
అలరించిన కుస్తీ పోటీలు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని మత్తడి పోచమ్మ ఆలయం వద్ద బుధవారం నిర్వహించిన కుస్తీ పోటీలు హోరాహోరీగా సాగాయి. కొబ్బరికాయ కుస్తీ నుంచి మూడు తులాల వెండి కడెం వరకు పోటీలు నిర్వహించారు. గెలుపొందిన మల్లయోధులకు నగదు బహుమతులు అందజేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓ మహిళ మగవారితో సమానంగా కుస్తీ పోటీల్లో పాల్గొని గెలుపొందడం విశేషం.
కోనాపూర్లో..
బాన్సువాడ రూరల్: మండలంలోని కోనాపూర్ గ్రామంలో బుధవారం ఉగాది ఉత్సవాల్లో భాగంగా కుస్తీపోటీలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన మల్లయోధులు కుస్తీపోటీల్లో తలపడ్డారు. విజేతలకు వీడీసీ సభ్యులు నగదు బహుమతులతోపాటు వెండి కడియాలు బహూకరించారు. పెద్ద సంఖ్యలో కుస్తీ పోటీలను తిలకించడానికి ప్రజలు వచ్చారు.

అలరించిన కుస్తీ పోటీలు