వ్యక్తి కిడ్నాప్‌.. హత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి కిడ్నాప్‌.. హత్యాయత్నం

Published Tue, Jun 25 2024 12:10 AM | Last Updated on Tue, Jun 25 2024 12:10 AM

-

గోదావరిఖని: మార్కండేయకాలనీకి చెందిన వెల్ధి రఘురాంను కొందరు ఈనెల 22న సాయంత్రం కిడ్నాప్‌ చేశారు. సమీపంలోని రాజేష్‌ థియేటర్‌ ఎదుట గల ప్రభుత్వ బాలుర జూనియర్‌ కాలేజీ మైదానంలోకి తీసుకెళ్లి దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరురుకున్నారు. ఈలోగా రఘురాం అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అయితే, అతడు చనిపోయాడని భావించిన ఆగంతకులు ద్విచక్ర వాహనాలు అక్కడే వదిలేసి పోలీసులను చూసి పరారయ్యారు. బాధితుడిని గుర్తించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వగా 108వాహనంలో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీసులకు బాధితుడి బంధువు ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తి కిడ్నాప్‌, హత్యాయత్నానికి గల కారణాలు, నిందితుల గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement