ఉగ్రదాడులు అమానుషం | - | Sakshi
Sakshi News home page

ఉగ్రదాడులు అమానుషం

Published Sun, Apr 27 2025 1:30 AM | Last Updated on Sun, Apr 27 2025 1:30 AM

ఉగ్రదాడులు అమానుషం

ఉగ్రదాడులు అమానుషం

జనగామ రూరల్‌: పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి జనగామ కవులు, కళాకారులు నివాళులర్పించారు. ఐక్యవేదిక ఆధ్వర్యాన శనివా రం పట్టణం పరిధి అంబేడ్కర్‌ నగర్‌లోని అంబేడ్క ర్‌ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. పర్యాటకులపై ఉగ్రదాడులు అమానుష చర్య అని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవా లని కోరారు. ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులు జి.కృష్ణ, పానుగంటి రామమూర్తి, అయిలా సొమనర్సింహాచారి, అంబాల శివనాథ్‌గౌడ్‌, గొలుసుల నర్సయ్య, పెట్లోజు సోమేశ్వరాచారి, నక్క సురేష్‌, గడ్డం మనోజ్‌కుమార్‌, రమేశ్‌, మల్యాల జనార్ధనాచారి, చిలుమోజు సాయికిరణ్‌, రంగరాజు ప్రసాద్‌, రామచంద్రం, డాక్టర్‌ ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement