Karnataka Latest News
-
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
సాక్షి,బళ్లారి: ప్రేమించిన అమ్మాయి తనకు దగ్గర కాలేదని ఓ యువకుడు ప్రాణ త్యాగం చేశాడు. ముందుగా తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు ఇన్స్టాలో పోస్టు చేశాడు. ఆ ప్రకారం తన బుల్లెట్ బైక్పై వెళ్లి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టి మంటల్లో చిక్కుకుని అగ్నికి ఆహుతైన ఘటన విజయపుర జిల్లా సింధగి తాలూకా టోల్గేట్ సమీపంలో జరిగింది. వివరాలు.. అల్లాపుర లేఅవుట్కు చెందిన అభిషేక్(19) అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. ప్రేమ సఫలం కాకపోవడంతో పిచ్చివాడయ్యాడు. ఆ యువతి లేకుంటే తాను జీవించలేననే మనస్తాపంతో బైక్పై వేగంగా వెళుతూ ఆర్టీసీ బస్సును ఢీకొన్నాడు. బస్సు డ్రైవర్కు ఏం జరుగుతోందో తెలిసేలోపు క్షణాల్లో ద్విచక్ర వాహనం మంటల్లో చిక్కుకుని కాలిపోయింది. వేగంగా వస్తున్న బస్సుకు అతివేగంగా బుల్లెట్ వాహనం ఢీకొనడంతో ముందుగా ద్విచక్ర వాహనంలో మంటలు వ్యాపించాయి. వెంటనే ఆర్టీసీ బస్సుకు కూడా మంటలు వ్యాపించాయి. ఆ మంటల్లో అభిషేక్ సజీవదహనం అయ్యాడు. అయితే బస్సులోని ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే కిందకు దిగిపోవడంతో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. బస్సు డ్రైవర్ చాకచక్యంగా వాహనాన్ని అదుపు చేసి బస్సులో ఉన్న ప్రయాణికులను కాపాడారు. ఆర్టీసీ బస్సు కూడా పూర్తిగా కాలిపోయింది. ఘటనపై సమాచారం అందుకున్న అక్కడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇన్స్టాలో ముందే సూసైడ్ మెసేజ్ పోస్ట్ బైక్పై వెళ్లి బస్సుకు ఢీకొట్టి సజీవదహనం తృటిలో తప్పిన ముప్పు, మంటల్లో బస్సు బుగ్గి -
హనీట్రాప్లో థియేటర్ ఓనర్
● రూ.25 లక్షలు, అర్ధ కేజీ బంగారం వసూలు ● 5 మంది మహిళల ముఠా అకృత్యం దొడ్డబళ్లాపురం: సినిమా థియేటర్ యజమానిని హనీట్రాప్ చేసిన 5 మంది మహిళలు రూ.25 లక్షలు, అర్ధకేజీ బంగారం దోచుకున్న సంఘటన బెంగళూరు వద్ద రామనగరలో వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. రామనగర పట్టణంలోని అగ్రహార కాలనీ నివాసి (52) స్థానికంగా ఒక సినిమా థియేటర్ కలిగి ఆర్థికంగా సెటిలై ఉన్నాడు. ఏడేళ్లుగా భార్యకు దూరంగా ఉంటూ ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో థియేటర్కి సినిమా చూడడానికి వచ్చిన ఒక మహిళ అతడితో పరిచయం చేసుకుని దగ్గరయ్యింది. తరువాత మరో నలుగురు మహిళలను పరిచయం చేసింది. తనను వివాహం చేసుకోవాలని ఆమె కోరగా బాధితుడు నిరాకరించాడు. దీంతో అతని మీద అత్యాచారం, పోక్సో కేసు పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరించి పలు విడతల్లో రూ.25 లక్షలు దోచుకున్నారు. 500 గ్రాముల బంగారం కూడా లాక్కున్నారు. అంతటితో ఆగక ఇంకా పెద్ద మొత్తంలో డబ్బులు, బంగారం కావాలని వేధిస్తూ ఉండడంతో బాధితుడు ఐజూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిళల కోసం గాలింపు చేపట్టారు. ఉద్యోగం తీసేశాడని... మేనేజర్ను చంపిన కూలీ దొడ్డబళ్లాపురం: పనిలో నుంచి తీసేశాడనే కోపంతో ఒక కార్మికుడు.. మేనేజర్ని కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన బెంగళూరులో జరిగింది. తిగళరపాళ్యలో ఉన్న పవర్ ప్లాస్టెక్ ఫ్యాక్టరీలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో పని చేస్తున్న యాదగిరికి చెందిన హనుమంతు అనే కార్మికుడు సక్రమంగా పనికి రావడం లేదని మేనేజర్ రాహుల్ (38) పనిలో నుండి తొలగించాడు. దీంతో రాహుల్పై పగ పెంచుకున్న హనుమంతు సోమవారం సాయంత్రం ఫ్యాక్టరీలోనే రాహుల్ను 10 సార్లు కత్తితో పొడిచి చంపాడు. రాజగోపాలనగర పోలీసులు నిందితుడు హనుమంతుని అరెస్టు చేశారు. మృతుడు రాహుల్ ఉత్తరప్రదేశ్వాసి అని తెలిసింది. నేత్రపర్వంగా హనుమంతోత్సవంబొమ్మనహళ్లి: హాసన్ జిల్లాలోని ప్రసిద్ధ బేలూరు పట్టణంలో వెలసిన శ్రీ చన్నకేశవస్వామి ఆలయ ఉత్సవంలో భాగంగా సోమవారం రాత్రి దివ్య హనుమంతోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. సోమవారం రాత్రి 11:30 గంటలకు మంగళవాయిద్యాల మధ్య ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి మహామంగళారతిని నిర్వహించారు. ఆ తర్వాత, విద్యుత్ దీపాలు, పువ్వులతో అలంకరించిన చన్నకేశవ, సౌమ్య నాయకి, రంగ నాయకి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఒక భారీ కంచు ఆంజనేయ విగ్రహంపై ఉంచి ఆలయంలోని ఎనిమిది రాజ వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. రోడ్డుపై కారు దగ్ధందొడ్డబళ్లాపురం: కదులుతున్న కారులో మంటలు చెలరేగి రోడ్డుమీదే కాలిబూడిదైన సంఘటన దేవనహళ్లి శివారులో హొసకోట–దాబస్పేట మార్గంలో జరిగింది. కారు రహదారిపై వేగంగా వెళ్తుండగా హఠాత్తుగా ఇంజిన్లో నుంచి మంటలు వచ్చాయి. దీంతో కారులో ఉన్నవారు కారు ఆపి దిగిపోయారు. చూస్తుండగానే కారు కాలిపోయింది. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. ఎండలకు ఇంజిన్ అధికంగా వేడెక్కి ఉంటుందని అనుమానాలున్నాయి. దేవనహళ్లి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
దావణగెరెలో కిరికిరి
శివాజీనగర: ఉప ఎన్నికల వేళ గృహ నిర్మాణ మంత్రి జమీర్ అహ్మద్ఖాన్ అలిగారు. దావణగెరె దక్షిణలో మైనారిటీ నాయకుడు సాదిక్ పైల్వాన్కు టికెట్ ఇవ్వాలని మంత్రి జమీర్ పట్టుబట్టినా అది జరగలేదు. తన కుమారుడు సమర్థ్ శ్యామనూరుకు టికెట్ రానివ్వకుండా జమీర్ అడ్డుపడడంపై మంత్రి ఎస్.ఎస్.మల్లికార్జున మండిపడి, ఏకవచనంతో విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాలతో జమీర్ అసంతృప్తికి గురై ఎన్నికల ప్రచారం నుంచి దూరంగా ఉన్నారు. ఆయన ప్రచారానికి రావాలని మైనారిటీ నాయకులు డిమాండ్ చేయడం గమనార్హం. ఈ గొడవలతో ఒక వర్గం ఓట్లకు గండి పడుతుందా? అనే ప్రచారం సాగుతోంది. పైల్వాన్ కోసం పట్టు ఉప ఎన్నికలు ప్రకటించిన నాటి నుంచి దావణగెరె మంత్రి ఎస్.ఎస్.మల్లికార్జున్, జమీర్ మధ్య వివాదం రాజుకుంది. కుమారుడు సమర్థ్ కోసం మల్లికార్జున, సాదిక్ కోసం జమీర్ హైకమాండ్పై ఒత్తిడి తీసుకొచ్చారు. చివరికి సమర్థ్కే టికెట్ ఇచ్చారు, కానీ జమీర్ దీనిని వ్యతిరేకిస్తూ వచ్చారు. సాదిక్ తిరుగుబాటు అభ్యర్థిగా నిలబడడానికి జమీర్ కారణమనే మాటలు వినిపించాయి. వీటి మధ్యలో సీఎం సిద్దరామయ్య ప్రచారంలో పాల్గొంటున్నారు. జమీర్కు సిద్దరామయ్య నచ్చజెప్పినట్లు సమాచారం. కానీ తమ నియోజకవర్గానికి జమీర్ రాకపోవడమే మంచిదని మల్లికార్జున్ ప్రకటించడంతో మళ్లీ అలిగారు. ఎక్కడ చూసినా హడావుడి చేసే జమీర్ ఎంతో ప్రధానమైన ఉప ఎన్నికల వేళ మౌనంగా ఉండడం ఆశ్చర్యకారకమైంది. కేరళ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నట్లు జమీర్ చెప్పారు. డీకే శివ ఏమన్నారు..? మంగళవారం దావణగెరెకు వచ్చిన డీసీఎం డీకే శివకుమార్కు జమీర్ అభిమాని ఆసిఫ్ అలీ ఫోటో పట్టుకుని ఎదురుగా నిలబడ్డారు. అతనిని పార్టీ నాయకులు పక్కకు తీసుకెళ్లి బుజ్జగించారు. డీకే మాట్లాడుతూ 79 శాతం ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా ఉన్నారు, మంత్రి జమీర్ కేరళలో కాంగ్రెస్ స్టార్ ప్రచారకునిగా పని చేస్తున్నారు, అక్కడ ముగించుకొని వచ్చిన తరువాత ఎక్కడికి పంపాలనేది చర్చిస్తున్నామని అన్నారు. ఒకరి మీద పార్టీ ఆధారపడదు, అది డీకే, సీఎం, జమీర్ ఎవరైనా కావచ్చు అని చెప్పడం గమనార్హం. కాంగ్రెస్ ప్రచారానికి దూరంగా మంత్రి జమీర్ అహ్మద్ అభ్యర్థి ఎంపికపై గుర్రు ఓటర్ల మీద ప్రభావం చూపేనా? దావణగెరె దక్షిణ, బాగల్కోటె అసెంబ్లీ క్షేత్రాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనుండగా రెండుచోట్లా గెలవడం అధికార కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యంగా మారింది. కానీ పార్టీ నాయకుల మధ్య కలహాలు ముసురుకున్నాయి. మంత్రి జమీర్ అహ్మద్ ఇందులో కేంద్ర బిందువుగా ఉన్నారు. సిద్దుది తుగ్లక్ దర్బార్: యడ్డి శివాజీనగర: ఉప ఎన్నికలలో పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాళ్తో పాటుగా ఎవరైనా వచ్చి బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తే స్వాగతిస్తానని పార్టీ నేత బీ.ఎస్.యడియూరప్ప తెలిపారు. యత్నాళ్ పార్టీ ప్రచారానికి వస్తే ఒప్పుకుంటారా? అని విలేకరులు యడ్డిని ప్రశ్నించగా స్వాగతిస్తానని తెలిపారు. తమకు గెలుపు ముఖ్యమని అన్నారు. 5, 6 తేదీల్లో బాగల్కోటలో పార్టీ అభ్యర్థి వీరణ్ణ చరంతిమఠ తరఫున ప్రచారం సాగిస్తానన్నారు. వంద శాతం గెలుస్తామనే నమ్మకముందన్నారు. రాష్ట్రంలో అవినీతి తాండవిస్తోంది, సీఎం సిద్దరామయ్య ప్రజోపయోగ పనులను మరిచి తుగ్లక్ దర్బార్ జరుపుతున్నారని ఆరోపించారు. అజీర్ణం అయ్యేవిధంగా కాంగ్రెస్కు మెజారిటీ ఉంది, మళ్లీ ఉప ఎన్నికల్లో గెలిస్తే అధికార మదంతో విర్రవీగుతారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో హిందీ భాష తప్పనిసరి కాదనే ప్రభుత్వ తీర్మానాన్ని ఖండిస్తూ, దేశంలో సంచరించాలంటే హిందీ ముఖ్యమని అన్నారు. -
నేటి నుంచి జనాభా లెక్కింపు సర్వే
హుబ్లీ: ఏప్రిల్ 1 నుంచి జనగణన స్వచ్ఛంద నమోదు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజలు ఈ ప్రక్రియలో పాల్గొని తమ కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయించాలని హుబ్లీ ధార్వాడ సిటీ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ రుద్రేష్ గాళి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సూచించిన వైబ్సైట్లో మొబైల్ నంబర్ ద్వారా నమోదు చేయించుకొని, మీ స్థలాన్ని ఎంపిక చేసుకొని డిజైన్లో మ్యాప్ను గుర్తించి ఇంటి వివరాలతో పాటు 33 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలన్నారు. ఆ తర్వాత మీ ఫోన్కు వచ్చే రెఫరెన్స్ ఐడీ నంబర్ ఏప్రిల్ 15 తర్వాత, తమ ఇంటి దగ్గరకు వచ్చే జనగణన సేకరణ అధికారులకు ఇవ్వాలన్నారు. ఏప్రిల్ 16 తర్వాత క్షేత్ర పరిశీలన ప్రక్రియ జరగనుంది. ఈ గడువులో జనాభా సేకరణ అధికారులు తమ ఇంటికి వచ్చి వివరాలను పరిశీలిస్తారు. ఒక వేళ స్వచ్ఛంద జనగణన పూర్తి చేయక పోతే జనాభా సేకరణదారులే వివరాలు నమోదు చేస్తారు. 28 మంది సిబ్బంది నియామకం ఈ నేపథ్యంలో పాలికె పరిధిలో 28 మంది సిబ్బందిని నియమించామన్నారు. విద్య, రెవెన్యూ శాఖలతో పాటు పాలికె ఇతర శాఖల సిబ్బంది జనగణన సర్వేలో పాల్గొంటారన్నారు. ఒక్కొక్క సిబ్బందికి 180 ఇళ్ల సర్వే బాధ్యత అప్పగించామన్నారు. ఇందులో భాగంగా సంబంధిత జనాభా సేకరణ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి ఏప్రిల్ 3 నుంచి మూడు రోజులు శిక్షణ సదస్సు ఏర్పాటు చేశామన్నారు. సంబంధిత సిబ్బందికి ఆయా జోన్ కార్యాలయాలను కేటాయిస్తూ ఈ విషయంలో హుబ్లీ మహిళా పాలిటెక్నిక్, ఐడీఎంఆర్ కళాశాలల్లో శిక్షణను ఏర్పాటు చేశారన్నారు. 2027 జనగణన తొలి దశ జాబితా ప్రక్రియ ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు అన్ని రాష్ట్రాలు, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలలో జరగనుందన్నారు. ఈ 30 రోజుల గడువులో ఈ ప్రక్రియ కొనసాగనుందని ఆయన కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ వివరాలను వెల్లడించారు. జనగణన స్వచ్ఛంద నమోదుకు శ్రీకారం ప్రజలు అవసరమైన కుటుంబ సభ్యుల వివరాలు అందించాలి హుబ్లీ ధార్వాడ సిటీ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ రుద్రేష్ గాళి -
లోకాయుక్త వలలో తిమింగలం
హుబ్లీ: ఆఫీసులోనే రూ.6 లక్షలు లంచం తీసుకుంటుండగా వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ లోకాయుక్త అధికారులకు పట్టుబడిన ఘటన వాణిజ్య నగరి హుబ్లీలో జరిగింది. భరత్కుమార్ హెగ్డే ఆ అధికారి. వివరాలు.. 2019లో 8 టిప్పర్లు కొనుగోలు చేసిన అంకోలావాసి విశ్వజిత్ నాయక్ ఇన్ఫుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్నారు. అయితే ఇది ట్యాక్స్ చట్టాలకు విరుద్ధమని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం 5వ సారి విచారణకు పిలిచారు, వచ్చేటప్పుడు డబ్బులు తీసుకొని రండి, అలాగైతే కేసు క్లోజ్ చేస్తామని అధికారి భరత్కుమార్ హెగ్డే ఆదేశించారు. ఆ మేరకు ఆఫీసులో రూ. 6 లక్షలు తీసుకుంటూ ఉండగా బెంగళూరు లోకాయుక్త ఎస్పీ శివప్రకాష్ దేవరాజ్, డీఎస్పీలు మల్లికార్జున చుక్కి, ప్రదీప్కుమార్, సీఐ రాజు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. హుబ్లీలో వాణిజ్య శాఖ అధికారి అరెస్టు -
పతి సూచన.. సతి సైతం కటకటాలకు
● ములాఖత్కు డ్రగ్స్ తీసుకెళ్లి పట్టుబడిన మహిళ ● చిన్నారి కూతురూ చెరసాలకు బనశంకరి: నగరంలో పరప్పన అగ్రహార జైలులో ఉన్న భర్తకు డ్రగ్స్ ఇవ్వడానికి వెళ్లి పట్టుబడిన మహిళతో పాటు నాలుగేళ్ల పాప కూడా జైలుపాలైంది. తల్లిదండ్రులు చేసిన మూర్ఖపు పనే కారణం. ఆపరేషన్ శుద్ధీకరణ పేరుతో జైలులో అధికారులు సోదాలను తీవ్రం చేశారు. ఖైదీల వద్ద నిషేధిత వస్తువులు ఉండకుండా నిఘా పెట్టారు. ఏం జరిగింది? నగరంలో హెణ్ణూరులో ఉండే రితికా రాయ్ (27) అసోం నుంచి వచ్చిన యువతి, హెణ్ణూరువాసి ఫర్హాన్ఖాన్ను రెండో పెళ్లి చేసుకుంది. కొన్ని నెలల క్రితం దోపిడీ కేసులో అతడు జైలుకెళ్లాడు. మార్చి 26వ తేదీన ములాఖత్కు వెళ్లిన రితికా అతనికి ఇవ్వాలని కొంత డ్రగ్స్, సిమ్కార్డులను శరీరంలో దాచుకుని జైలుకు వెళ్లింది. జైలు గేటు వద్ద రితికా రాయ్ ప్రవర్తన పట్ల అనుమానం రావడంతో మహిళా భద్రతా సిబ్బంది ఆమెను తనిఖీ చేశారు. 3 సిమ్కార్డులు, 27 గ్రాముల మెథాంఫెటమైన్ డ్రగ్, బీడీలు, పొగాకు దొరికాయి. ఆ సమయంలో 4 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. రితికా రాయ్ను డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు. బయట కుమార్తెను చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో తల్లి కోరిక మేరకు ఆమెతో పాటు పాపను జైలులో ఉంచారు. భర్త చెప్పడంతోనే ఈ వస్తువులు తెచ్చానని రితికా రాయ్ తెలిపింది. కాగా ఆమెకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరితో సంబంధాలున్నాయనేది దర్యాప్తు చేపట్టారు. ఎక్స్ప్రెస్ వేలో రెండు కార్లు ఢీదొడ్డబళ్లాపురం: బెంగళూరు– మైసూరు ఎక్స్ ప్రెస్ వేపై రెండు కార్లు ఢీకొన్నాయి. చెన్నపట్టణ తాలూకా కోలూరు గ్రామం వద్ద రహదారిపై ముందు వెళ్తున్న కారును వెనుక నుంచి వే గంగా వచ్చిన మరో కారు ఢీకొంది. దీంతో ముందు వెళ్తున్న కారు పక్క రోడ్డులోకి పల్టీ కొ ట్టింది. రెండు కార్లు మైసూరు నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కార్లలోని ప్రయాణికులు స్వల్పంగా గాయపడగా చెన్నపట్టణ తాలూకా ఆస్పత్రికి తరలించారు. -
శాంతి ప్రబోధకుడు మహావీరుడు
రాయచూరులో నిర్వహించిన మహావీర్ జయంతిలో పాల్గొన్న జిల్లాధికారి నితీష్, ఇతర ప్రముఖులు బళ్లారిలో నిర్వహించిన మహావీర్ జయంతిలో పాల్గొన్న మేయర్ గాదెప్ప, ముండ్రిగి నాగరాజ్ తదితర ప్రముఖులుచిత్రపటం ఊరేగింపులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి, జైన్ సమాజ ప్రముఖులుసాక్షి,బళ్లారి/బళ్లారిటౌన్: జైన మత ప్రచారకుడు, భగవాన్ మహావీర్ జయంతిని కన్నుల పండువగా ఆచరించారు. మంగళవారం భగవాన్ మహావీర్ జైన్ జయంతిని పురస్కరించుకుని కన్నడ సాహిత్య పరిషత్, జిల్లా పంచాయతీ, మహానగర పాలికె సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహావీరుని చిత్రపటాన్ని భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వక్తలు ముఖ్యంగా లిడ్కర్ అధ్యక్షుడు ముండ్రగి నాగరాజు మాట్లాడుతూ మహావీరుడు బోధించిన పంచతత్వాలు అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం మనిషి జీవిత సత్యానికి మార్గదర్శకాలని చెప్పారు. ప్రతి జీవిలో అత్మ ఉందని, ఎవరికీ హాని చేయకూడదని సూచించారన్నారు. ప్రతి ప్రాణిని ప్రేమించాలని, చంపకూడదని సూచించిన మహానుభావుడు మహావీరుడన్నారు. సత్యాన్ని పాటించడం, ఇతరుల ఆస్తిని ఆశించకపోవడం, నియమ నిష్టలతో జీవించడం, భౌతిక ఆశలు విడిచిపెట్టడం వంటి విలువలను నేర్పించారన్నారు. భారతదేశంలో ఎన్నో మతాలు, కులాలు ఉద్భవించాయన్నారు. అయితే జైన మతం అహింసా సిద్ధాంతాలు, నైతిక విలువలు సమాజ ఐక్యతకు దోహదం చేశాయన్నారు. జైన సమాజం ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. మహావీరుని బోధనలు ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయన్నారు. మేయర్ గాదెప్ప మాట్లాడుతూ మహావీరుడు ఇచ్చిన శాంతి సందేశం నేటి సమాజానికి ఎంతో అవసరం అన్నారు. జైన్ మతానికి చెందిన వారు జీవహింసకు దూరంగా ఉండేందుకు మాస్క్ ధరించడం, పాదరక్షలు కూడా లేకుండా నడవడం వంటి ఎన్నో సుగుణాలతో జీవిస్తున్నారని కొనియాడారు. ఏడీసీ మహమ్మద్ ఝుబేర్ తదితరులు మహావీరుని గుణగణాలను కొనియాడారు. కార్యక్రమంలో కన్నడ సంస్కృతీ శాఖ ఏడీ బీ.నాగరాజు, జిల్లా జైన్ సంఘం అధ్యక్షుడు సురేష్మల్ జైన్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు మున్సిపల్ కళాశాల మైదానం నుంచి మహావీరుని ప్రతిమను ఊరేగింపుగా జైన్ భవనానికి తీసుకొచ్చారు. ఈసందర్భంగా జైన్ సమాజం వారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. జయంతిలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మహావీర్ జయంతిలో మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మహావీర్ జైన్ విగ్రహ ఊరేగింపులో పాల్గొని ఆ సమాజానికి చెందిన వారితో ఊరేగింపులో పాల్గొని భక్తిని చాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ హింసామార్గాన్ని విడనాడి, శాంతి మార్గంలో నడుస్తూ సమాజానికి జైనులు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. మన సంస్కృతి వారసత్వాలకు ప్రతీకగా జైన్ సమాజం నిలుస్తోందని గుర్తు చేశారు. రాయచూరులో... రాయచూరు రూరల్ : మానవుడు అరిషడ్ వర్గాలను త్యజించాలని జిల్లాధికారి నితీష్ పేర్కొన్నారు. మంగళవారం మహావీర్ వృత్తం వద్ద స్తూపానికి పూలమాలలు వేసి మాట్లాడారు. వర్థమాన మహావీరుని చిత్రపటానికి సమాజ ప్రముఖుడు సుఖాణి పూలమాలలు వేశారు. సుమతీనాథ్ జైన్ శ్వేతాంబర్ భవనంలో జిల్లా పాలన యంత్రాంగం, జెడ్పీ, నగరసభ, కన్నడ సంస్కృతి, సాంఘీక సంక్షేమ శాఖ, జైన్ సముదాయం ఆధ్వర్యంలో వర్ధమాన మహావీర్ జయంతిని జ్యోతి వెలిగించిన అసిస్టెంట్ కమిషనర్ హంపన్న మాట్లాడారు. సమాజంలో మానవుడు సత్యాంశాలతో జీవించాలన్నారు. అహింసా మార్గాన్ని అనుసరించి మానవత్వంతో సేవలు అందించాలన్నారు. మహావీర్ చిత్రపటం ఊరేగింపులో ఎస్పీ అరుణాంగ్షు గిరి జైన్ సమాజం సంచాలకుడు అశోక్ కుమార్ జైన్, జైన్ నేతలు అమిత్, ఆశిష్, మోహిత్, వినయ్, ఆయుష్ సంచితి, రాహుల్, హితేష్, కృష్ణలున్నారు. జయంత్యుత్సవంలో పలువురు వక్తలు కన్నుల పండువగా మహావీర్ జయంతి -
ఏప్రిల్ నెలాఖరుకు గేట్ల ఏర్పాటు పనుల పూర్తి
