సకాలంలో వైద్యపరీక్షలు చేయించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సకాలంలో వైద్యపరీక్షలు చేయించుకోవాలి

Apr 10 2025 1:25 AM | Updated on Apr 10 2025 1:25 AM

సకాలంలో వైద్యపరీక్షలు చేయించుకోవాలి

సకాలంలో వైద్యపరీక్షలు చేయించుకోవాలి

సీనియర్‌ సివిల్‌ జడ్జి సి.విక్రమ్‌

జనగామ రూరల్‌: వృద్ధులు సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి సి.విక్రమ్‌ అన్నారు. ఈ మేరకు బుధవారం ప్రపంచ ఆరోగ్య దినం పురస్కరించుకుని ఓబుల్‌ కేశవాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సెల్‌ సర్వీసెస్‌ అథారిటీ సంయుక్తంగా కోమటిరెడ్డి సుశీలమ్మ వృద్ధాశ్రమంలో వైద్య, కంటి పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై వైద్యశిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. వృద్ధులు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌రావు మాట్లాడుతూ వృద్ధాప్యంలో కంటిచూపు మందగిస్తుందని, అవసరమైన శస్త్రచికిత్సలు చేసుకుని అద్దాలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ రవీందర్‌, ఆశ్రమ ఇన్‌చార్జ్‌ డి.లక్ష్మ ణ్‌, ఫ్లోరెన్స్‌, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Video

View all
Advertisement