
ఎల్ఆర్ఎస్ @ రూ.6.8కోట్లు
జనగామ: లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్) రాయితీని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 30వ తేదీ వరకు 25 శాతం రాయితీతో ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు మరో అవకాశం కల్పించింది. జిల్లాలోని జనగా మ, స్టేషన్ఘన్పూర్ పురపాలికలతో పాటు 12 గ్రామపంచా యతీల పరిధిలో 69,710 మంది 2020లో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు 11,144 మంది ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించగా, ఇంకా 54,403 మంది చెల్లించాల్సి ఉంది. ఇందులో 681 మందికి ప్రొసీడింగ్ కాపీలు అందించగా.. ఇప్పటి వరకు పురపాలిక, గ్రామ పంచాయతీల నుంచి రూ.6,80,80,000 ఫీజుల రూపంలో వచ్చాయి. గత నెల 31వ తేదీ వరకు 25 శాతం రాయితీతో ఎల్ఆర్ఎస్కు అవకాశం ఇవ్వగా.. రెండు రోజుల క్రితమే గడువు ముగిసింది. దరఖాస్తులు పెద్ద ఎత్తున పెండింగ్లో ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ వంత శాతం లక్ష్యంగా ప్రభుత్వం రాయితీ గడువును పొడిగించడంతో పురపాలిక, పంచాయతీ అధికారులు రంగంలోకి దిగారు. ఇదిలా ఉండగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో పురపాలికల పరిధిలో అసలు ఆస్తి పన్నుపై 5 శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
జీపీ పరిధిలో.. జనగామ ఘన్పూర్
మున్సిపాలిటీ మున్సిపాలిటీ
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు 47,151 18,358 4,201
ఫీజు చెల్లించిన వారు 9,002 1,909 233
ప్రొసీడింగ్స్ పొందినవారు 348 333 000
వచ్చిన ఆదాయం(రూ.) 1,31,80,000 4.97 కోట్లు 58 లక్షలు
ఫీజు చెల్లించిన వారు 11,144 మంది..
వచ్చిన దరఖాస్తులు 69,710
25 శాతం రాయితీ గడువు పెంపు
ఈనెల 30 వరకు అవకాశం