హుబ్లీ: క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఒకరిని ధార్వాడ టౌన్ పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. గామనగట్టి నివాసి పర్వత ప్రకాష్ శర్మ అరెస్ట్ అయిన నిందితుడు. ఇక్కడి రసూల్పుర వీధిలో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న వేళ సదరు స్టేషన్ ఎస్ఐ ఆర్హెచ్ నదాఫ్ తమ సిబ్బందితో దాడి చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.2080ల నగదుతో పాటు ఓ మొబైల్ను జప్తు చేశారు. ఘటనపై ధార్వాడ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్నారు.
మహిళ అదృశ్యం
హొసపేటె: సుమారు 55 ఏళ్ల వయస్సుగల ఉంకి హులిగమ్మ అనే మహిళ అదృశ్యం కావడంపై హగరిబొమ్మనహళ్లి టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ శరీరాకృతి, 5.2 అడుగుల ఎత్తు కలిగిన మహిళ, నల్లటి కుర్తా, తెల్లటి పూల బొమ్మలతో కూడిన ఆకుపచ్చని చీర, ఎడమ కనుబొమ్మపై పాత మచ్చ కలిగి ఉంది. గత నెల 27న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈమె ఆచూకీ గురించి ఎవరికై నా సమాచారం తెలిస్తే పట్టణ పోలీస్ స్టేషన్కు లేదా 08397–238333, 9480805770 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.
రైల్వే ఉద్యోగులకు
సురక్షత ప్రశస్తుల ప్రదానం
హుబ్లీ: నైరుతి రైల్వే జోన్ జీఎం ముకుల్ శరణ్ మాథుర్ తన విధుల్లో చూపించిన చొరవతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకున్న భద్రతా చర్యలతో రైల్వే కార్యకలాపాల్లో సమర్థవంతంగా భద్రత నిర్వహణ చేసినందుకు గాను 5 మంది ఉద్యోగులకు సురక్షత ప్రశస్తిని ప్రదానం చేశారు. గదగ్ రోడ్డులోని రైలు సౌధలోని జీఎం ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ ఐదుగురిని ఎంపిక చేసిన సన్మానించారు. శివాజీ ఎల్. పవార్, కై లాస్ ప్రసాద్ మీనా, హెచ్ఎస్ మహేష్, జేబీ లోహిత్, అబూ సాలియాలకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ విధి నిర్వహణలో సమయస్ఫూర్తితో తీసుకున్న నిర్ణయాలతో భద్రత, ప్రయాణికుల సురక్షతణకు ప్రాధాన్యం ఇచ్చామని, అదే నైరుతి రైల్వే లక్ష్యం అని అన్నారు.
రైలు ఢీకొని వ్యక్తి మృతి
హొసపేటె: విజయనగర జిల్లా కొట్టూరు తాలూకాలోని హారాళు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రైలు ఢీకొని మరణించిన ఘటన గ్రామ శివార్లలో జరిగింది. హారాళు గ్రామానికి చెందిన భంగి నాగరాజ్ (29) అనే వ్యక్తిని ఉదయం 8.30 గంటలకు రైలు ఢీకొన్నట్లు సమాచారం అందడంతో ఆయన మరణ వార్త విని కుటుంబ దిగ్భ్రాంతికి గురైంది. మరణానికి ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వారం క్రితం అదే గ్రామానికి చెందిన జాద్రి కొట్రప్ప అనే వ్యక్తి రైలు ఢీకొని మరణించాడు. ఒకే వారంలో ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రైలు ఢీకొని మరణించిన ఘటనలపై రెండు కేసులు నమోదయ్యాయి. ఇలాంటి సంఘటన మళ్లీ జరగకుండా రైల్వే శాఖ ముందస్తు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు తెలిపారు.
లింగాయత్ ఎమ్మెల్యేలు
బీజేపీని వీడాలి ●
● కూడల సంగమ జయ మృత్యుంజయ స్వామీజీ పిలుపు
హుబ్లీ: ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాళ్ను పార్టీ నుంచి బీజేపీ అధిష్టానం బహిష్కరించడంపై పంచమశాలి సామాజిక వర్గంలో ఆక్రోశం వ్యక్తమవుతోంది. బహిష్కరణ అన్నది నీచమైన కృత్యం అని కూడల సంగమ జయ మృత్యుంజయ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరైతే తమ సమాజానికి రిజర్వేషన్లను కేటాయించడానికి వెనుకంజ వేశారో వారే నేడు బసవనగౌడ పాటిల్ యత్నాళ్ను పార్టీ నుంచి బహిష్కరించడంలో కృతకృత్యులయ్యారని మండిపడ్డారు. యత్నాళ్కు అండగా నిలబడేందుకు లింగాయత్ ఎమ్మెల్యేలు వెంటనే బీజేపీని వీడాలని స్వామీజీ పిలుపునిచ్చారు. అంతేగాక త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పంచమశాలి వర్గం ఒక రోజు పాటు ఆందోళన చేపడుతుందన్నారు.
ట్రామా కేంద్రం ప్రారంభం
రాయచూరు రూరల్ : రాజీవ్గాంధీ సూపర్ స్పెషాలిటీ(ఒపెక్) ఆస్పత్రిలో రోగులకు ట్రామా కేంద్రాన్ని ప్రారంభించినట్లు జిల్లాధికారి నితీష్ పేర్కొన్నారు. గురువారం ఒపెక్ ఆస్పత్రిని సందర్శించి ఆయన మాట్లాడారు. కళ్యాణ కర్ణాటక జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి అధికంగా వచ్చే రోగులందరికీ సమానంగా వైద్యం అందిస్తున్నారన్నారు. ఒపెక్ ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలతో కూడిన వైద్య చికిత్సలకు శ్రీకారం చుట్టామన్నారు. క్యాన్సర్ చికిత్సకు కిద్వాయి ఆస్పత్రిలో మాదిరిగా రూ.52 కోట్లతో 2.5 ఎకరాల స్థలంలో క్యాన్సర్ ట్రామా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కార్డియాలజీ, యూరాలజీ, అనస్థీషియా, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో సర్జికల్, మెడికల్ గ్యాస్ట్రో, పైకో మ్యాక్సిలరీ సర్జరీ సౌకర్యాలు కల్పించారన్నారు. ఒపెక్ ఆస్పత్రి ప్రత్యేక అధికారి డాక్టర్ రమేష్ సాగర్, డాక్టర్ రమేష్, విజయ శంకర్లున్నారు.
అభివృద్ధి పనులకు భూమిపూజ
రాయచూరు రూరల్: నగరాభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని నగరసభ సభ్యుడు జయన్న పేర్కొన్నారు. గురువారం 2వ వార్డులో ఉద్యానవనాలను రూ.5 లక్షలతో నిర్మాణం, తాగునీటి ట్యాంకర్లకు భూమిపూజ చేసి మాట్లాడారు. భవిష్యత్తులో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి పాటు పడుతామన్నారు. ఈ సందర్భంగా భీమనగౌడ, నాగరాజ్, కులకర్ణి, ఆంజనేయ, తిమ్మారెడ్డి, రత్న, శారదమ్మ, విజయలక్ష్మి, నరసింహమూర్తిలున్నారు.
క్రికెట్ బెట్టింగ్.. ఒకరు అరెస్ట్