఎం పర్యటనలో ఆందోళన చేస్తామన్నారు. ఈ సమావేశంలో రామ్దయాకర్, ఏనుగుల రఘు, జి.అజయ్ స్వామి, రూతు భారతి, ప్రశాంత్, గోపాలకృష్ణ, స్వప్న, కవిత, రజిత, ఎల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
రాణించిన రైతు బిడ్డ
రేగొండ: రేగొండ మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన మూలగుండ్ల భాగ్యమ్మ, సాంబరెడ్డి కుమారుడు ఉపేందర్ రెడ్డి చిన్నప్పటి నుంచి చదువులో ప్రతిభావంతుడు. గ్రూప్–2 ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో 28వ ర్యాంకు సాధించాడు. ఉపేందర్ ప్రస్తుతం పలిమెల తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. గతంలోనూ పంచాయతీ కార్యదర్శిగా నాలుగేళ్లపాటు సేవలందించాడు. ప్రస్తుతం గ్రూప్–2లో ప్రతిభ చూపడంతో తల్లిదండ్రులతోపాటు, స్నేహితులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
సమస్యను పరిష్కరించాలి..
కార్మికలకు వేతనాలు చెల్లించి హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. ఐదు హాస్టళ్లలో పెద్ద సంఖ్యలో మహిళా విద్యార్థులు ఉంటున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే హాస్టళ్లలో ఉండలేం. – విహారిక, మెడికోనీటి సమస్య ఎదుర్కొంటున్నాం.. ఓవర్హెడ్ ట్యాంక్లకు బోర్ వెల్ ద్వారా నీరునింపే పని కార్మికులు చేస్తుంటారు. వారు సమ్మెకు వెళ్లడంతో నీటి సరఫరా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. – ఇంద్రతేజ ● -
తల్లిని హత్యచేసిన తనయుడి అరెస్టు
● వివరాలు వెల్లడించిన సీఐ రమేశ్ ఎల్కతుర్తి: కన్నతల్లిని గొడ్డలితో నరికి హత్య చేసిన తనయుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశా రు. దీనికి సంబంధించి మండల కేంద్రంలో సీఐ పులి రమేశ్ తన కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని వీరనారాయణపూర్ గ్రామానికి చెందిన చదిరం అజయ్ తనకు రావాల్సిన భూమి వాటాను తల్లి చదిరం రేవతి(45) పంచివ్వ డం లేదన్న కోపంతో ఈనెల 7న గొడ్డలితో నరికి హత్య చేశాడు. దీంతో మృతురాలి చిన్న కుమారుడు చదిరం విజయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈక్రమంలో మండలంలోని కోతులనడుమ గ్రామ సమీపంలో సోమవారం వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తారసపడిన అజయ్ని అరెస్టు చేసి, విచారింగా.. నేరం అంగీకరిండంతో రిమాండ్కు తరలించిన ట్లు సీఐ వెల్లడించారు. ఎస్సై ప్రవీణ్కుమార్, మల్లే శం, గణేశ్, భాస్కర్రెడ్డి, నిరంజన్ పాల్గొన్నారు. -
గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
కొండపర్తికి నేడు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ● ములుగు జిల్లా కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకున్న గవర్నర్ ● అభివృద్ధి పనుల పరిశీలన అనంతరం సమ్మక్క–సారలమ్మ దర్శనం ● గిరిజన గ్రామాల్లో అభివృద్ధిపై సమీక్షించనున్న జిష్ణుదేవ్ సాక్షిప్రతినిధి, వరంగల్ : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్లోని రాజ్భవన్ నుంచి బయల్దేరనున్న గవర్నర్.. దత్త త గ్రామం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కొండపర్తి గ్రామానికి రోడ్డు మార్గాన చేరుకుని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకు మేడారంలోని ఐటీడీఏ గెస్ట్ హౌజ్లో భోజన విరామం తర్వాత హైదరాబాద్కు బయల్దేరుతారు. కాగా గవర్నర్ పర్యటన సందర్భంగా సోమవారం ము లుగు కలెక్టరేట్లో ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, ఎస్పీ శబరీష్, అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ దివాకర.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ● ఉదయం 8 గంటలకు హైదరాబాద్లోని రాజ్భవన్నుంచి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని దత్తత గ్రామమైన కొండపర్తికి రోడ్డు మార్గాన బయలుదేరుతారు ● ఉదయం 11 గంటలకు కొండపర్తి గ్రామానికి చేరుకుంటారు ● 11 నుంచి 12.30 గంటల వరకు గవర్నర్ చేతుల మీదుగా వివిధ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం, స్థానిక ఆదివాసీలతో గవర్నర్ మాటామంతి. ● మధ్యాహ్నం 12.30 గంటలకు కొండపర్తి నుంచి మేడారంలోని సమ్మక్క సారలమ్మ గుడికి రోడ్డు మార్గాన బయలుదేరుతారు. ● 12.45 నుంచి 1 గంట వరకు అమ్మవార్ల దర్శనాలు, మొక్కులు చెల్లించనున్నారు. ● 1 నుంచి 2 గంటల వరకు మేడారంలోని ఐటీడీఏ గెస్ట్ హౌజ్లో భోజన విరామం. ● 2 గంటలకు ఐటీడీఏ గెస్ట్ హౌజ్ నుంచి తిరిగి హైదరాబాద్లోని రాజ్భవన్కు రోడ్డు మార్గాన తిరుగు ప్రయాణం. ● సాయంత్రం 5 గంటలకు రాజ్భవన్కు చేరుకోనున్న గవర్నర్ఎస్ఎస్తాడ్వాయి: తన దత్తత గ్రామమైన మండలంలోని కొండపర్తికి గవర్నర్ జిష్ణుదేవ్వర్మ నేడు (మంగళవారం) రానున్నారు. ఈనేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. కొండపర్తిలో ట్రైబల్వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కమ్యూనిటీహాల్, పాఠశాల భవనానికి మరమ్మతులు, ప్రహరీ నిర్మాణం, అంగన్వాడీ కేంద్రానికి ప్రహరీ నిర్మాణ పనులు పూర్తి చేశారు. అంతేకాకుండా నిర్మించిన బహుళ ఉపయోగ భవనంలో కారంపొడి మిల్లు, మహిళలకు కుట్టు మిషన్లను సిద్ధం చేశారు. గవర్నర్ అభివృద్ధి పనులను ప్రారంభించి బిర్సాముండా, కొమురంభీం విగ్రహాలను మంత్రి సీతక్కతో కలిసి ఆవిష్కరించనున్నారు. కొండపర్తిలో అధికారులు గవర్నర్ రాక నేపథ్యంలో జిల్లా అధికారులు కొండపర్తి బాట పట్టారు. ఆయా శాఖల వారీగా ఏర్పాట్లు చేశారు. గర్నవర్ జిష్ణుదేవ్వర్మ మాట్లాడేందుకు వేదిక సిద్ధం చేస్తున్నారు. గ్రామంలోని రోడ్లు శుభ్రం చేసి సైడ్ బర్మ్కు మట్టి పోశారు. కొండపర్తిలో ప్రత్యేక హెల్త్ క్యాంపు ఏర్పాటుకు డీఎంహెచ్ఓ గోపాల్రావు గ్రామాన్ని సందర్శించి పరిశీలించారు. ట్రైబల్ వెల్పేర్ ఈఈ వీరభద్రం దగ్గరుండి ఏర్పాట్లు చేయించారు. స్థానిక ఎంపీడీఓ సుమనవాణి, ఎంపీఓ శ్రీధర్రావు పరిశుభ్రత ఏర్పాట్లను సిబ్బందితో చేయించారు. ఇదిలా ఉండగా.. సోమవారం సాయంత్రం కలెక్టర్ దివాకర ఏర్పాట్లను పరిశీలించారు. పీహెచ్సీలో అత్యవసర గది ఏర్పాటు గవర్నర్ కొండపర్తికి వస్తున్న నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రకారం తాడ్వాయి పీహెచ్సీలో అత్యవసర గదిని సిద్ధం చేశారు. ఈ గదిలో రెండు పడుక మంచాలు, మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచారు. డీఎంహెచ్ఓ గోపాల్రావు గదిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రణధీర్, వైద్యాధికారి అడెపు చిరంజీవి, సిబ్బంది ఉన్నారు.రోడ్డు నిర్మించాలి కొండపర్తి స్టేజీ నుంచి గ్రామం వరకు రోడ్డును బాగు చేయాలి. గతంలో బీటీ రోడ్డు పనులను మొ దలు పెట్టగా అటవీశాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పనులు నిలిచిపోయాయి. రాకపోకలకు ఇబ్బంది పడుతున్నాం. రోడ్డు అభివృద్ధికి అధికారులు కృషి చేయాలి. – చింత కౌసల్య, కొండపర్తిఆర్థికాభివృద్ధికి భరోసానివ్వాలి.. కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకోవడం సంతోషంగా ఉంది. మహిళ కోసం కుట్టు మిషన్లు, కారంపొడి మిల్లు నెలకొల్పారు. మహిళలకు డైరీ ఫాంలు, ఫౌల్ట్రీఫాంలు నెలకొల్పితే కుటుంబాలకు ఆర్థికభరోసా ఉంటుంది. – రజిత, కొండపర్తిగవర్నర్ టూర్ షెడ్యూల్ ఇలా..గవర్నర్ దత్తత శుభపరిణామం అటవీ ప్రాంతంలో ఉన్న కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దత్తత తీసుకోవడం సుభపరిణామం. సాగునీటి కోసం బోర్లు నిర్మిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో పంటలను సాగు చేసుకునే ఆలోచనలో ఉన్నాం. – అరెం లచ్చుపటేల్, మేడారం జాతర చైర్మన్ -
సాగునీటి సరఫరాలో అప్రమత్తంగా ఉండండి
సాక్షిప్రతినిధి, వరంగల్: యాసంగి పంటలు చేతికందే వరకు సాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి అధికారులతో సోమవారం కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకు ముందు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి తదితరులు మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలను కలిసి పంటలు ఎండుతున్న ప్రాంతాల్లో పరిస్థితులను వివరించారు. అనంతరం సాగు నీటి నిర్వహణ, సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.. అధికారులకు పలు సూచనలు చేశారు. నీటి పారుదల, వ్యవసాయ, విద్యుత్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పంటలకు సాగు నీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దేవాదుల ప్రాజెక్టు కింద అత్యధికంగా వరి సాగవుతోందని, ఎగువ భాగాన రైతులు ఎక్కువ మోటార్లు పెడుతున్నారని, చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలని, సాగు నీటి కొరత రాకుండా చూడాలని ఆదేశించారు. పంట చేతికందే వరకు చివరి ఆయకట్టుకు నీరందాలి కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం మంత్రులు ఉత్తమ్, పొంగులేటిలతో ఎమ్మెల్యేల భేటి -
కోర్కెలు తీర్చే కల్పవల్లి..
కాజీపేట రూరల్: కాజీపేట ఫాతిమానగర్లోని ఫాతిమామాత ప్రజల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతోంది. చరిత్రకలిగిన ఫాతిమామాత దేవా లయం కేథడ్రల్ చర్చి ప్రాంగణం ఓరుగల్లు మేత్రాసనంలో ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రతి ఏటా మూడు రోజులపాటు నిర్వహించే ఫాతిమామాత మహోత్సవానికి వివిధ జిల్లాల నుంచి విశ్వాసులు, అన్ని వర్గాల ప్రజలు తరలివస్తుంటారు. ఈ ఏడాది ఓరుగల్లు పీఠంలో 2025 సాధారణ జూబిలీ సంవత్సరంలో బిషప్ డాక్టర్ ఉడుములబాల ఆశీర్వాద వేళలో మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు బిషప్ సెక్రటరీ ఫాదర్ గంగారపు అనుకిరణ్ సోమవారం తెలి పారు. కాజీపేట మెయిన్రోడ్లో చర్చి ఎంట్రెన్స్ వద్ద నిర్మించిన మహాతోరణం ఆశీర్వాద ద్వారం, ప్రాంగణంలో జపమాల బృందావనం (రోజరి గార్డెన్)ను బిషప్ ఉడుముల బాల ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలను పురస్కరించుకొని కేథడ్రల్ చర్చి, ఫాతిమామాత గుహను ప్రత్యేకంగా అలంకరించారు. ఉత్సవాలకు 12 జిల్లాల నుంచి 10 వేల మంది భక్తులు రానున్నట్లు తెలిపారు. మూడు రోజుల కార్యక్రమాలు.. కేథడ్రల్ చర్చిలో ఈ నెల 11వ తేదీన మంగళవారం మహాపూజ్య డాక్టర్ ఉడుములబాల దివ్యబలిపూజ సమర్పణ, దంపతులకు సన్మానం, 12వ తేదీ బుధవారం ఫాదర్ తాటికొండ జోసెఫ్, డి.జోసెఫ్ ఆధ్వర్యంలో స్వస్థత ప్రార్థనలు, దివ్యబలిపూజ, కర్కూల్ పీఠం పూజ్య ఏరువ జోజిరెడ్డిచే పూజ ప్రార్థనలు. సాయంత్రం ఫాతిమామాత స్వరూపంతో ఊరేగింపు, ఫాతిమా మాత ప్రధాన ద్వారం, రోజరి గార్డెన్ ప్రారంభం, కొవ్వత్తులతో దివ్వప్రసాద ప్రదక్షిణ ది వ్యప్రసాద ఆశీర్వాదం. 13వ తేదీన గురువారం బెంగళూర్ అగ్రపీఠం మెన్సిగ్నోర్ సి.ప్రాన్సీస్ ఆంగ్లంలో దివ్యబలిపూజ కార్యక్రమం చేయనున్నారు. ఓరుగల్లు పీఠకాపరి అండ్ విశాఖ అగ్రపీఠకాపరి ఉడుములబాల సమష్టి కృతజ్ఞత సమర్పణ. సాయంత్రం 5:30 గంటలకు మూడో పూజ, గురుశ్రీ ఆశీ ర్వాదం, ఎస్.జె దివ్యపూజ పతాక అవరోహణతో పాతిమామాత ఉత్సవాల ముగింపు. పోస్టర్ ఆవిష్కరణ కాజీపేట: మంగళవారం నుంచి మూడు రోజులపాటు జరగనున్న ఫాతిమామాత ఉత్సవాలను విజ యవంతం చేయాలని బిషప్ ఉడుముల బాల కోరారు. ఈమేరకు కాజీపేట మీడియా పాయింట్ ఆవరణలో స్థానిక కెథడ్రల్ చర్చి విచారణ గురువు ఫాదర్ కాసు మర్రెడ్డి ఆధ్వర్యంలో వాల్పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. అనుకిరణ్, బొక్క దయాసాగర్, తాటికొండ జోసఫ్, సురేష్, నవీన్ ఫాదర్ సురేందర్, తదితరులు పాల్గొన్నారు. ఫాతిమామాత మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి ముఖ్య అతిథిగా ఓరుగల్లు పీఠకాపరి ఉడుములబాల నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం -
బాధ్యతగా పనిచేయాలి: సీపీ
స్టేషన్ఘన్పూర్/రఘునాథపల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈనెల 16న స్టేషన్ఘన్పూర్లో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసు అధికారులు భద్రత ఏర్పాట్లపై బాధ్యతగా పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన సోమవారం శివునిపల్లి పాలకుర్తి రోడ్డులో నిర్వహించే సీఎం బహిరంగ సభాస్థలంతో పాటు పార్కింగ్ స్థలాలు, హెలిప్యాడ్ ప్రాంతాన్ని జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డివిజన్ పోలీసు అధికారులతో మాట్లాడారు. సీఎం పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకో వాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అనంతరం రఘునాథపల్లి పోలీస్ స్టేషన్ను సీపీ సందర్శించారు. నమోదైన కేసులు, దర్యాప్తు వివరాలు, రికార్డుల గదులను పరిశీలించారు. విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. స్టేషన్ ఆవరరణ లో మొక్కల పెంపకం, పచ్చదనాన్ని చూసి పోలీసులను అభినందించారు. సీపీ వెంట డీసీపీ రాజమహేంద్రనాయక్, స్టేషన్ఘన్పూర్ ఏసీపీ భీంశర్మ, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐలు జి.వేణు, ఎడవెల్లి శ్రీనివాస్రెడ్డి, ఎస్సైలు నరేష్, వినయ్కుమార్ తదితరులు ఉన్నారు. సభాస్థలాన్ని పరిశీలించిన ఆర్డీఓ శివునిపల్లిలో సీఎం రేవంత్రెడ్డి బహిరంగసభ నిర్వహించనున్న స్థలాన్ని ఆర్డీఓ డీఎస్ వెంకన్న సోమవారం పరిశీలించారు. స్థలం చదును తదితర పనుల గురించి ఆర్అండ్బీ అఽధికారుల కు సూచనలు చేశారు. -
తెలంగాణకు పట్టిన గ్రహణం సీఎం
జనగామ: తెలంగాణలో ప్రస్తుతం వచ్చిన కరువు.. కాలం తెచ్చింది కాదు.. రేవంత్రెడ్డి ప్రభుత్వం తెచ్చినదే అని, తెలంగాణకు పట్టిన గ్రహణం సీఎం అని.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు విమర్శించారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవా రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దంపతులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి చేపల పులుసు తింటే.. బాబును ప్రజాభవన్కు పిలిచి అడుగులకు మడుగులు ఒత్తింది రేవంత్రెడ్డి కాదా.. అని ప్రశ్నించారు. కృష్ణా నదిలో రేవంత్రెడ్డి గురువు చంద్రబాబునాయుడు నీళ్లు దోచుకుపోతుంటే కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ధ్వజమెత్తారు. సీఎం, మంత్రికి బాబును ప్రశ్నించే దమ్ము, ధైర్యం లేదని, యాసంగి సీజన్ పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాలన చేతకాక ప్రకృతి, ప్రతిపక్షాలపై నిందలు వేసి రేవంత్రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. ఎండల తీవ్రతతో పంటలు ఎండిపోతుంటే కేసీఆర్, హరీశ్రావు సంతోషపడుతున్నారని సీఎం అనడం ఆయన రాజకీయ దివాలాకోరు తనానికి నిదర్శనమని అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఎండలు లేవా.. ఆనాడు ఒక్క ఎకరం ఎందుకు ఎండలేదు.. ఈ రోజు సాగు నీటి కష్టాలు ఎందుకు వచ్చాయో కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేవాదుల ఓఅండ్ఎం కాంట్రాక్టర్కు రూ.7వేల కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో 33 రోజులపాటు దేవాదుల పంపు మోటార్లను ఆన్ చేయలేదని, రేవంత్ రెడ్డి చేసిన తప్పును ప్రకృతి మీద మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. గోదావరిలో ప్రవాహం ప్రారంభం కాగానే మోటార్లు ఆన్చేసి రిజర్వాయర్లు, చెరువులు నింపితే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే లక్ష ఎకరాలు ఎండిపోయాయని, మహబూబ్నగర్, నల్గొండలో పంటలు ఎండిపోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డగోలుగా కృష్ణానది జలాలను దోచుకోవడమే కారణమన్నారు. దేవాదుల ఫేజ్–3 మోటార్లను వెంటనే ఆన్చేస్తే అదనపు నీటిని తెచ్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. వానాకాలం సీజన్లో కొనుగోలు చేసిన సన్నధాన్యానికి అందించే బోనస్ రూ.400 కోట్ల మేర పెండింగ్లో ఉందని తెలిపారు. ప్రస్తుతం నష్టపోయిన ప్రతీ ఎకరాకు ప్రభుత్వం రూ.20 వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో భూముల క్లియరెన్స్, గ్రేటర్ కమ్యూనిటీలకు అనుమతుల కోసం రేవంత్రెడ్డి ప్రభుత్వం 20 శాతం కమీషన్లు దండుకుంటుందని ఆరోపించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో శాసన మండలి బీఆర్ఎస్ శాసన సభాపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్, పాడి కౌశిక్రెడ్డి, నాయకులు మేకల కలిగంరాజు, తాళ్ల సురేష్రెడ్డి, సంపత్, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, మసిఉర్ రెహమాన్, సమ్మద్, అనిత, స్వరూప, సుధ, నాగరాజు, యాదగిరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. బాబుకు గురుదక్షిణతోనే.. ఎడారిగా రాష్ట్రం విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి హరీశ్రావు -
కంపు కంపు!