● టీబీ డ్యాం గేట్ల అమరిక పనుల పరిశీలనలో మంత్రి, ఎమ్మెల్యే హొసపేటె: తుంగభద్ర డ్యాంకు నూతనంగా ఏర్పాటు చేస్తున్న గేట్ల పనులను ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ తుంగభద్ర డ్యాం నూతన గేట్ల ఏర్పాటు ప్రక్రియ, బిగింపు పనులు ఏప్రిల్ నెలాఖరు నాటికి పూర్తి కానున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో కర్ణాటక ప్రభుత్వం కూడా త్వరితగతిన పనులు చేపట్టిందన్నారు. గేట్ల బిగింపు పనులు పూర్తయితే కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతుల ప్రయోజనాల కోసం ఇప్పటికే 18 కొత్త గేట్లు అమర్చారన్నారు. తుంగభద్ర డ్యాం పాత గేట్లతో పాటు పాత గొలుసు(చైన్)లను కూడా మార్చుతున్నామని చెప్పారు. మండలి కార్యదర్శి ఓఆర్కే రెడ్డి, సూపరింటెండింగ్ ఇంజినీర్ నారాయణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో బైకిస్టు మృతి హొసపేటె: అతి వేగంగా వస్తున్న లారీ ముందు వెళుతున్న బైక్ను బలంగా ఢీకొట్టడంతో బైక్ చోదకుడు స్థలంలోనే మృతి చెందిన ఘటన మంగళవారం తాలూకాలో దానాపుర గ్రామం వద్ద జరిగింది. మృతుడిని తాలూకాలోని గుండా తాండాకు చెందిన కిరణ్ (27)గా గుర్తించారు. మందులు తేవడానికి హొసపేటె నగరం వైపు బైక్పై వెళుతూండగా బెంగళూరు నుంచి అహమ్మదాబాద్కు వెళుతున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. తల, వీపు, ముఖానికి తీవ్ర గాయాలతో అతను అక్కడికక్కడే మరణించాడు. వెనుక నుంచి ఢీకొన్న లారీని పట్టుకున్న మరియమ్మనహళ్లి పోలీసులు ఆ లారీ డ్రైవర్ను విచారిస్తున్నారు. ఘటనా స్థలాన్ని హగరిబొమ్మనహళ్లి సీఐ వికాస్ లమాణి, మరియమ్మనహళ్లి స్టేషన్ ఎస్ఐ తారాబాయి పరిశీలించారు. యువత మత్తుకు బానిస కారాదు రాయచూరు రూరల్: నేటి తరం యువకులు మత్తు పదార్థాలకు బానిస కారాదని జిల్లా ఎస్పీ అరుణాంగ్శు గిరి వెల్లడించారు. సోమవారం రాత్రి నగరంలోని హరిజన వాడలో మద్యం, సీహెచ్ పౌడర్ గంజాయి, హఫీం వంటి వాటికి బానిసలుగా మారకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల నుంచి అక్రమంగా వచ్చే మద్యానికి యువకులు దూరంగా ఉండాలన్నారు. పోలీసులకు సమాచారం అందించి వాటి నియంత్రణకు సహకరించాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ కుమారస్వామి, డీఎస్పీ శాంతవీర, సీఐ మేకా నాగరాజ్, ఎస్ఐలు బపవరాజ్, మహ్మద్ ఇషాక్, యల్లప్ప, రాజు, నరసింహులు, అనిల్ కుమార్లున్నారు. హిడకల్ డ్యాంలో ఇద్దరు చిన్నారుల గల్లంతు రాయచూరు రూరల్: హిడకల్ డ్యాంలో పడి ఇద్దరు చిన్నారులు నీటి పాలైన ఘటన బెళగావి జిల్లా యమకనమరడి తాలూకాలో చోటు చేసుకుంది. పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించడంతో సోమవారం గుడుగనకట్టి గ్రామానికి చెందిన ప్రజ్వల్(11), కృష్ణ విఠల్(11) అనే పిల్లలు స్నానం చేయడానికి వెళ్లి మృత్యువాత పడ్డారు. యమకనమరడి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకోగా, కుటుంబ సభ్యుల ఆక్రందనలు మిన్నంటాయి. -
వరకట్న వేధింపులకు గృహిణి బలి
హుబ్లీ: వరకట్న వేధింపులకు ఓ గృహిణి బలైన ఘటన కేశ్వాపుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శిల్ప(25) ఆత్మహత్య చేసుకున్న గృహిణి. ఈ కేసులో మృతురాలి అత్త అన్నపూర్ణ, మామ ప్రవీణ్, ఆడపడుచు జ్యోతితో పాటు ముగ్గురిపై కేసు నమోదైంది. నాలుగేళ్ల క్రితం హనుమంతను పెళ్లి చేసుకున్న శిల్పను అత్త అన్నపూర్ణ పెళ్లి సమయంలో ఏమీ తేలేదంటూ నిత్యం వేధించేది. దీంతో శిల్ప పుట్టింటికి వచ్చింది. తిరిగి రాజీ చేయడంతో మళ్లీ మెట్టింటికి వెళ్లింది. అయినా వారు హింసించడం మానక పోవడంతో మనోవేదనకు గురై తన కుమార్తె ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లి సుజాత పాటిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేశ్వాపుర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సర్కార్లు రైతు వ్యతిరేక విధానాలు వీడాలి రాయచూరు రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలని అఖిల భారత రైతు సంఘం సంచాలకుడు రంగయ్య పేర్కొన్నారు. సోమవారం రాత్రి టిప్పుసుల్తాన్ ఉద్యాన వనంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కార్మికుల నుద్దేశించి మాట్లాడారు. కార్పొరెట్ రంగాల పరంగా మారిన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి, స్వామినాథన్ నివేదికల ఆధారంగా మద్దతు ధరలు ప్రకటించాలని, భూమి లేని పేదలకు దున్నేవాడికి మిగులు భూములు పంపిణీ చేయాలన్నారు. డీహెచ్ పూజార్ మాట్లాడుతూ ఇటీవల ఇరాన్, అమెరికాల మధ్య జరుగుతున్న యుద్ధంతో వ్యవసాయ చట్టాలు రైతులకు గుదిబండల్లా మారాయన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సామాన్య మానవుడి జీవితం దుర్భరంగా మారక మునుపే ప్రభుత్వాలు మేల్కొనాలన్నారు. సమావేశంలో అశోక్, రాము, నిర్వహణప్ప, ఖాజా అస్లాం పాషా, రమేష్, జాన్ వెస్లీ, నరసప్ప, బేరి, బసవరాజ్, శ్రీనివాస్లున్నారు. కార్మికులకు కనీస వేతనాలివ్వరూ రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అసంఘటిత మహిళా కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. మంగళవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో సంఘం అధ్యక్షురాలు పద్మ మాట్లాడారు. అసంఘటిత వలయంలో విధులు నిర్వహించే మహిళా కార్మికులకు నెలకు రూ.37 వేల నుంచి రూ.43 వేల వరకు వేతనాలు చెల్లించేలా బిల్లు ప్రవేశ పెట్టి తమను ఆదుకోవాలని కోరారు. పోక్సో చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని, రాత్రి వేళలో పనులు చేయించుకోరాదని, పరువు హత్యల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికాధికారి ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో గోకారమ్మ, వీరేష్, శరణ బసవ, వరలక్ష్మి, జమున, కరియప్ప, మహాదేవిలున్నారు. బాధిత కుటుంబానికి మంత్రి పరామర్శరాయచూరు రూరల్: వ్యవసాయ పొలంలోని నీటి కుంటలో పడి నలుగురు చిన్నారులు ఇటీవల దుర్మరణం పాలైన ఘటన నేపథ్యంలో యాదగిరి జిల్లా ఇంచార్జి మంత్రి శరణ బసప్ప దర్శనాపూర్ పర్యటించారు. మంగళవారం కెంబావి తాలూకా నాగనూరులో మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబానికి రూ.లక్ష పరిహారం అందించారు. అగ్నిప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలుహుబ్లీ: పెట్రోల్ నిల్వ చేసిన ఇంటికి ఆకస్మికంగా నిప్పు అంటుకొన్న ఫలితంగా గృహిణి తీవ్రంగా గాయపడిన ఘటన ధార్వాడ తాలూకా తడకోడ గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. పూర్ణిమ(32) తీవ్రంగా గాయపడిన మహిళ. 80 శాతం శరీరం కాలిన స్థితిలో ముందుగా జిల్లా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన చికిత్స కోసం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పెట్రోల్ కొరత నేపథ్యంలో ఓ క్యాన్లో పెట్రోల్ నింపి ఆ ఇంట్లోని ఫ్రిజ్ వద్ద పెట్టారు. పూర్ణిమ వంటింట్లో ఉన్న వేళ ఉన్న ఫళంగా ఆ పెట్రోల్ క్యాన్కు నిప్పంటుకొని పేలింది. దీంతో ఇల్లంతా మంటలు వ్యాపించడంతో వంటింట్లో ఉన్న వదినను మరిది యల్లప్ప కాపాడే ప్రయత్నంలో అతడికి కూడా గాయాలయ్యాయి. అయితే మహిళ పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఆ ప్రమాద వేళలో ఇంట్లోని వారు బయట కూర్చున్నందువల్ల పెద్ద ప్రమాదం తప్పిందని గరగ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అర్పేందుకు కృషి చేశారు. మంటలు చెలరేగి కారు దగ్ధం మరో ఘటనలో ధార్వాడ బైపాస్ రోడ్డులో వెళుతున్న ఓ కారులో సాంకేతిక సమస్యతో ఆకస్మికంగా మంటలు కనిపించి కారు పూర్తిగా కాలిబూడిదైంది. ప్రమాదాన్ని పసిగట్టిన కారులో ఉన్న వారు అప్రమత్తమై బయటకు రావడంతో ప్రాణనష్టం జరగలేదు. ఆనంద్ నగర నివాసి ఆసిఫ్కు చెందిన కారులో బెళగావికి వెళుతుండగా కారు ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ క్రమంలో ఇంజిన్ నుంచి పొగ రావడంతో డ్రైవర్ గమనించి కారును నిలపడంతో ప్రయాణికులు హుటాహుటిన బయట పడ్డారు. ధార్వాడ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
మహిళలను గౌరవించడం సంప్రదాయం
బళ్లారి రూరల్ : మహిళలను గౌరవించడం మన సంస్కృతి అని బళ్లారి క్యాథలిక్ రైట్ రెవరెండ్ బిషప్ హెన్రి డిసౌజ తెలిపారు. మహిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్, బళ్లారి భారతీయ రెడ్క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఆ కళాశాలలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. మహిళలు పురుషులతో సమానం. వారు లేకపోతే సమాజం సృష్టి, అభివృద్ధి లేదని తెలిపారు. ప్రతి ఒక్కరు కళ్లల్లో కరుణ, ముఖంలో కళ, నోటిలో సత్యం, హృదయంలో ప్రేమ, మనస్సులో మంచి, కాళ్లు, చేతుల్లో సేవాభావాలు కలిగి ఉండాలన్నారు. మొదటి జైల్ సూపరింటెండెంట్ను నేనే ముఖ్యఅతిథిగా బళ్లారి కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ లతా మంజునాథ్ మాట్లాడుతూ తాను రాష్ట్ర మొట్ట మొదటి జైల్ సూపరింటెండెంట్గా బాధ్యతలను తీసుకొన్నప్పుడు ఎంతో భయం వేసిందన్నారు. ఒక మహిళ జైల్ సూపరింటెండెంట్గా వెళ్లడమా అని అందరిలోను ఒకింత భయం, ఆశ్చర్యాన్ని కలిగించింది. అందులోను బళ్లారి సెంట్రల్ జైలు అంటే ఇంకెంత భయపడాల్సిన అవసరమో చెప్పనవసరం లేదు. అధికారులు నేను ఈ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించగలనా? అని తొలుత సందేహించారు. అప్పుడు తాను పరప్పన అగ్రహార, బళ్లారి సెంట్రల్ జైళ్లలో కూడా పని చేయగలనని చెప్పాక పోస్టింగ్ ఇచ్చారన్నారు. ప్రతి మహిళ అభివృద్ధి వెనుక పురుషుడు ఉన్నట్లుగా తన వెనుక తన భర్త, పై అధికారుల ప్రోత్సాహం ఉందన్నారు. రాష్ట్ర ఐఎంఏ ప్రముఖుడు డాక్టర్ యోగానందరెడ్డి మహిళల సమానతపై మాట్లాడారు. అనంతరం మహిళలను సన్మానించారు. డాక్టర్ షడ్రక్, డాక్టర్ శివకుమార్, డాక్టర్ నాగరాజరావు, రెడ్క్రాస్ ప్రముఖుడు షకీబ్, మహిమ నర్సింగ్ కళాశాల డైరెక్టర్ సహన, ఫాతిమా, లిల్లిమేరి, సెలిన్ ఫిలిప్, విద్యార్థులు పాల్గొన్నారు. మహిళలు లేకుంటే సమాజం సృష్టి, అభివృద్ధి లేదు బళ్లారి క్యాథలిక్ రైట్ రెవరెండ్ బిషప్ హెన్రి డిసౌజ -
విడతలవారీగా పీయూసీ ఫస్టియర్ ఫలితాలు
శివాజీనగర: ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగిన ప్రథమ పీయూసీ ఫలితాలను కేఎస్ఈఏబీ మంగళవారం ప్రకటించింది. విద్యార్థులు ఫలితాలను ఆన్లైన్లో వీక్షించవచ్చు. సుమారు 6 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ దఫా ఫలితాల పద్ధతిని మార్చారు. అందరి ఫలితాలను ఒకేసారి కాకుండా దశలవారీగా విడుదల చేస్తున్నట్లు బోర్డు తెలిపింది. పూర్తిగా విడుదల కావడానికి కొన్నిరోజులు పడుతుందని, విద్యార్థులు సహనంతో ఉండాలని తెలిపింది. వెబ్సైట్పై ఒత్తిడి తగ్గించడానికే ఇలా చేసినట్లు పేర్కొంది. ఫలితం రాలేదని విద్యార్థులు ఆందోళన చెందరాదని తెలిపింది. అంత్యక్రియలకు వెళ్తుండగా ప్రమాదంమండ్య: మద్దూరులో చిక్కరసినకెరె వంతెన వద్ద ఆటో రిక్షాను ఎద్దుల బండిని ఢీకొనగా ఒకరు చనిపోగా, ఐదుమంది గాయపడ్డారు. మృతుడు బెంగళూరుకు చెందిన సిద్ధరాజు (48) కాగా, భార్య భాగ్యమ్మ (42), దిలీప్ (22), మహాలక్ష్మి (10), మహాదేవ్ (8), ఆటో డ్రైవర్ చేతన్ (24) గాయపడ్డారు. బంధువు చనిపోవడంతో అంత్యక్రియలకని ఆటోలో కొల్లేగాళ తాలూకాలోని బన్నిసెరగా గ్రామానికి వెళుతున్నారు. తెల్లవారుజామున 5 గంటలకు ఎదురుగా వస్తున్న ఎద్దుల బండిని ఆటో ఢీకొనింది. సిద్ధరాజు అక్కడే మరణించాడు. డీఎస్పీ యశ్వంత్ కుమార్, కె. ఎం. దొడ్డి సీఐ అనిల్ కుమార్, సిబ్బంది చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు. -
బెంగళూరులో భారీగా డ్రగ్స్ సీజ్
బనశంకరి: రాజధానిలో నలుమూలలా మత్తు పదార్థాల విక్రేతల హవా అధికమైంది. తినుబండారాలు అమ్మినంత సులభంగా డ్రగ్స్ను విక్రయిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో యలహంక ఉపనగర, ఆడుగోడి, భారతినగర, జాలహళ్లి, పులకేశినగర పోలీస్స్టేషన్ల పరిధిలో డ్రగ్స్ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు విదేశీయులతో పాటు 11 మందిని నగర పోలీసులు అరెస్ట్ చేశారు. విలువ రూ.5 కోట్ల పైనే వీరి వద్ద నుంచి రూ. 5.14 కోట్ల విలువచేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ తెలిపారు. డ్రగ్స్ను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఆయా ప్రాంతాలలో డ్రగ్స్ను విక్రయిస్తున్నట్లు తెలిసి పోలీసులు దాడులు జరిపి విక్రేతలను పట్టుకున్నట్లు తెలిపారు. 2 కిలోల ఎండీఎంఏ, 31 కిలోల గంజాయి, 220 గ్రాముల హైడ్రో గంజాయి, 162 గ్రాముల హెరాయిన్ ఇందులో ఉన్నాయి. యలహంకలో నైజీరియన్ డ్రగ్స్ విక్రేత సామ్యుయేల్ను అరెస్టు చేసి 2 కేజీల ఎండీఎంఏని సీజ్ చేశారు. 11 మంది విక్రేతల అరెస్టు -
సేంద్రియ సాగుతో భారీగా పంట దిగుబడి
రాయచూరు రూరల్ : సేంద్రియ వ్యవసాయానికి కొత్త దిశఽను కల్పించిన హరీష్ మహారాజ్ అనే ప్రగతిశీల రైతు ఆదర్శ విజయగాధతో కొప్పళ జిల్లా కుష్టిగి తాలూకా కిల్లారహట్టి తాండాలో రైతులకు ఆదర్శంగా నిలిచారు. రైతుతన పొలంలో పూర్తి స్థాయిలో సేంద్రియ వ్యవసాయాన్ని అవలంభించారు. రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు వినియోగించకుండా స్వయంగా వివిధ రకాలైన సేంద్రియ ఎరువులను తయారు చేసి తన పొలంలో వినియోగిస్తున్నారు. జీవామృతాన్ని తయారు చేసి పంటలకు తప్పకుండా వాడుతున్నారు. జీవామృతం, ఆవు మూత్రం, ఆవు పేడ, బెల్లం, సెనగ పిండి, భూమిలోని సూక్ష్మ జీవులతో తయారు చేస్తారు. దీంతో భూసారాన్ని మెరుగు పరుస్తుందని రైతు తెలిపారు. మన జీవామృతం, పంచ గవ్య ఇతర సేంద్రియ ఎరువులను పంటలకు వివిధ దశల్లో వినియోగిస్తూ పంట దిగుబడి సాధించారు. సేంద్రియ ఎరువుల వాడకంతో భూసారాన్ని సంరక్షించడంతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి వీలుంటుందన్నారు. ఉత్పత్తి ఖర్చులు తగ్గడమే కాకుండా రైతులు అధిక లాభాలు గడిస్తారని యువ రైతు తెలిపారు. కంది, సజ్జ తదితర పంటలు 13 ఎకరాల్లో వేశామన్నారు. 10 ఎకరాల్లో కంది 40 బస్తాలు, ఐదు ఎకరాల్లో 30 బస్తాలు పండించినట్లు తెలిపారు. కిల్లారహట్టి తాండా ఆదర్శ రైతు హరీష్ మహారాజ్ విజయగాధ -
రాష్ట్రపతి రాకకు తుమకూరు సిద్ధం
తుమకూరు: కాయక యోగి, గొప్ప మానవతావాదిగా ప్రసిద్ధ చెందిన డాక్టర్ శివకుమార స్వామి 119వ జయంతి, గురువందన మహోత్సవం తుమకూరులోని సిద్ధగంగ మఠంలో బుధవారం జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. జిల్లా యంత్రాంగం ఆమెకు లాంఛనాలతో ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేసింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో తుమకూరు విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి కారులో సిద్ధగంగ మఠానికి చేరుకుని జయంతి వేడుకలలో పాల్గొంటారు. మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి ముర్ము బెంగళూరుకు చేరుకోగా గవర్నర్ గెహ్లాట్, అధికారులు ఘన స్వాగతం పలికారు. వేలమంది కూర్చునేలా విశాలమైన వేదిక నిర్మాణమైంది. గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రముఖ స్వామీజీలు పాల్గొనబోతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు రాబోతున్నారు. వారికి అన్న దాసోహ కోసం చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాయక యోగి శివకుమారస్వామి జయంతి ఉత్సవం నేడు -
రైలు మార్గానికి నిధులు కేటాయించండి
సాక్షి,బళ్లారి: దశాబ్ధాలుగా ఎదురు చూస్తున్న బళ్లారి నుంచి సిరుగుప్ప, సింధనూరు మీదుగా లింగసూగూరు వరకు నూతన రైలు మార్గ నిర్మాణం కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాలని కర్ణాటక రాష్ట్ర రైల్వే క్రియా సమితి అధ్యక్షుడు మహేశ్వరయ్య స్వామి ఆధ్వర్యంలో కేంద్ర ఆర్థికమంత్రిని కలిసి సమస్యలను వివరించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలసి బళ్లారి జిల్లాలో రైల్వే సమస్యలను, నూతన రైళ్ల రాకపోకలకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పోరాటం గురించి వివరించారు. ఈ ప్రాంత రైల్వే అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కేంద్ర మంత్రికి అందజేశారు. ఈ నూతన రైలు మార్గం అమలు చేస్తే మొదటి దశలో బళ్లారి నుంచి సింధనూరు ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ప్రయాణికులు ఎన్నో సమస్యలను అనుభవిస్తున్నారని గుర్తు చేశారు. ఈ మార్గం భవిష్యత్తులో చామరాజనగర్, మైసూరు, హాసన్, అరసీకెరె, చిత్రదుర్గ, బళ్లారి, రాయచూరు మీదుగా బీదర్ వరకు సుమారు 950 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గంగా అభివృద్ధి చెందుతుందని గుర్తు చేశారు. అదే విధంగా సిరుగుప్ప ప్రాంతంలో తుంగభద్ర ఆయకట్టులో వరిని పండించే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, బియ్యాన్ని వివిధ ప్రాంతాలకు రైళ్ల ద్వారా రవాణాతో ఎగుమతి చేయవచ్చన్నారు. అలాగే బళ్లారి మార్గం గుండా వందేభారత్, సూపర్ ఫాస్ట్ జన శతాబ్ధి లేదా ఇంటర్ సిటీ రైలు సేవలను ప్రారంభించాలన్నారు. రైల్వే క్రియా సమితి అందించిన వినతిపత్రాన్ని క్షుణ్ణంగా చదివిన అనంతరం బళ్లారి మార్గం గుండా రైల్వే సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని సమితి బృందం తెలిపారు. కుష్టిగి నుంచి బెంగళూరుకు రైలు నడపాలి రాయచూరు రూరల్: కొప్పళ జిల్లా కుష్టిగి నుంచి బెంగళూరుకు నూతన రైలును నడపాలని రైతు సంఘం అధ్యక్షుడు అందానప్ప డివిజనల్ రైల్వే మేనేజర్కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హుబ్లీలోని రైల్వే జోనల్ కార్యాలయంలో రైతులు కలసి వినతి పత్రం అందించారు. కళ్యాణ కర్ణాటకలోని గదగ్– వాడి రైలు మార్గంలో కుష్టగి నుంచి హుబ్లీకి రైలును ప్రారంభించారని, కుష్టిగి నుంచి బెంగళూరుకు నూతన రైలును నడపాలన్నారు. హుబ్లీ నుంచి తిరుపతికి వెళ్లడానికి హర్లాపుర స్టేషన్లో స్టాపింగ్ కల్పించాలని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి రైల్వే క్రియా సమితి బృందం వినతి -
అపూర్వ త్యాగమూర్తి శాంతాబాయి
సాక్షి,బళ్లారి: సాధారణంగా అత్తా కోడళ్ల మధ్య కలహాలు, విభేదాలు, గొడవలు తదితర ఎన్నో సమస్యలు ఉండటం మనం వింటూ ఉంటాం. యాదగిరి జిల్లాలో ఓ అత్త తమ అత్తాకోడళ్ల బంధానికి సరికొత్త నిర్వచనం ఇచ్చింది. ప్రాణాపాయస్థితిలో ఉన్న కోడలికి ఏకంగా కిడ్నీ దానం చేసి తన మానవత్వం, ప్రేమ, త్యాగం ఎంతో గొప్పదని చాటుకుంది. యాదగిరి జిల్లా సరిహద్దు గ్రామమైన మాళనూరు గ్రామానికి చెందిన శాంతాబాయి, గుర్రణ్ణ దంపతుల కుమారుడు ప్రకాష్తో 14 ఏళ్ల క్రితం విజయపుర జిల్లా తాళికోటె తాలూకా హొసహళ్లి గ్రామానికి చెందిన బసమ్మ అనే యువతికి పైళ్లెంది. ప్రకాష్ బెంగళూరులో డ్రైవర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. బసమ్మ గర్భం దాల్చినప్పుడు పలు వైద్య పరీక్షలు చేసిన సమయంలో ఆమెకు ఒక కిడ్నీనే పని చేస్తోందని గుర్తించారు. 8 ఏళ్ల తర్వాత బాగా ముదిరిన సమస్య సంతానం కలిగిన 8 ఏళ్ల తర్వాత కిడ్నీ సమస్య మరింతగా ముదిరిపోయింది. కిడ్నీ మార్పిడి ఒకటే మార్గంగా మారింది. అత్త శాంతాబాయి (62) కోడలిని బతికించుకునేందుకు తన కిడ్నీని దానం చేయడానికి ధైర్యంగా ముందుకు వచ్చింది. శాంతాబాయి రక్తం గ్రూపు ఏ పాజిటివ్ కాగా బసమ్మ బ్లడ్ గ్రూపును ఓ పాజిటివ్గా గుర్తించారు. అయితే అన్ని వైద్య పరీక్షల తర్వాత అత్త కిడ్నీ కోడలికి సరిపోతుందని, ఇకపై ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాబోవని వైద్యులు నిర్థారించారు. చివరకు ఫిబ్రవరి 15వ తేదీన విజయపురలోని యశోద ఆస్పత్రిలో వైద్యులు విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఇద్దరూ కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారు. కిడ్నీ దానంతో కోడలు ప్రాణాలు కాపాడిన అత్త -
1న తుమకూరుకు రాష్ట్రపతి రాక
తుమకూరు: ఏప్రిల్ 1వ తేదీన తుమకూరులోని సిద్ధగంగ మఠంలో జరుగనున్న త్రివిధ దాసోహి డా.శివకుమార స్వామి 119వ జయంతి, గురువందన మహోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. దీంతో ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. సోమవారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని హెలిప్యాడ్లో హెలికాప్టర్లతో రిహార్సల్ నిర్వహించారు. మరోవైపు వేలాది భక్తుల అన్నసంతర్పణ కోసం క్వింటాళ్ల కొద్దీ లడ్డు, మిఠాయిలు, కారా బూందీ తయారీ సాగుతోంది. షుగర్ వ్యాధిగ్రస్తుల పాదాలు భద్రం ● మంత్రి శరణప్రకాష్ బనశంకరి: మధుమేహ రోగుల్లో పాదాల సంరక్షణ పట్ల శ్రద్ధ వహించాలని, రానున్న రోజుల్లో తమ శాఖ ద్వారా మధుమేహ పరీక్షల సౌకర్యాన్ని కల్పిస్తామని వైద్య విద్యా శాఖ మంత్రి డాక్టర్ శరణ ప్రకాష్పాటిల్ తెలిపారు. ఈ అంశంపై కలబుర్గిలో జాతీయ అభియానను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. బెంగళూరులో ఉన్న కర్ణాటక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎండోక్రైనాలజీ ఉత్తమంగా పనిచేస్తోందన్నారు. ఆదే తరహాలో కలబురిగి, మైసూరులోనూ అలాంటి వైద్య సంస్థలను ఏర్పాటు చేయాలనే యోచన ఉందన్నారు. చక్కెర రోగుల్లో పాదాల్లో సమస్యలను ప్రారంభ దశలోనే స్క్రీనింగ్ ద్వారా కనిపెట్టవచ్చని తెలిపారు. వైద్య నిపుణులు మాట్లాడుతూ ప్రపంచంలో ప్రతి 20 సెకెన్లకు ఒకరు చక్కెర రోగానికి బలి అవుతున్నారని చెప్పారు. ప్రతి 12 సెకెన్లకు ఒక షుగర్ కేసు నమోదవుతోందని చెప్పారు. భారతదేశంలో 10 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని తెలిపారు. దీనివల్ల పాదాల సమస్యలు వచ్చి ప్రతి ఏడాది 14 లక్షల మంది కాళ్లను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చక్కెర వ్యాధిని మొదట్లోనే కనిపెట్టి వైద్యం తీసుకుంటే ఇబ్బంది ఉండదని తెలిపారు. దంపతుల ఉసురుతీసిన లారీ శివమొగ్గ: భద్రావతి తాలూకాలోని హెచ్కే జంక్షన్ సమీపంలో బైక్పై వెళ్తున్న దంపతులను లారీ ఢీకొని వారి మీద నుంచి దూసుకెళ్లడంతో దుర్మరణం చెందారు. మృతులను తరికెరె తాలూకావాసులు బాబు (30), భార్య సావిత్రి (27)గా గుర్తించారు. ఆదివారం రాత్రి జొన్నల లోడుతో ఆంధ్రప్రదేశ్కు చెందిన లారీ శివమొగ్గ నుంచి తరికెరె మీదుగా వెళ్తోంది. బాబు దంపతులు ఒక హోటల్లో తమ పని ముగించుకుని తరికెరె మీదుగా తమ ఊరికి ఇంటికి వెళ్తున్నారు. ముందు వెళ్తున్న దంపతులను లారీ తాకడంతో కింద పడిపోగా వారి మీద నుంచి లారీ వెళ్లింది. కొన్ని క్షణాల వ్యవధిలో భార్యా భర్తలు చనిపోయారు. లారీ చక్రాల కింద బైక్ ఇరుక్కుపోయింది. భద్రావతి రూరల్ పోలీసులు లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. -
బెంగళూరువాసులకు నీటి చార్జీలు అదనం
విద్యుత్ భారమే కాకుండా బెంగళూరు ప్రజలకు మరో షాక్ తగలనుంది. ఏప్రిల్ 1 నుంచి నీటి చార్జీల వడ్డన కూడా తప్పేలా లేదు. నీటి బిల్లులో 3 శాతం మేర పెంపుదల ఉండవచ్చు. నీటి సరఫరా ఖర్చులతో పాటు నిర్వహణ వ్యయాలు పెరగడం, విద్యుత్, జీతభత్యాల వ్యయం ఎక్కువగా ఉందని జలమండలి చెబుతోంది. ఈ ఒత్తిడిని తట్టుకోవాలంటే కొళాయి బిల్లులను పెంచడమే శరణ్యమని ఉన్నతాధికారులు తెలిపారు. గత ఏడాది నీటి చార్జీలను ప్రతి ఏటా 3 శాతం మేర పెంచేందుకు ప్రభుత్వం ఆమోదించింది. ఆ ప్రకారం ఏప్రిల్ నుంచి ఈ పెంపు ఉంటుదని బెంగళూరు జలమండలి అధ్యక్షుడు రామ్ప్రసాద్ మనోహర్ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి విద్యుత్, నీటి చార్జీలు పెంపుదల అమలైతే ప్రజలపై ఆకస్మికంగా భారం పడనుంది. పంచ గ్యారెంటీ పథకాల ద్వారా ఖాళీ అయ్యే ఖజానాను నింపుకునేందుకు సిద్దు సర్కారు ఈ ధరలను పెంచుతోందనే ఆరోపణలు ఉన్నాయి. -
భక్తసాగరం మధ్య పంచ రథోత్సవం
సోమవారం ఉదయం శ్రీకంఠేశ్వర ఆలయం చుట్టూ జనసాగరం రాత్రయినా అదే స్థాయిలో భక్తజనం మైసూరు: దక్షిణ కాశీగా చరిత్ర ప్రసిద్ధి చెందిన మైసూరు జిల్లాలోని నంజనగూడులోని శ్రీకంఠేశ్వర (నంజుండేశ్వర) దేవస్థానం భక్తసాగరంతో కిక్కిరిసిపోయింది. సోమవారం లక్షలాది భక్తుల మధ్య గౌతమ పంచ మహారథోత్సవం వైభవోపేతంగా జరిగింది. ఉదయం ఆలయంలో విశేష పూజలు, యాగాదులు నిర్వహించారు. తర్వాత రథం వద్ద బలి పూజ నిర్వహించారు. శ్రీకంఠేశ్వరుని ఉత్సవ విగ్రహాన్ని నవరత్న కంఠహారంతో అలంకరించారు. ప్రధాన పూజారి జె. నాగచంద్ర దీక్షిత్ పలు పూజల తరువాత ఉత్సవమూర్తిని తేరులో ప్రతిష్ఠించారు. ఉదయం 6.35 గంటలకు ఎమ్మెల్యే దర్శన్ ధ్రువనారాయణ్, కలెక్టర్ జి.లక్ష్మీకాంతరెడ్డి టెంకాయ కొట్టి తేరు ఉత్సవానికి నాంది పలికారు. లక్షలాది భక్తులు తాడు పట్టుకుని తేరు లాగుతూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఆలయ వీధుల గుండా రథం కదిలింది. శ్రీ కంఠేశ్వర, పార్వతి, గణేశ, సుబ్రహ్మణ్య, చండికేశ్వర అనే 5 రథాలను భక్తులు లాగారు. సుమారు 97 అడుగుల ఎత్తు, 250 టన్నుల బరువున్న శ్రీకంఠేశ్వరుని తేరు కదలగానే భక్తుల హర్షధ్వానాలు మిన్నంటాయి. రాత్రి పొద్దుపోయేవరకూ భక్తులు రథోత్సవం చూడడానికి రావడంతో రద్దీ నెలకొంది. నంజనగూడులో ఆధ్యాత్మిక వేడుక -
బస్టాండ్లో చైన్స్నాచింగ్
గుత్తి: స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో ఆదివారం రాత్రి చైన్స్నాచింగ్ జరిగింది. కర్ణాటకలోని బళ్లారి జిల్లా తోరణగల్లుకు చెందిన గౌతమి గుత్తిలోని బంధువుల ఇంట శుభకార్యానికి వచ్చింది. ఫంక్షన్ ముగించుకున్న అనంతరం ఆదివారం రాత్రి తిరుగు ప్రయాణమైన ఆమె బస్టాండ్కు చేరుకుని బస్సు ఎక్కుతున్న సమయంలో దుండగులు ఆమె మెడలోని మూడు తులాల బరువున్న బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. జైలు నుంచి నిందితుడి బెదిరింపులు హుబ్లీ: ధార్వాడ సెంట్రల్ జైలులో పోక్సో కేసు నిందితుడు మైనర్ బాలికకు నిత్యం వీడియో కాల్ చేసి వేధిస్తున్న ఘటన సర్వత్రా విమర్శలకు దారి తీసింది. ఆ నిందితుడు బాలికను బెదిరిస్తూ కోర్టులో తనకు మద్దతుగా మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాడు. అంతేగాక అతను తన చేతిపై బాధితురాలి పేరును రాసుకొని వీడియో కాల్ చేస్తున్నాడని తెలిసింది. ఈ ఘటన ద్వారా జైలులో మొబైల్ ఫోన్ల లభ్యత ఎంత సులభంగా ఉందో, వాటి వాడకం గురించి తీవ్రమైన ప్రశ్నలు తలెత్తాయి. పోలీస్ అధికారులేమో జైల్లో మొబైల్ ఫోన్లకు అవకాశం లేదని పదేపదే చెబుతున్నారు. ఈ తాజా ఘటన దీనికి విభిన్నంగా కనిపిస్తోంది. లవ్ జిహాద్ ఆరోపణలు తలెత్తిన ఈ కేసులో నిందితుడు బాలికపై నిత్యం వేధింపులకు పాల్పడుతుండటంతో బాధితురాలి కుటుంబం ఆవేదనతో రగిలి పోతుంది. జైలు అధికారుల సహకారం లేకుండా ఇలాంటి ఘటన జరగడం అసాధ్యం అని సదరు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ తమకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు. పట్టర పట్టు.. విజేతగా నిలిచేట్టు.. ● జాతరలో అలరించిన కుస్తీ పోటీలు హుబ్లీ: హావేరిలోని ప్రముఖ పురసిద్దేశ్వర దేవర జాతర వేడుకలు సరికొత్త అనుభూతినిస్తూ ఘనంగా ముగిశాయి. ముఖ్యంగా ఈ సారి కుస్తీ పోటీలు అందరిని అలరించాయి. ప్రతి ఏటా ఉగాది నేపథ్యంలో జాతర మహోత్సవాలు, ఆ తర్వాత కుస్తీ పోటీలు అంతే ఆసక్తికరంగా ఏర్పాటు చేస్తారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ కుస్తీ పోటీల్లో వివిధ రకాల పట్టులతో క్రీడాకారులు అలరించారు. హావేరి హొసమని సిద్దప్ప మైదానంలో జరిగిన కుస్తీ పోటీల్లో విజేతలకు రూ.2000 బహుమతి, వెండి గదను ప్రదానం చేశారు. ఈ ఫైల్వాన్లు 10 నిమిషాలకు పైగా బరిలో పోరాడి ఎక్కువ సేపు ప్రత్యర్థులను తమ పట్టు సడలించకుండా బరిలో నిలిచారు. దీంతో ప్రేక్షకుల్లో ఎక్కడ లేని ఉత్సాహం రేకత్తి కేకలు, చప్పట్లు, ఈలలతో మైదానం దద్దరిల్లింది. బెళగావి, ధార్వాడ, దావణగెరె, చిత్రదుర్గ జిల్లాల నుంచి 150 మందికి పైగా ఫైల్వాన్లు పాల్గొన్నారు. మట్కా బుక్కీలపై పోలీసు దాడి ● రూ.19.44 లక్షల నగదు స్వాధీనం ● ముగ్గురు అరెస్ట్, మొబైల్, బైక్ సీజ్ బళ్లారిఅర్బన్: నగరంలోని ఏపీఎంసీ పోలీస్ స్టేషన్ పరిధిలో మట్కా బుక్కీలపై పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఒక మొబైల్ ఫోన్, ఒక మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. కాకర్లతోట హనుమాన్ నగర్లోని కోళ్ల ఫారం సమీపంలో మట్కా నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడి చేశారు. రూపనగుడి రోడ్డుకు చెందిన జీవీ.రామాంజినేయులు, మిల్లర్పేట్కు చెందిన నూర్ అలియాస్ నూర్ మహ్మద్లను మట్కా బుక్కీలుగా గుర్తించి అరెస్ట్ చేశారు. వారి వద్దకు డబ్బు తేవడానికి వచ్చిన ఉరవకొండ మండలం చోళసముద్రంకు చెందిన జన్నే లక్ష్మణ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. యువతిపై కేసు బనశంకరి: బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులోని ఖైదీకి నిషేధిత వస్తువులను అందజేయడానికి యత్నించిన యువతి (27)ని అరెస్ట్ చేశారు. వివరాలు.. రితికా రై అనే యువతి 26 తేదీ సాయంత్రం 4 గంటలకు విచారణ ఖైదీ పర్హాన్ ఖాన్ను కలవాలని పాస్ తీసుకుని వెళ్లింది. ఆమెను తనిఖీ చేస్తున్న మహిళా పోలీసులకు అనుమానం వచ్చింది. క్షుణ్ణంగా పరిశీలించగా మహిళ శరీరంలో 3 పొగాకు ప్యాకెట్లు, 5జీ సిమ్కార్డులను దాచుకున్నట్లు తెలిసింది. వస్తువులను స్వాధీనం చేసుకుని ఆమెను స్థానిక పోలీసులకు అప్పగించారు. రితికా రై, ఫర్హాన్ ఖాన్పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. జాతీయ పారా తైక్వాండో పోటీలో ప్రతిభ అనంతపురం: జాతీయ పారా తైక్వాండో పోటోల్లో అనంతపురం యువకుడు ప్రశాంత్ రెడ్డి ప్రతిభ చూపాడు. బెంగళూరులోని కోరమంగల ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన నేషనల్ చాంపియన్షిప్–2026లో ఏకంగా స్వర్ణ పతకం సాధించి, ఆసియా చాంపియన్షిప్కు ఎంపికయ్యాడు. త్వరలో జరగనున్న ప్రతిష్టాత్మకమైన ఆసియా పారా తైక్వాండో చాంపియన్షిప్ పోటీల్లో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. అనంతపురంలోని ’చాంపియన్స్ తైక్వాండో అకాడమీ’ విద్యార్థి అయిన ప్రశాంత్రెడ్డి ఈ విజయంతో అంతర్జాతీయ స్థాయికి అర్హత సాధించాడు. రామాంజినేయులు, జన్నే లక్ష్మణ్, నూర్మహ్మద్ -
ఎన్ఆర్బీసీ ఆయకట్టుకు అందని నీరు
నీరు లేక ఎండిన కాలువ(ఫైల్)ఎమ్మెల్యే కరెమ్మ నాయక్ రాయచూరు రూరల్: నారాయణపుర కుడి గట్టు కాలువ(ఎన్ఆర్బీసీ) ఆయకట్టు చివరి భూములకు నీరందక పోవడంతో రైతులు బిక్క ముఖం వేసుకున్నారు. మూడు జిల్లాల్లో లక్షలాది హెక్టార్లలో పంట నష్టం సంభవించే అవకాశాలున్నాయి. నీటి గేజ్ నిర్వహణ, సామర్థ్యాన్ని బట్టి ఆయకట్టు భూములకు నీరందేలా అధికారులు జాగ్రత్తలు పాటించడం లేదు. అధికారులు ఆయకట్టు చివరి భూములకు నీరందించక పోవడంతో పంటలు వాడు ముఖం పట్టాయి. పంట నష్టం వివరాలు: యాదగిరి జిల్లాలో శహాపుర, సురపుర, హుణసిగి, వడిగేర, నారాయణపుర, రాయచూరు జిల్లాలో లింగసూగూరు, దేవదుర్గ, రాయచూరు ప్రాంతాల్లో వరి, మిరప, సజ్జ పంటలు పండిస్తున్నారు. యాదగిరి ప్రాంతంలో దాదాపు రెండు లక్షలు, రాయచూరు జిల్లాలో లక్ష, విజయపుర జిల్లాలో రెండు లక్షల హెక్టార్లలో వరి, సజ్జ, మిరప పంటలను పండిస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు రోజు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయక పోవడంతో పంటలు చేతి కొచ్చే అవకాశం లేదు. కాలువలో నీటి సామర్థ్యం, గేజ్ నిర్వహణ చేయడంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల పంటలు చేతికొచ్చే సమయంలో నీటి లభ్యత కరువైంది. ఆల్మట్టి డ్యాం నుంచి నారాయణపుర డ్యాంకు ఆరు టీఎంసీల నీటిని విడుదల చేస్తే రైతులు కష్టాల నుంచి గట్టెక్కుతారు. ఏప్రిల్ 20 వరకు నీరు విడుదల చేయాలి: తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూములకు ఏప్రిల్ నెలాఖరు వరకు చివరి భూములకు నీరందివ్వాలని దేవదుర్గ శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్ డిమాండ్ చేశారు. రెండు రోజుల పాటు పాదయాత్రను చేపట్టారు. ఎండుతున్న పంటలను చూసైనా నీటిని విడుదల చేయాలని ఆమె అన్నారు. ఎన్ఆర్బీసీకి ఏప్రిల్ వరకు నీరందించాలి నారాయణపుర కుడి కాలువ ఆయకట్టు చివరి భూములకు ఏప్రిల్ నెలాఖరు వరకు చివరి భూములకు నీరందించాలని మాజీ మంత్రి రాజుగౌడ డిమాండ్ చేశారు. కాలువ కింద ఎండుతున్న వాణిజ్య పంటలు సుమారు ఆరు లక్షల హెక్టార్లలో పంట నష్టం కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో రైతుల ఆక్రందనలు -
లోయలోకి బస్సు బోల్తా
బస్సు ప్రమాద దృశ్యం శివమొగ్గ: అదుపు తప్పిన ప్రైవేట్ బస్సు వంతెన పై నుంచి లోయలోకి పడిపోవడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదం సోమవారం మధ్యాహ్నం 1 గంటప్పుడు భద్రావతి తాలూకాలోని వీరపుర సమీపంలో కాగేహళ్ల వద్ద జరిగింది. రేణుకాంబ ట్రావెల్స్కు చెందిన బస్సు దావణగెరె నుంచి చన్నగిరి మీదుగా భద్రావతికి వస్తోంది. అయితే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు లోయలోకి పడింది. బస్సు డ్రైవర్తో సహా ఐదుమంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పోలీసులు, స్థానికులు కలిసి బాధితులను బయటకు తీసి భద్రావతి ఆస్పత్రికి తరలించారు. ఫైర్ అధికారి ప్రశాంత్, సిబ్బంది బాబు, మంజునాథ్, హరీష్, ప్రజ్వల్ పాల్గొన్నారు. భద్రావతి వద్ద ప్రమాదం ఐదుమందికి గాయాలు -
సేంద్రియ పుచ్చ సాగు.. లాభాలు బహు బాగు
హొసపేటె: తండ్రికొడుకు సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పుచ్చకాయలను విజయవంతంగా పండించి ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచారు. తండ్రి పూర్తికాలపు రైతు కాగా, కొడుకు ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ వ్యవసాయం చేయడానికి సమయం కేటాయిస్తాడు. ఈ విధంగా అతను పాక్షికకాలపు రైతుగా మారి తన తండ్రికి సహాయం చేస్తున్నాడు. విజయనగర జిల్లాలోని ఉప్పారహళ్లి గ్రామానికి చెందిన రైతు రాజ్కుమార్ సుమారు ఐదు ఎకరాల భూమిలో సేంద్రియ వ్యవసాయం ద్వారా పుచ్చకాయలను పండిస్తున్నారు. అతని కుమారుడు సచిన్ తండ్రికి సహాయం చేస్తున్నాడు. రాజ్కుమార్కు సుమారు 7 ఎకరాల భూమి ఉంది. అతను 3–4 సంవత్సరాలుగా పుచ్చకాయలను పండిస్తున్నాడు. ఈ సంవత్సరం ఉద్యాన శాఖ నుంచి సమాచారం పొందిన తరువాత పూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంభించి పుచ్చకాయలను పండించారు. రూ.3 లక్షల పెట్టుబడితో పంట సాగు ఈ సంవత్సరం అతను 5 ఎకరాల భూమిలో రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టి పుచ్చకాయలను పండించాడు. అతని కుమారుడు సచిన్ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తాడు. తండ్రికి పుచ్చకాయ పంట పండించడంలో సహాయం చేయడానికి సచిన్ మూడు నెలల పాటు తన కంపెనీ పనికి సెలవు తీసుకున్నాడు. ఆ తర్వాత పుచ్చకాయలను కోసి కుప్పలుగా పోసిన తర్వాత అతను తిరిగి తన కంపెనీ పనికి వెళతాడు. ఈ విధంగా అతను కంపెనీ పనికి సెలవు తీసుకుని తన తండ్రికి మద్దతు ఇస్తున్నాడు. మట్టికి దూరంగా ఉంటూ కంపెనీ ఉద్యోగాల కోసం వెంపర్లాడే యువతకు అతను ఒక ఆదర్శంగా నిలిచారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలిచిన వైనం విజయనగర జిల్లాలో ఓ రైతు విజయగాధ -
గని కార్మికులకు కొత్త వేతనాలివ్వండి
రాయచూరు రూరల్: హట్టి బంగారు గనుల కంపెనీలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు కొత్త వేతనాలివ్వాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. సోమవారం హట్టి సమీపంలోని కంపెనీ కార్యాలయం ముందు చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మహంతేష్ మాట్లాడారు. 45 శాతం వేతనాలు పెంచాలని, సిబ్బంది భద్రతకు రూ.10 లక్షలు కేటాయించాలని, విద్య, వైద్య, ఆరోగ్య రంగాలకు పెద్ద పీట వేయాలని కోరారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ ఎండీ శిల్పాకు వినతిపత్రం సమర్పించారు. దావణగెరె ఉప పోరుకు కాంగ్రెస్ పరిశీలకుడుబళ్లారిఅర్బన్: దావణగెరె దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార పర్వానికి పరిశీలకుడిగా నగర మాజీ ఉపమేయర్, కేపీసీసీ సమన్వయకర్త బెణకల్ బసవరాజ్ నియమితులయ్యారు. పార్టీలో ఎన్నో ఏళ్లుగా నిబద్ధతతో పని చేస్తున్న నాయకుడిగా గుర్తింపు పొందిన బసవరాజ్కు ఈ బాధ్యతలను అప్పగించారు. ఉప ఎన్నికల్లో పార్టీ విజయానికి సమర్థవంతంగా ప్రచారం నిర్వహించేలా ఇతర నాయకులతో కలిసి పని చేయాలని కేపీసీసీ సూచించింది. చలివేంద్రం ప్రారంభం రాయచూరు రూరల్: నగరంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద క్రాంతి వీర సంగొళ్లి రాయణ్ణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నగరసభ మాజీ ఉపాధ్యక్షుడు పంపాపతి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చలివేంద్రాలతో వేసవిలో రెండు నెలల పాటు నగరానికి వచ్చే గ్రామీణ ప్రజలు, నగరవాసుల దాహార్తిని తీర్చవచ్చన్నారు. నగరంలోని స్టేషన్ రోడ్డు తదితర చోట్ల కూడా చలివేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వ్యవసాయ వర్సిటీకి వాల్మీకి పేరు పెట్టరూరాయచూరు రూరల్: నగరంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలక భవనానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టాలని క్రాంతి వీర సంగొళ్లి రాయణ్ణ సంఘం డిమాండ్ చేసింది. వ్యవసాయం విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ హన్మంతప్పకు వినతిపత్రం సమర్పించి కార్యాధ్యక్షుడు రఘువీర్ నాయక్ మాట్లాడారు. అధికారులు దృష్టి సారించి అధిక భాగం గ్రామీణ ప్రాంతాల నుంచి వ్యవసాయంలో మెలకువలు నేర్చుకోవడానికొచ్చే విద్యార్థులకు భవనాల పేర్లు గుర్తుండేలా చూడాలని కోరారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలక భవనానికి తోడు వివిధ శాఖల విషయంలో జాతీయ స్థాయి పేర్లను నమోదు చేసి రాయించాలన్నారు. ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్●14 మోటార్ సైకిళ్ల స్వాధీనం హొసపేటె: వివిధ జిల్లాల్లో వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ మాన్యం మెహబూబ్ను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని వద్ద నుంచి 14 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో టౌన్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఆ మార్గంలో అనుమానాస్పదంగా వెళుతున్న నిందితుడిని పట్టుకుని విచారించగా బైక్ల వరుస చోరీల కేసు మిస్టరీ వీడింది. దీనిపై సోమవారం సాయంత్రం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఎస్పీ జాహ్నవి మాట్లాడుతూ నిందితుడు కొప్పళ జిల్లా మునిరాబాద్కు చెందిన వాడని తెలిపారు. నిందితుడు బళ్లారిలో రెండు, సండూరులో ఒకటి, గంగావతిలో ఒకటి, కంప్లిలో ఒకటి, మండ్య జిల్లాలో రెండు బైక్లను దొంగలించాడని, వీటి విలువ సుమారు రూ.12.81 లక్షలు ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. నిందితునిపై 2022లో టౌన్ పోలీస్ స్టేషన్, 2008లో కొప్పళ పోలీస్ స్టేషన్లో బైక్ చోరీ కేసులు నమోదైనట్లు ఆమె తెలిపారు. -
సిలిండర్ల కొరతతో తెరపైకి బయోగ్యాస్ వాడకం
హుబ్లీ: పశ్చిమాసియాలో యుద్ధం పర్యవసానంగా అంతటా వంటగ్యాస్ సమస్య తలెత్తి ఆర్థిక సమస్యలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూలన పడవేసిన బయోగ్యాస్ వినియోగంపై పలువురు వ్యాపారులు ఆసక్తి చూపి తిరిగి దాని పునరారంభానికి నడుం కట్టారు. వంటగ్యాస్ సమస్య తలెత్తడంతో హావేరి రాజేంద్ర నగర్ నివాసి శ్రీనివాస్ గతంలో మూలన పడవేసిన బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా గ్యాస్ వినియోగానికి తిరిగి పాత విధానానికి శ్రీకారం చుట్టారు. గత నాలుగేళ్ల నుంచి ఈ యూనిట్ను బంద్ చేశారు. బయోగ్యాస్ యూనిట్ ప్రారంభానికి ఏర్పాట్లు తన ఇంటి ముందు బయోగ్యాస్ యూనిట్ ప్రారంభానికి ఏర్పాట్లు చేసుకున్నారు. పేడ, వ్యవసాయ వ్యర్థాలు, తడి చెత్త, సేంద్రియ వస్తువులను బయోగ్యాస్ ప్లాంట్లో ఆమ్లజనక రహిత స్థితిలో మరిగించడం ద్వారా ఈ గ్యాస్ ఇంధనంగా మారుతుంది. ఎల్పీజీ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియని అయోమయంలో బయోగ్యాస్ను సిద్ధం చేసుకుంటున్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ నేను, నా భార్య, పిల్లలకు ఈ గ్యాస్ సరిపోతుందన్నారు. నాలుగేళ్ల క్రితం రూ.15 వేలు ఖర్చు పెట్టి ఈ ప్లాంట్ నిర్మించుకున్నాను. తొలుత 15 గంపల పేడ వేయగా రోజు తమ వంటింటిలో మిగిలిన కాయకూరలు, ఆకుకూరలు ఇతర పదార్థాలను కొద్దిగా నీటిలో కలిపి వేస్తే చాలు ఇంధనం సిద్ధమవుతుందన్నారు. పశువుల పేడతో బయోగ్యాస్ ఉత్పత్తి గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తాము పెంచిన పశువుల పేడతో బయోగ్యాస్ ఉత్పత్తి చేసి వంటావార్పుకు వినియోగించుకొనే వారు. ప్రారంభంలో అవిభక్త కుటుంబాలు ఉండటం వల్ల పశుపక్ష్యాదులు సైతం ఎక్కువగా ఉండేవి. పెరట్లో భారీ బావి ఆకారంతో బయోగ్యాస్ యూనిట్ నిర్మించే వారు. ప్రతి రోజు పశువులు వేసే పేడను సేకరించి దానిలో చెత్తచెదారం లేకుండా బావిలో వేస్తే చాలు గ్యాస్ సిద్ధమయ్యేదన్నారు. మొత్తానికి పాత బయోగ్యాస్ వాడకం విధానమే మంచిదని రైతు శ్రీనివాస్ కుటుంబం అభిప్రాయ పడింది. పాత విధానం పునరారంభానికి శ్రీకారం వినియోగంలోకి మూలన పడిన ప్లాంట్ -
35 టన్నుల చౌక బియ్యం పట్టివేత
రాయచూరు రూరల్: జిల్లాలో పేదలకు పంచాల్సిన చౌక బియ్యం పక్క జిల్లాకు అక్రమంగా తరలిస్తుండగా 35 టన్నుల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన గంగావతిలో జరిగింది. ఆహార పౌర సరఫరాల శాఖాధికారి శేఖరప్ప ఫిర్యాదు మేరకు ఈ దాడులు నిర్వహించారు. కొప్పళ జిల్లా కుకనూరు నుంచి గంగావతి, మాన్విలోని బియ్యం మిల్లులకు అక్రమంగా తరలిస్తున్న వాహనంలోని సుమారు రూ.10 లక్షలు విలువ చేసే బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై మాన్వికి చెందిన వీరభద్రప్ప ఆల్దాళ, బసనగౌడ ఆల్దాళ, రాయచూరు వెంకటరెడ్డి, కుకనూరు యమనూరప్పలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గ్రామీణ పోలీసుల దాడుల్లో.. బళ్లారిఅర్బన్: బళ్లారి గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం నిల్వలపై పోలీసులు దాడులు నిర్వహించి మొత్తం 123 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొదటి ఘటనలో ఎన్పీఆర్ లేఅవుట్ సమీపంలోని గుట్ట అంచున ఉన్న ఓ బహిరంగ ప్రదేశంలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు రూ.93,840 విలువ చేసే 40.80 క్వింటాళ్ల రేషన్ బియ్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో గుగ్గరహట్టికి చెందిన శరభయ్య అనే వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మరొక ఘటనలో ఆహార, పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించారు. కొళగల్లు– సిరుగుప్ప రహదారి మధ్యలో ఉన్న ఓ లేఅవుట్లో నిల్వ ఉంచిన సుమారు రూ.1,90,440 విలువ చేసే 82.80 క్వింటాళ్ల రేషన్ బియ్యంను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
ఒక్కో ఎమ్మెల్యేకు 3 ఐపీఎల్ టికెట్లు
బనశంకరి: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లకు టికెట్ ఇవ్వాలన్న ఎమ్మెల్యేల డిమాండ్ పై చర్చించడానికి డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్(కేఎస్సీఏ), డీఎన్ఏ, ఆర్సీబీ ప్రతినిధులతో సోమవారం భేటీ అయ్యారు. ఇంతకుముందు ఒక్కో ఎమ్మెల్యేకు 2 ఉచిత టికెట్లు ఇవ్వాలని అనుకోగా, ఈ భేటీలో దానిని 3కు పెంచడం గమనార్హం. బెంగళూరులో జరిగే ప్రతి మ్యాచ్కు 3 టికెట్లు ఇవ్వాలని తీర్మానించారు. డీకే శివకుమార్ మాట్లాడుతూ 3 ఉచితమని, ఇంకా ఎక్కువ కావాలనుకునేవారు కొనుగోలు చేయాలని చెప్పారు. చిన్నస్వామి స్టేడియంలో సీట్లు పెంచాలని కేఎస్సీఏ ఆలోచిస్తోందని, దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందించాలని తెలిపామన్నారు. మరో క్రికెట్ స్టేడియాన్ని ఎక్కడ కట్టాలో అలోచిస్తున్నట్లు తెలిపారు. కేఎస్సీఏ అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్ పాల్గొన్నారు. డీసీఎం డీకే శివకుమార్ -
ఘనంగా మహావీర్ జయంతి
రాయచూరు రూరల్: దిగంబర్ జైన్ సమాజం ఆధ్వర్యంలో వర్థమాన్ మహావీర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. సోమవారం బైరూన్ కిల్లాలో వెలసిన భగవాన్ ఆదినాథ్ దిగంబర జైన్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. భగవాన్ ఆదినాథ్ దిగంబర జైన్ ఆలయం నుంచి మహావీర్ సరి్క్ల్ వరకు మహిళలు కుంభకలశాలతో ఊరేగింపు నిర్వహించారు. పార్శ్వనాథ్కు ఉదయం అభిషేకాలు, గంగ పూజలు జరిపారు. దిగంబర జైన్ సమాజం సంచాలకుడు మహావీర్, అమృత కీర్తి, స్మృతి సాగర్, కిరణ్ కుమార్, పండిత ఉపాధ్యాయ, అనిల్ కుమార్, మహాబలిలున్నారు. విజయనగరలో... హొసపేటె: ప్రపంచానికి అహింసా పరమో ధర్మః అని చాటి చెప్పిన జైన మత 24వ తీర్థంకరుడు, భగవాన్ మహావీరుని జన్మదినం పురస్కరించుకుని మహావీర్ జయంతిని దేశవ్యాప్తంగా జైన్ భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారని నగర కమిషనర్ వివేకానంద తెలిపారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహావీర్ జయంతిలో పాల్గొని ఆయన మాట్లాడారు. శాంతి, అహింస, కరుణ, సత్యం, త్యాగానికి ప్రతీకగా భావించే మహావీర్ జయంతిని చైత్ర మాసంలో శుక్లపక్ష త్రయోదశి నాడు జరుపుకుంటారన్నారు. బిహార్లోని వైశాలిలో క్రీ.పూ. 599లో జన్మించిన వర్ధమాన మహావీరుడు తన 30వ ఏట రాజ్యాన్ని, సంపదను త్యాగం చేసి సత్యాన్వేషణలో ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారన్నారు. ఈ పవిత్రమైన రోజున జైన్ భక్తులు మహావీరుని విగ్రహానికి పాలు, నీటితో అభిషేకం చేస్తారు. దేవునికి పండ్లు, మిఠాయిలు సమర్పిస్తారు. భగవాన్ మహావీర్ ఆశయాలను, బోధనలను స్మరించుకుంటూ దేశంలోని పలు నగరాల్లో భారీ శోభాయాత్రలు నిర్వహిస్తారన్నారు. అహింసను పాటించాలని, జీవులపై దయ కలిగి ఉండాలని ఈ వేడుకల్లో తెలిపారు. అదనపు పోలీస్ అధికారి మంజునాథ్, అధికారి సిద్దలింగయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు. -
మైనర్ల డ్రైవింగ్ రక్తసిక్తం
చింతామణి: బైకును కారు ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు బాలలు తీవ్రంగా గాయపడ్డారు. రూరల్ పోలీసు స్టేషన్ పరిధి బెంగుళూరు రోడ్డు చాపుర దగ్గర సోమవారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు.. చింతామణి పట్టణానికి చెందిన అల్లాబకాష్ (16) హర్ష (16), రంజిత్లు బైక్లో చాపుర దగ్గర ఉన్న స్విమ్మింగ్ పూల్కు వెళ్తున్నారు. బైక్ను ఓ వైపునకు తిప్పగా, వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు వారిని ఢీకొట్టింది. దీంతో ముగ్గూరూ ఎగిరిపడ్డారు. ముగ్గురికీ కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. కారు పొలాల్లోకి దూసుకువెళ్లగా అందులోనివారు సురక్షితంగా ప్రమాదం నుంచి బయట పడ్డారు. స్థానిక ప్రజలు బాధితులను ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు పంపించారు. ఎస్ఐ ప్రకాష్, పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నపిల్లలు బైక్లు వేసుకుని ఇష్టానుసారం నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు వాపోయారు. పిల్లల బైక్ను ఢీకొన్న కారు ముగ్గురికి తీవ్రగాయాలు -
రన్వేపై టెక్కీ స్మోకింగ్
దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్టు రన్ వేపై టెక్కీ సిగరెట్ తాగుతుండగా, ప్రశ్నించిన సిబ్బందిపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఉత్కర్ష్ గౌతమ్ అనే ఐటీ ఇంజనీరు గూగుల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. విమానం ఎక్కడానికి ముందు రన్ వే మీదకు వచ్చి సిగరెట్ తాగుతున్నాడు, ఇది చూసిన గ్రౌండ్ సిబ్బంది.. సార్.. ఇక్కడ సిగరెట్ తాగరాదు అని చెప్పగా, కోపంతో అతనిపై దాడి చేశాడు. ఏవియేషన్ న్యూస్ అనే ఇన్స్టా ఖాతాలో దాడి వీడియో పోస్టు చేయడం వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఎయిర్పోర్టులో భద్రతా వైఫల్యాన్ని ప్రశ్నించడంతో పాటు గౌతమ్ను నో ఫ్లై లిస్టులో చేర్చాలని డిమాండు చేస్తున్నారు. అతనిని ఎయిర్పోర్టు భద్రతా సిబ్బంది మందలించినట్లు సమాచారం. -
సిలిండర్ల లారీ పల్టీ
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది, సిలిండర్లు దొరకడం గగనమైన తరుణంలో గ్యాస్ సిలిండర్లు తరలిస్తున్న లారీ బోల్తాపడిన సంఘటన గదగ్ జిల్లా రోణ పట్టణ శివారులో జరిగింది. హుబ్లీ నుంచి రోణ, గజేంద్రగడ మీదుగా కుష్టగి పట్టణానికి భారత్ గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ రోణ శివార్లలో మలుపులో ఓవర్టేక్ చేయబోయి రోడ్డు పక్కకు బోల్తా కొట్టింది. దీంతో గ్యాస్ సిలిండర్లు రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోయాయి. అదృష్టవశాత్తు అంతకుమించి జరగలేదు. ఎవరూ సిలిండర్లు ఎత్తుకుపోకుండా రోణ పోలీసులు బందోబస్తు కాశారు. గ్యాస్ సిలిండర్ల చోరీబొమ్మనహళ్లి: ఆనేకల్ తాలూకాలోని సూర్య సిటీలో బి–కాంపొనెంట్లో సిలిండర్ దొంగతనాలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలప్పుడు రెండు ఇళ్ల నుంచి మూడు సిలిండర్లు చోరీకి గురయ్యాయి. ఓ ఇంటివారు ఫుల్లు సిలిండర్ను తీసుకుని ఇంటి కిందిభాగంలో ఉంచారు. మరో రెండు ఇళ్లలోనూ సిలిండర్లు ఉన్నాయి. దీనిని కనిపెట్టిన దొంగలు వరుసగా సిలిండర్లను ఎత్తుకెళ్లారు. ఇద్దరు బైక్పై వచ్చారు, హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి వాటిని తీసుకెళ్లడం సీసీ కెమెరాలలో రికార్డయింది. గ్యాస్ కొరత వల్ల ఇలాంటి దొంగతనాలు పెరిగాయి. మేం సురక్షితంగా జీవించగలమా అనే ప్రశ్న తలెత్తుతోంది అని స్థానిక నివాసి పూర్ణేష్ రెడ్డి వాపోయారు. కట్న వేధింపులకు ఉద్యోగిని బలి రాయచూరు రూరల్: భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయచూరులోని ఐబీ రోడ్డులో ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు.. విద్య (30) అనే మహిళకు 2023 డిసెంబర్లో మంజునాథ్ ఉప్రాళమఠతో మూడు తులాల బంగారం, అర కేజీ వెండిని కానుకలుగా ఇచ్చి వివాహం జరిపించారు. ఆమె రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉప కేంద్రంలో అసిస్టెంట్ ప్రోగ్రాం అధికారిణిగా ఉద్యోగం చేసేది. భర్త మద్యం వ్యవసనంతో పాటు వరకట్న వేధింపులతో చిత్రహింసలకు గురి చేస్తుండేవాడు. పెద్దలు రాజీ చేసినా ఫలితం లేక పోయింది. ఆ బాధలు భరించలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి మృత్యుంజయస్వామి సదర్ బజార్ మహిళాళ పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశాడు. పూమొగ్గ మింగి శిశువు మృతిమైసూరు: జిల్లాలోని హుణసూరు తాలూకాలో చామంతి పువ్వు మొగ్గ ఆరున్నర నెలల పసికందు ప్రాణం తీసింది. వివరాలు.. దొడ్డ హెజ్జూర్లో సుదర్శన్, నవ్యల రెండవ కుమారుడైన చిన్మయ్ గౌడ మృతుడు. తండ్రి ఇంటి గడపకు పూజ చేసి పువ్వులను ఉంచాడు. పసివాడు చిన్మయ్ తన అన్నతో కలిసి ఆడుకుంటూ గడపపై ఉన్న చామంతి మొగ్గను మింగేశాడు. అది శ్వాసనాళంలో ఇరుక్కుపోయి బాలుడు ఊపిరి అందక అవస్థలు పడుతుండగా తల్లిదండ్రులు హనగోడ్లోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు, అక్కడి నుంచి మైసూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే కొంతసేపటికే శిశువు మరణించడంతో తల్లిదండ్రులు శోకంలో మునిగిపోయారు. -
పౌర కార్మికులకు సన్మానం
కోలారు: బేతమంగల గ్రామంలో కరగ మహోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వై.సంపంగి ఆధ్వర్యంలో పౌర కార్మికులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో శ్రమిస్తున్న పంచాయతీ పౌర కార్మికులను గుర్తించి సన్మానించడం అందరి కర్తవ్యమన్నారు. సమాజ ఆరోగ్యంలో పౌర కార్మికులు గొప్ప పాత్రను పోషిస్తున్నారన్నారు. సమాజంలో పౌర కార్మికులు అందిస్తున్న సేవలు శ్లాఘనీయమన్నారు. కార్యక్రమంలో టీఏపీసీఎంఎస్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షుడు లక్ష్మీపతి, డైరెక్టర్ పురుషోత్తం, గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు మమతా గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
సమాజ సేవతో పునీతులు కావాలి
రాయచూరు రూరల్: సమాజ సేవతో అందరూ పునీతులు కావాలని అఖిల భారత శరణ సాహిత్య పరిషత్ సంచాలకుడు గోరూరు చెన్నబసప్ప పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని వీరశైవ కళ్యాణ మంటపంలో స్వాతంత్య్ర సమర యోధుడు, న్యాయవాదిగా సేవలందించిన నాగప్ప చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజంలో ఉన్నత సేవలందించిన వారిని గుర్తించి సన్మానించారు. హిందుస్థానీ సంగీత గాయకుడు అంబయ్య నులిని పూలమాలతో సన్మానించారు. సమావేశంలో నాగప్ప ప్రతిష్టాన అధ్యక్షుడు తిప్పారెడ్డి, మల్లికార్జున, సభ్యులు నాగరాజ్, అంబాపతి పాటిల్, మహలింగప్ప పాల్గొన్నారు. నీటి సంపులో పడి చిన్నారి మృతిసాక్షి బళ్లారి: తల్లిదండ్రుల అజాగ్రత్త, చిన్నారి ఆటలాడుకునే క్రమంలో నీటి సంపులో పడి మృతి చెందింది. ఈ ఘటన కొప్పళ జిల్లా కారటగి పట్టణంలోని రాజీవ్గాంధీ నగరంలో చోటుచేసుకుంది. కలకప్ప అనే వ్యక్తి కుమార్తె హన్షిక (3) ఇంటి ఎదురుగా హర్షవర్ధన్ అనే బాలుడితో కలసి ఆటలాడుకుంటూ నీటి సంపులో పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా చిన్నారి అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతిరాయచూరు రూరల్: సింధనూరు తాలూకాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. కున్నటిగికి చెందిన విరుపాక్షయ్య (22) మల్లన గౌడ (22)లు శనివారం బైక్లో వెళ్తూ మార్గం మధ్యలో ట్యాంకర్కు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. సింధనూరులోని 21వ వార్డుకు చెందిన ముగ్గురు మిత్రులు ద్విచక్ర వాహనంలో వెళ్తూ ప్రమాదవశాత్తూ బంగాలి క్యాంప్ వద్ద బస్సును ఢీకొట్టారు. ఈ ఘటనలో సయ్యద్ యాసిన్(29) మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నమిత్తం రిమ్స్లో చేర్పించారు. మరో ఘటనలో ఎరువుల బస్తాలతో వెళ్తున్న ట్రాక్టర్ నాలుగవ మైలు వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పొలం యజమాని విరుపన గౌడ (50), డ్రైవర్ సుఖమని (35) మరణించారు. ిసింధనూరు గ్రామీణ సీఐ వీరన గౌడ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ చంద్రశేఖర తెలిపారు. ఫైర్ ఇంజన్ వాహనం ప్రారంభంహొసపేటె: నగరంలోని అగ్ని మాపక కేంద్రానికి మంజూరు చేసిన 6 వేలలీటర్ల సామర్థ్యం గల కొత్త ఫైర్ ఇంజన్ను ఎమ్మెల్యే గవియప్ప జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి జిల్లాకు రూ.80 లక్షల వ్యయంతో 6 వేల లీటర్ల నీటిని అందించే ఫైర్ ఇంజన్ను ఇవ్వడం జరిగిందని తెలిపారు. గంజాయి విక్రేతల అరెస్ట్హొసపేటె: నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని స్థానిక చిత్తవాడిగి పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తవాడి పోలీస్టేషన్ పరిధిలోని సిద్ధిప్రియ కళ్యాణ మండపం వెనుక గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో దాడి చేశారు. సతీష్ కుమార్, చిన్నబాలును అరెస్టు చేసి, వారి నుంచి సుమారు రూ.60 వేలు విలువైన 1,200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. చిత్తవాడి పోలీస్టేషన్లో కేసు నమోదు చేసి నిందితులను జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. దాడిలో చిత్తవాడి పోలీస్టేషన్ పీఐ సోమనాయక్, సిబ్బంది పాల్గొన్నారు. -
మన్కీబాత్లో ప్రధాని సందేశాలు భేష్
సాక్షి బళ్లారి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్కీబాత్ ద్వారా దేశ ప్రజలకు ఇచ్చే సందేశాలు బాగున్నాయని మాజీ ఎమ్మెల్యే గాలిసోమశేఖర్ రెడ్డి కొనియాడారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ మన్కీబాత్ సందేశాన్ని జిల్లాలోని కురుగోడు తాలూకా దమ్మూరు వేంకావాదూత మఠంలో స్థానిక బీజేపీ కార్యకర్తలు, నేతలతో కలసి వీక్షించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్, డీజల్, గ్యాస్ సమస్యలు తలెత్తడంతో భారత్ జాగ్రత్తగా అడుగులు వేస్తోందన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని సూచించారు. ప్రధానమంత్రి మన్కీబాత్లో అనే ముఖ్యమైన అంశాలను తెరపైకి తెచ్చారన్నారు. దేశంలో కొత్త అభివృద్ధి పనులు, సాంకేతికతలో మార్పులు, సామాజిక అంశాలు, ప్రజాసామ్యంపై నమ్మకం తదితర విషయాలను చర్చించారన్నారు. యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమవంతుగా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. దేశ భద్రత, వైద్యుల సంక్షేమం, యువత భవిషత్తు తదితర అంశాలపై మన్కీబాత్లో చర్చించారన్నారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్ కుమార్మోకా, మాజీ మేయర్ గుర్రం వెంకటరమణ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేఎస్ దివాకర్, కార్పొరేటర్లు కేఎస్ అశోక్, గోవిందురాజులు, మోత్కూర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ కోసం ప్రజల అగచాట్లు
● బుకింగ్ చేసినా దొరకని సిలిండర్లు ● గ్యాస్ ఏజెన్సీల వద్ద జనం క్యూ ● పలు హోటళ్లలో కట్టెల పొయ్యిపై వంటల తయారీ సాక్షి, బళ్లారి: మధ్య ప్రాచ్య దేశాల మధ్య యుద్దం ప్రారంభం కాక ముందు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే ఒకటి, లేదా రెండు రోజులకే సరఫరా చేసేవారు. యుద్ధం ప్రారంభమయ్యాక గ్యాస్ బుకింగ్ చేసి 20 రోజులు గడుస్తున్నా ఇంటి గుమ్మానికి చేరడం లేదు. వంట గ్యాస్ (ఎల్పీజీ) సరఫరాలో తీవ్ర అంతరాయం నెలకొంది. గ్యాస్ కొరతతో పలు హోటళ్లలో కట్టెల పొయ్యిలపై వంటలు చేయడం మొదలు పెడుతున్నారు. చిన్న చిన్న హోటళ్లను మూసివేసేందుకు సిద్ధం అవుతున్నారు. హోటళ్లు పెట్టుకుని జీవనం సాగించే కుటుంబాలు గ్యాస్ కొరతతో జీవనోపాధి కోల్పోతున్నాయి. గ్యాస్ ఏజెన్సీలు సందట్లో సడేమియా అంటూ గ్యాస్ సిలిండర్లను అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. సిలిండర్ల ధరలకు రెక్కలు రావడంతో హోటళ్లులో ధరలు కూడా పెంచుతున్నారు. గృహ అవసరాలకు రూ.960 ఉన్న గ్యాస్ సిలిండర్ రూ.2,000 ఇచ్చినా ఇవ్వడం లేదు. హోటళ్లు ఇతర వాణిజ్య అవసరాలకు అయితే గ్యాస్ సిలిండర్ను ఏకంగా రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు కొన్ని ఏజెన్సీలు విక్రయిస్తున్నాయని హోటల్ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా గత్యంతరం లేక అధిక ధరలు చెల్లించి గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేసి హోటళ్లు నడుపుతున్నామని చెబుతున్నారు. గ్యాస్ బుక్ చేసి 20 రోజులైనా సిలిండర్ ఇవ్వడం లేదని బళ్లారి నగరానికి చెందిన పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. -
పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాస్
