Jangaon District Latest News
-
ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
జనగామ రూరల్: ఎన్నికల విధుల్లో ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని భువనగిరి పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు సాయన్ దెబర్మ అన్నా రు. సోమవారం ఆయన జిల్లా కేంద్రానికి రాగా కలెక్టర్ రిజ్వాన్ బాషా స్వాగతం పలికి పూల మొక్క అందజేశారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశీ లకులు మాట్లాడుతూ.. ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. అభ్యర్థుల ఎన్నికల వ్యయాలపై పరిశీలించి ఎప్పటికప్పు డు సమాచారం ఇవ్వాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పింకేష్కుమార్, డీసీపీ సీతారాం, ఆర్డీఓలు కొమురయ్య, వెంకన్న, నోడల్ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలి ఓటు హక్కు ఎంతో విలువైనది.. ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా స్వీప్ నోడల్ అధికా రి వినోద్కుమార్ అన్నారు. సోమవారం చౌడారం కేజీబీవీ విద్యార్థులతో స్థానిక బస్టాండ్లో ఫ్ల్లాష్ మాబ్ నిర్వహించారు. విద్యార్థులకు, ప్రజలకు ఓటు హక్కు ప్రాముఖ్యతను విరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరుగా నమోదు చేసుకున్న వారు జాబితాలో పేర్లు సరిచూసుకో వా లని సూచించారు. ప్రలోభాలాకు లొంగకుండా నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకోవా లని కోరారు. డీఈఓ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు సాయన్ దెబర్మ -
108 సిబ్బందికి రాష్ట్ర స్థాయి అవార్డు
స్టేషన్ఘన్పూర్: ఉత్తమ సేవలు అందిస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడినందుకు స్టేషన్ఘన్పూర్ 108 ఎమర్జెన్సీ సర్వీస్ సిబ్బంది ఈఎంటీ హరికృష్ణ, పైలట్ యాకయ్య కు రాష్ట్ర స్థాయి పురస్కారం లభించింది. ఈమేరకు హైదరాబాద్ మేడ్చల్లోని ప్రధాన కార్యాలయంలో 108 సీఈఓ ఖాలిద్, డైరెక్టర్ వెంకటేశం చేతుల మీదుగా సోమవారం అవార్డు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రోగ్రాం మేనేజర్ నసీరుద్దీన్, మేనేజర్ శ్రీనివాస్ అభినందించారు. ఇంటి పన్నుపై 5శాతం రాయితీ జనగామ రూరల్: ఇంటి పన్ను ముందుగా చెల్లించిన వారికి ప్రభుత్వం 5 శాతం రాయితీ కల్పించిందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన పన్నుల వసూలు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పన్ను చెల్లించడానికి వచ్చిన వారికి రాయితీ వివరాలు వివరించి పలువురికి రశీదు అందజేశారు. అనంతరం నర్సరీని సందర్శించి న అదనపు కలెక్టర్.. వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి లేకుండా మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకో వాలని నిర్వాహకులకు సూచించారు. మున్సిప ల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు. విద్యుత్ ప్రమాదాలను నివారించాలి స్టేషన్ఘన్పూర్: విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఎన్పీడీసీఎల్ జనగామ ఎస్ఈ వేణుమాధవ్ అన్నారు. స్థానిక ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం విద్యుత్ ప్రమాదా ల నివారణపై డీఈ ఎం.హుస్సేన్నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. నిరంతర సేవలందించే విద్యుత్ సిబ్బంది విధి నిర్వహణలో తడబాటుకు గురికా కుండా ఏకాగ్రతతో ఉండాలని సూచించారు. ఎస్ఏఓ జయరాజ్, టెక్నికల్ డీఈ ప్రభావతి, స్టేషన్ఘన్పూర్ ఏడీఈ సత్యనారాయణ, ఏడీఈ ప్రొటక్షన్ శ్రీరామ్, ఎస్పీఎం సుజాత, భువనేశ్వరి, మాస్టర్ ట్రెయినర్లు మహేందర్రెడ్డి, యాదగిరి, ఏఈలు, సబ్ ఇంజనీర్లు, ఐఎన్టీయూసీ నాయకులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం వద్దు : కొమ్మూరి జనగామ: వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్ల విషయంలో అలసత్వం చేయకుండా వెంటనే చేపట్టాలని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. తేమ 17 శాతం ఉన్న ధాన్యంతో పాటు కొంత అటు ఇటుగా ఉన్న సరుకును సైతం మంచి ధరతో కొనుగోలు చేయాలని కోరారు. మార్కెట్లో క్రయవిక్రయాలను ప్రారంభించడానికి కృషి చేసిన జిల్లా అధికారులు, రైతు సంఘం నాయకులు, ట్రేడర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం లింగాలఘణపురం: నేలపోగుల గ్రామంలో కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. పార్టీ మండల అధ్యక్షుడు కొల్లూరి శివకుమార్ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సభ్యులు గ్రామాల్లో బూత్ కమిటీలను ఏర్పాటు చేసేందు కు రెండు రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం నేలపోగులకు వెళ్లగా ఎంపీటీసీ, సాంస్కృతిక సేన రాష్ట్ర కార్యదర్శి గుగ్గిళ్ల నర్సయ్య మాట్లాడుతూ స్థానిక సర్పంచ్ దూసరి గణపతిని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేర్చుకోవద్దని, పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అనేక ఇబ్బందులకు గురి చేశాడంటూ సమన్వయ కమిటీ సభ్యులతో వాగ్వాదానికి ది గారు. కాంగ్రెస్లో చేర్చుకోవద్దంటూ నాయకులు రాజు, ఆంజనేయులు, కొమురయ్య, అబ్బ య్య, నర్సింహ, రామచందర్, సత్తయ్య, నాగరాజు తదితరులు బయటికి వెళ్లిపోయారు. -
నామినేషన్ల సందడి
● దాఖలు చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ● వరంగల్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు.. ● మహబూబాబాద్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ దాఖలు.. ● తొలిసెట్ సమర్పించిన సుధీర్కుమార్, కడియం కావ్య – వివరాలు 8లోu -
కొనుగోలు కేంద్రాలు మూసేయొద్దు
జనగామ: కొనుగోలు కేంద్రాల్లో సరుకు లేకున్నా సెంటర్లను ఎట్టి పరిస్థితుల్లో మూసి వేయవద్దు.. ప్రతి కేంద్రంలో అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సివిల్ సప్లయీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్.ప్రసాదరావు అన్నారు. సోమవారం ధాన్యం కొనుగోళ్లపై హైదరాబాద్ నుంచి వ్యవసా య, మార్కెటింగ్ శాఖల డైరెక్టర్లు మూర్తి, ప్రశాంత్లతో కలిసి అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యానికి ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని, అకాల వర్షాల సమయంలో ఆరబోసిన ధాన్యం తడవకుండా సెంటర్ నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. మార్కెటింగ్, సివిల్ సప్లయీస్, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ మాట్లాడుతూ జిల్లాలో 195 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేశామని, ఇప్పటి వరకు 5,192 రైతుల వద్ద 28,840 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించినట్లు చెప్పారు. ప్రతి సెంటర్లో అన్ని వసతులు కల్పించామని తెలిపారు. వీసీలో జిల్లా పౌరసరఫరాల అధికారి రోజారాణి, సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ ప్రసాద్, మార్కెటింగ్ శాఖ అధికారి నరేంద్ర, వ్యవసాయ శాఖ అధికారి వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. సివిల్ సప్లయ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాదరావు -
సమయపాలన పాటించాలి
నర్మెట: వైద్య సిబ్బంది సమయ పాలన పాటించా లని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆకస్మికంగా సందర్శించిన ఆయన ఆరోగ్య కేంద్రం పరిసరా లు, మందుల నిల్వలు, రికార్డులను పరిశీలించారు. నిర్మాణంలోని అదనపు గదిని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. అనంతరం వైద్యాధికారి డాక్టర్ రవళి స్టెల్లాతో పాటు సిబ్బందికి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ ఎం.మహిపాల్రెడ్డి, ఎంఆర్ఐ సాయిబాబ, ఎస్ఎన్లు సామ్రాజ్యం, శ్రీలత, ఫార్మసిస్టు అనిల్కుమార్, ఎల్టీ మల్లయ్య, సూపర్వైజర్లు పద్మావతి, శ్రీనివాస్, ఐలయ్య తదితరులు ఉన్నారు. ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలి తరిగొప్పుల: కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను ఎప్పటికప్పుడూ మిల్లులకు తరలించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం మండలంలో పర్యటించిన ఆయన తహసీల్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించిన అనంతరం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. అలాగే అబ్దుల్నాగారంలోని ఐకేపీ కేంద్రాన్ని సందర్శించా రు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. తహసీల్దార్ కిష్టయ్య, ఎంపీడీఓ దేవేందర్రెడ్డి, ఆర్ఐ రవీందర్, ఎంపీఓ ఆగా మిస్బాఆలాం తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
కొనుగోళ్లు పునఃప్రారంభం
జనగామ: వ్యవసాయ మార్కెట్లో నిలిచిపోయిన కొనుగోళ్లు ఎట్టకేలకు సోమవారం పునఃప్రారంభం అయ్యాయి. కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేర కు అదనపు కలెక్టర్ రోహిత్సింగ్.. మార్కెటింగ్, సహకార, పౌరసరఫరాలు, మార్కెట్, జిల్లా గ్రామీ ణాభివృద్ధి తదితర శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కనీస మద్దతు ధరతో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ప్రైవేట్ కొనుగోళ్లు సైతం మంగళవారం నుంచి కనీస మద్దతు ధర రూ.1,825తో చేపట్టనున్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్లో తేమ సాకుతో ధాన్యాన్ని కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈనెల 11 నుంచి ప్రైవేట్ కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లు ఏర్పా టు చేసిన అధికారులు ప్రభుత్వ కొనుగోళ్లకు మాత్ర మే అనుమతించారు. అంతకు ముందే మార్కెట్కు వచ్చిన సుమారు 25వేల ధాన్యం బస్తాలు పేరుకుపోయాయి. అయితే అవసరాల రీత్యా చాలా మంది రైతులు ప్రైవేట్లోనే ధాన్యం అమ్ముకునేందుకు ఆసక్తి చూపారు. అయితే ధాన్యం ఆరబోసుకుని తేమ 17 శాతం లోపు వచ్చాక ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని అధికారులు సూచించారు. రోజుల తరబడి నిరీక్షించే ఓపిక లేదని.. తేమను ప్రామాణికంగా తీసుకుని ధర ఇప్పిస్తే చాలని రైతులు కోరాగా అధికారులు సమ్మతించకపోవడంతో అన్నదాతలు మరోసారి మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో ఉన్న సరుకును మాత్రమే ప్రైవేట్ ట్రేడర్లతో కొనుగోలు చేయించేలా చర్యలు తీసుకుని.. ఈనెల 15 నుంచి కొనుగోళ్లు పూర్తిగా నిలిపివేశారు. దీంతో రైతులు ఇబ్బంది పడగా.. మార్కెట్పై ఆధారపడిన అడ్తిదారులు, హమాలీ, దడువాయి, స్వీపర్లు ఉపాధి కోల్పోయారు. కొనుగోళ్లు తాత్కాలికంగా నిలిచి పోయినా రైతులు మార్కెట్కు ధాన్యం తీసుకురావడం అధికారులకు తలనొప్పిగా మారింది. దీంతో పరిస్థితులపై కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ ఆరా తీశారు. ట్రేడర్లు, అడ్తిదారులు, హమాలీల విజ్ఞప్తి మేరకు ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని ఆదేశించారు. దీంతో ఏడు రోజుల తర్వాత మార్కెట్లో తిరిగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి చొరవ.. మార్కెట్లో ప్రైవేట్ కొనుగోళ్లు నిలిచిపోవడంపై డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషాతో మాట్లాడి కొనుగోళ్లు జరిగేలా చూడాలని కోరారు. అంతకు ముందు ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఇక్కడి సమస్య వివరించారు. మొదట ప్రభుత్వ కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేపట్టేందుకు అంగీకరించిన అధికారులు.. ప్రైవేట్ వ్యాపారులతో సైతం చర్చలు జరిపి కొనుగోళ్లకు వచ్చేలా చూశారు. ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష మార్కెట్లో ఐకేపీ, పీఏసీఎస్ ద్వారా ధాన్యం కొనుగోలుకు నిర్ణయం నేటి నుంచి ప్రైవేట్ కొనుగోళ్లు కూడా.. ఎంఎస్పీ రూ.1,825తో సేకరణ నేటి నుంచి ‘ప్రైవేట్’ కొనుగోళ్లు కనీస మద్దతు ధర రూ.1,825తో.. అధికారులకు ఒప్పంద పత్రం అందజేత మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారం సజావుగా సాగేందుకు పూర్తి సహకారం అందిస్తామని వ్యాపారులు, రైతు సంఘం నాయకులు నిర్ణయించారు. సోమవారం రాత్రి డీఎంఓ నరేంద్ర, డీసీఎస్ఓ రోజారాణి, డీఏఓ వినోద్కుమార్, ఏఎంసీ కార్యదర్శి శ్రీనివాస్, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మోకు కనకారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్. రాజా రెడ్డి, చందునాయక్, వ్యాపారులు నాగబండి రవీందర్, వెంకటనారాయణ, యాంసాని శ్రీనివాస్, అశోక్, లింగం తదితరుల ఆధ్వర్యంలో ప్రైవేట్ కొనుగోళ్లపై మార్కెట్లో రెండు గంట ల పాటు చర్చలు జరిగాయి. ఈ–నామ్ పద్ధతిలో ధాన్యం క్వింటాకు కనీస మద్దతు ధర రూ.1,825 తో కొనుగోలు చేస్తామని వ్యాపారులు, రైతు సంఘం నాయకులు నిర్ణయించి ఒప్పంద పత్రాన్ని అధికారులకు అందజేశారు. కోత పెడితే ఊరుకునేది లేదు : అదనపు కలెక్టర్ రైస్ మిల్లులతో పాటు చిల్లర కాంటాల వ్యాపారంపై నిఘా పెట్టామని, సాకులు చూపి ధరలో కోత పెడితే ఊరుకునేది లేదని అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ స్పష్టం చేశారు. డీఎంఓ నరేందర్, సహకా ర శాఖ అధికారి రాజేందర్రెడ్డి, డీసీఎస్ఓ రోజా రాణి, సివిల్ సప్లయ్ డీఎం ప్రసాద్తో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మార్కెట్లో పీఏసీఎస్, ఐకేపీ సెంటర్ల ద్వారా కనీస మద్దతు ధరతో ధాన్యం కొనుగోళ్లు చేపట్టేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. ముఖ్యంగా రైస్ మిల్లుల వద్ద వివిధ కారణాలతో తూకం, నగదు, ధరలో కోతపెట్టినట్లు ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మిల్లుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి రశీదు ఇవ్వడంతోపాటు రోజువారీ కొనుగోళ్ల సమాచారం మార్కెట్ అధికారులకు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో ప్రైవేట్ వ్యాపారులు సైతం కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. మార్కెట్ ఆవరణతో పాటు పట్టణంలో చిల్లర కాంటాలపై దృష్టి సారించి సీజ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
మార్కెట్ తెరిపించాలని ధర్నా
జనగామ: వ్యవసాయ మార్కెట్ తెరిపించి వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశా రు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందునాయక్, రాష్ట్ర కమిటీ సభ్యుడు మోకు కనకారెడ్డి నేతృత్వంలో మార్కెట్ గేటు ఎదుట రెండు గంటల పాటు చేపట్టిన ఆందోళనతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సైలు సృజన్, తిరుపతి, భరత్, పోలీసు సిబ్బంది ధర్నా చేస్తున్న నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అనంతరం రైతు సంఘం నాయకులు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అదనపు కలెక్టర్ రోహిత్సింగ్కు అందజేశారు. అంతకు ముందు ధర్నా సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆరుగా లం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకునే పరిస్థి తి లేకుండా పోయిందన్నారు. రైతులు, వ్యాపారుల మధ్య నెలకొన్న సమస్యను పరిష్కరించాల్సింది పోయి పదిహేను రోజులుగా మార్కెట్ మూసివేయ డం ఏమిటని ప్రశ్నించారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మంగ బీరయ్య, సహాయ కార్యదర్శి రామావత్ మీట్యా నాయక్, వెంకట మల్లయ్య, ధర్మబిక్షం, పొత్కనూరి ఉపేందర్, సాయన్న, సోమయ్య, రాములు, ఆనందం, హమాలి నాయకులు రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాళ్లు మొక్కుత బాంచన్.. ‘సారూ మీ కాళ్లు మొక్కుత బాంచన్.. మార్కెట్ తెరిపించండి.. పదిహేను రోజులుగా ఉపాధి కోల్పోతున్నాం.. కడుపు కాలుతున్నది’ అంటూ మహిళా స్వీపర్ సీఐ రఘుపతిరెడ్డిని వేడుకున్న సంఘటన సోమవారం జనగామ మార్కెట్ వద్ద చోటుచేసుకుంది. రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా సందర్భంగా.. మహిళా స్వీపర్ సీఐ కాళ్లు మొక్కి వేడుకుంది. ‘నా 30 ఏళ్ల సర్వీసులో ఏనాడూ మార్కెట్ బంద్ లేదు.. సమస్య వస్తే మాట్లాడుకున్నారే తప్ప మూసి వేయలేదు.. వ్యాపారం లేక పోతే కడుపులో ముద్ద దిగేదెట్లా’ అంటూ వాపోయింది. రైతు సంఘం నాయకుల అరెస్ట్ -
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గల్లంతు
మంగళవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024కాళోజీ సెంటర్: ‘35 ఏళ్ల తర్వాత వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా మహిళకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించి గెలిపించాలి’ అని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్లో ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్యకు తన నామినేషన్ సెట్ పత్రాన్ని దాఖలు చేశారు. అనంతరం కావ్య మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా మహిళా ఓటర్లున్నారని, గతంలో మహిళల సమస్యల పరిష్కారానికి పని చేశానన్నారు. విద్య, ఆరోగ్యం కోసం అధిక ప్రాధాన్యమిస్తానన్నారు. ప్రధానంగా పెండింగ్లో ఉన్న సమస్యలైన రైల్వే కోచ్ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్ అప్ గ్రేడ్, లెదర్ పార్క్ తేవనికి కృషి చేస్తానన్నారు. ఎడ్యుకేషన్, ఐటీ హబ్గా మార్చడానికి, అండర్ డ్రెయినేజీ వ్యవస్థను తీర్చిదిద్దడానికి పని చేస్తానని హామీ ఇచ్చారు. ఇతర పార్టీల నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ.. రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారు.. వారి మాటలు నమ్మకుండా తన గెలుపు కోసం అందరూ సహకరించాలని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కావ్య కోరారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, సీనియర్ నాయకుడు దొమ్మటి సాంబయ్య మాట్లాడుతూ.. కులాల పేరుతో.. మతాల పేరుతో నిరుద్యోగులను, రైతులను పొట్టన పెట్టుకున్న పార్టీ బీజీపీ అన్నారు. 120 రోజుల తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు నిందలు మోపుతూ 10 ఏళ్ల పాలనలో అన్ని రకాలుగా ప్రజలను, నిరుద్యోగ యువతను మోసం చేసింది మర్చిపోయారా అని ప్రశ్నించారు. అన్ని రకాల ప్రజలకు మేలు జరగాలంటే.. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, సీనియర్ నాయకుడు ఈవీ.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ అర్బన్: కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చి మిగతా వర్గాలను విస్మరించిందని.. పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ గల్లంతవుతుందని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు అన్నారు. మానుకోట పార్లమెంట్ స్థానంలో బీజేపీ ఎంపీ అభ్యర్ధి అజ్మీరా సీతారాంనాయక్ను గెలిపించాలని కోరారు. అజ్మీరా సీతారాం నాయక్ నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సోమవారం కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు ముఖ్య అతిథిగా ప్రత్యేక హెలికాప్టర్లో మానుకోట జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియం సమీపానికి చేరుకున్నారు. అనంతరం ర్యాలీని ప్రారంభించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం సెంటర్లో సభ నిర్వహించారు. ఈసందర్భంగా కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు మాట్లాడుతూ.. గత 70 ఏళ్లుగా దేశంలో పరిష్కారం కాని ఎన్నో సమస్యలను మోదీ సర్కార్ పరిష్కరించిందన్నారు. మోదీ అంటే గ్యారంటీ అని, ప్రజలు ఆలోచన చేస్తున్నారని, దేశం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందని, ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోందన్నారు. ఆదివాసీ, గిరిజన మహిళలను రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీ మోదీ సర్కార్కే దక్కుతుందని, ఉద్యోగం, రాజకీయం ఇతర రంగాల్లో మహిళల కు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. సీతారాంను ఎంపీగా గెలిపిస్తే మానుకోటలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలతో జిల్లా యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. దేశాభివృద్ధి కోసం మూడోసారి మోదీని ప్రధాని చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్, మాజీ రాజ్యసభ, బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, క్రమశిక్షణ సంఘం చైర్మన్ ధర్మారావు, జిల్లా అధ్యక్షుడు యలమంచిలీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. హన్మకొండ/కాళోజీ సెంటర్: బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ 50 వేల మెజార్టీతో విజయం సాధిస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ అభ్యర్థి మారేపల్లి సుధీర్కుమార్ సోమవారం నామినేషన్ వేసిన సందర్భంగా హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం నుంచి ఏకశిల పార్కు వరకు భారీ ర్యాలీ తీశారు. ర్యాలీలో, నామినేషన్ వేసిన అనంతరం విలేకరులతో ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. తాను సర్వే చేయించానని, రంగంలోకి దిగకముందే 50 వేల మెజార్టీతో గెలుస్తున్నారని.. ప్రచారం చేపడితే మెజార్టీ మరింత పెరుగుతుందన్నారు. పార్టీ పరంగా లాభం పొంది బయటకు వెళ్లిన నాయకులను తిరిగి చేర్చుకునేది లేదని, ఈవిషయంపై పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వద్ద మాట తీసుకున్నానన్నా రు. తనను కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని, వారికి ఎలాంటి ఆధారాలు దొరకడం లేదన్నారు. కడియం శ్రీహరికి తానే రాజకీయ జీవితమిచ్చానన్నారు. రేవంత్రెడ్డి బ్రోకర్ అయితే కడియం శ్రీహరి మోసకారి అని ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. కేసీఆర్ను బ్లాక్ మెయిల్ చేసి బిడ్డకు టికెట్ ఇప్పించి వంచించి న మోసగాడు కడియం శ్రీహరి అని ధ్వజమెత్తారు. శ్రీహరిని చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతుందని విమర్శించారు. ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్కుమార్ మాట్లాడుతూ.. తాను స్థానికున్నే అని, కడియం కావ్య గుంటూరుకు చెందిన వ్యక్తి అని అన్నారు. కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ప్రకాశ్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ జ్యోతి, మాజీ ఎమ్మెల్యేలు, వినయ్ భాస్కర్, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్ కార్యకర్తలు పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎర్రబెల్లి, చిత్రంలో ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్, వినయ్భాస్కర్, రాజయ్య మీడియాతో మాట్లాడుతున్న డాక్టర్ కడియం కావ్య, చిత్రంలో సాంబయ్య, ఎమ్మెల్యేలు న్యూస్రీల్ బీజేపీ అభ్యర్థి సీతారాంనాయక్ను గెలిపించాలి కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు -
మెరుగైన సేవలు అందించాలి
● ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి జనగామ రూరల్: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అదించాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి అన్నారు. శుక్రవారం దేవరుప్పు ల సబ్ డివిజన్ విద్యుత్ సిబ్బంది, అధికారులకు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలన్నారు. బిల్లుల వసూలు, విద్యుత్ మీటర్ల నిర్వహణ, లైన్ల పర్యవేక్షణ చేపట్టా లని చెప్పారు. ట్రాన్స్ఫార్మర్లలో నిర్వహణ లోపాలు ఉంటే సరిచేసుకోవాలని, కొత్త లైన్లు త్వరగా పూర్తి చేయాలన్నారు. అనధికారిక విద్యుత్ వినియోగంపై దృష్టి సారించి ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సబ్ డివిజన్ల వారీగా శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయాలన్నారు. రఘునాథపల్లిలో 20న, స్టేషన్ఘన్పూర్ 22న, పాలకుర్తి వారికి 23న శిక్షణ ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో డైరెక్టర్ సదర్లాల్, ఎస్ఈ వేణుమాధవ్, డీఈ లక్ష్మీనారాయణ, విజయ్కుమార్, డీఈ ఇన్చార్జ్ ప్రభావతి, ఏడీఈ అనిల్కుమార్, ఏఎస్ఓ జయరాజు పాల్గొన్నారు. -
ప్రొఫెసర్ రవీందర్రెడ్డికి అమెరికా ఆహ్వానం
లింగాలఘణపురం: మండల కేంద్రానికి చెందిన ఉస్మానియా యూనివర్సి టీ భౌతిక శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్బుట్రెడ్డి రవీందర్రెడ్డికి అమెరికాలో ఈసీఎస్(ఎలక్ట్రో కెమికల్ సొసైటీ) నిర్వహించే 245వ సమావేశానికి ఆహ్వానం అందింది. మే 26 నుంచి శాన్ప్రాన్సిస్కో నగరంలో జరిగే ఈసీఎస్ సమావేశంలో ‘సూపర్ కెపాసిటర్స్’ అనే అంశంపై తాను చేసిన పరిశోధనపై ప్రసంగం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయనను ‘సాక్షి’ పలకరించగా.. ఎలక్ట్రికల్ వాహనాల్లో వినియోగించే బ్యాటరీ, సూపర్ కెపాసిటర్స్ శక్తిని మరింత పెంచేందుకు తాను చేస్తున్న పరిశోధన ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తనను ఎంపిక చేసి ఆహ్వానం పంపించినట్లు చెప్పారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యాభ్యాసం రవీందర్రెడ్డి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి, జనగామ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, హైదరాబాద్ సిటీ కాలేజీలో డిగ్రీ చదివారు. ఓయూలో పీజీ చేసి 2015లో భౌతికశాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్గా చేరి విధులు నిర్వహిస్తున్నారు. పాలిసెట్కు దరఖాస్తుల ఆహ్వానంఈనెల 22వ తేదీ వరకు గడువు స్టేషన్ఘన్పూర్: సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 22 చివరి తేదీ.. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని ఘన్పూర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పోచయ్య తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. ప్రవేశ పరీక్షకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.250, ఇతర కేటగిరీల వారు రూ.500 ఫీజు చెల్లించాలన్నారు. గడువు దాటి న తర్వాత 24వ తేదీ వరకు రూ.100 అపరాధ రుసుముతో.. 26వ తేదీ వరకు రూ.300 అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చన్నా రు. ప్రవేశ పరీక్ష మే 24న ఉంటుందని చెప్పా రు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్తో పాటు సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు, ప్రతి కోర్సులో 60 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. కళాశాలకు గత ఏడాది ఎన్బీఏ(నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్) గుర్తింపు లభించిందని తెలిపారు. పాలిసెట్ కోసం ఉచిత కోచింగ్ ఇస్తున్నామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 90102 22168 నంబర్లో సంప్రదించాలని కోరారు. నగదు స్వాధీనంతరిగొప్పుల: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా.. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్వేత తెలిపారు. మండల కేంద్రం శివారు ఎన్యానాయక్తండా క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం సీఐ సాయిరమణ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాలకు చెందిన కోళ్ల రాజు తన మహేంద్ర జీటో వాహనంలో వస్తుండగా తనిఖీ చేశారు. అందులో ఏ ఆధారం లేకుండా రూ.85 వేల నగదు లభించగా స్వాధీనం చేసుకుని ఎలక్షన్ గ్రీవెన్స్ కమిటీకి పంపించనట్లు ఎస్సై తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు కొడకండ్ల : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలి.. ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య అన్నారు. శుక్రవారం గిర్నితండా చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా భద్రతా చర్యలు, వాహనాల తనిఖీపై సిబ్బందికి ఏసీపీ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి సీఐ మహేందర్రెడ్డి, ఎస్సై బండి శ్రావణ్కుమార్, సీఆర్పీఎఫ్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు. -
ఓటు హక్కు ఎంతో విలువైనది
జనగామ రూరల్: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనది.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా స్వీప్ నోడల్ అధికారి వినోద్కుమార్ అన్నారు. ఓటు హక్కు– వినియోగంపై శుక్రవారం పెంబర్తిలో ఉపాధి హామీ పని ప్రదేశంలో కూలీలకు అవగాహన కల్పించారు. అర్హులంతా ఓటరు జాబితాలో పేర్లు సరిచూసుకోవాలని చెప్పారు. ఎలాంటి ప్రలోభాలా కు లోనుకాకుండా ఓటు వేయాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపడుతోందని అన్నారు. జిల్లా స్వీప్ నోడల్ అధికారి వినోద్కుమార్ -
ఎండుతున్నాను.. నీరు పోయండి
చెట్టుకు ప్లకార్డు ‘రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. నీరు లేక ఎండుతున్నాను.. జలం పోసి కాపాడండి’ అంటూ ఓ చెట్టు ప్రాధేయ పడుతున్నట్టుగా జనగామ రైల్వేస్టేషన్ ఏరియా ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని రుచిక(9వ తరగతి) రూపొందించిన ప్లకార్డు ఆలోచింపజేస్తోంది. ‘పైకి చూడు.. నేను ఎండిపోతున్నాను.. బాటిల్ వాటర్ పోయండి’ ప్లీజ్ అంటూ పాఠశాల ఆవరణలోని చెట్టుకు వేలాడదీసిన ప్లకార్డు తోటి విద్యార్థుల్లో చైతన్యం కలిగించేలా ఉంది. – జనగామ -
మానుకోట.. కాంగ్రెస్ కంచుకోట
జన జాతర సభలో జోష్ నింపిన సీఎం రేవంత్రెడ్డి ప్రసంగం ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో చూస్తా.. గెలిచే స్థానాల్లో మొదటి రెండు స్థానాలు ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ ఉంటాయి. ఇరు పార్లమెంట్ ఇన్చార్జ్లు పొంగులేటి, తుమ్మల ఇక్కడే ఉన్నారు. ఈ రెండు పార్లమెంట్ స్థానాల్లో ఎవరు ఎక్కువ మెజార్టీ తెస్తారో చూస్తాం. ప్రజలను ఇబ్బందులు పెట్టి.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే నరేంద్ర మోదీ, ఆయనకు మద్దతుగా ఉన్న కేసీఆర్కు బుద్ధి చెప్పాల్సిందే. ఈ రెండు పార్టీలను ఓడించేందుకు మీరు (ప్రజలు) సిద్ధమేనా.. – సీఎం రేవంత్రెడ్డి సాక్షి, మహబూబాబాద్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపును కాంక్షిస్తూ శుక్రవారం మానుకోటలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ ప్రసంగం ఆద్యంతం పార్టీ శ్రేణులు, ప్రజల్లో జోష్ నింపుతూ సాగింది. సీఎం రేవంత్రెడ్డి మధ్యాహ్నం 3.15 గంటలకు మహబూబాబాద్ చేరుకున్నారు. అప్పటికే ఆయన అలసిపోవడంతో బస్సులో విశ్రాంతి తీసుకొని సాయంత్రం 5:16 గంటలలకు సభా వేదికపైకి వచ్చారు. 6:17 గంటల వరకు ప్రసంగం సాగింది. సీఎం వచ్చిన తర్వాత తొర్రూరు, డోర్నకల్ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. అప్పటివరకు కాసేపు పొంగులేటి, తర్వాత తుమ్మలతో సీఎం ముచ్చటించారు. సీఎం వేదికపైకి వచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్ పైకి వచ్చి ప్రజలకు అభివాదం చేశారు. తర్వాత మానుకోట.. ఎప్పటికి కాంగ్రెస్ కంచుకోట.. అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగం ప్రారంభించి మొదటి మాటతోనే కార్యకర్తలు, ప్రజల్లో ఉత్తేజాన్ని నింపారు. బీజేపీ, బీఆర్ఎస్పై విమర్శలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను విమర్శించడమే లక్ష్యంగా సీఎం ప్రసంగం సాగింది. ముందుగా ప్రధాని మోదీ నుంచి మొదలు పెట్టి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి వరకు విమర్శలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ చేసిన పని ఏమీలేదని, బయ్యారం ఉక్క ఫ్యాక్టరీ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గిరిజన యూనివర్సిటీ ఆలస్యం చేయడంతో గిరిజనులు నష్టపోయిన తీరును వివరించారు. పార్లమెంట్లో తెలంగాణను తక్కువ చేసి మాట్లాడిన ప్రధాని మోదీని ఎలా సమర్థిస్తారని కిషన్రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ ఏ మొఖంతో ఓట్లు అడుగుతుందని చెప్పి అవునా.. కాదా.. అని ప్రజలతోనే చెప్పించారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించడం, బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు, కేసీఆర్ బిడ్డ కోసం రాష్ట్రాన్ని బీజేపీ కాళ్లముందు వేశారని విమర్శలు చేశారు. ‘ప్రభుత్వం కూలిపోతుంది.. పార్టీలు మారుతారు అన్న విషయంపై ఆషామాషీగా రాలేదని ఎన్నో ఎత్తుగడలతో వచ్చాం.. బీఆర్ఎస్ను తొక్కి వచ్చాం’ అని చెప్పడంతో.. ప్రజలనుంచి ప్రతిస్పందన వచ్చింది. జోష్ నింపుతూ ప్రసంగం ముఖ్యమంత్రి ప్రసంగం కార్యకర్తలు, ప్రజల్లో జోష్ను నింపుతూ సాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించామని, ఇప్పుడు మోదీని ఓడించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియాగాంధీ చేసిన త్యాగం చెబుతూ.. అప్పటి ఎంపీలు సోనియాగాంధీకి బలిదానాల విషయం చెప్పిన తీరు.. ఆమె స్పందన, తల్లిగా అర్థం చేసుకుందని చెబుతూ.. ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ను కదిలించారు. పదేళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ ఏమీ చేయలేదని చెప్పి.. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు డబుల్ బెడ్రూం ఇళ్లు, రైతు రుణమాఫీ, ఉద్యోగాల నియామకం మొదలైన అంశాలను ప్రస్తావించారు. అదే తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను అమలు చేశామని చెప్పి ప్రజలతో చెప్పించారు. ఆగస్టు 15 నాటికి రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటన చేయడంతో సభ ముందున్న వారందరూ చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. అయితే ముందుగా కుల సంఘాల నాయకులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల ప్రసంగాలు మొదలుకొని సీఎం ప్రసంగం వరకు అభ్యర్థి బలరాంనాయక్ స్టేజీకి అటు చివర నుంచి ఇటు చివరి వరకు నడుస్తూ.. ప్రజలకు అభివాదం చేయడం... తనను గెలిపించాలని చెప్పకనే చెప్పినట్లు సంకేతంగా మారింది. మంత్రులు ఏమన్నారంటే.. బీజేపీ, బీఆర్ఎస్పై విమర్శనాస్త్రాలు కేసీఆర్ను టార్గెట్ చేస్తూ మాట్లాడిన మంత్రులు చేతులు ఊపుతూ.. దండం పెట్టే పనిలో అభ్యర్థి బలరాంనాయక్ 8లోuకొనసాగుతున్న నామినేషన్ల పర్వం మానుకోటలో రెండో రోజు నాలుగు, వరంగల్లో మూడు నామినేషన్లుసీఎం పర్యటన సాగిందిలా.. 3.12 గంటలకు హెలికాప్టర్ ల్యాండింగ్ 3.15 నుంచి 5.14 వరకు సీఎం రేవంత్రెడ్డి విశ్రాంతి 5.16 గంటలకు సభాస్థలికి చేరుకున్న సీఎం 5.51 గంటలకు సీఎం ప్రసంగం ప్రారంభం 6.17 గంటలకు ప్రసంగం ముగిసింది 6.18 గంటలకు మానుకోట ప్రజలకు అభివాదం చేశారు 6.25 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్ బయలుదేరారు -
ఈవీఎంలను జాగ్రత్తగా తరలించాలి
జనగామ రూరల్: లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు, వీవీప్యాట్లను జాగ్రత్తగా తరలించాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంను సందర్శించారు. ఈవీఎంల తరలింపు ప్రక్రియను సహాయ ఎన్నికల అధికారులు పింకేష్కుమార్, రోహిత్సింగ్, ఆర్డీఓలు డి.కొమురయ్య, డీఎస్ వెంకన్నలతో కలిసి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం సూచనల మేరకు బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్ల వివరాల స్కానింగ్ పకడ్బందీగా చేపట్టి ధ్రువీకరించాలని చెప్పారు. కార్యక్రమంలో పార్టీల ప్రతినిధులు చెంచారపు శ్రీనివాస్, రావెల రవి, విజయభాస్కర్, జోగు ప్రకాష్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు పాలకుర్తి/పాలకుర్తి టౌన్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలను నియోజకవర్గ కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూంలకు తరలించారు. పాలకుర్తికి సంబంధించి స్థానిక తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంకు, అలాగే స్టేషన్ఘన్పూర్కు సంబంధించి డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ని స్ట్రాంగ్ రూమ్కు శుక్రవారం రాత్రి తరలించారు. వాటిని జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాం నుంచి ఆర్టీసీకి చెందిన రెండు డీజీటీ వాహనాల్లో పోలీస్ ఎస్కార్ట్ మధ్య తీసుకువచ్చి భద్రపరిచారు. పాలకుర్తిలో అదనపు కలెక్టర్, ఏఆర్ఓ రోహిత్సింగ్, ఏసీపీ నర్సయ్య, ఘన్పూర్లో డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ఏసీపీ భీమ్శర్మ తదితరులు పర్యవేక్షించారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
వడదెబ్బకు గురైన గర్భిణి
జనగామ: జనగామ చంపక్హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్) వెయింటింగ్ హాల్లో ఓ గర్భిణి వడదెబ్బకు గురై కుప్పకూలిపోయిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఓ మండలానికి చెందిన ఎనిమిది నెలల గర్భవతి కావ్య ఆరోగ్య పరీక్షల నిమిత్తం వచ్చింది. వెయిటింగ్ హాల్లో ఉన్న సమయంలో ఉక్కపోత కారణంగా ఊపిరాడక డీ హైడ్రేషన్కు గురై కూర్చున్న చోట నుంచే కింద పడిపోయింది. అక్కడే ఉన్న ఆయాతో పాటు కుటుంబ సభ్యులు ఆస్పత్రి నిర్వహణ తీరుపై మండిపడ్డారు. ఫ్యాన్ తిరగదు.. కూలర్ లేదు నెలవారి చెకప్, డెలివరీ, బాలింతలు, ఇతర ఆరోగ్య సమస్యలపై ఎంసీహెచ్కు రోజూ 200 మంది ఔట్ పేషెంట్లు ఉదయం 8 గంటలకు చేరుకుంటారు. డాక్టర్ వచ్చే వరకు గంటల తరబడి వెయింటింగ్ హాల్లో నిరీక్షిస్తారు. ఇక్కడ గర్భిణులకు సరైన వసతులు లేవు. సరిపడా కుర్చీలు లేక కిందనే కూర్చునే పరిస్థితి. ప్రస్తుతం 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. వెయింటింగ్ హాల్లో ఒక్క ఫ్యాన్ తిరగడం లేదు. గతంలో అందుబాటులో ఉన్న కూలర్లు సైతం రిపేరుకు రావడంతో మూలన పడేశారు. ఎంసీహెచ్లో ఫ్యాన్లు లేవు.. రిపేరులో కూలర్లు గర్భవతులను పట్టించుకోని అధికారులు గంటల తరబడి ఓపీలో వెయిటింగ్ప్రభుత్వం స్పందించాలి.. ఎండలు మండుతున్న సమయంలో ఆస్పత్రి లో ఫ్యాన్లు.. కూలర్లు లేకపోవడం దారుణం.. తక్షణమే ఏర్పాటు చేయాలని బీఎస్పీ నాయకుడు పంగ ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఎంసీహెచ్కు వచ్చిన ఆయ న.. గర్భిణులకు కనీస వసతులు లేకపోవడాన్ని చూసి ఆశ్చర్య పోయారు. పైన రేకుల షెడ్డు.. అధిక వేడి.. గాలి ఆడడంలేదు.. ఈ క్రమంలో గర్భిణి నవ్య డీ హైడ్రేషన్కు గురై కుప్పకూలి పోవడం తనను కలచి వేసిందని, ఈ విషయమై సీఎం రేవంత్రెడ్డికి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. -
మార్కెట్లో కొనుగోళ్లు చేపట్టాలి
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్లో పదిరోజులుగా కొనుగోళ్లు నిలిచిపోవడంతో సరుకులను అమ్ముకునేందుకు వచ్చే రైతులతో పాటు మార్కెట్పై ఆధారపడిన హమాలీలు, దడువాయిలు, స్వీపర్లు, కమీషన్ ఏజెంట్లు(అడ్తి) ఇబ్బంది పడుతున్నారు.. తక్షణమే కొనుగోళ్లు చేపట్టాలని ది గ్రెయిన్ మార్కెట్ అడ్తి అసోసియేషన్ అధ్యక్షుడు మాశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్కు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇటీవల మార్కెట్కు ధాన్యం అధికంగా రావడంతో కొనుగోళ్లకు ఆటంకం ఏర్పడుతోందని ఆపివేశారని, దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. రైతులతో పాటు మార్కెట్పై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని కొనుగోళ్లు త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సంఘం గౌర అధ్యక్షుడు బుస్సా లింగమూర్తి, ప్రధాన కార్యదర్శి సముద్రాల హన్మంతరావు, కోశాధికారి కాచం సురేష్, గోవింద్ లోహియా, శర్విరాల ఉపేందర్, కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, రాజేశేఖర్, నాగభూషణం, అశోక్, సత్యకుమార్, రామాంజనేయులు, ప్రభాకర్, రాజు, మధు తదితరులు ఉన్నారు.● గ్రెయిన్ మార్కెట్ అడ్తి అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు -
కొనుగోలు కేంద్రాల సందర్శన
బచ్చన్నపేట: మండల పరిధి బండనాగారం, లక్ష్మాపూర్, కేసిరెడ్డిపల్లి, భోనకొల్లూర్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా పౌరసరఫరాల అధికారి రోజారాణి, జిల్లా వ్యవసాయ అధికారి వినోద్కుమార్ గురువారం సందర్శించారు. బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి ఆయా కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయిన విషయమై ‘సాక్షి’లో ప్రచురి తమైన కథనానికి అధికారులు స్పందించారు. ఆయా సెంటర్లను పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ ధాన్యాన్ని త్వరగా తూకం వేసి వెంట నే మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బండనాగారంలో 26 మంది రైతులు 3,729 బస్తాలు, కేసిరెడ్డిపల్లిలో 36 మంది రైతులు 5,582 బస్తాల ధాన్యం ఇప్పటి వరకు మిల్లులకు చేరినట్లు తెలిపారు. లక్ష్మాపూర్లో ధాన్యం తేమ శాతం రానందున ఇంత వరకు కొనుగోలు చేయలేదన్నారు. రైతులు ప్రభుత్వ కొనుగో లు కేంద్రాల్లోనే ధాన్యం మద్దతు ధరకు విక్రయించాలని, దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు అమ్ముకోవద్దని సూచించారు. కార్యక్రమంలో సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్లు శ్రీనివాస్, దేవనా యక్, పీఏసీఎస్ సీఈఓ బాలస్వామి పాల్గొన్నారు. -
నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలి
రఘునాథపల్లి: వేసవిలో తాగు నీటి ఎద్దడి తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవడంతోపాటు అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగితన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ అన్నారు. గురువారం మండల పరిధి గోవర్ధనగిరి, ఖిలాషాపూర్, కుసుంబాయితండాలను ఆకస్మికంగా సందర్శించిన ఆయన తాగునీటి సరఫరాపై అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో చర్చించారు. ఎండల తీవ్రత పెరిగిన దృష్ట్యా ప్రజలకు తాగు నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ఇప్పటికే రూపొందించిన యాక్షన్ ప్లాన్ ప్రకారం చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ డీఈ కరుణ్కుమార్ను ఆదేశించారు. అమ్మ ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో చేపట్టిన పనులను పర్యవేక్షించాలని చెప్పారు. ఆయన వెంట పంచాయతీ రాజ్ డీఈ శ్రీనివాస్, డీఈఓ రాము, ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు, మిషన్ భగీరథ ఏఈ లక్ష్మీపతి, పీఆర్ ఏఈ తదితరులు పాల్గొన్నారు. స్ట్రాంగ్ రూంను పరిశీలించిన అదనపు కలెక్టర్ పాలకుర్తి టౌన్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పాలకుర్తి నియోజవకర్గ కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంను గురువారం అదన పు కలెక్టర్, ఏఆర్ఓ రోహిత్సింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఆయన వెంట సీఐ మహేందర్రెడ్డి, తహసీల్థార్ వెంకటేశం, ఎస్సై సాయిప్రసన్నకుమార్, ఎన్నికల టీడీ రామరావు ఉన్నారు. అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ -
ఆరు గ్యారంటీలతో ప్రజాసంక్షేమ పాలన
● డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు జనగామ: సీఎం రేవంత్రెడ్డి ఆరు గ్యారంటీలతో ప్రజాసంక్షేమ పాలన అందిస్తున్నారు.. ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీ భువనగి రి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తు న్న చామల కిరణ్కుమార్రెడ్డిని గెలిపించాలని ఉమ్మడి రాష్ట్ర మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు కోరారు. గురువారం సమాచార హక్కు వికాస సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి, ప్రేమ సేవా సదన్ డైరెక్టర్ మహమ్మద్ ఖుర్షీద్ పాషా అధ్యక్షతన స్థానిక ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ జీఓలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా ఆన్లైన్కు శ్రీకారం చుట్టిన సీఎంకు అభినందలు తెలిపారు. సమాచార హక్కు వికాస సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రమాద కృష్ణారెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం సమగ్రంగా అమలు కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. సీనియర్ జర్నలిస్టు, సమాచార హక్కు వికాస సమితి ముఖ్య సలహాదారులు కన్న పరశురాములు, వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు ఎన్.రవి, ఉపాధ్యక్షులు శ్రీను, శ్రీకాంత్, నాగరాజు, వరంగల్ జిల్లా అధ్యక్షుడు పూర్ణచందర్, సీనియర్ న్యాయవాది ఉమాపతి, మాజీ ఎంపీపీ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు
పాలకుర్తి టౌన్/దేవరుప్పుల/కొడకండ్ల : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ అన్నారు. గురువారం పాలకుర్తి, దేవరుప్పు ల పోలీస్స్టేషన్లతో పాటు కొడకండ్లలోని జనగామ–సూర్యాపేట రహదారి మొండ్రాయి వద్ద పోలీస్ చెక్ పోస్టును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ల పరిసరాలు, కార్యాలయ నిర్వహణ తీరు, పెండింగ్ కేసుల రికార్డులు, విధుల తీరుపై ఆరా తీశారు. ఎన్నికల కోడ్ నిబంధనలు పాటించేలా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా సిబ్బందికి సూచించారు. అంతకు ముందు శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట పాలకుర్తి సీఐ గట్ల మహేంద్రెడ్డి, ఎస్సైలు సాయి ప్రసన్నకుమార్, ఎన్.చెన్నకేశవులు, బండి శ్రావణ్ కుమార్, పోలీసు సిబ్బంది ఉన్నారు. వరంగల్ సీపీ అంబర్ కిషోర్ -
ఎన్నికల సామగ్రి పంపిణీ చేయాలి
జనగామ రూరల్ : నియోజకవర్గాల వారీగా ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. గురువారం కలెక్టరేట్లోని ఎన్నికల సెల్లో సామగ్రిని పరిశీలించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు సామగ్రి ఎప్పటికప్పుడు పంపి ణీ చేసి వివరాలు నమోదు చేయాలని చెప్పారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుని ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సామగ్రి నోడల్ అధికారి కుమారస్వామి, ఏఓ రవీందర్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
బాధ్యతలు స్వీకరించిన డీఐఈఓ ఆంజనేయరాజు
జనగామ రూరల్: ఇంటర్ విద్యాధికారిగా కె.ఆంజనేయరాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు డీఐఈఓ పదవీ విరణ చేయగా ఆయన స్థానంలో డెక్ సభ్యుడుగా ఉన్న ఆంజనేయరాజుకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుమతులు ఉన్న కళాశాలల్లోనే విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవాలని, లేకుంటే భవిష్యత్లో సమస్యలు వస్తాయని సూచించారు. ప్రభుత్వ కళాశాలల్లో అనుభవం కలిగిన అధ్యాపకులు, సకల సౌకర్యాలు ఉంటాయని చెప్పారు. ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రభుత్వ కళాశాలలు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. అర్హత లేని వైద్యుడిపై కేసు జనగామ: పట్టణంలోని సూర్యాపేట రోడ్డు ప్రాంతంలో అర్హత లేని వైద్యుడు చింతకింది యాదగిరికి చెందిన క్లినిక్పై డ్రగ్ కంట్రోల్ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండా విక్రయిస్తున్న 43 రకాలకు సంబంధించి రూ.45 వేల విలువ చేసే ఆలోపతి మందులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సదరు అర్హత లేని వైద్యుడిపై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వరంగల్ ఔషధ నియంత్రణ సహాయ సంచాలకులు డాక్టర్ రాజ్యలక్ష్మి, జనగామ, వరంగల్ జిల్లా ఔషధ నియంత్రణ అధికారులు బాలకృష్ణ, ఎం.అరివింద్కుమార్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. దరఖాస్తుల ఆహ్వానం జనగామ రూరల్: జిల్లాలో వేసవి క్రీడల శిక్షణ శిబిరాలు నిర్వహించడానికి దరఖాస్తు చేసుకో వాలని జిల్లా యువజన క్రీడా అధికారి బి.వెంకట్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మే 1 నుంచి 31 వరకు 14 ఏళ్ల లోపు బాల బాలికలకు కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్, వాలీబాల్, బాస్కెట్ బాల్, ఇతర క్రీడల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించడానికి ఉత్సాహవంతులైన వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రదేశం, క్రీడా, పూర్తి వివరాలతో కలెక్టరేట్లోని ఎస్15 నంబర్ కార్యాలయంలో ఈనెల 24లోపు దరఖాస్తు అందజేయాలని, మరిన్ని వివరాలకు 91825 52593 నంబర్లో సంప్రదించాలని సూచించారు. పాలిటెక్నిక్లో ఉచిత ప్రవేశం జనగామ రూరల్: శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ శిక్షణ సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో 2024–25 విద్యా సంవత్సరం డిప్లొమా కోర్సుల్లో ఉచిత ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి జయంతి ఒక ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రులను కోల్పొయిన బాలికలు, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన అనాథలు, పేదరికంలో ఉన్న బాలికలు, అక్రమ రవాణాకు గురైన బాలికలు, మహిళా సంస్థలో ఉన్న బాలికలు ప్రవేశ పరీక్ష లేకుండా అడ్మిషన్ పొందవచ్చని పేర్కొన్నారు. పదో తరగతి పూర్తి చేసిన వారు అర్హులని, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వంటి కోర్సుల్లో ప్రవేశాలున్నాయని తెలిపారు. తల్లి లేదా తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం, విద్యార్థి ని బోనఫైడ్, స్టడీ సర్టిఫికెట్లు, 2 ఫొటోలు దరకా స్తుకు జతచేసి కలెక్టరేట్లోని జీ6 రూం నంబర్లో మే 15లోపు అందజేయాలని సూచించారు. వైభవంగా రథోత్సవం లింగాలఘణపురం: నవాబుపేట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో గురువారం రథోత్స వం వైభవంగా నిర్వహించారు. శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణోత్సవం అనంతరం వేదపండితులు ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఉత్సవ విగ్రహా లను రథంపై అలంకరించి కోలాటాలు, డోలు వాయిద్యాల మధ్య ఊరేగించారు. ఈఓ లక్ష్మీప్రసన్న, దేవస్థాన కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభాకర్, డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. శిక్షణను వినియోగించుకోవాలి జనగామ రూరల్: టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే టెట్ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. గురువారం శిక్షణ తరగతుల కపత్రాలను జిల్లా కమటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఆవిష్కరించి మాట్లాడారు. ఈనెల 24 నుంచి మే 11 వరకు పట్టణంలోని ఏకశిల హైస్కల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ కోసం 9573141365, 9848362672 నంబర్లలో సంప్రదించాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు లక్ష్మయ్య, కార్యదర్శి ఎన్ఎన్.రాజు, వజ్రయ్య, అకుశావలి, శ్రీరాములు, శ్రీహరి, రాజారెడ్డి, లక్ష్మణ్, వరప్రసాధ్, గణేష్, శివ పాల్గొన్నారు. -
లక్ష్యానికి దూరం..!
పక్క ఫొటోలోని వ్యక్తి పేరు కోల శ్రీనివాస్. స్టేషన్ఘన్పూర్ మండలం శివునిపల్లి. రెండేళ్ల క్రితం ప్రభుత్వ ఆదేశాలతో ఇంకుడు గుంత నిర్మించుకున్నాడు. ప్రభుత్వం చెల్లించే రూ.6,000 వేలకు మరో రూ.4వేలు అదనంగా అయ్యాయి. అప్పుచేసి నిర్మాణం పూర్తి చేస్తే ఇంత వరకు డబ్బు రాలేదు. ‘అదనంగా అయిన ఖర్చు చూడా ప్రభుత్వమే బిల్లుతో చెల్లించాలి’ అని శ్రీనివాస్ కోరాడు. ● ఇంకుడు గుంతల నిర్మాణంపై నిర్లక్ష్యం ● క్షేత్రస్థాయి ప్రజల్లో అవగాహన కరువు● పట్టించుకోని అధికార యంత్రాంగం ● నీరుగారుతున్న సర్కారు లక్ష్యం జనగామ రూరల్: భూగర్భ జలాలను పెంపొందించేందుకు గ్రామాలు, పట్టణాల్లో ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా క్షేత్రస్థాయిలో ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ప్రతి వేసవిలో వాగులు, చెరువుల్లో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. మరోవైపు తాగు నీటికి తిప్పలు తప్పడంలేదు. ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టి సమస్యను అధిగమించడానికి మొద ట ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టినా ఆ తర్వాత అధికారులు గాలికి వదిలేశారు. గత ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో భూగర్భజలాల మట్టం పెరిగింది. పంటల సాగు కూడా పెరిగింది. అయితే ఫిబ్రవరి నుంచే ఎండలు మండి పోతుండడంతో భూగర్భజలాలు తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో భూగర్భజలాల పెంపునకు ఇంకుడు గుంతలు ఆధారం కానున్నాయి. ఇంకుడు గుంతలతో కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియకపోవడం.. నిర్మాణం చేపట్టిన వారికి సకాలంలో బిల్లులు రాక ఏగ్రామంలోనూ నూరు శాతం పూర్తి కాలేదు. కొంత మంది ఇంకుడు గుంతలు నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నా అధికారులు వాటిపై స్పష్టత ఇవ్వడం లేదు. జిల్లాకు 48,962 ఇంకుడు గుంతలు మంజూరు కాగా ఇప్పటి వరకు 22,743 మాత్రమే పూర్తయ్యాయి. బిల్లుల్లో జాప్యం.. కొరవడిన అవగాహన అధికారుల సూచన మేరకు కొంత మంది ఇంకుడు గుంతలు నిర్మించుకున్నారు. ఒక్కో ఇంకుడు గుంత నిర్మాణానికి ప్రభుత్వం రూ.6,000 చెల్లిస్తుండగా.. ఖర్చు అంతకంటే ఎక్కువ అవుతుండడంతో చాలా మంది ఆసక్తి చూపడం లేదు. నిర్మాణం పూర్తయిన వాటికి బిల్లులు సకాలంలో రాకపోవడం.. నిర్మాణ సామగ్రి సొంత డబ్బుతో తెచ్చుకున్నప్పటికీ ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందో లేదో అనే అనుమానంతో మరి కొందరు ముందుకు రావడంలేదు. జిల్లా వ్యాప్తంగా చాలా వరకు ఇంకుడు గుంతలు పెండింగ్లోనే ఉన్నాయి. 10 వేలకు వరకు పురోగతిలో ఉన్నాయి. అనేక మంది గుంతలు తవ్వి మధ్యలోనే వదిలేశారు. మరి కొందరు బిల్లులు వస్తే నిర్మించుకుంటామని చెబుతున్నారు. జిల్లాకు మంజూరైనవి 48,962 ఇప్పటి వరకు పూర్తయినవి 22,743 జిల్లాకు మంజూరైన ఇంకుడు గుంతలు బచ్చన్నపేట 3,151 చిల్పూర్ 3,601 దేవరుప్పుల 4,297 స్టేషన్ఘన్పూర్ 4,230 జనగామ 5,063 కొడకండ్ల 3,672 లింగాలఘణపురం 6,631 నర్మెట 3,311 పాలకుర్తి 4,126 రఘునాథపల్లి 2,857 తరిగొప్పుల 3,149 జఫర్గఢ్ 4,874 -
పాలిటిక్స్ షురూ..
ఓవైపు నామినేషన్లు.. మరోవైపు ప్రచారం సాక్షి, వరంగల్ : ఉమ్మడి జిల్లాలోని వరంగల్, మహబూ బాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. గురువారం నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభమైంది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారానికి ఫంక్షన్హాళ్లను వేదికగా చేసుకుంటున్నారు. ఆయా పార్టీల ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటుచేసి గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తున్నారు. శుక్రవారం మానుకోట లో సీఎం ప్రచారసభలో పాల్గొనున్నారు. అదేవిధంగా ఈ నెల 24న హనుమకొండలో బహిరంగసభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు.. వరంగల్ పార్లమెంట్ ఎస్సీ రిజర్వ్డు, మహబూబాబాద్ పార్లమెంట్ ఎస్టీ రిజర్వ్డు స్థానాలను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండడంతో రోజురోజుకూ రాజకీయం వేడెక్కుతోంది. ఈ రెండు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. అదేవిధంగా అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ అగ్రనేతలు కూడా ప్రచారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధి నేత కేసీఆర్తోపాటు మాజీ మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ ప్రచారం చేసేలా ఆ పార్టీ షెడ్యూల్ రూపొందించుకుంటోంది. అదే సమయంలో బీజేపీ కూడా జాతీయ అగ్రనేతలతో ప్రచారం ఉండేలా కసరత్తు చేస్తోంది. దీంతో ఆయా పార్టీల ముఖ్యనేత ల ప్రసంగాలకు ఉమ్మడి వరంగల్ వేదిక కానుంది. రెండు రోజుల్లో నామినేషన్లు.. తొలిరోజు నామినేషన్ల దాఖలుపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆసక్తిచూపలేదు. రిజిస్టర్డ్, స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున కడియం కావ్య, బీజేపీ నుంచి అరూరి రమేశ్, బీఆర్ఎస్ నుంచి డాక్టర్ మారేపల్లి సుధీర్కుమార్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరు నామినేషన్లు దాఖలు చేసేందుకు మంచి ముహూర్తం కోసం ఆరా తీస్తున్నారు. 20వ తేదీలోపే మంచి రోజులు ఉండడంతో కొందరు శుక్రవారం, మరి కొందరు శనివారంలోపు నామినేషన్లు దాఖలు చేయవచ్చని ఆయా పార్టీల్లో చర్చ జరుగుతోంది. ఇంకోవైపు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో ఆయా పార్టీల నాయకులు గెలుపు కోసం ప్రచారా న్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జ్లను కూడా నియమించాయి. ఈ నెల 24న మడికొండలో సీఎం రేవంత్రెడ్డి ప్రచార సభకు నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కడియం శ్రీహరి పార్టీలోకి వచ్చాక ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న మొదటి సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు గురువారం పార్టీ పార్లమెంట్ ఇన్చార్జ్ రేవూరి ప్రకాశ్రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డిలు సభాస్థలిని పరిశీలించారు. వీరి జాతకం తేల్చేది ఎంతమందంటే.. వరంగల్ లోక్సభ పరిధిలో వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కొత్త ఓటరు జాబితా ప్రకారం 18,16,543 మంది ఓటర్లున్నారు. వీరిలో 8,91,940 మంది పురుష ఓటర్లు, 9,24,208 మంది మహిళా ఓటర్లున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట, ములుగుతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక, ఇల్లందు, భద్రాచలం నియోజకవర్గాలున్నాయి. కొత్త ఓటరు జాబితా ప్రకారం 15,30,367 మంది ఓటర్లున్నారు. వీరిలో 7,46,982 మంది పురుష ఓటర్లు, 7,83,280 మంది మహిళా ఓటర్లున్నారు. వీరంతా నాయకుల జాతకం తేల్చనున్నారు. నామినేషన్ సెంటర్వద్ద భారీ బందోబస్తు వరంగల్ పార్లమెంట్ స్థానానికి వరంగల్ కలెక్టరేట్లో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద పోలీసులు బారికేడ్లు పెట్టి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హనుమకొండ ఏసీపీ దేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య గురువారం నామినేషన్ సెంటర్లోని ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు తగిన సూచనలు చేశారు. ఉమ్మడి జిల్లాలో మొదలైన రాజకీయ వేడి వరంగల్, మహబూబాబాద్ ఎంపీ స్థానాల్లో గెలుపుపై దృష్టి 24న హనుమకొండలో కాంగ్రెస్ సభ నిర్వహణకు కసరత్తు అదేబాటలో బీఆర్ఎస్, బీజేపీ అగ్రనేతలు ప్రచారానికి ప్లాన్ నామినేషన్ల దాఖలుకు మంచి ముహూర్తంపై అభ్యర్థుల ఆరానేడు మానుకోటకు సీఎం ఎన్నికల ప్రచార సభకు హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్ సాక్షి, మహబూబాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం మానుకోటకు రానున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన పార్లమెంట్ ఎన్నికల ప్రచార నిమిత్తం జిల్లాకు వస్తున్నారు. కాగా మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్ ఉదయం నామినేషన్ వేస్తారు. సాయంత్రం 4గంటలకు మహబూబాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభకు సీఎం హాజరై ప్రసంగిస్తారు. 6గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్కు వెళ్తారు. కాగా మూడు రోజులుగా సభ ఏర్పాట్లను సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పరిశీలించారు. గురువారం మంత్రి తుమ్మల జిల్లా పోలీస్ అధికారులతో కలిసి సభా వేదిక, హెలిపాడ్ను పరిశీలించారు. దంచికొండుతున్న ఎండల నేపథ్యంలో బహిరంగ సభకు జనసమీకరణ స్థానిక నాయకులకు సవాల్గా మారింది. గతంలో మాదిరిగా ప్రజలు స్వచ్ఛందంగా సభలకు వచ్చే పరిస్థితి లేదని, వారికి అన్ని ఏర్పాట్లు చేస్తేనే వస్తారని పలువురు నాయకులు చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ శుక్రవారం ఉదయమే నామినేషన్ వేయనున్నారు. -
బేకరీ సీజ్.. జరిమానా
జనగామ: పట్టణ పరిధి సిద్దిపేటరోడ్డులోని డీఎఫ్సీ ఫుడ్ కోర్టు, బేకరీని సీజ్ చేసి రూ.5వేల జరిమానా విధించినట్లు జిల్లా ఇన్చార్జ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ సి.కృష్ణమూర్తి తెలిపారు. పలువురు వినియోగదారుల ఫిర్యాదు మేరకు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశామన్నారు. లిక్విడ్ కారామిల్ గడువు ముగిసిన తర్వాత కేకుల తయారీలో వినియోగిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. అలాగే దిల్ఖుష్, క్రీమ్బన్ నమూనాలు సేకరించి హైదరాబాద్ ఆహార ప్రయోగశాలకు పంపించినట్లు పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మల్లిగారి మధు ఆధ్వర్యంలో బేకరీ సీజ్ చేసినట్లు స్పష్టం చేశారు. హోటళ్లు, బేకరీలు, రెస్టారెంట్లు ఇతర ఆహార పదార్థాల తయారీ, అమ్మకందారులు నాణ్యత, పరిశుభత్ర పాటించి కస్టమర్లకు స్వచ్ఛమైన వాతావరణం కల్పించాలన్నారు. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని కృష్ణమూర్తి హెచ్చరించారు.