Jangaon District Latest News
-
బంజారాల అభివృద్ధికి కృషి
జనగామ రూరల్: ప్రతి తండాలో తాగునీటి వసతి కల్పించడంతోపాటు బంజారాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్ఎంఆర్ గార్డెన్లో డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో ఆయ న మాట్లాడారు. తన వంతు సహకారంగా బంజా రా భవనానికి భూమి, అలాగే జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడానికి సేవాలాల్ మహరాజ్ విగ్రహం ఇప్పిస్తానని చెప్పా రు. డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ మా ట్లాడుతూ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా బంజారా భవనం నిర్మాణానికి సహకరించటం లేదని, బంజారాల ఓట్లతో గెలిచిన నాయకులు గిరి జనుల సమస్యలు పట్టించుకోవడం లేద ని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు చౌరస్తా నుంచి లంబాడీ మహిళలు సంప్రదాయ నృత్యాలతో ర్యాలీగా వచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అజ్మీరా స్వామినాయక్, సేవాలాల్ జయంతి స్పెషల్ ఆఫీసర్ రూపరాణి, మాజీ కౌన్సిలర్ అనిత, జిల్లా వైద్యులు బాలాజీనాయక్, శంకర్నాయక్, కొర్ర కాలురామ్నాయక్, ధర్మ భిక్షం, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు రాంకోటి, బానోతు రవి, గోవర్ధన్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సేవాలాల్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
ఎమ్మెల్సీ ఎన్నికలపై అలర్ట్!
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్–నల్లగొండ–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్ని కల పోలింగ్కు ఐదు రోజులే గడువుంది. అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో ఉండగా.. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి ఆరు జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులను అలర్ట్ చేశారు. ఈమేరకు శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రా ల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన సుదర్శన్రెడ్డి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలన్నారు. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా నిఘా పటిష్టం చేయాలని సూచించారు. ఎన్నికల నిబంధనల ను జిల్లాల్లో పకడ్బందీగా అమలు చేయాలని, డబ్బు, మద్యం, ఆభరణాలు, పరికరాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయకుండా జాగ్రత్త పడాల ని, క్షేత్రస్థాయి నుంచి వచ్చే సమాచారంతో దాడులు నిర్వహిస్తూ వీటిని నిరోధించాలని చెప్పారు. ఏర్పాట్లలో అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన మేర సౌకర్యాలు ఉండేలా ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు. పూర్వ వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 24,905 ఓట్లు ఉండగా.. ఉమ్మడి వరంగల్ పరిధి ఆరు జిల్లాల్లో 6,509 పురుషులు, 4,288 సీ్త్రలు కలిపి 10,797 మంది ఓటర్లున్నారు. ఆరు జిల్లాల్లోని 70 మండలాల్లో ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా.. 72 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్కాస్టింగ్ నిరంతరం పని చేసేలా విద్యుత్ సరఫరా ఏర్పాట్లపై స్థానికులతో మాట్లాడుతున్నారు. అలాగే.. 27న జరిగే పోలింగ్ కోసం ఒక్కరోజు ముందే ఎన్నికల సామగ్రిని తరలించేలా జిల్లాకేంద్రాల్లో డిస్టిబ్య్రూషన్, రిసెప్షన్ సెంటర్లవద్ద అవసరమైన వసతులపై కసరత్తు చేస్తున్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఉదయం 8 గంట లకు పోలింగ్ ప్రారంభమయ్యేలా, ప్రతీ రెండు గంటలకు పోలింగ్ వివరాలు ప్రకటించేలా ఎన్నికల అధికారులు, సిబ్బందిని కలెక్టర్లు సంసిద్ధం చేస్తున్నారు. వేడెక్కిన ప్రచారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 19 మంది అభ్యర్థులు బరి లో ఉన్నారు. మొత్తం 23 మంది 50 సెట్లు నామినేషన్లు దాఖలు చేయగా.. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత 19 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బరిలో అలుగుబెల్లి నర్సిరెడ్డి– స్వతంత్ర(యూటీఎఫ్ మద్దతు), గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి – స్వతంత్ర (టీచర్స్ జేఏసీ మద్దతు), పులి సరోత్తంరెడ్డి – బీజేపీ (టీపీయూఎస్ మద్దతు), శ్రీపాల్రెడ్డి పింగిళి–స్వతంత్ర (పీఆర్టీయూ– టీఎస్ మద్దతు), పూల రవీందర్ – స్వతంత్ర (ఎస్టీ యూ మద్దతు)తో పాటు స్వతంత్రులుగా సంగంరెడ్డి సుందర్రాజు, కొలిపాక వెంకటస్వామి, అర్వ స్వాతి, కంటె సాయన్న, పన్నాల గోపాల్రెడ్డి ఏలె చంద్రమోహన్, చాలిక చంద్రశేఖర్, జంకిటి కైలాసం, జి.శంకర్, తలకోల పురుషోత్తంరెడ్డి, తాటికొండ వెంకటరాజయ్య, దామెర బాబురావు, బంక రాజు, ప్రజావాణి పార్టీ నుంచి లింగిడి వెంకటేశ్వర్లు పోటీలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు మరో ఐదు రోజు లే గడువుండడంతో అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశాం అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ జనగామ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లాలో పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామని అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ అన్నారు. సీఈఓ వీసీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు మండలా లకు ఒక రూట్ చొప్పున నాలుగు రూట్లు ఏర్పాటు చేశామని, సెక్టోరియల్ అధికారులకు, పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్లకు విధులు కేటా యించినట్లు వివరించారు. అదనపు కలెక్టర్ రోహిత్సింగ్, డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏఎస్పీ పండారి చేతన్నితిన్, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఏర్పాట్లపై కలెక్టర్లకు సీఈఓ సుదర్శన్రెడ్డి ఆదేశం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఉమ్మడి జిల్లాలో 10,797 మంది ఓటర్లు 27న పోలింగ్.. మార్చి 3న లెక్కింపు ప్రచారంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు -
అరకొర.. అసంపూర్తి
జిల్లాలో జాతీయ రహదారి–143 పనుల విషయంలో పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామాల్లో సర్వీస్రోడ్లు, సైడ్ రెయిలింగ్లు, డ్రెయినేజీ పనులు అరకొర.. అసంపూర్తిగా ఉన్నాయి. గడువు ముగిసి ఆరేళ్లయినా పనుల పూర్తికి మోక్షం లభించడంలేదు. ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. – స్టేషన్ఘన్పూర్ ● ఎన్హెచ్–143 పనులు ఆగమాగం ● గడువు ముగిసి ఆరేళ్లయినా పూర్తికాని సర్వీసు రోడ్ల నిర్మాణం ● రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న ప్రజలు ● పట్టింపులేని పాలకులు, అధికారులు జాతీయ రహదారి–143 విస్తరణ పనుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2015 సంవత్సరంలో రూ.1,920 కోట్లతో యాదాద్రి–వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టింది. ఇందులో రహదారి విస్తరణ పనులకు రూ.897.03 కోట్లు, మిగిలిన రూ.1022.97కోట్లు భూసేకరణ, ఇళ్ల యజమానులకు కేటాయించారు. 2016 జూన్ 1న నాటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పనులకు శంకుస్థాపన చేయగా ఎల్అండ్టీ సంస్థ పనులు చేపట్టింది. యాదాద్రి జిల్లా వంగపల్లి నుంచి వరంగల్ జిల్లా ఆరెపల్లి వరకు 99.10 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులను 30 నెలల్లో పూర్తి చేసే లక్ష్యంతో చేపట్టారు. వాస్తవానికి 2019 జనవరి వరకు పూర్తి కావలసి ఉంది. గడువు ముగిసి ఆరు సంవ త్సరాలు అయినా పూర్తిస్థాయిలో పనులు చేపట్టలేదు. జిల్లా వ్యాప్తంగా ఇదే దుస్థితి జాతీయ రహదారి విస్తరణ పనుల్లో జిల్లా వ్యాప్తంగా ఇదే దుస్థితి నెలకొంది. పెంబర్తి, లింగాలఘణపురం, రఘునాథపల్లి, స్టేషన్ఘన్పూర్, చిల్పూ రు మండలాల్లో సర్వీస్ రోడ్డు పనులను పూర్తి చేయలేదు. పలుచోట్ల యూటర్న్ లేకపోవడంతో వాహనాలు ఎదురెదురుగా వచ్చి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో వాహనదారులు అదనంగా దూరం తిరిగి వెనక్కి రావాల్సి వస్తున్నది. ● రఘునాథపల్లి మండలంలో సర్వీస్ రోడ్లు వేసినా ఇరుకుగా ఉన్నాయి. ● డివిజన్ కేంద్రమైన స్టేషన్ఘన్పూర్లో సర్వీస్ రోడ్లు అసంపూర్తిగా వేశారు. స్థానిక బస్టాండ్ నుంచి శ్రీవాణి గురుకులం వరకు సర్వీస్ రోడ్డు వేయాల్సి ఉండగా కేవలం విద్యుత్ సబ్స్టేషన్ వరకే వేసి వదిలేశారు. దాంతో సర్వీస్ రోడ్డు నిరుపయోగంగా మారింది. ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ● ఘన్పూర్ మండలం రాఘవాపూర్లో రహదారికి రెండువైపులా ఇంతవరకు సర్వీస్ రోడ్లు వేయలేదు. ప్రజలు నేరుగా జాతీయ రహదారి పైకి రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ● చిల్పూరు మండలం చిన్నపెండ్యాలలో సర్వీస్ రోడ్లు, డ్రెయినేజీల పనులు అరకొరగా చేపట్టారు. అసంపూర్తి సర్వీస్ రోడ్లు, రెయిలింగ్ పనులతో ఆయా మండలాల్లో ప్రజలు పడరాని పాట్లు పాడుతున్నారు. సర్వీసురోడ్లు లేక ప్రజల అవస్థలు రాఘవాపూర్లో సర్వీస్రోడ్డు కోసం గోతులు తీసి వదిలేసిన రోడ్డుజాతీయ రహదారి విస్తరణలో భాగంగా గ్రామాలు ఉన్న చోట సర్వీస్ రోడ్లు వేయాలి. సర్వీస్ రోడ్డుపై నుంచి ప్రజలు నేరుగా జాతీ య రహదారిపైకి రాకుండా మధ్యలో రెయిలింగ్ ఏర్పాటు చేయాలి. సర్వీస్ రోడ్డుకు, జాతీ య రహదారికి మధ్య హైమాస్ట్ లైట్లు వేయాలి. సర్వీస్ రోడ్డు పక్కన డ్రెయినేజీలు పూర్తి చేసి మురుగు నీరు ఇళ్లలోకి రాకుండా చర్యలు చేపట్టాలి. అయితే సంబంధిత అధికారులు కేవలం జాతీయ రహదారి విస్తరణ చేశారే తప్ప.. సర్వీస్రోడ్లు, రెయిలింగ్ పనులను విస్మరించారు. కొన్ని గ్రామాల్లో సర్వీస్రోడ్లు కొంతమేర వేసి వదిలేశారు. -
ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
జనగామ రూరల్ : రాష్ట్రంలోని గురుకులాల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సాంఘిక సంక్షేమ విద్యాలయాల సంస్థ జిల్లా కోఆర్డినేటర్ పి.శ్రీనివా సరావు ఒక ప్రకటనలో తెలిపారు. 5, 6, 7, 8, 9 తరగతుల్లో ప్రవేశానికి మొత్తం 1,851 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, ఈనెల 23న ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకు జిల్లా పరిధిలో తొమ్మిది సెంటర్లు కేటాయించామని తెలిపారు. నిర్దేశిత సమయానికి గంట ముందే సెంటర్లోకి అనుమతిస్తారని, ప్రతీ విద్యార్థి హాల్ టికెట్, పరీక్ష ప్యాడ్, బ్లూ, బ్లాక్ పెన్ తప్పనిసరి వెంట తెచ్చుకోవాలని సూచించారు. జిల్లా కోఆర్డినేటర్ పి.శ్రీనివాసరావు -
బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
బచ్చన్నపేట : కొడవటూర్లోని స్వయంభూ శ్రీ సిద్ధేశ్వరాలయంలో మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు అవసరమైన ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ నల్లొగొండ సహాయ కమిషనర్ భాస్కర్రావు ఆదేశించారు. శుక్రవారం ఆయన ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 24 నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, శివరాత్రి రోజున శివపార్వతుల కల్యాణం ఉంటుందని చెప్పారు. కల్యాణానికి వచ్చే వేలాది మంది భక్తుల కు వసతుల కల్పనలో లోటు లేకుండా చూడాలన్నా రు. కట్టుదిట్టమైన భద్రత, వైద్య సేవలు అందుబా టులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, కార్యనిర్వహణాధికారి చిందం వంశీ, ప్రధాన పూజారి ఓం నమఃశివాయ, డైరెక్టర్ నిమ్మ కర్ణాకర్రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. పాలకుర్తిలో ఏర్పాట్ల పరిశీలన పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 25 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు జరిగే మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను శుక్రవారం దేవాలయ ధర్మాదాయ శాఖ నల్లొగొండ సహాయ కమిషన్ కె.భాస్కర్ పరిశీలించారు. ఆలయంలో భక్తుల కోసం క్యూలైన్, చలువ పందిళ్లు ఏర్పాటు చేయగా.. సందర్శించారు. లడ్డూ తయారీని పరిశీలించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు, సూపరింటెండెట్ కొత్తపల్లి వెంటకయ్య, సిబ్బంది పాల్గొన్నారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ భాస్కర్రావు -
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ
జనగామ: జిల్లా కేంద్రంలోని హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ, మున్సిపల్, పోలీసు అధికారులు శుక్రవారం ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. నిర్వహణ అధ్వానంగా ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలాజీ బార్ యజమానికి రూ.10వేలు, అమృతబార్కు రూ.5వేలు, భువన బార్కు రూ.5వేలు జరిమా నా విధించి హెచ్చరికలు జారీ చేశారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశం మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కృష్ణమూర్తి, నిఖిల్, ఎస్సై రాజన్బాబు, పురపాలిక స్పెషల్ ఆఫీసర్ పులి శేఖర్ తనిఖీలు చేపట్టారు. ఓవర్లోడ్తో ప్రయాణిస్తే చర్యలు జనగామ రూరల్: ఓవర్లోడ్తో ప్రయాణిస్తే చర్యలు తప్పవని జిల్లా రవాణా అధికారి జీవీ.శ్రీనివాస్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రం చౌరస్తాలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరి పొట్టు ఓవర్ లోడుతో వెళ్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. ఓవర్లోడ్ కారణంగా ప్రమాదాలతోపాటు ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బంది పడతారని, నింబధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే చర్యలు తీసుకుంటామని అధికారి హెచ్చరించారు. ఈ తనిఖీల్లో కానిస్టేబుల్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఎకో ఫ్రెండ్లీ పర్యావరణం లక్ష్యం..జనగామ: ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు కష్టపడి చదువుకుంటూనే.. ఎకో ఫ్రెండ్లీ పర్యావరణం లక్ష్యంగా నేటి యువత పనిచేయాలని రిడీమ్ ఇండస్ట్రీస్, ఫౌండర్, సీఈఓ అరుణ్కుమార్ అన్నారు. జనగామ మండలం యశ్వంతా పూర్ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో ఐటీసీ సెల్ ఆధ్వర్యాన శుక్రవారం నిర్వహించిన ‘ప్రాసెస్ ఆఫ్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్, టెక్నాలజీ రెడీనెస్ లెవల్, కమర్షియలైజేషన్ ఆఫ్ ల్యాబ్ టెక్నాలజీ, టెక్నాలజీ ట్రాన్స్ఫర్’ అనే ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు. తమ సంస్థ ద్వారా విద్యార్థులు సమాజానికి హాని కలిగించని విధంగా బయోడీగ్రేడబుల్ బ్యాగులు తయారు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమం ఎకో ఫ్రెండ్లీ పర్యావరణానికి దోహదం చేస్తుందన్నారు. సీజేఐటీలో విద్యను అభ్యసించి, ఓ కంపెనీకి సీఈఓ గా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చు కోవాలని సూచించారు. హైదరాబాద్ సందెల ఇంజనీరింగ్ కళాశాల ఎండీ విజయ్కుమార్ మాట్లాడుతూ సౌర, వాయు, జలశక్తి లాంటి ఆవిష్కరణలు చేసేలా విద్యార్థులు ఆలోచనలకు పదును పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సీజేఐటీ కళాశాల డైరెక్టర్ డి.విజయపాల్రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి, ఐటీసీ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ కె.యాకూబ్, అధ్యాపకులు డాక్డర్ బి.వీరు, రఘుపతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి నాటికల పోటీలు నయీంనగర్: హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో ఈనెల 23 నుంచి 26 వరకు రాష్ట్ర స్థాయి నాటికల పోటీలు నిర్వహిస్తున్నట్లు సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ నిర్వాహకులు గన్నమరాజు గిరిజామనోహరబాబు, వనం లక్ష్మీకాంతారావు తెలిపారు. శుక్రవారం హనుమకొండ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి పోటీలకు తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక నాటక రంగ సంస్థల ను ఆహ్వానించినట్లు తెలిపారు. పోటీలకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరిస్తున్నాయ ని పేర్కొన్నారు. వరంగల్ సహృదయులంతా కుటుంబాలతో విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏవీ.నరసింహారావు, టి.లక్ష్మణరావు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ అవసరాలకు తగ్గట్టుగా చర్యలు
జనగామ: వినియోగదారుల డిమాండ్ కు తగ్గట్టుగా మరింత నాన్యతతో కూడిన విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్పీడీసీఎల్ జిల్లా ఎస్ఈ టి.వేణుమాధవ్ అన్నా రు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జనగా మ సర్కిల్ పరిధిలో ప్రస్తుత నెల 12వ తేదీ రోజున గరిష్ట విద్యుత్ డిమాండ్ 5.75 మిలియన్ యూని ట్లు నమోదు కాగా.. రాబోయే మూడు నెలల్లోనూ గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు. గత మూడు నెలల నుంచే వేసవి కాలం ముందస్తు కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని, ఆ మేరకు కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పా రు. ముందు ఎక్కడెక్కడ అదనపు లోడ్ పెరుగుతుందో నిర్ధారించుకుని కొత్తగా 32 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామని, అలాగే 45 ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచి, 33/11 కేవీ సబ్స్టేషన్లలో నూతనంగా 5 పవర్ ట్రాన్స్ఫార్మర్లను బిగించినట్లు వివరించారు. అత్యవసర సమయంలో ప్రత్యామ్నాయ లైన్(ఇంటర్ లింకు) ద్వారా విద్యుత్ సరఫరా చేయడానికి కొత్తగా రెండు ఇంటర్ లింకింగ్ లైన్లు ఏర్పా టు చేశామని తెలిపారు. మెరుగైన, కోతలు లేని విద్యుత్ సరఫరా కోసం కొత్త ఫీడర్లను సైతం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్సమస్యల పరిష్కారానికి టోల్ఫ్రీ నంబర్ 1912 విద్యుత్ వినియోగదారులకు 24 గంటల పాటు సేవలందిస్తున్నామని, సమస్యలు ఉత్పన్నమైతే టోల్ఫ్రీ నంబర్ 1912కు పోన్ చేయాలన్నారు. ట్రాన్స్ ఫార్మర్లు పెయిల్యూర్, ఫ్యూజ్ ఆఫ్ కాల్స్, లోవోల్టేజీ, బ్రేక్ డౌన్స్, ప్రమాదకరంగా ఉన్న స్తంభాలు, తీగలు, విద్యుత్ బిల్లుల్లో తేడాలు, పేరు మార్పు, మీటర్లలో సాంకేతిక సమస్య, సర్వీసు రద్దు తదితరాలకు టోల్ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం అందుకున్న వెంటనే సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. -
స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలి
జనగామ రూరల్: స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలని అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ అధికా రులను ఆదేశించారు. రాబోయే గ్రామ పంచాయ తీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్లు, పోలింగ్, పోస్టల్ బ్యాలెట్, కౌంటింగ్ విధులపై నోడల్ అధికారులు, స్టేజ్–1 రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, స్టేజ్–2 రిటర్నింగ్ అధికారులకు శుక్రవారం కలెక్టరేట్లో జెడ్పీ, జీపీ విభాగాల ఆధ్వర్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. నామినేషన్ల ప్రక్రియ నుంచి ఓట్ల లెక్కింపు వరకు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. బ్యాలెట్ పత్రాల ద్వారా నిర్వహించే ఈ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, నామినేషన్ల ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు, పోలింగ్, కౌంటింగ్ వరకు ప్రతి దశలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల సంఘం ద్వారా అందించిన కరదీపికను చదువుకొని సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని ఆదేశించా రు. సందేహాలు ఉంటే మండలాల వారీగా నియమించిన మాస్టర్ ట్రైనర్లను అడిగి నివృత్తి చేసుకో వాలని చెప్పారు. జిల్లాలో మొత్తం 2,543 పోలింగ్ కేంద్రాలకు గాను ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 783 ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ శిక్షణకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి స్టేజ్–1, 2కు సంబంధించి ఆర్ఓలు 75, ఏఆర్ఓలు 150 మంది చొప్పున, జెడ్పీటీసీ ఎన్నికలకు ఆర్ఓలు 13 మంది, ఎంపీటీసీ ఎన్నికల కు సంబంధించి ఆర్ఓలు, ఏఆర్ఓలు 55 మంది చొప్పున, ఎంపీడీఓలు, ఎంపీఓలు హాజరయ్యారు. అంతకుముందు మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల విధుల నిర్వహణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, జెడ్పీ సీఈఓ మాధురీ షా, డిప్యూటీ జెడ్పీ సీఈఓ సరిత, డీపీఓ స్వరూప తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
జనగామ రూరల్: జిల్లా కేంద్రంలోని ఎంసీ హెచ్, మెడికల్ కళాశాల హాస్టల్ కాంట్రాక్ట్ వర్కర్ల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించా లని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ రిజ్వాన్ బాషాకు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యాన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాపర్తి రాజు మాట్లాడుతూ నాలుగు నెలల నుంచి వేతనాలు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షు డు ఎం.రామ్దయాకర్, ఏనుగుల రఘు, జి.అజయ్, బి.సువర్ణ, సీహెచ్ రజిత, జి.బాలమణి, వి.మంజుల, బి.స్వరూప, యాదలక్ష్మి, జె.పద్మ తదితరులు పాల్గొన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాలరాజు గౌడ్జనగామ: బ్లాక్ కాంగ్రెస్ జనగామ జోన్ అధ్యక్షుడిగా యశ్వంతపూర్ గ్రామానికి చెందిన మెరుగు బాలరాజ్గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి నియామకపత్రాన్ని గురువారం అందజేశారు. పార్టీ బలోపేతానికి కృషిచేయాల ని, కష్టపడిన వారికి పదవులు లభిస్తాయని కొమ్మూరి ఈ సందర్భంగా పేర్కొన్నారు. సామాజిక చైతన్య కార్యక్రమాలపై దృష్టి పెట్టాలిజనగామ రూరల్: కవులు, కళాకారులు సామాజిక చైతన్య కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. జనగామకు చెందిన కల్చరల్ క్రియేటివ్ చానల్ కార్యక్రమాల పోస్టర్ను ఆయన గురువారం ఆవిష్కరించి మాట్లాడారు. చానల్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి జి.కృష్ణ మాట్లాడు తూ.. విభిన్నమైన సామాజికాంశాలతోపాటు సమాజానికి పెను సవాల్గా మారిన డ్రగ్స్, వాటి వల్ల జరుగుతున్న దుష్పరిణామాలపై లఘుచిత్రం రూపొందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిలా సోమనరసింహాచారి, పెట్లోజు సోమేశ్వరాచా రి, లగిశెట్టి ప్రభాకర్, చిలుమోజు సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయం, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ బచ్చన్నపేట : వ్యవసాయానికి, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని ట్రాన్స్కో డీఈ లక్ష్మీనారాయణరెడ్డి అన్నారు. గురువా రం మండల కేంద్రంతో పాటు, బండనాగారం, ఆలింపూర్, నారాయణపురం గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. వేసవిలో వ్యవసాయ బావులకు లోవోల్టేజీ సమస్య తలెత్తకుండా ఉండేందుకు హెచ్పీ పెంచిన నూతన ట్రాన్స్ఫార్మర్లను బిగించామని చెప్పారు. రైతులు స్టాటర్లకు కెపాసిటర్లను బిగించుకుంటే విద్యుత్ ఆదా అవుతుందన్నా రు. కార్యక్రమంలో ఏడీఈ వేణుగోపాల్, ఏఈ రాజ్కుమార్, లైన్మెన్లు శ్రీనివాస్రెడ్డి, మెతుకు జలేందర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. నేడు ర్యాలీ, సదస్సు జనగామ: సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో శుక్రవారం(నేడు) నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేయాలని బంజారా నాయకు డు డాక్టర్ లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో కోరారు. ఉదయం 9 గంటలకు నెహ్రూపార్కు నుంచి ఎన్ఎంఆర్ గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం సదస్సు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యఅతిథిగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, జిల్లా ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపారు. సేవాలాల్ కమిటీ తరఫున అన్నదానం ఏర్పా టు చేసినట్లు వివరించారు. -
బీసీ రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలి
స్టేషన్ఘన్పూర్: కేంద్రంలోని బీజేపీ సర్కారుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని ఎమ్మెల్యే కడి యం శ్రీహరి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, సమన్వయ కమిటీ సభ్యులతో గురువారం ఏర్పా టు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడా రు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడానికి అన్ని రాజకీ య పార్టీలు సహకరించాలని కోరారు. అలాగే ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదు.. ఇటీవల కొందరికి పార్టీలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఫ్యాషన్ అయింది.. ఇది సమంజసం కాదు.. గతంలో అవినీతి, అక్రమాలను ప్రోత్సహించి పదవులు, పథకాలను అమ్ముకున్న వారే ఇప్పుడు విమర్శలు చేస్తున్నార ని కడియం విమర్శించారు. అలాంటి దుష్ప్రచా రాలను యువజన, సోషల్ మీడియా నాయకులు తిప్పికొట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్య, రాష్ట్ర నాయకులు గంగారపు అమృతరావు, బెలిదె వెంకన్న, సీహెచ్.నరేందర్రెడ్డి, మారుడోజు రాంబా బు, జూలుకుంట్ల శిరీష్రెడ్డి, చింత ఎల్లయ్య, నీరటి ప్రభాకర్, కొలిపాక సతీష్ పాల్గొన్నారు. -
నీటి కొరత రాకుండా చూడాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా ● వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు..జనగామ రూరల్: వచ్చే నెల నిర్వహించే ఇంట ర్మీడియట్ వార్షిక పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమన్వ య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 8,945 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనుండగా, అందులో ఫస్టియర్ 4,251, సెకండియర్ 4,694 మంది విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. మొత్తం 17 సెంటర్లు కేటాయించామని, వీటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, సంబంధిత అధికారులు కేటాయించిన విధుల ను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. విద్యార్థులు సమయానుకూలంగా పరీక్ష కేంద్రాలకు చేరేలా ఆర్టీసీ బస్సులు నడపాలని, నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టాలని అన్నారు. మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ పరిధిలో తాగునీరు, శానిటేషన్, వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడంలో ఇబ్బందులుంటే టెలిమానస్లో సంప్రదించాలన్నారు. 14416 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో ఏసీపీ పండారి నితిన్చేతన్, పరీక్షల నోడల్ అధికారి పింకేష్కుమార్, ఇంటర్మీ డియట్ జిల్లా అధికారి దినేష్రెడ్డి, డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు, డీఈఓ రమేష్ పాల్గొన్నారు. జనగామ రూరల్: వేసవి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని నీటి కొరత రాకుండా చూడాల ని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. తాగునీరు, ఉపాధి హామీ పనులు, ఇందిరమ్మ ఇళ్లు, పారిశుద్ధ్య నిర్వహణ, పన్ను వసూళ్లపై గురువారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలు, ఎంఈఓలు, ఈఈలు, ఏఈలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులతో జూమ్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎల్1, ఎల్2, ఎల్3 జాబితా లో ని కుటుంబాల వివరాలను మరోసారి పరిశీలించి తుది జాబితా ఈనెల 28వ తేదీలోగా ఇవ్వాలన్నా రు. వేసవిలో సాగు, తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని, ఇందుకు గ్రామాల వారీగా కార్యాచరణను సిద్ధం చేయాలని చెప్పారు. మున్సిపల్ వార్డులు, గ్రామీణ ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పన్ను వసూళ్లు వందశాతం చేపట్టాలని, ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచడంతో పాటు వారికి వందరోజుల పని కల్పించాల ని చెప్పారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. గ్రామ నర్సరీల్లో మొక్కల పెంపకానికి విత్తనాలు వేయాలని సూచించారు. ప్రతి బుధవా రం అంగన్వాడీ కేంద్రాలను, శుక్రవారం రెసిడెన్షి యల్ పాఠశాలలు, వసతి గృహాలను సందర్శించి పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. సమీక్షలో జెడ్పీ సీఈఓ మాధురీ షా, జనగామ, ఘన్పూర్ మున్సిపల్ కమిషనర్లు వెంకటేశ్వర్లు, రవీందర్, డీపీఓ స్వరూప, ఈఈ హౌసింగ్ మాత్రునాయక్, డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, ఈఈ మిషన్ భగీరథ శ్రీకాంత్, అడిషనల్ డీఆర్డీఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు.రుణాల రికవరీ వేగవంతం చేయాలిరుణాల రికవరీ వేగవంతం చేసి లక్ష్యాలు నెరవేర్చా లి కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. జిల్లా గ్రామీణా భివృద్ధి శాఖ ఆధ్వర్యాన సీ్త్రనిధి, మహిళా శక్తి, ఇంది రమ్మ క్యాంటీన్, బ్యాంక్ లింకేజీ తదితర అంశాలపై అదనపు కలెక్టర్ పింకేష్కుమార్తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. -
సమీపిస్తున్న గడువు..
జనగామ రూరల్: గ్రామాల్లో పన్నుల వసూలు జోరుగా సాగుతోంది. గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే నిధులు ఎంత కీలకమో.. పంచాయతీల్లో వసూలయ్యే పన్నులు అంతే అవసరం. అయితే ఏడాదిగా ఎస్ఎఫ్, 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల పూర్తిగా నిలిచిపోవడంలో జీపీలు ఆర్థికంగా సతమతమవుతున్నాయి. ఇన్నాళ్లు వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు కృషి చేసిన కార్యదర్శులు ప్రస్తుతం పన్నుల వసూలుపై దృష్టి సారించారు. ఉదయం 8గంటలకే గ్రామాలకు చేరుకుని సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరుగుతూ పన్ను వసూలు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం పన్ను వసూళ్ల లక్ష్యం(బకాయిలతో) రూ.7,11,32,109. ఇందులో ఇప్పటి వరకు రూ.5,72,20,972(80 శాతం) వసూలైంది. ఇంకా 1,39,11,137 వసూలు చేయాల్సి ఉంది. గ్రామ పాలనలో పంచాయతీ కార్యదర్శులదే కీలక పాత్ర. వీరంతా మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రజాపాలన, ఇంది రమ్మ ఇళ్ల సర్వేల్లో బీజీబీజీగా గడిపారు. దీంతో పన్నుల వసూళ్లపై తీవ్ర ప్రభావం పడింది. ఆర్థిక సంవత్సరం మరో నెల తొమ్మిది రోజుల్లో ముగియనుంది. గడువులోపు నూరుశాతం లక్ష్యసాధనకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. 37 పంచాయతీల్లో వందశాతం జిల్లాలో 283 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో 37 జీపీలు ఇప్పటికే వందశాతం పన్ను వసూలు చేసి ఆదర్శంగా నిలిచాయి. వీటిలో పాలకుర్తి మండల పరిధిలో 10 జీపీలు, దేవరుప్పులలో 8, చిల్పూరు, తరిగొప్పుల పరిధిలో 4 చొప్పున, బచ్చన్నపేట, జనగామ 3 చొప్పున, జఫర్గఢ్, స్టేషన్ఘన్పూర్ 2 చొప్పున, కొడకండ్లలో ఒక గ్రామపంచాయతీ వందశాతం పూర్తి చేశాయి. పన్ను వసూళ్లలో అత్యంత వెనుకబడిన పంచాయతీలను పరిశీలిస్తే.. రఘునాథపల్లి మండలంలో జాఫర్గూడెం 24 శాతం, మల్లంపల్లి 28 శాతం, ఇబ్రహీంపూర్లో 34 శాతం, దేవరుప్పుల మండలం లకావత్తండా 32 శాతంతో వెనుకబడి ఉన్నాయి. నూరుశాతం పన్ను వసూలు లక్ష్యం ఇప్పటి వరకు 80.44 శాతం పూర్తి వందశాతం వసూలు చేసిన జీపీలు 37లక్ష్య సాధన దిశగా ముందుకు.. వివిధ సర్వేలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో భాగంగా మొన్నటి వరకు పంచాయతీ కార్యదర్శులు బీజీగా ఉండటం ద్వారా పన్నుల వసూళ్లకు అవరోధం ఏర్పడింది. ప్రస్తుతం వసూళ్లపై దృష్టి సారించారు. ప్రతీ పంచాయతీలో పన్నులు వంద శాతం వసూలు చేయాలని ఇప్పటికే ఆదేశించాం. ఆ దిశగా ముందుకు సాగుతున్నాం. – స్వరూప, డీపీఓ -
విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దు
స్టేషన్ఘన్పూర్: విద్యార్థులు పరీక్షల సమయంలో ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికావొద్దు.. ప్రణాళికతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. నియోజకవర్గ పరిధి కరుణాపురంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలు ర పాఠశాల, కళాశాలలో బుధవారం రాత్రి బస చేసిన ఆయన.. గురువారం ఉదయం పాఠశాల పరిసరాలను సందర్శించారు. వాటర్ప్లాంట్, వంట శాల, కిచెన్ గార్డెన్, మెనూ బోర్డును, విద్యార్థుల కోసం తయారు చేసిన అల్పహారాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భుజించారు. ‘ఆహారం సరిపోతున్నదా.. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా.. మాంసాహారం ఏ రోజుల్లో పెడుతున్నారు’ అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని, ఉపాధ్యాయుల సూచనల మేరకు చదువుతూ మంచి ఫలితాలు సాధించాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సి పాల్ రవికుమార్, ఏటీపీ ఆర్.శ్రీనివాస్, డీడబ్ల్యూ జవహర్లాల్, ఫ్యాకల్టీ స్లీవరాజు పాల్గొన్నారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
నర్సిరెడ్డి గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి
జనగామ రూరల్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి కోరా రు. గురువారం టీఎస్ యూటీఎఫ్, టీపీటీఎఫ్ ఆధ్వర్యాన పట్టణంలోని ఉమాపతి భవన్లో యూ నియన్ జిల్లా అధ్యక్షుడు రాజు ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నర్సిరెడ్డి గెలిస్తే ఓటరు గెలిచినట్లే.. మరెవరు గెలిచినా వెంట నే అధికార పార్టీలో చేరిపోయే అవకాశవాదులే అన్నారు. నర్సిరెడ్డి నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేశారని గుర్తు చేశారు. నాయకులు డి.శ్రీనివాస్, రంజిత్కుమార్ చంద్రశేఖర్రావు, వెంకటేష్, అంకుషావళి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
అగ్గి రాజుకుంటే అంతా బుగ్గే..
భవనాల్లో సెల్లార్ల నిర్మాణం.. వాటి వినియోగంలో యజమానులు నిబంధనల ను తుంగలో తొక్కుతున్నారు. పురపాలిక అధికారుల నిర్లక్ష్యం.. అగ్నిమాపక శాఖ అలసత్వం రెండూ కలిసి అమాయక ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. జిల్లా కేంద్రంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా.. ఆ క్షణం ఆగమాగం చేయడం.. తర్వాత గాలికి వదిలేస్తున్నారు. అనుమతి లేకుండా సెల్లార్లు అడ్డగోలుగా నిర్మించడంతో పాటు వాటిలో వ్యాపారాలు సాగిస్తున్నారు. వినయకృష్ణారెడ్డి కలెక్టర్ గా ఉన్న సమయంలో పలు సెల్లార్లను మూసివేయించగా.. ఆ తర్వాత వచ్చిన వారు పట్టించుకునన్న దాఖలాలు లేవు.. - జనగామజనగామ పట్టణంలోని నెహ్రూపార్కు, బస్టాండ్ చిన్నగేటు, స్వర్ణకళామందిర్, హైదరాబాద్రోడ్డు, పెట్రోల్పంపు గల్లీ తదితర ప్రాంతాల్లో సెల్లార్లను వ్యాపార, వాణిజ్య సంస్థలకు అద్దెకు ఇచ్చారు. మొదట కొన్ని రోజుల పాటు పార్కింగ్ కోసం వదిలేసి.. ఆ తర్వాత రెంటుకు ఇచ్చేస్తున్నా రు. గత ఏడాది విజయ, శ్రీలక్ష్మి షాపింగ్ మాల్స్, ఇటీవల జై భవానీ ఎలక్ట్రిక్ హార్డ్ వేర్లో ప్రమాదవ శాత్తు మంటలు అంటుకుని రూ.కోట్లలో నష్టం వాటిల్లింది. ఈ రెండు సంఘటనలు తెల్లవారుజాము, రాత్రి జరగడంతో కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగింది. ఓపెన్గా ఉన్న దుకాణాల్లో మంటలు చెలరేగితేనే అదుపులోకి తీసుకు వచ్చేందుకు గంటల సమయం పట్టింది. ఒక వేళ సెల్లార్లలో మంటలు చెలరేగితే పరిస్థితి ఏమిటనే ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది. ఒక్క జిల్లా కేంద్రంలోనే 20 నుంచి 50 వరకు సెల్లార్లు ఉండగా, అన్నింట్లో వ్యాపారాలు నడుస్తున్నాయి. సెల్లార్లలో కస్టమర్లు ఉన్న సమయంలో ప్రమాదం జరిగితే వారిని తప్పించేందుకు ఎమ్జెన్సీ ఎగ్జిట్ సైతం ఉండదు. స్వర్ణ కళామందిర్ రూట్లో ఫైర్ ఇంజన్ వెళ్లే పరిస్థితి లేదు. అంతటి ఇరుకైన స్థలంలో సెల్లార్ల వ్యాపారం ఎంతటి డేంజరో అర్థం చేసుకోవచ్చు.ఫైర్ సేఫ్టీపై కొత్త జీఓగతంలో 15 ఫీట్ల ఎత్తులో ఉన్న భవనాలకు మాత్రమే ఫైర్ సేఫ్టీ ఉండాలనే నిబంధన ఉండగా.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 డిసెంబర్ 17వ తేదీన కొత్త జీఓ తీసుకు వచ్చింది. వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు ప్రతీ షాపింగ్ మాల్కు ఫైర్ సేఫ్టీ తప్పనిసరి ఉండాలని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు అగ్నిమాపక శాఖ ఫాం 9 నోటీసుతో ఆయా వ్యాపార సంస్థలను తనిఖీ చేసి, నిబంధనల మేరకు ఫైర్ సేఫ్టీ లేని వారికి ఫాం 12 నోటీసు జారీ చేశారు. కాటన్, రైస్ మిల్లులతో పాటు వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులు, అసోసియేషన్ల ప్రతినిధులకు నోటీసులు ఇచ్చారు. నెల రోజుల సమయం ఇచ్చి.. అప్పటికీ స్పందించకుంటే ఫాం 14 ద్వారా డీజీకి అటాచ్ చేస్తారు. అక్కడి నుంచి కోర్టు ద్వారా సదరు వ్యాపార సంస్థలకు జరిమానా లేదా తదుపరి చర్యలు తీసుకుంటారు. అయితే పట్టణంలో మాత్రం ఇప్పటి వరకు జరిమానా, చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని తెలుస్తున్నది. ఇదిలా ఉండగా అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సెల్లార్లపై ఎవరూ నోరు మెదపడం లేదు.ప్రమాదానికి హేతువు..హైదరాబాద్రోడ్డు పెట్రోల్పంపు గల్లీలోని సెల్లార్లలో ఇళ్లకు వేసే రంగులు, పీఓపీ, ఫోమ్, ఫైబర్, వైరింగ్ మెటీరియల్, స్వర్ణకళామందిర్ రోడ్డులో గిఫ్ట్ ఆర్టికల్స్, చైనా మాల్, ప్లాస్టిక్ గూడ్స్ విక్రయాలు జరుగుతాయి. ఇవి అత్యంత ప్రమాదరకమైనవి. అంటుకుంటే ఆర్పడం కష్టమే.అధికారులకే తెలియదట..నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ల నిర్మాణం జరుగుతున్నా పురపాలిక అధికారులు చోద్యం చూస్తున్నారు. అనుమతులు లేకుండా సెల్లార్లలో వ్యాపారం చేస్తున్నా.. కనీసం నోటీసులు సైతం ఇవ్వడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై పర్యవేక్షించాల్సిన ఓ ఉన్నతాధికారిని అడిగితే పట్టణంలో సెల్లార్లు ఉన్నాయా.. ఉంటే అందులో వ్యాపారాలు కూడా చేస్తున్నారా అంటూ రివర్స్ ప్రశ్నించారు. -
రోడ్లపై పార్కింగ్, ఫుట్పాత్ వ్యాపారం ఉండకూడదు
జనగామ పట్టణాన్ని ప్రమాద రహితంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నం. రోడ్లపై ఫుట్పాత్ వ్యాపారంతో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూం వద్ద జరిగిన ఘటనే ఇందుకు సాక్ష్యం. ఫుట్పాత్ వ్యాపారం చేసేవారితో పాటు, కస్టమర్లు సగం రోడ్డుపైనే ఉండాల్సి వస్తోంది. దీంతో అదుపు తప్పి వచ్చే వాహనాలతో ఇబ్బంది కరంగా మారుతోంది. అడ్డగోలు పార్కింగ్, ఫుట్పాత్ వ్యాపారాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నాం. – దామోదర్రెడ్డి, సీఐ, జనగామ● -
వైద్యులు అందుబాటులో ఉండాలి
● జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్రావు బచ్చన్నపేట : ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి కె.మల్లికార్జున్రావు అన్నారు. బుధవారం స్థానిక ఆస్పత్రిని సందర్శించి రోగుల గదులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందడానికి ప్రజలు ఎక్కువగా వస్తున్నారని, వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని చెప్పారు. వేసవి సమీపిస్తున్నందున ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడంతోపాటు ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు గ్రామాల్లో ప్రజలకు, ఈజీఎస్ పనుల వద్ద కూలీలకు అందజేయాలని తెలిపారు. ఎండలో బయటకు వెళ్లకూడదని, తప్పనిసరి అయి తే తలకు పాగా, టోపీ ధరించాలని సూచించారు. నీటిని ఎక్కువగా తీసుకోవాలన్నారు. ఆరోగ్య పరమైన ఇబ్బందులు తలెత్తితే అందుబాటులోని ఆస్రత్రిలో చూపించుకోవాలని సూచించారు. మండల వైద్యాధికారి సృజన, డాక్టర్లు శ్రీనివాస్, అరుణ, దీప్తి, పీహెచ్ఎన్ అన్నాంబిక, సీహెచ్ఓ జంగమ్మ, హెడ్ నర్సు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
మహనీయుడు సేవాలాల్
స్టేషన్ఘన్పూర్: అందరి జీవితాలను, భవిష్యత్ను తీర్చిదిద్దిన మహనీయుడు సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శివునిపల్లిలోని ఓ ఫంక్షన్హాల్లో బుధవారం నిర్వహించిన సేవాలాల్ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఉత్సవ సమితి బాధ్యుడు బానోతు రాజేష్నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీహరి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే సేవాలాల్ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని, నియోజకవర్గ కేంద్రంలో రూ.2కోట్లతో బంజారా భవన్ నిర్మిస్తున్న ట్లు పేర్కొన్నారు. ఎంపీ కావ్య మాట్లాడుతూ.. ప్రజ లకు ఏ సమస్య వచ్చినా కడియం కుటుంబం అండగా ఉంటుందని అన్నారు. సంత్సేవాలాల్ చూపిన మార్గంలో నడుస్తూ గిరిజనులు అభివృద్ధి చెందాల ని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గోర్ బంజారా గురువు మహేష్మహరాజ్, వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ లావణ్యశిరీష్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుడోజు రాంబాబు, బూర్ల శంకర్, గిరిజన నాయకులు భూక్య స్వామినాయక్, రమేష్ నాయక్, లకావత్ చిరంజీవినాయక్, కొర్ర వెంకటేష్ నాయక్, దశరథ్నాయక్, హుస్సేన్నాయక్, భిక్షపతి నాయక్, లక్ష్మణ్, లచ్చిరాం పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
ఆర్థిక ఒడిదుడుకులు
జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి జిల్లా వెనకబాటుసాక్షి ప్రతినిధి, వరంగల్: జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వెనకబాటు కనిపిస్తోంది. జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల అభివృద్ధి రేటు రాష్ట్రంలోనే వెనకబడి ఉంది. వరంగల్ అర్బన్ (హనుమకొండ) 14వ స్థానంలో ఉండగా.. వరంగల్ రూరల్ 22, (వరంగ ల్), మహబూబాబాద్ 23వ స్థానంలో నిలిచాయి. 2021–22 సంవత్సరానికి ప్రస్తుత ధరల్లో జీడీడీపీ విలువ పెరుగుదల కనిపించినప్పటీకి రాష్ట్రస్థాయిలో మిగతా జిల్లాలతో పోలిస్తే ఆశించిన స్థాయిలో వృద్ధి సాధించలేదు. తలసరి ఆదాయం విషయానికి వస్తే జయశంకర్ భూపాలపల్లి 15వ స్థానంలో నిలిచింది. జాతీయ ధరల సూచీ ప్రకారం దీనిని గణిస్తారు. ఇదే సమయంలో మిగతా ఐదు జిల్లాలు తలసరి ఆదాయంలో తెలంగాణలోని మిగతా జిల్లాలతో వెనకబడి ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక, గణాంకశాఖ ఇటీవల విడుదల చేసిన ’తెలంగాణ రాష్ట్ర గణాంకా ల నివేదిక– అట్లాస్–2024’లో ఈ వివరాలు వెల్లడించారు. పడుతూ.. లేస్తూ 14, 15 స్థానాల్లోనే.. ఉమ్మడి వరంగల్లో ఆరు జిల్లాలు ఉండగా.. 2022–23 సంవత్సరానికిగాను ఆర్థిక వృద్ధిలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పోటీ పడలేకపోయాయి. జిల్లా స్థూల దేశీయోత్పత్తిలో 14వ స్థానంలో హనుమకొండ, తలసరి ఆదాయంలో 15వ స్థానంలో జేఎస్ భూపాలపల్లి జిల్లాలు నిలిచాయి. మిగతా నాలుగు జిల్లాలు ఆ తరువాతి స్థానాలకే పరిమితమయ్యాయి. జీడీడీపీలో వరంగల్ 22, మహబూబా బాద్ 23, జనగామ 29, జేఎస్ భూపాలపల్లి 31 స్థానాల్లో నిలవగా.. రూ.7.583 కోట్లతో ములుగు జిల్లా అన్నింటికన్న చివరన నిలిచింది. జిల్లాల ఆర్థికాభివృద్ధికి సూచికగా జీడీడీపీని పరిగణించగా, అభివృద్ధి అంతా రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కేంద్రీకృతమైంది. కాగా, నగరాలు, పట్టణ ప్రాంతాల్లో కొంత మెరుగ్గా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. గ్రేటర్ వరంగల్ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి కారణంగా ఆరిక వృద్ధిలో టాప్–2లో నిలిచినట్లు చెబుతున్నారు. తలసరి ఆదాయంలో భూపాలపల్లి బెటర్.. 2022–23లో రంగారెడ్డి జిల్లా రూ.9,54,949 తలసరి ఆదాయంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవగా.. రూ.2,28,655లతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా 15వ స్థానంలో నిలిచింది. అయితే 2021–22 సంవత్సరం ఇది రూ.2,34,132లు కాగా ఈసారి రూ.5,477లు తగ్గినా.. మిగతా జిల్లాలతో పోలిస్తే ఎక్కువై 15వ స్థానంలో ఉంది. వరంగల్ రూరల్ (వరంగల్) గతంలో రూ.1,94,317లతో 16వ స్థానంలో ఉండగా.. ఈసారి రూ.2,20,174లకు పెరిగినా 18వ స్థానంలో నిలిచింది. అలాగే రూ.1,86,278 ఉన్న జనగామ ఈసారి రూ.2,21,424లతో 16, రూ.1,79,222లతో 20వ స్థానంలో ఉన్న మహబూబాబాద్ రూ.2,00,309లతో 25, రూ.1,77,316లతో 21లో ఉన్న ములుగు రూ.2,15,772లతో 19 స్థానాల్లో నిలవగా, రూ.1,56,086 లతో చివరి స్థానంలో నిలిచిన వరంగల్ అర్భన్ (హనుమకొండ) ఈసారి రూ.1,86,618లతో 31వ స్థానంలో ఉంది. పట్నవాసం వద్దు, పల్లె నివాసమే బెస్ట్.. ఉమ్మడి వరంగల్లో 38,20,369 మంది జనాభా ఉంది. ఇందులో 28,28,036 మంది పల్లెల్లో, 9,92,333 మంది పట్టణాల్లో జీవనం గడుపుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ప్రజలు నివాసం పట్టణం/నగరాలైన హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డిల తర్వాత స్థానంలో హనుమమకొండ నిలిచింది. ఉమ్మడి వరంగల్లో హనుమకొండ మినహా ఐదు జిల్లాల్లో జనం ఊళ్లల్లోనే ఉంటున్నారు. హనుమకొండ జిల్లాలో ఉన్న 10,62,247 మంది జనాభాలో 5,63,629 (53.1 శాతం) మంది పట్నంలో ఉంటుండగా, 4,98,618 (46.9 శాతం) మంది గ్రామాల్లో ఉంటున్నారు. వరంగల్ జిల్లాలో 7,37,148లకు 69.2 శాతం మంది పల్లెటూళ్లలో, 30.8 శాతం మంది పట్టణవాసం చేస్తున్నారు. జనగామలో 5,34,991 జనాభాకు 4,63,634 (86.7 శాతం) మంది గ్రామాల్లో, 71,357 (13.3శాతం) పట్టణాల్లో, జేఎస్ భూపాలపల్లిలో 4,16,763లకు 3,74,376 (89.8 శాతం) గ్రామాల్లో, 42,387 (10.2 శాతం) పట్టణాల్లో ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అదే విధంగా మహబూబాబాద్ జిల్లాలో 7.74.549 మందికి 6,98,173 (90.1 శాతం), పల్లెలు, తండాల్లో, 76,376 (9.9 శాతం) మందే పట్టణాల్లో ఉంటుండగా.. ములుగు జిల్లాలో 2,94,671లకు 96.1 శాతం మంది పల్లెటూళ్లలో ఉంటుండగా.. కేవలం 11,493 (3.9 శాతం) మంది పట్నవాసం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా మొత్తం జనాభా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇలా..9,92,33338,20,36928,28,036గ్రామీణ జనాభాపట్టణ/నగరజనాభామొత్తం జనాభాజిల్లా మొత్తం గ్రామీణ పట్టణ/నగరం జనాభా జనాభా జనాభా హనుమకొండ 10,62,247 4,98,618 5,63,629 వరంగల్ 7,37,148 5,10,057 2,27,091 జనగామ 5,34,991 4,63,634 71,357 జేఎస్.భూపాలపల్లి 4,16,763 3,74,376 42,387 మహబూబాబాద్ 7,74,549 6,98,173 76,376 ములుగు 2,94,671 2,83,178 11,493 రూ.7,583 కోట్లతో ఆఖరున ములుగు జేఎస్ భూపాలపల్లిలో తగ్గి... ఐదు జిల్లాల్లో పెరిగిన ‘తలసరి’ తలసరి ఆదాయంలో 15వ స్థానంలో జేఎస్ భూపాలపల్లి హనుమకొండ జిల్లాలో అర్బన్ జనాభా.. మిగతా ఐదు జిల్లాల్లో పల్లెవాసమే.. ‘రాష్ట్ర గణాంకాల నివేదిక అట్లాస్–2024’లో వెల్లడి -
మహనీయుడు సేవాలాల్
స్టేషన్ఘన్పూర్: అందరి జీవితాలను, భవిష్యత్ను తీర్చిదిద్దిన మహనీయుడు సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శివునిపల్లిలోని ఓ ఫంక్షన్హాల్లో బుధవారం నిర్వహించిన సేవాలాల్ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఉత్సవ సమితి బాధ్యుడు బానోతు రాజేష్నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీహరి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే సేవాలాల్ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని, నియోజకవర్గ కేంద్రంలో రూ.2కోట్లతో బంజారా భవన్ నిర్మిస్తున్న ట్లు పేర్కొన్నారు. ఎంపీ కావ్య మాట్లాడుతూ.. ప్రజ లకు ఏ సమస్య వచ్చినా కడియం కుటుంబం అండగా ఉంటుందని అన్నారు. సంత్సేవాలాల్ చూపిన మార్గంలో నడుస్తూ గిరిజనులు అభివృద్ధి చెందాల ని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గోర్ బంజారా గురువు మహేష్మహరాజ్, వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ లావణ్యశిరీష్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుడోజు రాంబాబు, బూర్ల శంకర్, గిరిజన నాయకులు భూక్య స్వామినాయక్, రమేష్ నాయక్, లకావత్ చిరంజీవినాయక్, కొర్ర వెంకటేష్ నాయక్, దశరథ్నాయక్, హుస్సేన్నాయక్, భిక్షపతి నాయక్, లక్ష్మణ్, లచ్చిరాం పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
వైద్యులు అందుబాటులో ఉండాలి
● జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్రావు బచ్చన్నపేట : ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి కె.మల్లికార్జున్రావు అన్నారు. బుధవారం స్థానిక ఆస్పత్రిని సందర్శించి రోగుల గదులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందడానికి ప్రజలు ఎక్కువగా వస్తున్నారని, వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని చెప్పారు. వేసవి సమీపిస్తున్నందున ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడంతోపాటు ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు గ్రామాల్లో ప్రజలకు, ఈజీఎస్ పనుల వద్ద కూలీలకు అందజేయాలని తెలిపారు. ఎండలో బయటకు వెళ్లకూడదని, తప్పనిసరి అయి తే తలకు పాగా, టోపీ ధరించాలని సూచించారు. నీటిని ఎక్కువగా తీసుకోవాలన్నారు. ఆరోగ్య పరమైన ఇబ్బందులు తలెత్తితే అందుబాటులోని ఆస్రత్రిలో చూపించుకోవాలని సూచించారు. మండల వైద్యాధికారి సృజన, డాక్టర్లు శ్రీనివాస్, అరుణ, దీప్తి, పీహెచ్ఎన్ అన్నాంబిక, సీహెచ్ఓ జంగమ్మ, హెడ్ నర్సు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్నల్ మార్కుల వెరిఫికేషన్
జనగామ: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులకు సంబంధించి వెరిఫికేషన్ చేసేందుకు నాలుగు రోజులుగా విద్యాశాఖ క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ నెల 17న ప్రారంభమైన వెరిఫికేషన్ 20వ తేదీతో ముగియనుంది. జిల్లాలో ప్రభు త్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలలు 183 ఉండగా, 6,234 మంది పదో తరుగతి విద్యార్థులు ఉన్నారు. వార్షిక పరీక్షల్లో 80 మార్కుల ఆప్షన్ ఉండగా.. స్కూల్ పరిధిలో ఇంటర్నల్గా 20 మార్కులు వేస్తా రు. ఇందులో పుస్తక సమీక్ష–5, రాత అంశాలు(నోట్స్)–5, ప్రాజెక్టు వర్కు–5, స్లిప్ టెస్ట్కు 5 మార్కులు ఉంటాయి. ఈ మార్కులు కరెక్టేనా.. లేదా అనే విషయాన్ని పరిశీలించేందుకు ఒక హెచ్ఎం, ఇద్దరు సబ్జెక్టు టీచర్లతో 21 టీంలను ఏర్పాటు చేశారు. ఈ బృందం సభ్యులు ఇంటర్నల్ మార్కుల కు సంబంధించి ఆన్సర్ షీట్లు, ప్రాజెక్టు రిపోర్టులను పరిశీలించాకే ఓకే చెబుతారు. 22 నుంచి ఆన్లైన్ పదో తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరుగుతాయి. ఇందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేయగా, 20 ఇంటర్నల్ మార్కుల ను పాఠశాలలు, విద్యార్థుల వారీగా ఈనెల 22 నుంచి ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. వార్షిక పరీక్షలు ముగిసి ఫలితాల సమయంలో వీటిని అనుసంధానం చేసి తుది మార్కులు విడుదల చేస్తారు. నేటితో ముగియనున్న ప్రత్యేక టీంల తనిఖీలు 22వ తేదీ నుంచి ఆన్లైన్ ప్రక్రియ -
అధికారుల హాస్టల్ నిద్ర
కరుణాపురం ఎంజేపీలో విద్యార్థులతో కలిసి నిద్రిస్తున్న కలెక్టర్ రిజ్వాన్ బాషాఎంజేపీలో రాత్రి బస చేసిన కలెక్టర్ రిజ్వాన్ బాషా జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల వసతి గృహాల్లో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు పింకేష్కుమార్, రోహిత్సింగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, మండల ప్రత్యేక అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అలాగే రాత్రి అక్కడే బస చేశారు. వసతులను పరిశీలించడంతో పాటు విద్యార్థుల ప్రతిభాపాటవాలను పరీక్షించారు. కరుణాపురంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర పాఠశాల, కళాశాలలో రాత్రి బస చేసిన కలెక్టర్.. అంతకు ముందు విద్యార్థులకు పాఠాలు బోధించారు. అలాగే వారితో కలిసి భోజనం చేసి సదుపాయాల గురించి తెలుసుకున్నారు. విద్యార్థి దశలోనే భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి.. పదవ తరగతి ఫలితాలు దిక్సూచి అని పేర్కొన్నారు. – జనగామ – వివరాలు 9లోu -
రోడ్డుపైనే పార్కింగ్..
వ్యాపార, వాణిజ్య సంస్థలకు అడ్డగోలు అనుమతులు● రహదారిపైనే వ్యాపారాలు ● అస్తవ్యస్తంగా వాహనాల పార్కింగ్ ● తరుచూ చోటుచేసుకుంటున్న ప్రమాదాలు..జిల్లా కేంద్రానికి కనెక్టివిటీగా సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, హనుమకొండ, నల్లగొండ, సిద్ధిపేట జిల్లా సరిహద్దులు ఉంటా యి. వాణిజ్యం, వ్యాపార పరంగా ఆరు జిల్లాల నుంచి వ్యాపారులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఇక్కడికి నిత్యం వస్తుంటారు. అలాగే కలెక్టరేట్, జిల్లా పరిషత్, ఎల్ఐసీ, వ్యవసాయ మార్కెట్, ఉన్నత చదువుల కోసం వందలాది మంది విద్యార్థులు ఆర్టీసీ బస్సులు, సొంత వాహనాల్లో రాకపోకలు సాగిస్తారు. దీంతో ట్రాఫిక్ గతం కంటే ఐదు రెట్లు పెరిగిందని చెప్పవచ్చు. హైదరాబాద్రోడ్డు, సిద్ధిపేటరోడ్డు, రైల్వేస్టేషన్, నెహ్రూపార్కు, స్వర్ణకళామందిర్ రోడ్లు ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు రద్దీగా ఉంటా యి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే రెండు నుంచి మూడు సార్లు రోడ్ల విస్తరణ చేపట్టగా.. చాలా మంది యజమానులు కోట్లాది రూపాయల విలువైన స్థలాలను కోల్పోయారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండడానికి రోడ్లను వెడల్పు చేస్తే.. ఆ ప్రదేశాన్ని ఫుట్పాత్ వ్యాపారాలు, పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారు. బార్లు, వైన్స్, సూపర్ మార్కెట్లు, బ్యాంకులు, షాపింగ్ మాల్స్ ఎదుట పార్కింగ్కు స్థలం లేక వచ్చే కస్టమర్లు కార్లు, బైక్లను రోడ్డుపైనే నిలపాల్సి వస్తున్నది. కొన్ని వాణిజ్య సంస్థలకు సెల్లార్లు ఉన్నా పార్కింగ్కు ఉపయోగించకుండా, వ్యాపారాల నిర్వహణకు అద్దెకు ఇస్తున్నారు. జనగామ: జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. షాపింగ్ మాల్స్, మార్డులు, వాణిజ్య సంస్థలకు పార్కింగ్ స్థలం లేకుండానే మున్సిపల్ నుంచి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారు. భవనాల నిర్మాణ సమయంలో సెల్లార్లు ఏర్పాటు చేసినప్పటికీ.. వాటిని గోదాంలకు ఉపయోగించడం లేదా అద్దెకు ఇస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. జనగామ జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత వ్యాపార, వాణిజ్య పరంగా దినదినాభివృద్ధి చెందుతూ రవాణా, ప్రజల రాకపోకలతో ఎప్పడూ రద్దీగా ఉంటోంది. ఈ క్రమంలో ఫుట్పాత్ వ్యాపారాలు పెరిగాయి. వాహనాల పార్కింగ్ కోసం రోడ్లను ఆక్రమిస్తుండడంతో ప్రమాదాలకు కారణమవుతోంది. సెల్లార్లు అద్దెకు.. రోడ్డుపైనే వాహనాలు -
ఇసుక అక్రమ రవాణా చేయొద్దు
కలెక్టర్ రిజ్వాన్ బాషా జనగామ రూరల్/రఘునాథపల్లి: ఇసుకను అక్రమంగా రవాణా చేయొద్దు.. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు. బుధవా రం జనగామ మండల పరిధి యశ్వంతాపూర్ వాగును డీసీపీ రాజమహేంద్రనాయక్తో కలిసి సందర్శించారు. ఇసుక, వాగుల్లోని ఒండ్రుమట్టి తరలింపును అరికట్టేందుకు దారుల్లో ట్రెంచ్లు తవ్వి ట్రాక్టర్లు వెళ్లకుండా కట్టడి చేయాలన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేయాలని చెప్పారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్ హుస్సెన్, డీటీ జగన్ తదితరులు పాల్గొన్నారు. పకడ్బందీ చర్యలు తీసుకోవాలి రఘునాథపల్లి మండలం కోమల్ల టోల్ ప్లాజా వద్ద చెక్ పోస్టును డీసీపీ రాజమహేంద్రనాయక్తో కలిసి కలెక్టర్ రిజ్వాన్బాషా తనిఖీ చేశా రు. చెక్పోస్టు వద్ద అనుచరిస్తున్న విదానాలను ఎస్సై నరేష్ను అడిగి తెలుసుకున్నారు. ఇసుక అక్రమ రవాణా చేయకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఎర్త్ కుండీల్లో నీరు నింపాలిచిల్పూరు: వేసవి సమీపిస్తున్నందున ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ కుండీల్లో నీరు నింపాలి.. అలా చేస్తే లోవోల్టేజీని తట్టుకుంటుందని విద్యుత్ డీఈ రాంబాబు అన్నారు. కొండాపూర్ డిస్ట్రిబ్యూషన్లోని మట్టి గుంతల్లో సిబ్బంది నీరు నింపడాన్ని బుధవారం రాజవరం ట్రాన్స్కో ఏఈ లక్ష్మీనారాయణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి తీవ్రత పెరుగుతున్నందున విద్యుత్ ఉప కేంద్రాల్లో సరఫరా, వినియోగం పెరిగి పవర్ ట్రాన్స్ ఫార్మర్లకు(పీటీఆర్) సాంకేతిక సమస్య రాకుండా ఉండేందుకు ఎర్త్ కుండీల్లో రోజూ నీరు నింపాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎల్ఎం కృష్ణంరాజు, జీపీ సిబ్బంది ఉన్నారు. ‘ఏబీవీ’ కళాశాలలో నూతన డిగ్రీ కోర్సులుజనగామ రూరల్: పట్టణంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ సాధించింది. దీంతో బీఏ, బీకాం, బీఎస్సీ(లైఫ్ సైన్స్, బీఎస్సీ(ఫిసికల్ సైన్స్)తో పాటు 2025–26 విద్యాసంవత్సరం నుంచి బీబీఏ(జనరల్) బీకాం(ఈ కామర్స్) బీఎస్సీ(ఫార్మసీ), కంప్యూటర్ సైన్స్ కొత్త కోర్సులు(డేటా సైన్స్, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్) ప్రారంభమవుతాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.నర్సయ్య అన్నారు. బుధవారం కోర్సుల వివరాలు తెలియజేశారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకొని నచ్చిన కోర్సుల్లో దోస్త్ ద్వారా ప్రవేశం పొందవచ్చని సూచించారు. తెలుగు విశ్వవిద్యాలయానికిసోమనాథుడి పేరు పెట్టాలిపాలకుర్తి టౌన్: స్వయంభూ సోమేశ్వర స్వామి నిలయం, మహాకవి పాల్కురికి సోమనాథుడి జన్మస్థలం అయని పాలకుర్తి క్షేత్రాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయాలని సాయితీ వేత్త, ఎంప్లాయీస్ వాయిస్ సంపాదకులు క్యామ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం ఆయన కుటుంబ సభ్యులతో సోమేశ్వర స్వామిని దర్శించుకు న్న అనంతరం పాల్కురికి సోమనాథుడి విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమనాథుడి పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయన వెంట ప్రఖ్యాత నర్తకి అడుసుమల్లి సుజాత, సోమనాథ కళాపీఠం అధ్యక్షుడు డాక్టర్ రాపోలు సత్యనారాయణ, పాలకుర్తి సీఐ గట్ల మహేందర్రెడ్డి ఉన్నారు. పోలింగ్ స్టేషన్ను సందర్శించిన డీసీపీజనగామ రూరల్: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టణ పరిధి గిర్నిగడ్డ పాఠశాలలోని పోలింగ్ సెంటర్ను బుధవా రం డీపీసీ రాజమహేంద్రనాయక్ సందర్శించా రు. ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూ చించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి న వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట సీఐ దామోదర్రెడ్డి ఉన్నారు. -
నేడు తిరుగువారం పండుగ
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో సమ్మక్క–సారలమ్మ పూజారులు నేడు (బుధవారం) తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. అమ్మవార్ల ఆలయాలను శుద్ధి చేసి పసుపు, కుంకుమలతో అలంకరించి తిరుగువారం పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం అమ్మవార్ల వస్త్రాలు, పూజా సామగ్రిని భద్రపరుస్తారు. అమ్మవార్లకు యాట నైవేద్యంగా సమర్పించనున్నారు. తిరుగువారం పండుగ రోజు పూజారుల కుటుంబీకులు, స్థానిక గ్రామస్థులు ఇళ్లను శుద్ధి చేసుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు. తిరుగువారం పండుగతో మినీజాతర (మండమెలిగె) పండుగ పూజా కార్యక్రమాల ముగియనున్నాయి. -
టీచర్ల, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి
కేయూ క్యాంపస్: వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బరిలో నిలిచిన తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్రెడ్డి అభ్యర్ధించారు. మంగళవారం హనుమకొండలోని ఆర్ట్స్అండ్ సైన్స్ కాలేజీలో తొలుత ప్రిన్సిపాల్ జ్యోతిని కలిశారు. అనంతరం పలువురు అధ్యాపకులతో మాట్లాడారు. తనను టీచర్ ఎమ్మెల్సీగా గెలిపిస్తే మండలిలో గళమెత్తుతానని, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయన వెంట యూనియన్ బాధ్యులు డాక్టర్ కుందూరు సుధాకర్, ఎస్కె మీరుద్దీన్ ఉన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీపాల్రెడ్డి -
సిద్ధులగుట్టలో చారిత్రక ఆనవాళ్లు
బచ్చన్నపేట: ఆలయాల చరిత్రను కాపాడి భవిష్యత్ తరాలకు అందించాలని, అప్పుడే వాటి వైభవాలను తెలియజేసిన వారిమవుతామని సామాజిక కవి, రచయిత, ఆధ్యాత్మిక వేత్త డాక్టర్ ఎక్కలదేవి మోహన కృష్ణ భార్గవ అన్నారు. మంగళవారం మండలంలోని కొడవటూర్ గ్రామంలోని స్వయంభూ సిద్ధేశ్వరాలయ క్షేత్ర చరిత్రపై పరిశోధనాత్మక వ్యాస సంకలన కరపత్రాన్ని ఆలయ ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధుల గుట్టలో అనేక చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దాశ్రమం సుదానంద స్వామి, ఆలయ అర్చకులు ఓం నమఃశివాయ, తహసీల్దార్ ప్రకాష్రావు, సీఐ అబ్బయ్య, ఎంపీడీఓ మల్లికార్జున్, ఈఓ చిందం వంశీ, ఆలయ చైర్మన్ మల్లారెడ్డి, విశ్వహిందూ పరిషత్ మండల ప్రముఖ్ కొత్తపల్లి రాజయ్య, జనగామ నగర ప్రముఖ్ అంబటి బాలరాజు, సహాయ కార్యదర్శి చిలువేరు హర్షవర్ధన్, రాజేశ్వర్ బార్గవ, చక్రాల పోచన్న, నక్క సురేష్ తదితరులు పాల్గొన్నారు. కవి, రచయిత, ఆధ్యాత్మిక వేత్త మోహన కృష్ణ భార్గవ -
నాణ్యమైన భోజనం అందించాలి
స్టేషన్ఘన్పూర్: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ అన్నారు. స్టేషన్ఘన్పూర్ శివారులో పల్లగుట్ట క్రాస్రోడ్డు సమీపంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను అదనపు కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, నాణ్యతను పాటిస్తున్నారా తదితర వివరాలను ప్రిన్సిపాల్ను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంఆర్ఐ శ్రీకాంత్, ప్రిన్సిపాల్ కృతమూర్తి, పీడీ కిషన్ తదితరులున్నారు. జఫర్గఢ్ గురుకుల పాఠశాలలో.. జఫర్గఢ్: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పని తీరు, భోజనశాలలో వంటకాలు, కూరగాయలు ఇతర నిత్యావసర సరుకులు, పాఠశాల పరిసరాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎంఎస్హెచ్ఆర్ఐ నిధులను పాఠశాల అభివృద్ధి, విహారయాత్రకు వినియోగించుకోవాలన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. మెను విషయంలో నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్, తహసీల్దార్ శంకరయ్య, ఎంపీడీఓ సుమన్, ప్రిన్సిపాల్ వరలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ -
పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి
జనగామ రూరల్: ప్రభుత్వ లక్ష్యాలను అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని సీఎస్ శాంతికుమారి అన్నారు. మంగళవారం హైదారాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్లతో కలిసి వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, రైతు భరోసాపై ఫిర్యాదులను పరిష్కరించేందుకు మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారి పరిధిలో గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదును పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. యాసంగి సాగు నీటి సరఫరా గురించి ఆన్, ఆఫ్ విధానంలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసిన వెంటనే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో డీఏఓ రామారావు నాయక్, డీఎం సీఎస్ హతిరాం, మిషన్ భగీరథ ఈఈ శ్రీకాంత్, విద్యుత్ ఎస్ఈ వేణుమాధవ్, అధికారులు పాల్గొన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట వ్యతిరేకం లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట వ్యతిరేకమని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో, బేటీ పడావో పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డీసీపీ రాజమహేంద్రనాయక్తో కలిసి పీసీ అండ్ పీఎన్డీటీ యాక్ట్ – 1994పై ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారికి 3 సంవత్సరాల జైలు, రూ. 10,000 జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ప్రతీ ఆస్పత్రిలో, స్కానింగ్ సెంటర్లలో ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ ఫ్లోరె న్స్, డీఎంహెచ్ఓ మల్లికార్జున్ రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రీదేవి, మహిళా సాధికారత కేంద్రం జిల్లా కో–ఆర్డినేటర్ హెచ్. శారద, ప్రోగ్రామింగ్ అధికారి రవీందర్, తదితరులు పాల్గొన్నారు. ‘రైతు భరోసా’కు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలి వీసీలో సీఎస్ శాంతికుమారి -
బుధవారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
– 8లోuవేసవి సమీపించడంతో తాగునీటి సరఫరాపై ఫోకస్ సారించాల్సిన అవసరం ఉంది. జీపీలకు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం, పన్నులకు సంబంధించి ట్రెజరీ ద్వారా డ్రా చేసుకునే వీలు లేకపోవడంతో వేసవి కష్టాలు సెక్రటరీలకు తలనొప్పిగా మారిపోయే అవకాశం ఉంది. మిషన్ భగీరథతో పాటు వందశాతం తాగునీటి సరఫరా లేకపోవడంతో జీపీ బోర్ల ద్వారా అనుసంధానం చేసి పంపింగ్ చేస్తున్నారు. ముందస్తు ప్రణాళిక తయారు చేసి, అందుకు తగ్గట్టుగా బడ్జెట్ కేటాయించాలి. అసలు జీపీల నిర్వహణ భారంగా మారిన సమయంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఉంటుందా లేక పంచాయతీ కార్యదర్శులపై మరింత ఆర్థిక భారం వేస్తారా వేచి చూడాలి.బచ్చన్నపేట: లక్ష్మాపూర్ జీపీలో నిరుపయోగంగా ట్రాక్టర్ఇప్పగూడెంలో నిండిన డ్రెయినేజీజఫర్గఢ్ మండల కేంద్రంలో రోడ్డుపై చెత్త డంపింగ్న్యూస్రీల్వేసవి గట్టెక్కేదెలా.. -
ప్రశ్నించే గొంతుకను గెలిపించాలి
● బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ జనగామ రూరల్: ప్రశ్నించే గొంతుక, పోరాడే వ్యక్తి పులి సరోత్తం రెడ్డిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. 36 సంవత్సరాలుగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్లో ఉ న్న డీఏల విషయంలో పోరాటం చేస్తున్నారన్నారు. పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ని లదీస్తూ ఉద్యమిస్తున్న పులి సరోత్తం రెడ్డికి మొ దటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరా రు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సరికొండ విద్యాసాగర్ రెడ్డి, ఉడుగుల రమేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజ్, పట్టణ అధ్యక్షుడు అనిల్, మహంకాళి హరిచంద్రగుప్త, పజ్జురి లక్ష్మీ నరసయ్య, గుజ్జుల నారాయణ, సంతోష్, గోధుమల అశోక్, డాక్టర్ భిక్షపతి శశిధర్, బింగి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి జనగామ రూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్నను సవరించి నిత్యావసర వస్తువు ధరలు తగ్గించాలని కోరుతూ మంగళవారం జిల్లా కేంద్రంలో సీపీఐ, సీపీఎం పార్టీలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆది సాయన్న మాట్లాడుతూ.. పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ప్రజలపై భారాలు వేసి కార్పొరేట్ శక్తులకు దేశాన్ని దోచిపెట్టే విధంగా బడ్జెట్ ఉందని మండిపడ్డారు. తెలంగాణ విభజన చట్టంలోని హామీలు అమలు చేయడానికి నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికై నా బడ్జెట్ను సవరించి ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జోగు ప్రకాష్, అహల్య, యాదగిరి, శేఖర్, బూడిద గోపి, సుంచు విజేందర్, ఐలయ్య, మధు, చంద్రయ్య, సుమ, కనకచారి, తదితరులు పాల్గొన్నారు. -
కార్యదర్శులు అప్పులపాలు!