కోలారు: తాలూకాలోని బెళగానళ్లి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షుడిగా బీఎం శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా భాగ్యమ్మ గోపాలప్ప ఎన్నికయ్యారు. సంఘం రాబోయే 5 సంవత్సరాల అవధికి ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన శ్రీనివాస్ 9 ఓట్లతో ప్రత్యర్థి బీ.ఎన్. ప్రవీణ్ కుమార్పై విజయం సాధించారు. ప్రవీణ్ కుమార్కు కేవలం 3 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్ష స్థానానికి భాగ్యమ్మ గోపాలప్ప ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. డైరెక్టర్ బీ.కే. మురళీధర, బీ.టీ.నాగరాజ్, బీ.కే. నాగేష్, బీ.ఎన్.రాజణ్ణ, శాంతమ్మ తదితరులు నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులను అభినందించారు. వైభవంగా కరగ ఉత్సవం కోలారు: ముళబాగిలు తాలూకా మరవేమన గ్రామంలో శనివారం రాత్రి ద్రౌపదమ్మ దేవి కరగ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలుత దేవాలయంలో గంధోత్సవం, గణపతి పూజ, కల్యాణోత్సవం, హసికరగ, అభిషేకం, హోమం, మహామంగళారతి, తీర్థ ప్రసాద వినియోగం జరిగింది. కరగ ప్రతి ఇంటి ముందుకు వెళ్లిన సమయంలో ప్రజలు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ద్రౌపదమ్మ దేవి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన వేదికపైన కరగ పూజారి చేసిన కరగ నృత్యం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. అగ్నిగుండ ప్రవేశంతో కరగ ఉత్సవం ముగిసింది. -
వైభవంగా మండల పూజ
మాలూరు: తాలూకాలోని లక్కూరు గ్రామంలో భక్తుల సహకారంతో నూతనంగా నిర్మించిన మునేశ్వర స్వామి దేవాలయంలో 48వ రోజు మండల పూజా కార్యక్రమాలను ఆదివారం వైభవంగా నిర్వహించారు. తొలుత మూల విగ్రహానికి అభిషేకం, పంచామృత అభిషేకం, వేదమంత్ర పారాయణం, కలశ స్థాపన, తదితర పూజలు చేపట్టారు. అంతకుముందు స్వామిని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం 2 వేల మందికి పైగా భక్తులకు అన్న సంతర్పణ జరిగింది. తాలూకాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చి పూజల్లో పాల్గొన్నారు. కొండపై పేలుళ్లను ప్రశ్నించినందుకు దాడి మాలూరు: కొండపై పేలుళ్లు జరుపుతుండడాన్ని ప్రశ్నించినందుకు ఇద్దరిపై దాడి చేసిన ఘటన తాలూకాలోని టీకల్ ఫిర్కా వీరకపుత్ర గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ మాజీ సభ్యుడు సురేష్, వెంకటేశప్ప కలసి అక్రమంగా కొండపై బ్లాస్టింగ్ చేపట్టారు. బ్లాస్టింగ్ చేసే ముందు గ్రామస్తులకు చెప్పాలి కదా అని వీరకపుత్ర గ్రామానికి చెందిన సురేష్, శ్రీనాథ్ ప్రశ్నించారు. ఆగ్రహించిన గ్రామ పంచాయతీ మాజీ సభ్యుడు సురేష్, వెంకటేశప్ప తదితరులు వీరకపుత్ర గ్రామానికి చెందిన సురేష్, శ్రీనాథ్పై దాడి చేశారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. మాలూరు పోలీసులు ఆస్పత్రికి వెళ్లి ఫిర్యాదు తీసుకున్నారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసుకున్నారు. ప్రశాంతంగా డైరెక్టర్ల ఎన్నికబొమ్మనహళ్లి: ఆనేకల్ తాలూకా మాయసంద్ర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 12 డైరెక్టర్ల స్థానాలకు ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. ఎం.రామకృష్ణ 422, కెంపన్న 412, ఎ.మూర్తి 412, మల్లేష్ రెడ్డి 394, శ్రీరామ 366, గెరటిగనబేలె నంజుండప్ప 364, ఆర్.గోపాలప్ప 312, హెచ్.ఎల్.రఘు 303, సి.చిన్నప్ప 375, సేవంతమ్మ 317, శశికళా 382, నవ్య 100 ఓట్లు సాధించి డైరెక్టర్గా ఎన్నికయ్యారు. హాప్కామ్స్ డైరెక్టర్ మేఘా, టీఏపీసీఎంఎస్ డైరెక్టర్ తిలక్ కుమార్ పాల్గొన్నారు. -
పెరుగుతున్న యువతుల అదృశ్యం కేసులు
హుబ్లీ: వివిధ కారణాలతో యువతులు అదృశ్యమవుతున్న కేసులు జిల్లా వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. కళాశాలకు, పరీక్షలకు, ఆలయాలకు, పర్యటనకు కుట్టుమిషన్ శిక్షణ, మెడికల్ షాపుకు, స్నేహితుల ఇంటికి, బట్టలు కుట్టించేందుకు సంఘంలో డబ్బులు కట్టడానికి, పాలు తీసుకురావడానికి ఇలా వివిధ కారణాలు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతులు కనిపించకుండా పోతున్నారు. మరి కొందరెమో ఇంట్లో ఎవరు లేని సమయంలో, రాత్రి పూట అందరూ నిద్రించాక వెళ్లిపోతున్నట్లు వెల్లడైంది. ఇలా వెళ్లిన వారిలో 18 నుంచి 23 ఏళ్ల వయస్సు లోపు ఉన్న యువతులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈ కేసులు నిగ్గుతేల్చడానికి ప్రయత్నించిన పోలీసులకు ఎక్కువగా తెలిసిన విషయం ఏమిటంటే ప్రేమ వివాహాలే. 2025 అక్టోబర్ నుంచి గత ఫిబ్రవరి వరకు ఇలాంటి 65 కేసులను పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఫిబ్రవరి 15 వరకు వివిధ పోలీస్టేషన్లలో ఇలాంటి కేసులు 25 నమోదు కాగా... వీటిలో 14 మందిని పట్టుకున్నారు. ఇంటి పని, అలాగే చదువు గురించి పోషకుల వేధింపులతో పాటు కౌటింబిక దౌర్జన్యానికి కొందరు యువతులు ఇంటిని విడిచి వెళ్లిపోతున్నారు. ప్రేమ విషయం తెలిస్తే కుటుంబ సభ్యులు హింసించడం, బలవంతంగా పెళ్లిళ్లు నిర్ణయించడం వంటి కారణాల వల్ల యువతులు అదృశ్యమవుతున్నట్లు దర్యాప్తులో తేలిందని నగర ఏసీపీ శివానంద తెలిపారు. కొన్నేళ్ల వివరాలను పరిశీలిస్తే.. 2023లో 239 కేసులకు గాను 234 పరిష్కరించగా.. 5 కేసులు దర్యాప్తు దశలో ఉన్నాయి. 2024లో 250 కేసులకు గాను 243 పరిష్కరించారు. 7 కేసులు పెండింగ్లో ఉన్నాయి. 2025లో 180 కేసులకు గాను 169 పరిష్కరించగా 11 దర్యాప్తు దశలోనే ఉన్నాయి. తాజాగా ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి వివరాలు పరిశీలిస్తే.. 25 కేసులు నమోదు కాగా వాటిలో 14 కేసులను పరిష్కరించగా 11 ఇంకా దర్యాప్తు దశలోనే ఉన్నాయి. -
విద్యార్థులకు రవాణా సౌలభ్యం
రాయచూరు రూరల్: సర్కార్ పాఠశాలలను బలోపేతం చేయడంతోపాటు విద్యార్థులకు రవాణా సౌలభ్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి బడిగెర, తాలూకా విద్యాశాఖ అధికారి ఈరణ్ణ కోస్గి పేర్కొన్నారు. యర మరాస్ ఆదర్శ విద్యా సంస్థ విద్యార్థుల కోరిక మేరకు ప్రభుత్వ పాఠశాల వేదిక, భారత జ్ఞాన విజ్ఞాన సమితి, మహిళ వేదిక ఆధ్వర్యంలో నూతనంగా ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇంట్లో విద్య కేవలం సంస్కారం, సంప్రదాయాలు ఆచార వ్యవహారాల కోసమైతే.. పాఠశాలలో లభించే విద్య జీనవ ప్రమాణాలను పెంచుతుందని పేర్కొన్నారు. మన పాఠశాల, మన హక్కు లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. కార్యక్రమంలో శివరాజ్, సంగీత, శివకుమార్ పాటిల్, హఫీజూల్లా, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల విలీనం వద్దు రాయచూరు రూరల్: కర్ణాటక పబ్లిక్ స్కూల్ (కేపీఎస్) ప్రాజెక్టు కింద ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఏఐడీఎస్ఓ నాయకులు వ్యతిరేకించారు. ఆదివారం అరికెర తాలుకా అడకల గుడ్డ పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులతో కలసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంచాలకుడు శాంతరాజ్ మాట్లాడుతూ.. కల్యాణ కర్ణాటక భాగంలోని మండళి నిధులను వాడుకోవడం తగదన్నారు. పాఠశాలల విలీనం ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కోరారు. విద్యుత్ తీగలు తగిలి లారీ దగ్ధంహొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకాలో ఆదివారం చిప్స్ ప్యాకెట్లతో వెళ్తున్న లారీ మంటల్లో కాలిపోయింది. లారీ బెంగళూరు నుంచి శివపుర హైవే మీదుగా రాష్ట్ర రహదారిపైకి వచ్చి హువినహడగలి వైపు బయలుదేరింది. మార్గంమధ్యలో వాహనానికి విద్యుత్ తీగ తగలడంతో మంటలు చెలరేగాయి. లారీ డ్రైవర్, సహాయకుడు వెంటనే లారీ నుంచి కిందకు దూకి ప్రాణాలతో బయటపడ్డారు. మంటల్లో లారీ పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. ఇంజక్షన్ వికటించి విద్యార్థిని మృతిరాయచూరు రూరల్: నకిలీ వైద్యుడు చేసిన ఇంజక్షన్ వికటించి విద్యార్థిని మృతి చెందిన ఘటన ఆదివారం మస్కి తాలుకాలో చోటుచేసుకుంది. అమినగడకు చెందిన 9వ తరగతి విద్యార్థిని సింధు (15) శనివారం రాత్రి అనారోగ్యానికి గురి కావడంతో వైద్య చికిత్సల కోసం వైద్యుడు ఉత్తమ్ కుమార్ వద్దకు తీసుకెళ్లారు. అయితే వైద్యుడు ఎలాంటి పరీక్షలు చేయకుండా సింధుకు ఇంజక్షన్ వేశాడు. ఆదివారం ఉదయానికి విద్యార్థిని శరీరంపై దద్దుర్లు వచ్చాయి. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు హుటాహుటిన మాన్వి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్తుండగా.. మార్గమద్యంలో మృతి చెందింది. సింధు మరణవార్త తెలుసుకున్న నకిలీ వైద్యుడు ఉత్తమ్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మాన్వి ప్రభుత్వాస్పత్రి వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
చిన్నారులను మింగిన నీటి కుంట
రాయచూరు రూరల్: యాదగిరి జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పొలంలో తవ్విన నీటి కుంటలో మునిగి నలుగురు పిల్లలు మృతి చెందారు. ఈ ఘటన యాదగిరి జిల్లా షోరాపూర్ తాలూకాలోని నాగానూర్లో చోటుచేసుకుంది. ప్రాథమిక నివేదికల ప్రకారం పిల్లలందరూ ఈతకు వెళ్లి, చెరువు లోతు తెలియక ఒకరి తర్వాత ఒకరు మునిగిపోయారు. యాదగిరి జిల్లా షోరాపూర్ తాలూకాలోని నాగానూర్ గ్రామానికి చెందిన పిల్లలు ఆదివారం సెలవు కావడంతో ఈత కొట్టేందుకు ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కృషి హోండా (నీటి కుంట) వద్దకు వెళ్లారు. సరదాగా ఈత కొట్టేందుకు ఒక్కొక్కరుగా దిగారు. లోతు ఎక్కువ ఉండటంతో అందరూ నీటిలో మునిగిపోయారు. కిరణ్ (6), బసమ్మ (11) శరత్ (6) హనుమేష్ (7) మృతులు. పిల్లలు కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. నీటి కుంట వద్దకు వెళ్లినట్లు తెలుసుకుని పరిశీలించారు. కుంటలోకి దిగి గాలించగా.. నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను బయటకు తీయడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయ్యో.. దేవుడా ఎంత ఘోరం జరిగిందని కంటతడి పెట్టుకున్న తీరు అక్కడున్న వారిని కలచివేసింది. ఒకే గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. షోరాపూర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జావీద్ ఇనామ్దార్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కెంబావి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందిన చిన్నారులు రోదిస్తున్న బాధిత కుటుంబ సభ్యులు యాదగిరి జిల్లాలో విషాదం ఈతకెళ్లి నలుగురు చిన్నారులు మృత్యువాత కన్నీరుమున్నీరుగా విలపించిన కుటుంబ సభ్యులు -
భల్లూకం బీభత్సం
దొడ్డబళ్లాపురం: రామనగర జిల్లా చన్నపట్టణ తాలూకా సింగరాజపుర–కోడంబళ్లి గ్రామాల రహదారిపై భల్లూకం బీభత్సం సృష్టించింది. అడవిలో నుంచి వచ్చి, బైకిస్టులపై దాడిచేసి గాయపరచింది. మారమ్మగుడి వద్ద రోడ్డుపైకి వచ్చిన ఎలుగుబంటి అటుగా వెళ్తున్న బైకిస్టులపై దాడి చేసింది. బైకిస్టులు ఎలాగో తప్పించుకోగా, ఓ టెంపోను అడ్డుకుని దాడికి ప్రయత్నించింది. ఎలుగుబంటిని చూసిన వాహనదారులు తమ వాహనాలను వదిలి పరారయ్యారు. ఈ వీడియో వైరల్గా మారింది. అటవీశాఖ అధికారులు గాలించి ఎలుగుబంటిని ఎట్టకేలకు బోనులో బంధించారు. ఎలుగుబంటి తిరగబడి అటవీశాఖ అధికారి ముత్తునాయక్, స్థానికుడు దొడ్డయ్యలను గాయపరిచింది. దానిని దూరంగా తరలించారు. రూ.1.28 కోట్ల సైబర్ దోపిడీ యశవంతపుర: మోసపోయేవారున్నంత కాలం మోసగించేవారు ఉంటారు. అమాయకత్వంతో చెప్పినట్టల్లా చేసి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ఫేస్బుక్లో వచ్చిన ప్రకటనను నమ్మి వ్యక్తి ఒకరు రూ.1.28 కోట్లు పోగొట్టుకున్న ఘటన చిక్కమగళూరులో వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లాలోని కడూరు తాలూకా శివపుర గ్రామానికి చెందిన కల్లేగౌడకు ఫేస్బుక్లో ఓ ప్రకటన కనిపించింది. తమ ద్వారా ఆన్లైన్లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని అందులో ఉంది. నమ్మిన కల్లేగౌడ అందులోని నంబరుకు కాల్ చేసి మాట్లాడాడు. అతని ద్వారా పెట్టుబడుల పేరుతో రూ.1.28 కోట్లు వసూలు చేశారు. ఎన్నిరోజులైనా రూపాయి కూడా తిరిగి రాలేదు. కల్లేగౌడ డబ్బులను విత్ డ్రా చేయబోగా, యాప్ పనిచేయలేదు. దీంతో అతడు సీఈన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీధి కుక్కల దత్తత బనశంకరి: బెంగళూరు దక్షిణ నగర పాలికె ఆధ్వర్యంలో జయనగర శాలిని మైదానంలో వీధి శునకాల కూనల దత్తత శిబిరం జరిగింది. పాలికె అధికారులు పాల్గొని కూనలను పలువురికి అప్పగించారు. వీధి కుక్కల సంఖ్యను క్రమేణా తగ్గించడం, మానవతా విధానాల ద్వారా కుక్కల సమస్యను పరిష్కరించడం తమ లక్ష్యమన్నారు. చిందులేసిన రౌడీల ఆటకట్టు దొడ్డబళ్లాపురం: బెంగళూరులో ఫేమస్ అయిన అణ్ణమ్మ పాటకు కత్తులు బట్టి డ్యాన్స్ చేసిన ఇద్దరు రౌడీషీటర్లను బ్యాటరాయనపుర పోలీసులు అరెస్టు చేశారు. నందీష్, రంజిత్లు కొన్ని రోజుల క్రితం రాత్రివేళ రోడ్డు మీద కత్తులు పట్టుకుని ఈ పాటకు చిందులేశారు. వారిని చూసి ప్రజలు భయభ్రాంతులయ్యారు. ఈ వీడియో వ్యాప్తి చెందగా పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్టు చేశారు. వీరిపై బెంగళూరులో పలు పోలీస్స్టేషన్లలో అనేక కేసులు నమోదై ఉన్నాయి.దావణగెరెలో గెలుపు మాదే: విజయేంద్ర శివాజీనగర: దావణగెరె దక్షిణ నియోజకవర్గ ఓటర్లు మార్పును కోరుకొంటున్నారని, ప్రతిసారి కాంగ్రెస్ను గెలిపించినా ఎలాంటి అభివృద్ధి పనులు జరుగలేదు. ఈసారి మార్పు రావాలని, ధన బలం, భుజబలాన్ని లెక్కించకుండా బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తారని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర అన్నారు. బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ దాస కరియప్ప తరఫున ఆయన ప్రచారం చేశారు. చేనేతకారుల సముదాయ భవన్లో చేనేతకారులతో సభ జరిపారు. కరియప్పను గెలిపిస్తే అన్ని వర్గాలకు న్యాయం లభిస్తుందన్నారు. ఈసారి గెలుపు తథ్యమని అన్నారు. సీఎం సిద్దరామయ్య 17 బడ్జెట్లను ప్రవేశపెట్టినా రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు. 5 రాష్ట్రాల ఎన్నికల తరువాత కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినట్లు సిద్దరామయ్య వినాలన్నారు. బెంగళూరులో విక్టరీ వెంకటేష్ బనశంకరి: ప్రముఖ తెలుగు నటుడు విక్టరీ వెంకటేశ్ బెంగళూరు బసవనగుడిలో ప్రముఖ హోటల్ విద్యార్థి భవన్లో మసాలా దోసె రుచిచూశారు. ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరుకు వచ్చిన ఆయన విద్యార్థి భవన్ హోటల్ను సందర్శించారు. మసాలా దోసెను ఆరగించారు. -
విహారయాత్రలో పెను విషాదం
యశవంతపుర: నగర జీవనం నుంచి విరామం తీసుకుని సముద్ర తీర ప్రాంతాలను చూసి రావాలనే ఆశ విషాదాంతమైంది. రోడ్డు పక్కలో నిలిపి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుంచి కారు ఢీకొన్న ప్రమాదంలో తల్లీ కూతురు దుర్మరణం చెందారు. ఈ ఘటన ఉడుపి జిల్లా బైందూరు తాలూకా నావుంద వద్ద శనివారం రాత్రి జరిగింది. వివరాలు.. బెంగళూరు నుంచి విహారయాత్రకు వెళ్లిన మమత (36), ఆమె కూతురు ధృతిక (14) మరణించగా, భర్త రఘు (40), పిల్లలు జాహ్నవి (12), చార్వీ (10), కారు డ్రైవర్ కిరణ్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. బెంగళూరు నుంచి వెళ్లిన వీరు అనేక పర్యాటక స్థలాలను దర్శించారు. మురుడేశ్వర, గోకర్ణ క్షేత్రాలను చూడాలని వెళ్తున్నారు. బైందూరు వద్ద రోడ్డు పక్కలో నిలిపిన కంటైనర్ను కారు ఢీకొంది. కారు ముందుభాగం తుక్కుగా మారింది. ఇద్దరు అక్కడే చనిపోగా, మిగతావారికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ కిరణ్ అరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మత్తులో కారుతో బైక్ను ఢీ, ఇద్దరు మృతి శివాజీనగర: మద్యం మత్తులో వన్ వేలో అతివేగంగా వచ్చిన కారు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనగా ఇద్దరు అక్కడే మరణించిన ఘటన బెంగళూరు నడిబొడ్డున హైగ్రౌండ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో వక్ఫ్ బోర్డు కార్యాలయం వద్ద జరిగింది. మృతులు జుబేర్ అహమ్మద్ (42) అబ్దుల్ మునీర్ పాషా (16). శనివారం రాత్రి వీరిద్దరు బైక్లో వెళ్తున్నారు, అయ్యప్ప అనే వ్యక్తి మద్యం తాగి కారును నడుపుతూ వేగంగా దూసుకొచ్చి ఢీకొన్నాడు. తీవ్రగాయాలతో ఇద్దరూ చనిపోయాడు. హైగ్రౌండ్స్ ట్రాఫిక్ పోలీసులు స్థలానికి చేరుకొని పరిశీలించారు. కారు డ్రైవర్ అయ్యప్పను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. బైక్ నుంచి పడగానే.. ● క్యాంటర్ ఢీ, భర్త మృతి యశవంతపుర: తుమకూరు జిల్లా కుణిగల్ వద్ద హైవేలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి షరీఫ్ (60) మృతి చెందాడు. ఆయన భార్య హసీనా గాయపడి కుణిగల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇద్దరూ నెలమంగల నుంచి మంగళూరుకు బైకుపై వెళుతుండగా హైవేలో అదుపుతప్పి కిందపడ్డారు. ఈ సమయంలో వెనుక వస్తున్న క్యాంటర్ షరీఫ్పై దూసుకెళ్లడంతో ప్రాణాలు కోల్పోయాడు. కుణిగల్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బైక్ని ఢీకొన్న క్యాంటర్–ఇద్దరి మృతి దొడ్డబళ్లాపురం: క్యాంటర్ బైక్ని ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన బెంగళూరు–హైదరాబాద్ రహదారి మార్గంలోని సాదలి క్రాస్లో చోటుచేసుకుంది. చేళూరు నివాసులు నరసింహప్ప(45), నారాయణస్వామి(44)లు బైక్పై వెళ్తుండా సాదలి క్రాస్ వద్ద వేగంగా వచ్చిన క్యాంటర్ ఢీకొంది. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. పేరేసంద్ర పోలీసులు కేసు నమోదు చేశారు. నిలిచి ఉన్న కంటైనర్కు కారు ఢీ తల్లీ కూతురు దుర్మరణం ఉడుపి జిల్లాలో ప్రమాదం -
పరప్పన జైల్లో ఖైదీల జల్సా
బనశంకరి: బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అనేది రాష్ట్ర జైళ్ల శాఖకే పెద్ద తలనొప్పిగా మారింది. ఇక్కడ జరుగుతున్న అక్రమాలు ఉన్నతాధికారులకు సవాల్ విసురుతున్నాయి. ఈ జైలులో మొబైల్, టీవీ, నెట్ఫ్లిక్స్ సౌలభ్యాలు ఉన్నాయని, అంతకంటే ఇంకేం కావాలంటూ ఖైదీలు వీడియో తీసి వైరల్ చేశారు. జైళ్ల అధికారుల సహకారం కూడా ఇందుకు ఉందని తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్ ఉంది, ఈసారి కప్ మనదే, జైల్లో అన్ని సౌకర్యాలూ ఉన్నాయి అని ఆ వీడియోలో ఖైదీలు చెప్పారు. ముగ్గురు వార్డర్ల సస్పెండ్ వీడియో వైరల్ కాగానే జైలు అధికారులు ప్రతి బ్యారక్లో తనిఖీలు చేపట్టారు. ప్లాస్టిక్ కవర్ చుట్టి బాత్రూమ్ నీటిపైపులో దాచిపెట్టిన కొన్ని మొబైల్స్ లభించాయి. నిర్లక్ష్యం వహించారంటూ జైళ్ల శాఖ డీజీపీ అలోక్కుమార్ ముగ్గురు వార్డర్లను సస్పెండ్ చేశారు. సదరు ఖైదీల బ్యారక్ వద్ద పనిచేసే శివానంద కర్లబట్టి, నిరంజన్ ఏ.కామత్, హనుమంతప్ప హడపద పై వేటేశారు. అయితే ఆ వీడియోను నిజంగా జైలులోనే తీశారా? అనేది విచారణ చేపట్టారు. అలోక్కుమార్ పేరు తమకు ఈ సౌకర్యాలను జైళ్ల శాఖ డీజీపీ అలోక్కుమార్ కల్పించారని ఖైదీలు చెప్పడం పెద్ద చర్చనీయాంశమైంది. దర్శన్, అభి, ఎండ్రోస్ అనే ముగ్గురు ఖైదీలు ఈ వీడియోలో ఉన్నారు. హెణ్ణూరు బండె వద్ద జరిగిన హత్యలో దర్శన్, అబి నిందితులు. వీడియో నేపథ్యంలో ముగ్గురిపైనా పరప్పన అగ్రహార పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. వారిని క్వారంటైన్ సెల్కు మార్చారు. అలోక్కుమార్కు చెడ్డ పేరు తేవాలని ఈ వీడియోను చేశారని అనుమానాలున్నాయి. ఆయన జైళ్ల శాఖ చీఫ్ అయ్యాక పరప్పనపై ప్రత్యేక దృష్టి పెట్టి అక్రమాలకు చెక్పెట్టారు. మొబైల్స్, టీవీ, నెట్ఫ్లిక్స్ అన్నీ ఉన్నాయి ముగ్గురు నిందితుల వీడియో వైరల్ జైళ్ల శాఖ చీఫ్పైనే ఆరోపణలు -
ఇద్దరు చైన్స్నాచర్లు అరెస్ట్
దొడ్డబళ్లాపురం: చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్న తురువెకెరె తాలూకా మైసంద్ర గ్రామం నివాసి ముత్తురాజు (26), మధుగిరి తాలూకా కరడిపుర గ్రామానికి చెందిన శ్రీనివాస్ (38)ను కుదూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 41 గ్రాముల బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బెంగళూరు టీ దాసరహళ్లిలో నివసిస్తున్నారు. శుక్రవారం గుడేమారనహళ్లి వద్ద బేకరీలో జ్యూస్ తాగుతూ పక్కనే నిలబడి ఉన్న అంబిక అనే మహిళ మెడలోంచి చైన్ లాక్కుని పరారయ్యారు. ఈ ఘటనలో బాధితురాలికి గాయాలయ్యాయి. సీసీకెమెరాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి 24 గంటల్లోపు అరెస్టు చేశారు. -
శాంతి దూతకు జేజేలు
తుమకూరు: ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే ఆచరణలో భాగంగా, నగరంలో క్రైస్తవ సహోదర సహోదరీలు పామ్ సండే ఊరేగింపును నిర్వహించారు. నగరంలోని చర్చ్ సర్కిల్లో ఉన్న వెస్లీ ప్రార్థనాలయం నుంచి, వెస్లీ చర్చ్, టోమ్లిసన్ చర్చ్, దేవనూర్ చర్చ్, కురిపల్య చర్చ్లతో సహా 8 చర్చిల నాయకులు, పాస్టర్లు, క్రైస్తవ సహోదరులు ఖర్జూర చెట్టు మట్టలు పట్టుకుని గీతాలు ఆలపిస్తూ ఊరేగింపు జరిపారు. టౌన్ హాల్, ఎం.జి. రోడ్ గుండా ప్రయాణించి తిరిగి వెస్లీ చర్చికి చేరుకున్నారు. రెవరెండ్ సుధీర్ మాట్లాడుతూ, 2 వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు శాంతిదూతగా యెరూషలేము నగరంలోకి ప్రవేశించిన రోజును పురస్కరించుకుని, ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ అని వివరించారు. యేసు శాంతి రాజు. ఆయన శిలువ వేయబడినప్పటికీ, యావత్ మానవాళి రక్షణ కోసం తన రక్తాన్ని చిందించి, మోక్ష మార్గాన్ని చూపించారని తెలిపారు. ప్రపంచంలో నెలకొన్న యుద్ధ వాతావరణం తక్షణమే అంతమై, శాంతి వికసించాలని ప్రార్థించినట్లు తెలిపారు. వెస్లీ మహాదేవాలయానికి చెందిన ఫాదర్ మోర్గాన్ సందేశ్, రెవరెండ్ సుధీర్, రెవరెండ్ మనోజ్ కుమార్, రెవరెండ్ ఎలిజబెత్, కుసుమాంజలి, సావంత్, సంజీవ్ సుందర్కుమార్, అనిల్, వందలాది క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. తుమకూరులో ఘనంగా పామ్ సండే వేడుకలు -
డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యం
మైసూరు: కర్ణాటకను మత్తు పదార్థాల రహిత రాష్ట్రంగా మార్చాలన్నది ప్రభుత్వ సంకల్పం అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. ఆదివారం మైసూరులోని కర్ణాటక పోలీస్ అకాడమీలో 46వ బ్యాచ్ 327 మంది సివిల్ ఎస్ఐల పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా జరిగింది. సీఎం పాల్గొని గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. మత్తు పదార్థాల తయారీ, విక్రయాలను అరికట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా యువతీ యువకులు పెద్ద సంఖ్యలో మాదకద్రవ్యాలకు బానిసలవుతున్నారని తెలిపారు. మీరు క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వంతో ప్రజలకు సేవ చేయాలి. సమాజంలో పేదలు, మహిళలు, బలహీనులను, న్యాయాన్ని రక్షించడం పోలీసు శాఖ బాధ్యత అని చెప్పారు. ఎంత కష్టమైనా సరే, న్యాయం అందించే విధంగా పోలీసు శాఖ విధులను నిర్వర్తించాలి. న్యాయం అందించడంలో రాజీ పడకూడదు, దురాశకు, ప్రలోభాలకు లొంగరాదు, నిజాయితీగా, విశ్వసనీయంగా పనిచేయాలని సూచించారు. ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, వాటిని నివారించాలని సీఎం తెలిపారు. పోలీసు అధికారులకు ధైర్యం ఉండాలి, మీరందరూ అదే రీతిలో పనిచేయాలని అన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించిన విధంగా 8 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి జి. పరమేశ్వర్, సాంఘిక సంక్షేమ మంత్రి హెచ్.సి. మహదేవప్ప, డీజీపీ సలీం తదితరులు పాల్గొన్నారు. పేదల కోసం పనిచేయాలి ఎస్ఐల పాసింగ్ ఔట్ పరేడ్లో సీఎం -
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
హొసపేటె: రైలు కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. సుమారు 70 ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై పడి మృతి చెందాడు. మృతుడు తెలుపు రంగు పంచ, నీలం రంగు ఫుల్ షర్ట్, పచ్చ రంగు టవల్ ధరించాడు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించక పోవడంతో అతని మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీ గదిలో భద్రపరిచి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు. -
బైక్ను ఢీకొన్న కారు.. వ్యక్తికి తీవ్ర గాయాలు
నుజ్జయిన కారు బానెట్, అద్దం ప్రమాదంలో దెబ్బతిన్న బైక్ తీవ్రంగా గాయపడిన తిప్పేష్ హొసపేటె: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా కానాహొసహళ్లి సమీపంలో శనివారం చోటు చేసుకుంది. కూడ్లిగి తాలూకా జుట్టిలింగనహట్టికి చెందిన తిప్పేష్ (31) అనే వ్యక్తి సొంత బైక్పై పని మీద వెళుతున్నాడు. ఈ క్రమంలో మసీదు వద్ద యూటర్న్ తీసుకుని వెళుతుండగా కానాహొసహళ్లి నుంచి కూడ్లిగి వైపు అతివేగంగా వెళ్తున్న కారు దూసుకొచ్చి బైక్ను బలంగా ఢీకొనడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో ఎగిరిపడి రోడ్డుపైకి బలంగా తాకడంతో తలకు గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లగా, స్థానికులు హుటాహుటిన కూడ్లిగి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్లో బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరగడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి కానాహొసహళ్లి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణమైన కారును పోలీస్ స్టేషన్కు తరలించారు. -
అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపండి
హొసపేటె: జిల్లాలో అక్రమ మద్యం తయారీ, అమ్మకాలు, రవాణాను పూర్తిగా నియంత్రించి, జిల్లాను మద్యపాన రహిత జిల్లాగా మార్చాలని జిల్లాధికారిణి కవిత ఎస్ మన్నికేరి సూచించారు. తన కార్యాలయంలో అక్రమ మద్యంపై జరిగిన స్థాయి సంఘం సమావేశానికి అధ్యక్షత వహించి ఆమె మాట్లాడారు. అక్రమ మద్యం తయారీ, వ్యాపారంపై అధికారులు చురుకుగా వ్యవహరించాలి. అక్రమ మద్యం అమ్మకాలు లేదా రవాణా జరుగుతున్నట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పొరుగు జిల్లాలు లేదా రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణా జరిగే అవకాశం ఉన్నందున జిల్లా సరిహద్దుల్లోని చెక్పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేయాలన్నారు. ఎకై ్సజ్, పోలీస్ శాఖలు సమన్వయంతో పని చేస్తూ అనుమానాస్పద ప్రదేశాలపై నిరంతరం దాడులు చేయాలన్నారు. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ మాదేశ్, ఏఎస్పీ మంజునాథ్, ఏడీసీ బాలకృష్ణ, ఏసీ వివేకానంద, వివిధ శాఖల జిల్లా, తాలూకా స్థాయి అధికారులు హాజరయ్యారు. అధికారులకు కలెక్టర్ కవిత సూచన -
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
సాక్షి,బళ్లారి: మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం సరి కాదని జిల్లా న్యాయసేవల ప్రాధికార సంస్థ అధ్యక్షురాలు, ప్రముఖ న్యాయమూర్తి కేజీ శాంతి పేర్కొన్నారు. ఆమె శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆరోగ్యం ఎంతో ముఖ్యమైందన్నారు. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించేందుకు వీలవుతుందని గుర్తు చేశారు. ఉచిత ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అప్పుడప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఆరోగ్య రక్షణకు సమయం కేటాయించుకోవాలన్నారు. మంచి ఆహారపు అలవాట్లతో పాటు నిత్యం క్రమం తప్పకుండా యోగా, ధ్యానం, వాకింగ్ తదితరాలను దినచర్యలో భాగం చేసుకోవాలన్నారు. న్యాయమూర్తి ప్రమోద్, సీనియర్ సివిల్ జడ్జి రాజేష్, న్యాయమూర్తులు రాఘవేంద్రగౌడ, ఇబ్రహీం, ముదుకప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. జిల్లా న్యాయమూర్తి శాంతి -
బాల్య వివాహాలకు కళ్లెం వేయండి
రాయచూరు రూరల్: జిల్లాలో బాల్య వివాహాలకు కళ్లెం వేయాలని అధికారులకు జిల్లాధికారి నితీష్ సూచించారు. తన కార్యాలయ సభాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. జిల్లాలో బాలింతల మరణాల నియంత్రణ, స్కానింగ్ కేంద్రాలపై నిఘా, పోక్సో చట్టం, ఇతరత్ర అంశాలపై అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. మహిళలపై దౌర్జన్యం కేసులు, వరకట్నపు వేధింపులు, బాల్య వివాహాలు వంటి అంశాలపై వివరాలు సేకరించాలన్నారు. 250 గ్రామాల్లో బాల్య వివాహాలు పూర్తి స్థాయిలో అరికట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ అరుణాంగ్షు గిరి, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, నగర కమిషనర్ జుబిన్ మహాపాత్రో, సంతోష్ రాణి, సురేంద్ర బాబు, నందిత, నవీన్ కుమార్లున్నారు. -
బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే సాంత్వన
రాయచూరు రూరల్: తుంగభద్ర నదిలో మునిగి నలుగురు మృతి చెందిన విషయంపై రాయచూరు గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్ మృతుల కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మాన్వి తాలూకా కుర్డి గ్రామంలో మృతదేహాలకు పూలమాలలు వేసి ఒక కుటుంబానికి రూ.50 వేల నగదు పరిహారాన్ని అందించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా ప్రభుత్వం నుంచి మరింత ఆర్థిక సాయం అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగాల భర్తీ చేపట్టాలిరాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న 52,432 ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాలని నిరుద్యోగుల పోరాట సమితి డిమాండ్ చేసింది. శనివారం కలబుర్గిలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు శాంత కుమార్ మాట్లాడారు. ఇటీవల హుబ్లీ–ధార్వాడ, బాగలకోటెల్లో ఆందోళనలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో ప్రభుత్వం స్పందించి త్వరిత గతిన నియామకాలు చేపట్టాలంటూ మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి ముందుకు రాకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీని ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేశారు. నెల రోజుల్లోగా నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రికి పంపదలచిన వినతిపత్రాన్ని జిల్లాధికారికి సమర్పించారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరంచెళ్లకెరె రూరల్: నేటి ఆధునిక ప్రపంచంలో పని ఒత్తిడితో ప్రజలు ఆరోగ్యంపై దృష్టి పెట్టడం లేదు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని ఎమ్మెల్యే టీ.రఘుమూర్తి తెలిపారు. ఆయన చెళ్లకెరె తాలూకా నగరంగెరె గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య పరీక్ష శిబిరంలో పాల్గొని మాట్లాడారు. నగరంగెరెకు తాలూకాలోని అనేక చోట్ల నుంచి ప్రజలు వచ్చి ఈ ఆరోగ్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. జయదేవ ఆస్పత్రి మాజీ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ ప్రహ్లాద్, డాక్టర్ పాలాక్ష, గ్యారెంటీ సమితి అధ్యక్షుడు గద్దిగేరి తిప్పేస్వామి, ఓబన్న, లింగప్ప, కుమారస్వామి, మైలారప్ప, రాజు, రంగనాథ్, బాబు తదితరులు పాల్గొన్నారు. ఖాళీ సిలిండర్లతో నిరసనహొసపేటె: గ్యాస్ సిలిండర్ల సమస్యను పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం కార్యకర్తలు విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకాలో ఖాళీ సిలిండర్లను ఉంచి నిరసన చేపట్టారు. కాంగ్రెస్ నాయకురాలు వీణా మహంతేష్ మాట్లాడుతూ గత నెల రోజులుగా వంటగ్యాస్ కొరత కారణంగా ప్రజలు రోజూ వంట చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తాలూకాలోని గ్రామాలకు సిలిండర్లను సరఫరా చేసి ఈ సమస్యను పరిష్కరించాలని ఒత్తిడి చేశారు. రూ.6.62 లక్షల సామగ్రి చోరీహుబ్లీ: స్థానిక జవళి స్ట్రాల్లోని ఎలక్ట్రికల్ అంగడి తాళం పగలగొట్టి సుమారు రూ.6.62 లక్షల విలువ చేసే సామగ్రితో పాటు నగదును చోరీ చేశారు. కుసుగల్ రోడ్డులని శివగంగా లేఅవుట్ నందివర్ధన్ దోషికి చెందిన అంగడిలో రూ.5.60 లక్షల నగదు, అలాగే రూ.1.2 లక్షల విలువ చేసే పూజ సామగ్రి, మొబైల్ చోరీ చేశారు. ఘటనపై గంటికేరి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. వేడుకగా శోభాయాత్రరాయచూరు రూరల్: నగరంలో శుక్రవారం సాయంత్రం కోదండ రామాలయం వద్ద శ్రీరాముని శోభాయాత్ర వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తుల సమక్షంలో శోభాయాత్రకు శ్రీకారం చుట్టారు. శ్రీరాముని ఉత్సవాలను శాంతమల్ల శివాచార్య ప్రారంభించారు. భక్తుల కోలహలం మధ్య నగరంలో శ్రీరాముడు, ఆంజనేయుడి విగ్రహాలను ఊరేగించారు. యాత్రలో మాజీ ఎంపీ బీ.వీ.నాయక్, మాజీ ఎమ్మెల్యే తిప్పరాజ్ హవల్దార్, ఏఎస్పీ హరీష్, డీఎస్పీ శాంతవీర, నాగరాజ్, శాంతప్ప, గోపాలరెడ్డిలున్నారు. -
గేట్లతో పాటు పాత గొలుసుల మార్పు
హొసపేటె: తుంగభద్ర డ్యాం వద్ద 19వ క్రస్ట్గేట్ 2024 ఆగస్ట్ 10న తెగిపోయి కొట్టుకుపోవడంతో నాలుగు జిల్లాల్లోని రైతులు ఎదుర్కొంటున్న కష్టాలకు పరిష్కారం కనుగొనేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. గేట్లను మార్చడంతో పాటు వాటిని ఆపరేట్ చేయడానికి అవసరమైన గొలుసులను కూడా మార్చాలని ఇప్పుడు నిర్ణయించారు. నవంబర్ నెలలో 19వ గేట్ స్థానంలో తాత్కాలిక స్టాప్లాక్ గేటును బిగించి నీటి వృథా అరికట్టారు. గేట్ల గడువు ముగిసినా వాటిని మార్చకపోవడం, గొలుసులు ఊడిపోవడమే దీనికి మూల కారణమని నిపుణులు తెలిపారు. ఈ ఘటన తర్వాత ప్రభుత్వం మేల్కొని మొత్తం గేట్లను మార్చేందుకు చర్యలు చేపట్టింది. సుమారు రూ.42 కోట్ల వ్యయంతో 33 గేట్లను మార్చే పని ప్రారంభమైనప్పటికీ, పాత గొలుసులను మార్చకుండా వాటినే కొనసాగించాలని తొలుత నిర్ణయించారు. రైతుల నుంచి వ్యతిరేకతతో నిర్ణయం రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని సవరించుకుంది. తుంగభద్ర డ్యాంలోని మొత్తం 33 గేట్లన్నింటికీ కొత్త గొలుసులను ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.5.5 కోట్ల అదనపు గ్రాంటును విడుదల చేయగా, టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. దీనిపై చిన్న నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ఎస్.బోసురాజు ఇటీవల స్పందిస్తూ గేట్లతో పాటు గొలుసులను కూడా మారుస్తామని తెలిపారు. మంత్రి డ్యాం గేట్ల పనులను పరిశీలించి మాట్లాడారు. పనులు ఇప్పుడు వేగవంతం అయ్యాయి. 18 గేట్ల డిమెటలింగ్ పని ఇప్పటికే పూర్తయింది. ఐదు కొత్త గేట్లను అమర్చారు. మిగిలిన గేట్ల పనులు కూడా నిరంతరం పురోగమిస్తున్నాయి. మే నెలాఖరులోగా అన్ని గేట్లను అమర్చాలని ప్రభుత్వం కాంట్రాక్టు కంపెనీకి గడువు విధించిందన్నారు. జూన్కల్లా పనులు పూర్తి, రైతులకు ఆందోళన వద్దు –మంత్రి మే నెలాఖరులోగా లేదా జూన్ మొదటి వారంలోగా పనులన్ని పూర్తవుతాయని మంత్రి భరోసా ఇచ్చారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఆయన అన్నారు. తుంగభద్ర జలాశయం తొలి క్రస్ట్ గేట్ ఏర్పాటు విజయవంతమైంది. మరో వైపు పనులు నెమ్మదిగా సాగుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గేట్ల మార్పు ఆలస్యమైతే, వచ్చే ఏడాది కూడా వేసవి పంటలకు నీటి సమస్య కొనసాగే అవకాశం ఉంది. అందువల్ల ప్రభుత్వం, అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పని చేసి రైతుల సమస్యలను త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద తుంగభద్ర జలాశయంలో గేట్ల మార్పిడి పనులు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి. ఇవి సకాలంలో పూర్తయితే లక్షలాది మంది రైతులకు ఉపశమనం లభిస్తుంది. తుంగభద్ర డ్యాం వద్ద క్రస్ట్గేట్ల పనులు చేపట్టిన దృశ్యం క్రేన్ సాయంతో కొత్త గేట్ను బిగిస్తున్న దృశ్యం 19వ క్రస్ట్గేట్ కొట్టుకుపోయిన తర్వాత మేల్కొన్న ప్రభుత్వం తుంగభద్ర ఆయకట్టు రైతుల్లో వెల్లివిరిసిన ఆనందం -
ప్రియుడి మోజులో భర్త ప్రాణాలు బలి
సాక్షి,బళ్లారి: ప్రియుడి మోజులో పడిన ఓ భార్య వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి సుపారీ ఇచ్చి దారుణంగా చంపించిన ఘటన యాదగిరి జిల్లాలో వెలుగు చూసింది. చామనహళ్లి తాండాకు చెందిన ఆటో డ్రైవర్ అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీని పోలీసులు చేధించారు. భార్య వివాహేతర సంబంధం కారణంగా భర్త హత్యకు గురైనట్లు పోలీసుల విచారణలో తేలింది. వివరాలు.. చామనహళ్లి తాండాకు చెందిన సాగర్ రాథోడ్(35), పూజ భార్యాభర్తలు. కాగా పూజ అదే గ్రామానికి చెందిన రెడ్డి రాథోడ్ అనే వ్యక్తితో మూడేళ్లుగా అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. తమ ఆనందానికి భర్త అడ్డుగా ఉన్నాడని పథకం ప్రకారం హతమార్చేందుకు కుట్ర పన్నారు. ఈక్రమంలో పూజా, ఆమె ప్రియుడు రెడ్డి రాథోడ్ ఇద్దరూ కలిసి మహేష్ అనే వ్యక్తికి రూ.లక్ష సుపారీ ఇచ్చి హత్య చేయాలని సూచించారు. దీంతో ఈనెల 22న పథకం ప్రకారం సాగర్ రాథోడ్ను సుత్తితో కొట్టి మహేష్ హత్య చేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లి కారుతో ఢీకొట్టించి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు చిత్రీకరించారు. అనుమానంతో పోలీసులు కూపీ లాగగా.. అయితే మృతదేహంపై గాయాలు ఉండటంతో పాటు సుత్తితో తలపై కొట్టినట్లు కూడా ఆనవాళ్లు కనిపించాయి. దీంతో పోలీసులకు అనుమానం రావడంతో పాటు స్థానికులు కూడా వారి అక్రమ సంబంధం గురించి తెలిపారు. ఫోన్ను తీసుకుని కాల్ డేటా వివరాలు సేకరించారు. దీంతో అసలు విషయం బయట పడింది. భార్య పూజాను పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా తామే హత్య చేయించినట్లు అంగీకరించింది. మృతుని భార్యతో పాటు ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరిని యాదగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని దారుణ హత్య ప్రియుడితో కలిసి భర్తను హతమార్చినట్లు వెలుగులోకి మృతుడి భార్యతో సహా ముగ్గురు నిందితుల అరెస్ట్ -
పాఠశాలల విలీనం తగదు
రాయచూరు రూరల్ : రాష్ట్రంలోని ప్రభుత్వ కన్నడ పాఠశాలలను మూసివేసి కర్ణాటక పబ్లిక్ పాఠశాల(కేపీఎస్)లోకి విలీనం చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించిన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలను బంద్ చేయబోమని ఆదేశాలు జారీ చేయాలని ఏఐడీఎస్ఓ డిమాండ్ చేసింది. శనివారం లింగసూగూరు తాలూకా హట్టి ప్రభుత్వ పాఠశాల వద్ద విద్యార్థులతో చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు శరణప్ప మాట్లాడారు. విద్యను వ్యాపారీకరణ చేయరాదన్నారు. కేపీఎస్ల స్థాపనకు కళ్యాణ కర్ణాటక ప్రాంత అభివృద్ధి మండలి నిధులను వాడుకోవడం సరికాదన్నారు. -
ఓటు హక్కు మనకు వజ్రాయుధం
బళ్లారి రూరల్ : ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని దావణగెరెలో జాగృతి ర్యాలీని నిర్వహించారు. జిల్లా యంత్రాంగం, జెడ్పీ, జిల్లా పోలీసు యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం దావణగెరె ఏపీఎంసీ రోడ్డులో గణేశ్ హోటల్ నుంచి 13వ క్రాస్ వరకు ర్యాలీ జరిగింది. ఓటు హక్కు విలువ, ఉత్తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి ఓటు హక్కును వినియోగించుకోవాలని నినాదాలు చేశారు. ర్యాలీలో వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బాటిల్ మందు ఇస్తే.. దిగుతా● టవర్ పైకెక్కి ఓ మందుబాబు హల్చల్ సాక్షి,బళ్లారి: మద్యం మత్తులో ఓ వ్యక్తి సెల్ టవర్ పైకెక్కి, మద్యం బాటిల్ ఇస్తేనే కిందకు దిగుతానని, లేకపోతే దూకుతానని బెదిరిస్తూ హల్చల్ చేశాడు. విజయపుర జిల్లా తికోటా తాలూకా కోట్యాళ గ్రామానికి చెందిన ఓ మందుబాబు నిత్యం మందు తాగకుండా ముద్ద తినేవాడు కాదు. దీంతో మద్యం మత్తులో శనివారం గ్రామంలోని సెల్ఫోన్ టవర్ పైకెక్కి, పై నుంచి అరుస్తూ మందు బాటిల్ పంపాలని కేకలు వేశాడు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గ్రామస్తులు, పోలీసులు టవర్ వద్దకు చేరుకుని, మందు బాబును సురక్షితంగా కిందకు దింపేందుకు అష్టకష్టాలు పడ్డారు. గతంలో కూడా ఈ వ్యక్తి ఇదే విధంగా సెల్టవర్ పైకెక్కి మందు కోసం హల్చల్ చేశాడని స్థానికులు చెబుతున్నారు. ఖైదీలకు గుట్కా, సిగరెట్ సరఫరా● ఇద్దరు జైలు సిబ్బంది, ఆటో డ్రైవర్ అరెస్ట్ హుబ్లీ: ఖైదీలకు గుట్కా, సిగరెట్ అందిస్తున్నారన్న ఆరోపణలపై ధార్వాడ జైల్కు చెందిన ఇద్దరు సిబ్బంది, అలాగే వాటిని తెచ్చి ఇచ్చిన ఆటో డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ కమిషనర్ శశికుమార్ మీడియాతో మాట్లాడుతూ జైలు సిబ్బంది అల్తాఫ్, రాజుతో పాటు ఆటో డ్రైవర్ మహబూబ్నగర్ మునీర్ అహ్మద్ను అరెస్ట్ చేశామన్నారు. వీరి నుంచి రూ.75 వేల విలువ చేసే పొగాకు ఉత్పత్తులతో పాటు ఆటోను కూడా జప్తు చేశామన్నారు. ఈ నెల 8న ఉదయం 3 గంటలకు పెద్ద సంచిని జైల్ దగ్గర పెట్టారు. దాన్ని కొందరు జైల్ లోపలికి తీసుకెళ్లారు. ఘటనపై దర్యాప్తు చేపట్టి కేసు నమోదు చేసుకొని బాధ్యులు జైల్ వార్డెర్లు అని దర్యాప్తులో తెలిసిందన్నారు. ఆటో డ్రైవర్ మునీర్ అహ్మద్ గుట్కా, సిగరెట్ ఉన్న బ్యాగ్ను గేటు ముందు తెచ్చి పెట్టి వెళ్లిన తక్షణమే అల్తాఫ్, రాజు వాటిని లోపలికి తీసుకెళ్లే వారు. వీటిని రెట్టింపు ధరలకు ఖైదీలకు అందించే వారు. నిందితులను జుడీషియల్ కస్టడీకి అప్పగించామన్నారు. జైల్ లోపల గంజాయి, మధ్యం లభించలేదు. గుట్కా, సిగరెట్లను బయట నుంచి ఎవరు అందించే వారో వివరాలు తెలుసుకున్నామని, వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. నలుగురు పోలీసులకు ముఖ్యమంత్రి పతకాలు హొసపేటె: విజయనగర జిల్లాకు చెందిన నలుగురు పోలీసు అధికారులు, సిబ్బందికి ముఖ్యమంత్రి బంగారు పతకాలు లభించాయి. హరపనహళ్లి డీఎస్పీ డాక్టర్ సంతోష్ చౌహాన్, హూవినహడగలి సీఐ దీపక్ బూసరెడ్డి, టీబీ డ్యాం ఎస్ఐ కోదండపాణి, హరపనహళ్లి స్టేషన్ పోలీస్ కానిస్టేబుల్ ఆనంద్లకు సీఎం బంగారు పతకాలు దక్కాయి. వచ్చే నెల 2న ఈ బంగారు పతకాలను ముఖ్యమంత్రి సిద్దరామయ్య చేతుల మీదుగా అందజేస్తారు. ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నా రాయచూరు రూరల్ : జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలను అరికట్టాలని కర్ణాటక రాష్ట్ర సమితి(కేఆర్ఎస్) నాయకులు డిమాండ్ చేశారు. శనివారం సింధనూరు ఎకై ్సజ్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు నిరుపాది మాట్లాడారు. సింధనూరు తాలూకా కన్నేరి గ్రామంలో అక్రమ మద్యం విక్రయాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. క్రీడల్లో గెలుపోటములు సహజం రాయచూరు రూరల్: క్రీడాకారులు క్రీడల్లో గెలుపు, ఓటమిలను సమానంగా స్వీకరించాలని వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ హన్మంతప్ప అభిప్రాయపడ్డారు. శనివారం వ్యవసాయ విశ్వ విద్యాలయం క్రీడా మైదానంలో మూడు రోజుల పాటు జరిగిన క్రీడా పోటీల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రీడాకారులనుద్దేశించి ఆయన మాట్లాడారు. క్రీడలతో మానసికంగా, శారీరకంగా ఎదగడానికి అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జాగృతి దేశమాన్, సతీష్ కుమార్, రాజణ్ణ, ప్రభురాజ్లున్నారు. -
షికారుకెళ్లి.. ముగ్గురు విద్యార్థుల దుర్మరణం
దొడ్డబళ్లాపురం: బైక్పై సరదాగా షికారుకు వెళ్లిన యువకులు లారీ ఢీకొని మృతిచెందిన సంఘటన నెలమంగల– హాసన్ హైవేలో జరిగింది. అభిలాష్ (21), మనోజ్ (21), నవీన్ (21) మృతులు. బెంగళూరులో ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ చదువుతున్న ముగ్గురూ పీజీ హాస్టల్లో ఉండేవారు. శుక్రవారం రాత్రి బైక్లో కుణిగల్ వైపు వెళ్తుండగా మాగడి తాలూకా మరూరు హ్యాండ్ పోస్టు వద్ద జాతీయ రహదారిపై లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్ర గాయాలతో అక్కడే దుర్మరణం చెందారు. నెలమంగల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలో రూ.20 లక్షల చోరీ మైసూరు: నగరంలోని బోగాదిలో ఉన్న మాతా విద్యా అమృతానందమయి సంస్థలోని ప్రిన్సిపాల్ ప్రైవేట్ గది తాళాలు విరగ్గొట్టి చొరబడిన దొంగలు అక్కడి అల్మారాలోని రూ.20 లక్షల నగదును దోచుకెళ్లారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ నళినాక్షి విధులు ముగించుకుని కార్యాలయానికి తాళం వేసుకుని వెళ్లారు. మరుసటి రోజున తాళం పగులగొట్టి ఉండటాన్ని చూసి స్వీపర్ ప్రిన్సిపాల్కు ఫోన్ చేసి చెప్పారు. అందరూ వచ్చి చూడగా నగదు కనిపించలేదు. విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో వసూలు చేసిన నగదు దొంగల పాలైందని వాపోయారు. సరస్వతీపురం ఠాణాలో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేత హత్య దొడ్డబళ్లాపురం: బాగలకోట తాలూకా గద్దనకేరి క్రాస్ వద్ద శుక్రవారం రాత్రి కాంగ్రెస్ నేత హత్యకు గురయ్యాడు. స్థానిక కాంగ్రెస్ నేత సంగప్ప నలతవాడ హత్యకు గురైన వ్యక్తి. స్కూటర్పై వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, రాడ్లతో దాడి చేసి హత్య చేసి పరారయ్యారు. ఎవరు, ఎందుకు చేశారనేది తెలిసిరాలేదు. కలాదగి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మంత్రి జమీర్.. గో బ్యాక్ దొడ్డబళ్లాపురం: మంత్రి జమీర్ అహ్మద్కి బాగల్కోటలో నిరసన సెగ తగిలింది. ఉప ఎన్నికల నేపథ్యంలో జమీర్ ఎన్నికల ప్రచారానికి వెళ్లగా ముస్లింలు గోబ్యాక్ జమీర్ అంటూ నినాదాలు చేసి అడ్డుకున్నారు. స్థానిక అంజుమన్ విద్యా సంస్థకు ఉన్న అధ్యక్షున్ని అవిశ్వాస నిర్ణయం ద్వారా తొలగించి కొత్త అధ్యక్షున్ని ఎన్నుకుని ఆమోదం కోసం వక్ఫ్ బోర్డుకు పంపించారు. 9 నెలల నుంచి ఆ పని పెండింగ్లో ఉంది. ఎన్నిసార్లు విన్నవించినా మంత్రి జమీర్ స్పందించలేదనే కోపంతో అక్కడి ముస్లింలు అడ్డుకున్నారు. పేద అంజుమన్ విద్యాసంస్థకు మంత్రి అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు. కరెంటు పోల్పై కార్మికుడు దుర్మరణం మండ్య: మండ్య జిల్లాలోని శ్రీరంగపట్నం తాలూకాలోని హెబ్బడి గ్రామంలో విద్యుత్ శాఖ అధికారుల అలసత్వం వల్ల, స్తంభంపై ప్రైవేట్ విద్యుత్ కార్మికుడు కరెంటు షాక్కు గురై మరణించాడు. వివరాలు... మండ్య తాలూకా జి.మల్లిగెరెవాసి విశ్వ (48) ఓ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తుంటాడు. శనివారం కరెంటు స్తంభంపై పనిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. అతని మృతదేహం రెండు గంటల పాటు స్తంభానికే వేలాడుతూ ఉంది. ఈ ఘటనతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అరకెరె పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. వారు చేరుకుని మృతదేహాన్ని కిందకు దించి, పోస్ట్మార్టం కోసం మైసూరులోని కేఆర్ ఆసుపత్రికి పంపించారు. మొదట కరెంటు తీసివేశామని చెప్పిన విద్యుత్ సిబ్బంది ఆ పని చేయలేదని, దీంతో విశ్వకు కరెంటు షాక్ కొట్టిందని సమాచారం. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఓ కుటుంబం రోడ్డున పడింది. కుటుంబానికి పరిహారం అందించాలని స్థానికులు డిమాండ్ చేశారు. -
ఖజానా నుంచి దేవస్థానానికి..
మండ్య: మండ్య జిల్లాలోని మేలుకోటె శ్రీ చెలువ నారాయణస్వామి చారిత్రక వైరముడి బ్రహ్మోత్సవం నేపథ్యంలో, వజ్రాలు పొదిగిన వైరముడి, రాజముడి కిరీటాలు, ఇతర బంగారు, వజ్రాభరణాలను శనివారం ఉదయం జిల్లా ఖజానా నుంచి మేలుకోటె దేవస్థానానికి తీసుకువచ్చారు. జిల్లా కలెక్టర్ కుమార్, జెడ్పీ సీఈఓ కె. ఆర్. నందిని, ఎస్పీ శోభారాణి తదితరులు మండ్య నగరంలో ట్రెజరీలోని నగల మూటలను ఉదయం 7 గంటలకు బయటకు తీసుకువచ్చారు. తరువాత పూలమాలలు వేసి, పూజలు చేశారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ఉంచి దేవస్థానానికి తీసుకువచ్చి ఆలయ అధికారులకు అప్పగించారు. దారి పొడవునా స్వాగతోత్సవం వైరముడి కిరీటాన్ని సంవత్సరంలో ఇప్పుడు మాత్రమే ఖజానా నుంచి బయటకు తీస్తారు. మొదట ఖజానా నుంచి బయలుదేరిన వాహనం నగరంలోని శ్రీ లక్ష్మీ జనార్దనస్వామి ఆలయానికి వెళ్లింది. అక్కడ ఘన స్వాగతం పలికారు. మార్గమధ్యలో 86 గ్రామాల గుండా వాహనం ప్రయాణించి సాయంత్రానికి మేలుకోటెను చేరుకుంది. గ్రామాలలో ప్రజలు మంగళవాయిద్యాలు, పూలదండలతో స్వాగతం పలికి పూజలు చేశారు. శ్రీరంగపట్నం తాలూకాలోని కిరంగూర్ వద్ద ఎమ్మెల్యే ఎ.బి.రమేష్ బండిసిద్దెగౌడ నగల మూటలను తలపై మోశారు. పాండవపుర తాలూకా రైల్వే స్టేషన్ సమీపంలో, ఎమ్మెల్యే దర్శన్ పుట్టన్నయ్య నగల మూటలను మోసి భక్తిని చాటుకున్నారు. మేలుకోటెకు వైరముడి, రాజముడి వజ్ర కిరీటాల తరలింపు -
ఫాంహౌస్లో డ్రగ్స్ ఫ్యాక్టరీ
● హుణసూరు వద్ద గుట్టురట్టు మైసూరు: జిల్లాలోని హుణసూరు తాలూకాలో దాసనపుర గ్రామంలో ఓ ఫాంహౌస్పై దాడి చేసి ఇద్దరు డ్రగ్స్ ఉత్పత్తిదారులను పట్టుకున్నట్లు మైసూరు జిల్లా ఎస్పీ మల్లికార్జున బాలదండి తెలిపారు. మైసూరులోని సిద్దిఖి మొహల్లా నివాసి మహ్మద్ ఇర్ఫాన్, హుణసూరుకు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ పట్టుబడిన నిందితులు. వివరాలు.. హుణసూరు పరిధిలో ఇర్ఫాన్కు చెందిన తోట ఇంటిలో భారీ ఎత్తున సింథటిక్స్ డ్రగ్స్ ప్యాకెట్లు తయారు చేస్తున్నారు. పోలీసులకు తెలిసి దాడి చేయగా, దుండగులు పరారయ్యారు, కానీ 10 కి.మీ.మేర వెంబడించి హుణసూరు పట్టణానికి సమీపంలోని సలీం ప్యాలెస్ వద్ద బంధించారు. హుణసూరు టౌన్ రహమత్ మొహల్లా నివాసి షెడ్లోని ముడి వస్తువులను దాచి ఉంచినట్లు చెప్పడంతో పోలీసులు వెళ్లి 7.35 కేజీల మెఫెడ్రోన్, 41 కేజీల ముడి పదార్థాలను స్వాధీనపరచుకున్నారు. మొత్తం 48 కేజీల డ్రగ్స్ను జప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీటి విలువ రూ.12 కోట్లుగా అంచనా వేశారు. ఈ వ్యవహారంతో హుణసూరులో కలకలం రేగింది. ఇంకా ఎంతమందికి ఇందులో ప్రమేయం ఉందో, ఎప్పటినుంచి సాగుతోందోననే చర్చ జరుగుతోంది. రూ.38 లక్షల దోపిడీ ● భూమి అమ్మిన డబ్బుతో వెళ్తుండగా దాడి దొడ్డబళ్లాపురం: భూమిని విక్రయించిన డబ్బుతో వెళ్తున్న వ్యక్తిని అడ్డగించి రూ.38 లక్షలు దోచుకున్న సంఘటన దావణగెరె జిల్లా హొన్నాళి తాలూకా ఏకే అరకెరె కాలనీ సమీపంలో జరిగింది. భద్రావతి తాలూకావాసి, వ్యాపారి మాలతేశ్ హొసపేటె జిల్లా హగరి బొమ్మనహళ్లి తాలూకా మోరగేర గ్రామంలోని తన 10 ఎకరాల భూమిని హొసపేటకు చెందిన ఒక డాక్టర్కి రూ.1.21 కోట్లకు విక్రయించాడు. డబ్బు తీసుకుని మాలతేశ్ హొసపేటెలో బాబులాల్ అనే వ్యాపారి వద్ద తాను తీసుకున్న రూ.36 లక్షలు అప్పు తీర్చి, మిగిలిన డబ్బుతో మారుతి కారులో స్వగ్రామానికి బయలుదేరాడు. రూ.38 లక్షలు ఒక సంచిలో, రూ.32 లక్షలు మరో సంచితో నింపి, రూ.2 లక్షలు తన జేబులో పెట్టుకున్నాడు. కారులో తన స్నేహితుడు మానాచారి కూడా ఉన్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు కారును అడ్డగించి ఇద్దరి మీదా దాడి చేసి, రూ.38లక్షలు ఉన్న సంచితో ఉడాయించారు. హొన్నాళి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. బెంగళూరులో పెట్రోలు కోసం కిటకిట శివాజీనగర: ఇరాన్– ఇజ్రాయెల్ యుద్ధం వల్ల గ్యాస్కు కొరత ఏర్పడగా, పెట్రోలు, డీజిల్ కోసం కూడా ప్రజలు పరుగులు తీస్తున్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో బంక్ల ముందు రాత్రంతా వేచి చూస్తున్నారు. బెంగళూరులో కూడా బాటిల్, క్యాన్లను పట్టుకుని పెట్రోల్ కోసం ఎగబడడం గమనార్హం. కారు, బైక్లకు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ నింపుకొని అదనంగా బాటిల్లలో వేసుకుంటున్నారు. అయితే కొన్ని బంకుల్లో సీసాలు, క్యాన్లను అనుమతించబోమని నోటీసులు పెట్టారు. క్యాన్, బ్యాటిల్లనును తీసుకొచ్చినవారిని వెనక్కి పంపించారు. దీంతో కొందరు బంక్ సిబ్బందితో గొడవకు దిగుతున్నారు. మీ వాహనాలకు మాత్రమే ఇంధనం ఇస్తామని తెలిపారు. సమస్య సృష్టించరాదని, పెట్రోల్ నిల్వ ఉందని బంక్ సిబ్బంది చెబుతున్నారు. 153 మంది పోలీసులకు సీఎం మెడల్స్ బనశంకరి: అంకిత భావంతో పనిచేసిన పోలీస్ సిబ్బందికి 2025 ఏడాదికిగాను సీఎం మెడల్స్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారం కేసును విచారించిన ఐపీఎస్ అధికారిణి సుమన పెన్నేకర్ను, అలాగే మరో 6 మంది ఐపీఎస్లు కలిపి 153 మంది పోలీసులను మెడల్స్కు ఎంపిక చేశారు. ఏప్రిల్ 2వ తేదీన బెంగళూరులో పతకాల ప్రదానోత్సవం జరుగుతుంది. -
ఉప సమరంలో గెలుపు మాదే
మైసూరు: రాష్ట్రంలోని దావణగెరె దక్షిణ, బాగల్కోటె అసెంబ్లీ క్షేత్రాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో మేమే గెలుస్తాం. భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా విజయం మాదే అని సీఎం సిద్దరామయ్య అన్నారు. శనివారం మైసూరులోని మండకల్లి విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. దావణగెరెలో ఎలాంటి గందరగోళం లేదన్నారు. ఆ ఫలితాలను దిక్సూచి అని, ఇంకేదో అని చెప్పనన్నారు. తాను ఏప్రిల్ 1 నుంచి ప్రచారంలో పాల్గొంటానని, ఏప్రిల్ 5న కేరళ ఎన్నికల ప్రచారానికి వెళ్తానని తెలిపారు. తమిళనాడులో ప్రచారానికి వెళ్లనన్నారు. ద్విభాషా విద్యా విధానమే త్రిభాషా విధానానికి బదులు రాష్ట్ర విద్యారంగంలో ద్విభాషా విధానాన్ని అమలు చేయడానికి పట్టుదలతో ఉన్నానని సీఎం తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అందరూ అంగీకరించాలని ఆయన అన్నారు. తాను బాల్యంలో హిందీ ఎప్పుడూ చదవలేదు. నాపై హిందీని బలవంతం చేయకూడదని అన్నారు. ఎమ్మెల్యేలు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ రెండు టికెట్లు కావాలని అడిగారు, అందులో తప్పేం లేదన్నారు. మ్యాచ్లు చూడడమంటే తనకూ ఇష్టమని చెప్పారు. మైసూరు జిల్లాలో డ్రగ్స్ నెట్వర్క్ గురించి పోలీసు అధికారుల నుంచి ఇప్పుడే సమాచారం అందిందన్నారు. కర్ణాటకను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు తాము పోరాడుతున్నామని చెప్పారు. మంత్రి డా. హెచ్.సి. మహాదేవప్ప, ఎమ్మెల్యే కె. హరీష్ గౌడ, అధికారులు పాల్గొన్నారు. 1 నుంచి ప్రచారానికి: సీఎం సిద్దు -
రాజధానిలో క్రికెట్ జోష్
శివాజీనగర: వీకెండ్లో బెంగళూరును ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జోష్ ఆవహించింది. ఎక్కడ చూసినా క్రికెట్ అభిమానుల సందడి మిన్నంటింది. అనేక చర్చల తరువాత నగరంలోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణకు ప్రభుత్వం ఒప్పుకోవడం తెలిసిందే. గతేడాది ఆర్సీబీ విజయోత్సవాలలో తొక్కిసలాట జరిగి 11 మంది మరణించడం, 60 మంది గాయపడడం తెలిసిందే. ఆ దుర్ఘటన తరువాత చిన్నస్వామి స్టేడియం ప్రవేశద్వారాలు, లోపల అనేక మార్పులు చేర్పులు చేశారు. ఆ ప్రమాదంతో మేల్కొన్న పోలీసులు, ఈసారి ఎలాంటి అపాయాలు జరగకుండా భారీ బందోబస్తు చేపట్టారు. ముమ్మరంగా బందోబస్తు 2,500 మంది పోలీసులను భద్రతకు మోహరించారు. మధ్యాహ్నం నుంచి పోలీసులు నిర్దేశిత ప్రదేశాలకు చేరుకొన్నారు. మైదానం లోపల, బయట భద్రత, ప్రవేశ మార్గాల్లో మార్పులు, పార్కింగ్ తదితరాలను అధికారులు పర్యవేక్షించారు. మెట్రో రైలు స్టేషన్ల వద్ద కూడా తొక్కిసలాట జరగకుండా చూశారు. నిబంధనలను అందరూ కట్టుదిట్టంగా పాటించాలని సూచించారు. ఏదైనా జరిగితే సిబ్బంది తక్షణమే తెలియజేయాలని పై అధికారులు ఆదేశించారు. ఆర్ఏఎఫ్, గరుడ టీం, పికప్ స్క్వాడ్ తదితర దళాలతో భద్రత ఏర్పాటైంది. మైదానం వద్ద రోడ్డుపై ఎవరూ నిలబడకుండా చూశారు. టికెట్ లేకపోతే ఇంట్లో కూర్చొని మ్యాచ్ను చూడాలని పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్సింగ్ తెలిపారు.శనివారం సాయంత్రం నుంచి స్టేడియం వద్ద క్రికెట్ అభిమానుల సందోహం అధికమైంది. ఆర్సీబీ– హైదరాబాద్ సన్రైజర్స్ జట్ల మ్యాచ్కు తరలివచ్చారు. యువతీ యువకుల సందడి ఎక్కువగా ఉంది. ఆయా టీంల టీషర్టులను ధరించి, ముఖానికి రంగులు పూసుకుని ఫొటోలకు పోజులిచ్చారు. కొందరు విదేశీయులు కుటుంబాలతో సహా స్టేడియానికి వచ్చారు. కొందరు వీరాభిమానులు భారీ ఫ్లెక్సీలను ప్రదర్శించారు.ప్రేక్షకుల ఉత్సాహం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పోటీ.. తరలివచ్చిన అభిమానులు గత సంఘటనల దృష్ట్యా భారీగా బందోబస్తు -
స్కూలు బస్సు– ప్రైవేటు బస్సు ఢీ
మండ్య: మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకాలోని సోమనహళ్లి–కేస్తూరు చౌరస్తాలోని అడిగాస్ హోటల్ సమీపంలో ప్రైవేట్ పాఠశాల బస్సు, ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 14 మంది విద్యార్థులు, బస్సులో 6 మంది ప్రయాణికులతో కలిపి 20 మంది గాయపడ్డారు. తీవ్ర గాయాలైన 6 మందిని మెరుగైన చికిత్స కోసం మండ్య మిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పాఠశాల ముగించుకుని పిల్లలను తీసుకుని పల్లెకు వెళ్తున్న బస్సును ఎదురుగా వచ్చిన ప్రైవేటు బస్సు ఢీకొంది. తల్లిదండ్రులకు తెలిసి మద్దూరు ఆసుపత్రికి చేరుకుని తమ పిల్లల కోసం వెతుకులాడారు. మాజీ మంత్రి డి.సి. తమ్మన్న, కలెక్టరు కుమార్, ఎస్పీ శోభరాణి తదితరులు చేరుకుని వైద్య సేవలను పరిశీలించారు. 20 మందికి గాయాలు -
మున్సిపల్ బడ్జెట్ రూ.122 కోట్లు
హొసపేటె: స్థానిక మున్సిపల్ కార్యాలయ హాలులో శుక్రవారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 2026–27 సంవత్సరానికి మున్సిపల్ ప్రెసిడెంట్ ఎన్.రూపేష్ కుమార్ రూ.122 కోట్లతో బడ్జెట్ సమర్పించారు. 2026–27 సంవత్సరంలో సొంత పన్ను, ఆస్తి పన్ను, ప్రకటనల పన్ను, వాణిజ్య పన్నులతో సహా వివిధ వనరుల నుంచి రూ.34.87 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అదనంగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లు, కేయూఐడీఎఫ్సీ, ఘన వ్యర్థాల నిర్వహణ, పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్య ఆర్థిక వనరులతో సహా వివిధ వనరుల నుంచి రూ.78.99 కోట్ల గ్రాంట్ వస్తుందని అంచనా. మున్సిపాలిటీ ప్రభుత్వం, వివిధ శాఖలకు చెల్లించాల్సిన అసాధారణ ఆదాయం రూ.9.10 కోట్లు కాగా.. మొత్తం రూ.12.39 లక్షలను మిగులు బడ్జెట్గా సమర్పించారు. ఉద్యోగుల జీతాల చెల్లింపునకు రూ.13.98 కోట్లు, వీధి దీపాల విద్యుత్ బిల్లులకు రూ.5.74 కోట్లు, నీటి సరఫరా ప్లాంట్ల విద్యుత్ బిల్లులు, రాష్ట్ర ప్రభుత్వ ఎస్ఎఫ్సీ గ్రాంటుకు రూ.8.07 కోట్లు కేటాయించారు. ఆస్తి పన్ను నుంచి రూ.15.39 కోట్లు, ఖాతా మార్పిడి నుంచి రూ.3 కోట్లు వస్తాయని అంచనా వేశారు. నగరంలోని అంబేడ్కర్ సర్కిల్లో హైడ్రాలిక్ సంస్థాపన, అభివృద్ధి పనులకు రూ.18.50 లక్షలు, మడకరి నాయక సర్కిల్తో సహా వివిధ సర్కిళ్ల మరమ్మతులు, అభివృద్ధికి రూ.8 లక్షలతో అంచనాలు సిద్ధం చేశారు. వీధి కుక్కల నియంత్రణకు రూ.15 లక్షలు కేటాయించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు జీవరత్నం, స్థాయి సమితి అధ్యక్షుడు సర్వనన్, కమిషనర్ శివ కుమార్ వివిధ వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