విధులు బహిష్కరించిన కేఎంసీ హాస్టళ్ల కార్మికులుఎంజీఎం : ప్రభుత్వ నిర్లక్ష్యం.. వేతనాల కోసం కార్మికులు చేపట్టిన ఆందోళనతో కాకతీయ మెడికల్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న మెడికల్ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత కీర్తి ప్రతిష్టలు పొందిన కేఎంసీ అధ్యాపకుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న క్రమంలో కనీసం మౌలిక వసతులు కల్పించడంలో సైతం ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం వైద్యవిద్యపై చూపుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. మెడికల్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన హాస్టళ్లలో పనిచేసే కార్మికులకు ఎనిమిది నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో వారు విధులు బహిష్కరించి ఆందోళన చేపడుతున్నారు. 80 మందికి పైగా కార్మికులు ఆందోళన బాట పట్టడంతో హాస్టళ్లలో శానిటేషన్ వ్యవస్థ అధ్వానంగా మారిది. ఇబ్బందులు పడుతున్న 1,250 మంది విద్యార్థులు -
గ్రూప్–1లో మెరిసిన గిరిజన ఆణిముత్యం
గార్ల: గిరిజన రైతు కుటుంబంలో పుట్టి గ్రూప్–1లో 900 మార్కులకు 454 మార్కులు సాధించాడు గిరిజన ఆణిముత్యం గంగావత్ పవన్కల్యాణ్. మానుకోట జిల్లా గార్ల మండలం పెద్దకిష్టాపురం గ్రామానికి చెందిన గంగావత్ లక్ష్మణ్, మంగ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు గంగావత్ పవన్కల్యాణ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 1 నుంచి ఇంటర్ వరకు చదివాడు. 10వ తరగతిలో 10/10 జీపీఏ సాధించడమే కాకుండా ఇంటర్లో ఎంఈసీ గ్రూప్లో పబ్లిక్ స్కూల్లో టాపర్గా నిలిచాడు. అనంతరం ఢిల్లీ యూనివర్సిటీలోని హిందూ కళాశాలలో డిగ్రీలో సీటు సాధించి బీఏ ఎకనామిక్స్ పూర్తిచేశాడు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే గ్రూప్–1 పరీక్ష రాసిన పవన్కల్యాన్ ఉత్తమ ఫలితం సాధించాడు. ఎస్టీ విభాగంలో కాకుండా ఓపెన్ కోటాలోనే డిప్యూటీ కలెక్టర్ పోస్టు వస్తుందని పవన్కల్యాణ్ ధీమా వ్యక్తం చేశాడు. పవన్కల్యాణ్ను గ్రామస్తులు, తల్లిదండ్రులు అభినందించారు. జశ్వంత్రాజ్ప్రతిభ మహబూబాబాద్ అర్బన్: సోమవారం విడుదలైన గ్రూప్ వన్ ఫలితాల్లో మానుకోట జిల్లా కేంద్రంలోని సంఘాల రవికుమార్ ప్రసన్న దంపతుల కుమారుడు సంఘాల జశ్వంత్రాజ్ 900 మార్కులకు 465 మార్కులు సాధించాడు. గ్రూప్ వన్లో అత్యధికంగా మార్కులు సాధించడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టెన్త్ స్పాట్ విధుల రెమ్యునరేషన్ చెల్లించండి ● డీఈఓకు టీఆర్టీఎఫ్ వినతి విద్యారణ్యపురి: గత ఏడాది ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రం హనుమకొండలో టెన్త్ పరీక్షల జవాబు పత్రాల మూల్యంకణంలో విధులు నిర్వర్తించిన ఉపాధ్యాయులకు నేటికీ రెమ్యునరేషన్ చెల్లించలేదు. తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బాసిరి రాజిబాపురావు, జనరల్ సెక్రటరీ గుగులోతు శ్రీనివాస్నాయక్లు సోమవారం డీఈఓకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రెమ్యునరేషన్తోపాటు టీఏ, డీఏలు చెల్లించలేదని తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈఏడాది ఏప్రిల్లో కూడా టెన్త్ విద్యార్థుల పరీక్షల జవాబు పత్రాల మూల్యంకనం ఉంటుందని కానీ, గత ఏడాదికి సంబంధించిన రెమ్యునరేషనే ఇవ్వకపోవడం దారుణమన్నారు. వెంటనే రెమ్యునరేషన్ చెల్లించాలని లేదంటే ఈఏడాది