
సకాలంలో వైద్యపరీక్షలు చేయించుకోవాలి
● సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్
జనగామ రూరల్: వృద్ధులు సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. ఈ మేరకు బుధవారం ప్రపంచ ఆరోగ్య దినం పురస్కరించుకుని ఓబుల్ కేశవాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ సంయుక్తంగా కోమటిరెడ్డి సుశీలమ్మ వృద్ధాశ్రమంలో వైద్య, కంటి పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై వైద్యశిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. వృద్ధులు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు మాట్లాడుతూ వృద్ధాప్యంలో కంటిచూపు మందగిస్తుందని, అవసరమైన శస్త్రచికిత్సలు చేసుకుని అద్దాలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రవీందర్, ఆశ్రమ ఇన్చార్జ్ డి.లక్ష్మ ణ్, ఫ్లోరెన్స్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.