Jangaon District Latest News
-
కష్టపడిన వారికే గుర్తింపు
జనగామ: కాంగ్రెస్లో చెట్ల కింద కూర్చుని పదవులు ఇచ్చే రోజులు పోయాయని, కష్టపడిన వారికే గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని విజయ ఫంక్షన్ హాల్లో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన జనగామ నియోజకవర్గ ముఖ్యనాయకుల సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. చెట్ల కింద కూర్చొని పలు ఇస్తే పార్టీలో మేము కూడా సస్పెండ్కు గురవుతామన్నారు. 2017 కంటే ముందు పని చేసిన వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు క్షేత్రస్థాయిలో పని చేసిన కేడర్కు గుర్తింపు ఉంటుందన్నారు. నాయకత్వ లక్షణాలు ఉన్నవారికే మండల, గ్రామశాఖ అధ్యక్షుల ఎంపిక ఉంటుందన్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి జూన్ 1 వరకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని, అలాగే ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు సంవిధాన్ బచావో పేరుతో ర్యాలీలు నిర్వహించాలన్నారు. రేవంత్రెడ్డి రెండోసారి సీఎం కావడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి బైకిని లింగం యాదవ్, సిద్ధిపేట జిల్లా పరిశీలకులు మల్లాడి పవన్, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్యాదవ్, నాయకులు చెంచారపు శ్రీనివాస్రెడ్డి, చెంచారపు బుచ్చిరెడ్డి, బడికె ఇందిర, జక్కుల అనిత, సర్వల నర్సింగరావు, వంగాల మల్లారెడ్డి, గాదెపాక రాంచందర్, బొట్ల శ్రీనివాస్, రాముని శ్రీనివాస్, కరుణాకర్రెడ్డి, మల్లేశం, మహేందర్, తదితరులు ఉన్నారు. చెట్ల కింద కూర్చుని పదవులు ఇచ్చే రోజులు కావు అర్హత ఉన్న వారికే స్థానిక ఎన్నికల టికెట్లు జనగామ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ అద్దంకి -
నేడు అవగాహన సదస్సు
జనగామ: జనగామ మండలం యశ్వంతాపూర్ శ్రీ సత్యసాయి కన్వెన్షన్ హాల్లో నేడు (మంగళవారం) విద్యుత్ భద్రతా వారోత్సవాలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఎన్పీడీసీ ఎల్ ఎస్ఈ వేణుమాధవ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని కట్టర్లు, ఆర్జిజియన్స్, ఓ అండ్ ఎం, ప్రొవెన్షనల్ స్టాఫ్, ఇంజ నీర్లు, యూనియన్ నాయకులు, కాంట్రాక్టర్లు, వినియోగదారులు, ప్రజా ప్రతినిధులు హా జరై సదస్సును విజయవంతం చేయాలన్నారు. సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేస్తాం లింగాలఘణపురం: ఉపాధ్యాయ, ఉద్యోగుల అపరిష్కృత సమస్యల సాధనకు తెలంగాణ ఉద్యోగ జేఏసీతో కలిసి పని చేస్తామని టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రామినేని వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మండలంలోని నెల్లుట్ల పాఠశాలలో టీయూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు జూన్ 9వ తేదీ జరగబోయే మహాధర్నాను విజయవంతం చేస్తామని తీర్మానించినట్లు తెలిపారు. పాఠశాలల ప్రారంభానికి ముందే పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని, 2024 మార్చి నుంచి ఏర్పడిన ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీని నిర్వహించాలన్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయుల బెనిఫిట్స్ను వెంటనే చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లచ్చుమల్ల వెంకన్న, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దార గణేష్, జిల్లా అధ్యక్షుడు రావుల వెంకటేశ్వర్లు, తదితరులుపాల్గొన్నారు. రేపు ‘విజయోస్తు’ సన్మాన సభ జనగామ: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పదో తరగతి వార్షిక ఫలితాల్లో జిల్లా 3వ స్థానంలో నిలువగా.. ఈ నెల 7వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్ సమావేశ హాలులో విజయోస్తు సన్మాన సభ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఈఓ భోజన్న సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పది ఫలితాల్లో జిల్లాను అత్యుత్తమ స్థానంలో నిలిపిన టీచర్లు, విద్యార్థులు, ప్రతీఒక్కరికి కృతజ్ఞతగా జిల్లా విద్యాశాఖను అభినందిస్తూ జిల్లా, మండల స్థాయిలో ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థులు, 100 శాతం ఫలితాలు సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సత్కరించనున్నట్లు తెలిపా రు. కలెక్టర్ రిజ్వాన్ భాషా అధ్యక్షతన జరిగే కార్యాక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. అలాగే జిల్లా, మండల, మేనేజ్మెంట్, సంక్షేమ వసతి గృహాల వారీగా అత్యుత్తమ మార్కులు పొందిన 23 మంది విద్యార్థులకు సన్మానంతో పాటు సైకిళ్లను బహుమతిగా అందజేయనున్నారు. పాఠ్యపుస్తకాల పంపిణీ జనగామ రూరల్: వచ్చే విద్యాసంవత్సరానికి గాను జిల్లా కేంద్రం నుంచి మండలాలకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాల పంపిణీని జిల్లా విద్యాశాఖాధికారి డి.భోజన్న సోమవారం ప్రారంభించారు. పట్టణంలోని వీవర్స్ కాలనీలోని గోదాంను సందర్శించారు. జిల్లాకు 2,14,460 రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 1,45,742 వచ్చాయన్నారు. ఇందులో జనగామ మండలానికి 10,510 పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశామని, మిగతా మండలాలకు త్వరలో పంపిణీ చేస్తామన్నారు. అలాగే జనగామ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు 32,938 నోటు పుస్తకాలు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠ్యపుస్తకాల మేనేజర్ సంపత్, శంకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ వాసులను వెనక్కి పంపాలి జనగామ రూరల్: పాకిస్తాన్, బంగ్లాదేశ్కు చెందిన వ్యక్తులను గుర్తించి వెనక్కి పంపాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎస్.రమేశ్ కోరారు. ఈ మేరకు సోమవారం బీజేపీ నాయకులతో కలిసి అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ భారత్లో నివాసం ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాలకు తెరలేపుతున్నారన్నారు. పౌరసత్వ లేకున్నా తప్పుడు పత్రాలు సృష్టించి నివాసం ఉంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అనిల్, లద్దలూరు మహేష్, నారాయణ, లక్ష్మీనరసయ్య, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
‘భూ భారతి’ని సద్వినియోగం చేసుకోవాలి
స్టేషన్ఘన్పూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్బాషా అన్నారు. సోమవారం పైలట్ మండలం స్టేషన్ఘన్పూర్లోని కొత్తపల్లి, విశ్వనాథపురం గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో భాగంగా దరఖాస్తుదారులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం రెవెన్యూ అధికారులకు సదస్సుల నిర్వహణ, దరఖాస్తుల స్వీకరణ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఈ నెల 13వ తేదీ వరకు సదస్సులు నిర్వహిస్తామని, రైతులు భూ సమస్యలను తగిన ఆధారాలతో సమర్పించాలన్నారు. దరఖాస్తు చేసుకున్న రైతులకు రశీదులు అందిస్తారన్నారు. మొదట పైలట్ ప్రాజెక్టుగా స్టేషన్ఘన్పూర్ మండలంలో పూర్తి చేసి ఇక్కడి ఫీడ్ బ్యాక్తో జూన్ మొదటివారంలో జిల్లావ్యాప్తంగా చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్నాయక్, ఆర్డీఓ వెంకన్న, తహసీల్దార్లు, డీటీలు, ఆర్ఐలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తేమశాతం రాగానే కొనుగోళ్లు చేసి వెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్ రిజ్వాన్బాషా అన్నారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రం, మండలంలోని విశ్వనాథపురంలోని ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా కొనుగోలు కేంద్రాల్లో నిర్వహిస్తున్న రిజిస్టర్లను పరిశీలించారు. రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని, ఓపీఎంఎస్లో కొనుగోళ్ల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ రోహిత్సింగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్నాయక్, తదితరులు ఉన్నారు. కొత్తపల్లి, విశ్వనాథపురంలో సదస్సులను పరిశీలించిన కలెక్టర్ రిజ్వాన్ బాషా -
ఓరుగల్లుకూ ‘గొర్రెల స్కాం’ సెగ!
సాక్షిప్రతినిధి, వరంగల్ : గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాల బాగోతంపై మళ్లీ విచారణ ఉమ్మడి వరంగల్లో కలకలంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గొర్రెల పంపిణీలో అక్రమాల కేసును సీరియస్గా తీసుకుని విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఏడాది క్రితం వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఏసీబీలు వేర్వేరుగా పలుకోణాల్లో విచారణ చేపట్టాయి. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ స్థాయి మొదలు ఆ శాఖ కీలక అధికారుల వరకు సుమారు 42 మందిపై మూడు శాఖలు అభియోగాలు మోపాయి. ఇందులో ఎనిమిది మంది ఉమ్మడి వరంగల్లో పనిచేసిన వారు కూడా ఉన్నారు. సుమారు రూ.700 నుంచి రూ.1,200 కోట్ల వరకు స్కాం జరిగినట్లు ప్రాథమిక నివేదిక ఇచ్చిన నిఘావర్గాలు.. కొందరినీ అరెస్టు చేసి.. మరికొందరిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేశాయి. ఆ కేసుల్లో ఉండి ఏడాదిలో ఉద్యోగ విరమణ చేసిన నలుగురు అధికారుల బెనిఫిట్స్ కూడా నిలిపి వేశారు. తాజాగా ఈ కుంభకోణంలో కీలక వ్యక్తిగా కాంట్రాక్టర్ మొయీనొద్దీన్ దుబాయికి పరారు కావడంతో అక్కడ బ్రేక్ పడింది. తాజాగా మొయీనొద్దీన్కు సంబంధించిన ఇంటిపై దాడులు నిర్వహించి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న ఏసీబీ.. ఆయన దగ్గర, ఆయన ద్వారా కొనుగోలు చేసిన పలువురిని విచారణకు పిలుస్తుండటం ఆశాఖలో కలకలం రేపుతోంది. యూనిట్ల వివరాలపై ఈడీ నోటీసులు.. గొర్రెల పంపిణీలో గోల్మాల్ వ్యవహారం మనీ ల్యాండరింగ్గా భావించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. ఆ స్కాం గుట్టు తేల్చేందుకు చివరి ప్రయత్నంగా జిల్లాల వారీగా పంపిణీ చేసిన యూనిట్ల వివరాలు కోరింది. 2017 నుంచి 2024 వరకు పంపిణీ చేసిన యూనిట్ల సమాచారం కావాలని ఈ మేరకు జిల్లా వెటర్నరీ, పశుసంవర్దకశాఖ అధికారులకు ఇచ్చిన నోటీసుల్లో ఈడీ పేర్కొంది. ఈ వివరాలు గత నెలాఖరు వరకే ఈడీకి సమర్పించాల్సి ఉండగా, కొందరు అబ్స్ట్రాక్టు మాత్రమే ఇచ్చి, మరికొందరు సంపూర్ణంగా ఇవ్వగా.. రెండు జిల్లాల నుంచి సమాచారం వెళ్లలేదని తెలిసింది. పంపిణీ చేసిన గొర్రెల యూనిట్ల వివరాలు పంపించని అధికారులు ఈనెల 10 వరకు ఇవ్వాలని మరోసారి రిమైండర్ లేఖ పంపించినట్లు సమాచారం. ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపై దృష్టి ఇదిలా ఉండగా 2017 నుంచి 2024 వరకు గొర్రెల పంపిణీ పథకంలో కీలకంగా వ్యవహరించి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపై మళ్లీ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ దృష్టి సారించింది. వరంగల్ కేంద్రంగా ఉన్న కార్యాలయానికి చెందిన ఇద్దరు అధికారులపై రెండు నెలల క్రితం హనుమకొండ డీవీఏహెచ్ఓ కార్యాలయంలో ఆరా తీశారు. అలాగే గతంలో అరోపణలు ఎదుర్కోవడంతో పాటు సస్పెన్షన్కు గురై తిరిగి కొలువులో చేరిన కొందరికీ హైదరాబాద్ నుంచి ఏసీబీ మూడు రోజుల క్రితం నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. పశుసంవర్థకశాఖలో మళ్లీ కలకలం యూనిట్ల వివరాలు ఇవ్వాలని ఈడీ నోటీసులు డీవీఏహెచ్ఓలను ఆరా తీస్తున్న ‘విజిలెన్స్’ కొందరు వీఏఎస్లను విచారణకు పిలిచిన ఏసీబీ? రిటైర్ అయినా తప్పని ఎంకై ్వరీ.. రిటైర్మెంట్ బెనిఫిట్స్పైనా పేచీ..వీటిలోనే అక్రమాల లెక్కలు.. ఉమ్మడి వరంగల్లో 2017 జూలైలో గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా గ్రామాల్లోని గొల్ల, కురుముల కుటుంబాలను పరిగణనలోకి తీసుకొని గ్రామ సంఘంలో సభ్యత్వం ఉన్న వారికి రెండు విడతల్లో గొర్రెలు పంపిణీ చేశారు. మొదటి విడతలో 50 శాతం, రెండో విడతలో మరో 50 శాతం మంది చొప్పున 575 సహకార సంఘాలకు చెందిన 60 వేల మందికి మొదటి విడత(ఎ–లిస్టు)లో 49,276 యూనిట్లు పంపిణీ చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రతి యూనిట్కు 20 గొర్రెలు, ఒక పొట్టేలు చొప్పున జిల్లాల వారీగా కోటా నిర్ణయించారు. ఒక్కో జిల్లా నుంచి ఇద్దరు ఏడీలు, ఒక డాక్టర్, ఇద్దరు పారా సిబ్బంది కమిటీగా.. ఉమ్మడి జిల్లాలో సుమారు 12 కమిటీల ద్వారా కొనుగోళ్లు, పంపిణీ చేపట్టారు. రెండో విడతలో 47,750 యూనిట్లకు ప్రణాళిక సిద్ధం చేశారు. దాని ప్రకారం వరంగల్ అర్బన్ జిల్లాలో 5,571 యూనిట్లు, వరంగల్ రూరల్లో 12,748, మహబూబాబాద్లో 11,868, భూపాలపల్లి/ములుగు జిల్లాల్లో 6,791, జనగామ జిల్లాలో 10,772 యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉండగా 12,123 యూనిట్ల తర్వాత అక్రమాలు వెలుగుచూడటంతో నిలిపివేశారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా విచారణకు ఆదేశించడం.. ఏడాది క్రితం అంతా అయిపోయిందని భావించిన తరుణంలో రెండు రోజులుగా మళ్లీ విచారణ స్పీడందుకుంది. ఉమ్మడి వరంగల్ అక్రమాలపైన మళ్లీ నోటీసులు జారీ కావడం లాంటి పరిణామాల నేపథ్యంలో బాధ్యులైన అధికారుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. -
ఎక్కడి సమస్యలు అక్కడే..
జనగామ రూరల్: సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కన్నీటితో వేడుకున్నా.. తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజలు వాపోయారు. పది నెలల నుంచి వేతనాలు లేక అవస్థలు పడుతున్నామని పార్ట్ టైం సిబ్బంది, కుమారులు తిండి పెట్టడం లేదని వృద్ధ దంపతులు, వితంతు, దివ్యాంగ పింఛన్ రావడం లేదని, కాల్వ కింద భూమి పోతే నష్టపరిహారం రాకుండా అడ్డుకున్నారని ఇలా పలు సమస్యలతో సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్కు పలువురు వినతులు సమర్పించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ ప్రజల నుంచి 60 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన వివిధ సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారానికై అన్ని మండలాల సంబంధిత తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తగిన చర్యలకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గోపీరాం, డీఆర్డీఓ వసంత, డీపీఓ స్వరూప, జిల్లా పౌరసరఫరాల అధికారిణి సరస్వతి, డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, డీఏఓ రామారావు నాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● పాలకుర్తి మండలం, ముత్తారం గ్రామానికి చెందిన కె.మంగమ్మ, ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోగా తమ పేరు మంజూరు జాబితాలో లేదని, తమకు ఇల్లు మంజూరు చేయాలని కోరారు. ● దేవరుప్పుల మండలం, సీతారాంపురం గ్రామానికి చెందిన తోరిపూరి రాములు తన 1.2 ఎకరాల భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారని, వారిపై తగిన చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ● లింగాలఘణపురం మండలం, కళ్లెం గ్రామానికి చెందిన ఆరె లక్ష్మీనర్సమ్మ తమ నలుగురు కుమారులు ఆస్తి మొత్తాన్ని వారి పేరు మీద చేసుకున్నారు. ఇప్పుడు తమను పోషించడం లేదని వినతిపత్రం సమర్పించారు. ● జిల్లా కేంద్రంలోని 11వ వార్డుకు చెందిన బిర్రు మల్లేష్ 15 ఏళ్లుగా కిరాయికి ఉంటున్నారని, తనకు వీవర్స్ కాలనీలో 100 గజాల స్థలం ఉందని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని వినతి అందజేశారు. ● జనగామ పట్టణానికి చెందిన బడికే శ్రీకాంత్కు దివ్యాంగ పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని వేడుకున్నాడు.కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు సమస్యలు పరిష్కారం కావడం లేవని మండిపాటు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలి కలెక్టర్ రిజ్వాన్ బాషా గ్రీవెన్స్కు 60 వినతులుఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ నర్మెట మండలం అమ్మపురానికి చెందిన వైద్యం సునీత, భర్త రాజ్కుమార్ నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఇద్దరు ఆడపిల్లలు. రోజూ జనగామకు వచ్చి హోటల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. తమది పేద కుటుంబమని, గ్రామంలో ఇల్లు కూడా లేదని, వితంతు పెన్షన్ మంజూరు చేస్తే ఆసరాగా ఉంటుందని కలెక్టర్కు వినతిపత్రం సమర్పించింది.పక్క ఫొటోలో కనిపిస్తున్న దివ్యాంగుడు చిల్పూర్ మండలం శ్రీపతిపల్లికి చెందిన చెట్టబోయిన వెంకటకిష్టయ్య. ఈయనకు నలుగురు కుమారులు ఉండగా తనకున్న పది ఎకరాల భూమిని నాలుగు సమాన భాగాలుగా ఇచ్చాడు. ప్రస్తుతం చిన్న కుమారుడి ఇంటి వద్ద ఉంటున్నాడు. నలుగురు కుమారులు ఉన్నా.. తనను చూసుకోవడం లేదని, గతంలో ఆర్డీఓకు ఫిర్యాదు చేస్తే పెద్ద మనుషుల సమక్షంలో నెలకు ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశాడు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి గ్రామంలో తమకు ఎలాంటి ఆస్తులు లేవు. భార్యభర్తలు ఇద్దరం దివ్యాంగులం. ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు చేసుకోగా అర్హులకు కాకుండా అనర్హుల పేర్లు వచ్చాయి. దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యతగా ఇల్లు మంజూరు చేయాలి. – వాతాల యాదగిరి, దివ్యాంగుడు, నిడిగొండ నష్టపరిహారం రాకుండా అడ్డుపడుతున్నారు.. దేవాదుల కాల్వ కింద 29 గుంటల భూమి పోయింది. ప్రభుత్వం నష్టపరిహారంగా రూ.10లక్షలు మంజూరయ్యాయి. గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు నష్టపరిహారం రాకుండా అడ్డుకుంటున్నారు. అధికారులు విచారణ జరిపి నష్టపరిహారం ఇప్పించాలి. – అరకల రజిత, జఫర్గఢ్ -
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పాలకుర్తి టౌన్: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ కార్యకర్త కష్టపడి పనిచేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్లో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి అధ్యక్షతన జరిగిన పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశానికి ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, ఆమార్ ఆలీఖాన్, ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డితో కలిసి ఎంపీ కావ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం దేశంలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయలేదన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతీకార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ పాలకుర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ముందంజలో ఉంచుతామన్నారు. కార్యకర్తలు పాత, కొత్త తేడా లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జనగామ, వరంగల్, మహబూబాబాద జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, భరత్చందర్రెడ్డి, అనుమాండ్ల ఝాన్సీరెడ్డి, రవళిరెడ్డి, బైకిని లింగం యాదవ్, పోట్ల నాగేశ్వర్రావు, మేడి రవిచంద్ర, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకుల వాగ్వాదం కాగా ఈ సన్నాహక సమావేశానికి దేవరుప్పులకు చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగం ఉపాధ్యక్షుడు ఉప్పుల సాయిప్రకాశ్ తన అనుచరులతో కలిసి వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అలాగే టీపీసీసీ సభ్యుడు, డాక్టర్స్ సెల్ జనగామ జిల్లా కన్వీనర్ లక్ష్మీనారాయణనాయక్ను వేదికపైకి పిలవకపోవడంతో ఆయన కొంతసేపు చూసి అక్కడినుంచి వెళ్లిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాల అమలులో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం హాలులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో కలిసి కలెక్టర్ ఆయా శాఖల అధి కారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలనలో భాగంగా సర్వే ప్రక్రియను పర్యవేక్షించాల్సిన బాధ్యత మండల ప్రత్యేక అధికారులపై ఉందన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో జనగామ జిల్లా మొదటి స్థానంలో ఉందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రాబోయే 15 రోజులు కీలకమని, తహసీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులు, సహకార, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రతీరోజు సెంటర్లను పరిశీలించి, నివేదికను సమర్పించాలన్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో వేసవి కార్యాచరణ ప్రణాళికను పక్కాగా అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ గోపీరాం, డీఆర్డీఓ వసంత, డీపీఓ స్వరూప, డీఏఓ రామారావు నాయక్, ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
భద్రకాళి అమ్మవారికి పల్లకీసేవ
అమ్మవారి పల్లకీసేవలో ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, దాసోజు శ్రవణ్హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళిభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీభద్రకాళి దేవాలయంలో అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యాన అమ్మవారికి నిత్య పూజలు, అలకరణ అనంతరం ఉత్సవమూర్తికి ఉదయం పల్ల కీసేవ, సాయంత్రం శేషవాహనసేవ నిర్వహించారు. మహిళలు కుంకుమపూజలు, లలితాసహస్రనామ పారాయణం చేశారు. అనంతరం అన్నదానం జరిగింది. సేవా కార్యక్రమాలకు వరంగల్ ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం, తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ మాతృసంఘం బాధ్యులు ఉభయదాతలుగా వ్య వహరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, దాసోజు శ్రవణ్కుమార్, డాక్టర్ లాల్కోట వెంకటాచారి, రాగిఫణి రవీంద్రాచారి, చొల్లేటి కృష్ణమాచారి, సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు నారోజు సత్యమనోరమ, శశిధర్శిల్పి తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్ల సాధనకు సంతకాల సేకరణ
జనగామ రూరల్: ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ల సాధనకు పోరాటాలు ఉధృతం చేస్తామని, ఇందుకోసమే లక్ష సంతకాలు సేకరిస్తున్నట్లు ఎన్పీఆర్డీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిట్ల గణేశ్ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని దుర్గమ్మ గుడి ఆవరణలో జిల్లా అధ్యక్షుడు పాముకుంట్ల చందు అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. దివ్యాంగులను ఐక్యం చేసి పార్లమెంట్ వేదికగా సమస్యలను చర్చించి అనేక సమస్యలను పరిష్కారం చేసేందుకు ఎన్పీఆర్డీ కృషి చేసిందన్నారు. దివ్యాంగులకు 5శాతం ఉద్యోగాల కేటాయింపు తదితర సమస్యల సాధనకు మే 19న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో మామిడాల రాజేశ్వరి, పిట్టల కుమార్, మాలోతు రాజ్ కుమార్, మోతె వెంకటమ్మ, భైరగోని మహేష్, రాజు, గోదల ఐలయ్య, జానకి, సతీష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కొనుగోళ్లకు కొర్రీలు
జనగామ: మద్దతు ధరకు ఆశపడి ప్రభుత్వ కొనుగోలు సెంటర్లకు వస్తున్న రైతులు ధాన్యం అమ్ముకోలేక చుక్కలు చూస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను సైతం పక్కన బెట్టి.. సొంత ఎజెండాను అమలు చేస్తున్నారు. సరుకులో తేమ వచ్చిన తర్వాత కొనుగోళ్లలో ఆలస్యం చేయొద్దని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించినా పట్టించుకోవడం లేదు. కాంటా వేసిన సరుకు లిఫ్టు అయ్యే వరకు కొత్త కొనుగోళ్లు ఉండవు.. సారు వచ్చి టోకెన్ ఇచ్చే వరకు నిరీక్షణ తప్పదంటూ జనగామ వ్యవసాయ మార్కెట్ పరిధిలోని కాటన్ యార్డులో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్ నిర్వాహకులు అన్నదాతలను ఇబ్బందులు పెడుతున్నారు. జనగామ మండలంలోని పలు గ్రామాల రైతుల సౌకర్యం కోసం వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలోని కాటన్ యార్డులో ప్రభుత్వ ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్ను ఏర్పాటు చేశారు. జనగామతో పాటు రఘునాథపల్లి, లింగాలఘణపురం సమీప మండలాల పరిధి నుంచి సైతం రైతులు తమ సరుకును అమ్ముకునేందుకు ఇక్కడకు వస్తున్నారు. కాటన్ యార్డులో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉండడంతో ధాన్యం ఆరబోసుకునేందుకు వెసలుబాటు ఉండడంతో ఈ సెంటర్కు డిమాండ్ పెరిగింది. ధాన్యం ఆరబోసుకుంటూ.. 17 తేమ శాతం వచ్చిన తర్వాత మద్దతు ధరకు అమ్ముకుని ఇంటికి తిరిగి వెళ్తున్నారు. కానీ ఇక్కడే తిరకాసు పెడుతున్నారు. కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ... టోకెన్ నంబర్ ఇష్యూ, కాంటా వేయడంలో జాప్యం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి ధాన్యం పండించి, అమ్ముకునేందుకు వస్తే రైతులకు కనీస గౌరవం దక్కడం లేదు. సారూ తేమ శాతం వచ్చింది.. ఇంకెప్పుడు కొనుగోలు చేస్తారంటూ సెంటర్ నిర్వాహకులను అడిగితే నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు కేంద్రాలను తనిఖీ చేసే సమయంలో గౌరవ ప్రదంగా మాట్లాడుతుంటే... కాటన్ యార్డు ఐకేపీ సెంటర్లో మాత్రం అలాంటి పరిస్థితి లేదంటున్నారు రైతులు. తేమ వచ్చి వారం రోజులు ధాన్యం తిర్లేసి.. మర్లేసీ ఒకటికి రెండు సార్లు ఆరబోసి ప్రభుత్వ నిబంధనల మేరకు 17శాతం వచ్చినా... కాటన్ యార్డు ఐకేపీ సెంటర్లో కొనుగోలు చేయడం లేదు. తేమ వచ్చి వారం గడిచినా టోకెన్ కూడా ఇవ్వడం లేదు. కాంటా వేసిన బస్తాలు లిఫ్టు చేసిన తర్వాతనే గన్నీ బ్యాగులు ఇచ్చి కొనుగోళ్లు స్టార్ట్ చేస్తామని చెబుతున్నారు. కోపమొచ్చిన రైతులు నిలదీస్తే, ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే అనే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చాలా మంది రైతులు ధాన్యం కొనుగోలుకు అర్హత సంపాదించినా... పదిరోజులుగా సెంటర్లోనే పడిగాపులు కాస్తున్నారు. కేంద్రంలో రైతులకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదని మండిపడుతున్నారు. కాటన్ యార్డులో దూర భారముందంటూ బస్తాకు అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. చినుకులు పడుతున్నా.. టార్పాలిన్ కవర్లు ఇవ్వడం లేదంటున్నారు.తేమశాతం వచ్చినా కొనుగోలు చేయరు కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ తాగునీరు ఉండదు.. టార్పాలిన్లు ఇవ్వరు దూర భారమంటూ అదనపు వసూళ్లు ఇబ్బందుల్లో అన్నదాతలు -
కడవెండిలో భక్తిశ్రద్ధలతో బోనాలు
దేవరుప్పుల: మండలంలోని కడవెండిలో యాదవ సామాజిక వర్గం ఇలవేల్పు గంగాదేవి, కాటమరా జు కల్యాణోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి వేర్వేరుగా హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. బోనాలను ఎర్రబెల్లి అలంకరించి దేవతమూర్తులకు ప్రదర్శనగా వెళ్లి సమర్పించారు. అలాగే ఝాన్సీరెడ్డి గంగాదేవికి కుల సాంప్రదాయాల మేరకు జలగంప మొక్కులను సమర్పించారు. ఒగ్గు కళాకారులు ఆటపాటతో దేవతమూర్తుల విశిష్టతపై ప్రదర్శనలు ఇవ్వగా శివసత్తుల పూనకాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాల్లో పెద్దగొల్ల, సారగొల్ల ప్రతినిధులు సుడిగెల కొమురయ్య, తోటకూరి మల్లయ్య, యాదవ సంఘం అధ్యక్షుడు మారసాని శ్రీనివాస్, పీఏసీఎసీఎస్ డైరెక్టర్ పెద్ది కృష్ణమూర్తి, నక్క రమేష్, కాంగ్రెస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నల్ల శ్రీరామ్, తీగల దయాకర్, మాజీ సర్పంచ్ హన్మంతు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు బాసటగా నిలుద్దాం
దేవరుప్పుల: గత ప్రభుత్వం పేదలకు పంచిన భూ పంపిణీ పట్టా రైతులకు అన్యాయం జరగకుండా న్యాయపరమైన రీతిలో బాసటగా నిలుద్దామని హైకోర్టు న్యాయవాది ఎండీ సాధిక్అలీ పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని చిన్నమడూరు రెవెన్యూ గ్రామ పరిధిలోని రంబోజిగూడెం శివారులో భూపంపిణీ పట్టాలను రద్దు చేసే యోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బాధిత రైతులతో కలిసి ఆందోళన చేశారు. అనంతరం ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఈరెంటి విజయ్ మాదిగ అధ్యక్షత జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను తిరిగి తీసుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కోఆర్డినేటర్ కొమ్ముల సురేందర్, జనగామ జిల్లా ఇన్చార్జ్ కన్నారపు పరుశురాములు, చిన్నమడూరు గ్రామ దళిత నాయకులు మేడ సోమనర్సయ్య, పాలడుగు యాదగిరి, దుబ్బాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు న్యాయవాది సాధిక్అలీ -
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
జనగామ రూరల్: అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ఇందుకు ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివారం క్యాంపు కార్యాలయం నుంచి అదనపు కలెక్టర్ పింకేష్కుమార్తో కలిసి ఇందిరమ్మ ఇళ్లపై నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, పరిశీలన అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పరిశీలనలో భాగంగా జనగామ నియోజకవర్గంలో 13, ఘనపూర్ 17, పాలకుర్తిలో 10 మంది అధికారులు సర్వే చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు అందేలా చూడాలని స్పష్టం చేశారు. పరిశీలన పూర్తి కాగానే అర్హుల జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించాలని వెల్లడించారు. సమీక్షలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, గృహ నిర్మాణ పీడీ మాతృనాయక్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రైతులకు యునికోడ్ కేటాయింపు ఆధార్తో దేశంలోని ప్రతీ పౌరుడికి గుర్తింపు ఇచ్చినట్లుగానే ప్రతీ రైతుకు 11 నంబర్లతో విశిష్ట సంఖ్య (యునికోడ్) కేటాయించాలని కేంద్రం నిర్ణయించినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టు చేపట్టామని, రైతులు తమ భూముల వివరాలతో కూడిన సమాచారంతో ఇ–ఫార్మర్ రిజిస్ట్రీ జరుగుతున్నదన్నారు. రెవెన్యూ శాఖ ద్వారా సేకరించిన భూ యాజమాన్య వివరాలను రైతు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయడం ద్వారా ఇ–ఫార్మర్ ఐడీ కేటాయిస్తారని పేర్కొన్నారు. రైతు భరోసా, రుణమాఫీ తదితర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రీకి ఏ సంబంధమూ లేదని స్పష్టం చేశారు. ఫార్మర్ ఐడీ పొందడానికి రైతులు ఆధార్, భూ యాజమాన్య పాస్బుక్, ఆధార్కు లింక్ చేసిన మొబైల్ నంబర్ తీసుకొని సమీప వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
కోర్టుకు హాజరైన జిల్లా ఉద్యమ నాయకులు
జనగామ రూరల్: జనగామ జిల్లా సాధన ఉద్యమకారులు శనివారం కోర్టుకు హాజరయ్యారు. పోరాడి జిల్లా సాధించుకున్నామే కాని అక్రమ కేసులు తొలగించలేదని నాయకులు అన్నారు. కోర్టుకు హాజరైన వారిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి, ఇనుగాల ప్రభాకర్రెడ్డి, ఉపేందర్రెడ్డి, వీరేందర్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, చౌడ రమేశ్, ఆకుల సతీష్, దశమతరెడ్డి, ఉడుగుల రమేశ్, కేవీఎల్.రాజు, మేడ శ్రీనివాస్, బక్క శ్రీనివాస్, హరిశ్చంద్ర ప్రసాద్, మేకల రాంప్రసాద్, గుజ్జుల నారాయణ, జగదీష్, మంగళంపల్లి రాజు, మజిత్, ఎల్లయ్య, కృష్ణ ఉన్నారు. ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి జనగామ రూరల్: మోడీ కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్ పిలుపునిచ్చారు. శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షుడు రాపర్తి రాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో 12 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించి బ్రిటిష్ కాలం నాడు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేలా కార్పొరేట్ అనుకూల విధానాలు అమలు చేస్తోందని, ఇందుకు నిరసనగా ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పాల్గొనాలని కోరారు.అన్నబోయిన రాజు, చిట్యాల సోమన్న, బాలరాజు, మల్లేష్ రాజ్, ఐలయ్య రేణుక పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు రాలేదని అధికారుల నిలదీతలింగాలఘణపురం: మండల పరిధి జీడికల్లో అర్హులైన తమకు ఇందిరమ్మ ఇళ్లు రాలేదంటూ శనివారం జీడికల్లో ఎంపీడీఓ జలేందర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్ను పలువు రు గ్రామస్తులు జీపీ కార్యాలయం వద్ద నిలదీశారు. ఇందిరమ్మ లబ్ధిదారుల జాబితాను చివరి దశలో విచారణ జరిపేందుకు శనివారం ఎంపీడీఓ జీడికల్ గ్రామానికి వెళ్లారు. పంచా యతీ కార్యాలయం వద్ద అప్పటికే కొంత మంది గుమికూడి జాబితాలో ఎవరెవరి పేర్లు ఉన్నాయని తెలుసుకుని అర్హులైన తమకు ఇళ్లు ఎందు కు రాలేదని మండిపడ్డారు. తమకు ఖాళీ జాగా ఉందని, అధికారులొచ్చి చూశారని, ఫొటోలు దింపారని ఇప్పుడు మాత్రం తమ పేర్లు రాలేద ని, ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలని మహేందర్, బాబు, శ్రీనివాసు, నగేశ్, నిర్మల తదితరులు ఎంపీడీఓను ప్రశ్నించారు. గ్రామంలో 91 మంది అర్హులున్నారని, మొదటి విడతగా 21 మందిని ఎంపిక చేశారని, మిగిలిన అర్హులకు రెండో విడతలో వస్తాయని సమాధానం చెప్పినా వినకుండా వాగ్వాదానికి దిగారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులను దూషించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి ఏదైనా సామరస్యపూర్వకంగా మాట్లాడుకోవాలని గొడవ చేయొద్దని చెప్పి వెళ్లారు. అప్పటికే గ్రామంలో మరో విచారణ ఉందని, ఎంపీడీఓ, కార్యదర్శి గ్రామ పంచా యతీ నుంచి వెళ్లిపోయారు. నో రిజిస్ట్రేషన్లు కాజీపేట అర్బన్ : కాజీపేట వంద ఫీట్ల రోడ్డులోని వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో శనివారం ఒక దస్తావేజు కూడా రిజిస్ట్రేషన్కు నోచుకోలేదు. విద్యుత్ శాఖ అధికారులు ఈ ప్రాంతంలో ట్రీ కటింగ్ చేసిన నేపథ్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా లేదు. దీంతోపాటు ఇంటర్నెట్వైర్లు తెగిపోవడంతో సర్వర్ పని చేయలేదు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్నారు. చివరికి రిజిస్ట్రేషన్లు లేక వెనుదిరిగారు. ఇదిలా ఉండగా.. వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని జాయింట్–2 సబ్ రిజిస్ట్రార్లకు జాయింట్–1గా పదోన్నతి లభించింది. మల్టీజోన్లో భాగంగా ఆడిట్ విభాగం సబ్ రిజిస్ట్రార్ తిరుమల్, అడక్ ప్రమోషన్లో భాగంగా సబ్ రిజిస్ట్రార్ ఆనంద్కు జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్గా పదోన్నతి లభించింది. -
ఆరున్నర గంటలు.. కీలక అంశాలు
రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు శనివారం హనుమకొండ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. మధ్యాహ్నం 1 గంటనుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పర్యటన కొనసాగింది. హసన్పర్తి మండలం దేవన్నపేటలో దేవాదుల పంప్హౌజ్, ధర్మసాగర్ రిజర్వాయర్, భద్రకాళి చెరువును సందర్శించారు. చివరగా హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి సాగునీటిపారుదల, పౌర సరఫరాల శాఖలపై అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. – సాక్షిప్రతినిధి, వరంగల్ ● ఓరుగల్లులో మంత్రులు ఉత్తమ్, శ్రీనివాస్రెడ్డి పర్యటన ● దేవాదుల పంపుహౌజ్, రిజర్వాయర్లపై రివ్యూ... ● భద్రకాళి పూడికతీత, సుందరీకరణ పనులపై సీరియస్ ● హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ అధికారులతో భేటీ ● పెండింగ్ ప్రాజెక్టులు, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష– వివరాలు IIలోu -
జనగామకు తాగునీరందించాలి
జనగామ: నియోజకవర్గంలో ఆగిపోయిన దేవాదుల పెండింగ్ పనులు పూర్తి చేసి జనగామకు తాగునీరు అందించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని కోరారు. శనివారం దేవన్నపేట పంపుహౌస్ వద్ద దేవాదుల మూడో దశ పనులను పరిశీలించిన అనంతరం మంత్రులను కలిసిన వినతిపత్రం అందజేశారు. మల్లన్నసాగర్ నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తీసుకువచ్చే పనులు 25 శాతం పూర్తయ్యాయని, మొత్తం పూర్తి చేస్తే ధర్మసాగర్ నుంచి గండిరామారం మీదుగా తపాస్పల్లి వెళ్లే భారాన్ని తగ్గించడమే కాకుండా స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి ప్రాంతాలకు కూడా నీరు ఎక్కువగా విడుదల చేసే అవకాశం ఉంటుందన్నారు. బచ్చన్నపేట, చేర్యాల ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న కెనాల్ పనులు రెండేళ్లుగా నిలిచి పోయాయని, భూసేకరణ సమయంలో కొంతమంది రైతులకు పరిహారం అందజేయగా.. మిగతావారి కారణంగా పనులు నిలిచిపోయినట్లు చెప్పారు. అలాగే జనగామ మండలం చీటకోడూరు డ్యామ్కు గోదావరి జలాలను మళ్లించి పట్టణానికి సరపడా తాగునీరు అందించాలని కోరారు. తరిగొప్పుల, చిల్పూరు, వేలేరు మండలాలకు సంబంధించి లిఫ్ట్ పనులు వెంటనే పూర్తి చేయాలని కోరారు. మంత్రులు ఉత్తమ్, పొంగులేటికి ఎమ్మెల్యే ‘పల్లా’ విజ్ఞప్తి -
ఆదివారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2025
– IIలోuజనగామ: పట్టణంలో మద్యం దుకాణాలు.. బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులు రోడ్లను ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారు. ఇరుకు గల్లీల్లో రోడ్లకు ఇరువైపులా మందుబాబులు వాహనాలు పార్కింగ్ చేస్తుండడంతో అటుగా వెళ్లే మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదు. ‘బహిరంగ మద్యపానం–వైన్స్ ల ఎదుట సామాన్య ప్రజల ఇబ్బందులపై’ శనివా రం రాత్రి 7 గంటల నుంచి 9 వరకు ‘సాక్షి’ చేపట్టిన విజిట్లో అనేక విషయాలు వెలుగు చూశాయి. ● బస్టాండ్ చిన్నగేటు ఏరియాలోని భువన బార్ అండ్ రెస్టారెంట్ వెనుక గల్లీ పూర్తిగా వాహనాల పార్కింగ్తో నిండిపోయింది. మధ్యలో మిగిలిన చిన్న సందు నుంచి కూరగాయల మార్కెట్, ఇతర పనుల కోసం వచ్చిన మహిళలు ఇబ్బంది పడుతూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ● రైల్వేస్టేషన్ అమ్మబావి ప్రాంతం దుర్గావైన్స్ సమీపంలో కనీసం వీధి దీపాలు సరిగా లేవు. వైన్స్కు వచ్చే వారితో పాటు అందులో మద్యం సేవించి బయటకు వెళ్లిపోయే వారితో గుండ్లగడ్డ, అంబేడ్కర్నగర్, ధర్మకంచ తదితర ప్రాంతాలకు వెళ్లే మహిళలు, సాధారణ ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. ● ఆర్అండ్బీ అతిథిగృహం ఆవరణలోని సింధు వైన్స్, లిక్కర్ మార్టుకు వచ్చే వారు తమ వాహనాలను రోడ్డుపైనే అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తున్నారు. దీంతో సిద్దిపేట ప్రధాన రహదారిపై వెళ్లే వాహనాలతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోంది. కూరగాయల కొనుగోలు, వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చే కుటుంబాలు వైన్స్ను దాటేసి రావాలంటే భయపడి పోతున్నారు. ● సూర్యాపేట ప్రధాన రహదారిపై ఉన్న బాలాజీబార్కు వచ్చే వాహనాలతో సింగిల్ లేన్ రోడ్డు పూర్తిగా నిండిపోతోంది. ● హైదరాబాద్ రోడ్డులోని బాలాజీబార్కు వచ్చే వాహనాలను రోడ్డుపైనే పార్కింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం తప్పడం లేదు. తరుచూ ప్రమాదాలు సైతం జరుగుతుంటాయి. దుకాణా లు, ఆస్పత్రులకు వచ్చే మహిళలు, కుటుంబాలు భయంభయంగానే వెళ్తున్నారు. ● ఆర్టీసీ జంక్షన్లోని ఎస్ఎస్ఎస్ వైన్స్ ఎదుట ఇదే పరిస్థితి నెలకొంది. రోడ్డుపై రెండు లేన్లలో వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ● ఇదిలా ఉండగా నెహ్రూపార్కు ఏరియా నుంచి 60ఫీట్ల రోడ్డు, వడ్లకొండ రూట్, ప్రెస్టన్ ఏరియా, వీవర్స్కాలనీ, పెద్ద మోరీ తదితర ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో చాలా మంది మద్యం సేవిస్తూ కనిపించారు. వైన్స్, బార్లు, లిక్కర్ మార్టుల వద్ద మాత్రం పట్టణంలోని ప్రధాన రోడ్లను ఆక్రమించి వాహనాలను పార్కింగ్ చేస్తుండడంతో రాకపోకల కు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. సూర్యాపేట రోడ్డు బాలాజీబార్ వద్ద రోడ్డు సగభాగానికి వచ్చిన వాహనాల పార్కింగ్ న్యూస్రీల్మద్యం దుకాణాలు, బార్ల నిర్వహణ అస్తవ్యస్తం బహిరంగ ప్రదేశాల్లో సిట్టింగ్లు విచ్చలవిడిగా వాహనాల నిలిపివేత దారివెంట వెళ్లే మహిళలకు ఇబ్బందులు ‘సాక్షి’ విజిట్లో వెలుగులోకి సమస్యలు -
హెచ్చరిక బోర్డుల ఏర్పాటు
లింగాలఘణపురం: మండలంలోని జనగామ–సూర్యాపేట రోడ్డులో నెల్లుట్ల నుంచి కుందారం క్రాస్ రోడ్డు వరకు తరుచూ ప్రమాదాలు జరుగుతుండగా రూరల్ సీఐ శ్రీనివాసురెడ్డి ఆధ్వర్యాన శుక్రవారం హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశా రు. నెల్లుట్ల–కుందారం క్రాస్రోడ్డు వరకు మూడు కిలోమీటర్ల దూరంలో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ‘డేంజర్ జోన్’ శీర్షికన గత నెల 29న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే ఎస్సై శ్రావణ్కుమార్ ఆధ్వర్యాన డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ.. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పిస్తున్నారు. -
పంచాయతీ కార్యదర్శి అవినీతిపై విచారణ
రఘునాథపల్లి: ఇటీవల రఘునాథపల్లి జీపీ కార్యదర్శిగా పనిచేసిన కవిత రూ.9.20లక్షల నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం డీపీఓ నాగపురి స్వరూప విచారణ చేపట్టారు. ప్రస్తుతం వెల్ది పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న కమిత.. రఘునాథపల్లి కార్యదర్శిగా పనిచేసిన సమయంలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్నుల రూపంలో వసూలు చేసిన నగదును ఎస్టీఓలో జమ చేయకుండా నేరుగా ఖర్చు చేశారని, ఇది చట్టవిరుద్ధమని డీపీఓ పేర్కొన్నారు. ఖర్చు చేసే ముందు గ్రామసభ తీర్మానం తీసుకోవాల్సి ఉంటుందని, అంతేకాకుండా స్థాయికి మించి ఖర్చు చేసినట్లు వివరించారు. రూ.5వేలకు మించి ఖర్చు చేసే అధికారం కార్యదర్శికి లేదని, వసూలైన మొత్తాన్ని పంచాయతీ పను ల నిమిత్తం ఖర్చు చేసి ఆ తర్వాత బిల్లులు సడ్మిట్ చేసినట్లు చెప్పారు. ఇందులో ఏదైనా అవినీతి జరిగిందా అనే కోణంలో విచారిస్తున్నట్లు తెలిపా రు. ఆమె వెంట ఎంపీఈఓ వెంకటేశ్వర్లు, పంచాయ తీ కార్యదర్శి బాలకిషన్ ఉన్నారు. ఈ సందర్భంగా కార్యదర్శి కవిత మాట్లాడుతూ.. తాను ఒక్క పైస కూడా దుర్వినియోగం చేయలేదని, గ్రామ సమస్య ల పరిష్కారం నిమిత్తం వసూలైన డబ్బుల నుంచి నేరుగా ఖరు చేయాల్సి వచ్చిందని వివరించారు. -
5 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి
● వీసీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిజనగామ రూరల్: పైలట్ ప్రాజెక్టు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో ఒక్కో మండలాన్ని పైలట్గా తీసుకొని గ్రామాల్లో ఈనెల 5వ తేదీ నుంచి 20 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నా రు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సీసీఎల్ఏ కమిషనర్ నవీన్మిట్టల్తో కలిసి వీడియో కాన్ఫరె న్స్ నిర్వహించగా.. జిల్లాలో కలెక్టర్ రిజ్వాన్ బాషా, డీసీపీ రాజమహేంద్రనాయక్, అదనపు కలెక్టర్లు పింకేష్కుమార్, రోహిత్సింగ్ పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల్లో పొజిషన్లో ఉన్న రైతుల దరఖాస్తులు పరిశీలించాలని, భూమి లేని నిరుపేదలు పోజిషన్లో ఉంటే వారికి పట్టాలు ఇచ్చేందుకు సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పట్టాలు ఉండి పొజిషన్లో లేని దరఖాస్తులను కూడా పరిశీలించాలని, హైకోర్టు నుంచి అనుమతి రాగానే సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరించాలని చెప్పారు. దీనికి అవసరమైన కార్యాచరణ పూర్తి చేయాలన్నారు. గతంలో పంపిణీ చేసిన అసైన్డ్ భూములు విక్రయిస్తే ముందు ఆ పట్టాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు చేసినవారు భూమి లేని నిరుపేదలైతే ఎంత భూమి క్రమబద్ధీకరించాలో ప్రభుత్వం నిర్ణయిరస్తుంన్నా రు. ఈ సందర్భంగా ‘నీట్’ నిర్వహణ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు తదితర అంశాలపై సమీక్షించారు. -
ఖైదీలకు హక్కులు తెలియాలి..
సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్ జనగామ రూరల్: ఖైదీలకు తమ హక్కులు తెలియాలి.. ఈ మేరకు జైలు, జైలు బయట వివరా లతో కూడిన పోస్టర్లను అంటించాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సబ్ జైలును శుక్రవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. జైలులో వసతులు, భోజనం, అలాగే ఖైదీల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. జైలు సిబ్బందితో ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలపాలని, ప్రతి ఒక్కరికీ న్యాయవాది ఉండాలని చెప్పారు. సమస్యలు ఉంటే రాసి సబ్ జైలులోని బాక్స్లో వేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఖైదీలకు చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించా రు. కార్యక్రమంలో సబ్జైలు సూపరింటెండెంట్ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
దేవరుప్పుల/కొండకండ్ల/పాలకుర్తి: భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రతీ పౌరుడి నైతిక బాధ్యత అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు నిర్వహించిన ‘జై భీమ్, జై బాపు, జై సంవిధాన్’ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర శుక్రవారం దేవరుప్పుల మండలం రామరాజుపల్లి, కొడకండ్ల మండలం రామవరం, పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంబేడ్కర్ను అవమానించేలా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ సర్కారు మతం మసుగులో దేశ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ గత పాలకుల తీరుపై అర్థరహిత విమర్శలు చేస్తోందని చెప్పారు. రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్, టీపీసీసీ సభ్యులు డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ నాయక్, కొడకండ్ల, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ల చైర్పర్సన్లు ఆండాలు, మంజులభాస్కర్, కాంగ్రెస్, అనుబంధ సంఘాల నాయకులు నల్లా శ్రీరామ్, పులిగిళ్ల వెంకన్న, కృష్ణ, గణేష్, నాగరాజు, రసూల్, సత్యనారాయణ, సురేష్నాయక్, రాజేష్నాయక్, యాకేష్యాదవ్, రాపాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, హర్వీశ్ తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
సివిల్ సప్లయీస్కు ‘సీఎంఆర్‘ చిక్కులు
సాక్షిప్రతినిధి, వరంగల్: ● హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఓ రైసుమిల్లుకు 2021–22, 2022–23 సంవత్సరాలకు కేటాయించిన సీఎంఆర్ కింద 4,310 మె.టన్నుల బియ్యానికి 1,889 మె.టన్నులు మాత్రమే సరఫరా చేశారు. సుమారు రూ.7.50 కోట్ల విలువైన బియ్యం ఎగవేయడంతో అప్పట్లో సివిల్ సప్లయీస్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి బియ్యం లేకపోవడంతో కేసులు నమోదు చేసి డిఫాల్టర్ లిస్టులో చేర్చారు. ● మహబూబాబాద్ జిల్లాలోని మూడు మిల్లుల్లో గత సీజన్లో రూ.30.38 కోట్ల విలువైన 1,13,796 క్వింటాళ్ల ధాన్యం దారి మళ్లించినట్లు తేలింది. అదే విధంగా కేసముద్రం విలేజ్ గ్రామంలోని రైస్ మిల్లుల్లో సివిల్ సప్లయ్, విజిలెన్స్, టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.30 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించి కేసులు పెట్టారు. ఉమ్మడి జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద రైసుమిల్లర్లకు సరఫరా చేయాల్సి ఉండగా.. ఈసారి డిఫాల్టర్లకు ఇవ్వొద్దని ప్రభుత్వంనుంచి కచ్చితమైన ఆదేశాలు ఉన్నాయి. 20 శాతం మిల్లర్లు ఈ జాబితాలో ఉండే అవకాశం ఉంది. సివిల్ సప్లయీస్ అధికారులు వాటిపై పునరాలోచన చేస్తూ మిగతా మిల్లర్లకు ధాన్యం ఇస్తున్నారు. ధాన్యం దిగుబడుల అంచనాలకు అనుగుణంగా ఉమ్మడి వరంగల్లో 987 కొనుగోలు కేంద్రాలను పౌరసరఫరాల శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు జిల్లాల వారీగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. జేఎస్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పాక్షికంగా సాగుతుండగా.. మిగతా జిల్లాల్లో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ధాన్యం అమ్ముకుంటున్న రైతులకు ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మెనేజ్మెంట్ సిస్టం (ఓపీఎంఎస్) ద్వారా డబ్బు బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తున్నారు. దాడులు, కేసులు పెట్టినా అదే మొండివైఖరి... సీఎంఆర్ కింద ఇచ్చిన ధాన్యాన్ని పలు జిల్లాల్లో కొందరు రైస్ మిల్లర్లు పక్కదారి పట్టించారు. రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాలశాఖ టాస్క్ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మూకుమ్మడి తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేశారు. గత రబీ సీజన్లో సీఎంఆర్ కోసం కూడా హనుమకొండ, వరంగల్, జేఎస్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లోనూ ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లాలోని మూడు మిల్లుల్లో రూ.30.38 కోట్ల విలువైన 1,13,796 క్వింటాళ్ల ధాన్యం దారి మళ్లించినట్లు తేలింది. వరంగల్ జిల్లాలోని ఓ మిల్లులో రూ.3.79 కోట్ల విలువైన 12,360 క్వింటాళ్లు పక్కదారి పట్టినట్లు గుర్తించి కేసు పెట్టారు. మొత్తంగా ఉమ్మడి వరంగల్లో జరిపిన తనిఖీల్లో ఆరేడు సంవత్సరాలకు సంబంధించిన రూ.201 కోట్లకు పైగా విలువైన బియ్యం బకాయి ఉన్నట్లు వెల్లడించారు. కాగా ఇప్పటికే డిఫాల్టర్ జాబితాలో ఉన్న పలువురికి నోటీసులు జారీ చేశామని, 6ఏ కేసులు కూడా నమోదు చేశామని, అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్టు కూడ పెడతామని పౌరసరఫరాలశాఖ అధికారులు చెబుతున్నారు. రబీ సీజన్ సీఎంఆర్ ఆచితూచి.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాయిల్డ్, రా రాస్ మిల్లులు 328 వరకు ఉన్నాయి. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, జనగామ, భూపాలపల్లి జిల్లాలోని మిల్లుల నుంచి బకాయిలు సుమారు లక్షా 20వేల మెట్రిక్ టన్నుల పైచిలుకు రావాల్సి ఉందని ఫైనల్గా తేల్చారు. సీఎంఆర్ బకాయి ఉన్న డిఫాల్టర్లకు ఈ సీజన్లో ధాన్యం ఇవ్వరాదన్న ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ 10.24 లక్షల మె.టన్నుల మేరకు ధాన్యం దిగుబడి ఉంటుందని అంచనా వేసిన అధికారులు 987 కొనుగోలు కేంద్రాల కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇన్టైమ్లో సీఎంఆర్ ఇచ్చిన మిల్లర్లకే సరఫరా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిఫాల్టర్గా ఉన్న రైసుమిల్లర్లకు కేటాయించే ధాన్యాన్ని సకాలంలో సీఎంఆర్ ఇచ్చిన మిలర్లకు తరలించడమా... లేక ఈ సీఎంఆర్ బకాయి రాబట్టుకుని అదనంగా జమానత్లు తీసుకుని వారికే ఇవ్వడమా... అన్న కోణంలో కసరత్తు చేస్తున్నారు. పెండింగ్లో గత రబీ, ఖరీఫ్ సీఎంఆర్ బియ్యం లక్ష్యానికి దూరంగా చాలామంది రైసుమిల్లర్లు గడువు పెంచినా కదలని సీఎంఆర్ బకాయి ఊపందుకున్న రబీ ధాన్యం కొనుగోళ్లు డిఫాల్టర్లకు సీఎంఆర్ ఇవ్వద్దని సర్కారు ఆదేశం.. ‘ప్రత్యామ్నాయం’పై కసరత్తు -
ఆలయ అభివృద్ధికి రూ.1.50లక్షల విరాళం
స్టేషన్ఘన్పూర్: హనుమకొండకు చెందిన కానిస్టేబుల్ రఘునాయకుల రవిప్రసాద్రెడ్డి, అతడి కుమార్తె రశ్మితరెడ్డి ఆధ్వర్యాన స్టేషన్ఘన్పూర్ మండలం నమిలిగొండలోని శివాల యం అభివృద్ధికి రూ.1.50లక్షలు విరాళం అందజేశారు. భగవంతుడి కృపతో తన కుమార్తె రశ్మితరెడ్డి ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నదని, గతంలో మొక్కుకున్న విధంగా ఆలయ అభివృద్ధికి విరాళంగా శుక్రవారం ఆ మొత్తాన్ని అందజేసినట్లు రవిప్రసాద్రెడ్డి తెలి పారు. కానిస్టేబుల్ గుంజ కుమారస్వామి, ఆలయ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం పరిశీలన జనగామ రూరల్: ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు కలెక్టరేట్లోని ప్రధాన ఈవీఎం గోదాంను కలెక్టర్ రిజ్వాన్ బాషా శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా నమో దు పుస్తకం, సీసీ కెమెరాల పనితీరు, నియంత్రణ పద్ధతులను తెలుసుకున్న ఆయన భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాల ని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. జనగామ తమాసీల్దార్ హుస్సేన్ పాల్గొన్నారు. వేసవి క్రీడా శిక్షణను వినియోగించుకోవాలిపాలకుర్తి టౌన్: ప్రభుత్వం క్రీడాకారులను ఉత్తమంగా తీర్చిదిద్దడానికి నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి వెంకట్రెడ్డి అన్నారు. శుక్రవారం గూడూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. జిల్లా పరిధి ఏడు మండలాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని, సెలవులను వృథా చేయకుండా క్రీడలను ఆస్వాదించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ పోతుగంటి నర్సయ్య, ఉన్న త పాఠశాల హెచ్ఎం శైలజ, పీఈటీ అసోసియేషన్ అధ్యక్షుడు గోర్సింగ్, పీడీ చిట్యాల యాదగిరి, ఎస్సై పవన్కుమార్, చెరిపెల్లి యాకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ప్రమాదాలు లేని జిల్లా లక్ష్యం : ఎస్ఈజనగామ: విద్యుత్ ప్రమాదాలు లేని జిల్లా లక్ష్యం.. భద్రతను అందరు బాధ్యతగా తీసుకుంటే ఇది సాధ్యమని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్ అన్నారు. ఈ నెల 1 నుంచి 7వ తేదీ వరకు జిల్లాలో విద్యుత్ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం జనగామ మండలం గానుగుపహా డ్లో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్ అధికారులు చేపట్టిన పొలం బాట కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తున్నద ని చెప్పారు. ప్రమాదాలు జరగకుండా భద్రతా ప్రమాణాలపై ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంతో పాటు అన్ని రకాల భద్రత పరికరా లు అందించామని చెప్పారు. విద్యుత్ సమస్యలు ఉత్పన్నమైన సమయంలో 1912 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. అనంతరం విద్యుత్ ప్రమాదాల నివారణ వివరాల పోస్టర్ ను ఆవిష్కరించారు. సదస్సులో డీఈ లక్ష్మీనా రాయణ తదితరులు పాల్గొన్నారు. మెరిట్ ఆధారంగానే నియామకాలు : డీఎంహెచ్ఓ జనగామ: జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యాన జాతీయ ఆరోగ్య మిషన్ స్కీంలో పలు కేటగిరీ లకు సంబంధించి ఉద్యోగ నియామకాలను మెరిట్ ఆధారంగా చేపట్టినట్లు డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు తెలిపారు. శుక్రవారం ఆయ న విలేకరులతో మాట్లాడుతూ చిల్పూరు మండలం కృష్ణాజీగూడెంకు చెందిన మారపాక ప్రేమ్కుమార్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజ ర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోగా.. ఆయన కు సంబంధించి అర్హతలతో కూడిన ఎంపీహెచ్ఏ(ఎం) సర్టిఫికెట్ 2021 ఏప్రిల్తో కాలపరిమి తి ముగిసిందని, రెన్యువల్ చేయించుకుని గడువులోగా సమర్పించక పోవడంతో పరిగణలోకి తీసుకోలేదన్నారు. మెరిట్ జాబితాలో నంబ రింగ్లో ఒకటి నుంచి 11 వరకు ఉన్న అభ్యర్థు లను ఉద్యోగానికి అవసరమైన అర్హతలు లేని కారణంగా ఎంపిక చేయలేదని తెలిపారు. ప్రేమ్కుమార్కు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ము గ్గురు అధికారులతో కమిటీని నియమించామ ని, పారదర్శకంగా నియామక ప్రక్రియ జరిగిన ట్లు నిర్థారించినట్లు తెలిపారు. -
‘నీట్’కు సర్వం సిద్ధం
రేపు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష● 582 మంది విద్యార్థులు.. రెండు సెంటర్లు ● అరగంట ముందే గేట్లు క్లోజ్ ● అడ్మిట్ కార్డు, ఐడీ ఉంటేనే అనుమతి ● సీసీ కెమెరాల నిఘా.. మూడంచెల భద్రత ● ఏర్పాట్లపై సమీక్షించిన కలెక్టర్జనగామ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్–2025) ఈ నెల 4న నిర్వహించడానికి జిల్లాలో సర్వం సిద్ధం చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో పరీక్ష నిర్వహణపై కలెక్టర్ రిజ్వాన్ బాషా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంబీబీఎస్తో పాటు బీడీఎస్, బీఎస్ ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాని కి నిర్వహించే ఈ పరీక్ష కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెనీ(ఎన్టీఏ) అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు నీట్ యూజీ అధి కారిక వెబ్సైట్ నుంచి అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ సహాయంతో అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రెండు సెంటర్లు.. 582 మంది విద్యార్థులు జిల్లాలో ‘నీట్’ నిర్వహణకు రెండు సెంటర్లను కేటాయించారు. మొత్తం 582 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా.. పట్టణంలోని ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల సెంటర్లో 504 మంది, పెంబ ర్తి ఎంజేపీ గురుకులం సెంటర్లో 78 మంది విద్యార్థులను కేటాయించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా పర్యవేక్షణలో చీఫ్సూపరింటెండెంట్ల ఆధ్వర్యాన 49 మంది ఇన్విజిలేటర్లు ‘నీట్’ విధులు నిర్వర్తించనున్నారు. డీసీపీ రవీంద్రనాయక్ నేతృత్వంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఎన్టీఏ, జిల్లా అబ్జర్వర్ల పర్యవేక్షణ ఉంటుంది. బయోమెట్రిక్.. సీసీ కెమెరాల నిఘా ఎన్టీఏ పర్యవేక్షణలో సీసీ కెమెరాల నిఘా మధ్య ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించే ‘నీట్’ పరీక్ష కోసం మధ్యాహ్నం 1.30 గంటల లోపు వచ్చిన విద్యార్థులను మాత్రమే సెంటర్లోకి అనుమతిస్తారు. అడ్మిట్ కార్డు, ఐడీ కార్డు తప్పనిసరి వెంట తెచ్చుకోవాలి. విద్యార్థులు సెంటర్లోకి వెళ్లిన తర్వాత బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది. వీటికి అనుమతి లేదు పరీక్ష కేంద్రంలోకి డిజిటల్, ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్, ఇతర వాచ్లు, నిబంధనలకు లోబడిన వివిధ ఆభరణాలు, కర్చీఫ్ తదితరాలకు అనుమతి లేదు. ఇదిలా ఉండగా పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్ల బాధ్యతలు, విధులపై నేడు(శనివారం) సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ల ఆధ్వర్యాన అవగాహన కల్పించి, ఐడీ కార్డులు అందజేయనున్నారు. పకడ్బందీగా ఏర్పాట్లు : కలెక్టర్ జిల్లాలో ‘నీట్’ పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. సమీక్షలో ఆయన మాట్లాడుతూ మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష ఉంటుందని, విద్యార్థులు 1.30 గంటల లోపు హాజరు కావాలన్నారు. ఆ తర్వాత వచ్చిన వారిని లోనికి అనుమతించరని, అడ్మిట్, ఐడీ కార్డులు లేకుంటే పరీక్షకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా అబ్జర్వర్ గౌసియాబేగం, సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ నర్సయ్య, చీఫ్ సూపరింటెండెంట్లు రవీందర్నాయక్, అనిత తదితరులు పాల్గొన్నారు.పటిష్ట బందోబస్తు: సీపీ వరంగల్ క్రైం: కమిషనరేట్ పరిధిలో ఈనెల 4న(ఆదివారం) జరిగే నీట్ ప్రవేశ పరీక్ష కేంద్రా ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి లో మొత్తం 13 పరీక్ష కేంద్రాలున్నాయని, ఇందులో వరంగల్, హనుమకొండలో 11, జనగా మలో 2 పరీక్ష కేంద్రాలున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తుతో పాటు సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి ఊరేగింపులు, ర్యాలీలు, ధర్నాలు, గుంపులుగా తిరగడం నిషేధమని, పరీక్ష పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసేయాలని ఈ సందర్భంగా కోరారు. -
లక్ష్యానికి మించి రుణం
మహిళల ఆర్థిక పరిపుష్టికి కృషి ● స్వయం సహాయక సంఘాలకు రుణాలు ● బ్యాంకు లింకేజీ ద్వారా రూ.532.84 కోట్లు ● సీ్త్రనిధి ద్వారా రూ.19.95 కోట్ల చెల్లింపులు ● రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచిన జిల్లాజనగామ రూరల్: స్వయం సహాయ క సంఘాలకు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాల చెల్లింపుల్లో జిల్లా అధికారులు ఆదర్శంగా నిలిచారు. ఆర్థిక సంవత్సరం ముగియక ముందే లక్ష్యాన్ని అధిగమించి జిల్లాను రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిపారు. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి సాధించా లనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా స్వయం సహాయక సంఘాల కు రుణాలు మంజూరు చేస్తోంది. అవసరాల మేరకు వారికి తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాలతో పాటు సీ్త్రనిధి రుణాలు అందజేస్తున్నారు. మహిళలు ప్రతినెలా ఈఎంఐ రూపంలో తిరిగి చెల్లిస్తున్నారు. లక్ష్యానికి మించి రుణాల పంపిణీ జిల్లాలో 5,777 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరం రూ.476.47 కోట్ల రుణాల పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యం పెట్టుకున్నారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి నెలరోజుల సమయం ఉండగానే లక్ష్యం చేరుకున్నారు. మొత్తం రూ.532.84 కోట్ల రుణాలు(111.83 శాతం) పంపిణీ చేశారు. మరోవైపు సీ్త్రనిధి ద్వారా రూ.19.95 కోట్ల రుణాలు లక్ష్యం కాగా.. ఇప్పటివరకు రూ.20 కోట్ల రుణాలు అందజేశారు. జిల్లాలో అత్యధికంగా చిల్పూరు మండలంలో 441 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.93.92 కోట్ల రుణాలు పంపిణీ చేసి మొదటిస్థానంలో నిలిచారు. అలాగే అత్యల్పంగా తరిగొప్పుల మండలంలో 170 సంఘాలకు రూ.14.46 కోట్లు అందజేసి చివరిస్థానంలో నిలిచింది. రికవరీ ఇలా. బ్యాంకు లింకేజీ ద్వారా అందజేసిన రుణాల్లో దాదాపు రూ.50 కోట్ల వరకు మొండి బకాయిలు ఉన్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. సీ్త్రనిధి రుణాల్లో ఈ ఏడాదిలో రూ.20 కోట్లు రికవరీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.62 శాతం రికవరీ అయినట్లు పేర్కొన్నారు. రుణాల పంపిణీతోపాటు రికవరీ కోసం క్షేత్రస్థాయిలో ఐకేపీ సిబ్బంది నిత్యం స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తూ.. తీసుకున్న రుణం డబ్బులు సకాలంలో చెల్లించడం ద్వారా కలిగే ప్రయోజనాలను వారికి వివరిస్తున్నారు.2024–25 సంవత్సరం మండలాల వారీగా రుణ పంపిణీ వివరాలు(రూ.కోట్లలో)మండలం సంఘాలు రుణ లక్ష్యం పంపిణీ బచ్చన్నపేట 886 45.51 39.69 చిల్పూర్ 828 45.84 93.92 దేవరుప్పుల 859 48.56 35.56 స్టేషన్ఘన్పూర్ 917 44.28 51.53 జనగామ 709 36.15 51.59 కొడకండ్ల 578 25.56 42.39 లింగాలఘణపురం 818 41.31 40.14 నర్మెట 363 20.21 15.81 పాలకుర్తి 1087 54.06 46.81 రఘునాథపల్లి 1066 50.25 67.02 తరిగొప్పుల 419 24.24 14.46 జఫర్గఢ్ 748 40.50 34.46 మొత్తం 9,278 476.47 532.84రుణాలను సద్వినియోగం చేసుకోవాలి మహిళా సంఘాల సభ్యులకు 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.476 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటివరకు లక్ష్యానికి మించి రూ.532 కోట్ల రుణాలు అందజేశాం. రికవరీ కోసం క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నాం. సభ్యులు రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. – వసంత, డీఆర్డీఓ -
ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులు జరిగేలా చూడాలి
చిల్పూరు: ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని వసతులు ఉన్నా.. చాలా మంది పేదలు విషయం తెలియక అనవసర ఖర్చులతో ఆపరేషన్లు చేయించుకుంటున్నారని, ఇక నుంచి ప్రభుత్వాస్పపత్రుల్లోనే కాన్పులు జరిగేలా సిబ్బంది పాటుపడాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మల్కాపూర్లోని పీహెచ్సీని గురువారం మధ్యాహ్నం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా డాక్టర్ కుశాలితో మాట్లాడుతూ.. నార్మల్ డెలివరీ ఉన్నప్పటికీ ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు డబ్బుల కోసం ఆపరేషన్ల పేరిట రోగుల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారన్నారు. ఇక నుంచి డెలివరీకి ఉన్న వారిని గుర్తించి ప్రభుత్వాస్పత్రుల్లోనే చేర్పించేలా చూడాలన్నారు. అనంతరం చిల్పూరు, మల్కాపూర్, రాజవరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట మండల ప్రత్యేకాధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీలత, తహసీల్దార్ సరస్వతి, ఎంపీఓ మధుసూదన్, ఏఈఓలు నరసింహులు, వినయ్, యాకూబ్ తదితరులు ఉన్నారు. కలెక్టర్ను కలిసిన డీఈఓ జనగామ రూరల్: నూతనంగా డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన భోజన్న గురువారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ను మార్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్క అందజేశారు. ఆయన వెంట ఏపీఓ రమేశ్ ఉన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ -
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపండి
● సీపీ సన్ప్రీత్సింగ్ వరంగల్ క్రైం: పోలీస్ అధికారులు ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పనిచేసి పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారులను గురువారం కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సన్ప్రీత్సింగ్ ఘనంగా సత్కరించారు. జ్ఞాపికలను అందజేశారు. పదవీ విరమణ పొందిన వారిలో ఎస్సైలు యుగేందర్, రాజశేఖర్రెడ్డి, కృష్ణారావు, ఎలిషా, ఏఎస్సై కుమారస్వామి, హెడ్కానిస్టేబుల్ రాంరెడ్డి ఉన్నారు. ఈసందర్బంగా సీపీ మాట్లాడుతూ సుదీర్ఘంగా కాలంగా పోలీస్ శాఖకు అందించిన సేవలు మరిచిపోమని తెలిపారు. భవిష్యత్లో శాఖాపరమైన సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు రవి, సురేశ్కుమార్, ఏసీపీలు సురేంద్ర, నాగయ్య, అంతయ్య, ఆర్ఐలు స్పర్జన్రాజ్, సతీష్, శ్రీధర్, ఏఓ రామకృష్ణస్వామి, ఆర్ఎస్సై శ్రవణ్కుమార్ తదితరులు ఉన్నారు. నీటిని ఒడిసి పట్టాలి ● డీపీఓ స్వరూపారాణి బచ్చన్నపేట: గ్రామాల్లో ఇళ్ల నుంచి బయటకు వచ్చే నీటిని ఒడిసి పట్టాలని అందుకు.. ఇంకుడు గుంతలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి నాగపురి స్వరూపారాణి అన్నారు. గురువారం మండలంలోని నారాయణపురంలో ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులు శ్మశాన వాటిక, డంపింగ్ యార్డులను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటిని భూమిలో ఇంకేలా చూస్తే భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. అలాగే గ్రామాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా చూడాలని అందుకు గ్రామస్తులు తడి, పొడి చెత్తను వేరు చేసి జీపీ ట్రాక్టర్లలో వేసేలా చూడాలన్నారు. నర్సరీల్లో వంద శాతం మొక్కలు రక్షించాలని, పార్కులలో కూడా మొక్కల్ని రక్షించాలన్నారు. గ్రామాల్లో అన్ని రకాల పన్నులు వసూలు చేస్తూ వాటి నిర్వాహణ రికార్డులను సక్రమంగా రాయాలని పలు సూచనలిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటమల్లికార్జున్, పంచాయతీ కార్యదర్శులు పలువురు పాల్గొన్నారు. -
కుల గణనపై ఫలించిన రాహుల్గాంధీ పోరాటం
జనగామ: దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని రాహుల్ గాంధీ చేపట్టిన పోరాటం ఫలించిందని జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ అన్నారు. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి ఆదేశాల మేరకు గురువారం డీసీసీ కార్యాలయంలో ఏఐసీసీ అధినేత రాహుల్, సీఎం రేవంత్రెడ్డి ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేసి, స్వీట్లు పంచిపెట్టారు. అనంతనం శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ.. కుల గణనతో పాటు జనగణనను వేగవంతం చేయాలన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఏడాదిన్నర పాలనలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయమని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చెంచారపు బుచ్చిరెడ్డి, ప్రకాశ్ యాదవ్, బన్సీ నాయక్, మోటే శ్రీనివాస్, సుధగాని కృష్ణ, తుపాకుల రాములు, మిద్దెపాక స్టాలిన్, మంతపురి ప్రకాశ్, భూష పర్వతాలు, మధు, అర్షద్, అశోక్ పాల్గొన్నారు. -
క్రీడలతో మానసిక వికాసం
జనగామ రూరల్: యువతకు విద్యార్థులకు క్రీడలతో మానసిక, శారీరక వికాసం కలుగుతుందని జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకటరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చౌడారంలో స్థానిక జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో క్రీడల శాఖ ఆధ్వర్యంలో అథ్లెటిక్స్ వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడాకారులు వేసవి శిక్షణ శిబిరాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర జాతీయ స్థాయి అథెటిక్స్లో పాల్గొనేలా నైపుణ్యాలు నేర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్రెడ్డి, తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కోశాధికారి గంగిశెట్టి మనోజ్కుమార్, శిక్షకులు మునిగె సురేశ్, గ్రామస్తులు కర్ణాకర్, కర్ల శ్రీకాంత్రెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.కార్మికులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలిజనగామ రూరల్: కార్మికులు హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలో అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా జడ్జి విక్రమ్ మాట్లాడుతూ.. కార్మికుల హక్కులు, వారికి సంబంధించిన చట్టాలు, ఆరోగ్య పథకాల గురించి తెలుసుకోవాలన్నారు. కార్మికులు పనిచేస్తున్న ప్రదేశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. లేబర్ కార్డు, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నారు. కార్యక్రమంలో ఆటోడ్రైవర్లు, పెయింటర్స్, చిరు వ్యాపారస్తులు, మెకానిక్లు, వడ్రంగులు, సోషల్ వర్కర్స్, ఐటీఐ విద్యార్థులు, పారా లీగల్ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు చరిష్మజఫర్గఢ్: మండలంలోని హిమ్మత్నగర్ గ్రామానికి చెందిన విద్యార్థి తాటికాయల చరిష్మ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) బాక్సింగ్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలంగాణ రాష్ట్ర బాక్సింగ్ ఆర్గనైజర్ సెక్రటరీ శీలం పార్థసారధి గురువారం తెలిపారు. హిమ్మత్నగర్కు చెందిన చరిష్మ మడికొండలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతోందని.. రెండేళ్ల నుంచి హైదరాబాద్లోని టీజీఎస్డబ్ల్యూఆర్ పాఠశాల బాక్సింగ్ అకాడమీలో కోచ్ కృష్ణ తాప దగ్గర ప్రత్యేక శిక్షణ పొందుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 30 నుంచి 5వ తేదీ వరకు న్యూఢిల్లీలో ఛత్రసల్ స్టేడియంలో 68వ (ఎస్జీఎఫ్) జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. ఈపోటీల్లోనూ ప్రతిభను కనబర్చి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆయన కోరారు. కాగా.. విద్యార్థిని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఉమా మహేశ్వరి, ఫిజికల్ డైరెక్టర్ పద్మ, పీఈటీ సరిత, రమేశ్, శాంసన్ అభినందించారు.‘యువ వికాసం’ పత్రాలు అందజేయాలి..జనగామ రూరల్: రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్న వారు దరఖాస్తు పత్రాలను సంబంధిత కార్యాలయంలో అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతం వారు మండల ప్రజాపాలన కేంద్రాల్లో, పట్టణ ప్రజలు మున్సిపల్ కార్యాలయంలో ఈనెల 3 వతేదీ సాయంత్రం 5 గంటల్లోపు అందజేయాలని సూచించారు. -
ఫలించిన ‘విజయోస్తు’
కోర్టు ఆదేశాలు బేఖాతర్ సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పు ఇచ్చినా టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది.– 8లోuశుక్రవారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 2025అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు అందజేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.– 8లోuన్యూస్రీల్ -
జిల్లాలో మండలాల వారీగా ఫలితాలు
మండలం విద్యార్థులు ఉత్తీర్ణత ఫెయిల్ శాతం బచ్చన్నపేట 557 549 8 98.56 చిల్పూరు 294 293 1 99.96 దేవరుప్పుల 361 356 5 98.61 స్టేషన్ఘన్పూర్ 890 880 10 98.88 జనగామ 1,382 1,372 20 98.56 కొడకండ్ల 359 358 1 99.72 లింగాల ఘణపురం 334 332 2 99.40 నర్మెట 368 366 2 99.46 పాలకుర్తి 668 656 12 98.20 రఘునాథపల్లి 480 473 7 98.54 తరిగొప్పుల 113 113 – 100.00 జఫర్గఢ్ 418 412 6 98.56 మొత్తం 6,224 6,160 74 98.81మొదటి నుంచే ప్రత్యేక శ్రద్ధ పాఠశాల ప్రారంభం నుంచే విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాం. వెనుకబడిన వారిని గుర్తించి ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. – రాజేందర్, ఉపాధ్యాయుడు,కొడకండ్ల2023–24 పరీక్ష రాసిన వారు: 6692ఉత్తీర్ణత: 6569బాలురు: 3076బాలికలు: 3493శాతం: 98.16ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తాం.. పదో తరగతిలో జనగామ జిల్లా ఉత్తమ ర్యాంకు సాధించాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా విజయోస్తు కార్యక్రమం చేపట్టి నిత్యం పర్యవేక్షించారు. ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో టీచర్లు సబ్జెక్టుల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహించారు. స్లిప్టెస్ట్లు నిర్వహించి, వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. రాష్ట్రంలో జనగామకు 3వ స్థానం దక్కేలా కలెక్టర్ చేసిన కృషి.. టీచర్ల శ్రమ విజయాన్ని ముంగిట నిలిపాయి. ఇదే స్ఫూర్తితో వచ్చే సంవత్సరం మరింత మెరుగైన ర్యాంకు కోసం కష్టపడతాం. – డి.ఓజన్న, డీఈఓ -
సీనియర్ సిటిజన్ల అపూర్వ సమ్మేళనం
జనగామ రూరల్: జనగామలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ 1977–79 బ్యాచ్ పూర్వ విద్యార్థులు గురువారం ఘట్కేసర్లోని ఓ రీసార్ట్లో కలుసుకున్నారు. 46 ఏళ్ల తర్వాత 65 ఏళ్లు దాటిన వారంతా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకున్నారు. ఈసందర్భంగా వారి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. కష్టసుఖాలు, సాధించిన విజయాల్ని చెప్పుకున్నారు. క్లాస్ రూంలో చేసిన అల్లరి, చదువు సాగిన తీరుపై ముచ్చటించుకున్నారు. భవిష్యత్లో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బండిరాజుల శంకర్, అల్లాడి ఉమామహేశ్వర్, టి.సుధాకర్, సంబోజు ఆంజనేయులు, రాపాక లక్ష్మణ్, కర్కెర్ల బాలరాజు, చంద్రమోహన్, బిల్లా జనార్ధన్ రెడ్డి, కె.హరిశ్చంద్ర ప్రసాద్, లింగాల ధర్మేందర్రెడ్డి, మాదారపు సాంబమూర్తి, కొన్యాల శ్రీనివాస్రెడ్డి, పోకల వెంకటేశ్వర్లు, మంచాల కృష్ణమూర్తి, లింగాల రవీందర్ రెడ్డి, వి.శేఖర్ రావు, మహదేవుని కృష్ణమూర్తి, మంగు శ్రీనాథ్, కందుకూరి సోమనర్సయ్య, పంగ జనార్దన్ రెడ్డి, వంటేరు జయపాల్ రెడ్డి, ఎ.సోమారెడ్డి, బత్తుల ఉపేందర్, సీహెచ్.ఉమాదేవి, పెద్ది రాణి, అనూరాధరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కడియం శ్రీహరిది గోబెల్స్ ప్రచారమే
చిల్పూరు: నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అబివృద్ధి చేసింది తానేనంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారని, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. మండల కేంద్రంలో గురువారం మండల ఇన్చార్జ్ మాలోతు రమేశ్నాయక్ అద్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 15 ఏళ్లలో కడియం శ్రీహరిని ప్రజలు మర్చిపోయారని, అందుకు మాజీ సీఎం కేసీఆర్ చేసిన అబివృద్ధే కారణమన్నారు. ప్రస్తుతం ఏసమావేశంలో మాట్లాడినా తానే అబివృద్ధి చేశానని చెప్పుకుంటున్న కడియం చిల్పూరుగుట్ట కింద సమావేశం పెడదామని.. ప్రజలే తీర్పు చెబుతారని అందుకు సిద్ధమా? అని కడియం శ్రీహరికి రాజయ్య సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పాలనలో పదేళ్లలో తాను ఎంతో అబివృద్ధి చేశానని అందుకు నిదర్శనం శిలాఫలకాలే అన్నారు. కార్యక్రమంలో నాయకులు కేశిరెడ్డి మనోజ్రెడ్డి, రాకేశ్రెడ్డి, జనగాం యాదగిరి, నారగోని రాజు, రవిచంద్ర, రంగు హరీశ్, అరూరి రవిచంద్ర, రైతు వెంకన్న, వెంకటస్వామి, పోలు రమ తదితరులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య -
దరఖాస్తుల ఆహ్వానం
జనగామ: మూడేళ్ల డిప్లామా ఇన్ హ్యాండ్లూ మ్స్, టెక్స్టైల్ టెక్నాలజీలో మొదటి, రెండవ సంవత్సరంలో ‘లేటరల్ ఎంట్రీ’ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళి శాఖ జిల్లా సహాయ సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఒడిషా రాష్ట్రం బర్గ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీలో 9 సీట్లకు 8+1 ఈడబ్యూస్ ప్రాతిపదికన అడ్మిషన్లకు తెలంగాణకు చెందిన టెన్త్ విద్యార్హత కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. ఇంగ్లిష్ సబ్జెక్టుగా పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. అన్ని కేటగిరీల్లో ప్రవేశానికి వయసు 2025 జూలై 16 నాటికి 15–23 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 15–25 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. లేటరల్ ఎంట్రీకి గానూ మ్యాఽథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో 10+2లో ఉత్తీర్ణులైన వారు లేదా ఒకేషనల్ విభాగంలో 10+2 పరీక్ష పూర్తి చేసినవారు డీహెచ్, టీటీ కోర్సు(లేటరల్ ఎంట్రీ) సెకండియర్లో ప్రవేశానికి అర్హులని వివరించారు. దరఖాస్తులను జూన్ 7వ తేదీలోగా చేనేత, జౌళిశాఖ జనగామ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.ఉద్యమకారులకు అవార్డులుజనగామ : జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులకు హైదరాబాద్లో శ్రీకాంత్చారి మెమోరియల్ అవార్డ్స్–2025 బుధవా రం అందజేశారు. అవార్డులను శ్రీకాంత్చారి తల్లి శంకరమ్మ తెలంగాణ ఉద్యమ కణం, ఓయూ జేఏసీ చైర్మన్ దరువు సంస్థ నిర్వాహకురాలు అరుణ బంగారం సమక్షంలో ప్రదానం చేశారు. అవార్డు అందుకున్న వారిలో దిగోజు నర్సింహాచారి, అయిలా సోమనర్సింహాచారి. గంగాభవాని, కృష్ణ, సోమేశ్వరాచారి, సంజీవ, ప్రతాప్, సాయికిరణ్, రవి పలువురు ఉన్నారు.మైనార్టీలకు ఉచిత కోచింగ్జనగామ రూరల్: యూపీఎస్సీ సీసాట్ పరీక్ష కోసం(2025–26 విద్యా సంవత్సరం) మైనార్టీ అభ్యర్థులు ఉచిత కోచింగ్కు దరఖాసుచేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి డాక్టర్ బి.విక్రమ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మహిళా అభ్యర్థులకు 33.33 శాతం, అన్ని రిజర్వ్ కేటగిరీల్లో వికలాంగులకు 5శాతం సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్లో మొదటిసారి ప్రవేశం పొందే వారు అడ్మిషన్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. డిగ్రీ పూర్తి చేసిన మైనారిటీ అభ్యర్థులు అర్హులని, మే 1 నుంచి 24 వరకు అప్లికేషన్ల స్వీకరణ, జూన్ 5న అన్ని జిల్లా కేంద్రాల్లోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పరీక్ష ఉంటుందని వివరించారు.రేపు ‘విజయోస్తు’ సంబరాలుజనగామ రూరల్: ‘విజయోస్తు’ కార్యక్రమంతో పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం వెలువడిన సందర్భంగా డీఈఓ రమేశ్ కలెక్టర్ను తన కార్యాలయంలో కలిసి సీట్లు పంచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా పరీక్షలకు సన్నద్ధం చేసిన ఉపాధ్యాయులను అభినందించారు. విద్యా సంవత్స రం ఆరంభం నుంచే విజయోస్తు కార్యక్రమం రూపొందించి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు చెప్పా రు. ఈనెల 2న ‘విజయోస్తు’ సంబరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. -
చట్టాలపై అవగాహన ఉండాలి
● సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్ జనగామ రూరల్: గ్రామాల్లో కమ్యూనిటీ మీడియేటర్లకు చట్టాలపై అవగాహన ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. బుధవారం లీగల్ సెల్ ఆధ్వర్యాన కోర్టు ఆవరణలో చట్టాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేసులు ఎలా పరిష్కరించాలో ముందు తెలుసుకోవాలని సూచించారు. కమ్యూనిటీ మీడియేటర్లుగా శిక్షణ తీసుకున్న వారు 31 మంది ఉన్నారని, ఇందులో చాలామంది రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తోపాటు వివిధ వృత్తుల్లో అనుభవం కలిగిన వారు ఉన్నట్లు పేర్కొన్నారు. వారి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మొత్తంలో కేసులను పరిష్కరించాలని సూచించారు. లీగల్గా తెలియని విషయాలు ఉంటే జిల్లా న్యాయసేవాధికార సంస్థ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. మండలం, గ్రామాల్లో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లు ఓపెన్ చేయాలని అన్నారు. ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు ● ఈనెల 3వ తేదీ వరకు అవకాశం జనగామ: ఎల్ఆర్ఎస్ పథకం కింద 25 శాతం రాయితీతో ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం మరో మూడు రోజుల పాటు అవకాశం కల్పిస్తూ బుధవారం జీఓ జారీ చేసింది. మొదటి విడతలో మార్చి 31 వరకు, రెండోసారి ఏప్రిల్ 2 నుంచి 30 వరకు అవకాశం కల్పించింది. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించే సమయంలో సర్వర్ డౌన్, సర్వే నంబర్లపై తగాదా లు, కోర్టు కేసుల నేపథ్యంలో ప్రోహిబిటెడ్ ఆప్షన్ ఉండడం కారణంగా రెగ్యులరైజేషన్ సమయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గ్రామపంచా యతీ, పురపాలిక పరిధిలో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు దరఖాస్తులు ఇబ్బడి, ముబ్బడిగా వచ్చినా.. అవి పెండింగ్లో ఉండడంతో మే 3వ తేదీ వరకు మరోసారి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.23 కోట్ల ఆదాయం జిల్లాలోని రెండు మున్సిపాలిటీలు, 12 మండలాల పరిధిలో 12,996 దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. ఇప్పటి వరకు రూ.23.87 కోట్ల ఆదాయం ఫీజు రూపంలో ప్రభుత్వానికి వచ్చింది. ఏఎంసీ సూపర్వైజర్ సరెండర్ జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్ కార్యాలయ సూపర్వైజర్ వి.నాగార్జునపై వచ్చిన పలు ఆరోపణలతో పాటు పాలకవర్గం తీర్మానం మేరకు ఆయనను హెడ్ ఆఫీస్కు సరెండర్ చేస్తూ కలెక్టర్ రిజ్వాన్ బాషా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ బుధవారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జున పనిచేసే సమయంలో అతనిపై చాలా ఫిర్యాదులు వచ్చాయని, కలెక్టర్కు వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో నాగార్జునను రాష్ట్ర మార్కెటింగ్ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు వివరించారు. -
శివాని విద్యాసంస్థల విజయభేరి
హసన్పర్తి: టెన్త్ పరీక్ష ఫలితాల్లో శివాని విద్యాసంస్థలు విశ్వరూపం ప్రదర్శించాయి. పాఠశాలకు చెందిన రుద్రోజు శ్రేష్ట 577 మార్కులు, దివిజా 569, శ్రీనిత్యా 553, అంచూరి మానస 551, కుంట మనోజ్ 546, భూపతి అశ్వితారెడ్డి 545, ఽశస్త్ర రాఘశ్రీ 543, పెద్దిరెడ్డి మణిదీప్ రెడ్డి 539, ప్రణవ్ 539, దీవన్కుమార్ 538 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను బుధవారం పాఠశాల యాజమాన్యం అభినందించారు. ఈ కార్యక్రమంలో శివానీ విద్యాసంస్థల కరస్పాండెంట్ టి.స్వామి, డైరెక్టర్లు సురేందర్రెడ్డి, చంద్రమోహన్, రాజు, ఎన్.రమేష్, మురళీధర్, వి.సురేష్, సంతోష్రెడ్డి, ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతిక సమస్య రాకుండా చూడాలి
జనగామ: జిల్లాలో ఈనెల 4న నిర్వహించే 2025–నీట్ పరీక్షలకు సంబంధించి పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల పనితీరులో ఎలాంటి సాంకేతిక సమస్య రాకుండా చూడాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. ఈ మేరకు బుధవారం డీసీపీ రాజమహేంద్రనాయక్తో కలిసి పట్టణంలోని గీతానగర్ ఏబీవీ డిగ్రీ కళాశాల, పెంబర్తి ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఐఎస్ రెసిడెన్షియల్ సెంటర్లను తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్ష రాసేందుకు వీలుగా తరగతి గదుల్లో బెంచీలు, లైటింగ్, ఫ్యాన్లు, తాగునీరు, టాయిలెట్స్ తదితర కనీస వసతులు కల్పించాలని చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులను తనిఖీ చేసిన తర్వాతే ఉదయం 11 గంటల నుంచి లోనికి అనుమతించి మధ్యాహ్నం 1.30 గంటలకు గేట్లు మూసివేస్తామని పేర్కొన్నారు. పరీక్ష సమ యం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని, విద్యార్థులు హ్యాండ్ కర్చీఫ్, మొబైల్ ఫోన్లు, వాచ్, బెల్ట్, పెన్, పెన్సిల్, రబ్బర్, శార్పనర్, ఎలక్ట్రానిక్ పరికరాలు వెంట తెచ్చుకోవద్దని, వాటికి అనుమతి లేదని స్పష్టం చేశారు. అడ్మిట్ కార్డును వెంట తెచ్చుకునే సమయంలో వాటిపై సరైన వివరాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలని సూచించారు. వారి వెంట ఆర్డీఓ గోపీరాం, జీసీడీఓ గౌసియాబేగం, చీఫ్ సూపరింటెండెంట్లు రవీంద్రనాయక్, అనిత తదితరులు ఉన్నారు. నీట్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్నీట్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్, పక్కన డీసీపీ, ఆర్డీఓ, ఇతర అధికారులు -
టెన్త్ ఫలితాల్లో ఎస్ఆర్ విజయభేరి
విద్యారణ్యపురి: టెన్త్ పరీక్షల ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు విజయభేరి మోగించారని ఆ విద్యాసంస్థల చైర్మన్ ఎ.వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోష్రెడ్డి తెలిపారు. సక్కరా శివప్రియ 600 మార్కులకు గాను 586, డి.దీక్షిత్రెడ్డి 586, ఎస్.మనస్విని 585, మనివర్ధన్ 584, శివచరణ్ 584, వి.హాసిని 584 మార్కులు సాధించారని వారు తెలిపారు. 580కి పైగా మార్కులు 23మందికిపైగా సాధించి తమ ప్రతిభను చాటారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులను గమనిస్తూ వాటిని ఆచరణ పరుస్తూ ఒత్తిడి లేని వాతావరణంలో క్రమశిక్షణ, సృజనాత్మకతతో కూడిన విద్యను అందిస్తున్నామన్నారు. ఎస్ఆర్ విద్యాసంస్థల్లో పోటీ పరీక్షలను ఎదుర్కొనే విధంగా ఎస్సెస్సీ విద్యార్థులకు ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్లో ఎక్కువ శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైమ్ స్కూల్స్ను ప్రారంభించామన్నారు. -
పురాతన విగ్రహం తల భాగం లభ్యం
జనగామ రూరల్: జనగామ మండల పరిధి శామీర్పేట గ్రామ శివారులోని ఆవునూరి మల్లారెడ్డికి చెందిన వ్యవసాయ పొలంలో బుధవారం కూలీలు ఉపాధి పనులు చేస్తుండగా ఓ పురాతన విగ్రహం తల భాగం బయటపడింది. ఇది 17వ శతాబ్దానికి చెందిన వైష్ణవ భక్తుడి శిల్పంగా తెలుస్తోందని డిస్కవరీ మ్యాన్, పురావస్తు నిపుణుడు రెడ్డి రత్నాకర్రెడ్డి తెలిపారు. ఇక్కడ ఒక దేవాలయం ఉన్నట్లు ప్రస్తుతం లభించిన ఈ విగ్రహం తల భాగం ఆధారంతో అవగతమవుతోందని అన్నారు. గ్రామంలో ఒక శాసనం ఉందని, దానిపై శివుడు, వినాయకుడు, సూర్యుడి విగ్రహాలు ఉన్నట్లు పేర్కొన్న ఆయన.. దీని ద్వారా ఇక్కడ త్రికూటాలయం ఉందని తెలుస్తున్నదని చెప్పారు. గ్రామంలో గతంలో డంగు సున్నంతో చేసిన పాత్రలు, సున్నపు రాయి లభించాయని వివరించారు. -
విద్యుత్ ప్రమాదాలను నివారించాలి
హన్మకొండ: విద్యుత్ ప్రమాదాలను నివారించాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నా టి వరుణ్ రెడ్డి అన్నారు. బుధవారం మే 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్న విద్యుత్ భద్రతా వారోత్సవాల వాల్ పోస్టర్లు, కరపత్రాలను సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి, ఇన్చార్జ్ డైరెక్టర్లు, సీజీఎంలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతీ సంవత్సరం మే మొదటి వారంలో విద్యుత్ భద్రతా వారోత్సవాలు నిర్వహించడంతో పాటు సిబ్బందికి, ప్రజలకు విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతీ సర్కిల్, డివిజన్, సబ్ డివిజన్లో విద్యుత్ విని యోగదారులకు, రైతులకు విద్యుత్ భద్రత ప్రాముఖ్యతను వివరించాలన్నారు. విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బందితో సమావేశాలు నిర్వహించాలని ఎస్ఈలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశో క్ కుమార్, టి.సదర్ లాల్, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సీఈలు తిరుమల్ రావు, రాజుచౌహాన్, అశోక్, బికంసింగ్, వెంకట రమణ, జాయింట్ సెక్రటరి కె.రమేష్ తదితరులు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి విద్యుత్ భద్రతా వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ -
‘పది’లో షైన్ విద్యార్థుల ప్రతిభ
హన్మకొండ: పదో తరగతి ఫలితాల్లో షైన్ విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని ఆ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్ తెలిపారు. బుధవారం వెలుబడిన ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ మార్కులు సాధించారన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలను తలదన్నేల విద్యారంగంలో విశిష్ట సంస్థగా పేరొందిన షైన్ విద్యార్థులు జిల్లాకే తలమానికంగా నిలిచారన్నారు. షైన్ అంటే కేవలం ‘ఐఐటీ’నే కాదని అన్నిరంగాల్లో ముందుంటామని మరోసారి రూఢీ అయ్యిందన్నారు. జిల్లాలోనే తమ పాఠశాల విద్యార్థి బి.ఆదిత్య దీక్షిత్ 588 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారన్నారు. జి.జ్ఞానదీప్ 580, పి.హాసిని, మణికంఠ, రింషా జైనబ్ 579, సాయిశ్రీ 578, మణిచందన 577, కార్తీక, త్రిషిక పటేల్ 576, సంప్రీత్ 575, రాజేష్ 574 మార్కులు సాధించారన్నారు. 23 మంది విద్యార్థులు 570 మార్కులకు పైగా, 53 మంది 560 మార్కులకు పైగా, 92 మంది 550 మార్కులకు పైగా, 371 మంది 500 మార్కులకు పైగా సాధించారని తెలిపారు. వరంగల్ మహానగరంతో పాటు రాష్ట్రస్థాయిలో షైన్ విద్యార్థులు ముందువరుసలో నిలిచారన్నారు. తెలుగులో 155 మంది, హిందీలు 90 మంది, ఇంగ్లిష్లో 299 మంది, గణితంలో 242 మంది, సైన్స్లో 217 మంది, సోషల్లో 154 మంది ఏ1 గ్రేడ్ సాధించారన్నా రు. డైరెక్టర్ పి.రాజేంద్రకుమార్ మాట్లాడుతూ దే శంలోని ప్రతీ ప్రతిష్టాత్మక కళాశాలలో షైన్ విద్యార్థులున్నారని, దానికి క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన కారణమన్నారు. బుధవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్, డైరెక్టర్లు పి.రాజేంద్రకుమార్, మూగల రమ, ఐఐటీ కోఆర్డినేటర్ మూగల రమేష్, షైన్ ఎర్రగట్టు గుట్ట చైర్మన్ జె.శ్రీనివాస్, ప్రి న్సిపాల్లు జి.రాజ్కుమార్, పి.విశాల్, ప్రగతి రెడ్డి, కవితా రాణి, ఉపాధ్యాయుల అభినందించారు. -
గౌరవం పెరిగేలా పోలీసులు పనిచేయాలి
● పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ కాజీపేట/మడికొండ: ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలు పెరిగేలా పని చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు. బుధవారం కాజీపేట, మడికొండ పోలీస్ స్టేషన్ను సీపీ సన్ప్రీత్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్ని పరిశీలించడంతో పాటు సీసీ కెమెరా ల పనితీరు, కేసుల నమోదు, పరిష్కరానికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. తనిఖీల్లో ఏసీపీ తిరుమల్, సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సైలు శివకృష్ణ, నవీన్ కుమార్, లవన్కుమార్, మడికొండ ఎస్ ఎచ్ఓ కిషన్, ఎస్సై రాజ్కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో చిన్నారికి గాయాలుహసన్పర్తి: హనుమకొండ, అంబాల మార్గమధ్యలో ఎర్రగట్టు గుట్ట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. పరకాల మండలం సీతానాగారాని కి చెందిన శ్రీనివాస్, లలిత దంపతులు బుధవారం ద్విచక్ర వాహనంపై హనుమకొండ నుంచి అంబాల వైపునకు వెళ్తున్నారు. ఎర్రగట్టు గు ట్ట సమీపంలో ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి ప్రధాన ర హదారిపై ఉన్న గేట్వాల్వ్ గుంతను ఢీకొన్నారు. దీంతో శ్రీనివాస్ దంపతులతో పాటు వారి రెండేళ్ల కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే రహదారిపై ప్రమాదకరంగా ఉన్న గేట్వాల్వ్ గుంత విషయం అధికా రుల దృష్టికి తీసుకెళ్లిన స్పందించడంలేదని స్థానికులు వాపోతున్నారు. -
గురువారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2025
ఫలితాల నమోదు ఇలా.. జిల్లాలో మొత్తం 180 పాఠశాలలు ఉండగా.. అందులో ఎయిడెడ్ 93.2 శాతం, జెడ్పీ 98.11, సర్కారు స్కూళ్లు 98.80, ఆశ్రమ, మోడల్ 98.98, కేజీబీవీలు 99.07, ప్రైవేట్ 99.28, సోషల్ వెల్ఫేర్ 99.32, ట్రైబల్ వెల్ఫేర్ 99.34, బీసీ వెల్ఫేర్, రెసిడెన్షియల్, మైనార్టీ పాఠశాలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. వంద శాతం ఫలితాలు సాధించిన ప్రభుత్వ స్కూళ్లు 127 ఉన్నాయి.‘పది’ ఫలితాల్లో 98.81శాతం ఉత్తీర్ణత ● రాష్ట్రంలో జిల్లాకు మూడో స్థానం ● గత ఏడాది కంటే పెరిగిన ఉత్తీర్ణత ● వంద శాతం సాధించిన పాఠశాలలు 127 జనగామ రూరల్: పదో తరగతి ఫలితాల్లో ఎప్పటిలాగే బాలికలు హవా కొనసాగించారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో జిల్లా 98.81 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, పాఠశాలలు, మైనార్టీ, కస్తూర్బాగాంధీ, సాంఘిక సంక్షేమ, మహాత్మాజ్యోతిబా పూలే, బీసీ వెల్ఫేర్, ఆశ్రమ, ఎయిడెడ్, మోడ ల్, గిరిజన పాఠశాలలు మొత్తం 180 ఉండగా.. 6,234 మంది టెన్త్ విద్యార్థులు పరీక్షలు రాశారు. 6,160 మంది ఉత్తీర్ణత సాధించగా.. వీరిలో బాలు రు 2,948, బాలికలు 3,212 ఉన్నారు. 2018–19 విద్యాసంవత్సరం 97 శాతం ఉత్తీర్ణతను నమోదు చేసుకుని రాష్ట్రంలో ముందంజలో ఉన్న జిల్లా గత ఏడాది 98.16 శాతంతో నాలుగో స్థానంలో ఉండగా.. ఈసారి 3వ స్థానంలో నిలిచింది. కలెక్టర్ కృషితో మెరుగైన స్థానం పదో తరగతి వార్షిక ఫలితాల్లో జిల్లాను ఉత్తమంగా నిలపాలనే కలెక్టర్ రిజ్వాన్ బాషా సంకల్పం నెరవేరింది. పరీక్షలకు మూడు నెలల ముందు నుంచే ‘విజయోస్తు’ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులను సన్నద్ధం చేసే ప్రక్రియ ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్టు టీచర్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాలు, గురుకులాల్లో ఉదయం, సాయంత్రం సబ్జెక్టుల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థుల ను పరీక్షలకు సన్నద్ధం చేశారు. జెడ్పీ విద్యార్థుల ప్రతిభ టెన్త్ ఫలితాల్లో పట్టణంలోని ధర్మకంచ విద్యార్థులు ప్రతిభ చాటారు. మొత్తం 53 మంది విద్యార్థులకు 52 మంది ఉత్తీర్ణత సాధించారు. అవదూ త దీక్షిత 575, ఎస్.వెంకటేష్ 562, కె.ఐశ్వర్య 550 మార్కులతో పాఠశాల టాపర్గా నిలిచారు. మైనారిటీ బాలుర జోరు జనగామ మైనారిటీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎండీ.ఫిరోజ్ 564, కె.హర్షవర్ధన్ 563, జమీల్ 558, టి.వర్షిత్ 552, ఎం.చందు 549 మార్కులు సాధించారు. అలాగే 16 మంది విద్యార్థులకు 500లకు పైన మార్కులు వచ్చినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ కర్రె కుమారస్వామి తెలిపారు. మెరిసిన ఎంజేపీ విద్యార్థులు మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. మొత్తం 73 మంది విద్యార్థుల కు 73 మంది 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. కె.శ్రీజ 580, బి.సింధు 574, ఎన్.వర్షిత 570, ఎన్.భువనేశ్వరీ 570, బిందుశ్రీ 569, మార్కులు తెచ్చుకున్నారని ఎస్ఓ ఎం.అనిత తెలిపారు. సోషల్ వెల్ఫేర్ ప్రభంజనం జిల్లాలో అయిదు సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు ఉండగా.. జఫర్గఢ్, నర్మెట, పాలకుర్తి గురుకులాలు 100 శాతం, జనగామ, స్టేషన్ఘన్పూర్ 98 శాతానికి పైగా ఉత్తీర్ణత నమోదైనట్లు సమన్వయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఎం.తరుణ్ 573, పి.హేమ 571, బి.శ్రావణి 571, కె.నరేష్ 568, డి.శశాంక్ 550 మార్కులు సాధించినట్లు వివరించారు. సమష్టి కృషితో ఉత్తమ ఫలితాలు పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో నిలిచింది. గడిచిన మూడు నెలల నుంచి విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేశారు. సమష్టిగా నిరంతర కృషి చేయడంతో మంచి ఫలితాలు సాధించాం. భవిషత్లో మొదటి స్థానం లక్ష్యంగా కృషి చేస్తాం. పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులకు అభినందనలు. – రిజ్వాన్ బాషా, కలెక్టర్ గత ఎనిమిదేళ్లలో జిల్లాలో పదోతరగతి ఉత్తీర్ణత వివరాలు శాతంలో.. సంవత్సరం బాలికలు బాలురు మొత్తం 2016–17 93.98 93.13 93.56 2017–18 88.50 88.27 88.38 2018–19 97.51 96.59 97.15 2019–20, 2021 కరోనాతో 100 శాతం ఉత్తీర్ణత 2021–22 96.01 93.39 94.72 2022–23 91.17 92.58 91.90 2023–24 98.68 97.59 98.16 2024–25 99.20 98.40 98.81అవదూత దీక్షిత/575 -
మరోసారి సత్తా చాటిన ‘తేజస్వి’
నయీంనగర్: ఎస్సెస్సీ పరీక్ష ఫలితాల్లో తేజస్వి పాఠశాల విద్యార్థులు గ్రేడ్ పాయింట్లతో పాటు మార్కుల్లో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో విజయదుందుభి మోగించినట్లు పాఠశాల చైర్మన్ రేవూరి జెన్నారెడ్డి తెలిపారు. 590 మార్కులతో మేకల శ్రీనిత్య ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఎ.సాయిసిరి 586 మార్కులు, బొల్లారపు గౌతమ్క్రిస్, పి.అహన్య 584, జి.రిషిక, కె.శ్రీనిధి 583, అయోషా తబుసమ్, పి.హృతిక్ రెడ్డి 581, పి.శృతిక, జి.పవన్ విదేష్, డి.సబరీష్ 580 మార్కులు సాధించారు. 579 నుంచి 570 మార్కుల వరకు 46 మంది, 569 నుంచి 560 మార్కుల వరకు 44 మంది, 559 నుంచి 550 మార్కుల వరకు 50మంది, 549 నుంచి 540 మార్కుల వరకు 61మంది విద్యార్థులు, 539 కంటే తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు 251 మందితో నయీంనగర్, పోచమ్మకుంట, ప్రశాంత్నగర్ బ్రాంచ్ల్లో జిల్లా స్థాయిలో అధిక మార్కులు సాధించినట్లు వివరించారు. విజయపరంపర కొనసాగించిన విద్యార్థులకు, బోధన, బోధనేతర సిబ్బందికి, తల్లిదండ్రులకు పాఠశాలల ప్రిన్సిపాళ్లు పిల్లలమర్రి చంద్రశేఖర్, సంధ్య, జేపీ రావు, ఉపాధ్యాయ బృందం అభినంధనలు తెలిపారు. -
పుష్కరాల పనుల్లో వేగం పెంచండి
కాళేశ్వరం: ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు జరిగే సరస్వతి నది పుష్కరాల పనుల్లో మరింత వేగం పెంచాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్రెడ్డి, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరేలతో కలిసి పుష్కరాల పనులను పరిశీలించారు. ముందుగా త్రివేణిసంగమం వద్ద వీఐపీ (జ్ఞాన సరస్వతి) ఘాటు వద్ద నిర్మిస్తున్న సరస్వతి మాత విగ్రహం, ఘాటు విస్తరణ పనులు, మరుగుదొడ్లు, శ్రాద్ధమండపం నిర్మాణాలను పరిశీలించారు. మంత్రికి ఎస్పీ వీఐపీ ఘాటుకు వచ్చే రోడ్డు మ్యాపును వివరించారు. గోదావరిలో నీటిమట్టం పుష్కరాల నాటికి తగ్గుతుందా? అని ఇరిగేషన్శాఖ ఈఈ తిరుపతిరావును అడుగ్గా కొంత తగ్గుతుందని, అయితే భక్తులకు ఇబ్బంది లేదన్నారు. సరస్వతిమాత విగ్రహం బేస్ కింద రివిట్మెంట్ కరెక్ట్ ఉందా అని ఎండోమెంట్ ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. వీఐపీ ఘాటు వద్ద టెంట్సిటీ నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ఇక్కడ టెంట్సిటీని మొదటిసారిగా ఏర్పాటు చేస్తున్నామని, జాయ్రైడ్స్ కోసం కన్నెపల్లి వద్ద కాకుండా దేవస్థానం లేదా ఘాటు పరిసరాల్లో మూడు హెలిపాడ్లు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్కు తెలిపారు.పారిశుద్ధ్యంపై దృష్టి సారించండిపుష్కరాలకు వచ్చే భక్తులకు అందంగా కనిపించాలని, వ్యర్థాలు, చెత్తచెదారం లేకుండా పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మీ, ఎంపీడీఓ వెంకటేశ్వర్లుకు ఆదేశించారు. పుష్కరాల్లో పారిశుద్ధ్యం పెద్దపీట వేస్తుందని, ఎక్కువ సంఖ్యలో కూలీలను పెంచాలన్నారు. అలాగే ప్రధాన ఘాటు నుంచి వీఐపీ ఘాటు వరకు గోదావరిలో బండరాళ్ల తొలగించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. మళ్లీ పుష్కరాల పనులు పరిశీలించేందుకు నిత్యం వస్తుంటానని, అధికారులు అందుబాటులో ఉంటూ పనులు పూర్తి చేయించాలన్నారు. అలాగే గోదావరిలో బోట్లు తిప్పేందుకు అనుమతి ఇవ్వాలని, మరిన్ని బోట్లు పెంచి గంగపుత్రులకు ఉపాధి కల్పించాలన్నారు. అనంతరం హరితహోటల్లో శాఖల వారీగా సమీక్ష చేశారు. మంత్రి వెంట సబ్కలెక్టర్ మయాంక్సింగ్, ఈఓ మహేష్, డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, సీఐ రామచందర్రావు, ఎస్సై తమాషారెడ్డి, నాయకులు కోట రాజబాపు, మాజీ ఎంపీపీ రాణిబాయి, అశోక్, శ్రీనివాసరెడ్డి, ఎల్.రాజబాపు, శకీల్, సత్యనారాయణ, జానీ, శ్యాందేవుడా తదితరులు పాల్గొన్నారు. -
విజయానికి నాంది
ఓటమి.. ఇటీవల విడుదలైన టెన్త్ ఫెయిల్ సినిమాలో హీరో తన గ్రామంలోని పాఠశాలలో పదో తరగతి ఫెయిలవుతాడు. ఆ తరువాత కష్టపడి చదువుతాడు. ఢిల్లీ వెళ్లి పిండిమర, టీస్టాల్ తదితర పనులు చేసుకుంటూనే సివిల్స్కు ప్రిపేరవుతాడు. ఒకటి, కాదు రెండు కాదు.. ఆరోసారి తను అనుకున్న ఐపీఎస్ సాధిస్తాడు. అతను మొదటిసారి రాలేదని కుంగిపోకుండా ‘రీస్టార్ట్’ అంటూ తన చదువు మొదలుపెట్టి చివరికి అనుకున్నది సాధిస్తాడు. ఒక్కసారి ఫెయిలైతే జీవితమే అయిపోయినట్టు కాదు ● దీన్ని అధిగమించి సక్సెస్ ఫుల్ లైఫ్తో ముందుకెళ్లొచ్చు ● పిల్లల మార్కులను పేరెంట్స్ ప్రతిష్టగా భావించొద్దు ● ఫలితం ఎలా ఉన్నా ప్రోత్సహిస్తేనే బంగారు భవిష్యత్ ● పదో తరగతి ఫలితాల వేళ మానసిక, వైద్య నిపుణుల సూచనలు జిల్లాల వారీగా పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు -
దొంగలపై నిఘా పెట్టాలి
వరంగల్ క్రైం: చోరీ కేసుల్లో శిక్ష అనుభవించి జైలు నుంచి బయటకు వచ్చే దొంగలపై నిఘా పెట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అధికారులకు సూచించారు. మార్చికి సంబంధించిన నెలవారీ నేర సమీక్షను పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రౌడీషీటర్లను పోలీ స్స్టేషన్లకు పిలిపించడం కాకుండా, అధికారులు వా రిని వ్యక్తిగతంగా కలిసి ప్రస్తుత స్థితిగతులను ఆరా తీయాలన్నారు. పోలీస్స్టేషన్ల పరిధిలో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించాలని, సీసీ కెమెరాల పనితీరు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, కొత్త సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషిచేయాలని సీపీ ఆదేశించారు. మహిళా సిబ్బందిని ప్రోత్సహించడంతో పాటు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలని చెప్పారు. జాతీయస్థాయిలో గుర్తింపు, అవార్డులు తీసుకొచ్చే విధంగా పోలీస్ స్టేషన్ నిర్వహణ ఉండాలని, రేయింబవళ్లు ప్రజల కోసం పనిచేసి పోలీస్ శాఖకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చే అధికారులకు అవార్డులు రివార్డులు ఉంటాయన్నారు. సమావేశంలో డీసీపీలు రాజమహేంద్రనాయక్, అంకిత్కుమార్, జనార్దన్, జనగామ ఏఎస్పీ చైతన్య, ఏఎస్పీ మనాన్భట్, అదనపు డీసీపీలు రవి, సురేశ్కుమార్, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు. నెలవారీ నేర సమీక్షలో సీపీ సన్ప్రీత్సింగ్ -
పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు
జనగామ రూరల్: జిల్లాలోని ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. మంగళవారం జనగామ మండలంలోని వెంకిర్యాల, గానుగుపహాడ్ పీఏసీఎస్ ధాన్యం సెంటర్లను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాల్లో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న సరుకును కలెక్టర్ పరిశీలించి అందులో తేమ శాతాన్ని పరిశీలించారు. రోజువారీగా కొనుగోళ్లకు సంబంధించి రిజిస్టర్లను పరిశీలించి వెంటవెంటనే ఓపీఎంఎస్లో రైతుల వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైతులను ఇబ్బందికి గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని నిర్వాహకులను హెచ్చరించారు. అక్కడ నుంచి గానుగుపహాడ్ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించి రిజిస్టర్లను పరిశీలించారు. తిరుగుప్రయాణంలో వడ్లకొండ ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలోని సఖి కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. అందులోని రికార్డులతో పాటు స్టాఫ్ రూం, కౌన్సెలింగ్ గదులను తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ హుస్సేన్, డీటీ సీఎస్ శ్రీనివాస్, రేణుక, అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన వేగవంతం.. ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో కలిసి వివిధ ప్రభుత్వ పథకాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల సర్వే చేసిన లబ్ధిదారుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. రాజీవ్ యువవికాసం దరఖాస్తులు కేటగిరీల వారీగా పరిశీలన చేసి సిబిల్ స్కోర్ నిమిత్తం ఆయా బ్యాంకులకు పంపించాలన్నారు. ఏఏపీ కమిటీల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. పీహెచ్సీల్లో ఓపీ సేవలను పెంచండి ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన వేగవంతం చేయాలి కలెక్టర్ రిజ్వాన్ బాషా -
వేసవి క్రీడల శిక్షణకు వేళాయె
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో వేసవి క్రీడల శిక్షణకు ముహూర్తం ఖరారు చేసింది. మే 1వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు అండర్ 14 విభాగంలో బాల,బాలికలకు అథ్లెటిక్స్తో పాటు వివిధ క్రీడాంశాలు వాలీబాల్, ఫుట్బాల్, మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్, సాఫ్ట్ బాల్లో తర్పీదును ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 10 క్రీడా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శిక్షణ కేంద్రాలివే.. జిల్లాలోని జనగామ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (చౌడారం/అథ్లెటిక్స్), వెంకిర్యాల ఉన్నత పాఠశాల (తైక్వాండో), స్టేషన్ఘన్పూర్ విద్యా జ్యోతి డిగ్రీ కళాశాల (ఫుట్బాల్), స్టేషన్ఘన్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బాక్సింగ్), పాలకుర్తి మండలం చెన్నూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల (సాఫ్ట్ బాల్), గూడూరు ఉన్నత పాఠశాల (వాలీబాల్), లింగాలఘణపురం మండలం వనపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల (వాలీబాల్), జఫర్గఢ్, చిల్పూరు మండలం తమ్మడపల్లి(జి), మల్కపూర్, నర్మెట మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాలల్లో (మార్షల్ ఆర్ట్స్)ను నేర్పిచనున్నారు. ఉదయం 6.60 నుంచి 8.30 సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రోజుకు రెండు దఫాలుగా బాల, బాలికలకు క్రీడ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే వివిధ విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ హాజరయ్యేందుకు ఆసక్తి ఉన్న బాల,బాలికలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఎస్ఏటీజీఏఎస్ఈ. తెలంగాణ.జీఓవీ.ఇన్లో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. చివరి రోజు బాల,బాలికలకు సర్టిఫికెట్లను అందిస్తారు. సద్వినియోగం చేసుకోవాలి జిల్లాలోని 10 ప్రదేశాల్లో మే 1వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు వేసవి క్రీడా శిక్షణ ప్రారంభమవుతుంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఉదయం, సాయంత్రం శిక్షణ ఉంటుంది. వేసవిలో క్రీడల ద్వారా శారీరక ధృఢత్వం, సంపూర్ణ ఆరోగ్యానికి క్రీడల్లో పాల్గొనాలి. – బి.వెంకట్రెడ్డి, జిల్లా యువజన, క్రీడల అధికారి రేపటి నుంచి 10 పాఠశాలల్లో ప్రారంభం అండర్–14 బాల,బాలికలకు అవకాశం -
కష్టపడిన వారికే ప్రాధాన్యం
జనగామ: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్సీ అ ద్దంకి దయాకర్, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతా ప్రెడ్డి అధ్యక్షతన జరిగిన పార్టీ క్రియాశీల కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. పా ర్టీలో నిజాయితీగా పని చేసిన వారికి భవిష్యత్ ఉంటుందన్నారు. సర్కారు అమలు చేస్తున్న పథకాల ను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతీకార్యకర్త పై ఉందన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ పార్టీలోకి ముందు వచ్చామా, వెనక వచ్చా మా అన్నది ముఖ్యం కాదని, పదిమందిని కదిలించి ఓట్లు వేయించే వారే అవసరమన్నారు. ఈ సమావేశంలో జనగామ ఇన్చార్జ్ బైకానీ లింగం యాదవ్, యాదాద్రి ఇన్చార్జ్ లకావత్ ధన్వంతి, జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, మారుజోడు రాంబాబు, కొమ్మూరి ప్రశాంత్రెడ్డి తదితరులు ఉన్నారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎంపీ చామల ఓట్లు వేయించే వారే ముఖ్యం ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
లక్ష్యం చేరని ఎల్ఆర్ఎస్
జనగామ: అనధికార లేఅవుట్లోని స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఇచ్చిన 25శాతం రాయితీ గడువు పెంచినా స్థలాల క్రమద్ధీకరణ లక్ష్యం చేరలేదు. లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) రాయితీ గడువు నేటితో ముగి యనుంది. మార్చి 30వ తేదీ వరకు 25 శాతం రాయితీతో ఎల్ఆర్ఎస్కు అవకాశం కల్పించగా, ఈ నెల 2వ నుంచి 30వ తేదీ వరకు రెండోసారి అవకాశం కల్పించారు. ఎల్ఆర్ఎస్ 2025–26 ఆస్తి పన్నుపై 5 శాతం రాయితీ గడువుకు నేడు (బుధవారం) ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ప్రొసీడింగ్ కాపీలు రాకపోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన మేర ఎల్ఆర్ఎస్ ల క్ష్యం నెరవేరడం లేదు. రెండుసార్లు అవకాశం ఇచ్చినా ప్రజల నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు యజమానులు ముందుకు రావడం లేదు. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించినా.. నేటికి ప్రొసీడింగ్ కాపీలు రాకపోవడం కూడా కొత్తగా ఫీజు చెల్లించాలనుకుంటున్న వారీపై ఎఫెక్టు కనిపిస్తోంది. 2020లో ఎల్ఆర్ఎస్ కోసం రూ.1,000తో 69,710 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 12,469 మంది మాత్రమే తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకున్నారు. వీటిపై రూ.22.82 కోట్ల మేర ఆదాయం సమకూరింది. ముగియనున్న 5 శాతం రాయితీ సర్కారు ఖజానాకు ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రభుత్వం 2025–26 (ప్రస్తుత) ఆస్తిపన్ను 100 శాతం చెల్లించిన వారికి 5 శాతం రా యితీ కల్పించింది. ఈ అవకాశం నేటితో ముగి యనుంది. జనగామ పట్టణంలో 15,609 అసెస్మెంట్లు ఉండగా, రూ.6.74కోట్ల మేర పన్ను వసూలు చేయాలని డిమాండ్ ఉంది. ఇందులో 5 శాతం రాయితీపై ఇప్పటి వరకు 2,082 మంది రూ.75లక్షల మేర చెల్లించి లబ్ధిపొందారు. కాగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు వచ్చే యజమానులకు ప్రొహిబిటెడ్ పరేషాన్ చేస్తోంది. ప్లాట్ల పంచాయితీలో ఫిర్యాదు వెళ్లిన సమయంలో సమీపంలోని అన్నింటినీ ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చారు. ప్రభుత్వం మరో అవ కాశం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. ప్లాట్ల క్రమబద్ధీకరణకు ముందుకురాని యజమానులు నేటితో ముగియనున్న గడువు జీపీ, పురపాలిక పరిధిలో రూ.22.82కోట్లు వసూళ్లుమూడు రోజుల నుంచి తిరుగుతున్న.. కళ్లెం రోడ్డులో 1989లో 250 గజాల ప్లాటు కొనుగోలు చే శా. ఎల్ఆర్ఎస్ కోసం గతంలోనే రూ.1,000 రుసుం చె ల్లించా. ప్లాటుకు సంబంధించి మిగతా డబ్బులు చెల్లించి, క్రమబద్ధీకరణ చేసుకుందామంటే ప్రొహిబిటెడ్లో ఉందంటున్నారు. అధికారులు సత్వరమే స్పందించాలి. – చిటుకుల అంజయ్య,21వ వార్డు, జనగామ -
రిజల్ట్స్ ఎలా ఉన్నా పాజిటివ్గా తీసుకోవాలి
పరీక్ష ఫలితాలు అంటేనే చాలా మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో కంగారు ఉండడం సహజమే. ఫలితాలు ఎలా ఉంటాయో...ఎన్ని మార్కులు వస్తాయోనని విద్యార్థులు సైతం టెన్షన్ పడుతుంటారు. కానీ, పరీక్ష ఫలితం ఎలా వచ్చినా ఆందోళన చెందకూడదు. అంతా పాజిటివ్గా తీసుకోవాలి. అనుకున్న దాని కంటే తక్కువ మార్కులు వచ్చినా, చదివినా చదువుకు తగిన ఫలితాలు రాలేదని అతిగా స్పందించొద్దు. ఒక్క ఓటమితో తమ చదువు ముగిసిపోదు. ప్రపంచంలోని మేధావులంతా ఎక్కువ మార్కులు సాధించినవారేమీ కాదని విషయాన్ని గుర్తించాలి. తల్లిదండ్రులు కూడా ఈ దిశగా విద్యార్థులకు ప్రోత్సాహం ఇవ్వాలి. –డాక్టర్ రాజు, మానసిక వైద్య నిపుణుడు. -
‘నీట్’కు పకడ్బందీ ఏర్పాట్లు
కలెక్టర్ రిజ్వాన్ బాషా జనగామ రూరల్: మే 4వ తేదీన జరగనున్న జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష 2025 (నీట్)కు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో డీసీపీ రాజమహేంద్రనాయక్, సంబంధిత అధికారులతో కలిసి సమీ క్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా నుంచి 582 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని, వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే రహదారి భద్రతపై జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారులపై స్పీడ్ బ్రే కర్లు ఏర్పాటు చేయాలన్నారు. చట్టాలపై అవగాహన ఉండాలి సీనియర్ సివిల్ జడ్జి జస్టిస్ విక్రమ్ జనగామ రూరల్: విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి జస్టిస్ సి.విక్రమ్ అన్నారు. మంగళవారం పట్టణంలోని బాల సదనాన్ని ఆయన సందర్శించి జాతీయ లీగల్ సర్వీస్ అథారిటీ రూపొందించిన చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ ఫర్ చిల్డ్రన్ స్కీంపై పిల్లలకు అవగాహన కల్పించారు. పిల్ల లకు ఎప్పుడు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ స్నేహభావంతో ఉంటుందని, ఎలాంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం పిల్లల వసతులు భోజనం, టిఫిన్స్, స్నాక్స్ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. బాలికలు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.కృష్ణవేణి, బి.స్రవంతి తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థుల తుది జాబితా విడుదల జనగామ: జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలో ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్, ఉద్యోగ నియామకానికి ఎంపికై న వివరాలను విడుదల చేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లిఖార్జున్ మంగళవారం ఒక ప్రకటనలో పే ర్కొన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ స్కీంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ద్వారా 33 పోస్టుల భ ర్తీకి గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం విధి తమే. అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా ను అధికారిక వెబ్సైట్తో పాటు కలెక్టరేట్లోని జి ల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయ నోటీసు బో ర్డుపై అందుబాటులో ఉంచినట్లు స్పష్టం చేశా రు. జాబితాలో అభ్యంతరాలు ఉంటే, అందుకు అవసరమైన వివరాలను జోడించి, మే 1వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు డీఎంహెచ్ఓ కా ర్యాలయంలో అందించాలన్నారు. కాగా ఉద్యోగానికి ఎంపికై న అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో మే 2వ తేదీన ఉదయం 11.30 గంటలకు డీఎంహెచ్ఓ కార్యాలయానికి హాజరు కావాలన్నారు. అభ్యర్థులు కౌన్సెలింగ్కు హాజరు కావాలి జనగామ రూరల్: టీజీపీఎస్సీలో వసతి గృహ సంక్షేమ అధికారిగా ఎంపికై న గ్రేడ్–2 అభ్యర్థులు జోన్ 5లో కౌన్సెలింగ్కు హాజరుకావాలని న ల్లగొండ ఉపసంచాలకులు ఎన్.ప్రేమ్కరణ్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. నేడు (బుధవారం) 10.30గంటలకు నల్ల గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కౌన్సెలింగ్ ఉంటుందని, అభ్యర్థులు హాజరుకావాలన్నారు. -
‘భూభారతి’తో భూసమస్యల పరిష్కారం
దేవరుప్పుల : భూభారతి చట్టంతో అపరిష్కృతంగా ఉన్న భూసమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంఎన్ఆర్ గార్డెన్లో తహసీల్దార్ ఆడెపు ఆండాలు అధ్యక్షతన ‘భూభారతి చట్టం–రైతుల చుట్టం’ అనే అంశంపై ఏర్పాటు చేసిన అవగా హన సదస్సులో ఆయన మాట్లాడారు. జఠిలమైన భూసమస్యల పరిష్కారానికి కొత్తచట్టం కార్యరూ పం దాల్చిందని, నాలుగంచెల వ్యవస్థతో భూయజమానులకు సానుకూలంగా ఉందని చెప్పారు. క్షేత్రస్థాయిలో తొలుత తహసీల్దార్, మలి విడత ఆర్డీఓ, ఆ తర్వాత కలెక్టర్ ద్వారా న్యాయం చేకూరలేదంటే అప్పీల్ వ్యవస్థను కీలకంగా వినియోగించు కోవచ్చని పేర్కొన్నారు. గతంతో పోల్చుకుంటే భూరికార్డుల తప్పుల సవరణ, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, వారసత్వం తదితర మార్గాల ద్వారా సాదా బైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టడానికి మార్గదర్శకాలు వచ్చాయని చెప్పా రు. గ్రామ పాలన అధికారుల పర్యవేక్షణలో ఏడాది కోసారి ఆయా గ్రామాల్లోనే భూరికార్డులు భద్రపర్చి ఉంచుతారని, తద్వారా కొనుగోలు చేసే వారికి క్లియరెన్స్ లభిస్తుందని వివరించారు. త్వరలో డిజిటల్ సర్వే ఆధారంగా నివాసిత ప్లాట్ల మాదిరి వ్యవసాయ భూముల వద్ద ఫొటోలు దిగి సరైన హద్దులతో కూడిన చిత్రపటం వచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పట్టాదారు పుస్తకం ఉండి కబ్జాలో లేని.. కబ్జాలో ఉండి పట్టాదారు పుస్తకం లేని రైతులకు సముచిత న్యాయం చేయడానికి అధికార యంత్రాంగం పరిశీలిస్తుందన్నారు. జూన్ నుంచి ఊరూరా భూసమస్యలపై గ్రామ సభల్లోనే ఫిర్యాదులు స్వీకరిస్తామని చెప్పారు. సదస్సులో మండల ప్రత్యేక అధికారి శ్రీధర్రావు, నాయబ్ తహసీల్దార్ లచ్చునాయక్, ఎంపీడీఓ కె.లక్ష్మీనారాయణ, రెవెన్యూ జిల్లా సిబ్బంది శ్రీనివాస్, వ్యవసాయ శాఖ ఏడీఓ పరశురాంనాయక్, ఏఓ దివ్య, ఎంపీఓ సురేష్కుమార్, ఆర్ఐ రాజు తదితరులు పాల్గొన్నారు. ధాన్యం ఎగుమతి సత్వరమే చేపట్టాలి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేసిన నిల్వ ల ఎగుమతి సత్వరమే చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. సోమవారం దేవరుప్పుల మండల పరిధి సింగరాజుల్ల్లిలోని కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఆయన రికార్డులను పరిశీలించి కల్లాల్లో ధాన్యం దిగుమతి, ఎగుమతి వివరాలు తెలుసుకున్నారు. హమాలీల కొరత లేకుండా యుద్ధప్రాతిపదికన కాంటాలు పెట్టి ధాన్యాన్ని సకాలంలో రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సహకారం సంఘం సీఈఓ కృష్ణమూర్తిని ఆదేశించారు. అకాల వర్షాల నేపథ్యంలో నిర్వాహకులతో పాటు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
విలువల పరిరక్షణలో కవులు ముందుండాలి
● కవి, గాయకుడు పెట్లోజు సోమేశ్వరాచారి జనగామ: మానవీయ విలువల పరిరక్షణలో కవులు ముందుండాలని కవి హృదయం సాహిత్య వేది క వ్యవస్థాపకుడు, కవి గాయకుడు పెట్లోజు సోమేశ్వరాచారి అన్నారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ జనగామ కవులు సోమవారం స్థానిక స్కాలర్ గ్రామర్ స్కూల్లో కవి హృదయం సాహిత్య వేదిక, కవులు, కళాకారుల ఐక్య వేదిక, సాధిక్ ఫౌండేషన్ ఆధ్వర్యాన నిర్వహించిన కవి సమ్మేళనాన్ని సాధిక్ అలీ ప్రారంభించి మాట్లాడారు. సమ సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ ఐక్యతను చాటాలని కోరారు. అంతకు ముందు ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతికలగాని రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. కవులు మాన్యపు బుజేందర్, అంకాల సోమయ్య, చిలుమోజు సాయికిరణ్, రంగరాజు ప్రసాద్, కవులు, కళాకారుల ఐక్య వేదిక అధ్యక్షుడు జి.కృష్ణ, లగిశెట్టి ప్రభాకర్, సాంబ రాజు యాదగిరి, నక్క సురేష్, పొట్టబత్తిని భాస్కర్, గడ్డం మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
’ఇరిగేషన్’లో ఏసీబీ గుబులు!
ఏసీబీ రంగప్రవేశం.. ఆందోళనలో ఇంజనీర్లు..సాక్షిప్రతినిధి, వరంగల్ : నీటిపారుదలశాఖలోని కొందరు ఇంజనీర్లలో మళ్లీ ఏసీబీ కలకలం మొదలైంది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఆందోళనలో పడ్డారు. మేడిగడ్డ మొదలుకుని కన్నెపల్లి, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు, పలు ప్యాకేజీ పనుల్లో లొసుగులపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. ఇప్పటికే చాలామందిని విచారించిన ఆ కమిటీ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించింది. ఈ నివేదిక ఆధారంగా ప్రాజెక్టు పరిధి వివిధ కేడర్ల లోని 17 మందిపై క్రిమినల్ కేసులు, 30 మందిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేశారు. ఇదే సమయంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికా రులు ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు గుర్తించి ప్రాజెక్టు ఎండీ హరిరామ్ ఇళ్లలో సోదాలు నిర్వహించి అరెస్టు చేయడం సంచలనంగా మారింది. విచారణలతో ఉక్కిరిబిక్కిరి.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించి న మేడిగడ్డ బ్యారేజీ కుంగి, పియర్లు దెబ్బతిన్న ఘటనలో తొలుత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల సీపేజీపైనా విచారణ జరిపి తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి కారణాలపై వివరంగా నివేదించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏకంగా 17 మంది సీనియర్ ఇంజనీర్లపై క్రిమినల్ కేసులకు సిఫార్సు చేసింది. అందులో అంతా మేడిగడ్డతో సంబంధం ఉన్నవారేనని తెలిసింది. నిర్మాణంతోపాటు డిజైన్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ తదితర విభాగాల్లో పనిచేసిన ఇంజనీర్లు ఉన్నట్లు ప్రకటించారు. క్రిమినల్ కేసుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు చేసిన వారిలో కాళేశ్వరం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుతోపాటు గతంలో ఎస్ఈగా పనిచేసిన రమణా రెడ్డి, ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతి రావు సహా 17 మంది ఉన్నారు. శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేసిన 30 మందిలో వివిధ విభాగాలకు చెందిన డీఈఈ, ఏఈఈలు ఉన్నట్లు తెలిసింది. నివేదికలో ఉన్న ఇంజనీర్ల పదోన్నతులను పరిశీలనకు తీసుకోవాలా లేదా తేల్చుకోలేక ఉన్నతాధికారులు పెండింగ్లో పెట్టారు. అలాగే నిర్మాణ సమయంలో నాణ్యత తనిఖీ విభాగం, నిర్వహణ సమయంలో ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ విభాగం ఇంజనీర్లు వైఫల్యం చెందినట్లుగా నిర్ధారించి, వారిపైనా కేసులకు సిఫార్సు చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించి మాజీ ఈఎన్సీ మురళీధర్, ప్రస్తుత చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి తదితరులపైనా చర్యలకు సిఫార్సు చేసినట్లు తెలుస్తున్నా.. శాఖాపరమైన చర్యలా? క్రిమినల్ చర్యలా? అన్నది తేలలేదు. ఏదేమైనా కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలో చిక్కుకున్న పలువురు ఇంజనీర్లు విచారణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చర్చనీయాంశంగా ఎండీ హరిరామ్పై దాడులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇక్కడి వాళ్లే.. ఇప్పటికే 17మందిపై క్రిమినల్ కేసులు 30మందిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు తాజాగా ఏసీబీ దాడులకు దిగడంతో కలకలం ఆదాయానికి మించిన ఆస్తులే కారణం ఎటు నుంచి ఎటొస్తుందోనన్న ఆందోళనకాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు వివాదంలో రంగంలోకి దిగిన ఏసీబీ.. ప్రాజెక్టులో ముఖ్య భూమిక పోషించిన నీటి పారుదల శాఖ గజ్వేల్ ఈఎన్సీ భుక్యా హరిరామ్పై దాడులు నిర్వహించడం నీటిపారుదలశాఖను కుదిపేసింది. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే అభియోగాల నేపథ్యంలో శుక్రవారం, శనివారం దాడులు నిర్వహించి.. శనివారం సాయంత్రం అరెస్టు చేసినట్లు ప్రకటించింది. మొత్తం ఆయన వద్ద ప్రాథమికంగా రూ.200 కోట్ల మేరకు అక్రమాస్తులుంటాయని భావించిన ఏసీబీ ఇంకా తనిఖీలు కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు అధికారుల ఆస్తుల గురించి కూడా ఏసీబీ ఆరా తీస్తుందన్న ప్రచారం ఇంజనీరింగ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలో ఓ వైపు కొంద రు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, ఎన్డీఎస్ఏ, జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ విచారణలు ఎదుర్కొంటుండగా.. మరోవైపు ఆదాయానికి మించిన ఆస్తుల పేరిట ఏసీబీ దాడులు నిర్వహిస్తుండటంతో ఆరోపణలున్న ఇంజనీర్లలో ఆందోళన మొదలైంది. -
ఆలకించి.. ఆదేశించి
జనగామ రూరల్: ‘అనారోగ్యంతో భర్త చేనిపోయాడు. ఇద్దరు పిల్లలున్నారు. పోషణ ఇబ్బందిగా మారింది. వితంతు పింఛన్ రావడంలేదని ఓ మహిళ.. తమ తండ్రి కొనుగోలు చేసిన భూమిని కొందరు ఆక్రమించారు. న్యాయం చేయాలని ఇద్దరు రైతులు.. పక్కన ఉన్న భూమి యజమానుల కారణంగా ఆయిల్పామ్ తోటకు నిప్పంటుని నష్టపోయాను. ఆదుకోవాలని ఓ రైతు’.. ఇలా అనేక సమస్యలతో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు అధికారులకు మొరపెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్కు 58 అర్జీలు రాగా.. వాటిని స్వీకరించిన అదనపు కలెక్ట ర్లు రోహిత్సింగ్, పింకేష్కుమార్.. వారి సమస్యల ను ఓపికగా విన్నారు. సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్ నాయక్, ఆర్డీఓ వెంకన్న, కలెక్టరేట్ ఏఓ మన్సూర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని ఇలా.. ● తన వ్యవసాయ భూమికి సంబంధించిన సమస్య పరిష్కారం కావడం లేదు.. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామానికి చెందిన మహిళా రైతు ఆలేటి ఎల్లమ్మ అర్జీ పెట్టుకుంది. ● తాను ఒంటరి మహిళను. రాజీవ్ యువ వికాసం పథకం కింద ఏదైనా ఉపాధి కల్పించాలని రఘునాథపల్లి మండలానికి చెందిన అంబిక దరఖా స్తు చేసుకున్నది. ● తన భూమిని ఆక్రమించుకున్నారని, వారిపై చర్య తీసుకోవాలని బచ్చన్నపేట మండలం దబ్బగుంటపల్లికి చెందిన నరేందర్రెడ్డి వినతి పత్రం అందజేశాడు.వితంతు పింఛన్ ఇప్పించండి ఐదేళ్ల క్రితం భర్త బత్తిని వెంకటేశ్వర్లు అనారోగ్యంతో మృతి చెందాడు. మాకు ఇద్దరు పిల్లలు. పోషణకు ఇబ్బంది పడుతున్నా ను. గ్రామంలో కూలీ పనులు చేసి పిల్లలను చదివిస్తున్నాను. ఎలాంటి ఆస్తులు లేవు. సొంత ఇల్లు లేక అద్దెకు ఉంటున్నాను. వితంతు పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలి. – బత్తిని లత, రాఘవాపూర్(స్టేషన్ఘన్పూర్)సర్వే చేయించి భూమిని కాపాడాలి మా తండ్రి భీమగోని చంద్రయ్య 50 ఏళ్ల క్రితం భూమి కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఖాస్తులో ఉండగా హైదరాబాద్కు చెందిన పేర్వారం రాధిక మా పట్టా భూమిలో వారి భూమి ఉందని 1.30 గుంట లు అక్రమంగా చదువు చేసి ఆక్రమించారు. సర్వే చేయించి భూమిని కాపాడాలి. – భీమగోని ప్రవీణ్కుమార్, శ్రావణ్కుమార్, ఖిలాషాపురం(రఘునాథపల్లి)తోట కాలింది.. ఆదుకోండి రఘునాథపల్లి మండలం కోమళ్లలో 4.38 గుంటల భూమిలో మూడేళ్ల క్రితం ఆయిల్పామ్ సాగు చేసిన. తోట పక్కన ఉన్న యజమానులు వారి భూమిని చదునుచెసి కంపచెట్లను తొలగించి వారం కింద నిప్పు పెట్టారు. రెండుసార్లు మంటలు ఆర్పేసిన. ఆదివారం మధ్యాహ్నం నిప్పుపెట్టిన కంపచెట్ల నుంచి మంటలు వ్యాపించి ఆయిల్పామ్ తోట కాలిపోయింది. రూ.10లక్షల వరకు పెట్టుబడి పెట్టిన. తోట కాలింది.. ఆదుకోండి. – బత్తోజు ఆంజనేయులు, జనగామ పట్టణంఅర్హులకు న్యాయం చేయాలి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారుల ఎంపిక సక్రమంగా జరగడంలేదు. గతంలో ఆస్తులు, ఆర్థికంగా ఉన్నవారి పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి. అధికారులు విచారణ చేపట్టి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ సజావుగా చేపట్టి అర్హులకు న్యాయం చేయాలి. – ముక్క కుమారస్వామి, చౌడారం (జనగామ) గ్రీవెన్స్లో ప్రజల గోడు వివిధ సమస్యలపై 58 అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్లు తక్షణమే పరిష్కరించాలని ఆదేశం -
దేశ ప్రగతికే ప్రధాని ‘మన్కీ బాత్’
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేశ్ జనగామ రూరల్ : దేశ ప్రగతికే ప్రధా ని ‘మన్కీ బాత్’ కార్యక్రమం చేపట్టార ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన ‘మన్కీ బాత్’ కార్యక్రమాన్ని వీక్షించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా యువతలో నైపుణ్య మెళకువలు, చిన్న పరిశ్రమల స్థాపన, అలాగే రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చేవిధంగా సేంద్రియ ఎరువుల వినియోగంపై, బడుగు బలహీన వర్గాలకు పారిశ్రామిక యూనిట్లు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహ న కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు దేవరాయ ఎల్లయ్య, నాయకులు గుజ్జుల నారాయణ, భాగాల నవీన్రెడ్డి, యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి చింతకింది సంతోష్, కేశపురం రవిరాజా పాల్గొన్నారు. -
తరలివచ్చిన జన ప్రవాహం..కిక్కిరిసిన సభా ప్రాంగణం
సోమవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025ప్రసంగిస్తున్న కేసీఆర్, అభివాదం చేస్తున్న కేసీఆర్ఎల్కతుర్కి క్రాస్ వద్ద జరిగిన రజతోత్సవ సభకు హాజరైన ప్రజలు, పార్టీ కార్యకర్తలుసాక్షిప్రతినిధి, వరంగల్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రజతోత్సవ సభ మినీ కుంభమేళాను తలపించింది. హనుమకొండ జిల్లా ఎల్క తుర్తి ఎక్స్రోడ్లోని సభావేదికకు ఆదివారం మధ్యాహ్నంనుంచే వివిధ జిల్లాలకు చెందిన ప్రజలు, కార్యకర్తలు చేరుకోవడం మొదలైంది. సాయంత్రానికి ఇసుకేస్తే రాలనంతగా జనం తరలిరాగా, సభా ప్రాంగణమంతా చీమల దండును తలపించింది. సభా ప్రాంగణానికి దాదాపు నాలుగైదు కిలోమీటర్ల వరకు జనం బారులు దీరారు. ఇక సభా ప్రాంగణంలో కళాకారుల ఆటపాటలకు జనం ఉరకలేస్తూ.. ఉత్సాహంతో డ్యాన్సులు చేశారు. తెలంగాణ పాటలతో గులాబీ సైనికులు, ప్రజలు ఊగిపోయారు. గులాబీ జెండాలను రెపరెపలాడిస్తూ.. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఉరకలెత్తిన ఉత్సాహంతో ఊగిపోయారు. కిక్కిరిసిన జనం, బాహుబలి వేదికపై కొలువుదీరిన నేతలు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం.. గులాబీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. తెలంగాణ ఉద్యమానికి ఓరుగల్లు తల్లి వంటిది 6.59 గంటలకు మైక్ అందుకున్న కేసీఆర్.. గ్యాదరి బాలమల్లును మైక్ సౌండ్ పెంచమంటూ ప్రసంగం మొదలుపెట్టారు.. 7:57 నిమిషాలకు ప్రసంగం ముగించారు. శ్రీ సీతారాముల జీవిత చరిత్రలో అయోధ్య ప్రాశస్త్యం మాదిరిగా తెలంగాణ సాధన ఉద్యమానికి ఓరుగల్లు కన్నతల్లి వంటిదని అభివర్ణిస్తూ ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఎగిరిన గులాబీ జెండా అంటూ.. ఈ జెండాను అనేక మంది ఎగతాళి చేసినా.. ఎట్టకేలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. 25 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో నిర్వహించుకున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రత్యేకత ఉందని.. 1969లో మూగబోయిన తెలంగాణ ఉద్యమానికి రాణి రుద్రమదేవి, సమ్మక్క,సారలమ్మ స్ఫూర్తితో గులాబీ జెండా ఊపిరిలూదిందని.. ఓరుగల్లు ప్రాశస్త్యం, ఉద్యమంలో ఓరుగల్లుతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. బీఆర్ఎస్ పాలనను గుర్తు చేసిన కేసీఆర్ కాంగ్రెస్ వచ్చి ఏడాదిన్నరయ్యింది.. ఏం చెప్పిండ్రు.. ఏం ఇస్తుండ్రు అనగానే ఏం ఇవ్వట్లేదు అని జనం పలికారు. ఇంతలో సభా వేదికకు దగ్గరగా ఉన్న పార్టీ శ్రేణుల గోలపై సహనం కోల్పోయిన కేసీఆర్ పల్లా రాజేశ్వర్రెడ్డిని పిలిచి ‘రాజేశ్వర్ వీళ్లెవరయ్యా.. మనోళ్ల వేరే వాళ్ల జర చూడు’ అన్నారు. అనంతరం కాంగ్రెస్ పరిపాలనను దుయ్యబట్టారు. ఇక కాంగ్రెస్ హామీల అమలు బుట్టదాఖలు తీరుపై జనం నోట పలికిస్తూ జోష్ తెచ్చారు. తెలంగాణ ప్రాంత దేవుళ్ల మీద ఒట్టు వేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఉనికి కోసం బీఆర్ఎస్పై అర్థరహిత విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘కేసీఆర్ పాలనకు.. కాంగ్రెస్ పాలనను పోల్చుకుని చూడండీ.. మీరేమో వాళ్లకు కత్తిచ్చి.. నన్ను యుద్ధం చేయిమంటున్నారు’ అని చమత్కరించారు. వైఎస్సార్ పాలనను.. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ శాశ్వత ప్రజాసంక్షేమం కోసమని భావించి నిర్విరామంగా కొనసాగించామని కితాబిచ్చారు. సభకు భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు రజతోత్సవ సభను ఇంత భారీగా నిర్వహించడానికి కృషి చేసిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, దాస్యం వినయభాస్కర్, పెద్ది సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీ తక్కళ్లపెల్లి రవీందర్ రావులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. అలాగే సభకు స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వాహనాలతో నిండిన పార్కింగ్ స్థలాలు.. పూర్వ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ తదితర జిల్లాలనుంచి వాహనాల ద్వారా వేలాదిగా తరలివచ్చారు. చింతలపల్లిలో సుమారు 1,059 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలు వాహనాలతో నిండిపోయాయి. పోలీసులతో పాటు 2,500 మంది వలంటీర్లు ట్రాఫిక్ నియంత్రణలో నిమగ్నమైనా.. వందలాది వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. మరిన్ని సభా విశేషాలు -
ఆయిల్పామ్ తోట అగ్నికి ఆహుతి
● రూ.10 లక్షల మేర నష్టం రఘునాథపల్లి: కోమళ్ల గ్రామానికి చెందిన బత్తోజు ఆంజనేయులు సాగు చేసిన ఐదెకరాల ఆయిల్పామ్ తోట ఆదివారం మధ్యాహ్నం అగ్నికి ఆహుతైంది. తోట పక్కనే ఉన్న భూముల రైతులు ఇటీవల జేసీబీతో కంపచెట్లు తొలగించి కుప్పగా వేసి నిప్పు పెట్టడంతో మంటలు ఆయిల్పామ్ తోట చుట్టూ వ్యాపించి పచ్చ ని చెట్లు కాలిపోయాయని బాధిత రైతు ఆరోపించారు. 100 నంబర్కు డయల్ చేయగా పోలీసులు చేరుకుని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. దారి సక్రమంగా లేకపోవడంతో ఫైరింజన్ తోట వద్దకు చేరుకోలేక వెనుదిరిగి పోయింది. రెండున్నర సంవత్సరాల క్రితం సాగు చేసిన తోట ఆరు నెలల్లో చేతికందనున్న పంట అగ్నికి ఆహుతి కావడంతో రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతు ఆంజనేయులు వాపోయాడు. ముళ్ల పొదలను తగులబెట్టిన సదరు రైతులపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్న ఆయన వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని విజ్ఙప్తి చేశాడు. -
మృతులకు నివాళి అర్పించి..
మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సైతం సభపై ఆసీనులయ్యారు. కశ్మీర్లో ఉగ్రవాదులు అమాయక దేశ బిడ్డలను దారుణంగా బలి తీసుకున్నారని.. ఇందుకు మౌనం పాటిద్దామని కేసీఆర్ పిలుపునివ్వడంతో సభకు వచ్చిన వారంతా నిలబడి నిమిషంపాటు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును స్వాగతోపన్యాసం చేయాలని కోరారు. రజతోత్సవ సభకు హాజరైన బీఆర్ఎస్ రథసారథి కేసీఆర్కు స్వాగతం పలుకుతూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రసంగించారు. 2013 తర్వాత జరుగుతున్న భారీ సభకు విచ్చేసిన మాజీ మంత్రులు, బీఆర్ఎస్ అధినేతలు, తెలంగాణ నలుమూల నుంచి వచ్చిన జనానికి కూడా ఆయన స్వాగతం చెప్పారు. పహల్గాం మృతులకు సంతాపంగా మౌనం పాటిస్తున్న కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, బండా ప్రకాశ్, మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, జగదీశ్రెడ్డి తదితరులు -
కట్టిపడేసిన ఆటాపాట..
మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ సాధన ఉద్యమానికి ఊపిరిలూదిన ఆట, పాటలతో సుమారు మూడు గంటల పాటు ఆటపాటలతో సభికులను కట్టిపడేశారు. పాత పాటలతో పాటు కొత్తగా కేసీఆర్ పాలన, పునఃపరిపాలనకు దోహదం చేసే తీరుపై పలువురు గాయకులు ఆలోచింపజేస్తూ జోష్ నింపారు. ఈసందర్భంగా దివంగత గాయకుడు సాయిచంద్కు కళాకారులు ఆటపాటతో ఘన నివాళులు అర్పించారు. విభిన్న సాంస్కతిక కళాకారులు తమ ప్రతిభతో తెలంగాణ ఉద్యమ తీరును చాటారు. కేసీఆర్ సభాస్థలికి వచ్చే ముందు తెలంగాణ సాధన మలి ఉద్యమంలో కేసీఆర్ పాత్ర తీరుతెన్నులు, సాధించిన తెలంగాణ పురోగతిపై బహుబలి సినిమా తరహాలో డిజిటల్ స్క్రీన్లపై ప్రదర్శన ఇచ్చారు. సభకు వచ్చిన జనం నిశ్శబ్దంగా తిలకించడం గమనార్హం. ‘‘మందెంట పోతుండే ఎలమంద... వాడు ఎవ్వాని కొడుకమ్మ ఎలమందా’’ పాటకు సభికులు ఉర్రూతలూగారు. ‘‘సారే కావాలంటున్నరే... తెలంగాణ పల్లెలల్ల.. మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల’’ తదితర పాటలతో సభాప్రాంగణం దద్దరిల్లింది. సభలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, సత్యవతిరాథోడ్, జి.జగదీశ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, డా.బండా ప్రకాష్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, తక్కళ్లపెల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి, గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్కుమార్, వినయ్భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, డా.టి.రాజయ్య, ధరంసోతు రెడ్యానాయక్, శంకర్నాయక్, బాల్క సుమన్, గాదరి కిషోర్, చల్లా ధర్మారెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, మాజీ ఎంపీ మాలోతు కవితతోపాటు పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు పాల్గొన్నారు. -
ఉగ్రవాదాన్ని అంతమొందించాలి
పాలకుర్తి టౌన్ : ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అంతమొందించాలని మహాత్మా హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు గంటా రవీందర్, డాక్టర్ కల్నల్ మాచర్ల భిక్షపతి అన్నారు. ఉగ్రదాడులకు నిరసనగా ఆదివారం రాత్రి పాలకుర్తి మండల కేంద్రం గుడివాడ చౌరస్తా నుంచి రాజీవ్ చౌరస్తా వరకు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పి తీరుతామని హెచ్చరించారు. ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన అమరుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో ఎంఈఓ పోతుగంటి నర్సయ్య, తండ మల్లయ్య, కిరాణ వర్తక వ్యాపార సంఘం అధ్యక్షుడు చారగొండ్ల ప్రసాద్, పన్నీరు సారంగపాణి, ఇమ్మడి అశోక్, భోనగిరి కృష్ణమూర్తి, కమ్మగాని శ్రీకాంత్, మారం రవి, గుమ్మడిరాజు సాంబయ్య పాల్గొన్నారు. కొవ్వొత్తులతో ప్రదర్శన జఫర్గఢ్ : పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మశాంతికి ఆర్యవైశ్యులు ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించా రు. గాంధీ సెంటర్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు అంచూరి యుగంధర్, నాయకులు దాంశెట్టి సోమన్న, ఇమ్మడి ఆశోక్, గందె సోమన్న, శ్రవణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పహల్గాం మృతులకు కొవ్వొత్తులతో శాంతిర్యాలీ -
పహల్గాం మృతులకు ఆస్ట్రేలియాలో నివాళి
జనగామ: పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఈ ఘటనలో మృతి చెందిన వారికి ఆస్ట్రేలియా ఫెడరేషన్ స్క్వేర్లో భారతీయులు నివాళులర్పించారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవా లని కోరారు. కార్యక్రమంలో మెల్బోర్న్ తెలుగు సంఘం ప్రతినిధి, జనగామవాసి చింతల శ్రీని వాస్, శివకుమార్, గురుప్రీత్ వర్మ, శ్రీదుర్గా టెంపుల్ అసోసియేషన్ కార్యదర్శి ప్రదీప్శర్మ, జోషి, హర్ప్రీత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. 29న జాబ్ మేళా జనగామ రూరల్: కలెక్టరేట్లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 29న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ముత్తూట్ మైక్రోఫిన్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యాన ఉదయం 10.30 గంటలకు నిర్వహించే ఈ మేళాకు అర్హత ఉన్న జనగామతోపాటు ఉమ్మడి జిల్లా నిరుద్యోగ యువతీ యువకులు బయోడేటా, విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్తో హాజరు కావాలని జిల్లా ఉపాధికల్ప న అధికారి పి.సాహితి ఒక ప్రకటనలో తెలిపా రు. మరిన్ని వివరాలకు 7995430401 నంబర్లో సంప్రదించాలని సూచించారు. రాపాక శ్రీశైలానికి డాక్టరేట్ దేవరుప్పుల : సమాజ రుగ్మతలను మెరుగు పర్చడమే లక్ష్యంగా సేవలందించిన సింగరాజుపల్లికి చెందిన రాపాక శ్రీశైలంకు (నాటా యూ ఎస్ఏ) హైదరాబాద్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో డాక్టరేట్ ప్రదానం చేశారు. దళిత సామాజిక కార్యకర్త శ్రీశైలం అనియత విద్యాకేంద్రంలో ఉపాధ్యాయుడిగా సేవలందిస్తూ మహిళా సాధి కారత దిశగా దేవరుప్పుల, చేర్యాల, ఘన్పూర్ మండలాల మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించారు. తెలంగాణ సాధన ఉద్యమంలో మమేకమైన ఆయన కులాంతర వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచాడు. హెచ్ఎస్ సీయూ కార్యనిర్వాహకులు డాక్టర్ ఆనంద్, ప్రసాద్ చేతుల మీదుగా శనివారం డాక్టరేట్ అందుకున్న శ్రీశైలం నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఎల్కతుర్తి వైపే!
దారులన్నీసాక్షిప్రతినిధి, వరంగల్: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో నేడు(ఆదివారం) నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యా యి. రాష్ట్ర నలుమూలల నుంచి జనాలను సమీకరించే పనిలో నాయకులు తలమునకలయ్యారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకల కు 10 లక్షల మంది వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి జనాలను సభకు తరలించేందుకు వాహన సౌకర్యం కూడా కల్పించారు. ఆదివారం సాయంత్రం 4:30 గంటలలోపు సభా ప్రాంగణానికి చేరుకునేలా నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీఆర్ఎస్ ఏర్పడి 24 ఏళ్లు పూర్తయి 25వ ఏట అడుగుపెడుతున్న నేపథ్యంలో రజతోత్సవం పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన ఈ సభ ఎల్క తుర్తిలో నిర్వహించడం చర్చనీయాంశం కాగా.. దారులన్నీ ఎల్కతుర్తి వైపే కదులుతున్నాయి. బాహుబలి వేదిక.. తరలివస్తున్న జనం గులాబీ పార్టీ పాతికేళ్ల పండుగకు ఎల్కతుర్తి ముస్తాబైంది. చరిత్రలో నిలిచేలా నిర్వహించే ఈవేడుకల కోసం ఎల్కతుర్తి ఎక్స్ రోడ్డులో బాహుబలి సభావేదిక సిద్ధమైంది. రజతోత్సవానికి అధినాయకత్వం ఎంచుకున్న ఎల్కతుర్తి ఎక్స్రోడ్డు సమీపంలో వేదిక నయనానందంగా రూపుదిద్దుకుంది. ఇందుకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీ ఆర్ పర్యవేక్షణలో 1,213 ఎకరాలను రైతుల నుంచి సమీకరించిన గులాబీ శ్రేణులు సుమారు నెల రోజులుగా శ్రమించారు. సుమారు పది లక్షల మంది హాజరయ్యే ఈ వేడుక కు కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గులాబీమయం రజతోత్సవ సభతో ఎల్కతుర్తి గులాబీమయమైంది. బీఆర్ఎస్ మహాసభతో ఎల్కతుర్తి రజతోత్సవ శోభను సంతరించుకుంది. పార్టీ అధినేత కేసీఆర్, ఇతర నాయకుల కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, గులాబీ తోరణాలతో కళకళలాడుతోంది. పెద్ద వేదిక ఆపక్కనే కళాకారు ల ఆట–పాట కోసం ప్రత్యేకంగా మరో వేదిక ఆకర్షణీయంగా కనిపిస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే వాహనాల కోసం 1,059 ఎకరాల్లో పార్కింగ్ ఇవ్వగా.. వీఐపీ వాహనాల కోసం సభావేదిక ఎడమ భాగం, వెనుక భాగంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. మహాసభ ప్రాంగణంలో వాహనాలు, ప్రజలు వచ్చేందుకు వీలుగా ఏర్పాటు చేసిన గ్రీన్, రెడ్ కార్పెట్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. సభావేదిక ఏర్పాట్లలో ఆ ఆరుగురు.. గులాబీ దళపతి, పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలు, సూచనలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యవేక్షణ లో ఆరుగురు నేతలు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యేలు వినయ్భాస్కర్, పెద్ది సుదర్శన్రెడ్డి, వొడితెల సతీశ్కుమార్ అవిశ్రాంతంగా శ్రమించా రు. ఎల్కతుర్తి, శివారు గ్రామాల రైతుల నుంచి భూముల హామీ పత్రాల స్వీకరణ మొదలు.. సభావేదిక ఏర్పాటు వరకు అధినేత ఆదేశాల మేరకు పని కానిచ్చారు. భారీ పోలీస్ బందోబస్తు ఎల్కతుర్తి: సభకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ సీపీ సన్ప్రిత్సింగ్ ఇదివరకే సభా ప్రాంగణాన్ని పరిశీలించి నిర్వాహకులతో చర్చించారు. సభలో అవాంతరాలు, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా భారీగా పోలీసులను నియమించారు. ఇద్దరు డీసీపీలు, మరో ఇద్దరు అడిషినల్ డీసీపీలు, ఎనిమిది మంది ఏసీపీలు, 28మంది సీఐలు, 66 మంది ఎస్సైలు, 137 మంది ఏఎస్సైలు, హెడ్కానిస్టేబుళ్లు, 511మంది కానిస్టేబు ళ్లు, 200 మంది హోంగార్డులతోపాటు డిస్ట్రిక్గార్డ్స్.. మొత్తం 1,100 మంది కిపైగా పోలీసులను కేటాయించారు. హెలిపాడ్, సభాప్రాంగణం, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ క్రౌడ్ కంట్రోలింగ్ ప్రాంతాల్లో సేవలందించనున్నారు. -
ఉగ్రదాడులు అమానుషం
జనగామ రూరల్: పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి జనగామ కవులు, కళాకారులు నివాళులర్పించారు. ఐక్యవేదిక ఆధ్వర్యాన శనివా రం పట్టణం పరిధి అంబేడ్కర్ నగర్లోని అంబేడ్క ర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. పర్యాటకులపై ఉగ్రదాడులు అమానుష చర్య అని, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవా లని కోరారు. ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులు జి.కృష్ణ, పానుగంటి రామమూర్తి, అయిలా సొమనర్సింహాచారి, అంబాల శివనాథ్గౌడ్, గొలుసుల నర్సయ్య, పెట్లోజు సోమేశ్వరాచారి, నక్క సురేష్, గడ్డం మనోజ్కుమార్, రమేశ్, మల్యాల జనార్ధనాచారి, చిలుమోజు సాయికిరణ్, రంగరాజు ప్రసాద్, రామచంద్రం, డాక్టర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
నాడు పిడికిలెత్తి.. నేడు ఉరకలెత్తి
● ఉద్యమ స్ఫూర్తితో ఓరుగల్లులో రజతోత్సవ సంబురం ● కాకతీయుల గడ్డపై స్వరాష్ట్ర సాధన ఉద్యమం ● ఉద్యమ పార్టీగా ఆదరణ.. 25 ఏళ్లలో ఎన్నో ఒడిదొడుకులు ● తెలంగాణ సాధనలో వరంగల్దే కీలక భూమిక చాకలి ఐలమ్మ పౌరుషం.. రాణి రుద్రమ వారసత్వం.. భూపతి కృష్ణమూర్తి పోరాట పటిమ. బత్తిని మొగిలయ్య అమరత్వం. జయశంకర్ సార్ మేధస్సు. కణకణమండిన కాళోజీ రచనల ఉద్వేగం. వీరందరి స్ఫూర్తితో నాడు ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ఈ గడ్డపై నుంచి ఏ కార్యం మొదలు పెట్టినా విజయవంతమవుతుందన్న కేసీఆర్ నమ్మకంతో నేడు పార్టీ 25 ఏళ్ల వేడుకను ఇక్కడ నిర్వహిస్తున్నారు. – సాక్షిప్రతినిధి, వరంగల్ కాంగ్రెస్ ఇక ఖతమే! ● ప్రభుత్వ మోసాలు ప్రజలకు తెలిసిపోయినయ్.. ● రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలి ● మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు– IVలోu -
రాష్ట్ర అధ్యక్షులుగా బీసీలనే నియమించాలి
● బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సిద్ధయ్య జనగామ రూరల్: బీఆర్ఎస్, భారతీ య జనతా పార్టీలకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షులుగా బీసీలనే నియమించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సిద్ధయ్య డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్లో పట్టణ అధ్యక్షుడు జాయ మల్లేష్ ఆధ్వర్యాన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ ప్రజలకు ఆ రెండు పార్టీలు చేసిన అభివృద్ధి ఏమి లేదని, రాజ్యాధికారం రాకుండా నిలువరిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికే బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారని, గతంలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని, పొరపాట్లను, నష్టాలను, తప్పుడు పాలసీలను ప్రజలకు తెలియ జేయాల్సిన బాధ్యత కేసీఆర్పై ఉందన్నారు. దేశ జనాభాలో 56శాతం ఉన్న బీసీలను నిర్లక్ష్యం చేస్తూ రిజర్వేషన్లలో అన్యాయం చేసి అధికారంలోకి రాకుండా అడ్డుకున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నామాల శ్రీనివాస్, రజక చైతన్య సంఘం జిల్లా నాయకుడు ఎదునూరి రవీందర్, కొలిపాక రాములు, కురుమ, యాదవ, కుమ్మరి, పద్మశాలి, బీసీ సంఘాల నాయకులు దేవర సత్యనారాయణ, చంద్ర శ్రీనివాస్, నాంపల్లి అశోక్, వల్లాల మల్లేశం, బత్తిని అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
సభకు దండులా కదలాలి
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు దండులా కదలి రావాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నా రు. శనివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సభలో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు ఊరూ, వాడా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ దుష్ట పాలనతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మరోపోరాటం తప్పదని స్పష్టం చేశారు. అంతకు ముందు సభకు హాజరయ్యే నాయకులకు స్వాగతం పలికేందుకు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. మాజీ మంత్రి హరీశ్రావుకు స్వాగతం రజతోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్తున్న మాజీ మంత్రి హరీశ్రావుకు వరంగల్–హైదరాబాద్ హైవే యశ్వంతాపూర్ జంక్షన్ వద్ద శనివారం ఎమ్మెల్యే రాజేశ్వర్రెడ్డి ఘన స్వాగతం పలికారు. నాయకులు తాళ్లసురేష్రెడ్డి, బాల్దె సిద్ధిలింగం, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, డాక్టర్ పగిడిపాటి సుధాసుగుణాకర్రాజు, మసిఉర్ రెహమాన్, ముస్త్యాల దయాకర్, కె.అనిల్రెడ్డి, కృష్ణ, సందీప్, హరిప్రసాద్, లక్ష్మీశ్రీశైలం, నాగరాజు పాల్గొన్నారు. -
‘భూ భారతి’పై అవగాహన అవసరం
జనగామ రూరల్: ‘భూ భారతి’ చట్టంపై రైతులకు అవగాహన అవసరమని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివారం పట్టణంలోని గాయత్రి గార్డెన్లో ఈ చట్టంపై రైతులకు ఏర్పాటు చేసిన అవగాహ న సదస్సులో అదనపు కలెక్టర్ రోహిత్సింగ్తో కలిసి మాట్లాడారు. ధరణిలో అప్పీల్ వ్యవస్థ లేక కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని, భూభారతి చట్టంలోని అప్పీల్ వ్యవస్థ ద్వారా జిల్లా పరిధిలోనే సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. ధరణిలో ప్రతీ దరఖాస్తు కలెక్టర్ వద్దకు వచ్చేదని, ఇప్పుడు అలా కాకుండా తహసీల్దార్, ఆర్డీఓ వద్దే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వివరించారు. మే చివరి నాటికి ప్రతీ గ్రామానికి రెవెన్యూ అధికారులు వచ్చి భూసమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, విచారణ చేపట్టి సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు. సదస్సులో ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్ హుస్సేన్, రైతులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివారం జనగామ మండల పరిధి వడ్లకొండ, శామీర్పేట్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ రోహిత్సింగ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని, దళారులకు విక్రయించి మోసపోవద్దని రైతులకు సూచించారు. కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివారం పట్టణంలోని 14వ వార్డులో జరుగుతున్న అబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని వెరిఫికేషన్ టీంకు సూచించారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి
జనగామ రూరల్: పెట్టుబడి దారులకు దేశ సంపదను దోచిపెడుతూ కార్మిక హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మశ్రీ పిలుపునిచ్చారు. అఖిలభారత కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యాన మే 20న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో బీఆర్టీయూ అల్లా అధ్యక్షుడు వేముల నర్సింగం అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ.. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ అనుకూల, మతోన్మాద చర్యలను మరింత దూకుడుగా అమలు చేస్తోందన్నారు. సమావేశంలో ఆయా సంఘాల నాయకులు యాటాల సోమన్న, రాపర్తి రాజు, ఆకుల శ్రీనివాస్, మోటే, శ్రీశైలం, చుంచు విజేందర్, జేరిపోతుల కుమార్, ఎండీ అంజాద్ పాషా, రమాదేవి పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మశ్రీ -
శ్రీఽథమ్–25 వేడుకలు షురూ
హసన్పర్తి: నగర శివారులోని ఎస్సార్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహిస్తున్న సుమతిరెడ్డి మహిళా ఇంజనీరిగ్ కళాశాలలో ‘శ్రీథమ్–25’ వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో ప్రిన్సిపాల్ డాక్టర్ రాజశ్రీరెడ్డి మాట్లాడారు. దేశ సాంస్కృతిక సంప్రదాయాలను పరిరక్షించాలన్నారు. క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని.. విద్యార్థినుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతాయన్నారు. తొలుత జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమాన్ని పురస్కరించుకుని వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ మహేందర్, డాక్టర్ సుదర్శన్, డాక్టర్ శ్రీవాణి, ఏఓ వేణుగోపాల్తో పాటు విద్యార్థినులు పాల్గొన్నారు. -
రంగప్పచెరువులో వెంచర్ రాళ్ల తొలగింపు
● ‘సాక్షి’ కథనానికి స్పందన ● కృతజ్ఞతలు తెలిపిన కాలనీ వాసులు జనగామ: జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న రంగప్ప చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్ పరిధిలో అక్రమంగా వేసిన వెంచర్(ప్లాట్లు) రాళ్లను అధికారులు శుక్రవారం తొలగించారు. ‘చెరువమ్మ.. కంట చెమ్మ’ శీర్షికన గత నెల 13న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి పురపాలిక, ఇరిగేషన్ అధికారులు స్పందించారు. రంగప్పచెరువు ఇప్పటికే 15 ఎకరాలకుపైగా ఆక్రమణకు గురైనట్లు అంచనా వేశా రు. కబ్జా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కొంతమంది పెద్ద మనుషులు ఇటీవల పాత ఇళ్లను కూల్చివేసిన మట్టితో చెరువును కప్పేస్తుండగా కాలనీ వాసులు అడ్డుకున్న విషయం తెలి సిందే. చెరువు కబ్జాపై కథనాలు ప్రచురించిన ‘సాక్షి’కి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రతీ ఇంట్లో ఎర్త్ వైరింగ్ ఏర్పాటుచేసుకోవాలి
– కూరాకుల పాల్, ఎలక్ట్రీషియన్ నెహ్రూసెంటర్: ఇళ్లలో వినియోగించే ఎలక్ట్రానిక్ వస్తువుల పట్ల జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో వాడుకునే ఫ్రిజ్, టీవీ, ఏసీ, కూలర్, ఫ్యాన్, వంటి వాటిని పిల్లలు ముట్టుకోకుండా చూసుకోవాలి. దీంతో పాటు వేసవిలో విద్యుత్ సరఫరా, అంతరాలు జరిగినప్పుడు, వడ గాలుల వల్ల విద్యుత్ వైర్లు తెగినప్పుడు వాటిని సరి చేసుకునే వరకు ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించొద్దు. సొంతంగా ఎలక్ట్రీషియన్ పనులు చేయవద్దు. అకాల వర్షాల కారణంగా వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులు పడిన సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఎలక్ట్రానిక్ వస్తువులను కాలిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించకూడదు. ఇంట్లో వస్తువులను ఏర్పాటు చేసుకున్నప్పుడు తప్పకుండా ఎర్త్ వైరింగ్ చేయాలి. చార్జింగ్ తీసిన తర్వాత ఫోన్ వినియోగించుకోవాలి. ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువగా వాడితే మంచి క్వాలిటీ కలి గిన విద్యుత్ వైర్లను వినియోగించాలి. ఇంటి ఆవరణలో ఇనుప తీగలతో దండాలు కట్టుకోవద్దు. దీని వల్ల విద్యుత్ ప్ర మాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైతే మెకానిక్, ఎలక్ట్రీషియన్కు చూపించాలి. -
సాహితీ యాత్రకు ఘన స్వాగతం
పాలకుర్తి టౌన్: పాలమూరు జిల్లా తెలుగు పండిత సమూహం ఆధ్వర్యాన చేపట్టిన ‘సాహితీ యాత్ర’కు ఘన స్వాగతం లభించింది. తెలంగాణ తెలుగు పాఠ్యపుస్తక మండలి సభ్యుడు, కవి పండితుడు పల్లెర్ల రామమోహన్రావు నేతృత్వాన 23 మంది కవులు, పండితులు, ఉపాధ్యాయులు చేపట్టిన పాలకుర్తి సాహితీ యాత్ర–2025 శుక్రవారం ఇక్కడికి చేరుకుంది. సోమనాథ కళాపీఠం అధ్యక్షుడు డాక్టర్ రాపోలు సత్యనారాయణ, డాక్టర్ శంకరమంచి శ్యాంప్రసాద్, మార్గం లక్ష్మీనారాయణ, పోతన సాహిత్య కళావేదిక వ్యవస్థాపకులు మన్యాపు భూజేంద్ స్వాగతం పలికారు. అనంతరం యాత్ర బృందం పాల్కురికి సోమనాథుడు, బమ్మెర పోతన జన్మస్థలాలు, సోమనాథుడి స్మారక కేంద్రం, సోతన దున్నిన పోలాలు, ఆయన తల్లి లక్కమాంబ పేరుమీద ఏర్పడిన లక్క సముద్రం చెరువును, గూడూరులో 900 సంవత్సరాల శాసనాన్ని, పాలకుర్తి సమీపాన వాల్మీకి మహర్షి నడయాడిన నేల వల్మిడిని సందర్శించారు. ఈ సందర్భంగా పాలమూరు కవులను సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ శంకరమంచి శ్యాంప్రసాద్, కట్ట గిరిజారమణ శర్మ, అనిత, సిద్ధాంతి రాజశేఖరశర్మ, తిరపతమ్మ తదితరులు పాల్గొన్నారు. -
దేశం.. ఎల్కతుర్తి వైపు చూస్తోంది
ఎల్కతుర్తి: దేశం.. ఎల్కతుర్తి వైపు చూస్తోందని, ఈనెల 27న పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ రాజకీయ పార్టీ సమావేశం కాదని, రాష్ట్ర ప్రజలందరి పండుగ అని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంతో పాటు చింతలపల్లి సమీపంలో రజతోత్సవ సభ ఏర్పాట్లను హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్కుమార్, పెద్ది సుదర్శన్రెడ్డి, నారదాసు లక్ష్మణ్రావుతో కలిసి సభ ఏర్పాట్లు పరిశీలించారు. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి 50 వేల మంది తరలివస్తారని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి వెల్లడించారు. పరిశీలించిన వారిలో పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, నాయకులు పేర్యాల రవీందర్రావు ఉన్నారు. నేతల తాకిడి.. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల నేతలు పరిశీలించారు. మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రాజ్యాసభ సభ్యులు మద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, ఉమ్మడి ఖమ్మం నుంచి రేగా కాంతారావు, హరిప్రియ, కామారెడ్డి నుంచి జాజుల సురేందర్ తదితర నేతలు సభాస్థలికి రాగా వారికి ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, వొడితెల సతీశ్కుమార్, నాగుర్ల వెంకన్న ఏనుగుల రాకేశ్రెడ్డి తదితరులు సభా ప్రాంగణంలో ఏర్పాట్ల గురించి తెలిపారు. వారికి కేటాయించిన పార్కింగ్ స్థలాలను చూపించారు. దండులా కదిలిరావాలి.. రజతోత్సవ సభకు ప్రజలు దండులా కదిలి రావాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. పాలమూరు జిల్లాకు కేటాయించిన పార్కింగ్ స్థలాన్ని ఆయన పరిశీలించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ సభాస్థలి పరిశీలన -
నిబంధనలు తూచ్..
‘ప్రభుత్వ నిబంధనలతో సంబంధం లేదు.. మేము నిర్ణయించిన ప్రకారమే కొనుగోలు చేస్తాం.. ధాన్యం లిఫ్టు అయ్యే వరకు గన్నీ బ్యాగులు ఇచ్చుడు లేదు’.. జనగామ వ్యవసాయ మార్కెట్ కాటన్ యార్డులో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్ నిర్వాహకుల తీరుతో ధాన్యం విక్రయించడానికి వచ్చిన రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. తేమ 17 శాతం వచ్చినా కొంటలేరు.. మద్దతు ధరకు అమ్ముకునేందుకు నాలుగు రోజుల కింద 200 బస్తాల వడ్లు ఇక్కడికి తెచ్చినం. నిలువ నీడ లేదు. కనీసం తాగడానికి నీళ్లు లేవు. ధాన్యంలో 17 శాతం తేమ వచ్చినా కొంట లేరు. సెంటర్ నిర్వాహకులు పొద్దున కాకుండా సాయంత్రం చూసి తేమ ఎక్కువ ఉందని అంటున్నారు.జనగామ: యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్ శాఖలకు చెందిన దొడ్డు, సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు 276 ఏర్పాటు చేశా రు. పట్టణ పరిధి, జనగామ మండలంలోని రైతుల సౌకర్యార్థం వ్యవసాయ మార్కెట్ కాటన్ యార్డులో చీటకోడూరు ఐకేపీ సెంటర్ ప్రారంభించారు. అయితే లింగాలఘణపురం, రఘునాథపల్లి తదితర మండలాల నుంచి కూడా రైతులు ఇక్కడికి ధాన్యం తీసుకువస్తున్నారు. దీంతో 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కాటన్ యార్డులో 25వేల బస్తాలకు పైగా ధాన్యం నిల్వలు పేరుకు పోయాయి. కొనుగోళ్లలో జాప్యం కారణంగా ఐదు నుంచి 15 రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నారు. తేమ 17 శాతం ఉన్నా కొనుగోళ్లలో జాప్యం..! ప్రభుత్వం 17 శాతం తేమ ఉన్న ధాన్యం క్వింటాకు రూ.2,320 చొప్పున కొనుగోలు చేసేలా నిబంధనలు విధించింది. ఈ సెంటర్లో మాత్రం 16 శాతం తేమ ఉండాల్సిదేనని షరతులు పెడుతున్నారు. ఇదేంటని రైతులు అడిగితే అట్లయితెనే కొంటాం అంటూ బుకాయించడంతో రెండు రోజుల క్రితం నిర్వాహకులను నిలదీయడంతో.. సమస్య పైఅధి కారుల వరకు వెళ్లింది. అయినా వారి తీరు మారకపోవడంతో రోజుల తరబడి రైతులు ధాన్యం ఆరబోసుకుంటూ నిరీక్షిస్తున్నారు. ‘17 శాతం తేమ వచ్చినా కొనుగోలు చేయడంలేదు.. ఒక వేళ కొనుగోలు చేసినా.. నిల్వ ఉన్న బస్తాలు రైస్ మిల్లులకు తరలించే వరకు గన్నీ బ్యాగులు ఇవ్వడంలేదు’ అని పలువురు రైతులు వాపోయారు. ఇప్పటి వరకు ఈ సెంటర్లో 2,818 మంది రైతుల నుంచి 37,821 బస్తాల ధాన్యం కొనుగోలు చేయగా.. 36,421 బ్యాగుల ధాన్యం రైస్ మిల్లులకు తరలించారు.– ఎలబోయిన సమ్మక్క, మహిళా రైతు, చీటకోడూరు(జనగామ)15 రోజుల క్రితం ధాన్యం తెచ్చాం.. మద్దతు ధరకు అమ్ముకోవడానికి 15 రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి 460 బస్తాల ధాన్యం తెచ్చాం. తేమ 16 శాతం ఉంటేనే కొంటామని నిర్వాహకులు మెలిక పెట్టారు. దీంతో చాలాసార్లు ఆరబోయగా తేమ 17 శాతం వచ్చింది. బైక్ పెట్రోలు, భోజనం, ఆరబోసేందుకు కూలీల ఖర్చు రోజుకు రూ.500 అవుతోంది. శుక్రవారం కొంటామని చెప్పిన నిర్వాహకులు.. ముందు కొన్న ధాన్యం లిఫ్టు అయ్యేవరకు గన్నీ బ్యాగులు ఇవ్వమన్నారు. – బండారు తిరుపతి, రైతు, చీటకోడూరుతేమ 17 కాదు.. 16 శాతం ఉంటేనే కొంటాం ఉన్న స్టాక్ తరలించాకే గన్నీ బ్యాగులిస్తామని మెలిక ఐకేపీ ధాన్యం సేకరణ కేంద్రంలో నిర్వాహకుల ఇష్టారాజ్యం రోజుల తరబడి రైతులకు తప్పని నిరీక్షణ -
మూగజీవాలకు తాగునీరు అందిద్దాం
– నాగ ప్రసాద్, పశువైద్యాధికారి, బచ్చన్నపేట జనగామ: వేసవి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు పెరిగాయి. ఎక్కడా కుళాయిలు అందుబాటులో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు, పక్షుల దాహార్తి తీర్చేందుకు ప్రతి ఒక్కరూ స్పందించాలి. ప్రభుత్వంతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలి. కుక్కలు, పక్షులు గొంతెండి మృత్యువాత పడకుండా ఇంటి ఆవరణ, భవనాల ముందు, ప్రధాన కూడళ్లలో నీటితొట్లు ఏర్పాటు చేసి ఎప్పుడూ తాగునీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పక్షులకు ఇంటిదాబా పైన తొట్టిలాంటి మట్టిపాత్రలు ఉంచి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నీటిని పోస్తూ ఉండాలి. వాటికి దాహం వేసిన సమయంలో అలవాటుగా రోజూ అక్కడికి వచ్చి దాహం తీర్చుకుంటాయి. వరంగల్ మహానగరంలో అయితే బల్దియా ఆధ్వర్యంలో సుమారు 300 చోట్ల నీటితొట్టెలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాగే అన్ని మున్సిపాలిటీ కేంద్రాల్లో ఏర్పాటుచేస్తే మంచిది. గ్రామాల్లో రోడ్ల వెంట గతంలో నీటితొట్లు ఏర్పాటుచేశారు. వాటిని శుభ్రం చేసి గ్రామ పంచాయతీవారు నీటిని నింపి పెట్టాలి. -
మలేరియా నిర్మూలనకు కృషి చేయాలి
జనగామ రూరల్: మలేరియా నిర్మూలనకు కృషి చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీని ప్రారంభించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. గ్రామ స్థాయిలో పరిసరాల పరిశుభ్ర త పాటించడంతోపాటు నీటి గుంతల నిర్వహణ, కొబ్బరి బొండాలు, ప్లాస్టిక్ కంటేయినర్లు తదితరా లను ఇష్టానుసారంగా వేయకుండా ప్రజలకు వివరించాలని చెప్పారు. దోమ కాటు నుంచి రక్షణ, దోమలతో వచ్చే వ్యాధులకు సకాలంలో చికిత్స అందేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా మలేరియా నివారణకు కృషి చేసిన సిబ్బంది టి.రవీందర్, ఫీల్డ్ వర్కర్ ముస్తఫా, అలివేలు మంగ, యాదలక్ష్మి తది తరులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్ర మంలో డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు, ప్రోగ్రాం అధికారి డాక్టర్ అశోక్, డాక్టర్ కమల్హాసన్ తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఎంపిక వేగంగా చేపట్టాలి జనగామ రూరల్: నిబంధనలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక వేంగంగా చేపట్టా లని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి జనగామ నియోజకవర్గానికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించా రు. ఈనెల 29లోగా వెరిఫికేషన్ పూర్తి చేసి మే 2న జీపీల్లో అర్హుల జాబితా ప్రదర్శించాలన్నారు. సమా వేశంలో స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ సుహాసిని, ఆర్డీఓ గోపీరాం, హోసింగ్ పీడీ మాతృనాయక్, మున్సిప ల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
చిన్న పిల్లల్లో హీట్ స్ట్రోక్
– డాక్టర్ సుధాకర్, పిడియాట్రిషన్ ఎంజీఎం : హీట్ స్ట్రోక్ (ఎండదెబ్బ) వల్ల ఎండాకాలంలో పిల్లలు బాగా ఇబ్బందులు పడుతుంటారు. ఎక్కువగా ఎండలో తిరిగేవారు, శుభకార్యాలకు వెళ్లేవారు, ఇంటి ఆవరణలో ఎండలో, ఆట స్థలంలో తిరిగే పిల్లలకు ఎక్కువగా హీట్ స్ట్రోక్కు గురవుతారు. హీట్ స్ట్రోక్ లక్షణాలు.. ● శరీరం బాగా వేడెక్కడం. వాంతులు, విరోచనాలతో శరీరంలో నీటిశాతం పడిపోతుంది ● పిల్లలకు మూత్రం సరిగ్గా రాకపోవడం, ఎర్రగా రావడం. ఎండలో తిరిగే పిల్లలు తొందరగా అలిసిపోవడం, తలనొప్పి, శరీరంలో నొప్పులు, నరాల బలహీనత , తీవ్ర అస్వస్థతతో కోమాలోకి వెళ్తారు. ● పసిపిల్లలు డల్గా ఉంటారు. బరువు తగ్గడం, పాలు సరిగ్గా తాగకపోవడంలాంటి లక్షణాలు ఉంటాయి. ● అందుకే పిల్లలు ఎండలో ఎక్కువగా తిరగకుండా ఉండాలి. ప్రయాణాలు తగ్గించుకోవాలి. ● పిల్లలు ఎక్కువగా నీళ్లు తాగాలి. ఓఆర్ఎస్ తాగించాలి. ● వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరింపజేయాలి. -
మిర్చి రైతులకు మెరుగైన ధర ఇవ్వాలి
● జేడీఎం ఉప్పుల శ్రీనివాస్ వరంగల్: ఏనుమాములలోని వరంగల్ వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతులకు నాణ్యత ప్రకారం మెరుగైన ధరల్ని ఇచ్చేందుకు వ్యాపారులు కృషి చేయాలని వరంగల్ జేడీఎం ఉప్పుల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మార్కెట్ ప్రధాన కార్యాలయంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, మిర్చి వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఇందులో మిర్చి ధరలపై సుధీర్ఘంగా చర్చించారు. తేజ రకం మిర్చిని జిల్లాలోని రైతులు ఖమ్మం మార్కెట్కు తరలించడంపై అధికారులు స్పందించి సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. కొద్దిరోజులుగా తేజ రకం మిర్చి ధరలు వరంగల్, ఖమ్మం మార్కెట్లో వ్యత్యాసం ఎక్కువగా ఉందని, రైతుల నుంచి వచ్చిన ఆరోపణలను వ్యాపారుల దృష్టికి తీసుకెళ్లారు. అక్కడికి నంబర్–1 క్వాలిటీ వెళ్తుందని, ఇక్కడికి 2, 3 రకం వస్తున్నందున ఈపరిస్థితులున్నట్లు వ్యాపారులు చెప్పారు. ఖమ్మం మార్కెట్ నుంచి తెచ్చిన షాంపిళ్లను వారి ముందు పెట్టి వరంగల్కు వచ్చిన మిర్చి ఒకేలా ఉన్నా ఎందుకు ధరల్లో వత్యాసం ఉందని ప్రశ్నించినట్లు తెలిసింది. దీనికి వ్యాపారులు ఘాటు తక్కువ ఉందని, కలర్ తక్కువ ఉందని వివిధ కారణాలు చెప్పినా.. అధికారులు సంతృప్తి చెందలేదని తెలిసింది. వరంగల్ మార్కెట్కు వచ్చే మిర్చికి నాణ్యతా ప్రమాణాల ప్రకారం.. మెరుగైన ధరలు చెల్లించేలా చాంబర్ ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని జేడీఎం సూచించారు. సోమవారం నుంచి ఈసమస్యను పరిష్కరించేందుకు సహకారం అందిస్తామని వ్యాపారులు హామీ ఇచ్చినట్లు సమాచారం. సమావేశంలో మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి జి.రెడ్డి, చాంబర్ ప్రతినిధులు బొమ్మినేని రవీందర్రెడ్డి, వేద ప్రకాశ్, రాజు కరాణి తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణ ప్రేమికుడు ‘అంజి’
‘మొక్కలు నాటి సంరక్షించుకుందాం.. కాలుష్య రహిత సమాజాన్ని నిర్మిద్దాం’ అనే నినాదంతో మహబూబాబాద్ జిల్లా ఈదులపూసపల్లి శివారు దర్గాతండాకు చెందిన ఆటో డ్రైవర్ భూక్యా అంజి పర్యావరణ పరిరక్షణకు నడుంబిగించాడు. అంజి ఓ వైపు ఆటో నడుపుతూ.. మరో వైపు వ్యవసాయం ఆధారంగా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోడ్డుపక్కన ఎండుతున్న మొక్కలు, ఎడారిగా మారుతున్న ఆటవీ ప్రాంతాలను చూసి చలించిపోయిన అతను పచ్చదనంపై ప్రజల్లో అవగాహన పెంచాలనే ఆలోచనతో తన ఆటోకు వివిధ రకాల మొక్కలను ఏర్పాటు చేసుకుని బయలుదేరాడు. శుక్రవారం జిల్లా కేంద్రం ఆర్టీసీ చౌరస్తా సిగ్నల్ వద్ద ఆగిన సమయంలో అంజిని ‘సాక్షి’ పలకరించగా.. ‘ప్రకృతిని నాశనం చేస్తున్నారు.. ఏళ్ల నాటి మహావృక్షాలు నేలకొరిగి పోతున్నాయి.. మొక్కలు నాటడం తప్ప సంరక్షించడంలేదు’.. ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నాడు. – జనగామ -
ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావొద్దు
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ రూరల్: రైతుల నుంచి సేకరించే ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావొద్దని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం అదనపు కలెక్టర్ రోహిత్సింగ్తో కలిసి ఆర్డీఓలు, డీఆర్డీఓ, సివిల్ సప్లయ్ అధికారులు, తహసీల్దార్లు, వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు తేమ శాతం రాగానే ధాన్యం కొనుగోలు చేసి మిల్లుకు తరలించాలని, తేమ 17 శాతం వచ్చి ధాన్యం కొనుగోలు చేయని, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఓపీఎంఎస్లో నమోదు చేయకపోయినా చర్యలు తప్పవన్నారు. అలాగే కొనుగోలు ప్రక్రియకు సంబంధించి రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలని చెప్పారు. ఎండల తీవ్రత దృష్ట్యా కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా, అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. బైక్ నడుపుతుండగానే మంటలుజనగామ: జనగామ జిల్లా కేంద్రం రైల్వేస్టేషన్రోడ్డున పోలీస్టేషన్కు కూతవేటు దూరంలో నడుపుతున్న బైక్ నుంచి మంటలు చెలరేగిన ఘటన శుక్రవారం జరిగింది. సూర్యపేటరోడ్డుకు చెందిన ఓ వ్యక్తి బైక్పై రైల్వేస్టేషన్కు వెళ్లే సమయంలో రన్నింగ్లోనే పెట్రోలు ట్యాంకు నుంచి మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో సదరు వ్యక్తి బైక్ను వదిలి పక్కకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. స్థానికులు వెంటనే బకెట్లలో నీటిని తీసుకువచ్చి మంటలు ఆర్పేయగా, అప్పటికే సగం కాలిపోయింది. ఈ ఘటన ఎండల తీవ్రతకు అద్దం పడుతోంది. భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి జనగామ రూరల్: జాతీయ రహదారి – 365బి నిర్మాణంలో ప్లాటు కోల్పోతున్న నిర్వాసితులకు సర్వే రిపోర్టు ప్రకటించి గజానికి రూ.15 వేలు పరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భూసేకరణ చట్టం మేరకు సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, నిర్వాసితులు వేమునూరు రాజేంద్రప్రసాద్, గూడెల్లి కృష్ణారెడ్డి, బిర్రు స్వప్న, గంగుల భూపాల్ రెడ్డి, ఉప్పరి విజయ్, గంగుల అనంతరెడ్డి, గంగుల తిరుపతిరెడ్డి, బి.విశ్వనాథం, నల్ల యాదగిరి, ఎండీ.సలీం, శ్రీనివాస్, రాజశేఖర్, ఎం.చంద్రారెడ్డి, పి.శ్రీలత, బి.చంద్రయ్య, నరసింహారెడ్డి పాల్గొన్నారు. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్
జనగామ రూరల్: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన బి.ప్రతిమను శుక్రవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా మార్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు.ప్రభుత్వం నుంచి వేతనాలు చెల్లించాలిలింగాలఘణపురం: తమ పేర్లు ఆన్లైన్లో నమోదు చేసి వేతనాలు ప్రభుత్వం నుంచి చెల్లించాలని నాన్ మల్టీపర్పస్ గ్రామ పంచాయ తీ సిబ్బంది హైదరాబాద్ ప్రజాభవన్లో శుక్ర వారం వినతి పత్రం అందజేశారు. మండల పరిధి 21 జీపీల్లో 102 మంది పంచాయతీ సిబ్బంది పని చేస్తుండగా అందులో 79 మంది ని మాత్రమే మల్టీపర్పస్ వర్కర్లుగా గుర్తించి ఆన్లైన్లో పేర్లు నమోదు చేసి ప్రభుత్వం నుంచి వేతనం ఇస్తున్నారు. మిగిలిన 33 మంది ఇబ్బంది పడుతున్నారు. గతంలో జీపీ తీర్మానం మేరకు విధుల్లోకి తీసుకున్న తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేయాలని సిబ్బంది డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఇట్టబోయిన మహేందర్, చింతల కనకరాజు, వెంకటేశ్, యాదగిరి, మల్లేశ్, నర్సయ్య తదితరులు ఉన్నారు.ఆర్టీసీ క్యూఆర్ కోడ్ కీ చెయిన్ల పంపిణీజనగామ: ఆర్టీసీ సేవలకు సంబంధించి కొత్తగా వినియోగంలోకి తెచ్చిన క్యూఆర్ కోడ్తో కూడి న కీచేయిన్లను జనగామ డిపో మేనేజర్ స్వాతి, ఆఫీస్ సూపరింటెండెంట్ యాదమణిరావు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అవినాశ్ ఆధ్వర్యాన శుక్రవారం జిల్లా అధికారులకు అందజేశారు. స్కానర్ ఓపెన్ చేసి ఆర్టీసీ యాప్ల ద్వారా అందే సేవల గురించి వివరించారు. డీసీపీ రాజమహేంద్రనాయక్, డీఆర్డీఓ వసంత, సీఐ దామోదర్రెడ్డి, సబ్ రిజిస్ట్రార్ కరుణ పాల్గొన్నారు.పాకిస్తానీలపై ఎస్బీ ఆరాజనగామ: పహల్గాం టెర్రరిస్టుల దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్పై నిషేధాజ్ఞలు కొనసాగుతున్న తరుణంలో.. ఆ దేశానికి చెంది న వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా అనే కోణంలో జిల్లా స్పెషల్ బ్రాంచ్ వర్గాలు శుక్రవారం ఆరా తీశాయి. పట్టణంతో పాటు ఆయా మండలాల పరిధిలో పోలీసులు, నిఘావర్గాలు రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. గతంలో పట్టణంలో ఇద్దరు పాకిస్తాన్కు చెందిన వారు ఉండగా.. గతంలోనే వెళ్లిపోయినట్లు తెలిసింది.మే 17న కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఎన్నికలుజనగామ రూరల్: జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మే 17న నిర్వహిస్తున్న ట్లు అసోసియేషన్ అధ్యక్షుడు మెరుగు బాలరా జు ఒక ప్రకటనలో తెలిపారు. అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి పదవులకు జరిగే ఈ ఎన్నికల కు రిటర్నింగ్ అధికారులుగా కాముని శ్రీనివాస్ బాబు, లగిశెట్టి కృష్ణమూర్తి వ్యవహరిస్తారని పేర్కొన్నారు. సూర్యాపేట రోడ్డులోని కెమిస్ట్ భవనంలో జరిగే ఈ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేఎన్ ఫార్మసీలో మే 15న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు స్వీకరిస్తారని తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ 16న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు, ఎన్నికలు 17న ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఉంటాయని వివరించారు.మందుల కొరత ఉండొద్దు..జనగామ: ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలని వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్, రాష్ట్ర పారా మెడికల్ బోర్డు సెక్రెటరీ, టాస్క్ఫోర్స్ అధికారి బి.ప్రేమ్కుమార్ అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో శుక్రవారం ప్రేమ్కుమార్ నేతృత్వంలోని టాస్క్ఫోర్స్ బృదం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ముందుగా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, లింగాలఘణపురం, రఘునాథపల్లి పీహెచ్సీ, జనగామ అర్బన్ హెల్త్ సెంటర్లను తనిఖీ చేశారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్కు సరఫరా చేస్తున్న మందులు, నిల్వలను పరిశీలించారు. ప్రేమ్కుమార్ మాట్లాడుతూ ఆస్పత్రుల్లో ఈ–ఔషధి తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పారు. విధినిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం జిల్లా ఆస్పత్రిలో సమీక్ష నిర్వహించారు. ఆయన వెంట టాస్క్ ఫోర్స్ బృందం సభ్యులు డాక్టర్ సయ్యద్ అహ్మ ద్, డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు, మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్రా వు, ఉమ్మడి జిల్లా సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ఇన్చార్జ్ భాస్కరరావు, జనగామ సీఎంఎస్ ఫార్మసీ అధికారి మల్లేశ్వరి, రాజేందర్, డాక్టర్లు శ్రీతేజ, అశోక్, కమలహాసన్ తదితరులు ఉన్నారు. -
డీసీసీలకు కొత్త సారథులు
‘స్థానికం’ కంటే ముందే సంస్థాగతం.. దృష్టి సారించిన అధిష్టానం సాక్షిప్రతినిధి. వరంగల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) సంస్థాగత కమిటీలపై దృష్టి సారించింది. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున.. అంతకుముందే సంస్థాగత కమిటీలు పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ మేరకు వచ్చే నెల 20వ తేదీలోగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులను నియమించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను కలుపుకుని డీసీసీ కమిటీలు వేసేందుకు జిల్లాకు ఇద్దరు చొప్పున టీపీసీసీ పరిశీలకులను నియమించింది. ఇందులో ప్రస్తుత డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు కూడా ఉండగా.. ఒక జిల్లాకు చెందిన వారిని మరో జిల్లాకు నియమించారు. కాగా, మే 20 నాటికి డీసీసీ అధ్యక్షుల నియామకం పూర్తి కావాలన్న రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ సూచన మేరకు పరిశీలకులు పని మొదలు పెట్టారు. నేటి(శుక్రవారం)నుంచి జిల్లాల్లో డీసీసీ సమావేశాలకు శ్రీకారం చుట్టనుండగా.. ఇదే సమయంలో అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారు మళ్లీ ప్రయత్నాల్లో పడ్డారు. మే 20 టార్గెట్గా సమావేశాలు.. జిల్లా కమిటీ అధ్యక్షులుగా సీనియర్లను ఎంపిక చేసేందుకు టీపీసీసీ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆరు జిల్లాలకు ఇద్దరు నాయకుల చొప్పున పరిశీలకులను బుధవారం నియమించింది. ఈ క్రమంలో ఇతర జిల్లాలకు చెందిన 12 మందిని ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాలకు.. ఈ ఆరు జిల్లాలకు చెందిన పలువురు సీనియర్లను ఇతర జిల్లాలకు పరిశీలకులుగా నియమించారు. జనగామ జిల్లాకు అద్దంకి దయాకర్, లింగంయాదవ్, మహబూబాబాద్కు పొట్ల నాగేశ్వర్రావు, కూచన రవళిరెడ్డి, హనుమకొండకు కె.వినయ్కుమార్ రెడ్డి, ఎండీ.అహ్మద్, వరంగల్కు అమీర్ అలీఖాన్, ఎం.రవిచంద్ర, జయశంకర్ భూపాలపల్లికి ఇనుగాల వెంకట్రామిరెడ్డి, లింగాజీ, ములుగుకు కొండేటి మల్లయ్య, కై లాష్లు పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. శుక్రవారంనుంచి ఈ నెల 30 వరకు జిల్లాస్థాయి, మే 4–10 వరకు శాసనసభ స్థాయి, మే 13 నుంచి మండల స్థాయి సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. వచ్చే నెల 20 నాటికి డీసీసీ అధ్యక్షుల ఎంపిక జరిగేలా పరిశీలకులు చూడాల్సి ఉంది. డీసీసీ పీఠం కోసం పోటాపోటీ.. ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న డీసీసీలకు ముహూర్తం ఖరారు కావడంతో ఆశావహులు మళ్లీ పావులు కదుపుతున్నారు. ఇప్పుడున్న వారిలో ఎందరినీ మళ్లీ కొనసాగిస్తారు? ఎక్కడెక్కడ కొత్తవారికి అవకాశం కల్పిస్తారు? అన్న చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఆరు జిల్లాలనుంచి కొత్తగా ఆశిస్తున్న 24 మంది పేర్లు అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ● హనుమకొండ డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఉండగా.. ఆయన కాదంటే సీనియర్ల స్థానంలో బత్తిని శ్రీనివాస్ (బట్టి శ్రీనివాస్), ఈవీ శ్రీనివాస్ రావు, పింగిళి వెంకట్రాం నర్సింహారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాష్రెడ్డి ఎవరిని ప్రతిపాదిస్తారన్న చర్చ జరుగుతోంది. ● వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణనే కొనసాగిస్తారా? కొత్త వారికి అవకాశం ఇస్తారా? అన్న చర్చ జరుగుతుండగా.. ఇక్కడినుంచి ప్రధానంగా నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి. గోపాల నవీన్ రాజ్, నమిండ్ల శ్రీనివాస్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, కూచన రవళి రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. ● జయశంకర్ భూపాలపల్లి డీసీసీ అధ్యక్షుడు అయిత ప్రకాష్రెడ్డి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా కూడా వ్యవహరిస్తుండడంతో ఇక్కడ కొత్త వారికి ఇచ్చే అవకాశం ఉంది. మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధు తదితరుల పేర్లు వినిపిస్తుండగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రతిపాదించిన వారికి పీఠం దక్కనుంది. ● మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి జనగామ డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా, ఇక్కడ కొత్తవారిని నియమించే అవకాశం ఉందన్న ప్రచారం ఉంది. ఇక్కడినుంచి అధిష్టానం దృష్టికి ఐదుగురి పేర్లు వెళ్లినట్లు చెబుతున్నారు. హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగాపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, లకావత్ ధన్వంతి, మాన్సానిపల్లి లింగాజీల పేర్లు ప్రచారంలో ఉండగా.. ఇక్కడి ఎంపికలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డిలు కీలకం కానున్నారు. ● ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోకే ఖాయమన్న ప్రచారం ఉంది. ఒకవేళ ఆయనను తప్పిస్తే మంత్రి ధనసరి అనసూయ సీతక్క కుమారుడు సూర్య పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయనతోపాటు మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బాదం ప్రవీణ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ● మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షుడి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తు తం ఉన్న జె.భరత్చంద్రా రెడ్డినే కొనసాగిస్తారన్న చర్చ ఉండగా.. ఇక్కడినుంచి వెన్నం శ్రీకాంత్రెడ్డి, నునావత్ రాథ కూడా ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే డోర్నకల్, మహబూబా బాద్, ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్, మురళీనాయక్లతోపాటు సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి నిర్ణయం కీలకంగా కానుంది. ?? వచ్చే నెల 20 నాటికి జిల్లా కమిటీలు.. పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ ఆదేశం ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాలకు కొత్త అధ్యక్షులు నేటినుంచి జిల్లాల్లో డీసీసీ సమావేశాలు... ఆరు జిల్లాలనుంచి టీపీసీసీ దృష్టికి కొత్తగా 20 మంది పేర్లు అధ్యక్ష పదవి కోసం పావులు కదుపుతున్న ఆశావహులు -
సర్కారు స్కూళ్లలోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్
జనగామ రూరల్: సర్కారు స్కూళ్లలోనే విద్యార్థుల కు బంగారు భవిష్యత్ ఉంటుందని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలి తాల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన కొడకండ్ల టీజీఆర్ఎస్–జేసీ విద్యార్థినులను గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పింకేష్కుమార్తో కలిసి అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో కాసేపు ముచ్చటించారు. భవిష్యత్లో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ ఫలితాలు ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకం కలిగిస్తాయని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షల్లో విద్యార్థినులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఐఈఓ జితేందర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ తమ్మి దిలీప్కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
కలిసికట్టుగా ముందుకు సాగుదాం
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి బచ్చన్నపేట : నియోజకవర్గ అభవృద్ధికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతూ ముందస్తు ప్రణాళిక వేసుకుందామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతోందని, ప్రజలు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో గురువారం మండల కేంద్రంలోని శ్రీనిధి గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రజతోత్సవ సభకు ప్రజలను సమాయత్తం చేయాలని, గ్రామానికో వాహనాన్ని పంపించడంతో పాటు ఇన్చార్జ్లను నియమించాలని చెప్పారు. కార్యక్రమంలో పీఏసీ ఎస్ చైర్మన్ పులిగిళ్ల పూర్ణచందర్, నాయకులు ఇర్రి రమణారెడ్డి, బొడిగం చెంద్రారెడ్డి, గంగం సతీష్రె డ్డి, బావండ్ల కృష్ణంరాజు, మద్దికుంట రాధ, కొండి వెంకట్రెడ్డి, చల్ల శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
పేదల కడుపు నింపడమే ధ్యేయం
జఫర్గఢ్: పేదల కడుపు నింపడమే ధ్యేయంగా ప్రభుత్వం సన్న బియ్యం పథకం అమలు చేస్తోంద ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రేగడితండాలోని బానోత్ కిషన్నాయక్ ఇంట్లో కలెక్టర్ రిజ్వాన్ బాషాతో కలసి ఎమ్మెల్యే సన్న బియ్యంతో వండిన భోజనాన్ని గురువారం వారి కుటుంబ సభ్యులతో భుజించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ధనికులు తినే సన్న బియ్యాన్ని పేదలకు అందిస్తున్న ఘనత సీఎం రేవంత్రెడ్డికే దక్కిందన్నారు. అనంతరం అల్వార్బండతండాలో ఈనెల 16న సీఎం వర్చువల్గా శంకుస్థాపన చేసిన శిలాఫలాకాన్ని కలెక్టర్తో కలసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ డీఎస్ వెంకన్న, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్రెడ్డి, మండల ప్రత్యేక అధికారి రాధాకిషన్, తహసీల్దార్ శంకరయ్య, ఎంపీడీఓ సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
ట్రేడ్ లైసెన్స్ పొందాకే వ్యాపారం చేయాలి
అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ జనగామ: ట్రేడ్ లైసెన్స్ పొందిన తర్వాతే వ్యాపారస్తులు బిజినెస్ నిర్వహించాలని అదన పు కలెక్టర్ పింకేష్కుమార్ అన్నారు. గురువారం జనగామ మున్సిపాలిటీ పరిధిలోని పలు దుకాణాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. కొత్తగా ఏర్పాటు చేసిన మహేంద్ర షోరూంకు సంబంధించి ట్రేడ్ లైసెన్స్ తదితర నిబంధనల వివరాలు సేకరించారు. ఓ షోరూం కొలతలను లెక్కించి ఫీజుకు సంబంధించి ఫైనల్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే కాలపరిమితి ముగిసిన వాణిజ్య లైసెన్స్లను వెంటనే పునరుద్ధరించు కోవాలని సూచించారు. మున్సిపల్ పరిధిలో నివాసానికి అనుకూలంగా లేని, శిథిలావస్థకు చేరిన ఇళ్లను గుర్తించా లని పేర్కొన్నారు. తనిఖీల్లో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి న్యాయవాదుల నిరసనజనగామ రూరల్: పహల్గాం ఘటనకు నిరసనగా జనగామ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దండెబోయిన హరిప్రసాద్యాదవ్ ఆధ్వర్యాన గురువారం న్యాయవాదులు నిధులను బహిష్కరించారు. నల్లబ్యాడ్జీలు ధరించి బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా చౌరస్తాలో హరిప్రసాద్ మాట్లాడుతూ ఆర్టికల్ 370 రద్దు తరువాత కాశ్మీర్లో శాంతి వాతావరణం ఏర్పడి అభివృద్ధి చెందుతుంటే టెర్రరిస్టులు కేవలం హిందువుల ను టార్గెట్ చేసి అతి కిరాతకంగా కాల్చిచంపడం దారుణమన్నారు. ఉగ్రవాదుల చర్యలను కేంద్రం తుదముట్టించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ప్రసాద్రావు, సుదీరంజన్, రాంగోపాల్, శ్రీరాం శ్రీనివాస్, ఇంగి అశోక్, రామకృష్ణ, సునీతరాణి, ఉపేంద ర్, చందు, గాజుల రవీందర్ పాల్గొన్నారు. టెక్స్టైల్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సులు.. జనగామ రూరల్: హైదరాబాద్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీలో డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ మూడేళ్ల కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు చేనేత, జౌళి శాఖ జిల్లా అధికారి పి.చౌడేశ్వరీ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంగ్లిష్ సబ్జెక్టుగా పదో తరగతి తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై, వయసు 15–23 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలు 15–25 ఏళ్ల మధ్య ఉండాలని పేర్కొన్నారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో 10+2 పరీక్షలో ఉత్తీర్ణులైన వారు లేదా ఒకేషనల్ విభాగంలో 10+2 పరీక్ష పూర్తి చేసినవారు రెండో సంవత్సరంలో ప్రవేశానికి అర్హులని తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులను ప్రిన్సిపాల్ కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ, ఫస్ట్ ఫ్లోర్, రైట్ వింగ్, పీఎస్ఆర్ తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి, హైదరాబాద్– 500004 చిరునామాకు పోస్టు ద్వారా మే 15వ తేదీ లోగా చేరేలా పంపించాలన్నారు. మరిన్ని వివరాలకు హిమజాకుమార్ను 9030079242 నంబర్లో సంప్రదించాలని సూచించారు. సాహితీ యాత్రకు ఘనస్వాగతం జనగామ రూరల్: తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమనాథుడి క్షేత్రాన్ని, పోతన జన్మస్థలమైన బొమ్మెర గ్రామాన్ని సందర్శించేందుకు పాలమూరు నుంచి పాలకుర్తి వెళ్తున్న 24 మంది సాహితీమూర్తులు, పండితులు, కవులు, రచయితలకు కలెక్టరేట్ వద్ద ఐక్యవేదిక ఆధ్వర్యాన కవులు కళాకారులుగురువారం ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సాహితీ యాత్రలో పాల్గొన్న పలువురు కవులు మాట్లాడుతూ గొప్ప కవులు జన్మించిన నేల.. చైతన్య పురిటిగడ్డ జనగామ అని పేర్కొన్నారు. ఈ యాత్రలో సాహితీవేత్త, కవి డాక్టర్ శంకరమంచి శ్యాంప్రసాద్, తెలుగు భాషా ఉపాధ్యాయుడు పల్లెర్ల రామ్మోహనరావు, కవులు సిద్ధాంతి రాజశేఖరశర్మ, బలరాంగౌడ్, గిరిజారమణ, అనితకుమారి, నీరజ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. -
తగ్గిన ఆర్టీసీ బస్సుల అద్దె
జనగామ: ఆర్టీసీ బస్సుల అద్దె(కిలోమీటర్ చార్జీలు) తగ్గిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీంతో వివాహాది శుభకార్యాల సమయంలో సామా న్య, పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గనుంది. ప్రైవేట్ నుంచి పోటీని తట్టుకుని మార్కెట్లో నిలదొక్కుకునేందుకు సంస్థ ఈ చర్యలు చేపట్టింది. జనగామ డిపో పరిధిలో 42 రూట్ల లో రోజువారీగా ప్రయాణికులకు సేవలందిస్తూనే వివాహాది శుభకార్యాలు, విహార యాత్రలకు బస్సులను అద్దెకు ఇస్తూ ఆదాయాన్ని గడిస్తోంది. ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోండి శుభకార్యాలు, విహార యాత్రలకు ఆర్టీసీ బస్సుల అద్దె సేవలను సద్వినియోగం చేసుకోవాలి. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సులకు గతంలో ఉన్న కిలోమీటరు చార్జీల్లో కొంత తగ్గించాం. విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. సురక్షిత ప్రయాణం, క్షేమంగా గమ్యానికి చేర్చడం మా లక్ష్యం. – స్వాతి, జనగామ డిపో మేనేజర్ఆర్టీసీ బస్సుల అద్దె చార్జీలు (కిలో మీటరుకు) బస్సు కేటగిరీలు సీట్లు గతంలో ప్రస్తుతం పల్లె వెలుగు 55 రూ.68 రూ.57 పల్లె వెలుగు 59 రూ.69 రూ.61 ఎక్స్ప్రెస్ 50 రూ.69 రూ.62 ఎక్స్ప్రెస్ 55 రూ.69 రూ.68 డీలక్స్ 40 రూ.65 రూ.57 -
హజ్ యాత్రికులు ఆరోగ్య సూత్రాలు పాటించాలి
జనగామ: హజ్ యాత్రికులు ఆరోగ్య సూత్రాలు పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్రావు అన్నారు. అర్బన్ పీహెచ్సీలో వైద్యారోగ్య శాఖ, హజ్ సొసైటీ ఆధ్వర్యాన గురువారం సొసైటీ జిల్లా ఉపాధ్యక్షుడు జహీరుద్దీన్ అధ్యక్షతన హజ్ యాత్రికులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీకా శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మక్కా వాతావరణం అత్యంత వేడిగా ఉండడంతో యాత్రికులు శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకుంటూ.. జాగ్రత్తలు పాటించాలని సూచించారు. శ్వాస కోశ వ్యాధులు రాకుండా మాస్కులు ధరించి అంటు వ్యాధుల బారిన పడకుండా చేతులను శుభ్రం చేసుకోవాలని పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు సమయానికి మందులు వేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి హజ్యాత్రకు వెళ్లే ముగ్గురు యాత్రికులకు టీకాలు వేసి ఐడీ కార్డులు అందజేశారు. కార్యక్రమంలో జనగామ హజ్ కమిటీ అధ్యక్షుడు ముజ్తహిదొద్దీన్, కార్యదర్శి జహీరుద్దీన్, డాక్టర్ శ్రీతేజ, డాక్టర్ ఇంజమామ్అలీ, రిటైర్డ్ సీహెచ్ఓ రెహమాన్, సీహెచ్ఓ జయపాల్రెడ్డి, ఎంపీహెచ్ఈఓ ప్రభాకర్, మేరాజ్ ఉర్రెహ్మాన్, మసిఉ ర్ రెహాన్జాకీర్, హఫీజ్, జలీల్, ఖలీముద్దీన్, నూరుద్దీన్, రషీదా పాల్గొన్నారు. జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్రావు -
తీవ్రవాదాన్ని తుదముట్టించాలి
జనగామ: ‘పహల్గాం’ ఘటనలు పునరావృతం కావొద్దు.. అమాయకులను పొట్టనపెట్టుకున్న టెర్రరిస్టులను వదిలిపెట్టొద్దు.. తీవ్రవాదాన్ని తుదముట్టించాలని డిమాండ్ చేస్తూ టీఎస్యూ టీఎఫ్, ముస్లింలు, ఐఎంఏ(వైద్యులు) ఆధ్వర్యాన గురువా రం రాత్రి జిల్లా కేంద్రంలో కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. నెహ్రూపార్కు నుంచి ఆర్టీసీ చౌరస్తా అంబేడ్కర్ విగ్రహం వరకు సాగిన ర్యాలీలో తీవ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కశ్మీర్ దుర్ఘట నను ముస్లింలు ముక్తకంఠంతో ఖండించారు. పర్యాటకులే లక్ష్యంగా అమాయకుల ప్రాణాలు తీయడం హేయమైన చర్య అని అన్నారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్రావు, ప్రధాన కార్యదర్శి మడూరి వెంకటేష్, కృష్ణ, కనకయ్య, ఆగయ్య, ముస్లిం ప్రతినిధులు అడ్వకేట్ జమాల్ షరీఫ్, మహమ్మద్ అబ్దుల్ఖాదర్, మసిఉర్ రెహమాన్, ఎండీ.జావీద్, ఎండీ.బాసిత్, ఎండీ రషీన్, ఎండీ.షకీల్, రషీద్, అంకుశావలి, తహసీన్ సికిందర్, గులాం, సలీం, బాబా, ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్లు బాలాజీ, రాజమౌళి, శ్రీకాంత్, కల్నల్ భిక్షపతి, శ్రీనివాస్, రజిని, స్వప్న తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్, ముస్లింలు, ఐఎంఏ ఆధ్వర్యాన కొవ్వొతుల ర్యాలీ -
టార్గెట్ 2.50 లక్షలపైనే..
సాక్షిప్రతినిధి, వరంగల్ : ‘బీఆర్ఎస్ 14 ఏళ్ల రాష్ట్ర సాధన పోరాటం, సాధించిన రాష్ట్రంలో పదేళ్ల అద్భుత పాలన.. పార్టీని తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలం చేశాయి. అలాంటి పార్టీ 25 సంవత్సరాల వేడుకలు నిర్వహించుకుంటున్నాం. సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించే అవకాశం మళ్లీ మళ్లీ రాదు.. రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్ను చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు కనీవిని ఎరుగని రీతిలో ప్రజలు హాజరయ్యేలా ప్రతి ఒక్కరూ కృషిచేయాలి’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. బుధవారం ఎల్కతుర్తిలో రజతోత్సవ సభావేదిక ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన హనుమకొండ రాంనగర్లోని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇంట్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జ్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పాతికేళ్ల పండుగ సభకు ఉమ్మడి వరంగల్నుంచి 2.50 లక్షల మందికిపైగా హాజరయ్యేలా చూడాలని కోరారు. ప్రతీ నియోజకవర్గంనుంచి 25 వేల మందికి తగ్గకుండా.. ఉమ్మడి వరంగల్లోని ప్రతీ గడపనుంచి జనాలను కదిలించాలని సూచించారు. పార్టీ అధినేత కేసీఆర్ ఈ నెల 27న నిర్వహించే సభకు సాయంత్రం 4.30 గంటలలోపే చేరుకుంటారని, ఆలోగా ప్రజలు సభావేదిక వద్దకు చేరేలా ప్లాన్ చేయాలన్నారు. ఒక్కొక్కరిగా జనసమీకరణపై ఆరా.. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్చార్జ్లు పాల్గొన్న ఈ సమీక్షసమావేశంలో జనసమీకరణపై ఇప్పటివరకు అమలు చేసిన కార్యాచరణపై నియోజకవర్గాల వారీగా కేటీఆర్ ఆరా తీసినట్లు తెలిసింది. ఈ మేరకు 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జ్లుగా వ్యవహరిస్తున్న నేతలను అడిగి తెలుసుకున్న ఆయన పలు సూచనలు చేసినట్లు సమాచారం. వాహనాల కొరత లేకుండా.. ట్రాఫిక్ సమస్య రాకుండా చూడడంతోపాటు జనం ఇబ్బందిపడకుండా చూడాలని, ఒక్కో వాహనానికి ఇన్చార్జ్ను నియమించాలని సూచించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పార్టీ నాయకులు అందరూ కూడా సమన్వయంతో పనిచేసి సభభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జనసమీకరణ, జనం తరలింపుపై ఫోన్ల ద్వారా సమీక్షించడం జరుగుతుందని, ఆందరూ తమ లక్ష్యాలను మించాలని ఈ సందర్భంగా కోరారు. జనసమీకరణపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం ఓరుగల్లు ప్రతీ ఇంటి నుంచి జనం కదలాలే సిల్వర్ జూబ్లీ వేడుకలు మళ్లీ మళ్లీ రావు... రజతోత్సవ సభ దద్దరిల్లాలని పిలుపు సుమారు నాలుగు గంటల పాటు సమీక్ష... కీలక అంశాలపై చర్చ సభా వేదిక, పార్కింగ్ స్థలాల ఏర్పాట్లపై అభినందనలుసభా ఏర్పాట్లపై అభినందనలు.. ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు తక్కువ సమయంలో ఏర్పాట్లు జరిగాయన్న కేటీఆర్.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. సభ కోసం 1,250 ఎకరాలను ఇచ్చిన రైతులకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ.. భూసేకరణ కోసం రైతులను ఒప్పించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్కుమార్, దాస్యం వినయభాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇతర నాయకులను అభినందించారు. సమీక్షా సమావేశంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు డాక్టర్ బండా ప్రకాష్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, శంకర్నాయక్, నన్నపనేని నరేందర్, నాయకులు నాగూర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాన న్యాయమూర్తిగా ప్రతిమ బాధ్యతల స్వీకరణ
జనగామ రూరల్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి గా డి.ప్రతిమ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జనగామలో పనిచేసిన డి.రవీంద్రశర్మ హైకోర్టుకు బదిలీ కాగా కరీంనగర్ కోర్టులో విధులు నిర్వర్తిస్తున్న ప్రతిమ ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జిలు సి.విక్రమ్, సుచరిత, జూనియర్ సివిల్ జడ్జిలు జి.శశి, కె.సందీప జిల్లా కోర్టులో ఆమెకు మొక్క అందజేసి స్వాగతం పలికారు. జనగా మ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.హరిప్రసాద్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇమ్యునైజేషన్ లక్ష్యం చేరుకోవాలిజనగామ: జిల్లాలో ఇమ్యునైజేషన్ నూరుశాతం లక్ష్యం చేరుకోవాలి.. ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జున్రావు అన్నారు. ఆరోగ్య కార్యాక్రమాలపై బుధవారం జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో డిప్యూటీ డీఎంహెచ్ఓలు, వైద్య అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇమ్యునైజేషన్ సెషన్లు, ఆరోగ్య సూచిక డేటాలను ఎప్పటికప్పుడు యూ–విన్, ఎంసీహెచ్ కిట్ పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు. శశక్త్ పోర్టల్లో ఏబీహెచ్ఏ ఐడీ లింకేజీ వందశాతం నమోదు చేయాలని సూచించారు. పీహెచ్సీల్లో కల్పించే సదుపాయాలను మహిళలకు వివరించి డెలివరీలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పా రు. ఏఎన్సీ రిజిస్ట్రేషన్ల శాతంలో 3, 4వ చెకప్ ల ఫాలోఅప్లు పెంచడానికి వైద్య సిబ్బంది పర్యవేక్షించాలన్నారు. ముఖ్యంగా గర్భస్రావ మరణాలు తగ్గించడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అనంతరం కుక్క, పాము కాటుకు గురైన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య సహాయం తదితర వివరాలతో రూపొందించిన పోస్టర్ ఆవిష్కరించారు. పనుల్లో వేగం పెంచండిజనగామ: పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. బుధవారం మున్సిపల్ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల ను పరిశీలించారు. రంగప్పచెరువు నుంచి హైదరాబాద్ ప్రధాన రహదారి మీదుగా గార్లకుంటకు వరద నీటిని మళ్లించేందుకు సెయింట్ మేరీస్ స్కూల్కు వెళ్లే దారిలో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అప్పటి వరకు ప్రధాన హైవేపై వన్వే రాక పోకలు జరుగుతాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా దయా నిలయం ఏరియాలో నిర్మాణం చేపట్టిన వెజ్, నాన్ వెజ్ మోడల్ మార్కెట్ పనులను పరిశీలించిన ఆయన పలు సూచనలు చేశారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఈ రాజ్కుమార్, ఏఈ మహిపాల్ పాల్గొన్నారు. టీపీసీసీ జిల్లా అబ్జర్వర్లుగా అద్దంకి, బైకిని..జనగామ: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జిల్లా అబ్జర్వర్ల ను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రతినిధి, తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్.. జిల్లాకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బైకిని లింగంయాదవ్లను అబ్జర్వర్లుగా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పరిధి ఎమ్మెల్యే, ఎంపీ, పార్టీ లోని అన్ని కేడర్లు, అనుబంధ సంఘాలు, ప్రజాప్రతినిధులు, మాజీలు ఇలా ప్రతి ఒక్కరి నీ అబ్జర్వర్లు సమన్వయం చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కృషి చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా జనగామకు చెంది న ఉమ్మడి వరంగల్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ లకావత్ ధన్వంతి యాదాద్రి భువనగిరి జిల్లా అబ్జర్వర్గా నియమితులయ్యారు. ఉద్యోగుల సమస్యలపై సంఘటిత పోరాటంబచ్చన్నపేట : జీపీ ఉద్యోగులు ఎదుర్కొంటు న్న సమస్యలపై సంఘటితంగా పోరాడుతామ ని గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్ అన్నారు. బుధవా రం స్థానిక జీపీ కార్యాలయంలో ఆయన మా ట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి ఉద్యోగ కార్మికులు ఏకం కావాలన్నారు. తేలుకంటి మురళి, కొమురెళ్లి శ్రీనివాస్, కాళ్ల ప్రభాకర్, గొల్లపల్లి బాబుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉగ్ర చర్యపై ఆగ్రహం
● పహెల్గాం మృతులకు ఘన నివాళి ● కొవ్వొత్తులు, కాగడాలతో భారీ ర్యాలీ జనగామ/జనగామ రూరల్: జమ్మూకశ్మీర్ పహెల్గాంలో హిందువులపై జరిగిన ఉగ్ర దాడిపై ఆగ్రహం పెల్లుబికింది. బీజేపీ, వీహెచ్పీ ఆధ్వర్యాన బుధవారం జిల్లా కేంద్రంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేయడంతోపాటు మృతులకు నివాళులర్పి స్తూ నెహ్రూ పార్కునుంచి ఆర్టీసీ చౌరస్తా శివాజీ విగ్రహం వరకు కొవ్వొత్తులు, కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి మోహనకృష్ణ భార్గవ మాట్లాడుతూ.. మారణకాండను యావత్ సమాజం ఖండించాలని పిలుపునిచ్చారు. జిహాదీ తీవ్ర వాదం నశించాలి.. ఉగ్రవాద సంస్థలను మట్టుబెట్టాలని నినాదాలు చేశారు. అనంతరం మోహనకృష్ణ భార్గవ మాట్లాడుతూ హిందువులను హతమార్చడమే ధ్యేయంగా ఉగ్రసంస్థలు పని చేస్తున్నాయని, పహెల్గామ్లో దారుణ మారణకాండకు పాల్పడిన ఉగ్రవాదులను మట్టుబెట్టడమే మృతులకు నిజమైన నివాళి అన్నారు. వేర్వేరుగా నిర్వహించిన ఆయా కార్యక్రమాల్లో మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాటికుమార్, ప్రముఖ వైద్యులు కల్నల్ భిక్షపతి, వీహెచ్పీ ఉపాధ్యక్షులు పాశం శ్రీశైలం, బచ్చు బాలనారాయణ, పట్టణ అధ్యక్షుడు అంబటి బాలరాజు, బైరునాథ్, బొమ్మగాని అనిల్కుమార్, సుంచు శ్రీకాంత్ తదితరులతోపాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్, మాజీ అధ్యక్షుడు దశమంతరెడ్డి, ఉడుగుల రమేశ్, పెరుమాళ్ల వెంకటేష్, శివరాజ్యాదవ్, శశిధర్రెడ్డి, అంజిరెడ్డి, అనిల్ పలువు రు, భజరంగ్దళ్, హిందూవాహిని, అనుబంధ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. -
గ్రాఫ్ పడిపోతోంది
జనగామ: ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యావ్యస్థపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం విద్యార్థులకు శాపంగా మారుతోంది. 2022 నుంచి నేటి వరకు ఉత్తీర్ణత శాతం పడిపోవడమే ఇందుకు నిదర్శనం. తరగతి గదిలో అధ్యాపకులు చెప్పే బోధన అర్థం కావడం లేదా.. లేక విద్యార్థుల్లోనే లోపం ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏటా పదో తరగతి వార్షిక పరీక్షల సమయంలో మూడు నెలల ముందుగానే ప్రత్యేక తరగతులతో సన్నద్ధం చేయడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే ఇంటర్ మీడియట్కు వచ్చే సరికి విద్యార్థులను పట్టించుకోవడంలేదు. ఫలితంగా కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం తగ్గిపోవడంతో అంతా ప్రైవేట్ వైపు వెళ్తున్నారు. తగ్గుతున్న ఉత్తీర్ణత శాతం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల కళాశాలలు 57 ఉన్నాయి. ఇందులో ప్రత్యేకంగా ప్రభుత్వ ఇంట ర్ మీడియట్ కాలేజీల పరిధిలో ఈసారి ఆశించిన ఉత్తీర్ణత శాతం నమోదు కాలేదు. ఏడు జూనియర్ కాలేజీలు, ఎంజేపీ, సోషల్ వెల్ఫేర్, మోడల్, మైనా ర్టీ కాలేజీల పరిధిలో ఫస్టియర్, సెకండియర్, ఒకేషనల్(ప్రైవేట్) విభాగంలో 7,924 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 4,450 మంది ఉత్తీర్ణత(64.35 శాతం) సాధించినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 5 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఫస్టియర్లో 298 మంది విద్యార్థులకు 148 మంది (49.66శాతం), సెకండియర్లో 293 మందికి 202 మంది ఉత్తీర్ణత(68.94శాతం) సాధించారు. ఇక ఎంజేపీ గురుకులాల విషయానికి వస్తే అత్యుత్తమంగా 89.8 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జూనియర్ కళశాలల్లో మాత్రం ఉత్తీర్ణత దారుణంగా పడిపోయింది. ఫస్టియర్లో జఫర్గఢ్ 17.5 శాతం, సెకండియర్ 23.97 శాతం, స్టేషన్ఘన్పూర్ ఫస్టియర్ 11.24, సెకండియర్ 25.79, జనగామ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫస్టియర్ 19.35, సెకండియర్ 20.95 శాతం పాస్ అయ్యారు. ఇదిలా ఉండగా.. 2022లో 77.93, 2023లో 63.70, 202 4లో 62.44, 2025లో 64.35శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో గడిచిన మూడేళ్ల ఫలితాలను పరిశీలిస్తే.. జూని యర్ కళాశాలల ప్రగతి ఒక్కోమెట్టు పడిపోతున్న విషయం అర్థమవుతోంది. 2025–26 విద్యా సంవత్సరంలో మంచి ఫలితాలు సాధించే దిశగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.జిల్లాలో గడిచిన నాలుగేళ్లుగా నమోదైన ఇంటర్ ఫలితాల వివరాలు(శాతంలో..)77.9364.3562.44 63.70 2022 2023 2024 2025 2022 నుంచి తగ్గుతున్న ఇంటర్ ఉత్తీర్ణత శాతం విద్యాబోధనపై కొరవడిన పర్యవేక్షణ -
మెరుగైన చట్టం.. ‘భూ భారతి’
లింగాలఘణపురం/రఘునాథపల్లి: ఇప్పటి వరకు దేశంలో వచ్చిన చట్టాల్లో భూమి సమస్యల పరిష్కారంలో ఎంతో మెరుగైనది ‘భూ భారతి’ చట్టం.. రైతులు అవగాహనతో తమ భూముల సమస్యలు పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం లింగాలఘణపురం తహసీల్ కార్యాలయం వద్ద అలాగే రఘునాథపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన అవగాహ న సదస్సుల్లో కలెక్టర్ రిజ్వాన్ బాషాతో కలిసి ఆయ న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో తోక పాసుబుక్కులు, ఆర్ఓఆర్–1బీ పాసు బుక్కులు, ధరణి పాస్ బుక్కులు ఇలా అనేక చట్టాలు వచ్చినప్పటికీ వాటి కంటే భూ భార తి ఎంతో మెరుగైనదని అన్నారు. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న 10 లక్షల సాదా బైనామాలు, 18 లక్షల పార్ట్ ‘బీ’ సమస్యలు పరిష్కరించుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. ప్రతి గ్రామానికి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లను నియమించి సమస్యలు పరిష్కరిస్తారని పేర్కొన్నారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ భూభారతి చట్టం అమలు మొదలైనప్పటి నుంచి ఏడాదిలోగా రైతులు తమ సమస్యల పరిష్కారానికి దరఖాస్తు చేసుకోవాలని, మే 30 వరకు అన్ని జిల్లాల్లో, జూన్ 2న అన్ని రెవెన్యూ గ్రామాల్లో చట్టం అమలులోకి వస్తుందని వివరించారు. ఈ సందర్భంగా కళ్లెం గ్రామానికి చెందిన సిరిగిరి పోచయ్య తమ అసైన్డ్ భూమి సమస్య పరిష్కరించాలని అధికారులకు మొరపెట్టుకున్నా రు. సమావేశంలో అదనపు కలెక్టర్ రోహిత్సింగ్, ఎస్డీసీ సుహసిని, ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్లు రవీందర్, మోసిన్ముజ్తబా, ఎంపీడీఓలు జలేందర్రెడ్డి, గార్లపాటి శ్రీనివాసులు, మార్కెట్ వైస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. అవగాహనతో సమస్యలు పరిష్కరించుకోండి ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
ఇంటర్మీడియట్లో ‘రెజోనెన్స్’ సత్తా
హన్మకొండ: ఇంటర్మీడియట్ ఫలితాల్లో రెజోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో వరంగల్, హ నుమకొండలోని రెజోనెన్స్ జూనియర్ కళాశాలలు 90 రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని ఆ విద్యా సంస్థల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బీపీసీలో రాష్ట్ర ఫస్ట్ ర్యాంకుతోపాటు మొత్తం 80 రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినట్లు వివరించారు. నలుగురు విద్యార్థులు 470 మార్కులగాను 468 మార్కులతో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకుసాధించారని, 22 మంది విద్యార్థులు 470 మార్కులకు 467 మార్కులతో రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకు సాధించారన్నారు. 21 మంది తృతీయ ర్యాంకు, 25 మంది రాష్ట్ర స్థాయి 4వ ర్యాంకు సాధించారని తెలిపారు. ద్వితీయ సంవత్సరంలోనూ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో జయకేతనం ఎగుర వేశారన్నారు. 21 మంది విద్యార్థులు రాష్ట్ర టాప్ మార్కులు, 995, 994, 993, 992, 991, 990తో పాటు మరిన్ని ఉత్తమ ర్యాంకులు సాధించారని వివరించారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో భూక్యా మనోజ్ కుమార్ 468, వేముల అనిక్షిత 468, గందె వర్ష 468, మంతిని సహస్ర 468 మార్కులు, ద్వితీయ సంవత్సరంలో నీలం నిక్షిత 995, బుర్ర అక్షిత 994, బీపీసీ మొదటి సంవత్సరంలో గండ్ర శ్రీజ 438, దావర్తి శ్రీనిధి 436, దర్ముల శ్రీతిక 436, ద్వితీయ సంవత్సరంలో ఎం.పూజశ్రీ 992, ఆర్.ఇక్షావర్ 992, డి.త్రిలోచన్ 992, ఎం.అస్మిత 992 మార్కులు సా ధించారని వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థా యి ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్, డైరెక్టర్లు, అధ్యాపకులు అభినందించారు. డైరెక్టర్లు లెక్కల మహేందర్ రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, సీఏఓ లెక్కల రమ్య, అకడమిక్ డీన్ గోపాలరావు, డీన్ కె.సాంబశివుడు పాల్గొన్నారు. -
పారదర్శకంగా ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక
జనగామ: ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి విడత లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ సచివాలయం నుంచి సీఎస్ శాంతికుమారి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్, హౌసింగ్ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ గౌతమ్లతో కలిసి ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతిపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. వీసీలో అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్లతో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా పాల్గొన్నారు. గ్రామాలు, మున్సిపల్ వార్డుల పరిధిలో ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హుల జాబితా ఎంపిక చేయాలని, ఇందిరమ్మ కమిటీ ఆమోదించిన ప్రతీ 200 ఇళ్లకు ఒక ప్రత్యేక అధికారిని నియమించి, ఏప్రిల్ 30 లోపు మరోసారి ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేసేలా చూడాలన్నారు. భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులను నిర్వహించాలన్నారు. వీసీలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ఆర్డీవోలు గోపీరాం, వెంకన్న, డీఆర్డీవో పీడీ వసంత, హోసింగ్ పీడీ మాతృనాయక్ తదితరులు పాల్గొన్నారు. బ్యాంకర్లు సహకరించాలి రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశం హాలులో అదనపు కలెక్టర్ పింకేష్కుమార్తో కలిసి రాజీవ్ యువ వికాసం పథకం, వాల్టాచట్టం అమలుపై బ్యాంకర్లు, సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హుల జాబితాను తయారు చేయాలన్నారు. ఈ సమీక్షలో డీఆర్డీవో పీడీ వసంత, డీపీఓ స్వరూప, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీధర్, అధికారులు ఉన్నారు. వీసీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి -
రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
జనగామ: ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 27న తలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ హోం మంత్రి మహమూద్ అలీ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వరంగల్లో జరిగే సభాస్థలికి వెళ్లే క్రమంలో ఆయన జనగామ ఆర్టీసీ చౌరస్తాలో కాసాపు ఆగగా, నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తిరుగు ప్రయాణంలో జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డితో సమావేశమయ్యారు. రజతోత్సవ సభ దేశ చరిత్రలో నిలిచి పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మైనార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ సలీం, సాజిద్ భాయ్, జహంగీర్ హుస్సేన్, పానుగంటి ప్రవీణ్, గులాం జానీ, రిజ్వాన్, తిప్పారపు విజయ్, సయ్యద్ ఫజల్, రాజేష్ రెడ్డి, అన్వర్ పాషా, అక్తర్ పాషా, ఆమీర్ రాజ్, కుమార్, తదితరులు ఉన్నారు. మాజీ హోంమంత్రి మహమూద్ అలీ -
ఇంటర్లో ‘శివాని’ విజయదుందుభి
హసన్పర్తి: ఇంటర్మీడియట్ ఫలితాల్లో భీమారంలోని శివాని కళాశాల విజయదుందుభి మోగించింది. జూనియర్ ఎంపీసీ విభాగంలో కళాశాలకు చెందిన నేరేళ్ల రిషిత 468 మార్కులు, నాగుల నవదీప్ 468 మార్కులు, చక్రిక 468, ఎన్.జశ్వంత్ 467, వరుణ్ తేజా 467, శివకుమార్ 467, తేజాశ్రీ 467, పూజిత 467, సంధ్యా 467 మార్కులు సాధించినట్లు శివాని విద్యాసంస్థల కరస్పాండెంట్ స్వామి తెలిపారు. బీపీసీ విభాగంలో బానోత్ స్వాతి 435 మార్కులు, ఇంద్రజా 434 మార్కులు సాధించారు. సీఈసీ విభాగంలో మేకల కార్తీక్ 484 మార్కులు సాధించాడు. సీనియర్ ఎంపీసీ విభాగంలో చీరాల శైజా 995 మార్కులు, కె. మాధవి 995, బి. మనీషా 993, నక్షత్ర 993, దివ్యశ్రీ 992, రోజా 992, పోరెడ్డి హర్షవర్ధన్రెడ్డి 991, జెమిని 990 మార్కులు సాఽధించినట్లు కరస్పాండెంట్ తెలిపారు. బీపీసీ విభాగంలో హర్షిణి 993 మార్కులు, హన్సిక 992, సుష్మిత 992 మార్కులు సాధించారని కరస్పాండెంట్ స్వామి చెప్పారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ స్వామి, ప్రిన్సిపాళ్లు చంద్రమోహన్, సురేందర్రెడ్డి, డైరెక్టర్లు రాజు, రమేశ్, మురళీధర్, సురేశ్, సంతోశ్రెడ్డి అభినందించారు. -
‘సువిద్య’ విద్యార్థుల విజయకేతనం
హన్మకొండ: ఇంటర్మీడియట్ ఫలితాల్లో హనుమకొండ నక్కలగుట్టలోని సువిద్య జానియర్ కాలేజీ ఫ ర్ గర్ల్స్ విజయకేతనం ఎగురవేసింది. మంగళవారం వె లువడిన ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణులయ్యారని కళాశాల కరస్పాండెంట్ కె.శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు ఎ.జితేందర్ రెడ్డి, ఎన్.వెంకట్ రెడ్డి తెలిపారు. ఎంపీసీ మొద టి సంవత్సరంలో ఎన్.ధృతి రెడ్డి 467 మార్కులు, ఎస్.జీవిక 463, పి.శ్రీజ 459, బీపీసీ మొదటి సంవత్సరంలో పి.షణ్ముక ప్రియ 424, ద్వితీయ సంవత్సరంలో ఎం.సిరిచందన 986, బి.దేవిశ్రీ 985, డి.ప్రీతిక 985 మార్కులు సాధించారన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్ అభినందించారు. -
కాళోజీ కళాశాల ప్రభంజనం
హసన్పర్తి: ఇంటర్మీడియట్ ఫలితాల్లో చింతగట్టులోని కాళోజీ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. సీనియర్, జూనియర్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినట్లు కళాశాల చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి తెలిపారు. సీనియర్ ఇంటర్ బీపీసీ విభాగంలో సురేశ్ 993 మార్కులు, ఎస్. వైష్ణవి 991 మార్కులు, ఎంపీసీ విభాగంలో సీహెచ్. శ్రీకృతి 991 మార్కులు, జి. తేజస్వీని 991, హాసిని 989, స్ఫూర్తి 985,అనురాఘవగౌడ్ 985 మార్కులు, సాధించినట్లు చెప్పారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ఎస్. వంశీ 463 మార్కులు, సింధు 461, కె. అక్షిత 460 , శ్రీనిధి 460 మార్కులు, బీపీసీ విభాగంలో ఆశ్రయ 428 మార్కులు, ఆర్.మానస 421, హారిక 421మార్కులు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, ప్రిన్సిపాల్ వై.కె.ఎస్. డైరెక్టర్లు తిరుపతిరెడ్డి, అనిల్రెడ్డి, మధుకర్రెడ్డి,ఎం.సతీశ్కుమార్ అభినందించారు. -
జనగామ
బుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 202 సివిల్స్లో మెరిశారు..9● ఉమ్మడి వరంగల్ జిల్లానుంచి నలుగురి ఎంపిక ● తెలుగు రాష్ట్రాల మొదటి ర్యాంకర్ వరంగల్వాసే ● సాయి శివానికి 11వ, జయసింహారెడ్డికి 46వ ర్యాంకు ● నీరుకుళ్ల యువకుడు హరిప్రసాద్కు 255వ ర్యాంకు ● ఐఏఎస్ కావాలని లక్ష్యంతోనే ముందుకు.. ● ఐపీఎస్ గోల్ కొట్టానంటున్న 855వ ర్యాంకర్ జితేందర్ నాయక్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లానుంచి నలుగురు అభ్యర్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. తెలుగు రాష్ట్రాల మొదటిర్యాంకర్ వరంగల్ నగరవాసే. వరంగల్ శివనగర్కు చెందిన ఇట్టబోయిన రాజ్ కుమార్, రజిత దంపతుల కుమార్తె సాయి శివాని ఆలిండియా స్థాయిలో 11వ ర్యాంకు, రావుల జయసింహారెడ్డి 46వ ర్యాంకులు సాధించి జిల్లా పేరుప్రతిష్టలను దేశస్థాయిలో నిలిపారు. – సాక్షి నెట్వర్క్– వివరాలు 10లోu -
తాగునీటి కొరత ఉండొద్దు
పాలకుర్తి టౌన్: నియోజకవర్గంలో వేసవిలో తాగునీటి కొరత లేకుండా చూడాలని ఎమ్మెల్యే యశ్వసినిరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఇరి గేషన్, మున్సిపల్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ల నీటి నిల్వల వివరాలు, తొర్రూరు ట్యాంక్ బండ్ పనులు వేగవంతం చేయాలన్నారు. కాల్వల పూడికతీత సమస్య ప్రధానంగా ఉందని, పలు ప్రాంతాల్లో కాల్వల్లో భారీగా పూడిక పేరుకుపోవడంతో నీటి ప్రవాహం సక్రమంగా జరగడం లేదన్నారు. రిజర్వాయర్ల పనులు వేగవంతం చేయాలి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
జూనియర్ ఇంటర్లో ‘ఇన్స్పైర్’కు ప్రథమ ర్యాంకు
హసన్పర్తి: ఇంటర్మీడియట్ ఫలి తాల్లో ఎర్రగట్టుగుట్ట సమీపంలోని ఇన్స్పైర్ అకాడమీ విద్యాసంస్థకు చెందిన తీగల సాయి శ్రే ష్టత జూనియర్ ఇంటర్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సా ధించినట్లు డైరెక్టర్ భరత్కుమార్ తెలిపారు. ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు 468 మార్కులు సాధించిన రాష్ట్రంలో ప్రథమ స్థా నంలో నిలిచిందన్నారు. అలాగే, ఎంపీసీ విభాగంలో మేర్గు అజయ్ 464, వంశీ 464, శ్రీ చరణ్ 463, సాయిప్రియా 462, సిరి చందన 460, సాయి ప్రియ 462, బైపీసీ విభాగంలో మధుప్రియ 432 మార్కులు, కీర్తిరోషి 431, సీఈసీ విభాగంలో నూతన శ్రీ 459మార్కులు, కిరణ్మయి 455 మార్కులు సాఽధించినట్లు చెప్పారు.ఈ సందర్భంగా సాయి శ్రేష్టతను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ సభ్యులు రాజ్కుమార్,మమత, సుంకరి శ్రీరాంరెడ్డి, హరీశ్గౌడ్, శివ తదితరులు పాల్గొన్నారు. -
సివిల్స్లో మెరిశారు..
ఐదోసారి ఐఏఎస్ కొట్టాడు.. ● ఇప్పటికే ఐపీఎస్ శిక్షణలో జయసింహారెడ్డి ● తాజాగా ఆల్ ఇండియా స్థాయిలో 46వ ర్యాంకు హన్మకొండ: హనుమకొండకు చెందిన రావుల జయసింహారెడ్డి ఐదో ప్రయత్నంలో ఐఏఎస్ ర్యాంకు సాధించాడు. గతంలో ఐపీఎస్కు ఎంపికై న జయసింహారెడ్డి ఈసారి ఐఏఎస్కు ఎంపికయ్యారు. ఆల్ ఇండియా స్థాయిలో 46వ ర్యాంకు సాధించారు. జయసింహారెడ్డి తండ్రి రావుల ఉమారెడ్డి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సహ పరిశోధన సంచాలకుడిగా విధులు నిర్వహిస్తుండగా తల్లి లక్ష్మి గృహిణి. జయసింహారెడ్డి గతంలో సివిల్స్ రాయగా ఒకసారి 217, మరోసారి 104 ర్యాంకు సాధించగా ఐపీఎస్ వచ్చింది. ప్రస్తుతం నేషనల్ అకాడమీ హైదరాబాద్లో ఐపీఎస్ శిక్షణ పొందుతున్నారు. జయసింహారెడ్డి పాఠశాల విద్య 7వ తరగతి వరకు జగిత్యాలలో, 8 నుంచి 10 వరకు హనుమకొండ ఎస్ఆర్ ఎడ్యు స్కూల్లో చదివారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. హైదరాబాద్ ఐఐటీలో బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అభ్యసించారు. తర్వాత 2020 నుంచి సివిల్స్కు సన్నద్ధమయ్యారు. మొదటి రెండు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్ వరకు వెళ్లారు. మూడో ప్రయత్నంలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచి 217వ ర్యాంకు సాధించారు. నాలుగో ప్రయత్నంలో మరింత మెరుగైన ప్రతిభ కనబరిచి 104వ ర్యాంకు సాధించారు. ఓ వైపు ఐపీఎస్ శిక్షణ పొందుతూనే ఐదో ప్రయత్నంలో 46వ ర్యాంకు సాధించి తన లక్ష్యం చేరుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు రావుల లక్ష్మి, ఉమారెడ్డి మాట్లాడుతూ తమ కుమారుడు ఐఏఎస్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఇద్దరు కుమారులని, అందులో జయసింహారెడ్డి చిన్నవాడని, పెద్ద కుమారుడు మనీష్ చంద్రారెడ్డి కాలిఫోర్నియాలో ఆపిల్ సంస్థలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యూపీఎస్సీ ఫలితాల్లో మనోళ్ల సత్తా.. నలుగురు ఉమ్మడి వరంగల్ జిల్లా అభ్యర్థులకు అత్యుత్తమ ర్యాంకులు నెలరోజుల్లో డబుల్ ధమాకా ● మొన్న గ్రూప్ వన్, ఇప్పుడు సివిల్స్ ● సత్తాచాటిన వరంగల్ వాసి ● తెలుగు రాష్ట్రాల్లో టాపర్గా నిలిచిన శివాని సాక్షి, వరంగల్: రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి సివిల్స్ ర్యాంక్ల్లో ఇట్టబోయిన సాయి శివాని టాపర్గా నిలవడంతో వరంగల్ పేరు ఒక్కసారిగా మార్మోగింది. నెలవ్యవధిలోనే ఆమె డబుల్ ధమాకా సాధించారు. రెండు ప్రభుత్వ ఉద్యోగాలు, అవి కూడా గ్రూప్–1లో రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంకు, ఇప్పుడూ సివిల్స్లో ఏకంగా జాతీయ స్థాయిలో 11వ ర్యాంక్ సాధించి ఔరా అనిపించారు. వరంగల్ శివనగర్ వాసవీ కాలనీలోని తమ ఇంట్లోనే చదువుకుంటూ, ఆన్లైన్ పాఠాలు వింటూ జాతీయస్థాయి ఘనత సాధించడం విశేషం. బీటెక్ పూర్తయిన మూడేళ్లలోనే రెండో ప్రయత్నంలో సివిల్స్ సాధించి వరంగల్కు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. తండ్రి రాజు మెడికల్ రిప్రజంటేటివ్గా పనిచేస్తుండగా, అమ్మ రజిత గృహిణిగా ఉంటూ తమ కుమార్తె సాయి శివాని కల సాకారం కోసం వెన్నుతట్టి ప్రోత్సహించారు. వారి ప్రోద్బలం, సాయి శివాని పట్టుదలతో చదవడంతోనే ఈ ఘనత సాధ్యమైంది. దేశ అత్యున్నత సర్వీస్ సివిల్స్లో మనోళ్లు మెరిశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసిన తుది ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా అభ్యర్థులు అత్యుత్తమ ర్యాంకులు కై వసం చేసుకున్నారు. వరంగల్ శివనగర్కు చెందిన ఇట్టబోయిన సాయి శివాని 11వ ర్యాంకు, హనుమకొండకు చెందిన రావుల జయసింహారెడ్డి 46, నీరుకుళ్లకు చెందిన పోతరాజు హరిప్రసాద్ 255, భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన గుగులోత్ జితేందర్ నాయక్ 855 ర్యాంకులు సాధించారు. దీంతో కుటుంబీకులు, బంధుమిత్రులు అభినందనలు తెలిపారు. నీరుకుళ్ల యువకుడు.. సివిల్స్ సాధించాడు ● తండ్రి ప్రోత్సాహంతో 255వ ర్యాంకు ఆత్మకూరు: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్లకు చెందిన పోతరాజు హరిప్రసాద్ సివిల్స్ సాధించారు. తండ్రి పోత్సాహంతో యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయస్థాయిలో 255 ర్యాంకు సాధించారు. కాగా, హరిప్రసాద్కు ఐఏఎస్ పోస్టు దక్కనుంది. హరిప్రసాద్ తండ్రి కిషన్ నల్లబెల్లి మండలం నందిగామ జెడ్పీ హైస్కూల్లో తెలుగు స్కూల్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి విజయ గృహిణి. వీరు హనుమకొండలోఉంటున్నారు. హరిప్రసాద్ పాఠశాల విద్య హనుమకొండలోని ఆర్యభట్ట పాఠశాలలో కొనసాగింది. ఇంటర్మీడియట్ హైదరాబాద్లోని నారాయణ కళాశాలలో చదివారు. ఐఐటీ ముంబయిలో బీటెక్(ఎలక్రికల్)2016లో పూర్తి చేశారు. అనంతరం జపాన్లోని ఓ కంపెనీలో 2017 నుంచి 2019 వరకు పనిచేశారు. అనంతరం ఇంటికి వచ్చి సివిల్స్కు సన్నద్ధమయ్యారు. ఇంటివద్దే చదువుకున్నారు. రెండుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. తాజా ఫలితాల్లో 255వ ర్యాంకు సాధించి తన కల సాకారం చేసుకున్నారు. నాన్న ప్రోత్సాహంతో.. మా నాన్న ప్రోత్సాహంతోనే సివిల్స్ వైపు దృష్టి సారించా. ఎలాంటి కోచింగ్ లేకుండా ఇంటి వద్దే ప్రణాళికతో ప్రిపేరయ్యా. 255 ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. నాకు ఐఏఎస్ వచ్చే అవకాశం ఉంది. – పోతరాజు హరిప్రసాద్, సివిల్స్ 255 ర్యాంకర్కొడుకు కలెక్టర్ కావాలనుకున్నా..నా కొడుకును కలెక్టర్ చేయాలనే కల నెరవేరింది. సివిల్స్తోనే సమాజ సేవ సాధ్యం. అందులోనే తృప్తి ఉంటుంది. మా గ్రామీణ ప్రాంతం నుంచి నా కొడుకు సివిల్స్ సాధించడం గర్వంగా ఉంది. – పోతరాజు కిషన్, హరిప్రసాద్ తండ్రి సొంతంగా ప్రిపేర్.. ● సివిల్స్లో 855 ర్యాంకు సాధించిన జితేందర్ నాయక్ భూపాలపల్లి అర్బన్: సివిల్స్లో భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన గుగులోత్ జితేందర్ నాయక్ మెరిశారు. ఐపీఎస్ కావాలనే లక్ష్యంతో ఎలాంటి శిక్షణ లేకుండా ఇంట్లోనే చదువుకుంటూ యూపీఎస్సీ ఫలితాల్లో 855 ర్యాంకు సాధించారు. జితేందర్ తండ్రి హేమానాయక్ భూపాలపల్లి ఏరియా సింగరేణి వర్క్షాపులో ఉద్యోగం చేస్తున్నారు. జితేందర్ 2021లో బీటెక్ పూర్తి చేసి 2022లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఏడాది పాటు ఉద్యోగం చేశారు. అనంతరం 2023 నుంచి ఇంట్లోనే ఉండి సివిల్స్కు సన్నద్ధమయ్యారు. ఎలాంటి శిక్షణ లేకుండా సొంతంగా చదువుకున్నట్లు తెలిపారు. చిన్నప్పటి నుంచి సివిల్ సాధించాలనే లక్ష్యంతో చదువుకున్నట్లు జితేందర్ పేర్కొన్నారు. -
‘భూ భారతి’తో సమస్యల పరిష్కారం
నర్మెట/తరిగొప్పుల: ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యల పరిష్కారం సులభతరం కానుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం నర్మెట, తరిగొప్పుల మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన భూ భారతి అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ధరణీలో పరిష్కారం కాని పలు సమస్యలకు భూ భారతిలో పరిష్కారం చూపబడిందని, దరఖాస్తుల స్వీకరణకు ఏడాదికాలం (2026 ఏప్రిల్ 14వ తేదీ) వరకు సమయం ఉందన్నారు. క్రయవిక్రయాల్లో హిస్టరీ ఆఫ్ డాక్యుమెంట్స్తోపాటు భూమికి సంబంధించిన నక్షా జత పరచడం జరుగుతుందన్నారు. ఎవరైనా మోసపూరిత రికార్డులను మార్చినా అలాంటివి రద్దు చేసే అధికారం ఈ చట్టానికి ఉందన్నారు. గతంలో మాదిరిగా వీఆర్ఓల స్థానంలో గ్రామపాలన అధికారిని నియమించి భూ క్రయవిక్రయాలు నమోదు చేసి రికార్డులు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ రోహిత్ సింగ్, ఎస్డీసీ సుహాసిని, ఆర్డీఓ గోపిరాం, ఎంపీడీఓలు అరవింద్ చౌదరి, దేవేందర్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
చిల్పూరు: పల్లగుట్ట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ఇటీవల శ్రీవాణి పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి షూటింగ్ బాల్ బాలబాలికల సబ్ జూ నియర్ విభాగంలో జరిగిన సెలక్షన్లో అభిజ్ఞ, ప్రీతి, యామిని, సాయిప్రియ, సుశాంత్, కార్తీక్, అక్షయ్, విష్ణులు రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు నారాయణపేట జిల్లా మక్తల్లో జరిగే పోటీల్లో పాల్గొంటారన్నారు. ఎంపికై న విద్యార్థులను పాఠశాల ఆవరణలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ దేవ్సింగ్, చిల్పూరు ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చిర్ర నాగరాజు, ఉపాధ్యాయులు అభినందించారు. -
పుట్టుకనుంచే రెండు కాళ్లు పనిచేయవు
పదకొండేళ్ల కూతురు మిన్నుకు పుట్టుక నుంచే రెండు కాళ్లు పనిచేయవు. 5వ తరగతి చదువుతోంది. సదరం సర్టిఫికెట్ కోసం పదేళ్ల నుంచి స్లాట్ బుకింగ్కు ప్రయత్నిస్తున్నాను. రెండు నెలల క్రితం స్లాట్బుకింగ్ దొరుకగా సదరంలో పర్మనెంట్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పటికీ రెండుసార్లు గ్రీవెన్స్కు వచ్చిన. పింఛన్ మాత్రం రావడం లేదు. కాళ్లు పనిచేయని పరిస్థితి ప్రత్యక్షంగా కనిపిస్తున్నా కనికరించడంలేదు. – కూతురు మిన్నుతో తండ్రి విద్యాసాగర్, వల్మిడి(పాలకుర్తి) -
కార్పొరేట్ తరహాలో సర్కారు విద్య
పాలకుర్తి టౌన్: సర్కారు పాఠశాలల్లో కార్పొరేట్ తరహా నాణ్యమైన విద్య అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.30 లక్షల నిధులతో నిర్మించనున్న ప్రహరీ, మరుగుదొడ్ల పనులకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీరెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. అనంత రం పాఠశాలలో వంట గదిని సందర్శించి భోజనంనాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాతో పాటు పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మెనూ చార్జీలు పెంచింద ని గుర్తు చేశారు. పాలకుర్తి ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరుకు సీఎం సుముఖంగా ఉన్నారని పేర్కొన్నారు. సమావేశంలో పాఠశాల హెచ్ఎం పాయం శోభారాణి, రాపాక సత్యనారాయణ, యాకాంతరావు, కమ్మగాని ఆంజ నేయలుగౌడ్, కమ్మగాని నాగన్న, ఎడవెల్లి సోమమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి -
టీకాతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది
జనగామ రూరల్: టీకాతో పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ప్రత్యేక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో నేటి(మంగళవారం) నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేక టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం ఇప్పటివరకు టీకాలు వేయించని పిల్లలకు, కొన్ని టీకాలు వేయించి మధ్యలో వదిలేసిన పిల్లలకు వేయించాలని కోరారు. మురికి వాడలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాలు, సంచార జాతులు, కోళ్ల ఫారాలు, రైస్, జిన్నింగ్ మిల్లుల పరిసరాల్లో నివాసముండే కుటుంబాల పిల్లల్లో టీకాలు వేయించని వారికి సమీప పీహెచ్సీ, సబ్ సెంటర్లలో ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్లు శ్రీతేజ, మౌనిక ప్రియదర్శిని, జయపాల్ రెడ్డి, సూపర్వైజర్లు ఉపేంద్ర, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్రావు -
భూ భారతి చట్టంతో సమస్యల పరిష్కారం
పాలకుర్తి టౌన్/కొడకండ్ల: భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. 2025 భూ భారతి చట్టం అమలుపై సోమవారం పాలకుర్తి, కొడకండ్ల మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో నిర్వహించిన అవగాహ న సదస్సుల్లో ఆయన మాట్లాడారు. ఈ నెలాఖరు వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు పూర్తి చేయడంతో పాటు మే ఒకటి నుంచి ఎంపిక చేసిన పైలట్ మండలంలో చట్టం అమలు చేస్తూ రైతుల నుంచి భూములకు సంబంధించిన సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పా రు. జూలై నుంచి అన్ని మండలాల్లో అమలు చేస్తామని వివరించారు. అన్ని సమస్యలు తీరుతాయి : ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పాలకుర్తిలో నిర్వహించిన సదస్సులో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ భూ భారతి చట్టంతో రైతుల అన్ని భూ సమస్యలు తీరుతాయని చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు ధరణితో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ మోసపోయారన్నారు. ధరణి సమస్యలేని ఊరు, తండా లేదని చెప్పారు. భూ భారతి చట్టం ద్వారా భూముల రికార్డు పారదర్శకంగా నిర్వహించి భవిష్కత్ తరాలకు భూ హక్కుల విషయంలో స్పష్టత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో అదపు కలెక్టర్ రోహిత్సింగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హనుమనాయక్, ఏడీఏ పరశురాంనాయక్, ఆర్డీఓ డీఎస్ వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మంజుల తదితరులు పాల్గొన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ కొడకండ్ల : అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా సూచించారు. స్థానిక మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రాన్ని సోమవారం సందర్శించిన ఆయన రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. టార్పాలిన్ కవర్లతో పాటు ధాన్యాన్ని తూర్పారబట్టే మిషన్లు సరిపోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా మరిన్ని పంపిస్తామని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రోహిత్సింగ్, తహసీల్దార్ చంద్రమోహన్, సీనియర్ అసిస్టెంట్ సుమన్, ఏఓ విజయ్రెడ్డి, ఏపీఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అవగాహన సదస్సుల్లో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
జాబ్ మేళా ఎన్నికల స్టంట్ కాదు
పాలకుర్తి: జాబ్ మేళాతో నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది.. మేళా నిర్వహించింది ఎన్నికల స్టంట్ కోసం కాదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం పాలకుర్తిలో బబ్బూరి శ్రీకాంత్ ఆధ్వర్యాన చారిటబుల్ ట్రస్టు నిర్వహించిన జాబ్ మేళాలో ఎంఎన్సీలు సహా 100 కంపెనీలు పాల్గొన్నా యి. పాలకుర్తి, దేవరుప్పుల, రాయపర్తి, తొర్రూరు, పెద్దవంగర మండలాల నుంచి నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దయాకర్రావు మాట్లాడుతూ.. గత పదేళ్లుగా జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పా రు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు పసునూరి నవీన్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్రావు, మాజీ ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, అభినయ్, సహకా ర సొసైటీ చైర్మన్ బొబ్బాల అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలి జనగామ రూరల్: గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలని ఫీల్డ్ అసిస్టెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు లావు బాల్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ వద్ద ఎఫ్ఏలు నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో తెలిపినట్లు ఎఫ్ఏలకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ పేస్కేల్ ఇవ్వాలన్నారు. జనవరి నుంచి పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని, హెల్త్ కార్డులు జారీ చేసి విధి నిర్వహణలో మరణించిన ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందజేశారు. సిబిల్ స్కోర్ ఉంటేనే ‘రాజీవ్ యువ వికాసం’బచ్చన్నపేట : రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేవారి సిబిల్ స్కోర్ సక్రమంగా ఉంటేనే అర్హులని జిల్లా వ్యవసాయ అధికారి రామారావునాయక్ అన్నారు. సోమవారం స్థాని క ఎంపీడీఓ కార్యాలయంలో సీబీఐ, టీజీబీవీ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరు అప్లికేషన్ ఫారాలను ఎంపీడీఓ కార్యాలయంలో అందజేయాలని చెప్పారు. వాటిని గ్రామాల వారీగా విభజించి ఏ బ్యాంకు పరిధిలోకి వస్తే వారికి అందజేస్తామ ని, బ్యాంకు అధికారులు సిబిల్ స్కోరు, ఖాతా పూర్వాపరాలను పరిశీలించి అర్హులను గుర్తించి జాబితా ఇస్తారని పేర్కొన్నారు. అనంతరం వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి లబ్ధిదారుల ను ఎంపిక చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటమల్లికార్జున్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ గోపీనా యక్, టీజీబీవీ ఫీల్డ్ ఆఫీసర్ అనూష పలువురు పాల్గొన్నారు. పోలీస్ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తాం.. వరంగల్ క్రైం : జాతీయస్థాయి క్రీడల్లో రాణించే పోలీస్ క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారా లు అందిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. గత నెలలో మధ్యప్రదేశ్ ఇండోర్లో జరిగిన 18వ జాతీయ పోలీస్ షూటింగ్ (స్పోర్ట్స్) చాంపియన్ షిప్ పోటీల్లో తెలంగాణ పోలీస్ తరఫున ప్రాతినిధ్యం వహించి 300 మీటర్ల మహిళా విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన సుబేదారి ఏఎస్సై సువర్ణను సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో సీపీ ఘనంగా సత్కరించారు. భవిష్యత్లోనూ ఈ క్రీడలో రాణించేందుకు అవసరమైన సహకారా న్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పరిపాలన విభాగం అదరపు డీసీపీ రవి తదితరులు పాల్గొన్నారు. -
లాభాల ఆయిల్ పామ్
జనగామ రూరల్: వంట నూనెల వినియోగం రోజు రోజుకూ పెరుగుతోంది. ఈనేపథ్యంలో పామాయి ల్ సాగుపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. సాగు విస్తీర్ణం పెంచడానికి రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తూ అవసరమైన పెట్టుబడి సాయం చేస్తోంది. ఆయిల్ పామ్ మొక్కల అందజేత నుంచి డ్రిప్ పరికరాలు, అంతర పంటల సాగు తదితరాల కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల సబ్సిడీలు ఇస్తున్నాయి. 2021 నుంచి ఇప్పటివరకు జిల్లాలో 6,976 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలు సాగయ్యాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం జనగామ మండలం ఎల్లంల గ్రామంలో ఏర్పాటు చేసిన ఆయిల్ పామ్ నర్సరీలో 2లక్షల 25 వేల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఇవి 3,947 ఎకరాలకు సరిపోతాయని అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న ధరలు వంట నూనెల ఉత్పత్తులకు పామాయిల్ వినియో గం పెరగడం, ఎగుమతులకు ప్రోత్సాహకాలు లభిస్తుండటం ఆయిల్ పామ్ ధరలు పెరగడానికి కారణంగా చెప్పవచ్చు. గతేడాది ఆగస్టు వరకు ఆయిల్ పామ్ టన్ను ధర రూ.14వేలు ఉండగా.. సెప్టెంబర్లో రూ.17వేలు, అక్టోబర్లో రూ.10 వేలు, నవంబర్లో రూ.30వేలు ఉంది. నవంబర్ నుంచి ఇప్పటి వరకు రూ.20 వేలకు పైగానే కొనసాగిన ధరలు మార్చి 31 వరకు రూ.20,871 కొనుగోలు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నిరంతర దిగుబడి ఆయిల్ పామ్ దిగుబడి నాలుగేళ్ల తర్వాత మొదలవుతుంది. పదేళ్లలోపు చెట్ల నుంచి ప్రతి ఏడాది 6 టన్నుల వరకు, పదేళ్లు దాటిన చెట్ల నుంచి ఏడాదికి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఏడాదంతా పంట వస్తూనే ఉంటుంది. దీనికి తోడు ప్రారంభంలో అంతర పంటలు వేసుకోవచ్చు. కూరగాయలు, పప్పు దినుసులు ఇతర పంటలతో అదనపు ఆదా యం సమకూరుతుంది. సాగుకు ప్రోత్సాహకాలు.. ఆయిల్ పామ్ తోటల సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ‘నేషనల్ మిషన్ ఎడిబు ల్ ఆయిల్–ఆయిల్ పామ్ ప్లాంటేషన్’ ఏర్పాటు చేసి సబ్సిడీ అందిస్తోంది. ఎకరాకు రూ.50,018 సబ్సిడీ లభిస్తుండగా.. రూ.190 విలువ చేసే మొక్కలను ప్రభుత్వం రూ.20కే ఇస్తోంది. ఎకరాకు దాదాపు 50 నుంచి 57 మొక్కలు నాటాలి. పంట సాగు చేసే రైతులకు ప్రభుత్వం ఎకరాకు ఏటా రూ.2,100 పెట్టుబడి, అంతర పంటల సాగుకు రూ.2,100 అందిస్తోంది. అలాగే సన్నకారు రైతులకు 90 శాతం, పెద్ద రైతులకు 80 శాతం సబ్సిడిపై డ్రిప్ సౌకర్యం కల్పిస్తోంది. దరఖాస్తులు స్వీకరిస్తున్నాం.. ఆయిల్ పామ్ పంటలకు మంచి ధర లభిస్తోంది. జిల్లాలో రైతులు పండించిన పంటను ప్రభుత్వం, ప్రైౖవేట్ కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. ఆదాయం మెరుగ్గా ఉండడంతో సాగుపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. పెండింగ్ దరఖాస్తులన్నీ పూర్తికావడంతో మళ్లీ కొత్తగా దరఖాస్తులు తీసుకుంటున్నాం. ఉద్యానవన పంటల సాగుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకా లను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – శ్రీధర్, ఉద్యాన శాఖ అధికారి, జనగామ ఇప్పటి వరకు జిల్లా రైతులు సాగు చేసిన ఆయిల్ పామ్ తోట వివరాలు పంట సాగుపై ఆసక్తి చూపుతున్న రైతులు సబ్సిడీలతో ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం జిల్లాలో 6,976 ఎకరాల్లో సాగుసంవత్సరం రైతులు ఎకరాలు 2021–22 73 426 2022–23 925 3204 2023–24 720 2170 2024–25 386 1176 మొత్తం 2105 6976 -
వచ్చే నెలలో టీచర్లకు ట్రైనింగ్
విద్యారణ్యపురి: రాష్ట్రంలో ఉపాధ్యాయులకు వేసవిలో శిక్షణ ఇవ్వనున్నారు. తొలుత ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులను మండల, జిల్లాస్థాయిలో రిసోర్స్ పర్సన్లుగా నియమించనున్నారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వుల ప్రకారం ఉమ్మడి జిల్లా పరిధి హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పనిచేస్తున్న మండల, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల, మోడల్స్కూల్స్, రెసిడెన్షి యల్ పాఠశాలల నుంచి ఆసక్తి కలిగిన ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు, గెజిటెడ్ హెడ్మాసర్లను రిసోర్స్పర్సన్లుగా ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం ఆయా జిల్లాల డీఈఓలు.. సదరు ఉపాధ్యాయులనుంచి ఈనెల 22నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరి స్తారు. ప్రతీ జిల్లాలో ప్రాథమిక పాఠశాలలనుంచి మండలస్థాయిలో రిసోర్స్ పర్సన్లుగా తెలుగు, ఇంగ్లిష్, మ్యాఽథ్స్, ఈవీఎస్ సబ్జెక్టులనుంచి ఇద్దరు చొప్పున ఎంఆర్పీల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లాస్థాయికి డీఆర్పీలుగా కూడా ఆయా సబ్జెక్టులకు ఒక్కో సబ్జెక్టుకు ఇద్దరు చొప్పున ఎంపిక చేసేందుకు దరఖాస్తులు తీసుకుంటారు. ఉర్దూ మీడియం, స్పెషల్ ఎడ్యుకేషన్నుంచి కూడా రిసోర్స్ పర్సన్లను నియమిస్తారు. జిల్లాస్థాయిలో హైస్కూళ్లనుంచి.. ప్రతీ జిల్లానుంచి హైస్కూల్స్థాయిలో విద్యాబోధన చేస్తున్న టీచర్లు ప్రతీ సబ్జెక్టునుంచి నలుగురి చొప్పున 9 సబ్జెక్టులకు 36మందిని జిల్లాస్థాయి రిసోర్స్పర్సన్లుగా ఎంపిక చేస్తారు. ఉర్దూ మీడియంలో ఐదు సబ్జెక్టులకు ఇద్దరు చొప్పున పది మందిని నియమిస్తారు. దరఖాస్తులు తీసుకున్నాక అందులోనుంచి అవసరం మేరకు సంబంధిత అధికారులు ఎంపిక చేస్తారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు ప్రతీ జిల్లాలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించాక ఏ జిల్లాకు ఆ జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంట ర్వ్యూలు నిర్వహిస్తారు. డెమో ద్వారా ఎంపిక చేస్తా రు. ఎంపిక చేసిన జాబితాలను ఆయా జిల్లాల డీఈ ఓలు ఈనెల 28వ తేదీ వరకు రాష్ట్ర విద్యాపరిశోధ న శిక్షణామండలికి, ఎస్ఈఆర్టీ అధికారులకు పంపనున్నారు. ఇదిలా ఉండగా హనుమకొండ జిల్లాలో ఆసక్తిగల తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూమీడియం ఉ పాధ్యాయులు నిర్దేశించిన అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ వాసంతి సోమవారం కోరారు. ఇతర సమచారం కోసం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఎంపిక చేసిన రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఎంపికై న మండల, జిల్లాస్థాయి రిపోర్స్ పర్సన్లకు ఆయా సబ్జెక్టుల వారీగా కూడా రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణామండలి అధికారులు త్వరలోనే సబ్జెక్టు ఎక్స్పర్ట్స్తో శిక్షణ ఇవ్వనున్నారు. వీరి ద్వారా జిల్లాస్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణలు ఉంటాయని సమాచారం. గుణాత్మక విద్యను అమలుచేసేందు కు ఉపాధ్యాయులకు అందించే శిక్షణలకు ఈ రిసోర్స్పర్సన్లను వినియోగిస్తారు. రిసోర్స్ పర్సన్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం డీఈఓ కార్యాలయాల్లో స్వీకరణ నేటినుంచి ఈనెల 24వరకు గడువు ఇంటర్వ్యూ, డెమో ద్వారా ఎంపికలు -
ఆదర్శ నియోజకవర్గమే లక్ష్యం
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్: నియోజకవర్గ ప్రజలు తనపై నమ్మకంతో గెలిపించారని, నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని కొత్తపల్లి గ్రామంలో రూ.15 కోట్లతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన, దాతల సహకారంతో ఏర్పాటు చేసిన గ్రంథాలయ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కడియం, ఎంపీ కడియం కావ్యతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చెవుల యాదగిరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడారు. కొత్తపల్లి క్రాస్ రోడ్డు జాతీయ రహదారి నుంచి కొత్తపల్లి, తాటికొండ, జిట్టెగూడెం గ్రామాల మీదుగా మల్లన్నగండి రూ.15 కోట్లతో రోడ్డు వెడల్పు, బీటీ రోడ్డు పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. వారం రోజుల్లో కొత్తపల్లి గ్రామస్తులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తానన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పేదలకు సన్నబియ్యం, రైతులకు సన్నబియ్యానికి బోనస్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మూర్ఖులు చేస్తున్న విమర్శలు పట్టించుకోనని స్పష్టం చేశారు. అనంతరం ఎంపీ కావ్య మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఓ ప్రబుద్దుడు అభివృద్ధిలో నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించాడని, తినడం, తాగడం, ఊగడం, వాగడమే పనిగా ఉన్నాడని పరోక్షంగా మాజీ ఎమ్మెల్యే రాజయ్యపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిలో వెనుకబడిన నియోజకవర్గాన్ని ప్రస్తుతం ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గానికి రూ.800 కోట్లు మంజూరీ చేయించి స్వయంగా సీఎంచే శంకుస్థాపన చేయించిన ఘనత కడియందే అన్నారు. కొత్తపల్లి గ్రామానికి తన ఎంపీ నిధుల నుంచి మహిళా కమ్యూనిటీ భవనం, హైమాస్ లైట్లకు నిధులు మంజూరీ చేస్తానని హామీ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, ఏఎంసీ చైర్పర్సన్ లావణ్యశిరీష్రెడ్డి, నాయకులు కీసర ముత్యంరెడ్డి, యాదగిరి, మధుసూదన్రెడ్డి, శిరీష్రెడ్డి, నరేందర్గౌడ్, శివచరణ్రెడ్డి, ఆనందం, రాజు, వెంకటస్వామి, కుమారస్వామి, రవి, రాజ్కుమార్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపిక
జఫర్గఢ్: మండలంలోని కూనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఆకుల సాయికుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు సదాశివ, భరత్ ఇటీవల స్టేషన్ఘన్పూర్లోని శ్రీవాణి గురుకుల పాఠశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు తెలిపారు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు నారాయణపేట జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొననున్నట్లు తెలిపారు. ఎంపికై న విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు ఎండీ పర్వేజ్, షూటింగ్ బాల్ జిల్లా అసోసియేషన్ బాధ్యులు సాంబరాజు అభినందించారు. మార్కెట్లో అవినీతిపై విచారణ చేపట్టాలి జనగామ రూరల్: జనగామ, కొడకండ్ల, స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ల పరిధిలో సీసీఐ పత్తి కొనుగోలులో జరిగిన అవినీతిపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వ్యవసాయ మార్కెట్ల పరిధిలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో దొంగ టీఆర్లతో కోట్ల రూపాయలు కొల్లగొట్టి సొమ్ము చేసుకున్న వ్యవసాయ మార్కెటింగ్ శాఖ జిల్లాస్థాయి అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు పాత్ర ఉన్న ప్రతి ఒక్కరిపై విచారణ చేపట్టి కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. మూడు వ్యవసాయ మార్కెట్ల పరిధిలో 15 పత్తి మిల్లులు ఉన్నాయని ఈ మిల్లుల్లో ప్రభుత్వం రైతు సంఘం పోరాట ఫలితంగా పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని ఆన్లైన్ తక్ పట్టీలు సంబంధం లేని వ్యక్తులపై టీఆర్, ఐడీ నంబర్లు సృష్టించి ప్రతి కింటాకు రూ.22 చొప్పున సుమారు రూ.కోటి 20 లక్షలు అక్రమ పద్ధతిలో చేతులు మారినట్టు తెలుస్తుందని తెలిపారు. పల్లికాయ కొనుగోలుపై పూర్తిస్థాయిలో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్షోత్సవాలు జనగామ: ఆరోగ్య తెలంగాణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో పో షణ పక్షోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆదివా రం కుర్మవాడ, బెగ్గర్స్ కాలనీల పరిధిలోని అంగన్వాడీ సెంటర్లలో పోషణ పక్షోత్సవం నిర్వహించారు. తలుల్లు, గర్భిణులు, పిల్లల్లో పోషకాహార లోపం ఉండొద్దని డీడబ్ల్యూఓ ఫ్లోరెన్సీ, వైద్యారోగ్య శాఖ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రవీందర్గౌడ్, ఐసీడీఎస్ సూపర్వైజర్ మనోహర, సీహెచ్ఓ జానమ్మ పిలుపునిచ్చారు. చిరుధాన్యాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. తల్లులు, బాలింతలు, గర్భిణీలు పోషకాహారం తీసుకోవాలని తెలిపారు. చేతులను శుభ్రం చే సుకునే ఏడు రకాల పద్ధతులను వివరించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే బాలా మృతం, పాలు, స్నాక్స్, సంపూర్ణ భోజనం ఎ లా ఉందని తల్లులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తల్లులు, పిల్లలతో పోషణ ప్రతిజ్ఞ చేయించారు. బెగ్గర్స్ కాలనీ సెంటర్లో ప్రీ స్కూల్ పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి, సర్టిఫికెట్లను అందజేశారు. పవిత్ర, హేమలత, స్వర్ణలత, స్వప్న, ప్రమీల, లక్ష్మి ఉన్నారు. -
యూడైస్ వెరిఫికేషన్
జనగామ: జాతీయ సమాచార కేంద్రం పర్యవేక్షణలో యూనిఫైడ్ డిస్ట్రిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్) ద్వారా పాఠశాలల డేటా బేస్ను సేకరించేందుకు కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ రెండేళ్ల క్రితం శ్రీకారం చుట్టింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, పాఠశాల పరిధిలో మౌలిక వసతులతోపాటు మరో 30 అంశాలకు సంబంధించి డేటాబేస్ను అభివృద్ధి చేశారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల సమగ్ర సమాచారాన్ని యూడైస్లో అప్లోడ్ చేశారు. అయితే ఆన్లైన్లో పొందుపరిచిన వివరాలు క్షేత్రస్థాయిలో సరిపోల్చే విధంగా ఉన్నాయా.. లేదా..? తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వే పేరిట థర్డ్ పార్టీ వెరిఫికేషన్కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి డీఈడీ, బీఈడీ ట్రెయినీ విద్యార్థులతో నిర్వహిస్తున్న థర్డ్ పార్టీ వెరిఫికేషన్ నేటి (సోమవారం)తో ముగియనుంది. పడిపోయిన ర్యాంక్ ! ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. సర్కారు బడుల్లో కనీస మౌలిక వసతి సౌకర్యాలను మెరుగుపర్చడంతోపాటు సాంకేతికత ఆధారంగా డిజిటల్ విద్యపై ప్రత్యేక దృష్టి సారించింది. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, కంప్యూటర్లు, ల్యాబ్స్, విద్యుత్ సౌకర్యం, సోలార్ ప్యానెల్స్, ఫర్నిచర్, ప్లే గ్రౌండ్, చేతులను శుభ్రం చేసుకునే వసతి, విద్యార్థుల వారీగా ఆరోగ్య రికార్డులు, కిచెన్ గార్డెన్లు, ఇంటర్నెట్, కిచెన్షెడ్లు, ఇంటిగ్రేటెడ్ సైన్స్ ల్యాబ్స్, వసతి సౌకర్యాలు ఏ మేరకు ఉన్నాయనే దానిపై యూడైస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసింది. పాఠశాలల వారీగా ఉపాధ్యాయులు విద్యార్థుల సమగ్ర సమాచారంతోపాటు కేంద్రం ఇచ్చిన ఫార్మెట్ ప్రకారం కనీస మౌలిక వసతి సౌకర్యాల వివరాలను అందులో పొందుపరిచారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి ఇచ్చిన యూడైస్ సమాచారంలో క్లారిటీ లేకపోవడంతో దేశంలో తెలంగాణ ర్యాంకు పడిపోయింది. దీంతో కేంద్రం నుంచి విద్యాభివృద్ధి కోసం రావాల్సిన నిధుల వాటా తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈక్రమంలో మేల్కొన్న సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం యూడైస్ సర్వేను థర్డ్ పార్టీ ద్వారా మరోసారి వెరిఫికేషన్ చేసేందుకు నిర్ణయం తీసుకుని, అమలు చేస్తోంది. వివరాల పునఃపరిశీలన జిల్లాలో ఐదు యాజమాన్యాల (స్థానిక సంస్థలు, ప్రభుత్వ, కేజీబీవీ, మోడల్, టీఆర్ఐఈఎస్, యూఆర్ఎస్) పరిధిలో 460 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ బడుల పరిధిలో ఆన్లైన్లో పొందుపరిచిన యూడైస్ వివరాలను క్రాస్ చెక్ చేసుకునేందుకు 43 మంది డీఈడీ, బీఈడీ ట్రేయినీ విద్యార్థుల ద్వారా థర్డ్ పార్టీ వెరిఫికేషన్ చేయిస్తున్నారు. ఒక్కో విద్యార్థి రోజుకు రెండు నుంచి మూడు పాఠశాలల్లో సర్వే చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో యూడైస్ ప్లస్ వెబ్సైట్లో నమోదు చేసిన 30 అంశాల సమాచారం సరిగ్గా ఉందా.. లేదా.. అనే కోణంలో పరిశీలన చేసి, తుది నివేదికను విద్యాశాఖ ఉన్నతాధికారులకు అందించనున్నారు. ఉన్నతాధికారుల పరిశీలన అనంతరం వివరాలను ప్రధానోపాధ్యాయులు వెబ్సైట్లో సరి చేయనున్నారు. సర్వే కొనసాగుతోంది జిల్లాలోని 460 సర్కారు బడుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, పాఠశాల పరిధిలో కనీస సౌకర్యాలతోపాటు మరో 30 అంశాలకు సంబంధించి యూడైస్ డేటాబేస్పై థర్డ్ పార్టీ వెరిఫికేషన్ కొనసాగుతోంది. పాఠశాలల వారీగా ఆన్లైన్ చేసిన వివరాలు, క్షేత్రస్థాయిలో సరిపోల్చే విధంగా ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకు సర్వే ఉపయోగపడుతుంది. సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య పెరుగుదల ఉంటే యూడైస్లో నమోదు చేస్తారు. – తోట రాజు, సమగ్ర శిక్ష ప్లానింగ్ కో ఆర్డినేటర్ సర్కారు పాఠశాలల్లో థర్డ్ పార్టీ పరిశీలన నేటితో ముగియనున్న సర్వే 460 పాఠశాలలు.. 43 మంది డీఈడీ, బీఈడీ విద్యార్థులు -
కొత్తవారికి మార్గనిర్దేశం చేయండి
జనగామ: వైద్యరంగంలోకి కొత్తగా వచ్చే వారికి మార్గనిర్దేశం ఐఎంఏ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచంద్రునాయక్ అన్నారు. శనివారం రాత్రి జిల్లా కేంద్రంలోని భ్రమరాంబ కన్వెన్షన్ హాల్లో ఐఎంఏ జనగామ శాఖ నూతన కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకారమహోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా రాంచంద్రునాయక్ మాట్లాడుతూ ఐఎంఏలో పరస్పర సహకారం ఉండాలన్నారు. వృత్తిలో ఈర్ష్య, ద్వేశాలకు దూరంగా ఉంటూ సంఘటితంగా ఉంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో వైద్యుల పాత్ర కీలకమని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పని చేయాలని సూచించారు. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ వైద్యులు ప్రత్యక్ష దైవస్వరూపులని అన్నారు. జిల్లా ఐఎంఏ నూతన అధ్యక్షుడిగా డాక్టర్ బాలాజీ, కార్యదర్శిగా అమృతం శ్రీకాంత్తోపాటు కమిటీని ఎన్నుకోగా, ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ద్వారాకానాథరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన అధ్యక్షుడు బాలాజీ మాట్లాడుతూ 1993లో ప్రారంభమైన జనగామ ఐఎంఏ రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐఎంఏ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ లవకుమార్రెడ్డి, డాక్టర్ జె.వెంకటేశ్వర్లు, రాష్ట్ర కోశాధికారి డాక్టర్ దయాల్ సింగ్, డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు, మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఏ.శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పోకల జమునలింగయ్య, డాక్టర్లు సీహెచ్ రాజమౌళి, లక్ష్మీనారాయణ నాయక్, పి.సుగుణకర్ రాజు, రవీందర్గౌడ్, జి.గోపాల్ రెడ్డి, కల్నల్ భిక్షపతి, ఇన్నారెడ్డి, స్వప్న లింగమూర్తి, విజయలక్ష్మి, ప్రీతీదయాల్, ఎల్.అశోక్, స్వప్న రాథోడ్, రంజిత్ కుమార్, విజ్ఞశ్రీ, లయన్స్ ఇంటర్నేషనల్ పూర్వ జిల్లా గవర్నర్ కన్న పరశురాములు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచంద్రు నాయక్ -
గిట్టుబాటు ధర చెల్లించేది కేంద్రమే..
రఘునాథపల్లి: రైతులు పండించిన పంటలకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరలు చెల్లించేది ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వమేనని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పెరుమాండ్ల వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని కోమళ్లలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పార్టీ నాయకులతో కలిసి ఆదివారం సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో సమస్యలు ఉన్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నది కూడా కేంద్ర ప్రభుత్వమేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి మంద వెంకటేష్యాదవ్, బూత్ అధ్యక్షుడు వల్లాల శ్రీను, బాల్నె వెంకటయ్య, మంకెన అన్నపురెడ్డి, మంద రాములు, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వెంకటేశ్వర్లు -
చెరువులు, చేప పిల్లల పంపిణీ వివరాలు
ఉమ్మడి జిల్లాలో చెరువులు 3,861ఉచిత చేప పిల్లల పంపిణీ లక్ష్యం 14.07 కోట్లు 3,462 చెరువుల్లో పోసిన చేప పిల్లలు 8.88 కోట్లు 35 నుంచి 45 మిల్లీమీటర్ల చేపలు 4.89 కోట్లు 80 నుంచి 100 మిల్లీమీటర్ల చేపలు 3.99 కోట్లు పెరగాల్సిన సైజు 1.5 కేజీ నుంచి 2.5 కేజీలు ప్రస్తుత సైజు 450 నుంచి 750 గ్రాములు -
చిక్కుల్లో చేప
ఎదుగూబొదుగు లేని మీనం!● టెండర్లు, చేప పిల్లల పంపిణీలో ఆలస్యం ● సిండికేట్గా మారిన కాంట్రాక్టర్లు ● నాసిరకం, ఇష్టారాజ్యంగా సరఫరా ● 750 గ్రాముల బరువు దాటని చేపలు ● ఎండదెబ్బ.. దిగుబడిపై సన్నగిల్లిన ఆశలు ● నష్టపోతున్నామంటున్న మత్స్యకారులు సాక్షిప్రతినిధి, వరంగల్ : మత్స్యకారుల జీవనోపాధికి ప్రభుత్వం వంద శాతం రాయితీపై చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. 2024–25 సంవత్సరానికి గాను ఉమ్మడి వరంగల్ పరిధి 3,861 నీటి వనరుల్లో ఈ ఏడాది 14.07 కోట్ల చేప పిల్లలు వదలాలి. 2024 జనవరిలోనే 35–40, 80–100 మిల్లీమీటర్ల పరిమాణమున్న చేప పిల్లల సరఫరాకు టెండర్లు పూర్తి చేశారు. ఆయా ప్రాంతాల్లో వాతావరణానికి తగినట్టుగా మెరిగెలు, బొచ్చె, రవ్వు, బంగారు తీగ లాంటి చేప పిల్ల లను ఉత్పత్తి చేసి సరఫరా చేయాల్సి ఉంది. అయితే ఏటా టెండర్లు దక్కించుకుంటున్న గుత్తేదారు సంస్థలు స్థానికంగా పెంచకుండా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినవి చెరువుల్లో వదిలి చేతులు దులుపుకుంటున్నారు. జూన్లో పంపిణీ చేయాల్సిన చేప పిల్లలను ఆగస్టులో మొదలెట్టి అక్టోబర్ వరకు పంపిణీ చేశారు. ఈలోగా కొన్ని మత్స్య సహకార సంఘాల నాయకులు, సభ్యులు డబ్బులు పోగేసుకుని చేప పిల్లలు కొనుగోలు చేసి చెరువుల్లో పోశారు. చాలాచోట్ల గుత్తేదార్లు సరఫరా చేసిన చేప పిల్లలు నాసిరకంగా ఉండగా.. వాటిలో ఇప్పటికీ ఎదుగుదల లేదని మత్స్యకారులు అంటున్నారు. చేప పిల్లల పంపిణీ 63.11 శాతమే ఉమ్మడి వరంగల్లో 3,861 చెరువులు, కుంటలు ఉండగా.. 14.07 కోట్ల చేప పిల్లలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మత్స్యశాఖ ప్రకటించింది. అయితే.. 35–40 మిల్లీమీటర్ల పిల్లలు 4.89 కోట్లు, 80–100 మిల్లీమీటర్లవి 3.99 కోట్లు.. మొత్తం 8.88(63.11 శాతం) కోట్లు పంపిణీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి జూన్ మొదటి వారం నుంచే చేప పిల్లలు చెరువుల్లో పోయాల్సి ఉంది. అలాగైతే ఆరేడు నెలల గడువులో ఒక్కో నెలకు పావుకిలో పెరిగినా రెండు, రెండున్నర కిలోలకు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఓ వైపు నాసిరకం విత్తన చేపపిల్లలు, మరోవైపు ఆలస్యంగా చెరువుల్లో వదలడం.. ఎండిపోతున్న చెరువుల్లో తీవ్రమైన ఎండవేడి.. ఈ ప్రతికూల కారణాలతో చెరువులో చేప ఎదగడం లేదు. మార్చి చివరి నుంచి చేపలు పట్టే అవకాశం ఉన్నా 450–750 గ్రాముల సైజులోనే ఉండటంతో మిన్నకుండిపోయారు. ఇప్పటికై నా ప్రభుత్వం కాంట్రాక్టర్లు, దళారులతో ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయకుండా వాటికి అయ్యే మొత్తాన్ని నేరుగా మత్స్య పారిశ్రామిక సంఘాల అకౌంట్లలోకి జమ చేస్తే.. నచ్చిన చేప పిల్లలను సకాలంలో కొనుగోలు చేసి చెరువులు, కుంటల్లో పోస్తే మంచి ఫలితాలు వస్తాయని మత్స్యకారులు, సంఘాల నాయకులు అంటున్నారు. -
ప్రణాళికాబద్ధంగా యాసంగి కొనుగోళ్లు
జనగామ రూరల్: ప్రణాళికాబద్ధంగా యాసంగి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్తో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అకాల వర్షాలు కారణంగా రైతులు నష్టపోకుండా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. సన్న బియ్యం నాణ్యతపై సామాజిక మాద్యమాల్లో వస్తున్న వ్యతిరేక వార్తలను పరిశీలించి తప్పుడు వార్తలైతే ఖండించాలని సూచించారు. నీటిపారుదల ప్రాజెక్టుల పరిధిలో తాగునీటి సరఫరా ఇబ్బందులు ఉంటే సమాచారం అందించాలని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ వీసీలో కలెక్టర్ రిజా్వ్న్బాషా, అదనపు కలెక్టర్ రోహిత్సింగ్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సరస్వతి, సివిల్ సప్లయీస్ డీఎం హతీరాం, మార్కెటింగ్, ఇరిగేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
మహిళల హక్కుల పరిరక్షణలో కేంద్రం విఫలం
● ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి జనగామ రూరల్: మహిళల హక్కుల పరిరక్షణలో కేంద్రం విఫలమైందని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. ఈ మేరకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహిళా హక్కుల పరిరక్షణ యాత్ర శనివారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా మహిళలు బస్టాండ్ చౌరస్తాలో ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పట్టణంలో ని నెహ్రూపార్క్ వద్ద ఇర్రి అహల్య అధ్యక్షతన ఏ ర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ రాజ్యాంగంలో సీ్త్ర పురుషులకు సమాన హక్కులు కల్పించబడ్డాయని, కానీ అసమానతలు ఇంకా తగ్గడం లేదన్నారు. జిల్లా అధ్యక్షురాలు అరుణ జ్యోతి, రాష్ట్ర సహాయ కార్యదర్శి బుగ్గవేటి సరళ, ఆశాలత, సా యి లీల, జిల్లా కార్యదర్శి ఎండీ షబానా, భవాని, పి.కల్యాణి, బి.రమ, విజేందర్ పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఐద్వా రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి -
గాలిదుమారం.. అకాల వర్షం
అకాల వర్షాలు, ఈదురుగాలులు రైతులను వెంటాడుతూ దడ పుట్టిస్తున్నాయి. పొద్దంతా ఎండలు దంచి కొడుతూ.. సాయంకాలం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు ఆగమాగం చేస్తున్నాయి. శనివారం జిల్లాలోని జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లితో పాటు తదితర మండలాల్లో కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయింది. విద్యుత్ స్తంభాలు కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట తడిసిపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.● కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం ● విద్యుత్ సరఫరాకు అంతరాయం– మరిన్ని ఫొటోలు IIIలోu -
ఆర్మీలో చేరాలనుంది..
కబడ్డీ రాష్ట్రస్థాయిలో విజేతగా నిలిచా. హనుమకొండ జేఎన్ఎస్లో పలుమార్లు శిక్షణ తీసుకున్నా. ఈశిక్షణతో కబడ్డీలో విజేతగా నిలిచా. నాకు ఆర్మీలో ఉద్యోగం పొందాలని ఉంది. సమయాన్ని వృథా చేయకుండా సెలవుల్లో పుస్తకపఠనం చేస్తా. – ఇట్టబోయిన గణేశ్, విద్యార్థి, వేలేరు పలు రంగాల్లో అవగాహన కల్పించాలి.. పిల్లలకు చదువుతోపాటు పలు రంగాల్లో ఆసక్తి కలిగేలా అవగాహన కలిగించి ప్రోత్సహించాలి. నాకు ఇద్దరు పిల్లలు అమ్మాయి, అబ్బాయి. వారిని రామకృష్ణ మఠంలో బాలసంస్కార్ క్లాస్కు పంపిస్తాను. విలువిద్య, స్విమ్మింగ్ నేర్పిస్తున్నా. – చింత శ్యాంసుందర్, హనుమకొండ కోచింగ్ పంపిస్తున్నాం.. మాకుమార్తె వర్షిణి ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తయింది. ప్రస్తుతం కళాశాలకు వేసవి సెలవులు ప్రకటించడంతో నీట్ కోచింగ్కు పంపిస్తున్నాం. అలాగే కూచిపూడి, సంగీతంలో కూడా శిక్షణ ఇప్పిస్తున్నాం. – కొలిపాక సునీత, స్టేషన్ఘన్పూర్ -
‘భూ భారతి’పై అవగాహన ఉండాలి
స్టేషన్ఘన్పూర్: భూ రికార్డుల్లో తప్పులను సరిదిద్దడానికి, రైతులకు మెరుగైన సేవలు అందించడానికి భూ భారతి–2025 చట్టాన్ని తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో స్థానిక రైతువేదికలో శనివారం భూ భారతి (భూమిపై హక్కులు, రికార్డులు) చట్టంపై అవగాహన సదస్సును నిర్వహించారు. తహసీల్దార్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅతిథిగా కడియం హాజరై మాట్లాడారు. పార్ట్ బీ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది పారదర్శకంగా పనిచేయాలన్నారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూ భారతి చట్టం పనిచేస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రో హిత్సింగ్, ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్రెడ్డి, ఎంపీడీఓ విజయశ్రీ, ఆర్ఐలు శ్రీకాంత్, సతీష్, డీటీ ఫణికిషోర్, రైతులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
వసతుల కల్పనకు కృషి
● హైకోర్టు జడ్జి జస్టిస్ అనిల్కుమార్ జనగామ రూరల్: జిల్లా కోర్టులో వసతుల క ల్పనకు కృషి చేస్తానని హైకోర్టు జడ్జి జస్టిస్ జె.అనిల్కుమార్ అన్నారు. శనివారం జిల్లా కో ర్టును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా, డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ పండరి చేతన్ నితిన్ ఆయనకు పూల మొక్క అందించి స్వాగతం పలి కారు. అనంతరం న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను జడ్జి దృష్టికి తీసుకువచ్చా రు. జిల్లా జడ్జి రవీంద్రశర్మ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలోని గుమాస్తా సంఘ భవనం, ఈసేవ, మహిళా బార్ అసోసియేషన్, లాకర్ రూంలను సందర్శించి పరిశీలించారు. అనంతరం జడ్జి జస్టిస్ అనిల్కుమార్ మాట్లాడుతూ జిల్లా కోర్టులో క్యాంటీన్, జిరాక్స్ సెంటర్, మహిళా బార్ అసోసియేషన్కు హాల్ తదితర సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామన్నారు. అ నంతరం కోర్టు ఆవరణలో జిల్లా జడ్జి, న్యాయవాదులతో కలిసి మొక్కలు నాటారు. నూతన బార్ అసోసియేషన్ సభ్యులు జడ్జిని శాలువా తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గోపిరామ్, తహసీల్దార్ హుస్సేన్, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. హరిప్రసాద్ యా దవ్, జనరల్ సెక్రటరీ పి.రామకృష్ణ, సీనియర్ న్యాయవాదులు శ్రీరామ్ శ్రీనివాస్, జాన్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సునీత రాణి పాల్గొన్నారు. స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టును హైకోర్టు జడ్జి జస్టిస్ అనిల్కుమార్ జిల్లా జడ్జి రవీంద్రశర్మతో కలిసి శనివారం సందర్శించారు. కోర్టు హాల్, చాంబర్, బార్ అసోసియేషన్ హాల్, టాయిలెట్లను పరిశీలించారు. స్టేషన్ఘన్పూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కనకం రమేశ్ ఆధ్వర్యంలో జడ్జికి పలు సమస్యలతో కూడిన వినతులు అందించారు. సమస్యల పరిష్కారానికి జడ్జి సానుకూలంగా స్పందించారు. పాలకుర్తి టౌన్: సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం హైకోర్టు జడ్జి జస్టిస్ అనిల్కుమార్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. -
ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– IIలోuపుస్తకాలతో కుస్తీ పడిన చిన్నారులకు రిలీఫ్ దొరికినట్లయ్యింది. ఇన్నాళ్లు బండెడు బుక్స్ను మోసిన ఆ చిన్ని భుజాలకు కాస్తంత విశ్రాంతి దొరికింది. ఇప్పటికే పలు ప్రైవేట్ స్కూళ్లు వేసవి సెలవులు ఇచ్చాయి. ప్రభుత్వ స్కూళ్లు మాత్రం ఈ నెల 24 నుంచి సెలవులు ప్రకటించాయి. స్పెషల్ క్లాసులు, ట్యూషన్లు, హోంవర్క్లు, బైహాట్లు ఇప్పుడివేమీ లేవు. అలాగని ఈ సెలవుల్లో వాళ్లేం ఖాళీగా ఉండరు. ఫోన్ చూడడమో, లేక టీవీకి అతుక్కుపోవడమో చేస్తుంటారు. ఈ సెలవుల్ని వినియోగించుకుంటే భవితకు పునాది వేసుకోవచ్చు. వారికి ఇష్టమైన క్రీడలు, నాట్యం, ఆత్మరక్షణ విద్య, స్విమ్మింగ్, ఇతర రంగాలను తెలుసుకుని ప్రోత్సహించాలి. పిల్లల్ని ఆ దిశగా నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అప్పుడే వారిలో మానసికోల్లాసంతోపాటు శారీరక దృఢత్వం అలవడుతుంది. సెలవుల్ని ఎలా వినియోగించుకోవాలనేదే ఈ వారం ‘సాక్షి’ ప్రత్యేకం. – హన్మకొండ కల్చరల్పర్యాటక ప్రాంతాల సందర్శన ఓరుగల్లు ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతం. వేసవిలో ఆహ్లాదం, ఆనందం కోసం తల్లిదండ్రులు పిల్ల లను ఉమ్మడి జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లవచ్చు. ముఖ్యంగా హనుమకొండ హంటర్రోడ్డులోని జూ పార్కు, సైన్స్సెంటర్, వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, రామప్ప, లక్నవరం, పాకాల సరస్సు ఖిలా వరంగల్కోట తదితర ప్రదేశాలను సందర్శించవచ్చు. సజీవంగా నిలిచిపోయే కళ చిత్రలేఖనం. ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఆర్టిస్టులు ఉచితంగా చిత్రలేఖనాన్ని నేర్పిస్తున్నారు. కొంత మంది నిర్ణీత రుసుముతో బొమ్మలు గీయడం నేర్పిస్తున్నారు. మరికొంత మంది ఆన్లైన్ క్లాసుల ద్వారా విద్యార్థులను బొమ్మలు గీయడంలో నేర్పరులుగా మారుస్తున్నారు. కాగా.. వరంగల్ కాపువాడకు చెందిన చిత్రకళలో డాక్టరేట్ సాధించిన యాకయ్య విద్యార్థులకు చిత్రలేఖనంలో మెళకువలు నేర్పుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని లైబ్రరీలు విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. శాస్త్ర, సాంకేతిక, కథలు, కవితలు, అన్నిరకాల పోటీ పరీక్షల పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఉచితంగా మేధను పెంచుకునేందుకు ఇవి చక్కటి సోపానాలు. ఉన్నత స్థానంలో ఉన్న వారంతా పుస్తకాల పురుగులే. నగరవాసులు అయితే వరంగల్, హనుమకొండలోని సెంట్రల్ లైబ్రరీలకు పిల్లలను ఎంచక్కా పంపొచ్చు. నృత్య, సంగీత శిక్షణతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వరంగల్కు చెందిన నటరాజ కళాకృష్ణ నృత్యజ్యోతి అకాడమీ గురువు రంజిత్ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీ నుంచి పేరిణి నాట్య కళాపరిచయం పేరిట 45 రోజులు నిర్వహించే శిక్షణ శిబిరాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ప్రాయోగిక, ప్రాథమిక స్థాయి శిక్షణతో పాటు ప్రశంస పత్రం అందజేస్తారు. అంతేకాకుండా హనుమకొండకు చెందిన శ్రీశివానంద నృత్యమాల నాట్యాచార్యులు బొంపల్లి సుధీర్రావు ఆధ్వర్యంలో భరతనాట్యం, కూచిపూడి నాట్యాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి.న్యూస్రీల్క్రీడల్లో శిక్షణ..పిల్లలు వేసవి సెలవుల్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలిసజీవ కళ చిత్రలేఖనం.. వారికి ఇష్టమైన కళలు, ఆటల్లో శిక్షణ ఇప్పించాలి.. సెల్ఫోన్ను దూరం పెట్టాలి.. పుస్తకాల్ని చేరువ చేయాలి ఆ బాధ్యత తల్లిదండ్రులదే.. పుస్తక పఠనం..భగవద్గీత శ్లోక శిక్షణ.. సామాజిక సేవ -
వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక అలంకరణ
చిల్పూరు: శ్రీ బుగులు వేంకటేశ్వరాలయంలో శుక్ర(లక్ష్మి) వారాన్ని పురస్కరించుకుని భూనీల సమేత స్వామివారిని అర్చకులు పుష్ప, తులసీ దళాలతో అలంకరించారు. అంతకు ముందు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈఓ లక్ష్మీప్రస న్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు, సిబ్బంది, ధర్మకర్తలు పాల్గొన్నారు. శ్రీసోమేశ్వరుడికి న్యాయమూర్తి పూజలుపాలకుర్తి టౌన్: జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించి హైకోర్టు రిజిస్ట్రార్గా పదోన్నతి పొందిన డి.రవీంద్రశర్మ కుటుంబ సభ్యులు శుక్రవారం శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారిని అర్చకులు స్వామివారి శేషవస్త్రాలతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆల య ఈఓ మోహన్బాబు, అర్చకులు డీవీఆర్. శర్మ, దేవగిరి అనిల్శర్మ, మత్తగజం నాగరాజు, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. నేడు బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ క్యాంప్జనగామ రూరల్: జిల్లా పరిధిలోని వినియోగదారులకు జనగామ టెలిఫోన్ ఎక్చేంజ్ పరిధి లో శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కస్టమర్ సర్వీస్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు సబ్ డివిజినల్ ఇంజినీర్ చంద్రగిరి ప్రసాద్ తెలిపారు. ఈ క్యాంపులో సంస్థకు సంబంధించి వివిధ సర్వీసులు, మొబైల్, ఇంట ర్నెట్, వైఫై, సిగ్నల్ సమస్యలు పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. క్యాంప్లో వరంగల్ ఏజీఏం దయాకర్తో పాటు ఎస్డీఈలు శ్రీహరి, రాంప్రసాద్, షఫీక్ పాల్గొంటారని వినియోగదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో కోరారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతే ధ్యేయంజనగామ: ఉద్యోగుల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా ఎన్పీడీసీఎల్ పాటుపడుతోందని ఎస్ఈ వేణుమాధవ్ అన్నారు. శుక్రవారం జనగామ డివిజనల్ కార్యాలయంలో జిల్లాలోని విద్యుత్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రి ఆధ్వర్యాన మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో 200 మందికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆస్పత్రి యాజ మాన్యం, డాక్టర్లను డీఈలు గణేష్, లక్ష్మీనారా యణ, వై.రాంబాబు, ఏడీఈ పి.రణధీర్రెడ్డి, ఏఈ పి.శంకర్తో కలిసి ఎస్ఈ సత్కరించారు. -
కిషన్రెడ్డికి క్షమాపణ చెప్పాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ జనగామ రూరల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి కి ఎమ్మెల్సీ దయాకర్, అంజన్కుమార్ వెంటనే క్షమాపణ చెప్పాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వారి దిష్టిబొమ్మను శుక్రవారం జిల్లా కేంద్రం చౌరస్తాలో దహనం చేశారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడు తూ.. రాజ్యాంగబద్ధంగా ఉన్నత పదవుల్లో ఉన్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని అనుచిత వ్యాఖ్యలతో మాజీ పార్లమెంట్ సభ్యుడు అంజన్కుమార్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. చౌకబారు మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలన్నా రు. లేదంటే పార్టీ కార్యకర్తలు ఆగ్రహానికి గురికావా ల్సి వస్తుందని హెచ్చరించారు. బొమ్మకంటి అనిల్ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజ్ యాదవ్, దేవర ఎల్లయ్య, బజ్టూరి లక్ష్మీనరసయ్య, డాక్టర్ కల్నల్ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
పట్టాలెక్కినకొనుగోళ్లు
276 ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లు●అధిక తేమతో ఇబ్బందులు ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సిద్ధంగా ఉన్నప్పటికీ.. అధిక తేమ కారణంగా ఆలస్యం అవుతోంది. ధాన్యంలో తేమ 23 నుంచి 30 శాతానికి పైగా వస్తుండడంతో మద్దతు ధర కోసం రైతులు రోజుల తరబడి ఆరబోసి నిరీక్షించాల్సి వస్తోంది. ఒక్కో రైతు 10 రోజుల నుంచి సెంటర్లలోనే పడిగాపులు కాస్తున్నారు. కాగా తరిగొప్పుల మండల పరిధిలో గన్నీ బ్యాగుబరువు, తరుగు పేరుతో బస్తాకు 40 కేజీలకు బదులు 41.2 కిలోలు తూకం వేస్తున్నారు. దీంతో ఒక్కో బస్తాకు కిలో 200 గ్రాములు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● దొడ్డు, సన్న రకం ధాన్యం సేకరణ ● ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం 57,260 క్వింటాళ్లు ● అధిక తేమతో ఆలస్యంగా కాంటాలు ● రైతులకు తప్పని పడిగాపులు -
క్రీడలతో మానసిక ఉల్లాసం
● డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డిజనగామ: క్రీడలతో శారీరక ధృడత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం ప్రెస్టన్ మైదానంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి రాజీవ్ మెమోరియల్ ట్రోఫీ(కొమ్మూరి ప్రతాప్రెడ్డి క్రికెట్ టోర్నమెంట్ సీజన్–1) ముగింపు వేడుకల్లో శుక్రవారం పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతనం జనగామ వ్యవసాయ మార్కె ట్ చైర్మన్ బనుక శివరాజ్యాదవ్ ఆధ్వర్యాన ఏర్పా టు చేసిన సమావేశంలో కొమ్మూరి మాట్లాడారు. నేటితరం యువత చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలని, రేపటి భవిష్యత్ కోసం అన్ని రకాలు గా సన్నద్ధమై ఉండాలని సూచించారు. పోటీల్లో మహబూబాబాద్ ప్రథమ, జనగామ జట్టు ద్వితీ య స్థానంలో నిలిచాయి. కార్యక్రమంలో ఆర్గనైజ ర్లు, క్రీడాకారులతో పాటు సీఐ దామోదర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మెరుగు బాలరాజ్, మాజీ కౌన్సిలర్ మేడ శ్రీనివాస్, నాయకులు చెంచారపు కరుణాకర్ రెడ్డి, కడారు ప్రవీణ్కుమార్, విజయ్, మల్లారెడ్డి, ప్రకాశ్ యాదవ్ పాల్గొన్నారు. -
ఉలిక్కి పడిన రైతులు
ధాన్యం కొనుగోలు కేంద్రం సమీపంలో పిడుగుపాటు బచ్చన్నపేట/జనగామ : ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం కురుస్తోంది.. ధాన్యం ఆరబోసిన రైతులంతా కొనుగోలు కేంద్రం సమీపాన చెట్టు కింద ఏర్పాటు చేసిన పందిరి కిందకు చేరారు. కొద్ది దూరంలో ఒక్కసారిగా పిడుగు పడింది. ఆ ధాటికి కూర్చున్న స్థలం నుంచి ఎగిరి పక్కకు పడ్డారు. 12 మందికి గాయాలు కాగా.. అందులో ఎనిమిది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యా రు. బచ్చన్నపేట మండలం అలింపూర్ గ్రామ చివరన ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో జిల్లాలోని రైతులందరూ ఉలిక్కిపడ్డారు. కొనుగోలు కేంద్రానికి 20 మీటర్ల దూరంలో హైటెన్షన్ వైరు ఉంది. పిడుగు పాటుకు మెరుపులు వచ్చాయి. అదే సమయంలో వర్షం పడుతోంది. ఈ క్రమంలో విద్యుత్ షాక్ వచ్చి ఈ ప్రమాదం జరిగి ఉంటుంద ని గ్రామస్తులు అంటున్నారు. పిడుగు పడిన సమయంలో కొనుగోలు కేంద్రం వద్ద దాదాపు 200 మంది ఉన్నట్లు సమాచారం. ఎనిమిది మందికి తీవ్ర అస్వస్థత పిడుగు పాటు ఘటనలో గాయపడ్డ వారిలో ఎనిమి ది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులో గ్రామానికి చెందిన దండ్యాల మల్లారెడ్డి, గంట పద్మ, వంగపల్లి సుశాంత్రెడ్డి, వంగపల్లి మల్లారెడ్డి, పాకాల మల్లయ్య, బీరెడ్డి జనార్ధన్రెడ్డి, బీరెడ్డి భారతమ్మ, పారుపల్లి నందిని ఉన్నారు. వారు జనగామ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అపస్మారక స్థితికి చేరిన వంగపల్లి సుశాంత్, పారుపల్లి నందినికి ఆస్పత్రి వైద్యులు సీపీఆర్ చేయడంతో ప్రాణాపాయం తప్పింది. పిడుగు ధాటికి గాయపడిన వారిలో ఒక్కొక్కరూ ఒక్కో రకమైన ఇబ్బందులతో బాధపడుతున్నారు. అవయవాలు పని చేయక కొందరు, మరికొందరు మాట్లాడలేక పోతున్నారు. నరాల జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుందని వారి కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఆస్పత్రి క్షతగాత్రుల బంధువులు, కుటుంబ సభ్యులతో కిక్కిరిసి పోయింది. సెంటర్ల వద్ద భద్రతపై ఆందోళన.. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పిడుగు పాటు సంఘటనలు గతంలో ఎన్నడూ జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చోటు చేసుకున్న పిడుగు పాటు జిల్లా యంత్రాంగంతో పాటు రైతుల కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ క్రమంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద భద్రతపై చర్చ మొదలైంది. చెట్ల కింద చలువ పందిరి వేయడం.. ధాన్యం ఆరబోసుకునే స్థలం పక్కనే విద్యుత్ హైటెన్షన్ తీగలు, కొన్ని చోట్ల కొబ్బరి, తాటిచెట్లు ఉండడంతో పిడుగు పాటుకు గురయ్యే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు, అకాల వర్షాలు సంభవించిన సమయంలో రైతులకు అవగాహన కల్పించి, రక్షిత ప్రదేశానికి పంపించేలా సెంటర్ల నిర్వాహకులకు అవగాహన కల్పించాల్సి ఉంది. 12 మందికి గాయాలు.. వీరిలో 8 మందికి తీవ్ర అస్వస్థత ఆస్పత్రికి తరలింపు.. చికిత్స పొందుతున్న క్షతగాత్రులు అలీంపూర్ ఘటనతో తెరపైకి రైతుల భద్రత అంశం అకాల వర్షాలు, వడగళ్లు కురిస్తే షెల్టర్లు ఎక్కడ? -
ధాన్యం తెచ్చి 12రోజులైంది..
మూడు ఎకరాల్లో వరి సాగు చేయగా.. 150 బస్తాల దిగుబడి మాత్రమే వచ్చింది. ఇంతకు ముందు సీజన్లలో 250 బస్తాల వరకు వచ్చింది. వడ్లు అమ్మడానికి 12 రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి వచ్చిన. తేమ ఉందని తీసుకోలేదు. ఆరబోసి ఎదురు చూస్తున్నాను. – ముదావత్ హర్య, అల్యతండా(అబ్దుల్నాగారం) సెంటర్లపై నిత్యం పర్యవేక్షణ జిల్లాలోని ధాన్యం కొనుగోలు సెంటర్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. అకాల వర్షాల నేపథ్యంలో టార్పాలిన్ కవర్లను అవసరం మేరకు అందుబాటులో ఉంచాం. సంబంధిత శాఖల ఉన్నతాధికా రులు పర్యటిస్తూ కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడడంతో పాటు రైతులకు సౌకర్యాల కల్పనపై దృష్టి సారించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంట నే డబ్బు చెల్లింపులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. – రోహిత్సింగ్, అదనపు కలెక్టర్(రెవెన్యూ) -
కుటుంబ సమస్యలు కులపెద్దలే పరిష్కరించాలి
జాతీయ గీతాలాపనలో రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్, న్యాయమూర్తులు వీబీ నిర్మలా గీతాంబ, సీహెచ్.రమేశ్ బాబు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆయా జిల్లాల న్యాయ సేవా సంస్థలు గుర్తించిన కమ్యూనిటీ మీడియేటర్ల మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం హనుమకొండలోని డీసీసీ బ్యాంక్ ఆడిటోరియంలో నిర్వహించారు. రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ మాట్లాడుతూ కుటుంబ సమస్యలను కులపెద్దలే పరిష్కరించాలన్నారు. – వరంగల్ లీగల్– వివరాలు IIలోu -
నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్లు
సామాన్య ప్రజల కోసమే ‘భూ భారతి’ చట్టం ● రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ● భూ భారతి పైలట్ మండలం వెంకటాపురం (ఎం)లో రెవెన్యూ సదస్సు ● హాజరైన మంత్రులు ధనసరి సీతక్క, కొండా సురేఖ తదితరులువెంకటాపురం(ఎం)/ములుగు: అర్హులైన పేదలందరికీ పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, ఈ నెలాఖరులోగా ప్రతీ గ్రామంలో ప్రారంభిస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూ భారతి పైలట్ మండలంగా ఎంపిక చేసిన ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన రెవెన్యూ సదస్సుకు మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖలతో కలిసి ఆయన హాజరయ్యారు. పలువురు రైతులనుంచి దరఖాస్తులు స్వీకరించి రశీదులు అందజేశారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ పేరు వింటేనే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. జిల్లాలో గిరిజనులు, గిరిజనేతరులు ఉన్నారని, ఈ ప్రాంత సమస్యలపై ప్రత్యేక కమిటీ వేసి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని చెప్పారు. రైతుల వద్దకే వెళ్లి అధికారులు భూ సమస్యలు పరిష్కరిస్తారని పేర్కొన్నారు. రైతును రాజు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ : మంత్రి కొండా సురేఖ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిరంతరం రైతుల గురించి ఆలోచించి రైతును రాజుగా చేశారని మంత్రి కొండా సురేఖ అన్నారు. సీఎం రేవంత్రెడ్డి రైతులకు న్యాయం చేసేందుకే భూభారతి చట్టాన్ని తీసుకు వచ్చారని చెప్పారు. రైతులను ఇబ్బందులు పెట్టకుండా అధికారులు సేవలందించాలని, తప్పు చేసే వారిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. భూమికి రైతుకు ఉన్న బంధమే తల్లీబిడ్డ సంబంధం: మంత్రి ధనసరి సీతక్క తల్లీబిడ్డకు ఎలాంటి సంబంధం ఉంటుందో భూమికి రైతుకు అలాంటి బంధం ఉంటుందని, గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చి రైతుల ఆత్మహత్యలకు కారణమైందని మంత్రి సీతక్క అన్నారు. నేడు రైతుల సమస్యలను పరిష్కరించడానికి సీఎం రేవంత్రెడ్డి భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చారని చెప్పారు. కార్యక్రమంలో మహబూబాబా ద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, కేఆర్.నాగరాజు, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, కలెక్టర్ దివాక ర టీఎస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ఆర్డీఓ వెంకటేష్, తహసీల్దార్ గిరిబాబు, ఎంపీడీఓ రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఓపెన్ స్కూల్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ఈనెల 20 నుంచి నిర్వహించనున్నారు. అందుకు హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆరు జిల్లాల్లో మొత్తం టెన్త్ విద్యార్థులు 2,679 మంది, ఇంటర్మీడియట్ పరీక్షలకు 4,707 మంది పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 34 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 34 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 35 మంది డిపార్టుమెంటల్ ఆఫీసర్లను నియమించారు. 9 ఫ్లయింగ్ స్క్వాడ్ల బృందాలు, 35 సిట్టింగ్ స్కా్వ్డ్ల బృందాలను ఏర్పాటు చేశారు. 418 మంది ఇన్విజిలేటర్లుగా విధులను నిర్వర్తించనున్నారు. టెన్త్, ఇంటర్ విద్యార్ధులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ప్రత్యేక సబ్జెక్టులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు పూటలా పరీక్షలు నిర్వహిస్తారు. ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హనుమకొండ డీఈఓ వాసంతి, ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కో–ఆర్డినేటర్ అనగొని సదానందం శుక్రవారం తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 80084 03631, 93460 20003 సంప్రదించాలని వారు సూచించారు. ఉమ్మడి జిల్లాలో టెన్త్లో 2,679 మంది ఇంటర్లో 4,707 మంది విద్యార్థులు -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
జనగామ: ప్రభుత్వ పథకాల అమలుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం నుంచి ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, తాగునీటి సరఫరా, ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ, పింఛన్లు, కుక్కకాటు నివారణ తదితర అంశాలపై స్పెషల్ డిప్యూ టీ కలెక్టర్లు, ఆర్డీఓలు, మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, పంచా యతీ కార్యదర్శులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి కేటాయించిన 3,500 ఇంది రమ్మ ఇళ్ల కోసం అర్హులను మాత్రమే ఎంపిక చేయాలన్నారు. మండల, మున్సిపాలిటీ స్థాయిలో ఇందిరమ్మ, వార్డు కమిటీల ద్వారా ఈనెల 18 నుంచి 21 వరకు ఎంపీడీఓలకు వచ్చే జాబితా ప్రకారంగా లబ్ధిదారులను గుర్తించాలని చెప్పారు. 22 నుంచి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ నిబంధనల మేరకు సర్వేచేసి అర్హులను ఎంపిక చేయాలని సూచించా రు. మే 2న జీపీ కార్యాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శించడంతోపాటు మే 3 నుంచి 5 వరకు లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశాక అర్హులకు ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎంపీడీఓలు మండల స్థాయిలో బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించాలన్నారు. పెండింగ్లో ఉన్న శాశ్వత వలస పింఛన్లు, మరణించిన పింఛన్దారుల పరిశీలన వేగంగా చేపట్టాలని తెలిపారు. తాగునీటి వనరులు లేని గ్రామాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ఎల్ఆర్ఎస్ పథకం కింద వచ్చిన దరఖాస్తుదారుల భూముల పరిశీలన వేగంగా చేపట్టాలని, అభ్యంతరాలు లేని వాటికి ప్రొసీడింగ్స్ జారీ చేయాలని ఆదేశించారు. వీధి కుక్కల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సమీక్షలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్నాయక్, ఆర్డీఓలు గోపిరాం, వెంకన్న, మున్సిపల్ కమిషనర్లు వెంకటేశ్వర్లు, రవీందర్, డీపీఓ స్వరూపరాణి, డిప్యూటీ సీఈఓ సరిత, ఎల్డీఎం శ్రీధర్, ఈడీ ఎస్పీ కార్పొరేషన్ మాధవిలత, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్ తదితరులు పాల్గొన్నారు. మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి.. మహనీయులు డాక్టర్ బీఆర్.అంబేడ్కర్, బాబు జగ్జీవన్రామ్, జ్యోతిబాపూలే ఆశయాలను స్ఫూర్తి గా తీసుకుని ముందుకు సాగాలని కలెక్టర్ రిజ్వానా బాషా అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో మహనీయుల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యాన పార్నంది వెంకటస్వామి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షుడు మేడ శ్రీనివాస్, పలు శాఖల అధికారులు డాక్టర్ విక్రమ్ కుమార్, మాధవిలత, రవీందర్, వెంకటేశ్వర్లు, పులి శేఖర్, డాక్టర్లు సీహెచ్.రాజమౌళి, సుగుణాకర్రాజు తదితరులు పాల్గొన్నారు. ‘కుంట’ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి జిల్లా కేంద్రం సూర్యాపేట రోడ్డులోని బతుకమ్మకుంట అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం బతుకమ్మ కుంటను సందర్శించిన కలెక్టర్ మాట్లాడుతూ.. బతుకమ్మకుంటను మరింత అభివృద్ధి చేయడానికి రూ.కోటి 50 లక్షలు మంజూరయ్యాయని, సుందరీకరణ నేపథ్యంలో గ్రిల్స్, కాలిబాట, లైటింగ్, వ్యాయామ పరికరాలు, చిన్నారులకు ఆటస్థలం, పరికరాలు, మినీ పార్కు పనులు నెలరోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే కుంట పూడికతీత పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నీటి పారుదల శాఖ ఈఈ మంగీలాల్, ఏఈ మహిపాల్, పలువురు అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
శిశువు మృతి ఘటనపై విచారణ
పాలకుర్తి టౌన్: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ కి వచ్చిన గర్భిణి కడుపులో శిశువు మృతి చెందిన ఘటనపై కలెక్టర్ ఆదేశాలతో డీఎంహెచ్ఓ మల్లికా ర్జున్రావు గురువారం విచారణ చేపట్టారు. గర్భిణి ఎప్పుడు ఆస్పత్రిలో చేరింది. ఆమెకు చేసిన పరీక్షలు ఏమిటి. ఇచ్చిన మందుల వివరాలతోపాటు ఆ సమయంలో విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది సమా చారం తెలుసుకున్నారు. అలాగే గర్భిణిని జనగామ ఎంసీహెచ్కు ఎందుకు రెఫర్ చేయలేదు.. చేస్తే వారు వెళ్లలేదా.. ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఎవరు సూచించారు.. బాధిత కుటుంబ సభ్యులు వెల్లడించిన అంశాలపై విచారణ చేపట్టారు. అలాగే ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విచారణలో అడిషనల్ డీఎంహెచ్ ఓ రవీందర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సుధీర్, డాక్టర్ సిద్ధార్ధరెడ్డి పాల్గొన్నారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణం పలు కోణాల్లో విచారణ చేపట్టిన డీఎంహెచ్ఓ ఈ ఘటనకు వైద్యులతో పాటు ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తేల్చారు. బాధ్యులైన గైనకాలజి స్ట్ డాక్టర్ కె.అపర్ణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజులుగా విధులకు రాకుండా పర్యవేక్షణ లోపానికి కారణమైన సూపరింటెండెంట్ డాక్టర్ పరమేశ్వరిని సస్పెండ్ చేయడానికి కమిషనర్ వైద్య విధాన పరిషత్కు రెకమండ్ చేశా రు. అలాగే ఆస్పత్రికి వచ్చిన గర్భిణి అర్చన విషయంలో అమర్యాదగా వ్యవహరించిన స్టాఫ్నర్సు జె.నీల, ఎంపీహెచ్ఏ కృష్ణవేణిలకు మెమో జారీ చేశారు. కొద్దిరొజులుగా విధులకు గైరాజరవుతున్న జీడీఎంఓ భరత్ను విధుల నుంచి తొలగించారు. గర్భిణిని సకాలంలో ఉన్నత ఆస్పత్రికి రెఫర్ చేయడంలో నిర్లక్ష్యం వహించి డాక్టర్ స్వప్నకు సైతం మెమో జారీ చేశారు. ఇద్దరు వైద్యుల సస్పెన్షన్ పలువురికి మెమోలు జారీ -
‘భూ భారతి’తో రైతులకు న్యాయం
చిల్పూరు: భూ సమస్యల పరిష్కారానికే కాంగ్రెస్ ప్రభుత్వం ‘భూ భారతి’ చట్టాన్ని తెచ్చింది.. దీని ద్వారా రైతులకు సరైన న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండల కేంద్రంలో గురువారం ఆర్డీఓ వెంకన్న అధ్యక్షతన భూ భారతి ఆర్ఓఆర్–2025 చట్టంపై కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ ఆధ్వర్యాన నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మా ట్లాడారు. గత ప్రభత్వం తెచ్చిన ధరణిలో చాలా పొరపాట్లు జరిగాయని, అర్హులైన రైతులు నష్టపోగా పాలకులు వేల ఎకరాల భూమిని కబ్జా చేశారని అన్నారు. ధరణి ద్వారా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారిని గుర్తించి క్రిమినల్ కేసులు పెట్టాలని అన్నారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా మార్చాల నే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. అధికారులు గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పించడంతోపాటు ఈ చట్టంతో కలిగే ప్రయోజ నాలను వివరించాలన్నారు. ఈ సదస్సులో తహసీల్దార్ సరస్వతి, ఆర్ఐ చీకటి వినీత్, చిల్పూరు ఆలయ మైర్మన్ శ్రీధర్రావు, వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ లావణ్య, ఎంపీఓ మధుసూదన్, వ్యవసాయాధికారి నజీరుద్ధీన్, మాధవీలత తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం రఘునాథపల్లి: మండల పరిధిలోని లక్ష్మీతండా, ఇబ్రహీంపూర్లో ఐకేపీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు ఫతేషాపూర్ నుంచి రామచంద్రగూడెం వరకు నిర్మించిన బీటీ రోడ్డును, ఇబ్రహీంపూర్లో పునరుద్ధరించిన మహిళా సంఘం భవనాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్యాదవ్, మాజీ జెడ్పీటీసీ లింగాల జగదీష్చందర్రెడ్డి, ఆర్డీఓ గోపిరాం, తహసీల్దార్ ఎండీ.మోహ్సి న్ముజ్తబ, ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు, అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్, ఏఓ శ్రీనివాస్రెడ్డి, ఏపీఎం సారయ్య, కోళ్ల రవిగౌడ్, నామాల బుచ్చయ్య, మల్కపురం లక్ష్మయ్య, మాలోతు నర్సింహ, పయ్యావుల కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
కారు కిరాయి.. ఇంధనం పరాయి
సాక్షిప్రతినిధి, వరంగల్: పరకాలలోని హుజూరాబాద్ రోడ్డున ఉన్న ఓ పెట్రోల్ బంకుకు గత నెల 25న స్కైబ్లూ కలర్ కియా కారులో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చా రు. క్యాన్లలో రూ.7,500 (78.67 లీటర్ల) డీజిల్ పోయించుకున్నారు. డబ్బులు ఇమ్మని అడగ్గా ఫోన్ పే చేస్తామని స్కాన్ చేశారు. డబ్బులు రాలేదని చెప్పగా.. వస్తాయని చెప్పి కారులో ఉడాయించారు. దీంతో పెట్రోల్ బంక్ మేనేజర్ ఈనెల 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయపర్తిలో హెచ్పీ పెట్రోల్ బంకులోకి గత నెల 31న రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో బ్లూ కలర్ బెలోనో కారు వెళ్లింది. అందులోని ముగ్గురు వ్యక్తులు మూడు క్యాన్లలో రూ.10,508 విలువైన 110.22 లీటర్ల డీజిల్ పోయించుకున్నా రు. స్కానర్ ద్వారా పేమెంట్ చేసినట్లు చెప్పారు. డబ్బులు జమ కాలేదని చెప్పినా వినకుండా కారు స్టార్ట్ చేసుకుని వెళ్లారు. దీంతో ఆ బంకు క్యాషియర్ ఈ నెల 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ... ఇలా సుమారు 25 రోజుల్లో సుమారు 25 బంకుల్లో డీజిల్, పెట్రోల్ దొంగిలించిన ఆకతా యి ల వ్యవహారం వరంగల్ కమిషనరేట్ పోలీసులకు సవాల్గా మారింది. గత కొద్ది రోజులుగా ఆకతాయిలు కొందరు సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలను అద్దెకు తీసుకుని కారుతోపాటు క్యాన్లలో ఇంధనం తీసుకెళ్లి అమ్ముకుంటూ.. ఆ డబ్బుతో జల్సా చేయ డం పరిపాటిగా మారింది. అత్యధికంగా పరకాల, దామెర, నడికూడ, రాయపర్తి, జఫర్గఢ్, రేగొండ, నల్లబెల్లి మండలాల్లోని బంకుల్లో ఈ తరహా దందా లకు పాల్పడినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసిన పరకాల, రాయపర్తి పోలీసులు నిందితుల కోసం ఆరా తీయగా.. ఇంధనం దొంగ ల గుట్టురట్టయ్యింది. కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. సుమారు 12 మంది వరకు పనీపాట లేని యువకులు మూడు టీములుగా ఏర్పడి ‘సెల్ఫ్ డ్రైవింగ్’ వాహనాలకు అద్దెకు తీసుకుని ఆ వాహనాల నంబర్ ప్లేట్లు తీసి పెట్రోల్ బంకుల్లో వెళ్లి ఇంధనం దొంగిలిస్తూ జల్సాలు చేస్తుండగా పోలీసులు వారి ఆట కట్టించినట్లు సమాచారం. మూడు టీములకు చెంది న సభ్యులను అరెస్టు చేసేందుకు సిద్ధమైన పోలీసులు అదుపులో ఉన్నవారినుంచి పూర్తి వివరాలు రాబడుతున్నట్లు సమాచారం. కాగా నేడో, రేపో నిందితులను అరెస్టు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్కాన్ చేసినట్లు యాక్షన్.. ఇంధనం క్యాన్లతో పరార్ పెట్రోల్ బంకులకు బురిడీ కొట్టించి జల్సా మూడు బృందాలుగా ఆగడాలు.. పోలీసుల అదుపులో ఆకతాయిలు -
నేడు ‘డయల్ యువర్ డీఎం’
హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పి.అర్పిత ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నా రు. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, పాలకుర్తి, తరిగొప్పుల రూట్ ప్రయాణికులు 99592 26047 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు వివరించడంతోపాటు, సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి లింగాలఘణపురం: దేవాలయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆ శాఖ నల్గొండ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కె.భాస్కర్ అన్నా రు. గురువారం జీడికల్ వీరాచల శ్రీరామచంద్రస్వామి ఆలయంలో జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన దేవాలయాల ఈఓలతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలయాల పేర్లతో ఉన్న భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాల ని, నిర్వహణ సక్రమంగా చేపట్టాలని ఆదేశించా రు. ఈఓలు లక్ష్మీప్రసన్న, వంశీ పాల్గొన్నారు. నేడు మార్కెట్కు సెలవు జనగామ: గుడ్ ఫ్రైడే సందర్భంగా జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు నేడు(శుక్రవారం) సెలవు ప్రకటించినట్లు చైర్మన్ బనుక శివరాజ్యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి మార్కెట్కు తీసుకురావొద్దని సూచించారు. 19న మార్కెట్ సేవలు కొనసాగుతాయని తెలిపారు. 24న ఉచిత విద్య టాలెంట్ టెస్ట్ జనగామ రూరల్: నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య లక్ష్యంతో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యాన ఈనెల 24న జిల్లా కేంద్రంలో టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్రావు, వెంకటేష్ తెలి పారు. గురువారం పట్టణంలో వారు మాట్లాడు తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతిభా వంతులైన గ్రామీణ పేద విద్యార్థులకు ప్రవేశ పరీక్ష ద్వారా ఉచిత విద్య అందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 4,5,6 తరగతులు చదివే వారికి అర్హత పరీక్ష ద్వారా 5,6,7 తరగతుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉందన్నారు. డిగ్రీ, ఆపై విద్య వరకు ఉచిత హాస్టల్ ప్రవేశంతో కూడిన విద్య అందించనున్నట్లు వివరించారు. పౌష్టికాహారంతోనే ఆరోగ్యం రఘునాథపల్లి: పౌష్టికాహారంతోనే ఆరోగ్యంగా ఉంటామని డీడబ్ల్యూఓ ఫ్ల్లోరెన్స్ అన్నారు. గురువారం నిడిగొండ అంగన్వాడీ కేంద్రంలో నిర్వ హించిన పోషణ పక్షం కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పుట్టిన బిడ్డకు వెంటనే ముర్రు పాలు తాగిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంద ని, ఆరునెలల వరకు తల్లిపాలు ఇవ్వాలని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అంది స్తున్న పోషకాహారాన్ని గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆంగన్వాడీ టీచర్లు సీహెచ్.జయలక్ష్మి, వీరలక్ష్మి, అంజనీబాయి, శోభ పాల్గొన్నారు. అలాగే శ్రీమన్నారాయణపురం, భాంజీపేట అంగన్వా డీ కేంద్రాల్లో పోషణ పక్షంలో భాగంగా ఆకలి పరీక్ష నిర్వహించారు. -
శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
నీడ లేక రోడ్డు పక్కన కల్వర్టుపై ప్రయాణికులు కొడకండ్ల: మొండ్రాయి క్రాస్రోడ్(చింతల్ బస్స్టాప్) సమీపంలో బస్షెల్టర్ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. లక్ష్మక్కపల్లి, రామన్నగూడెం, బోడోనికుంట, పెద్దబాయి, మొండ్రాయి పరిసర తండాలకు చెందిన ప్రయాణికులు నిత్యం మండల కేంద్రంతో పాటు జనగామ, తిరుమలగిరి, పాలకుర్తి తదితర ప్రాంతాలకు వెళ్తుంటారు. బస్షెల్టర్ లేక చెట్ల కింద సేద దీరాల్సిన దుస్థితి. సంవత్సరాల తరబడి సమస్య ఉన్నా పట్టించుకున్న వారే లేరు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. నలుగురు కూర్చుంటే నిండి పోతుందిన్యూస్రీల్చెట్లకింద సేదదీరాల్సిందే.. -
గురువారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
జనగామ: భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. అప్పుడే ఎండలు మే నెలను తలపిస్తున్నాయి. ఉదయం 8 గంటలు దాటిందంటే ఒంట్లో నుంచి చెమటలు ఉబికి వస్తున్నాయి. రోజువారీ కూలీ పనులకు వెళ్లే కార్మికులు, చిరు వ్యాపారులు తల్లడిల్లి పోతున్నారు. ఇక ఇళ్లలో ఉండే ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు ఉక్కపోత, వేడి గాలుల కారణంగా డీ హైడ్రేషన్కు గురవుతున్నారు. ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వినియోగిస్తున్నా వేడి గాలి తప్ప ఉపశమనం లభించడంలేదు. ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరుగుతుండడంతో పరిస్థితులు ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో బుధవారం ఉదయం 11.30 గంటలకు 32 డిగ్రీల సెల్సీఎస్ టెంపరేచర్ నమోదు కాగా.. మధ్యాహ్నం 3 గంటల వరకు 40 డిగ్రీలు దాటి పోయింది. అధిక వేడితో జనం అల్లాడి పోయారు. జిల్లాలో ఒక శాతం మాత్రమే అటవీ సంపద ఉండ డం.. ఉన్న పచ్చదనం కాస్త కనుమరుగైపోతున్న నేపథ్యంలో ప్రజలు నీడపట్టున ఉపశ మనం పొందలేని పరిస్థితి నెలకొంది. రోడ్ల విస్తరణ పేరుతో దశాబ్దాల నాటి మహావృక్షాలను తొలగించడం.. కొత్తగా నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతను గాలికి వదిలేయడంతో వాతావరణ అసమతుల్యత కు కారణమవుతోంది. వాతావరణంలో విచిత్ర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంట ల వరకు ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్న తరుణంలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు, వడగళ్లు కురిసి ఒక్కసారి గా వాతావరణం చల్లబ డుతోంది. రాత్రి తేమగా ఉంటూ.. తెల్లారే సరికి అగ్నిగుండంలా మారిపోతోంది. గంటల వ్యవధిలోనే వాతావరణంలో మార్పుల చోటుచేసు కోవడం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి యువకులు, విద్యార్థులు బావులు, ఈత కొలనుల్లో సేద దీరుతున్నారు. కొందరు శీతల పానీయాలు, కొబ్బరి బొండాలతో కాస్త చల్లబడుతున్నారు. ● పొద్దంతా ఎండవేడితో మంట ● సాయంకాలం ఈదురు గాలులు ● ప్రజలకు చెమటలు.. అన్నదాతలకు ముచ్చెమటలు ● విచిత్ర వాతావరణంతో పెరుగుతున్న అనారోగ్య బాధితులుపొద్దంతా ఎండ మంట.. -
ఉపాధి హామీ పనుల పరిశీలన
జనగామ రూరల్: శామీర్పేట గ్రామంలో ఉపాధి హామీ పనులను జిల్లా అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి చంద్రశేఖర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఉపాధి హామీ కూలీల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే కూలి రూ.307 వచ్చే విధంగా కొలతల ప్రకారం పనిచేయాలని, ఇందుకు సంబంధిత అధికారులు, ఎఫ్ఏలు కృషి చేయాలని చెప్పా రు. కార్యక్రమంలో ఎంపీడీఓ సంపత్ కుమార్, ఈసీ మాధవరెడ్డి, టీఏ అనిల్గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ రాములు పాల్గొన్నారు. దేవాలయ భూమికి హద్దులుచిల్పూరు: శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి దేవాలయానికి సంబంధించిన భూమిని ఇటీవ ల రెండుమార్లు సర్వే చేసిన అనంతరం బుధవారం దేవాదాయ శాఖ ఏడీ మన్నెంకొండ ఆధ్వర్యాన సిబ్బంది హద్దులు నాటారు. ఆలయానికి 229 ఎకరాల భూమి ఉండగా అందులో కొంత అన్యాక్రాంతమైనట్లు తెలియగా సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేసినట్లు ఏడీ చెప్పారు. తహసీల్దార్ సరస్వతి, ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్ శ్రీధర్రావు, ధర్మకర్తలు గనగోని రమేష్, కొలిపాక రాజు, వెంకటేశ్వర్లు, మోతె మహేష్, భూక్య శ్రీను పాల్గొన్నారు. కోళ్ల గూడులో బాలికదేవరుప్పుల: కామారెడ్డికి చెందిన మహమ్మద్ యూసఫ్ పాషా కూతురు మెహరిన్(నాలుగేళ్ల వయసు) ఇంటి వద్ద బుధవారం తప్పిపోయింది. బాధిత కుటుంబ సభ్యులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా స్పందించిన ఎస్సై సృజన్కుమార్ సిబ్బందిని పంపించారు. చుట్టుపక్కల వెతుకుతుండగా పరిసరాల్లోని మరో ఇంటిలో ని కోళ్ల గూడులో మెహరిన్ కనిపించింది. వెంట నే బాలికను ఇంటి వద్దకు తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలిక ఆచూకీ సత్వరమే కనుగొన్న హెడ్ కానిస్టేబుల్ సదయ్య, కానిస్టేబుళ్లు యాకూబ్, అశోక్, యాకేష్, గౌస్ పాషాను స్థానికులు అభినందించారు. నియామక ఇంటర్వ్యూలు కేయూ క్యాంపస్: కేయూ పరిధి దూరవిద్యాకేంద్రంలో డిప్లొమా ఇన్ యోగా కోర్సు బోధనకు బుధవారం కౌన్సెలర్ల నియామకానికి ఇంట ర్వ్యూలు నిర్వహించారు. దూర విద్య డైరెక్టర్ బి.సురేష్లాల్, విద్యావిభాగం డీన్ ఎన్.రాంనాఽథ్కిషన్, బీఓఎస్, వరంగల్ నిట్ ఫిజికల్ డైరెక్టర్ రవికుమార్ పాల్గొన్నారు. 9 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. -
వైద్య సేవలను వినియోగించుకోవాలి
● జిల్లా వ్యవసాయ అధికారి రామారావునాయక్బచ్చన్నపేట : గ్రామీణ ప్రాంత ఆస్పత్రుల్లో ఉచితంగా అందించే వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవా లని జిల్లా వ్యవసాయ అధికారి రామారావునాయక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని జీపీ కార్యాలయంలో మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యాన నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో ఆయన మాట్లాడారు. ఉచిత వైద్య శిబిరాలు పేదలకు వరం లాంటివని, వృద్ధులు, చేతకాని వారు కూడా దూర ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రులకు వెళ్లకుండా అందుబాటులో ఉన్న శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటమల్లికార్జున్, పంచాయతీ కార్యదర్శి నర్సింహచారి, నాయకులు నల్లగోని బాలకిషన్గౌడ్, గుర్రపు బాల్రాజు, అల్వాల రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
● ఎన్పీడీసీఎల్ డీఈ రాంబాబు స్టేషన్ఘన్పూర్: విధుల నిర్వహణలో విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎన్పీడీసీఎల్ స్టేషన్ఘన్పూర్ డీఈ వై.రాంబాబు అన్నారు. స్థానిక సబ్స్టేషన్లో విద్యుత్ సిబ్బంది చేపట్టిన పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ లైన్లో పనిచేస్తున్న సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, లైన్ క్లియర్ తీసుకున్నప్పటికీ ఎర్త్ కట్టెలు వాడాలని చెప్పారు. ప్రస్తుత సీజన్లో విద్యుత్ లైన్లు తెగి ఇతర లైన్లపై పడి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని, అప్రమత్తతే విద్యుత్ సిబ్బందికి శ్రీరామరక్ష అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించాలి●● డీపీఓ స్వరూపరాణి తరిగొప్పుల: ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా పంచాయతీ అధికారి నాగపురి స్వరూపరాణి అన్నారు. అంకుషాపూర్ గ్రామపంచాయతీని ఆమె బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డుల నిర్వహణ, పన్నుల వసూలు, ఎస్టీఓలో నిధుల జమ తదితరాల విషయాలపై పంచాయతీ కార్యదర్శి అమనగంటి మహేందర్కు సూచనలు చేశారు. అనంతరం అంగన్వాడీ సెంటర్లో కొనసాగుతున్న పోషణ పక్షం కార్యక్రమంలో పాల్గొని మాతా శిశు సంరక్షణపై అవగాహన కల్పించారు. బలవర్థకమైన ఆహారం తీసుకునేలా జాగ్రత్తలు పాటించాలని, పచ్చదనం, పరిశుభ్రతపై ప్రత్యేక చొరవ చూపించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ మాలతి, అంగన్వాడీ టీచర్ రాధ పాల్గొన్నారు. తాగునీటి ఎద్దడి రానివ్వద్దు నర్మెట: తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి నాగపురి స్వరూపారాణి అన్నారు. నర్మెట జీపీని సందర్శించిన ఆమె రికార్డులను పరిశీలించి కార్యదర్శి కందకట్ల శ్రీధర్కు పలు సూచనలు చేశారు. పన్నులు వంద శాతం వసూలు చేయడంతో పాటు పారిశద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, తాగునీటి ట్యాంకులను క్లోరినేషన్ చేయించాలని సూచించారు. అనంతరం చౌరస్తాలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఆమె వెంట ఎంపీడీఓ బోడపాటి అరవింద్ చౌదరి, తరిగొప్పుల ఎంపీఓ ఎం.మాలతి, కార్యదర్శులు వంశి, యాకూబ్, గణేష్, అనిల్, శ్రీకాంత్, లింగం తదితరులు పాల్గొన్నారు.