నిర్వహించబోయే స్పాట్ వాల్యూయేషన్ను ఉపాధ్యాయులు బహిష్కరించాల్సి వస్తుందని వినతిపత్రంలో పేర్కొన్నారు. క్రీడల్లోనూ పిల్లలను ప్రోత్సహించాలి వరంగల్ స్పోర్ట్స్: పిల్లలను చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలని సీనియర్ సివిల్ జడ్జి క్షేమదేశ్పాండే తల్లిదండ్రులకు సూచించారు. వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ బస్టాండ్ సమీపంలోని శ్రీహర్ష కన్వెన్షన్హాల్లో సోమవారం నిర్వహించిన ఓపెన్ టు ఆల్ ఉమ్మడి జిల్లా స్థాయి చదరంగ పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. ఈ పోటీల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి క్షేమదేశ్పాండే, విశిష్ట అతిథిగా కన్వెన్షన్హాల్ డైరెక్టర్ వేణు హాజరై విజేతలకు బహుమతులను అందజేసి, మా ట్లాడారు. టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి కన్నా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా నుంచి 80 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. ఓపెన్ టు ఆల్ విజేతగా అల్లాడి శ్రీవాత్సవ్ నిలవగా వరుస స్థానాల్లో రిత్విక్ గండు, షేక్ రియాజ్, స్వాతి దేవరపల్లి, ఎం.దీక్షిత్ నిలిచినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో చీఫ్ ఆర్బిటర్లు, తదితరులు పాల్గొన్నారు. -
ఒక్కొక్కరిది ఒక్కో సమస్య
మంగళవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2025– 8లోuతోడబుట్టిన వారే కష్టపెడుతున్నరు.. జనగామ పట్టణంలోని శివాలయం వీధికి చెందిన గంట శ్రీలతకు పెళ్లి సమయంలో 50 గజాల స్థలాన్ని పుట్టింటి వారు కట్నం కింద ఇచ్చారు. ఏడు సంవత్సరాల క్రితం భర్త యోగానందు చనిపోవడంతో శ్రీలత ప్రైవేట్ స్కూల్లో పని చేస్తూ తన కూతురును పోషించుకుంటున్నది. ఓ బ్యాంకులో రుణం తీసుకుని ఉన్న కొద్ది స్థలంలో ఇల్లు కట్టుకున్నది. రెక్కల కష్టంతో నిర్మించుకున్న ఇంటి స్థలం ఇచ్చేయాలంటూ సోదరులు ఇబ్బందులకు గురి చేస్తుండడంతో ఆ అభాగ్యురాలు కలెక్టరేట్ మెట్లెక్కింది. ఇదిలా ఉండగా.. పెద్ద దిక్కు లేకపోవడంతో తల్లిదండ్రులు సైతం శ్రీలత వద్దే ఉంటూ ధైర్యం చెబుతున్నారు. కూతురు కష్టాలు చూడలేక ఆ దంపతులు రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోవడానికి రైల్వేట్రాక్ వద్దకు వెళ్లగా గమనించిన స్థానికులు కాపాడారు. కూతురుకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు.పక్క ఫొటోలోని వృద్ధ దంపతులు వెంకటకృష్ణయ్య, బుచ్చమ్మది చిల్పూరు మండలం శ్రీపతిపల్లి. వీరికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రెండో కుమారుడు రంగయ్య ఇల్లరికం వెళ్లగా, మిగతా వారు ఊరిలోనే ఉంటున్నారు. ఆరు నెలల క్రితం ప్రమాదం జరగ్గా వెంకటకృష్ణయ్య కాలు తొలగించారు. అప్పటి నుంచి ఆ దంపతులకు కష్టాలు మొదలయ్యాయి. అప్పటికే ముగ్గురు కుమారులు ఉన్న భూమి పంచుకుని తల్లిదండ్రులకు బువ్వ పెట్టకుండా ఇబ్బందుల కు గురిచేస్తుండడంతో ఆ పండుటాకులు న్యాయం కోసం తహసీ ల్దార్, ఆర్డీఓను ఆశ్రయించారు. ‘కొడుకులు అన్నం పెట్టడంలేదు.. ఓ చిన్న గదిలో వండుకుంటున్నాం’ అంటూ ఆ దంపతులు కలెక్టర్తో తమ కష్టాలు చెప్పుకుని విలపించారు. ‘ఆర్డీఓకు ఆదేశాలు ఇచ్చా.. వారం రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుంది.. వెళ్లి కలవండి’ అంటూ కలెక్టర్ వారికి భరోసా కల్పించారు. న్యూస్రీల్ -
సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
● కలెక్టర్ రిజ్వాన్ బాషాజనగామ రూరల్: సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, వారు ఐక్యంగా ఉంటే అద్భుతా లు సృష్టించగలరని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నా రు. సోమవారం కలెక్టరేట్లో మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యా న మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అదనపు కలెక్టర్లు పింకేష్కుమార్, రోహిత్సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. మహిళలు ఇంటా, బయట సమానత్వంతో పాటు జీవితంలో ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు. ఆడ, మగ మధ్య వ్యత్యాసం చూడకూడదని, 80 శాతం మహిళలే జిల్లా అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారని పేర్కొన్నారు. వ్యాపార, వృత్తి, ఉపాధి రంగాల్లో మహిళ పాత్ర గణనీయమని, ఆడపిల్లను తల్లితండ్రులు తప్పనిసరి చదివించి వారికి అండగా నిలవాలని సూచించారు. అనంతరం ఐడీఓసీని పరిశుభ్రంగా ఉంచుతున్న మహిళా శానిటేష న్ సిబ్బందిని, మున్సిపల్ మహిళా పారిశుద్ధ్య కార్మి కులను సత్కరించి బహుమతులు అందజేశారు. కేక్ కట్ చేసిన అనంతరం వివిధ శాఖలకు చెందిన మహిళా అధికారులు, ఉత్తమ మహిళా ఉద్యోగుల కు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి ఫ్లోరెన్స్, డీపీఓ స్వరూప, డీఆర్డీఓ వసంత, డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు, జౌళి శాఖ అధికారి చౌడేశ్వరి, జెడ్పీ సీఈఓ మాధురీ కిరణ్చంద్రషా, డిప్యూటీ సీఈఓ సరిత, సీడీపీఓ రమాదేవి, మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ హెచ్.శారద, టీజీఓస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, టీఎన్జీఓస్ ప్రెసిడెంట్ ఖాజా షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్గా సన్ప్రీత్ సింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించా రు. సూర్యాపేట జిల్లానుంచి బదిలీపై వచ్చిన ఆయన.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సాయుధ పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించారు. డీసీపీలు, అదనపు డీసీపీలు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్గా పూర్వ సీపీ అంబర్ కిషోర్ ఝానుంచి బాధ్యతలు స్వీకరించారు. అంబర్ కిషోర్ ఝా.. నూతన సీపీకి పూలబొకే అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వందశాతం శాంతి భద్రతలను కాపాడుతామని, ప్రజలకు పోలీసులపై నమ్మకం కలిగే విధంగా ఇరువై నాలుగు గంటలు ప్రజల కోసం పనిచేస్తామన్నారు. ప్రధానంగా నేరాల నియంత్రణతోపాటు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కృషి చేస్తామని చెప్పారు. ప్రస్తు తం పోలీసులు ఎదుర్కొంటున్న సవాళ్లు అయిన సైబర్ క్రైం, మత్తు పదార్థాల కట్టడితోపాటు మత్తు పదార్థాలను వినియోగించేవారు, విక్రయించేవారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. రాబోయే రోజుల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులను మరింత బలోపేతం చేస్తామన్నారు. అభినందనలు తెలిపిన వారిలో డీసీపీలు షేక్ సలీ మా, రాజమహేంద్రనాయక్, అంకిత్ కుమార్, ఏఎస్పీ చైతన్య, అదనపు డీసీపీలు రవి, సురేష్ కుమార్, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, వివిధ విభాగాల అధికారులు ఉన్నారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో నూతన సీపీ సన్ప్రీత్సింగ్ బాధ్యతల స్వీకరణ