జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలో తాళం వేసిఉన్న ఇంట్లో చోరీ జరిగింది. రూ.లక్ష, బంగారం, వెండి ఆభరణలు చోరీకి గురయ్యాయి. టౌన్ సీఐ వరంగంటి రవి వివరాలు.. మున్సిపల్ పరిధిలో కొత్తపల్లిలోని కెనాల్సమీపంలో శ్రీపతి రమేశ్ కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. రెండ్రోజుల క్రితం స్వగ్రామమైన ఓదెల మండలం గుంపులకు కుటుంబంతో సహా వెళ్లారు. సోమవారం ఉదయం తిరిగొచ్చారు. ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో రమేశ్ లోపలికి వెళ్లి చూశాడు. బీరువాలోని రూ.లక్ష నగదు, 5గ్రాముల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు అపహరణకు గురయినట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. టౌన్ సీఐ వి.రవి, కరీంనగర్ క్లూస్టీం ఇంట్లో ఆధారాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment