బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద జూనియర్ సివిల్ కోర్టులో జడ్జిని నియమించాలని కోరుతూ బుధవారం బిచ్కుంద బార్ అసోసియేషన్ నాయకులు.. తెలంగాణ హైకోర్టులో కామారెడ్డి పోర్టు ఫోలియో చూసే జడ్జి పుల్లా కార్తీక్ను హైదరాబాద్లో కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం బార్ అధ్యక్షుడు ప్రకాష్ పటేల్ మాట్లాడుతూ.. బిచ్కుంద కోర్టులో మూడేళ్ల క్రితం బదిలీపై వెళ్లిన న్యాయమూర్తి స్థానంలో కొత్తగా న్యాయమూర్తిని నియమించలేదని, కక్షిదారులు, న్యాయవాదులు చాలా అవస్థలు పడాల్సి వస్తుందని విన్నవించినట్లు తెలిపారు. త్వరలో శాశ్వత న్యాయమూర్తిని నియమించాలని జస్టిస్ పుల్లా కార్తీక్ను కోరినట్లు తెలిపారు. న్యాయవాదులు లక్ష్మణ్రావు, మల్లేశ్వర్, శివాజీ, విఠల్, విఠల్రావు, షేక్ మహ్మద్, శంకర్రావు, రాజ్ దేశ్ముఖ్, పురుషోత్తం, శ్రీనివాస్ పాల్గొన్నారు.
గ్రూప్–1 విజేతకు సన్మానం
కామారెడ్డి క్రైం/కామారెడ్డిఅర్బన్: జిల్లా బీసీ సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న కొండపల్లి గాయత్రి ఇటీవల వెలువడిన టీజీపీఎస్సీ గ్రూప్–1 ఫలితాల్లో జిల్లా స్థాయిలో ఉద్యోగం సాధించి సత్తా చాటింది. బుధవారం ఆమెను కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, అధికారులు ఘనంగా సన్మానించారు. డీఈవో రాజు, పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అంబీర్ మనోహర్రావు, జె.లక్ష్మీరాజ్యంలు కూడా ప్రత్యేకంగా ఆమెను అభినందించారు.
మహనీయుడు సర్వాయి పాపన్న
కామారెడ్డి క్రైం: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పోరాటం చేసిన మహనీయుడు సర్వాయి పాపన్న గౌడ్ అని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ విక్టర్, జెడ్పీ సీఈవో చందర్, వివిధ శాఖల అధికారులు, గౌడ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
విద్యార్థులు భావి భారత పౌరులు
ఎల్లారెడ్డిరూరల్: విద్యార్థులు భావి భారత పౌరులని ఆర్డీవో మన్నె ప్రభాకర్ అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలోని జీవదాన్ పాఠశాలలో నిర్వహించిన ఇన్ఫాన్షియా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో సీఎంఐ సంస్థ ద్వారా జీవదాన్ పాఠశాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు మంచి విద్యను అందించడం సంతోషకరమన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సీఐఎం ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ అలెక్స్, కౌన్సిల్ సభ్యులు ఽథామస్, ప్రిన్సిపల్ బాబు, ఏఎంసీ చైర్ పర్సన్ రజిత, తదితరులున్నారు.

జడ్జిని నియమించండి

మహనీయుడు సర్వాయి పాపన్న