జనగామ/జనగామ రూరల్: అస్తవ్యస్తంగా డ్రెయినేజీలు.. కంపుకొడుతున్న పల్లెలు... అంధకారంలో వార్డులు... మూలన పడుతున్న ట్రాక్టర్లు... పేరుకుపోతున్న చెత్తడంపులు ఇవీ జిల్లాలోని గ్రామాల్లో నెలకొన్న దుస్థితి. సర్పంచ్ల పదవీ కాలం ముగిసి ఏడాది గడిచి పోతున్నా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించకపోవడంతో కేంద్ర, రాష్ట ప్రభుత్వాల నుంచి గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు నిలిచిపోయాయి. ఇంటి, నల్లా పన్నులకు సంబంధించి ట్రెజరీలో ఫ్రీజింగ్ విధించడంతో.. భారమంతా సెక్రటరీలపై పడుతుంది. స్పెషలాఫీసర్లు కేవలం పర్యవేక్షణ మాత్రమే చేస్తుండగా... కార్యదర్శులు సొంతంగా అప్పులు తీసుకు వచ్చి జీపీల నిర్వహణను నెట్టుకువస్తున్నారు. జిల్లాలోని స్టేషన్ఘన్పూర్ మున్సిపల్గా ప్రమోట్ కాగా దాని పరిధిలో శివునిపల్లి, ఛాగల్ జీపీలను విలీనం చేయడంతో జిల్లాలో 280 గ్రామ పంచాయతీలకు కుదించబడ్డాయి. 2023–24 వార్షిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.33.88 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ ద్వారా రూ.5.98 కోట్లు మొత్తంగా రూ.39.87 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేసింది. 2024 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి జీపీ పాలక మండళ్ల గడువు ముగిసి పోవడంతో 2025–26 సంవత్సరంలో బడ్జెట్కు సంబంధించి పైసా రాలేదు. నిలిచిన చెల్లింపులు జిల్లాలోని జీపీలకు గతేడాది ఆగస్టు మాసం నుంచి బిల్లుల చెల్లింపులను నిలిపేశారు. పాలకవర్గం (సర్పంచ్/వార్డు సభ్యులు) కాల పరిమితి ముగిసిన నాటి నుంచి జీపీల నిర్వహణ బాధ్యత పూర్తిగా కార్యదర్శులపై పడింది. పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన ట్రాక్టర్ డీజిల్, మరమ్మతు, బ్లీచింగ్, దోమల నివారణ కోసం బయోటెక్స్, ఫాగింగ్, పారిశుద్ధ్య సామగ్రి, వీధి దీపాలు, తాగునీటి నిర్వహణకు అప్పులు చేసి పనులు చేయిస్తున్నారు. ఇంటి, నల్లా, అనుమతి ఇతర పద్దుల ద్వారా జీపీకి వచ్చే ఆదాయ వనరులను జీపీ అకౌంట్ (టెజరరీ ద్వారా/ఐఎఫ్ఎంఎస్)లో జమ చేస్తున్నారు. ట్రెజరరీ అకౌంట్ ఫ్రీజింగ్ చేయడంతో అందులో డబ్బులు వేయడమే తప్ప, తీసుకునే వీలు లేకుండా పోయింది. దీంతో గతేడాది ఆగస్టు మాసం నుంచి పంచాయతీ కార్యదర్శులు ఖర్చు చేసిన లక్షలాది రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. రోజు వారి నిర్వహణకు ప్రతీ నెల చిన్న పంచాయతీలకు రూ.లక్షకు పైగా, మేజర్ జీపీల్లో రూ. 2 లక్షలవరకు సెక్రటరీలు సొంతంగా ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే పలు జీపీల్లో ట్రాక్టర్లు మూలన పడడంతో చెత్తను ఎ క్కడ పడితే అక్కడే వేస్తున్నారు. బిల్లులు చెల్లించా లని జనగామ మండలానికి చెందిన కార్యదర్శులు ఇటీవల ఎంపీడీఓకు వినతిపత్రం అందించారు.సొంతంగా ఖర్చు చేసుకునే స్థోమత లేదు.. పంచాయతీల నిర్వహణకు టీఎస్బీపాస్ ద్వారా డబ్బులు విడుదల చేసుకునే అవకాశం కల్పించాలి. నిధుల లేమితో అభివృద్ధి కుంటుబడుతోంది. కార్యదర్శులు సైతం సొంతంగా ఖర్చు చేసుకునే స్థోమత లేకుండా పోతుంది. – దామెర వంశీ, కార్యదర్శుల సంఘం మండల అధ్యక్షుడు, నర్మెట ప్రతీ నెల రూ.60 వేల ఖర్చు పద్నాలుగు నెలలుగా బిల్లులు రావడం లేదు. కనీస అవసరాలకు ఆయా దుకాణదారుల్లో చేసిన అప్పులతో రోడ్డెక్కితే ముఖం చాటేయాల్సి వస్తోంది. నిత్యం శానిటేషన్ పనులు, ట్రాక్టర్ డీజిల్, తాగునీటి మోటారు, పైపులైన్ మరమ్మతు తదితర అత్యవసర పనులకు ప్రతీ నెల రూ.60 నుంచి రూ.90 వేల ఖర్చు చేస్తున్నాం. – జిలుకర వెంకన్న, జీపీ కార్యదర్శి, దేవరుప్పులపంచాయతీ నిర్వహణకు సొంత డబ్బులు గత ఆగస్టు నుంచి బిల్లుల పెండింగ్ ఎలక్షన్లు జరిపితేనే సర్కారు నుంచి నిధులు మూలన పడుతున్న ట్రాక్టర్లు కంపుకొడుతున్న గ్రామాలు ఆగమాగంగా వీధిలైట్ల నిర్వహణపంచాయతీ పాలన కష్టమే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాక, ట్రెజరీ నుంచి విడిపించుకోలేని పరిస్థితుల్లో ఏడాదిగా ఆర్థిక భారాన్ని మోస్తున్నాం. వీధి దీపాలు, డీజిల్, బోరు మోటార్ల నిర్వహణ, పారిశుద్ధ్యం నిర్వహణ ఖర్చుల కోసం అప్పులు చేస్తున్నాం. అధికారులు స్పందించి నిర్వహణ ఖర్చులను విడుదల చేయాలి. – పన్నీరు మధుసూదన్, సెక్రటరీ, చిల్పూరు, వెంకటేశ్వరపల్లి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం.. పంచాయతీలకు పెండింగ్లో ఉన్న బిల్లులు విడుదల చేయాలని కార్యదర్శులు తమకు వినతి చేస్తున్నారు. ఇంటి, తదితర పన్నులు ట్రెజరీలో వేసిన తర్వాత, డ్రా చేసుకునే అవకాశం లేదు. దీంతో టీఎస్బీపాస్ ద్వారా డ్రా చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. – నాగపురి స్వరూప, డీపీఓ -
కార్మిక వ్యతిరేక బడ్జెట్ను వ్యతిరేకించాలి
జఫర్గఢ్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన కార్మిక, ప్రజావ్యతిరేక బడ్జెట్ను వ్యతిరేకించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు కోరారు. మండల కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ సంపన్నులకు అనుకూలంగా ఉందని ఆరోపించారు . నిత్యావసర ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెరగడం లేదన్నారు. కార్మికులకు మేలు చేసే 49 కార్మిక చట్టాలను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. యాజమాన్యాలకు మేలు చేసే విధంగా బీజేపీ వ్యవహరిస్తున్నదన్నారు. ఇందుకోసం కొత్తగా నాలుగు లెబర్ కోడ్లను అమలు చేసేందుకు సిద్ధ పడుతున్నట్లు తెలిపారు. మతతత్వ విధానాల ముసుగులో పూర్తిగా కార్మిక, ప్రజా వ్యతి రేక విధానాలు అనుసరిస్తున్నారన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా నాయకులు యాతం సమ్మ య్య, నల్లతీగల శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ప్రాక్టికల్ పరీక్షలకు 17 మంది గైర్హాజరు
జనగామ రూరల్: జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 17 మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ జితేందర్ రెడ్డి తెలిపారు. మొదటి సెషన్లో జనరల్ 161 విద్యార్థులకు 153 మంది హాజరు కాగా 8 మంది గైర్హాజరయ్యారు. రెండో సెషన్లో జనరల్, ఒకేషనల్ 195 విద్యార్థులకు 186 విద్యార్థులు హాజరు కాగా 9 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను సందర్శించినట్లు జితేందర్ రెడ్డి తెలిపారు. జిల్లా పరీక్ష నియంత్రణ అధికారులు శ్రీనివాస్ వి.శేఖర్ జఫర్గఢ్ జనగామ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఆలయ అభివృద్ధికి విరాళాలు నర్మెట: మండలకేంద్రంలోని కాకతీయుల కాలం నాటి అతి పురాతన శివాలయం శిథిలావస్థకు చేరుకోగా గంగం నర్సింహారెడ్డి ఆధ్వర్యంలోని ఆలయ కమిటీ భక్తుల సహకారంతో నూతన ఆలయ నిర్మాణం చేపట్టింది. ఇటీవల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలను మూడు రోజులు ఘనంగా నిర్వహించారు. కాగా రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు పాతూరి మల్లారెడ్డి– మాధవి దంపతులు రూ. 2,01,116, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి దేవులపల్లి ప్రభాకర్ –ప్రపుల్ల రూ.51,116, సర్వేయర్ జంగిటి మహేందర్– నిరోషారాణి రూ.25,116, ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనందాస్ రాధాకృష్ణ –రమాదేవి రూ.21,116, ఆకుల రాంచందర్– అంజలి రూ.11,116, పాతూరి పద్మారెడ్డి– స్వాతి రూ.10,016 ఆదివారం కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో జంగిటి అంజయ్య, దేవులపల్లి భాగ్యలక్ష్మి ప్రతాప్రెడ్డి, నిమ్మ హనుమారెడ్డి, రాజబోయిన లక్ష్మీనారాయణ, వంగ భూపాల్ రెడ్డి, కల్లూరి రాజు, కొండ బాలయ్య మేకల పెద్దాపురం, వేముల రాంచంద్రం, తదితరులు పాల్గొన్నారు. వేసవిలో విద్యుత్ సమస్య పరిష్కారానికి కృషి జనగామ రూరల్ : వేసవిలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు ఎన్పీడీసీఎల్ జనగామ డీఈ లక్ష్మీనారాయణరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని సెక్షన్–1 విభాగం ఏరియాలో వేసవి ముందస్తు కార్యాచరణలో భాగంగా 63,100,163 కేవీఏ సామర్థ్యం కలిగిన ట్రాన్స్ఫార్మర్లలో లోపాలు లేకుండా చార్జీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిగితా సీజన్ల కంటే వేసవిలో విద్యుత్ డిమాండ్ మేరకు తగు సామర్థ్యం కలిగి ఉండేలా ట్రాన్స్ఫార్మర్లను అప్గ్రేడ్ చేస్తామన్నారు. వినియోగదారులు సైతం విద్యుత్ వినియోగంలో పొదుపు పాటిస్తూ ఎన్పీడీసీఎల్ యంత్రాంగం తోడ్పాటుకు పాటుపడాలన్నారు. ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఈ వేణుగోపాల్, ఏఈ సౌమ్య, సబ్ ఇంజనీర్ మనోహర్, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాటం జనగామ రూరల్: రాష్ట్రం మారిన పీడిత ప్రజలకు న్యాయం జరగడం లేదని, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాటం చేయాల్సి అవపరం ఉందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని విజయ గార్డెన్లో జిల్లా అద్యక్షుడు పాకాల వెంకన్న ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా ద్వితీయ మహాసభల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గడ్డం లక్ష్మణ్, భారత్ బఛావో నాయకుడు గాదె ఇన్నయ్య పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా.. పేదల బతులకు మారలేదని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం జరగలేదని గద్దర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ప్రజాఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి కడకంచ సంపత్, కార్యకర్తలు పాల్గొన్నారు. -
తెలంగాణలో శాసన మండలి నిర్వీర్యం
జనగామ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో శాసనమండలిని నిర్వీర్యం చేశారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అధ్యక్షతన జరిగిన ఓటర్ల సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డితో కలిసి కిషన్రెడ్డి మాట్లాడారు. సరోత్తంరెడ్డి ఉత్తముడని కొనియాడారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరోత్తంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వచ్చే శివరాత్రి పర్వదినం రోజున ఒక్కపొద్దు ఉండి, ఆదేరోజు ఓటు వేసి ఉపవాస దీక్ష వీడాలని పిలుపునిచ్చారు. గతంలో ప్రభుత్వం అంటే ఉపాధ్యాయులు అనే ఉద్దేశంతోనే శాసనసభతోపాటు శాసనమండలిలో ఎమ్మెల్సీ ఎన్నుకునే ప్రక్రియను తీసుకొచ్చారన్నారు. తన గురువు రామారావుకు ఎన్నికల సమయంలో అనేక మంది చందాలు పోగు చేసి అండగా నిలిచారన్నారు. గతంలో మంత్రులు శాసనమండలికి రావాలంటే వణికి పోయేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. బీజేపీ మాత్రం ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేసే భాగంలో వారి వెంటే ఉంటుందన్నారు. కేంద్రం డీఏ, వేతనాలు సకాలంలో చెల్లిస్తుంటే, రాష్ట్రంలో దారుణంగా ఉందన్నారు. రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, అప్పుల కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసిన రికార్డును సొంతం చేసుకున్నాడని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాగానే ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్రెడ్డి, ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కృషితో హైదరాబాద్కు కంపెనీలు వస్తున్నాయని, ప్రధాని దెబ్బకు పాకిస్తాన్ అడుక్కునే పరిస్థితికి చేరుకుందన్నారు. గ్రామ పంచాయతీలకు గత ప్రభుత్వం 10ఏళ్ల పాటు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. ఏడు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు వచ్చే విధంగా చూడాలని కోరుతూ దేవాదుల లిఫ్టు ఇరిగేషన్ కాంట్రాక్టు వర్కర్లు పి.సాయిలు ఆధ్వర్యంలో కేంద్ర మంత్రికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి, మాజీ మంత్రి గుండె విజయరామారావు, ఎమ్మెల్సీ, జిల్లా ఇన్చార్జ్ రాజమౌళిగౌడ్, నాయకులు బొజ్జపల్లి సుభాష్, జిల్లా ప్రధాన కార్యదర్శులు శివరాజ్యాదవ్, దుబ్బా రాజశేఖర్గౌడ్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మహంకాళి హరిశ్చంద్రగుప్త, అనిల్ గౌడ్ తదితరులు ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి జనగామలో ఎమ్మెల్సీ ఓటర్ల సమ్మేళనం -
20 ఫీట్లతో ఇబ్బందులే..
రఘునాథపల్లి: మండలంలోని నిడిగొండ రైల్వే ట్రాక్ వద్ద రోడ్డు అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) నిర్మా ణం పూర్తయినా ప్రయోజనం లేకుండా పోనుందా.? అంటే క్షేత్రస్థాయి పనులు జరుగుతోన్న తీరు చూస్తే ఔనన్నదే సమాధానం.. అధికారుల అనాలో చిత చర్యలు, నిర్ణయాలు, నిర్లక్ష్యంతో ఓ వైపు ఆర్యూబీ ఇరుకుగా మారనుంది. ఒక వాహనం వెళ్లాక మరో వాహనం వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడనుంది. ని డిగొండ నుంచి ఫతేషాపూర్, ఇబ్రహీంపూర్, మా దారం, లక్ష్మీతండా, ఖిలాషాపూర్ గ్రామాలకు వెళ్లే మార్గంలో రైల్వే ట్రాక్ వద్ద రూ.6 కోట్లతో ఆర్యూబీ నిర్మిస్తున్నారు. ట్రాక్ ఇరువైపులా 497 ఫీట్ల పొడవుతో నిర్మాణం పనులు చేపట్టారు. అయితే పూర్థిస్థాయిలో సమస్య పరిష్కారమయ్యేలా పనులు జరగడం లేదు. ఫతేషాపూర్ వైపు అప్రోచ్ రోడ్డు 32 ఫీట్ల వెడల్పుతో నిర్మిస్తుండగా.. నిడిగొండ వైపు మాత్రం 20 ఫీట్లకే పరిమితం చేస్తున్నారు. దీంతో వాహనాల రాకపోకలు సాఫీగా సాగే అవకాశం లేకుండా పోనుంది. ఎందుకిలా..? ట్రాక్ వద్ద ఫతేషాపూర్ వైపు 32 ఫీట్లు చూపిన రోడ్డును నిడిగొండ వైపు 20 ఫీట్లుగా రెవెన్యూ అధికారులు చూపినట్టుగా తెలుస్తోంది. నక్ష ప్రకారం మార్కింగ్ చేశామని అధికారులు చెబుతున్నా.. ఓ వైపు 32 ఫీట్లు, మరో వైపు 20 ఫీట్లు ఎలా ఉంటుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రెవెన్యూ అధికారులు నక్ష ప్రకారం ఇచ్చిన వివరాల ఆధారంగా ఆర్యూబీ డిజైన్ చేశామని రైల్వే అధికారులు.. ఒప్పందం ప్రకారం పనులు చేస్తున్నానని కాంట్రాక్టర్ చెబుతున్నారు. ట్రాక్ వద్ద నిడిగొండ వైపు ఉన్న ప్రైవేట్ వ్యక్తుల భూమి సేకరించేందుకు పలు గ్రామాల నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కడియం శ్రీహరి, రైల్వే డీఆర్ఎం దృష్టికి తీసుకెళ్లగా జిల్లా కలెక్టర్ను కలవాలని యోచిస్తున్నారు. ఇటీవల ఆర్యూబీ పనులను సందర్శించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. భూమి ఇచ్చేలా యజమానులను ఒప్పించాలని, సేకరణకు తాను కొన్ని డబ్బులు ఇస్తానని చెప్పారు. దీంతో పలుమార్లు భూ యజమాని మడ్లపల్లి రాజు, కొలిపాక రాజ్కుమార్లతో నాయకులు మాట్లాడారు. ఆర్డీఓ వద్దకూ వారిని తీసుకెళ్లి చర్చించారు. నిడిగొండ వైపు భూసేకరణకు స్వచ్ఛందగా తాము కొంత డబ్బులు చెల్లిస్తామని నాయకులు పేర్కొనగా.. బహిరంగ మార్కెట్ ప్రకారం తమకు పరిహారం ఇవ్వాలని భూ యజమానులు పట్టుబడుతున్నట్లు తెలిసింది. దీంతో భూసేకరణ విషయం కొలిక్కి రాలేదు. ఇదిలా ఉంటే అందుబాటులో ఉన్న స్థలంలో 20 ఫీట్ల వెడల్పుతో కాంట్రాక్టర్ పనులు కొనసాగిస్తున్నాడు. మేమేం చేయలేమని రైల్వే అధికారులు చెబుతుండటం గమనార్హం. చట్టం ప్రకారం.. ప్రజాప్రయోజన ప్రాజెక్టుల కోసం 2013 చట్టం ప్రకారం భూమి సేకరించే అధికారం ప్రభుత్వ విభాగాలకు ఉంది. ఇక్కడ మాత్రం అధికారులు ఆ దిశగా కసరత్తు చేయడం లేదు. చట్టం ప్రకారం సేకరణకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్న దృష్ట్యా.. సంప్రదింపుల ద్వారా భూసేకరణ చేయాలనుకుంటున్నాయని ఓ అధికారి తెలిపారు. భూమి సేకరించకుండా నిడిగొండ వైపు కేవలం 20 ఫీట్లతో అండర్గ్రౌండ్లో రోడ్డు నిర్మిస్తే.. ఇబ్బందులు తప్పవని ప్రజలు పేర్కొంటున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేలా ఇరువైపులా 32 ఫీట్లతో అండర్గ్రౌండ్లో రోడ్డు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిడిగొండ వైపు 20, ఫతేషాపూర్ వైపు 32 ఫీట్లు ఒక్కో వైపు ఒక్కోలా నిడిగొండ ఆర్యూబీ నిర్మాణం అధికారుల అనాలోచిత నిర్ణయాలు -
ఎన్నికలకు వేళాయె..
జనగామ: మహిళా సంఘాల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుత సంఘాల పదవీ కాలం మార్చితో ముగియనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సంఘాలపై ప్రత్యేక దృష్టి సారించింది. మహిళా శక్తి ప్రోగ్రామం ద్వారా ఆర్థిక బలోపేతం సాధించే విధంగా సంఘాలకు పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా మండల, గ్రామ, జిల్లా స్థాయిలో సంఘాలకు కొత్త సారథులను ఎన్నుకునేందుకు ఎన్నికల కసరత్తు మొదలుపెట్టింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో సెర్ప్ ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శిక్షణ..జిల్లాలో 466 వీఓ, 11,240 సెల్ఫ్ హెల్ఫ్ గ్రూపులు ఉండగా.. 1,28,115 మంది మహిళా సభ్యులు ఉన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ‘మహిళా శక్తి మెంబర్ మొబిలైజేషన్’ కార్యక్రమంలో 1,716 సంఘ సభ్యులను చేర్చుకోవాలనే లక్ష్యం మేరకు 355 వీఓల పరిధిలో 2,013 మందికి సభ్యత్వం ఇచ్చి 117.31 శాతం అదనంగా అచ్ఛీవ్మెంట్ సాధించారు. కొత్త సంఘాల ఏర్పాటుకు హైదరాబాద్లో డీపీఎం, ఏపీఎం స్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వగా, జిల్లా, గ్రామ, మండల లెవల్లో వీఓ, వీఓఏ, సెర్ప్ సిబ్బంది, మండల, గ్రామ సమాఖ్యలకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రస్తుత కమిటీల పదవీ కాలం మార్చిలో ముగియనుండగా.. కొత్త సారథులు ఏప్రిల్ చివరి వారంలో బాధ్యతలను తీసుకోనున్నారు. కసరత్తు షురూ..పాత, కొత్త సంఘాలను కలుపుకుని కొత్త సారథుల ఎన్నికలో భాగంగా ఈ నెల చివరి వారం నుంచి ఎలక్షన్ ప్రక్రియను మొదలు పెట్టనున్నారు. నూతన సంఘాల పదవీ కాలం ఏడాది నుంచి మూడు సంవత్సరాలపాటు ఉంటుంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష, పాలకవర్గ సభ్యులను చేతులెత్తే పద్ధతిలో ఎన్నుకోనున్నారు. స్వయం సహాయ సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సీ్త్ర నిధి ద్వారా పెద్ద ఎత్తున రుణాలను మంజూరు చేస్తోంది. జిల్లాలో 2024–25 వార్షిక సంవత్సరంలో 4,644 ఎస్హెచ్జీ గ్రూపులకు రూ.431 కోట్ల రుణాలు ఇవ్వగా.. 90.48 శాతం మేర లక్ష్యాన్ని చేరుకున్నారు. మహిళా క్యాంటీన్లు, చిరు వ్యాపారాల్లో సంఘాలు రాణిస్తూ.. ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నాయి. సంఘాల బలోపేతం, లావాదేవీల్లో అధ్యక్ష, ఉపాధ్యక్షుల పాత్ర కీలకమని చెప్పుకోవచ్చు. మహిళా సంఘాలకు కొత్త సారథులను ఎన్నుకునేందుకు ఏకగ్రీవం లేదా చేతులెత్తే పద్ధతి, చీటీల ద్వారా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు చర్యలు చేపడతారు. మొదట గ్రామ సంఘ అధ్యక్షురాలు.. అక్కడ నుంచి మండల సమాఖ్య అధ్యక్షురాలిగా ఎన్నుకోబడుతారు. మండల అధ్యక్షులు కలిసి జిల్లా సమాఖ్య అధ్యక్షులను ఎన్నుకుంటారు. మండల సమాఖ్య ఎలక్షన్లను ఈ నెల చివరి వరకు పూర్తి చేసి, మార్చి నాలుగవ వారంలో జిల్లా సమాఖ్య అధ్యక్ష, ఉపాధ్యక్ష, పాలక మండలి సభ్యులను ఎన్నుకుని, ఏప్రిల్లో నూతన కమిటీలచే ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.మహిళా సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎలక్షన్లు ఏప్రిల్ వరకు ప్రక్రియ పూర్తి మార్చి వరకు పని చేయనున్న ప్రస్తుత కమిటీలు జిల్లాలో 1.28 లక్షల మంది సభ్యులుజిల్లాలో మహిళా సంఘాల వివరాలు మండలాలు 12పంచాయతీలు 280రుణాల టార్గెట్ రూ.476.47 కోట్లు రుణాల మంజూరు రూ.431 కోట్లు వీఓలు 466ఎస్హెచ్జీ 11,240మొత్తం సభ్యులు 1,28,115 -
పట్టణంలో కారు బీభత్సం
● బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంలోకి దూసుకు వచ్చిన వాహనం ● ఒకరి పరిస్థితి విషమం.. ఐదుగురికి గాయాలు ● తొమ్మిది వాహనాలు ధ్వంసం ● పోలీసుల అదపులో యువకులుజనగామ: జిల్లా కేంద్రంలో ఆదివారం ఓ కారు బీభత్సం సృష్టించిన ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా మారగా.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం.. జనగామ చౌరస్తా నుంచి ఏపీ 36 ఏటీ 1179 నంబరు గల కారు సూర్యాపేట రోడ్డువైపు అతివేగంగా వస్తోంది. అందులో నలుగురు యువకులు ఉన్నారు. సడెన్గా హ్యాండ్ బ్రేక్ వేయడంతో కారు పక్కనే ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూం వైపు దూసుకు వచ్చింది. అదే సమయంలో రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామానికి చెందిన కొయ్యడ రాకేష్, కొయ్యడ శ్రావన్, సింగిరెడ్డి సంతోష్కుమార్ స్నేహితుడి వివాహ వేడుకలకు గిఫ్టు కొనుగోలు చేసేందుకు షోరూం వద్దకు వచ్చారు. షోరూంలో పనిచేసే లింగాలఘణపురం మండలం నెల్లుట్లకు చెందిన మహిళా ఉద్యోగిని కల్పన అదే సమయంలో బయటకు వస్తున్నారు. సెకండ్ల వ్యవధిలో వంద కిలోమీటర్ల వేగంతో వచ్చిన కారు షోరూం ముందు పార్క్ చేసిన తొమ్మిది బైక్లను ఢీ కొడుతూ కల్పనను లాక్కుపోయింది. ఈ ఘటనలో ఆమె రెండు కాళ్లు విరిగి పోయి తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు చెందిన మరో మహిళ పేరువుల మేరితో పాటు ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను 108 అంబులెన్స్లో జిల్లా ఆస్పత్రికి తరలించి.. కారు ప్రమాదానికి కారకులైన నలుగురు యువకులను పోలీసులకు అప్పగించారు. కారు ఎన్పీడీసీఎల్ ఉద్యోగికి చెందినదిగా భాస్తుండగా.. అందులో ఉన్న కొంతమంది మద్యం సేవించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కల్పనతో పాటు నలుగురికి జిల్లా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసి వరంగల్కు పంపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో దీపక్కు చోటు
జనగామ రూరల్: ఇటీవల నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్వకేషన్ రికార్డ్ హోల్డర్స్లో జనగామ పట్టణానికి చెందిన మోర్తాల దీపక్కు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన వాహన రహదారి(ఉమ్లింగ్ లా పాస్ – 19,024 అడుగుల ఎత్తు)ని 2021 నవంబర్ 16న, లడక్లోని కార్థుంగ్ లా పాస్ని(17,982 అడుగులు ఎత్తు) 2023 అక్టోబర్ 17న ద్విచక్ర వాహనంతో దీపక్ అధిరోహించి చరిత్ర సృష్టించాడు. ఈ మేరకు శనివారం ఢిల్లీలో ఇంటర్ నేషనల్ కాన్వకేషన్ సందర్భంగా వియాత్నం దేశానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ చూ బయో క్యూ చేతుల మీదుగా దీపక్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందుకున్నాడు. కాగా ప్రస్తుతం దీపక్ జనగామ ప్రభుత్వ ఆస్పత్రిలో రేడియో గ్రాఫర్గా పనిచేస్తున్నాడు. దేశంలో బెస్ట్ మోటార్ సైకిల్ సాహస యాత్రికుడిగా పేరు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న దీపక్ను పలువురు అభినందించారు. -
సేవాలాల్ ఆశయ సాధనకు కృషి
పాలకుర్తి టౌన్: సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. శనివారం సంత్సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి సందర్భంగా నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన గిరిజనులు ర్యాలీగా తరలివచ్చి సేవాలాల్ మహరాజ్కు పూజలు చేశారు. గిరిజన వేషధారణలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమండ్ల ఝాన్సీరెడ్డి పూజలు నిర్వహించి ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించారు. రాజకీయాలకతీతంగా గిరిజనులు పాల్గొని భోగ్ బండార్ను తిలకించి పూజలు నిర్వహించారు. అనంతరం సేవాలాల్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు హమ్యానాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. నియోజవర్గంలోని ప్రతీ మండలంలో సేవాలాల్ భవనం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు లావుడియ మంజుల, తిరుపతిరెడ్డి, హమ్యానాయక్, లావుడియ్య భాస్కర్, దరావత్ రోజా, సరేష్నాయక్, రాజేష్నాయక్, తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి
స్టేషన్ఘన్పూర్: విద్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ అన్నారు. శనివారం ఘన్పూర్ శివారులోని ప్రభు త్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా సోషల్ వెల్ఫేర్ పాఠశాల, కళాశాలకు చెందిన వంటగది, ల్యాబ్, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశా లలో ఎప్పటికప్పుడు చెత్తను తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు. తాగునీరు సమస్య లేకుండా చూ డాలని, మరుగుదొడ్ల మరమ్మతు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. అనంతరం స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించారు. పా రిశుద్ధ్యం పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయ న వెంట కమిషనర్ రవీందర్, ఎంపీడీఓ విజయశ్రీ, తదితరులు ఉన్నారు. అడిషనల్ కలెక్టర్ పింకేష్కుమార్ -
మరో అవకాశం!
● జిల్లాలో నేటి నుంచి కులగణన ● ప్రజాపాలన కేంద్రాల్లో వివరాల నమోదు జనగామ: రాష్ట్రంలో తొలిసారి చేపట్టిన కులగణన సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)కు ప్రభుత్వం మరోసారి శ్రీకారం చుట్టింది. గతేడాది చేపట్టిన సర్వేలో వివిధ కారణాలతో తమ వివరాలను నమోదు చేయించుకోలేని కుటుంబాలకు రెండవసారి అవకాశం కల్పించింది. నేటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు కుల గణన సర్వే జరగనుంది. ఇందుకు సంబంధించి 12 మండలాల పరిధిలో ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు సర్వేకు దూరంగా ఉన్న కుటుంబాలు ఆన్లైన్లో పొందుపరిన ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో కుటుంబ సమగ్ర వివరాలను పూర్తి చేసి, ప్రజాపాలన సేవా కేంద్రంలోని అధికా రికి అందజేసి పేరును నమోదు చేసుకోవాలి. సందేహాల నివృత్తికి టోల్ ఫ్రీ నంబర్ 9052 308 621కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు పొందవచ్చు. సర్వేకు దూరంగా 15వేల కుటుంబాలు గత ఏడాది నవంబర్ 6వ తేదీ నుంచి 8 వరకు ఇంటింటికీ స్టిక్కరింగ్ వేశారు. 9వ తేదీన మొట్టమొదటి సారిగా కులగణన సర్వే ప్రారంభించారు. 20 రోజుల పాటు సర్వే నిర్వహించి, 1,77,122 కుటుంబాల డాటాను ఆన్లైన్ ఎంట్రీ చేశారు. జిల్లాలో సుమారు 15 నుంచి 18 వేల కుటుంబాలు సర్వేకు దూరంగా ఉండగా, రెండవ సారి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతుంది. దీంతో కులాల వారీగా జిల్లాలో ఎంత మంది ఉన్నారనే విషయంలో స్పష్టత రానుంది. సర్వేలో పాల్గొనండి.. ప్రభుత్వం నేటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు రెండవ సారి నిర్వహించే కుల గణనలో వివిధ కారణాలతో దూరంగా ఉన్న కుటుంబాలు తమ వివరాలను నమోదు చేయించుకోవాలి. 12 మండలాల పరిధిలోని ప్రజాపాలన సేవా కేంద్రాల్లో సమగ్ర వివరాలతో అధికారులకు అందించాలి. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకుని, సర్వేకు సహకరించాలి. – రిజ్వాన్ బాషా, కలెక్టర్ ● -
విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలి
జనగామ రూరల్: రాబోయే రాష్ట్ర బడ్జెట్లో విద్యా రంగానికి మొత్తం బడ్జెట్లో 15శాతం కేటాయించాలని సాదిక్ ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది సాదిక్ అలీ అన్నారు. సాదిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏకశిల డిగ్రీ కాలేజీలో శనివారం విద్యా మహోద్యమ స ద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సాదిక్ ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది సాది క్ అలీ మాట్లాడుతూ విద్యా మహోద్యమానికి ప్రజలు మద్దతునిస్తూ అనేక విధాలుగా సహకరిస్తున్నారని ఈ నెల 17 సోమవారం సాదిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్రెడ్డికి పో స్టుకార్డులు రాసి పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల విద్యార్థులు, సాదిక్ ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు. 84 మంది గైర్హాజరుజనగామ రూరల్: జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 84 మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ జితేందర్రెడ్డి తెలిపారు. మొదటి సెషన్లో జనరల్, ఒకేషనల్లో 573 విద్యార్థులకు 509 విద్యార్థులు హాజరు కాగా 64 మంది గైర్హాజరయ్యారు. రెండవ సెషన్లో జనరల్, ఒకేషనల్ 397 విద్యార్థులకు గాను 377 మంది హాజరు కాగా 20 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలో పలు పరీ క్ష కేంద్రాలను డీఐఈఓ జితేందర్రెడ్డి సందర్శించగా జిల్లా పరీక్షల నియంత్రణ అధికారులు ఎస్. శ్రీనివాస్, వి.శేఖర్ జఫర్గఢ్, జనగామ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. నిట్లో ‘క్యూరా–25’ వేడుకలు షురూ! కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లోని రామన్ సెమినార్ హాల్లో రెండు రోజులపాటు జరిగే 14వ నేషనల్ లెవల్ మేనేజ్మెంట్ ఫెస్టివల్ ‘క్యూరా–25’ వేడుకలను శనివారం టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్ అండ్ సీఎండీ వరుణ్రెడ్డి కర్నాటి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బిజినెస్ స్కూల్ విద్యార్థులు తమ అభిప్రాయాలను పంచుకునే నూతన ఆవిష్కరణలకు వేదికగా ‘క్యూరా–25’ నిలవాలన్నారు. ప్రపంచం భారతదేశాన్ని వ్యాపార కేంద్రంగా చూస్తోందని, ఇందుకు తగ్గట్టుగా బిజినెస్ స్కూల్ విద్యార్థులు పారిశ్రామిక వేత్తలుగా రాణించాలని ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా 120 మంది బిజినెస్ స్కూల్ విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొంటారని, ఏడు రకాల పోటీలు నిర్వహించనున్నట్లు క్యూరా స్టూడెంట్ కోఆర్డినేటర్ శర్ధిల్ తెలిపారు. కార్యక్రమంలో నిట్ ప్రొఫెసర్లు వేణువినోద్, సునీత, మహమ్మద్ షఫీ తదితరులు పాల్గొన్నారు. హేమాచల క్షేత్రంలో భక్తుల సందడి మంగపేట : మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, చింతామణి జలపాతం, వనదేవత(దైత) అమ్మవారి ప్రాంత పరిసరాల్లో కోలాహలం నెలకొంది. ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద స్నానాలు చేసి హేమాచల కొండపైకి చేరుకున్నారు. స్వయంభు స్వామివారిని దర్శించుకున్న భక్తులు లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు పూలు, పండ్లు, పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు స్వామివారికి తిలతైలాభిషేకం నిర్వహించారు.సంతానం కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. -
శివుడిని అమితంగా ఇష్టపడే కొందరికి గజ్జెల లాగు అంటే బహు ప్రీతి.. అత్యంత పవిత్రంగా చూస్తారు.. నీసు తగలనివ్వరు.. తల స్నానం చేయనిదే తాకనైనా తాకరు.. మట్టి రేణువులు కూడా లాగును తాకొద్దని నేలపై సంచులు పరిచి విప్పుతారు.. మిగతా వస్త్రాలతో కాకుండా వేరుగా శుభ్రం చేస
గారడి ముసుగుఎల్లమ్మ గవ్వల బుట్టకొత్తకొండ ఈరన్న.. కొమురెల్లి మల్లన్న.. ఎములాడ రాజన్న.. ఓదెల, ఐనవోలు మల్లికార్జున స్వామి.. ఇలా దేవాలయాలు, జాతరలు ఏవైనా శివసత్తులు, పోతరాజులుంటేనే భక్తజన సందోహం. చిన్నపట్నం, పెద్దపట్నం, అమ్మవారి బోనాలు.. పూజా కార్యక్రమాల్లో పరవశించిన శివసత్తుల శిగాలు.. పోతరాజుల విన్యాసాలు.. ఈరకోల ఆటలు.. మేకపోతులు, కోడిపుంజులను గావుపట్టే పూనకాలు భక్తులను మైమరిపిస్తాయి. ఆయా ఉత్సవాలకు ధరించే ప్రత్యేక దుస్తులు, వస్తువుల తయారీ, సరఫరా కేంద్రం హనుమకొండ జిల్లా నడికూడలో ఉంది. తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర.. ప్రాంతాల్లోని పేరున్న దేవాలయాల్లో శివసత్తులు, పోతరాజులు, భక్తులకు సుమారు 60 ఏళ్లుగా గజ్జెల లాగులు మొదలు ఈరకోలలు, పట్నాల గొంగడి, ఢమరుకం, శూలం.. వరకు ప్రతి ఒక్కటీ నడికూడ నుంచే సరఫరా అవుతున్నాయి. ఇరవై కుటుంబాలు సుమారు 200 మంది నిరంతరం శ్రమిస్తూ ఉపాధి పొందుతుండగా.. ప్రతి ఏడాది డిసెంబర్ నుంచి మార్చి వరకు ఉమ్మడి వరంగల్లోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి నడికూడకు వచ్చి వస్తువులను కొనుగోలు చేస్తారు. సామగ్రికి ప్రసిద్ధి.. తెలంగాణ జానపద సంస్కృతిలో నిర్వహించే పూజల్లో భాగంగా ధరించే గజ్జెల లాగుల తయారీకి నడికూడ గ్రామం ప్రసిద్ధి. కొమురవెల్లి మల్లన్న, ఐనవోలు, బోనాలు, సమ్మక్క–సారలమ్మ జాతరలో, పట్నాలు, పెద్ద పట్నం, గట్టు మల్లన్న జాతరల్లో ఈ గజ్జెల లాగులు, పసుపుపచ్చని అంగీలు ధరిస్తారు. వేములవాడ, కొండగట్టు, శ్రీశైలం, హైదరాబాద్, రంగారెడ్డి, విజయవాడ తదితర తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి వచ్చి సామగ్రిని తీసుకెళ్తారు. గజ్జల లాగులకు బ్రాండ్గా నడికూడ గ్రామం నిలుస్తోంది. వీటిని ధరించే వారు ఎంత నిష్టగా ఉంటారో.. తయారు చేసేవారూ అంతే నిష్టతో ఉంటారు. సెట్టు రూ.13 వేల వరకు.. శివసత్తులు, పోతరాజులు, భక్తులు ధరించే ప్రత్యేక దుస్తులు, వస్తువులు 10–12 రకాలను ఒక సెట్టుగా విక్రయిస్తారు. అవసరాలను బట్టి విడివిడిగా కూడా అమ్ముతారు. ఒక సెట్టులో ఎల్లమ్మ గవ్వలు, ఈరకోల, ఢమరుకం, వల, ప్రతిమలు, కాళ్ల గజ్జలు, తౌతులు, శూలం, గొంగళి, కుల్ల(గవ్వల టోపీ), నిలువు ప్యాంట్లు ఉంటాయి. నాణ్యతను బట్టి ఈసెట్టును రూ.6 వేల నుంచి రూ.13 వేల వరకు విక్రయిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మరింత ఆకర్షణగా మెషిన్ ఎంబ్రాయిడరీతో గజ్జెల లాగుల తయారీ వస్త్రాలపై దేవతల నమూనాలను కూడా వేస్తున్నారు. పూజకు కావాల్సిన ప్రతీ సామగ్రి ఇక్కడ లభిస్తుండడంతో జాతరల సీజన్లో వివిధ ప్రాంతాల భక్తులు నడికూడ బాట పడుతున్నారు. ముహూర్తం చూసి కొనుగోళ్లు.. జాతరల సీజన్లో పట్నాలు, బోనాల మొక్కులు చెల్లించేవారు వారం రోజుల పాటు నిష్టగా ఉంటారు. ఒక్కపూట భోజనం.. ఉపవాస దీక్షలను పాటిస్తారు. ఇదే సమయంలో పట్నాలు, బోనాలు చెల్లించేవారు.. ప్రత్యేక దుస్తులు, వస్తువులను కూడా దైవసమానంగా భావిస్తారు. అందుకే వీటిని కొనేటప్పుడు మంచి ముహూర్తం చూసి కొంటారని దుస్తుల తయారీదారులు చెబుతున్నారు. మల్లన్న బుట్ట పలు రాష్ట్రాలకు ఇక్కడి నుంచే సరఫరా.. వీటి తయారీని నమ్ముకున్న 200 మంది 60ఏళ్లుగా ఉపాధి పొందుతూ..భక్తిశ్రద్ధలతో తయారు చేస్తాం.. గజ్జెల లాగులు కొనడానికి మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ఇక్కడ భక్తిశ్రద్ధలతో తయారు చేస్తాం. వర్క్ కూడా చాలా బాగా ఉంటుంది. – రావుల సుమలత, నడికూడ -
పదిహేనేళ్ల నిరీక్షణకు తెర
జనగామ: పదిహేనేళ్ల ఎదురుచూపులకు మోక్షం లభించింది. సర్కారు కొలువు కోసం చేసిన పోరా టం పట్టాలెక్కగా.. కోర్టు తీర్పు మేరకు కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగ బాధ్యతలను చేపట్టనున్నారు. కొందరిలో సంతోషం.. మరికొందరిలో నిరాశ. 2008లో డీఎస్సీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు, 2010లో నిర్వహించిన రిక్రూట్మెంట్కు హాజ రయ్యారు. ఎస్జీటీ పోస్టుల్లో బీఈడీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వడంతో డీఈడీ అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ మధ్యలోనే ఆపేశారు. దీంతో ఉపాధ్యాయ కొలువు వస్తుందని ఆశగా చూసిన వేలాది మంది అభ్యర్థులకు నిరాశనే మిగిలింది. న్యాయం కోసం 15 ఏళ్లుగా పోరాటం చేస్తున్న అభ్యర్థులకు కోర్టు తీర్పుకు లోబడి ప్రభుత్వం తీపి కబురు అందించింది. డీఈఓ కార్యాలయంలో కౌన్సెలింగ్.. 2008 డీఎస్సీ నష్టపోయిన జిల్లాకు చెందిన 33 మంది అభ్యర్థులు కాంట్రాక్టు పద్ధతిలో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) ఉపాధ్యాయులుగా బాధ్యతలను తీసుకోనున్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ నెల 17వ తేదీలోగా ఉద్యోగ నియామకం చేపట్టాలని ఇచ్చిన ఆదేశాల మేరకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. 33 మంది అభ్యర్థులకు జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్ నేతృత్వంలో కబురు పంపించగా... శనివారం ఒరిజినల్ సర్టిఫికెట్లతో డీఈఓ కార్యాలయానికి హాజరయ్యారు. అ భ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించిన అనంతరం కలెక్ట ర్ ఆదేశాల మేరకు కౌన్సెలింగ్ ప్రారంభించారు. జి ల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల పరి ధిలోని ఖాళీ ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి న వివరాలను అందుబాటులో ఉంచారు. ఇందులో బచ్చన్నపేట–2, చిల్పూరు–2, దేవరుప్పుల–4, స్టే షన్ ఘన్పూర్–1, జనగామ–1, కొడకండ్ల–4, లింగాలఘణపురం–1, నర్మెట–2, పాలకుర్తి–7, రఘునాథపల్లి–5, తరిగొప్పుల–3 జఫర్గఢ్–1లో ఖాళీ ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు కౌన్సెలింగ్లో చూ పించారు. అభ్యర్థుల మెరిట్ ప్రకారం వారు కోరుకు న్న చోట పోస్టింగ్ ఇస్తూ ఆర్డర్ కాపీ ఇష్యూ చేశారు. ఆర్డర్ కాపీ తీసుకునే కాంట్రాక్టు ఉపాధ్యాయులు, ఎంఈఓకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్టు పద్ధతిలో... హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను అనుసరిస్తూ 2008 డీఎస్సీ బాధితులకు ప్రభుత్వం కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలను ఇస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. నెలవారి వేతనం రూ.31,040గా నిర్ణయించింది. విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి ముగింపు చివరి దశ (ఏప్రిల్ 23వ తేదీ) వరకు పని చేసి, తిరిగి జూన్ 12 నుంచి కొత్త బాండ్ పేపర్తో మళ్లీ విధుల్లో చేరతారు. ఏసీ జీఈ రవికుమార్, యాదగిరి, మళ్లిఖార్జున్, శ్రీధర్, నూరొద్దీన్, మెరుగు రామరాజు, కిరణ్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించగా, పలు ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.2008 డీఎస్సీ అభ్యర్థులకు కాంట్రాక్టు ఉద్యోగాలు సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. కౌన్సెలింగ్ పూర్తి జిల్లాలో 33 మందికి పోస్టింగ్ ఈ నెల 17న విధుల్లోకి...సంతోషంగా ఉంది.. 2008లో డీఎస్సీ అర్హత సాధించి, 2010లో రిక్రూట్మెంట్ కోసం నియామక పత్రం తీసుకునే సమయంలో కోర్టు స్టేతో తమ ఆశలు ఆవిరైపోయాయి. న్యాయంగా తమకు రావాల్సిన ఉద్యోగం కోసం 15 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. కోర్టు తీర్పునకు లోబడి ప్రభుత్వం తమను కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం ఇవ్వడం సంతోషంగా ఉంది. – గడ్డం కవిత, బీఈడీ, 2008 డీఎస్సీ అభ్యర్థిప్రభుత్వానికి కృతజ్ఞతలు ప్రభుత్వం కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు ఇవ్వడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం ప్రైవేట్ స్కూల్లో పని చేస్తున్న. ఈ నెల 17వ తేదీ నుంచి ఉద్యోగ నియామక బాధ్యతలు తీసుకుని, విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేస్తా. 15 ఏళ్ల పోరాటంలో సుమారు రూ.లక్షకు పైగా ఖర్చు అయింది. – ఎం.రమేశ్, శివునిపల్లి -
పకడ్బందీగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు
జనగామ: వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జి ల్లా ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న ట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ హాలులో రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్తో కలిసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ, పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ విధానంపై సెక్టార్, ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓల మొదటి విడత శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పా ల్గొని మాట్లాడారు. జిల్లాలో 1,002 ఉపాధ్యాయ ఓట్లకు గాను 12 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎలక్షన్ నేపధ్యంలో జిల్లాలో మూ డు మండలాలకు ఒక రూట్ చొప్పున నాలుగు రూ ట్లను ఏర్పాటు చేయగా, నలుగురు సెక్టోరియల్ అ ధికారులను నియమించినట్లు చెప్పారు. మొదటి రూట్లో జనగామ, లింగాలఘణపురం, రఘునాథపల్లి మండలాలు ఉండగా, రెండవ రూట్లో కొడకండ్ల, దేవరుప్పుల, పాలకుర్తి, మూడవ రూట్ పరి ధిలో చిల్పూర్, స్టేషన్ఘన్పూర్, జఫర్గఢ్, నా లుగవ రూట్ పరిధిలోకి నర్మెట, బచ్చన్నపేట, తరి గొప్పుల మండలాలు ఉన్నట్లు వెల్లడించారు. అధికారుల పాత్ర కీలకం ఉపాధ్యాయ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిర్వహణ లో ఎలక్షన్ అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ అ న్నారు. 17 మంది పీఓలు, 18 మంది ఏపీఓలు, 37 మంది ఓపీఓలు, 18 మంది మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో ఎలక్షన్ నిర్వహించనున్నామన్నారు. అధి కారుల సమన్వయంతో పని చేసి పొరపాటుకు తా వులేకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. బ్యాలెట్ పేపర్తో ఎన్నికలను నిర్వహించనున్న నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 27న పోలింగ్ ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, సాయంత్రం ఓటింగ్ ముగిసే సమయంలో క్యూ లైన్లో ఉన్న వారికి టోకెన్ నంబర్లను ఇచ్చి, ఓటింగ్ వేసేలా చూడాలన్నారు. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలోనే బ్యాలెట్ బాక్స్లను ఓపెన్ చేసి చూపించాలన్నారు. ఎన్నికల నిర్వహణలో అధి కారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంతకు ముందు ఎన్నికల నిర్వహణపై సెక్టార్ అధికారులు, పీఓలు, ఏపీఓలు, ఓపీఓలకు మాస్టర్ ట్రేనర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీకాంత్, క లెక్టరేట్ ఏఓ మన్సూరి, సెక్టార్ అధికారులు, ఎన్ని కల విభాగం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలి పీఓలు, ఏపీఓలు, ఓపీఓల పాత్ర కీలకం కలెక్టర్ రిజ్వాన్ బాషాటెన్త్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలిజనగామ రూరల్: పదోతరగతి వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని అందుకు కా ర్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని గీతాంజలి పబ్లిక్ పాఠశాలలో ఎస్సీ, బీసీ, మైనార్టీ వసతి గృహాలకు చెందిన పదవ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలపై ప్రేరణ–అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమయాన్ని వృథా చేయకుండా ప్రతీక్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ వార్షిక పరీక్షల సన్నద్ధతకు ఆరు సూత్రాలను తప్పనిసరిగా అనుసరించాలని, వాటిలో యాక్షన్ ప్లాన్, స్మార్ట్ వర్క్, ఆ రోగ్యం, మంచి నిద్ర, సాధన, ప్రేరణ వంటి సూత్రాలను పాటిస్తూ ప్రతీ విద్యార్థి పది ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఎస్సీ డీఓ విక్రమ్, మైనార్టీ సంక్షేమ ప్రిన్సిపాల్స్ కుమారస్వామి, అనిల్, ఎస్సీ, బీసీ వసతి గృహా ల అధికారులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి
జనగామ రూరల్: విద్యార్థులకు చదువుతో పాటు సమాజం, అలాగే చట్టాలపై అవగాహన ఉండాలని సీనియర్ సివిల్ జెడ్జి సి.విక్రమ్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన పట్టణ పరిధి వైష్ణవి హైస్కూల్లో శుక్రవారం నిర్వహించిన చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ ఫర్ చిల్డ్రన్స్ స్కీం–2024, న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థులు తమకున్న హక్కులను తెలుసుకోవాల ని చెప్పారు. సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలని, తల్లిదండ్రులకు చెప్పుకోవడం లేదా విద్యార్థులే కలిసికట్టుగా ఏర్పడి పరిష్కారానికి పోరాడాలని సూచించారు. ఈ సందర్భంగా బాలికల్లో నలుగురు, బాలురలో ఇద్దరు చొప్పున గ్రూప్ లీడర్లను ఎంపిక చేసి చేశారు. పాఠశాలల్లో సమస్యలుంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు సంబంధించిన పారాలీగల్ వలంటీర్లకు తెలియజేయాలని సూచించారు. బాలబాలికలపై ఎవరైనా వేధింపులకు పాల్పడితే కఠినమైన శిక్ష తప్పదని, వేధింపుల విషయంలో సుప్రీంకోర్టు నుంచి జిల్లా స్థాయి వరకు కఠినమైన శిక్షలు ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ ఉప్పలయ్య, కోఆర్డినేటర్ రవికుమార్, సభ్యులు శ్రీలత, స్వాతి, డిఫెన్స్ కౌన్సిల్ ఎం.రవీంద్ర, తిరుమల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సివిల్ జెడ్జి విక్రమ్ -
బీఆర్ఎస్ నేతలకు మతిభ్రమించింది
స్టేషన్ఘన్పూర్: బీఆర్ఎస్ నేతలు అధికారం కోల్పోయాక ఆగమవుతున్నారు.. మతిభ్రమించిన ట్లు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15 నుంచి అధికారికంగా నిర్వహించనున్న సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవా రం గిరిజన నాయకులతో సమావేశం అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలకు వింత జబ్బు పట్టుకుంది.. రోజూ మీడియాలో కనిపించకపోతే వారికి ఏమీ తోచడం లేదు.. ఈ జబ్బు ప్రధానంగా కేటీఆర్, కవితకు ఎక్కువగా ఉందన్నారు. మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ నేతలు అప్పుల కుప్పగా మార్చారని, ఈవిషయాన్ని స్వయంగా కేంద్రమంత్రి నిర్మలాసీతారా మన్ చెప్పారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు సిగ్గు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉప ఎన్నికలు వస్తాయ ని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా కాంగ్రెస్దే విజయమని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీదే విజయం ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
సురక్షితమైన ఆహారం అందించాలి
జనగామ రూరల్: ప్రజలకు సురక్షితమైన ఆహారం అందించాలి.. ఆహార భద్రత పాటించకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల ఆధ్వర్యాన అదనపు కలెక్టర్ రోహిత్సింగ్, డీసీపీ రాజమహేంద్రనాయక్తో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆహార భద్రత పై ముందుగా ఆహార పదార్థాల తయారీ, విక్రయదారులకు అవగాహన కార్యక్రమం చేపట్టాలని, ఇందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని షెడ్యూలు ఇవ్వాలని సూచించారు. వినియోగదారులను ఆకర్షించేందుకు ఆహారంలో వినియోగిస్తున్న హానికర రంగులు, నిషేధిత ఎసెన్స్ వల్ల జరిగే పరిణామాల పై విక్రయదారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పారు. టాస్క్ ఫోర్స్ బృందం విస్తృత తనిఖీలు చేపట్టి ఆహార భద్రతలో నియమ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జునరావు, మహిళా శిశు సంక్షేమ అధికారి ఫ్లోరెన్స్, డీఏఓ రామారావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆహార భద్రత శాఖ ఉమ్మడి జిల్లా అధికారి కృష్ణమూర్తి, జిల్లా అధికారి వినీల్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి సాధిక్ అలీ పాల్గొన్నారు. పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తిచేయాలి: వీసీలో రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కేంద్ర ప్రభుత్వ నిధులతో పాఠశాలల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అన్నా రు. శుక్రవారం హైదరాబాద్ నుంచి పాఠశాల విద్య డైరెక్టర్ నర్సింహారెడ్డితో కలిసి నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్లో పీఎంశ్రీ, సమగ్ర శిక్ష పథకాల అమలు తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా యోగితా రాణా మాట్లాడుతూ.. జిల్లాలో పీఎంశ్రీ కింద ఎంపిక చేసిన 15 పాఠశాలల్లో అభివృద్ధి పనులకు విడుదలైన నిధులు, అలాగే అన్ని పాఠశాలల్లో పనులకు సమగ్ర శిక్ష కింద కేటాయించిన నిధులు, వాటి వినియోగంపై సూచనలు చేశారు. కేంద్రం నిధులతో చేపట్టిన పనులు ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేయాలని ఆదేశించారు. వీసీ అనంత రం కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో సోలార్ ఫెన్సింగ్ చేపట్టాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, గ్రీనరీ కోసం మొక్కలు నాటించాలని చెప్పారు. ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసి కూరగాయల పెంపకం చేపట్టాలని అన్నారు. పాఠశాల భవనాలు, తరగతి గదులకు కిటికీలు, తలుపుల మరమ్మతులు, హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
ముగిసిన ‘బడిబయటి పిల్లల’ సర్వే
జనగామ రూరల్: జిల్లాలో ఐదేళ్లు నిండిన బాల బాలికలందరినీ పాఠశాలల్లో చేర్పించాలనే లక్ష్యంతో గత నెల 10 నుంచి ప్రారంభించిన ‘బడిబయటి పిల్లల సర్వే’ ముగిసింది. క్షేత్రస్థాయిలో ప్రతి మండలంలో క్లస్టర్ వారీగా ఆవాస ప్రాంతంల్లోని ఇంటింటికి వెళ్లి విద్యాశాఖ సీఆర్పీలు సర్వే నిర్వహించారు. మొత్తం 210 మంది పిల్లలను అధికారులు గుర్తించా రు. స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, గ్రామ కార్యదర్శి, అంగన్వాడీ సిబ్బంది, ఆశ కార్యకర్తలు, గ్రామ పెద్దల సహాయంలో ఉమ్మడిగా సమావేశం నిర్వహించి విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ సిద్ధం చేసుకున్నారు. 33 కాలమ్స్ ఉన్న సర్వే పత్రంలో వారి వివరాలు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. గత ఏడాది బడిబయట ఉన్న 263 మంది పిల్లలను గుర్తించగా.. ఈ ఏడాది 210 మందిని గుర్తించారు.బడిలో చేర్పించడమే లక్ష్యం.. గ్రామ స్థాయి అధికారులు, ఉపాధ్యాయుల సమన్వయంతో సర్వే విజయవంతం చేశాం. విద్యాహక్కు చట్టం ప్రకారం బడి వయసు పిల్లలందరూ పాఠశాలల్లో చేరాలి. అందుకు జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నది. ప్రతీ ఆవాస ప్రాంతాన్ని పరిశీలించి బడికి వెళ్లని, డ్రాప్ఔట్ అయిన పిల్లలందరినీ బడిలో చేర్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. – రమేశ్, డీఈఓ జిల్లాలో గత ఏడాది, ఈ ఏడాది బడిబయటి పిల్లలను గుర్తించిన వివరాలు మండలాల వారీగా.. మండలం గత ఏడాది ఈ ఏడాది బచ్చన్నపేట 22 26 చిల్పూర్ 26 8 దేవరుప్పుల 10 16 స్టేషన్ఘన్పూర్ 22 33 జనగామ 20 36 కొడకండ్ల 8 8 లింగాలఘణపురం 28 9 నర్మెట 37 19 పాలకుర్తి 25 28 రఘునాథపల్లి 43 8 తరిగొప్పుల 6 2 జఫర్గఢ్ 16 17 మొత్తం 263 210 జిల్లాలో 210 మంది గుర్తింపు -
లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు
● డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు జనగామ : లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు అన్నారు. లింగనిర్ధారణ నిషేధ చట్టం అమలుపై శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. స్కానింగ్ సెంటర్లు తప్పనిసరి గా నియమ నిబంధనలు పాటించాలన్నారు. లింగనిర్ధారణను ఎవరూ ప్రోత్సహించవద్దని ఆగ, మగ ఇద్దరినీ సమానంగా చూడాలన్నా రు. ఆస్పత్రికి వచ్చే వారికి ఈ విషయమై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో చట్టం అమలు సలహా సభ్యులు లవకుమార్రెడ్డి, కన్నా పరశురాములు, రవీందర్రెడ్డి, వైద్యులు స్వప్న, లింగమూర్తి, రవీందర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.108 అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలిచిల్పూరు: అత్యవసర సమయంలో 108 అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలని జిల్లా ఆర్గనైజర్ మండ శ్రీనివాస్ కోరారు. మల్కాపూర్ పీహెచ్సీలోని అంబులెన్స్ వాహనాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. వాహనంలోని పరికరాల పనితీరును పరిశీలించారు. వేసవి సమీపించినందున వేడి, డీహైడ్రేషన్ సమయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి సిబ్బందికి సూచనలు చేశారు. ఈఎంటీ రాజేంద్రప్రసాద్, రమేశ్ పాల్గొన్నారు. న్యాయవాదుల నిరసనజనగామ రూరల్: రంగారెడ్డి జిల్లా కోర్టులో తొమ్మిదవ అడిషనల్ జడ్జిపై గురువారం జరిగిన దాడికి నిరసనగా జనగామ బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన శుక్రవారం న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. అనంతరం కోర్టు న్యాయవాదుల భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎనగందుల చంద్రరుషి మాట్లాడుతూ.. పోక్సో కేసు కింద జడ్జి శిక్ష విధించారనే కారణంతో దాడికి దిగడం సరికా దని, నిందితులను చట్టం ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నక్క సిద్దులు, న్యాయవాదులు నాగరాజు శర్మ, శ్రీరాం శ్రీనివాస్, రవీందర్రెడ్డి, కోట శంకర్, యుగేందర్, భిక్షపతి, లక్ష్మణస్వామి, రాంరెడ్డి, చంద్రశేఖర్ పాల్గొన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసంస్టేషన్ఘన్పూర్: క్రీడలతో దేహదారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కుమార్గౌడ్, చైర్మన్ పోగుల సారంగపాణి, స్టేషన్ఘన్పూర్ సీఐ జి.వేణు అన్నారు. పాంనూర్లో నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను శుక్రవారం వారు ప్రారంభించి మాట్లాడారు. ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తితో వ్యవహరించాలని, ఓటమిచెందిన వారు దిగులు చెందకుండా తమలోని లోపాలను సరిదిద్దుకుని క్రీడానైపుణ్యాన్ని మరింతగా పెంపొందించుకునేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యాన పాంనూర్లో సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఇందులో ఎంపికైన వారు ఈనెల 20 నుంచి వికారాబాద్లో జరిగే అంతర్జిల్లాల చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొననున్నారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గట్టయ్య, మండల ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లుయాదవ్, అసోసియేషన్ మండల ఉపాధ్యక్షుడు ఇనుగా ల గణేష్రెడ్డి, కుమార్, సుధాకర్, పొన్న బీరయ్య, ఒగ్గు రాజు, కరుణాకర్రెడ్డి, నరేందర్, అన్వర్, సలీం, జీవన్, రాజేందర్, సఫీర్ తదితరులు పాల్గొన్నారు. -
డీసీసీబీ, ‘పాక్స్’ల పదవీకాలం పొడిగింపు
సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్రంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పాక్స్) పాలకవర్గాల పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. మరో ఆరు నెలల పాటు పదవిలో కొనసాగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గం గడువు శుక్రవారంతో ముగియగా.. అదే రోజున మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే పదవీకాలం ముగిసిన గ్రామ పంచాయతీలు, ఎంపీపీ, జిల్లా పరిషత్లకు ప్రత్యేకాధికారులను నియమించిన విషయం తెలిసిందే. సహకార సంఘాలకు కూడా ప్రత్యేక అధికారుల నియామకం ఇబ్బందికరం కాగా.. పాలకవర్గాల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ‘పాక్స్’ల పదవీకాలం ఆరు నెలలు పొడిగించినట్లు చెబుతున్నారు. ఈ ఉత్తర్వుల ద్వారా ఉమ్మడి వరంగల్లో 91 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు పాలకవర్గాలు మరో ఆరు నెలల పాటు సేవలు అందించనున్నాయి. ఇదిలా ఉండగా.. సహకార సంఘాల పదవీ కాలం పొడిగించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ లు కాంగ్రెస్ పార్టీ నాయకులకు.. తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రజా ప్రభుత్వంలో సహకార సంఘాలకు అందిస్తున్న సహాయ సహకారాలకు ధన్యవాదాలని, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ సంఘాల బలోపేతానికి రాబోయే రోజుల్లో మరింత కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మరో ఆరు నెలలు కొనసాగే అవకాశం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం -
సాగునీరివ్వమంటే పట్టించుకోని ప్రభుత్వం
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ: దేవాదుల ప్రాజెక్టు ద్వారా గండిరామవరం, బొమ్మకూరు, కన్నెబోయినగూడెం, వెల్దండ, లద్నూర్, తపాస్పల్లి రిజర్వాయర్ల ను నింపి జనగామ నియోజకవర్గంలోని ఆయకట్టు ప్రాంతానికి సాగు నీరివ్వాలని కోరినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంద ని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. యాసంగి వరినాట్లు పూర్తయి నీళ్లకోసం రైతు లు తండ్లాతుంటే అధికారులు, ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను ఇరిగేషన్ ఏఈ, డీఈ, ఎస్ఈ, సీఈ, ఈఎన్సీ, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. అన్ని పంపులను బంద్ చేయడం సిగ్గుచేటన్నారు. దేవాదు ల వద్ద వెంటనే అన్ని పంపులు, మోటార్లను ఆన్ చేసి రిజర్వాయర్లు, చెరువులను నింపి పంటలను కాపాడాలని రైతుల తరఫున ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో అన్నదాతలతో కలిసి ప్రత్య క్ష ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఒక ప్రకటనలో హెచ్చరించారు. -
ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
జఫర్గఢ్: ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. మండలంలోని ఉప్పుగల్లు శివారు ఆకేరు వాగు పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ ర్యాంపులను ఆయన గురువారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కమిషనరేట్ వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాపై పోలీస్ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారన్నారు. ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నట్లు తెలిసిన వెంటనే 100 కి డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ శ్రీనివాసరావు, ఎస్సై రామ్చరణ్ పాల్గొన్నారు. ఇసుక కట్టడికి చెక్పోస్ట్ రఘునాథపల్లి: ఇసుక అక్రమ రవాణా కట్టడికి గురువారం మండలంలోని కోమల్ల టోల్ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును డీసీపీ రాజమహేంద్రనాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరత రాకూడదని ప్రభుత్వం, సీపీ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో ఇసుక ప్రాంతాలను గుర్తించామని.. వాగుల నుంచి వాహనాల ద్వారా ఇసుక తరలించకుండా జేసీబీలతో అడ్డుగా కందకాలు తవ్వించినట్లు తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే ఇసుకకు అనుమతి తప్పనిసరి అని.. అదనపు లోడ్, నకిలీ బిల్లులను గుర్తించినా కఠిన చర్యలు తప్పవని డీసీపీ తెలిపారు. స్టేషన్ఘన్పూర్ ఏసీపీ భీంశర్మ, జనగామ రూరల్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్రెడ్డి, స్టేషన్ఘన్పూర్ సీఐ వేణు, ఎస్సై నరేష్, ఏఎస్సై కట్టమల్లు తదితరులు ఉన్నారు.వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా -
ప్రేమ.. లక్ష్యం రెండూ ముఖ్యమే
రామన్నపేట: ‘ప్రేమించడానికి, ప్రేమను వ్యక్తీకరించడానికి ప్రేమికుల దినోత్సవం ఒక్క రోజు సరిపోదు. ప్రేమను పంచాలనుకుంటే ప్రతీ రోజు ప్రేమికుల దినోత్సవమే. ప్రేమించడం, ప్రేమ వివాహాలు చేసుకోవడం తప్పు కాదు. ప్రేమ మోజులో పడి తమ సమయాన్ని వృథా చేసుకుని లక్ష్యాలను వదిలిపెట్టి తల్లిదండ్రులకు చెడ్డ పేరు తేవడం తప్పు. పాఠశాల విద్య వయస్సులో, ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో ప్రేమపేరుతో విచ్చలవిడిగా తిరగడం సమంజసం కాదు. ఆ సమయంలో ఏర్పడేదంతా ఆకర్షణ మాత్రమే. ప్రేమకు, ఆకర్షణకు మధ్య మధ్య తేడా తెలుసుకుని సరైన వయస్సులో.. సరైన సమయంలో ప్రేమించడం, తల్లిదండ్రులను ఒప్పించడం.. లక్ష్యాలను సాధించి సంతోష జీవనం గడిపే ఆదర్శమైన ప్రేమ జంటగా నిలవాలి’ అని ఎల్బీ కళాశాల విద్యార్థులు అంటున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆ కళాశాలలో గురువారం ‘ప్రేమ–ఆకర్షణ’పై నిర్వహించిన సాక్షి చర్చా వేదికలో యువత తమ అభిప్రాయాలను వెల్లడించింది. తల్లిదండ్రులను ఒప్పించి ప్రేమికులుగా గెలవాలి సమయాన్ని వృథా చేసుకోవద్దు.. ‘ప్రేమ–ఆకర్షణ’పై సాక్షి చర్చా వేదికలో అభిప్రాయాలు వెల్లడించిన పలువురు విద్యార్థులు -
తనివితీరా మొక్కులు
● మేడారం మినీజాతరకు పోటెత్తిన భక్తులు ● ఉదయమే ఆలయాలకు వెళ్లిన వనదేవతలువనదేవతలకు భక్తులు తనివితీరా మొక్కులు చెల్లించారు. నిలువెత్తు బంగారం, కోడి, యాటలను సమర్పించారు. బుధవారం రాత్రి అంతా గద్దెల వద్ద జాగారం చేసిన పూజారులు గురువారం ఉదయం పొద్దుపొడువక ముందే అమ్మవార్లను తీసుకొని మేడారం, కన్నెపల్లి ఆలయాలకు తిరిగి వెళ్లారు. భక్తులతో అమ్మవార్ల గద్దెల ప్రాంగణం కిక్కిరిసింది. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసర ప్రాంతాల్లోని చెట్ల కింద వంటావార్పు చేసుకొని సహపంక్తి భోజనాలు చేశారు. మంత్రి సీతక్క అమ్మవార్లను దర్శించుకున్నారు. – ఎస్ఎస్ తాడ్వాయి– వివరాలు 8లోu -
ప్రభుత్వ వైద్యం ఎలా ఉంది?
జనగామ: సర్కారు వైద్యం ఎలా ఉంది.. డాక్టర్లు చూస్తున్నారా.. సేవలు బాగున్నాయా..? అంటూ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆరా తీశా రు. జనగామ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని గురువారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సదరం క్యాంపును పరిశీలించిన తర్వాత కలెక్టర్ నేరుగా జనరల్ వార్డులతోపాటు ఎమర్జెన్సీ సర్వీసులకు సంబంధించిన సేవలు ఎలా అందుతున్నాయో డాక్టర్ అనురాధతో కలిసి ప్రత్యక్ష్యంగా పరిశీలించారు. చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన చిన్నారి శంకరపల్లి రన్విత ఆరోగ్య పరిస్థితిపై కలెక్టర్ ఆరా తీశారు. పాపకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మహిళ, పురుష వార్డులను తనిఖీ చేసిన కలెక్టర్.. ఎలా ఉన్నారు.. ఎక్కడినుంచి వచ్చారు, డాక్టర్లు రోజులో ఎన్నిసార్లు వస్తున్నారు, టిఫిన్, భోజనం ఇస్తున్నారా.. అని చికిత్స పొందుతున్న వారి ని అడిగి తెలుసుకున్నారు. పెంబర్తి గ్రామానికి చెందిన వెంకటమ్మ, నర్మెట మండలం వెల్దండకు చెందిన నాగమ్మ సర్కారు వైద్యం బాగుందని స్పందించారు. కంటి వైద్య విభాగాన్ని సందర్శించి, సిటీ స్కాన్, లిఫ్ట్ ఏర్పాట్ల పనులను కలెక్టర్ పరిశీలించారు. ఆస్పత్రిలో శానిటైజేషన్ నిర్వహణ, పరిశుభ్రత పాటించాలని సూచించారు. 24 గంటలు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలన్నారు. డాక్టర్లు కేశవనాథ్, అశోక్, సజన్ కుమార్, సిబ్బంది, ఖాజా పాష ఉన్నారు. -
నేడు ప్రేమికుల దినోత్సవం
మా ఊరుకు 20 కిలోమీటర్ల దూరంలో మా పిన్ని కూతురు అత్తగారి ఇల్లు ఉంటుంది. మా చెల్లి అంటే అందరికి ఇష్టం. ఆమెకు కూడా మేం అంటే ప్రాణం. అందుకోసమే తరచూ నేను అక్కడికి వెళ్లేవాడిని. అక్కడ మా చెల్లి దగ్గరికి తన స్నేహితురాలు ప్రియాంక వచ్చేది. చెల్లిని కలిసినప్పుడు ఒకరోజు ప్రియాంకను పరిచయం చేసింది. ఆమె కూడా సరదాగా మాట్లాడేది. కానీ, అది ప్రేమగా మారుతుందని అనుకోలేదు. చూస్తూ ఉండగానే ఒకరోజు నేనంటే ఇష్టమని నా చెల్లెలికి చెప్పింది. ఈ విషయం చెల్లి నాకు చెప్పేందుకు తడబడినా.. చివరకు చెప్పింది. మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ప్రపంచంలో ప్రతీజీవి తోడు కోరుకుంటుంది. ఆ తోడు కోరుకోవడంలో ఆచితూచి అడుగులు వేయడం కీలకం. కుటుంబ పరిస్థితులు, తల్లిదండ్రులు అంటే గౌరవం, బాధ్యతలు అన్నింటిని సరిచూసుకుంటూ.. నచ్చిన జోడీని ఎంచుకోవడం, అదికూడా ఆకర్షణ కాకుండా జీవితంగా భావించి.. ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకునేందుకు సమయం తీసుకొని.. అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం అంటే.. ఒక మహాయజ్ఞంలాంటిదే. సరిగ్గా అదే జరిగింది మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్– ప్రియాంక దంపతుల ప్రేమ వివాహంలో. నేడు (శుక్రవారం) ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఐపీఎస్ సుధీర్ రాంనాథ్ కేకన్ తన ప్రేమ వివాహ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..చెల్లెలు కలిపిన బంధం -
దేవాలయ భూములను కాపాడాలి
పాలకుర్తి టౌన్: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దేవాలయా భూములు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షణకు రాష్ట్రస్థాయిలో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని అర్చక, ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డీవీఆర్ శర్మ, చైర్మన్ గంగు ఉపేంద్రవర్మ గురువారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను కలిసి వినతి పత్రం అందజేశారు. దేవాలయ వ్యవస్థలో 3 రకాలైన వేతన విధానంతో దేవాలయ అర్చక సిబ్బంది జీతాలు మిగతా సిబ్బంది వలె ఒకటో తేదీన రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. సమస్యను పరిష్కరించాలని కోరారు. సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుండిగల్ ఆనంద్ శర్మ, పంచాగకర్త డాక్టర్ అవసరాల ప్రసాద్శర్మ పాల్గొన్నారు. సేవాలాల్ జయంతిని విజయవంతం చేయండి పాలకుర్తి: గిరిజనుల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఈ నెల 15 విజయవంతం చేయాలని స్టేషన్ఘణపూర్ ఆర్డీఓ డీఎస్ వెంకన్న కోరారు. గురువారం పాలకుర్తిలో తహసీల్దార్ కార్యాలయంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని అధికారులు, గిరిజన నాయకుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్సవాలను రాజకీయాలకు అతీతంగా నిర్వహించుకోవాలన్నారు. జయంతి రోజున రాజకీయ పార్టీల ఫొటోలు, జండాలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకోకూడదని, చేస్తే తొలగిస్తామని తెలిపారు. సేవాలాల్ జయంతి సందర్భంగా 15న సేవాలాల్ నిర్మాణ మందిరం వద్ద భోగ్ బండారో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, చంద్రమోహన్, శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ వేణుగోపాల్ రెడ్డి, ఆర్ఐ రాకేష్, తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి తరిగొప్పుల : ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలిన డీఆర్డీఓ వసంత అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జీవనజ్యోతి రచనా మండల సమాఖ్య కార్యాలయంలో ఆరోగ్యంపై అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణలో వసంత పాల్గొని మాట్లాడుతూ ప్రతి రోజూ పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని అన్నారు. గ్రామాల్లో ప్రజలకు పోషక పదార్థాలపై అవగాహన కలించాలని సూచించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ రంగమ్మ, ఏఎన్ఎం వసంత, పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి, ఏపీఎం విజయ, సీసీలు రాములు, యాదగిరి, సిద్దులు, రాణి, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు. సాయి వైన్స్ సీజ్ జనగామ: జిల్లా కేంద్రంలో ట్రేడ్ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న సాయి వైన్స్ను సీజ్ చేసినట్లు మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గరువారం జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ కవర్ల నిర్వహణ, ట్రేడ్ లైసెన్స్లకు సంబంధించి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్లాస్టిక్ కవర్లను విక్రయిస్తున్న దుకాణ యజమానులకు జరిమానా విధించగా, ట్రేడ్ లైసెన్స్ లేని వైన్స్ను మూసి వేయించారు. ప్రతి ఒక్కరు ట్రేడ్ లైసెన్స్ పొందిన తర్వాతనే దుకాణాలను తెరుచుకోవాలని కమిషనర్ తెలిపారు. కమిషనర్ వెంట శానిటేషన్ ఇన్స్పెక్టర్ గోపయ్య, ప్రత్యేక అధికారి పులి శేఖర్ ఉన్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు 90 మంది గైర్హాజరు జనగామ రూరల్: జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 90 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జితేందర్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సెషన్లో జనరల్, ఒకేషనల్ 644 విద్యార్థులకు 577 మంది హాజరు కాగా 67 మంది గైర్హాజరయ్యారు. రెండో సెషన్లో జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 492కి 469 మంది విద్యార్థులు హాజరు కాగా 23 విద్యార్థులు గైర్హాజరయ్యారు. డీఐఈఓ జితేందర్ రెడ్డి దేవరుప్పుల కొడకండ్ల పరీక్ష కేంద్రాలను సందర్శించగా జిల్లా పరీక్ష నియంత్రణ అధికారులు శ్రీనివాస్, వి.శేఖర్ స్టేషన్ ఘనపూర్, జఫర్గఢ్ పరీక్ష కేంద్రాలను సందర్శించారు. జనగామ పట్టణం, కొడకండ్ల పరీక్ష కేంద్రాలను ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం తనిఖీలు చేపట్టింది. -
శుక్రవారం శ్రీ 14 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
మీరు ఏ వివాహం చేసుకుంటారు..ఉద్యోగం ముందు.. తర్వాతే ప్రేమ‘జీవితంలో ముందు ఉద్యోగం సాధించాక ప్రేమించుకోవచ్చు. ముందు ప్రేమ అంటే లక్ష్యం నెరవేరదు’ అని అంటున్నారు యువత. ప్రేమ – ఆకర్షణ, ప్రేమ పెళ్లి, పెద్దలు కుదిర్చిన పెళ్లి తదితర అంశాలపై నగరంలోని ఎల్బీ కాలేజీలో గురువారం 30 మంది యూత్ (ఆడపిల్లలు–అబ్బాయిలు)ను సాక్షి సర్వే చేసింది. వారు తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించారు. – రామన్నపేట పెద్దలు కుదిర్చిందిప్రేమించి పెద్దలను ఒప్పించి..ప్రేమన్యూస్రీల్151005 -
విద్యుత్ సరఫరాకు ముందస్తు కార్యాచరణ
జనగామ: వేసవిని దృష్టిలో ఉంచుకుని మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు ముందస్తు కార్యాచరణ చేపట్టినట్లు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ టి.వేణుమాదవ్ తెలిపారు. మంగళవారం సర్కిల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న సమ యంలో రోజురోజుకు విద్యుత్ డిమాండ్ ఉందన్నారు. జనగామ సర్కిల్ పరిధిలో ఈ నెలలో గరిష్ట విద్యుత్ వినియోగం 317.82 మెగావాట్లుగా నమోదు అయిందన్నారు. రాబోయే మూడు నెలల్లో గణనీయంగా పెరిగే అవకాశం ఉండటంతో అంచనాల ప్రకారం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగిందన్నారు. వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా ఎన్పీడీసీఎల్ శాఖ పూర్తి సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సేవలు సులభతరం.. విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సే వలను అందించే లక్ష్యంలో భాగంగా కొత్త సర్వీ సుల మంజూరీ సేవలను సులభతరం చేసినట్లు ఎస్ఈ టి. వేణుమాదవ్ తెలిపారు. నూతన విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో సాంకేతిక లోపంతో దానిని తిరస్కరిస్తే తక్షణమే ద రఖాస్తుదారుడి మొబైల్కు మెసేజ్ వస్తుందన్నారు. జతచేయాల్సిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించేందుకు మరోమారు అవకాశం కల్పించామన్నారు. ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాదవ్ -
ఒక నామినేషన్ తిరస్కరణ
● సంతకం పెట్టకుండా సమర్పించడంతో తిరస్కరించిన ఎన్నికల అధికారులు నల్లగొండ: వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సమర్పించిన నామినేషన్లలో ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించగా.. మొత్తం 23 మంది నామినేషన్లు సమర్పించారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం (స్క్రూట్నీ) నిర్వహించారు. స్వతంత్ర అభ్యర్థి తండు ఉపేందర్ నామినేషన్ పత్రంపై సంతకం పెట్టకుండా సమర్పించడంతో తిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మిగిలిన 22 మంది నామినేషన్లు నిబంధనలకు అనుగుణంగా ఉండటంతో వాటిని ఆమోదించినట్లు పేర్కొన్నారు. జేఎన్వీ ఏర్పాటు చేయాలని వినతి జనగామ: జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయం (జేఎన్వీ) ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ సంజయ్కుమార్, కేంద్ర నవోదయ విద్యాలయ సమితి కమిషనర్ ప్రాచీపాండేను మంగళవారం ఢిల్లీలో వరంగల్ ఎంపీ కడియం కావ్య కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో నవోదయ విద్యాలయం ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నాయని, ఎక్కువగా షెడ్యూల్డ్ కులాలు, తెగలు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్థల కేటాయింపునకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయమై వారు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. సస్యరక్షణ చర్యలు చేపట్టాలి బచ్చన్నపేట: అన్నదాతలు పంటల రక్షణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని, సమయానుకూలంగా మందులను చల్లుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో వ్యవసాయ సంచాలకులు ఎస్ఎస్ బీనాతో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నా రు. అనంతరం మండలంలోని కొన్నె గ్రామంలో పర్యటించి క్షేత్రస్థాయిలో పంటలను పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ జిల్లాలో 5,046 టన్నుల డీఏపీ, 110 ట న్నుల పొటాష్, 437 టన్నుల కాంప్లెక్స్, 3,427 మెట్రిక్ టన్నుల ఎరువుల లభ్యత ఉందన్నారు. ఇటీవల వరి పంటలు పసుపు రంగులోకి మారుతున్నాయని, దాని నివారణకు జింక్ వాడుకో వాలని సూచించారు. ఏదైన సమస్యల నివారణకు ఆయా గ్రామాల ఏఈఓలను సంప్రదించాలని తెలిపారు. డిజిటల్ క్రాప్ బుకింగ్ విధానాన్ని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి విద్యాకర్రెడ్డి, ఏఈఓ భాగ్యలక్ష్మి, రైతులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి జనగామ రూరల్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం డీసీసీ కార్యాలయంలో జనగామ నియోజకవర్గ పరిధిలోని మండల అధ్యక్షులు, మార్కెట్ చైర్మన్, యూత్ కాంగ్రెస్ నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ఇ ంటింటికీ చేరేలా ప్రచారం చేయాలన్నారు. ప్రతీ కార్యకర్త పార్టీకోసం పనిచేస్తే తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యకక్రమంలో మండల అధ్యక్షులు, యూత్ నాయకులు పాల్గొన్నారు. క్రీడలతో మానసికోల్లాసం క్రీడలతో యువత శారీరక, మానసికోల్లాసం కలుగుతుందని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ ఆధ్వర్యంలో ప్రెస్టన్ గ్రౌండ్లో రాజీవ్ గాంధీ స్మారక క్రికెట్ టోర్నమెంట్ పోటీలను కొమ్మూరి ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి, కుమార్, అనిరుధ్, ప్రమోద్లు పాల్గొన్నారు. -
ఆర్ఓ, ఏఆర్ఓల నియామకం
జనగామ: స్థానిక సంస్థల ఎన్నికల నేపఽథ్యంలో అధి కార యంత్రాంగం నిర్వహణ పనుల్లో నిమగ్నమయ్యారు. పంచాయతీ ఎలక్షన్ అధికారుల నియామ క ప్రక్రియ పూర్తి కాగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక ల కోసం మంగళవారం ఆర్ఓ, ఏఆర్ఓలను నియమిస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాను విడుదల చేశారు. ఎంపీటీసీ ఎలక్షన్ కోసం ఆర్ఓ, ఏఆర్ఓ (రిజర్వుడుతో) కలుపుకుని 55 మంది, జెడ్పీటీసీ కోసం ఆర్ఓలు 12 (ఒకరు రిజర్వుడు) 67 మందిని నియమించారు. ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం స్టేజీ–1 ఆఫీసర్ (ఆర్ఓ/గెజిటెడ్)–75(రిజర్వుడు–14 మంది), అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్– 75 (ఏఆర్ఓ/నాన్ గెజిటెడ్)(రిజర్వుడు–12 మంది), పంచాయతీ ఎన్నికల కోసం స్టేజీ–2 రిటర్నింగ్ ఆఫీసర్స్–280(రిజర్వుడు–25) మంది పని చేయనున్నారు. గతంలో మూడు దశల్లో ఎలక్ష న్లు నిర్వహించగా, ఈసారి అధికార యంత్రాంగం రెండు దశల్లోనే ముగించేలా ప్లాన్ చేస్తున్నారు. 13వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ జిల్లాలోని 12 మండలాల పరిధిలో 783 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను విడుదల చేయగా, 13వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ, అదే రోజు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం, 14న అభ్యంతరాల పరిశీలన, అనంతరం ఎలక్షన్ కమిషన్ ఆమోదం పొందడం జరుగుతుంది. 15న తుది పోలింగ్ స్టేషన్ల జాబితాను ప్రకటిస్తారు. బచ్చన్నపేట–81, చిల్పూరు–62, దేవరుప్పుల–68, స్టేషన్ఘన్పూర్–56, జనగామ–65, కొడకండ్ల–61, లింగాలఘణపురం–64, నర్మెట–41, పాలకుర్తి–106, రఘునాథపల్లి–85, తరిగొప్పుల–31, జఫర్గఢ్–63 పోలింగ్ కేంద్రాలను ముసాయిదా జాబితాలో ప్రదర్శించారు. జిల్లాలో స్థానిక సమరం నేపఽథ్యంలో ప్రకటించిన తుది జాబితాలో మొత్తం 4,0,1,101 ఓట్లు ఉండగా, మహిళలు 2,02,648, పురుషులు 1,98,448, అదర్స్ 5 ఉన్నారు. జిల్లాకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పుస్తకాలు, ఇతర మెటీరియల్ చేరుకోగా సంబంధిత అధికారులు అప్పగిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల ముసాయిదా విడుదల రెండు దశల్లో ఎన్నికల నిర్వహణకు కసరత్తు -
బీరు మరింత ప్రియం
జనగామ: బీరుప్రియులకు మత్తెక్కించే వార్త. వేస వి ప్రారంభంలోనే ధరలకు రెక్కలు రావడంతో చల్ల ని బీర్లు లాగేద్దామని ఉబలాట పడే బీరు ప్రేమికుల కు కాసింత నిరాశ అని చెప్పుకోవచ్చు. రెండు నెలలుగా మార్కెట్లో బీర్ల కొరత తీవ్రం కాగా.. ప్రస్తు తం పెరుగుతున్న ధరలతో సరిపడా స్టాక్ రానుంది. దీంతో ఇక కాటన్లకు కాటన్లు కొనుగోలు చేసుకో వచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత బీర్లపై 15 శాతం ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయగా.. కొత్త ధరలు మంగళవారం నుంచే అమలులోకి వచ్చా యి. జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పరిధిలో 47 మద్యం దుకాణాలతో పాటు పట్టణంలో ఐదు బార్లు ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు పెరిగాయి. జిల్లాలో రోజువారీగా రూ.47లక్షల అమ్మకాలు ప్రభుత్వం బీరు బాటిల్పై ప్రస్తుతం ఉన్న ధరపై 15 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.150 ఉన్న లైట్ బీరు ఇక నుంచి రూ.180, రూ.160 ఉన్న స్ట్రాంగ్ బీరు ఇక నుంచి రూ.190కి చేరనుంది. జిల్లాలో రోజువారీగా రూ.47లక్షల మేర (2,500 కాటన్లు) బీర్ల కాటన్లు అమ్మకాలు జరుగుతున్నాయి. ధరల పెరుగుదలతో బీరు ప్రియులపై రోజువారీగా రూ.7లక్షలకుపైగా అదనపు భారం ప డనుంది. మద్యం దుకాణాల్లో ప్రస్తుతం ఉన్న స్టా క్పై 15 శాతం పెంచి.. ఇందుకు సంబంధించిన ట్యాక్స్ను ప్రభుత్వం వసూలు చేయనుంది. బీర్ల ధ రల పెంపుపై సర్వత్రా విమర్శలు వ్యక్త మవుతుండగా.. ప్రతిపక్షాలు బాధుడు షురూ చేశారంటూ సె టైర్లు వేస్తున్నారు. కొద్ది రోజుల్లోనే లిక్కర్పై కూడా ధరలు పెరగనున్నాయనే ప్రచారం జరుగుతుంది. జిల్లాలో మద్యం దుకాణాలు, అమ్మకాల వివరాలు ఒక్కో బాటిల్పై 15శాతం పెంపు జిల్లాలో రోజువారీగా 2,500 కాటన్లకు పైగా అమ్మకాలు రూ.7 లక్షలకు పైగా భారం అమల్లోకి కొత్త ధరలుమద్యం దుకాణాలు :47 బార్లు :5 రోజువారీగా బీర్ల అమ్మకాలు :2,500 కాటన్లు నగదు రూపంలో :రూ.47లక్షలు పెరిగిన ధరలతో రోజువారీగా అదనపు భారం : రూ.7లక్షలు -
పన్నుల వసూళ్లలో వేగం పెంచాలి
జనగామ: జనగామ పురపాలిక పన్నుల వసూళ్లలో మరింత వేగం పెంచాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన ప్రత్యేక అధికారి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో కలిసి పన్నుల వసూళ్లు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాల సేకరణ, ఎల్ఆర్ఎస్, భవన నిర్మాణ అనుమతులు తదితర అంశాలపై సమీక్షించారు. మార్చి 31వ తేదీలోగా రూ.6.50 కోట్ల పన్నులకు గాను రూ.5 కోట్లు వసూలు (85శాతం) చేయాలన్నారు. పన్నుల వసూళ్లలో ప్రతిభ కనబర్చిన వారికి ఉత్తమ అధికారి అవార్డు అందించనున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో మున్సిపల్ మేనేజర్ రాములు, ఏఈ మహిపాల్, వార్డ్ ఆఫీసర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి జనగామ రూరల్: పాఠశాలల్లో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం జిల్లాలోని వివిధ పాఠశాలల్లో చేపట్టిన పనులపై సంబంధిత విద్యాశాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ కార్యాలయం నుంచి వీసీ ద్వారా సమీక్షించారు. పూర్తయిన పనులను ఎంబీ రికార్డ్ చేసి వెంటనే నివేదిక అందించాలన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారి రమేశ్, శ్రీనివాస్, శ్రీధర్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు ఇష్టంతో చదవాలి నర్మెట: విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మండలకేంద్రంలోని వినాయక గార్డెన్స్లో మంగళవారం డీఈఓ రమేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టెన్త్ విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమయానికి నిద్ర, మంచి ఆహారం, తగినంత నీరు తీసుకోవడం వంటి ఆరోగ్య సూత్రాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఆరోగ్యంగా ఉంటేనే విద్యపై ఆసక్తి కలుగుతుందన్నారు. ఓరియంటేషన్ కార్యక్రమాలు విద్యార్థుల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయన్నారు. అనంతరం విద్యార్థులకు పరీక్ష కిట్స్ను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ను ఉపాధ్యాయులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కలకుంట్ల వెంకట రామానుజా చార్యులు, ఎంఈఓ మడిపెల్లి ఐల య్య, ఏఎంఓ శ్రీనివాస్, కాంప్లెక్స్ హెచ్ఎంలు వే ణు, గోపాల్రెడ్డి, కమల, ఎస్సార్పీలు వాసుదేవ రెడ్డి, శామ్యూల్ ఆనంద్, త్రిపురారి పద్మ, వజ్రయ్య, నరసింహ మూర్తి, పవన్ శ్రవణ్కుమార్, సీఆర్పీలు దయాకర్, రవీందర్, సంపత్ పాల్గొన్నారు. రహదారులపై చెత్త వేస్తే జరిమానా విధించాలి మున్సిపల్ సమీక్షలో కలెక్టర్ రిజ్వాన్ బాషా -
‘మండమెలిగె ’కు పూజారులు సిద్ధం..
బుధవారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025– 8లోuమేడారం, కన్నెపల్లిలో మండమెలిగె పండుగకు పూజారులు సిద్ధమయ్యారు. మంగళవారం సమ్మక్క, సారలమ్మ పూజారులు సమావేశమై మండమెలిగె పూజా కార్యక్రమాలపై చర్చించుకున్నారు. బుధవారం, గురువారం రెండు రోజులు జరగనున్న పూజా కార్యక్రమాలపై సమావేశంలో సమీక్షించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పూజలు నిర్వహించాలని నిర్ణయించారు. దేవాదాయ శాఖ తరఫున పూజారులకు దుస్తులు, పూజా సామగ్రిని అధికారులు అందించారు. మండమెలిగె పండుగ సందర్భంగా మేడారం, కన్నెపల్లిలోని ఆదివాసీలు, ఆదివాసేతరులు తమ ఇళ్లను శుద్ధి చేసుకొని అమ్మవార్లకు పూజలు నిర్వహించనున్నారు. ఎస్ఎస్ తాడ్వాయి : ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క–సారలమ్మ మినీ జాత ర (మండమెలిగె) పండుగ నేటి (బుధవారం) నుంచి ప్రారంభంకానుంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరకు వివిధ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మేడారం, కన్నెపల్లిలోని ఆలయాలు, గద్దెల ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలిరానున్నారు. జాతర మొదటి రోజు (బుధవారం) మేడారం, కన్నెపల్లిలోని అమ్మవార్ల ఆలయాల్లో మండమెలిగె పండుగను సమ్మక్క–సారలమ్మ పూజారులు నిర్వహించనున్నారు. ముందుగా సమ్మక్క గుడి శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆడపడుచులు రంగవల్లులు వేసి ముస్తాబు చేస్తారు. డోలు వాయిద్యాలతో తూర్పు, పడమర పొలిమేర్లలో ధ్వజస్తంభాలు (దిష్టి తగలకుండా) మామిడి తోరణాలతో అలంకరిస్తారు. ముందుగా పూజారులు గ్రామ దేవతలకు పసుపు, కుంకుమ పెట్టి పూజలు చేస్తారు. అనంతరం గుడికి చేరుకొని అమ్మవారి దీప, ధూపాలతో పూజలు నిర్వహించి యాటతో నైవేద్యం సమర్పిస్తారు. రాత్రి సమయంలో పూజారులు అమ్మవారి పూజాసామగ్రి, పసుపు, కుంకుమలను తీసుకొని డోలు వాయిద్యాలతో గద్దెల వద్దకు వెళ్లి అమ్మవారి గద్దె వద్ద కూడా పూజలు చేస్తారు. అలాగే, కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో కూడా సారలమ్మ పూజారులు అమ్మవారికి పూజలు నిర్వహించి రాత్రి సమయంలో గద్దెల ప్రాంగణంలోకి తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తారు. సమ్మక్క–సారలమ్మ పూజారులు గద్దెల వద్ద కలుసుకొని శాకాహానం (ఇప్పపువ్వు సారా) ఇచ్చి పుచ్చుకొని రాత్రంతా గద్దెల వద్ద డోలు వాయిద్యాలతో జాగారం చేస్తూ సంబురాలు జరుపుకుంటారు. నేటినుంచి మినీ మేడారం (మండమెలిగె) ముస్తాబైన మేడారం ● ఆదివాసీ సంస్కృతీసంప్రదాయబద్ధంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలుముస్తాబైన గద్దెల ప్రాంగణం... దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని శుభ్రం చేసి విద్యుత్ దీపాలతో ఆలకరించారు. భక్తుల క్యూలైన్లపై చలువ పందిళ్లు వేశారు. మంచినీటి సౌకర్యం కల్పించారు. హైమాస్ట్ లైట్ల ఏర్పాటుతో పాటు అమ్మవార్ల గద్దెలు జిగేల్మనేలా సాలాహారం చుట్టూ విద్యుత్ దీపాలను అలంకరించారు. మధ్యాహ్నం సమయంలో ఎండతీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రాంగణ ఆవరణలో కాళ్లు కాలకుండా కూల్ పెయింట్ వేశారు. ప్రశాంతంగా అమ్మవార్ల దర్శనంన్యూస్రీల్జల్లు స్నానాలకు తిప్పలే..? -
తెలంగాణ బడిలో ఒడిశా విద్యార్థులు..
కేసముద్రం: ఇటుక బట్టీలో పని చేసేందుకు వచ్చిన ఒడిశా కార్మికులను ఒప్పించి, వారి పిల్లలను బడిలో చేర్పించారు.. వారికి అర్థమయ్యే భాష హిందీ లోనే పాఠాలు బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్పట్నం యూపీఎస్ టీచర్లు. వివరాలు ఇలా ఉన్నాయి.. మహమూద్పట్నం ఉమ్మడి జీపీ పరిధి కాలనీతండా సమీపంలోని ఇటుకబట్టీలో పనిచేసేందుకు ఇటీవల ఒడిశాకు చెందిన కొంతమంది కార్మికులు కుటుంబాలతో సహా వచ్చారు. తల్లిదండ్రులు పనులు చేస్తుండగా, బడిలో ఉండాల్సిన పిల్లలు వారివెంటే ఉంటున్నారు. ఈవిషయం తెలుసుకున్న మహమూద్పట్నం యూపీఎస్ హెచ్ఎం సురేశ్నాయుడు, టీచర్ సండ్ర రాధిక, సీఆర్పీ సుల్తానా వెళ్లారు. ‘ మీ పిల్లల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని మా బడికి పంపించండి’ అంటూ కార్మికులకు చెప్పారు. దీంతో 14 మంది పిల్లలను తల్లిదండ్రులు సోమవారం పాఠశాలలో చేర్పించారు. ఆ పిల్లలకు హెచ్ఎం సురేశ్నాయుడు, టీచర్ రాధిక, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ కే.ఉమారాణి విద్యాసామగ్రి అందజేశారు. పిల్లలకు అర్థమయ్యే భాష హిందీలోనే ఉపాధ్యాయులు పాఠాలు బోధించారు. కాగా, ఒడిశా పిల్లలను ఇక్కడి పాఠశాలలో చేర్పించడమేకాకుండా వారికి అర్థమయ్యే భాష హిందీలోనే బోధిస్తున్న ఉపాధ్యాయులను గ్రామస్తులు, విద్యావంతులు అభినందించారు. పాఠశాలలో చేర్పించిన మహమూద్పట్నం ఉపాధ్యాయులు పిల్లలకు అర్థమయ్యే భాష హిందీలోనే బోధన -
రోడ్డు ప్రమాదంలో సైట్ ఇంజినీర్ దుర్మరణం
● గొల్లచర్లలో ఘటన డోర్నకల్: రోడ్డు ప్రమాదంలో ఓ సైట్ ఇంజినీర్ దుర్మరణం చెందాడు. ఈఘటన మండలంలోని గొల్లచర్ల శివారు విద్యుత్ సబ్స్టేషన్ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయక్పల్లి గ్రామానికి చెందిన తాటికొండ రాజేశ్(28) డోర్నకల్లో జరుగుతున్న అమృత్ ఓవర్హెడ్ నిర్మాణ పనుల వద్ద సైట్ ఇంజినీర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి బైక్పై మహబూబాబాద్ నుంచి డోర్నకల్కు వస్తుండగా గొల్లచర్ల సబ్ స్టేషన్ మలుపు వద్ద వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన పడింది. ఈ ఘటనలో రాజేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది ఘటనాస్థలికి చేరుకునే సమయానికి మృతి చెందాడు. పోలీసులు రాజేశ్ మృతదేహాన్ని మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి సోదరుడు అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డోర్నకల్ సీఐ బి.రాజేశ్ తెలిపారు. మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం● కాంగ్రెస్ పార్టీలో విలువ ఉండడం లేదన్న వీడియో వైరల్ కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం విలాసాగర్ మాజీ సర్పంచ్ అందె సత్యనారాయణ సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పా ల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి అనంతరం మెరుగైన చికి త్స నిమిత్తం వరంగల్లోని ఎంజీఎంకు తీసుకెళ్లారు. ప్రస్తుతం సత్యనారాయణ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. కాగా, మాజీ సర్పంచ్ సత్యనారాయణ ఆత్మహత్యాయత్నానికి ముందు రికార్డు చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాంగ్రెస్ గెలుపు తర్వాత పార్టీలో చేరిన వారికే ప్రాధాన్యం ఉందని, ముప్పై ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న తన లాంటి నాయకులు, కార్యకర్తలకు విలువ లేదని వీడియోలో సత్యనారాయణ పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, ఈ విషయాన్ని పలుమార్లు మంత్రి శ్రీధర్బాబు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వీడియోలో వెలి బుచ్చారు. తన ఆత్మహత్యతోనైనా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని సత్యనారాయణ పేర్కొన్నారు. పలువురు కాంగ్రెస్ నాయకులు మాత్రం వీడియోలో సత్యనారాయణ వ్యాఖ్యలను ఖండించారు. నేడు రెడ్ రిబ్బన్ క్లబ్ల ప్రారంభం కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ జాతీయ సేవాపథకం (ఎన్ఎస్ఎస్ ) ఆధ్వర్యంలో మంగళవారం రెడ్రిబ్బన్ క్లబ్లు ప్రారంభించనున్నట్లు కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ సోమవారం తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం 11 గంటలకు సెనేట్ హాల్లో హెచ్ఐవీ, ఎస్టీఐపై జిల్లా స్థాయి అవగాహన నిర్వహించనున్నామని తెలిపారు. వీసీ కె. ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రం తదితరులు పాల్గొంటారని తెలిపారు. -
మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలు
పాలకుర్తి టౌన్ : శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలను అధికారులు సమన్వయంతో విజయవతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం ఆలయ కల్యాణ మండపంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో జాతరలో ప్రచార ఫ్లెక్సీలు ఏర్పా టు చేయొద్దన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు పీఆర్ శాఖ ఆధ్వర్యాన 130 మంది జీపీ సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. నాలుగుచోట్ల వాహనాల పార్కింగ్, గుట్టపైన దర్శనానికి వెళ్లే భక్తులకు క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. వరంగల్, తొర్రూరు, జనగామ, సూర్యాపేట డిపోల నుంచి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడించా ల ని సంబంధిత అధికారులకు సూచించారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ మాట్లాడుతూ బందోబస్తు కు 200 మంది పోలీసులను నియమించడంతో పాటు సీసీ కెమారులు, పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రైవేట్ వాహనాల పా ర్కింగ్కు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ట్రాన్స్కో డీఈ రాంబాబు మాట్లాడతూ జాతర ముగిసేంత వరకు నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీఎంహెచ్ఓ మల్లికార్జున్ మాట్లాడుతూ జారతలో భక్తులకు వైద్య సేవలు అందించేందుకు ఆలయ ఆవరణలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం మహాశిరాత్రి జాతర వాల్పోస్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో డీపీఓ స్వరూప, ఆర్టీఓ వెంకన్న, డీఆర్డీఓ వసంత, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ మహేందర్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాములు, ఆలయ ఈఓ మోహన్బాబు, సీపీఓ లక్ష్మీప్రసన్న, ఎస్సై పవన్కుమార్ పాల్గొన్నారు. అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలి సమీక్షలో కలెక్టర్ రిజ్వాన్ బాషా విద్యార్థులను కొట్టొద్దు : కలెక్టర్ ఉపాధ్యాయులు విద్యార్థులను కొట్టవద్దని.. ప్రేమతో చదువు నేర్పాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మండల కేంద్రంలోని తెలంగా ణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను అదనపు కలెక్టర్ రోహిత్సింగ్తో కలిసి సందర్శించారు. ఇటీవల గురుకుల పాఠశాలలో విద్యార్థినులను ఉపాధ్యాయురాలు కొట్టిన ఘటన గురించి ప్రిన్సిపాల్ స్వరూపను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల మధ్య గొడవను విద్యార్థుల మీదకు తేవద్దన్నారు. అనంతరం పదవ తరగతి విద్యార్థినులకు పాఠాలు బోధించారు. ఆయన వెంట ఆర్డీఓ వెంకన్న, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ రాకేష్ తదితరులు ఉన్నారు. -
31 కిలోల ఎండు గంజాయి స్వాధీనం
ఖిలా వరంగల్ : గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరె స్ట్ చేసి వారి వద్ద నుంచి 31కిలోల సరుకు స్వాధీనం చేసుకున్నట్లు ఆర్పీఎఫ్ ఎస్సై వెంకటేశ్వర్లు తెలి పారు. వరంగల్ రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ఆర్పీఎఫ్ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద మహారాష్ట్రలోని ఐరోలి కట్నానవీ గ్రామానికి చెందిన రాహుల్ రామ్ లఖన్ తివారీ, ముంబైలోని ఘున్సోలి థానే అంబేడ్కర్ నగర్కు చెందిన ఆశీష్ రామ్నాయక్ యాదవ్ అనుమానాస్పదంగా కనిపించారు. వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా రూ.7.75 లక్షల విలు వైన 31కిలోల గంజాయి లభ్యమైంది. వెంటనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీధర్కు అప్పగించినట్లు ఆర్పీఎఫ్ ఎస్సై పేర్కొన్నారు. కేసముద్రంలో నాలుగు కిలోలు.. కేసముద్రం: పోలీసులు నాలుగు కిలోల గంజాయిని పట్టుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై మురళీధర్రాజు కథనం ప్రకారం.. కేసముద్రం మండలం ఇంటికన్నెకు చెందిన బానోత్ హరినాఽథ్, బయ్యారం మండలం బాల్య తండాకు చెందిన గుగులోత్ చరణ్, మరిపెడ మండలం గమ్యతండాకు చెందిన లునావత్ ప్రవీణ్ రైలులో ఒడిశాకు వెళ్లారు. అక్కడ నబీన్ప్రధాన్ అనే వ్యక్తి వద్ద రూ.లక్ష విలువైన నాలుగు కిలోల గంజాయి కొనుగోలు చేసి రైల్లో మహబూబాబాద్కు చేరుకున్నారు. అక్కడి నుంచి సోమవారం కేసముద్రం వచ్చారు. ఉప్పరపల్లి రోడ్డువైపు వాహనం కోసం ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో అటువైపు సిబ్బందితో వెళ్లిన ఎస్సైకి వారు అనుమానాస్పదంగా కనిపించడంతో విచారించారు. నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు రూరల్ సీఐ, ఎస్సై తెలిపారు. వరంగల్లో 1,280 గ్రాములు.. వరంగల్: వరంగల్ గోవిందరాజులగుట్ట వద్ద గిర్మాజీపేటకు చెందిన వీరమల్ల సరోజిని, భూపాలపల్లి జిల్లా కారల్మార్క్స్కాలనీకి చెందిన మహ్మద్ అజార్ వద్ద సుమారు రూ.32వేల విలువైన 1,280 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ షుకుర్ తెలిపారు. సోమవారం వీరి వద్ద గంజాయి లభించగా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గంజాయి చాక్లెట్లు స్వాధీనం.. గీసుకొండ : కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో పోలీసులు సోమవారం ముగ్గురి నుంచి 36 గంజా యి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. పార్కు వద్ద గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఎస్సై ప్రశాంత్బాబు సిబ్బందితో వెళ్లారు. బిహార్కు చెందిన సన్నీ కుమార్, ఉత్తర్ప్రదేశ్కు చెందిన వివేక్యాదవ్, మధ్యప్రదేశ్కు చెందిన శుభం విశ్వకర్మను పట్టుకున్నారు. ఒక్కొక్కరి వద్ద 12 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్సై చెప్పారు. ఇద్దరి అరెస్ట్.. ఆర్పీఎఫ్ ఎస్సై వెంకటేశ్వర్లు వెల్లడి -
జాతర నాలుగు రూట్లుగా విభజన..
మినీ మేడారం జాతరను పోలీసు శాఖ నాలుగు రూట్లుగా విభజించింది. 15 రోజుల నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉండడంతో రూట్లను ఏర్పాటు చేసి అధికారులను కేటాయించింది. రూట్–1హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వాహనాలు పస్రా–వెంగళాపురం–నార్లాపూర్–కొత్తూరు మీదుగా జంపన్నవాగు, హరిత జంక్షన్ ద్వారా ఐటీడీఏ గెస్ట్ హౌస్ వెనుక నుంచి అమ్మవారి ఎదురుకోళ్ల గుడి పక్కకు చేరుకుని ఇక్కడ పార్క్ చేయాలి. ఎదురుకోళ్లగుడి పార్కింగ్లో స్థలం లేకపోతే వాహనాలకు హరిత హోటల్, ఇంగ్లిష్ మీడియం పాఠశాల ఎదుట పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నారు. తిరుగు ప్రయాణంలో హరిత వై జంక్షన్, ఇంగ్లిష్ మీడియం స్కూల్, ఆర్టీసీ బస్టాండ్, ఎలుబాక మీదుగా చింతల్ క్రాస్కు చేరుకునేలా రూట్ ఏర్పాటు చేశారు. రూట్–2 భూపాలపల్లి, కరీంనగర్ మీదుగా వచ్చే భక్తుల వాహనాలు నార్లాపూర్, కొత్తూరు, జంపన్నవాగు మీదుగా ఎదురుకోళ్లగుడికి చేరుకోవాలి. తిరుగు ప్రయాణం రూట్–1 వాహనాలతో పాటే చింతల్ క్రాస్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. రూట్–3ఛత్తీస్గఢ్, భద్రాద్రికొత్తగూడెం, ఏటూరునాగారం ప్రాంతాల వైపు నుంచి వచ్చే భక్తుల వాహనాలు ఎస్ఎస్ తాడ్వాయి మండలంలో అమ్మవారి ఆర్చ్ మీదుగా మేడారం సమీపంలోని శ్రీరాంసాగర్ చెరువు నుంచి వీఐపీ పార్కింగ్కు వెళ్లాల్సి ఉంటుంది. తిరుగు ప్రయాణం కూడా ఇదే రూట్లో ఉంటుంది. రూట్–4హైదరాబాద్, వరంగల్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు పస్రా–ఎస్ఎస్తాడ్వాయి మీదుగా బస్టాండ్కు చేరుకోవాలి. భూపాలపల్లి, కరీంనగర్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు చింతల్ క్రా స్–ఎలుబాక మీదుగా ఆర్టీసీ బస్టాండ్కు చేరుకోవాలి. అక్కడి నుంచి జంపన్నవాగు, అమ్మవారి గద్దెలకు నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. భక్తుల సంఖ్య తక్కువ ఉంటే స్థానికంగా ఆటోలను ఏర్పాటు చేయనున్నారు. ఇక వీవీ ఐపీ పార్కింగ్కు నేరుగా వెళ్లాలనుకునే భక్తులు శ్రీరాంసాగర్చెరువు మీదుగా చేరుకోవాలి. -
వరంగల్ జిల్లాకు చేరుకున్న సర్వే హెలికాప్టర్
● నేడు వర్ధన్నపేటలో ఏరియల్ సర్వేకాజీపేట రూరల్ : మున్సిపాలిటీల పూర్తి వివరాలు (స్థలాలు, ఇళ్లు, భవనాలు, చెరువులు, గుట్టలు, రోడ్లు, హాస్పి టళ్లు, తదితర సమాచారం) తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా వంద మున్సిపాలిటీలను ఎంపిక చేసింది. ఇందులో తెలంగాణ నుంచి పది ఎంపికయ్యాయి. నక్ష ద్వారా జియో ట్యాగింగ్, టుడీ/త్రీడీ మ్యాపింగ్తో ఆయా మున్సిపాలిటీల్లో ఆర్.వి. అసోసియేట్ ఏజెన్సీ ద్వారా హెలికాప్టర్తో ఏరియల్ సర్వే చేస్తోంది. ఈ నేపథ్యంలో పైలట్ ప్రాజ్టెక్లో భాగంగా వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాలను సర్వే చేయడానికి హెలికాప్టర్ నగరంలోని సేయింట్ గ్యాబ్రియల్ స్కూల్లో ల్యాండ్ అయింది. ఆది, సోమవారాల్లో జగిత్యాల, హుస్నాబాద్లో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు. మంగళవారం వర్ధన్నపేట మున్సిపాలిటీ ప్రాంతంలో సర్వే చేయనున్నారు. ఏరియల్ సర్వేకు కమిటీ సభ్యులుగా వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్, జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ల్యాండ్ రికార్డు అధికారి, ఇరిగేషన్ ఈఈ, ఆర్అండ్బీ ఈఈ, డీపీఓ, వర్ధన్నపేట ఏసీపీ ఉన్నారు. సర్వే హెలికాప్టర్ను సందర్శించిన కలెక్టర్ సత్యశారద కాజీపేట సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ గ్రౌండ్లో ల్యాండ్ అయిన హెలికాప్టర్ను వరంగల్ కలెక్టర్ సత్యశారద సందర్శించారు. ఈ సందర్భంగా ఏరియల్ సర్వే వివరాలు తెలుసుకున్నారు. నావిగేటర్ నిదేశ్కుమార్, మేనేజర్ మల్లారెడ్డి ఏరియల్ సర్వే సిస్టమ్, ప్రాంతాల మ్యాపింగ్, టెక్నాలజీ, ఫొటోగ్రఫీ క్యాప్చరింగ్, రికార్డు సిస్టమ్, ఇతర సాంకేతికపర వివరాలను కలెక్టర్కు వివరించారు. -
క్రీడలతో తెలంగాణ కీర్తిని చాటాలి
మామునూరు : క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించి, తెలంగాణ కీర్తిని చాటాలని కేయు ప్రొఫెసర్ కె.రాంచందర్, సాఫ్ట్బాల్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ తాబేటి రాజేందర్, ఉపాధ్యక్షుడు పెరుమాండ్ల సాంబమూర్తి పేర్కొన్నారు. ఖిలావరంగల్ మండలం బొల్లికుంట వాగ్దే వి ఇంజనీరింగ్ కళాశాల క్రీడా మైదానంలో హనుమకొండ సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల సాఫ్ట్బాల్ పోటీలు సోమవారం ముగిశాయి. ము ఖ్యఅతిథులుగా వారు హాజరై పలు జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులును పరిచయం చేసుకున్నారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ.. మరుగున పడిపోతున్నా గ్రామీణ క్రీడలను వెలికితీసి ప్రోత్సహించే ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో హైదరాబాద్ జట్టు విజేతగా నిలువగా.. రెండు, మూడో స్థానంలో మెదక్, రంగారెడ్డి జట్లకు ట్రోఫీ, బహుమతులను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ పి.సాంబశివ రావు, నీవన్, అభిషేక్, కోచ్ కృష్ణ, ప్రమోద్కుమార్, అశోక్బాబు, అభినవ్, వినయ్కుమార్, రాజేశ్వర్, నాగరాజు, సుమలత, వినయ్, మధు, సృజన, రవి, శశాంక్, ప్రశాంత్, భగత్, లక్ష్మీపతి, నరేశ్, అర్జున్, సుష్మ, వెన్నెల,పలు జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. -
భక్తుల సౌకర్యార్థం టోల్ ఫ్రీ నంబర్
మినీ మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ములుగు కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసి 18004257109 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో పాటు షిఫ్ట్ల వారీగా ముగ్గురు అధికారులను సహాయకులుగా కేటాయించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జూనియర్ అసిస్టెంట్ శివకుమార్(9010738645), మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు జూనియర్ అసిస్టెంట్ రాకేశ్(9966454235), రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు జూనియర్ అసిస్టెంట్ దిలీప్(8555955540)ను కేటాయిస్తూ కలెక్టర్ దివాకర ఉత్తర్వులు జారీ చేశారు. -
భద్రత.. భారీగా
మినీ మేడారానికి పటిష్ట బందోబస్తు ● విధులకు వెయ్యి మంది పోలీసులు ● బుధవారం నుంచి ఆదివారం వరకు డేగకళ్లతో నిఘా ● జాతరకు పోలీసు శాఖ ఏర్పాట్లు పూర్తిములుగు: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న మినీ జాతరకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే రోజు వారీగా 60 నుంచి 100 మంది బందోబస్తు చేపడుతుండగా బుధవారం జరిగే మండమెలిగె నుంచి మినీ జాతర పూర్తయ్యే వరకూ జిల్లాలోని తొమ్మిది మండలాల్లో విధులు నిర్వర్తిస్తున్న సివిల్, ఏఆర్, సీఆర్పీఎఫ్ నుంచి వెయ్యి మందికి ఎస్పీ శబరీశ్ డ్యూటీలు కేటాయించారు. ములుగు డీఎస్పీ నలువాల రవీందర్ పర్యవేక్షణ చేస్తున్నారు. వచ్చే ఆదివారం వరకు భద్రతాచర్యలు కొనసాగనున్నాయి. షిప్టుల వారీగా కేటాయించే విధులకు ఓఎస్డీ మహేశ్ బాబాసాహెబ్ గితే, ట్రాఫిక్ కంట్రోల్కు ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, ట్రాఫిక్ పర్యవేక్షకులుగా ఏటూరునాగారం సీఐ శ్రీనివాస్, ములుగు సీఐ శంకర్ వ్యవహరించనున్నారు. ఇక ఆలయ ప్రాంతంలో అడిషనల్ ఎస్పీ (ఏఆర్) సదానందం, డీసీఆర్బీ డీఎస్పీ కిశోర్కుమార్ బందోబస్తు చేపడుతారు. ములుగు డీఎస్పీ రవీందర్, పస్రా సీఐ రవీందర్ పర్యవేక్షణ చేయనున్నారు. స్నానఘట్టాలు, దుస్తులు మార్చుకునే గదులు, గద్దెల ప్రాంగణంలో మహిళా సిబ్బంది.. జంపన్నవాగుపై ఏర్పాటు చేసిన స్నానఘట్టాలు, దుస్తులు మార్చుకునే గదులు, అమ్మవార్లను దర్శించుకునే మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మహిళా ఎస్సైలు, కానిస్టేబుళ్లుకు విధులు కేటాయించారు. సుమారు 60 నుంచి 100 మందికి షిప్టుల వారీగా డ్యూటీలు కేటాయించారు. ఇక చోరీలు, పిక్ప్యాకెటింగ్, అనుమానిత వ్యక్తులను గుర్తించడానికి బ్లూకోల్ట్స్తో పాటు ప్రత్యేక సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు. జాతరకు ఏర్పాట్లు పూర్తి మినీ మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ సారి వెయ్యి మందితో ట్రాఫిక్, శాంతిభద్రతలను పర్యవేక్షించనున్నాం. భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని షిప్టుల వారీగా సిబ్బంది సంఖ్య పెంచుతాం. భక్తుల సౌకర్యార్థం ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు, రూట్ మ్యాప్ల సైన్ బోర్డులను ఏర్పాటు చేశాం. జంపన్నవాగుపై స్థలం తక్కువ ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఆగే భక్తులు కొంత సమన్వయంతో వాహనాలను క్రమపద్ధతిలో పార్క్ చేసుకోవాలి. ఎవరికై నా సమస్య తలెత్తితే బందోబస్తులో ఉన్న పోలీసు అధికారుల సాయం కోరాలి. – డాక్టర్ శబరీశ్, ఎస్పీ, ములుగు -
నూతన విద్యుత్ సర్వీసుల మంజూరు సులభతరం
● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాదవ్ జనగామ: వినియోగదారులకు మెరుగైన సేవలందించే చర్యల్లో భాగంగా కొత్త విద్యుత్ సర్వీసుల మంజూరు సేవలను సులభతరం చేసినట్లు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ టి.వేణుమాదవ్ తెలిపారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ నూతన కనెక్షన్ దరఖాస్తును సాంకేతిక లోపంతో తిరస్కరించకుండా చర్యలు తీసుకుంటామని, నిబంధనల మేరకు పత్రాలు సమర్పించుకునేందు కు మరో అవకాశం ఇస్తామని చెప్పారు. ఇందుకు వినియోగదారుడి ఫోన్కు మెసేజ్ రూపంలో సమాచారం పంపిస్తామని తెలిపారు. ధ్రువీరణ పత్రాల ను నిర్దిష్ట సమయంలో సమర్పిస్తే ఆలస్యం కాకుండా కనెక్షన్ ఇచ్చే వీలుందని వివరించారు. వినియోగదారులు అప్లికేషన్ ఏస్టేజీలో ఉందో తెలుసుకునేందుకు కొత్తగా ట్రాకింగ్ వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం 1912 టోల్ఫ్రీ నంబర్లో సంప్రదించాలని కోరారు. -
మహాకుంభాభిషేకం విజయవంతం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని కాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థానంలో మూడు రోజులపాటు వైభవోపేతంగా నిర్వహించిన మహాకుంభాభిషేక మహోత్సవాలకు సహకరించిన ప్రతీ ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఈఓ ఎస్.మహేశ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్ రాహుల్శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగుల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసి మహాకుంభాభిషేక ఘట్టం దిగ్విజయం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరే, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, మీడియాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.● కాళేశ్వరం దేవస్థానం ఈఓ ఎస్.మహేశ్ -
ఇద్దరు పిల్లలకు విషమిచ్చిన తల్లి
డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం జోగ్యాతండాలో అమానుషం జరిగింది. తల్లి తన కుమారుడు, కుమార్తెకు కూల్డ్రింక్లో గడ్డిమందు కలిపి తాగించింది. ఇద్దరు చిన్నారులు హైదరాబాద్లోని నీలో ఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పిల్లల నానమ్మ ఫిర్యాదుతో సోమవారం ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగ్యాతండాకు చెందిన ఆటోడ్రైవర్ వాంకుడోత్ వెంకటేశ్కు ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాలకు చెందిన ఉషతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి వరుణ్తేజ్, నిత్యశ్రీ చిన్నారులు ఉన్నారు. వెంకటేశ్ అనారోగ్యంతో నాలుగు నెలల క్రితం చనిపోయాడు. ప్రస్తుతం ఉష తన పిల్లలతో వెంకటేశ్ తల్లిదండ్రులు వాంకుడోత్ శ్రీను, బుజ్జి ఇంటిలోని ఓ గదిలో నివాసం ఉంటుంది. ఈ నెల 5న ఉష బయటకు వెళ్లిన సమయంలో వరుణ్తేజ్, నిత్యశ్రీ ఆడుకుంటూ ఒక్కసారి కిందపడి వాంతులు చేసుకున్నారు. నానమ్మ బుజ్జితోపాటు బంధువులు పిల్లలను పరిశీలించగా ఆకుపచ్చ రంగులో వాంతులు చేసుకుంటుండగా ఏమైందని అడగగా, అమ్మ కూల్డ్రింక్ తాగించిందని తెలిపారు. ఉష ఇంటికి రాగానే పిల్లలను ఖమ్మంలోని ఓప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులపాటు చికిత్స అందించిన వైద్యులు పిల్లల శరీరాల్లో పురుగుమందు ఆనవాళ్లు ఉన్నాయంటూ అనుమానం వ్యక్తం చేయడంతో బంధువులు, కుటుంబసభ్యులు ఉషను నిలదీశారు. దీంతో ఆమె పిల్లలకు కూల్డ్రింక్లో గడ్డి మందు కలిపి తాగించినట్లు ఒప్పుకుంది. బంధువులు ఉష ఇంట్లో వెతకగా అరలీటర్ గడ్డి మందు డబ్బా లభ్యమైంది. పిల్లల పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఆ చిన్నారుల్లో నిత్యశ్రీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విచారణ చేస్తున్నాం.. పిల్లలకు గడ్డి మందు తాగించిన ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు డోర్నకల్ సీఐ బి.రాజేశ్ తెలిపారు. సిబ్బందిని హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి పంపి విచారణ చేస్తున్నట్లు చెప్పారు.తల్లి ఆత్యహత్యాయత్నం... పిల్లలకు గడ్డిమందు తాగించినట్లు అందరికీ తెలియడంతో మూడు రోజుల క్రితం ఉష ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమె సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకుని సోమవారం నీలోఫర్ ఆస్పత్రికి వచ్చినట్లు తెలిసింది.హైదరాబాద్లో చికిత్స పొందుతున్న చిన్నారులు నానమ్మ ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి.. అందరికీ తెలిసిందని తల్లీ ఆత్మహత్యాయత్నం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం జోగ్యాతండాలో ఘటననానమ్మ ఫిర్యాదుతో వెలుగులోకి.. పిల్లలకు గడ్డిమందు తాగించినట్లు తల్లి ఒప్పుకోవడంతో పిల్లల నానమ్మ బుజ్జి సోమవారం డోర్నకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. బుజ్జి విలేకరులతో మాట్లాడుతూ తమ కోడలు ఉష ప్రవర్తనపై తమకు అనుమానాలు ఉన్నాయని, తన స్వేచ్ఛకు పిల్లలు అడ్డుగా ఉన్నారనే వారికి గడ్డి మందు తాగించిందని ఆరోపించింది. తన కుమారుడు వెంకటేశ్ మృతి పట్ల కూడా అనుమానాలు ఉన్నాయని, ఉషకు సంబంధించి సెల్ఫోన్ డేటాను పరిశీలించాలని బుజ్జి డిమాండ్ చేసింది. -
మినీ మేడారానికి సిద్ధం
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మినీ జాతరకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న జాతరకు వచ్చే భక్తుల సేవల కోసం అన్ని ఏర్పాట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆర్టీసీ బస్టాండ్ కంట్రోల్ పాయింట్ ఏర్పాటు చేశారు. ఆగ్ని ప్రమాదాలు సంభవిస్తే నివారించేందుకు మేడారం ఎండోమెంట్ కార్యాలయంలో ఒక ఫైర్ ఇంజన్ను అందుబాటులో ఉంచారు. అడుగడుగునా నిఘా.. మేడారంలో భక్తుల రద్దీని, దొంగలు చేతివాటం ప్రదర్శించకుండా నిత్యం పర్యవేక్షించేందుకు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం, ఆర్టీసీ వై జంక్షన్, మేడారం ఐలాండ్ ప్రాంతం, గద్దెల ప్రాంగణం, జంపన్నవాగు తదితర ప్రాంతాల్లో గతంలో ఉన్న సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించారు. అన్నింటినీ మేడారంలోని కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానించారు. ఫుటేజీల ను నిత్యం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. తాత్కాలిక డ్రెస్సింగ్ గదుల ఏర్పాటు జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద భక్తులు దుస్తులు మార్చుకునేందుకు జీఆర్ షీట్స్తో 10 తాత్కాలిక డ్రెస్సింగ్ గదులను అందుబాటులో ఉంచారు. భక్తుల జల్లు స్నానాల కోసం 10 బాటరీ ఆఫ్ ట్యాప్లను ఏర్పాటు చేశారు. ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు జిల్లా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులు అమ్మవార్లకు మొక్కుగా కోళ్లను సమర్పిచండం ఆనవాయితీ. ఎక్కడపడితే అక్కడ కోళ్లు, మేకల వ్యర్థాలు వేయకుండా షాపుల వద్ద డస్ట్బిన్లను ఏర్పాటు చేశారు. గద్దెల సమీపంలో, రోడ్ల వెంట, భక్తులు విడిది చేసే షెడ్ల వద్ద ఈగలు, దోమలు వ్యాపించకుండా కెమికల్ పిచికారీ చేశారు. ముగింపు దశకు చేరుకున్న పనులు రేపటినుంచి 15వ తేదీ వరకు జాతరభద్రత.. భారీగా జాతర విధులకు వెయ్యి మంది సిబ్బంది బుధవారం నుంచి ఆదివారం వరకు కొనసాగనున్న బందోబస్తు– వివరాలు 8లోu