తుంగభద్ర నదిలో చిక్కుకున్న ట్రాక్టర్
● భయంతో కేకలు వేసిన భక్తులు హొసపేటె: సింగటలూరులోని వీరభద్రేశ్వర స్వామి జాతరకు ట్రాక్టర్లో వెళ్లిన భక్తులు తుంగభద్ర నదిలో చిక్కుకున్నారు. ఈ ఘటన విజయనగర జిల్లా, హడగలి తాలూకాలోని నవలిలో జరిగింది. వివరాలు.. రోడ్డు మార్గంలో వెళ్తే చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుందనే ఉద్దేశంతో డ్రైవర్ ట్రాక్టర్ను తుంగభద్ర నదిలో తీసుకెళ్లాడు. నది మధ్య భాగం చాలా లోతుగా ఉండటంతో ట్రాక్టర్లోకి నీరు చేరింది. ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న 10 మందికి పైగా భక్తులు భయంతో సహాయం కోసం కేకలు వేశారు. అక్కడే ఉన్న జాలర్లు భక్తులందరినీ కాపాడటానికి అక్కడికి పరుగెత్తుకొచ్చారు. అనంతరం వారు క్రేన్ సహాయంతో ట్రాక్టర్ను నదిలోంచి బయటకు లాగారు. ట్రాక్టర్ ఉన్న ఒక భక్తుడు ఈ సంఘటనపై స్పందిస్తూ.. ‘మేము డ్రైవర్ మాటలు నమ్మి ప్రమాదం ఉందని తెలిసినా నదిలో ప్రయాణించాం. దేవుడి దయతో ప్రాణాలతో బయటపడ్డాం. మమ్మల్ని కాపాడిన జాలర్లకు కృతజ్ఞతలు. ఇలాంటి సత్వర మార్గాలను ఎవరూ ఉపయోగించవద్దు’ అని తెలిపాడు. -
రాములోరి కల్యాణం..చూసిన కనులదే భాగ్యం
సాక్షి, బళ్లారి/బళ్లారి అర్బన్: నగరంలో శుక్రవారం శ్రీరాముడి నామస్మరణ మార్మోగింది. శ్రీరామ నవమి పురస్కరించుని శ్రీరామ ఆలయాలు, ఆంజనేయ స్వామి ఆలయాల్లో భక్తుల కోలాహలం నెలకొంది. ఆలయాల్లో శ్రీరామ, లక్ష్మణ, సీత, ఆంజనేయ స్వామి విగ్రహాలకు అభిషేకాలు, పూజలు, అర్చనలు చేపట్టారు. నగరంలోని మోతీ సర్కిల్ వద్ద శ్రీరామాలయం, విద్యా నగరలోని అభయాంజనేయ స్వామి, మిల్లార్ పేట ఆంజనేయ స్వామి, అహంబావి ఆంజనేయ స్వామి ఆలయాలు, శ్రీరాంపుర కాలనీ, కాకర్లతోటలోని ఆలయాల్లో సీతారాములకు అర్చకులు కల్యాణం జరిపించారు. ఆలయాల వద్ద భక్తులకు పానకం, మజ్జిగ పంపిణీ చేసి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీరామ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, సామాజిక కార్యకర్త వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు పాల్గొన్నారు. నగరంలోని అహంబావిలో ప్రముఖ పారిశ్రామికవేత్త బీ.వీ.శ్రీనివాస రెడ్డి స్వగృహంలో సీతారాములు కల్యాణోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. సీతారామ, లక్ష్మణ, ఆంజనేయుడి కాంస్య విగ్రహాలకు అభిషేకం చేశారు. బళ్లారి అర్బన్: బళ్లారి జిల్లా కంప్లి తాలూకా శ్రీ రామరంగాపురంలో వెలసిన కోదండ రామాలయంలో శుక్రవారం శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణోత్సవం కనుల పండువగా నిర్వహించారు. గ్రామంలో హిందువులు, ముస్లింలు కలిసి ఈ వేడుకలను నిర్వహించడం విశేషం. ప్రత్యేకంగా ఫరుకు శిలాంబి కుటుంబానికి చెందిన సభ్యులు ఏటా సీతారాముల కళ్యాణోత్సవానికి అవసరమైన బాసింగాలను ఇంటి నుంచి దేవస్థానానికి తీసుకు రావడం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. గ్రామస్తుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. సాయంత్రం సీతారాములను పల్లకీలో ఊరేగించారు. అంతకుముందు సీతారాములతో పాటు లక్ష్మణుడు, ఆంజనేయ స్వాములకు పంచామృతాభిషేకం, అలంకరణ, అర్చనలు చేశారు. కల్యాణం.. కమనీయం..రాయచూరు రూరల్: జిల్లాలో శుక్రవారం శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. రాయచూరు గ్రామీణ నియోజక వర్గంలోని పంచముఖి గాణ దాల్ ఆంజనేయ స్వామి ప్రాణదేవర ఆలయంలో గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ, మాజీ ఎమ్మెల్యే తిప్పరాజ్ , వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పాదయాత్రగా వచ్చి దైవ దర్శనం పొందారు. మంత్రాలయంలో పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగల్ శ్రీరాముడి విగ్రహానికి పూజలు చేశారు. రాయచూరు నగరం రైల్వే స్టేషన్ వద్ద ఉన్న రామాలయం, కోటలోని బాలాంజనేయ, పాతాళాంజనేయ, బెట్టద్ రామాలయం, మంగళవారపేట మారుతి దేవాలయంలో శ్రీరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆర్యవైశ్య గీతా మందిర్లో శ్రీరామ నవమి సందడి నెలకొంది. ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చి రామాలయంలో పూజలు చేపట్టారు. రాయచూరు రూరల్: భక్తులచే ఊయల సేవలు బళ్లారిలో రథాన్ని లాగుతున్న భక్తులుబళ్లారిలో సీతారాముల కల్యాణంపూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డిసీతారాములకు కల్యాణం జరిపిస్తున్న అర్చకులుబళ్లారిలో భక్తులకు అన్నదానంరాయచూరు రూరల్: రాముడికి పూజలు భక్తిశ్రద్ధలతో శ్రీరామనవమి శ్రీరామ, ఆంజనేయ స్వామి ఆలయాల్లో పూజలు సీతారాముల దర్శనానికి పోటెత్తిన భక్తులు పలుచోట్ల పానకం, మజ్జిగ, చల్లని పానీయాల పంపిణీ -
నేడు గణితంపై వర్క్షాప్
హుబ్లీ: కర్ణాటక విశ్వవిద్యాలయంలోని సెనేట్ హాల్లో శనివారం నుంచి సోమవారం వరకు గణిత అధ్యాపకుల బోధన వృద్ధి వర్క్షాప్ నిర్వహించనున్నట్లు గణిత శాస్త్ర అధ్యాయనం విభాగం ముఖ్యుడు, ప్రొఫెసర్ ఎస్సీ సిరాళ హట్టి ఓ ప్రకటనలో తెలిపారు. కర్ణాటక విశ్వవిద్యాలయం, గణిత శాస్త్ర అధ్యయన విభాగం, పావాటే ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేథమెటిక్స్, సైన్స్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ వాలికర, ప్రొఫెసర్ సాలిమఠ, తదితరుల జ్ఞాపకార్థం గణితంపై వర్క్షాప్ ఉంటుందన్నారు. గణిత విభాగం అధ్యాపకుడు డాక్టర్ ధనుంజయ వర్క్షాప్ను ప్రారంభిస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో ప్రముఖులు ప్రొఫెసర్ ఎం.డేవిడ్, ఉషా, ప్రొఫెసర్ భజంత్రితో పాటు కర్ణాటక విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్.శంక్రప్ప తదితరులు పాల్గొంటారన్నారు. గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలిహుబ్లీ: ఎల్పీజీ సిలిండర్లను అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని ధ్వని సంఘం నేతలు శుక్రవారం జిల్లా అధికారి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కొందరు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్న ఎక్కువ ధరకు సిలిండర్లు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. అలాంటి ఏజెన్సీలను కనుక్కొని తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు కార్తీక్ నాయక, బసవరాజ జాదవ, షణ్ముఖ కట్టి, లోకేష్, సిద్దు తదితరులు పాల్గొన్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతిహుబ్లీ: నగర రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం–1 రైల్వే బ్రిడ్జి కింద అస్వస్థతకు గురైన గుర్తు తెలియని వ్యక్తిని చికిత్స నిమిత్తం కేఎంసీ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వ్యక్తి వయస్సు సుమారు 55 ఏళ్లు ఉండొచ్చు. వివరాలు తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలని రైల్వే సిబ్బంది ఓ ప్రకటనలో కోరారు. మరో ఘటనలో నగరంలోని లక్ష్మీ కాంప్లెక్స్ నురాణి మార్కెట్ అంగడి మెట్లపై తెలియని వ్యాధితో బాధపడుతూ అనిల్ అనే వ్యక్తి మృతి చెందాడు. చెత్తాచెదారం విక్రయించే జీవనం సాగించే వాడని సమాచారం. ఈ వ్యక్తి వివరాలు తెలిసిన వారు ఉంటే కమరిపేట పోలీసులను సంప్రదించాలని సంబంధిత అధికారులు కోరారు. ఘటనపై కమరిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గోవుల సంరక్షణకు ముందుకు రండిరాయచూరు రూరల్: నగరంలో గోవుల సంరక్షణకు అదికారులు ముందుకు రావాలని శివసేన నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఆ సంఘం అధ్యక్షుడు మహస్ విలేకరులతో మాట్లాడారు. నగరంలోని వీధుల్లో సంచరించే గోవులను రక్షించి వాటిని గోశాలకు తరలించాలని సూచించారు. వేసవి కాలంలో ఎండల తీవ్రతకు గోవులు మృత్యువాత పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మానవతా దృక్పథంతో గోవులను కాపాడాలని కోరారు. అనంతరం స్థానిక అధికారికి వినతిపత్రం అందజేశారు. క్షయ నియంత్రణకు చర్యలు రాయచూరు రూరల్: జిల్లాలో క్షయ వ్యాధి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్ర బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా ఆరోగ్య అధికారి కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2035 నాటికి దేశంలో క్షయ వ్యాధిని నియంత్రించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాలను నేరవేర్చాలన్నారు. ప్రపంచంలో ప్రతి మూడు నిమిషాలకు ఒక్కరు క్షయ రోగంతో మరణిస్తున్నారని తెలిపారు. వ్యాధి సోకిన మరుక్షణమే ఆరు నెలల పాటు చికిత్సలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు గణేష్, శాఖిర్, నందిత, ఉద్యోగులు పాలాక్షి, సంధ్య, లక్ష్మి, సరోజ తదితరులు పాల్గొన్నారు. హాస్టల్లో అగ్ని ప్రమాదం● ముగ్గురు విద్యార్థులకు గాయాలు సాక్షి, బళ్లారి: విజయపుర జిల్లా ముద్ధిబిహాల్ తాలూకా ఫాళపూజి గ్రామంలోని ఎస్టీ సముదాయ వర్గాలకు చెందిన హాస్టల్లో సోమవారం రాత్రి విద్యుత్షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయడంతో రంగంలో దిగిన సదరు అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేసి ప్రమాదాన్ని నివారించారు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
అక్రమాలపై విచారణ జరపాలి
రాయచూరు రూరల్: లింగసూగురు తాలుకాలో కళ్యాణ పథకంలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని కర్ణాటక రైతు సంఘం డిమాండ్ చేసింది. శుక్రవారం లింగసూగురు ఏసీ కార్యాలయం వద్ద ఆ సంఘం అధ్యక్షుడు వీరభద్రప్ప విలేకరులతో మాట్లాడారు. కళ్యాణ పథకం, ప్రధానమంత్రి సడక్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన రహదారి పనులు నాసిరకంగా ఉన్నాయని తెలిపారు. నీల్గల్ నుంచి చిక్కహెసరూర్ వరకు 6.7 కి.మీ రహదారి పనులకు రూ.4.34 కోట్ల వ్యయం చేశారని ఆరోపించారు. కాంట్రాక్ట్ పొందిన శాసన సభ్యుడు వజ్జల్ మానప్ప సోదరులు వడ్డెర కంపెనీ నాసిరకంగా పనులు చేపట్టారని తెలిపారు. అలాంటి రహదారి నిర్మాణాలు చేపట్టిన వారిని బ్లాక్ లిస్ట్లో చేర్చి క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. అనంతరం అసిస్టెంట్ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. -
అంగరంగ వైభవంగా రథోత్సవం
హొసపేటె: విజయనగర జిల్లా, హోస్పేట్ తాలూకా మరియమ్మనహళ్లి పట్టణంలో లక్ష్మీ నారాయణ స్వామి, ఆంజనేయ స్వామి రథోత్సవం శుక్రవారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు తరలివచ్చి రథోత్సవాన్ని వీక్షించారు. రథం ముందుకు కదులుతుండగా భక్తులు జై శ్రీరామ్ అంటూ నామస్మరణ చేశారు. కదులుతున్న రథంపై అరటి పండ్లు, పూలు, అగరబత్తులను విసురుతూ భక్తిని చాటుకున్నారు. గత నాలుగైదు రోజులుగా వివిధ పూజా కార్యక్రమాలు చేపట్టారు. రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయనగర జిల్లా ఎస్పీ ఎస్.జాహ్నవి పర్యవేక్షణలో డీఎస్పీ మల్లేష్ దొడమణి, సీపీఐ వికాస్ లమాని, పీఎస్ఐ తారాబాయి నేతృత్వంలో పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. -
సుమో బోల్తా: 9 మందికి గాయాలు
హొసపేటె: విజయనగర జిల్లా, హోస్పేట తాలూకా మరియమ్మనహళ్లి పట్టణ శివారులోని జాతీయ రహదారి–50పై సుమో ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులతో సహా 9 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హోస్పేట తాలూకా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. గాయపడిన వారందరూ బాదామి తాలూకా, బాగల్కోట జిల్లాలోని గోవినకొప్ప, కొన్నూరు గ్రామాలకు చెందిన నివాసులు. మడికేరిలో 13 మంది డ్రమ్ సెట్ కళాకారులు ఓ శుభకార్యం ముగించుకుని.. హునగుండకు బయలుదేరారు. జాతీయ రహదారి పక్కన ఆపిన లారీని తప్పించే క్రమంలో రహదారిపై మలుపు తిరుగుతుండగా సుమో బోల్తా పడింది. డ్రైవర్ లాల్సాబ్, కుమార్, అన్నపూర్ణ, అలాగే బాలికలు రక్షిత, అక్కమ్మ నందిని గాయపడిన వారిలో ఉన్నారు. ప్రమాద స్థలాన్ని మరియమ్మనహళ్లి పోలీసులు పరిశీలించారు. -
మాన్విలో బాలింత ఆత్మహత్య
రాయచూరు రూరల్: ఐదు రోజుల బాలింత ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయచూరు జిల్లా మాన్విలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. మాన్విలో వాసవి (25) అనే మహిళ ఇటీవల నవజాత శిశువుకు జన్మనిచ్చింది. ఐదు రోజుల అనంతరం శిశువుకు కామెర్లు సోకడంతో చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చారు. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు కాని.. వాసవి ఆస్పత్రి పై అంతస్తు నుంచి దూకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. యువతి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదవశాత్తూ కాలు జారి పడిందా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని తెలియాల్సి ఉంది. బండరాయితో బాది వ్యక్తి హత్యచెళ్లకెరె రూరల్: పాత కక్షలతో ద్వేషం పెంచుకుని వ్యక్తిని బండరాయితో బాది హత్య చేసిన ఘటన చిత్రదుర్గ తాలూకా బీమా సముద్ర గ్రామంలో జరిగింది. హత్యకు గురైన వ్యక్తి కాంతరాజు (35). హత్య చేసిన నరసింహప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. 2020 సంవత్సరంలో కాంతరాజు, నరసింహప్ప మధ్య గలాట జరిగింది. ఆ సమయంలో నరసింహప్పపై కాంతరాజు దాడి చేశాడు. కాంతరాజుపై నరసింహప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజీ చేసుకుని సమస్యను పరిష్కరించుకోవాలని కాంతరాజుకు రూ.20 వేలు ఇస్తానని నరసింహప్ప చెప్పాడు. అందుకు కాంతరాజు నిరాకరించాడు. రాజీకి ఒప్పుకోకపోవడంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య గలాటలు జరుగుతున్నాయి. శుక్రవారం మళ్లీ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోపంతో ఊగిపోయిన నరసింహప్ప బండరాయితో కాంతరాజు తలపై కొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కాంతరాజును చికిత్స నిమిత్తం దావణగెరె ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కాంతరాజు మృతి చెందాడు. ఈ ఘటనపై చిత్రదుర్గ గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జయంతుల ఆచరణపై సమీక్ష కేజీఎఫ్: అంబేడ్కర్, బాబు జగ్జీవన్రాం జయంతులను అర్థవంతంగా ఆచరించాలని ఎమ్మెల్యే రూపా శశిధర్ సూచించారు. జయంతుల ఆచరణపై శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నూతనంగా నిర్మిస్తున్న అంబేడ్కర్ స్మారక భవనం వద్ద జయంతిని నిర్వహించాలని పలువురు దళిత నాయకులు కోరారు. అయితే స్మారక భవనం నిర్మాణ పనులు ప్రగతిలో ఉన్నందున ఈసారి తహసీల్దార్ కార్యాలయంలోనే నిర్వహించాలని ఎమ్మెల్యే తెలిపారు. పీడీఓల సంఘం కార్యవర్గం ఎన్నిక కోలారు: రాష్ట్ర పీడీఓల సంఘానికి శుక్రవారం ఎన్నిక నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా మహేష్, కోశాధికారిగా సంపరాజ్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా మోహన్, రాష్ట్ర పరిషత్ సభ్యురాలిగా భవాని, సంఘటనా కార్యదర్శిగా ముళబాగిలు రమేష్, సునీతా, క్రీడా కార్యదర్శిగా నాగరాజ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ పీడీఓల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. -
శ్రీరామ నవమికి సెలవు లేదాయే..
సాక్షి బళ్లారి: హిందువుల ముఖ్య పండుగల్లో ఒక్కటైనా శ్రీరామనవమి రోజున కర్ణాటకలో ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం యథావిధిగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు పని చేశాయి. శ్రీరామనవమి అనేది శ్రీరాముని జన్మదినంగా భావించే పవిత్రమైన రోజు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, రామాయణ పారాయణం, శ్రీసీతారాముల కళ్యాణోత్సవం, ఊరేగింపులు, అన్నదానాలు జరుగుతాయి. కర్ణాటకలో ఈ పండుగకు విశేష ప్రాధాన్యత ఉంది. కర్ణాటక ప్రభుత్వం అధికారిక సెలవు జాబితాలో పలు జాతీయ, ప్రాంతీయ, మత పరమైన పండుగలకు సెలవులు ఇచ్చింది. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామనవమి రోజున సెలవు ప్రకటించకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. పవర్ లిఫ్టింగ్లో పతకాల పంట కోలారు: బెంగుళూరు ఉత్తర విశ్వ వర్సిటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో బంగారుపేటలో నిర్వహించిన 57 కిలోల పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారుపేటలోని ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థిని మానస తృతీయ బహుమతి సాధించింది. ప్రథమ బీఏ విద్యార్థిని గౌరమ్మ 69 కిలోల విభాగంలో తృతీయ స్థానం, ప్రథమ బీఎస్పీ అంబికా 84 కిలోల విభాగంలో ద్వితీయ బహుమానం సాధించారు. సాధక విద్యార్థినులను ప్రిన్సిపాల్ శ్రీనివాసగౌడ, దైహిక శిక్షణ డైరెక్టర్ సుబ్రమణి, క్రీడా సమితి సభ్యులు అభినందించారు. -
నేడు చెలువరాయస్వామి పట్టాభిషేక మహోత్సవం
మండ్య: మండ్య జిల్లా మేలుకోటె పుణ్యక్షేత్రంలో వెలసిన చెలువనారాయణస్వామి ప్రపంచ ప్రసిద్ధ వైరముడి పట్టాభిషేక ఉత్సవానికి ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ కుమార్ తెలిపారు. 28న రాత్రి 8గంటలకు ప్రారంభమై తెల్లవారుజామురన 4 గంటల వరకు కొనసాగుతుందన్నారు. మైసూరు రాజులు చేయించిన వజ్రాలు పొదిగిన రాజముడి కిరీటాన్ని ధరింపజేసి ఉత్సవం నిర్వహిస్తారన్నారు. సుమారు రెండు లక్షల మంది భక్తులు, పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. అన్ని ప్రధాన పట్టణాలు, నగరాల నుంచి మేలుకోటకు కేఎస్ ఆర్టీసీ 140 బస్సులను ఏర్పాటు చేసిందన్నారు. మొత్తం 14 చోట్ల వాహనాల పార్కింగ్కు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కీచక ప్రొఫెసర్ అరెస్ట్ దొడ్డబళ్లాపురం: విద్యార్థినికి చాక్లెట్ ఇచ్చి అసభ్యకరంగా వ్యవహరించిన ప్రొఫెసర్ను నెలమంగల పోలీసులు అరెస్టు చేశారు. హోంమంత్రి జీ పరమేశ్వర్కు చెందిన నెలమంగల తాలూకా టీబేగూరు వద్ద ఉన్న సిద్ధార్థ మెడికల్ కళాశాలలో అబ్దుల్ అనే ప్రొఫెసర్ ఒక విద్యార్థినికి చాక్లెట్ ఇచ్చి స్టేజ్ మీద నిలబడి మైక్లోనే ప్రపోజ్ చేయగా విద్యార్థులు కలిసి చితకబాదిన సంగతి తెలిసిందే. ఈ దృశ్యాలు వైరల్ కావడంతో కేసు నమోదు చేసుకున్న నెలమంగల పోలీసులు ప్రొఫెసర్ అబ్దుల్ను అరెస్టు చేశారు. భార్యకు దూరంగా ఉంటున్న అబ్దుల్ గతంలోనూ తుమకూరు ఆస్పత్రి, బోరింగ్ ఆస్పత్రుల్లోనూ ఇదేవిధంగా అసభ్యంగా ప్రవర్తించి తన్నులు తిన్నట్టు తెలిసింది. బనశంకరీదేవికి విశేష పూజలు బనశంకరి: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బనశంకరీ దేవికి శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఏ.చంద్రమోహన్ ఆధ్వర్యంలో బనశంకరీదేవి మూలవిరాట్కు ప్రత్యేక అర్చనలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం పలు రకాల పండ్లతో విశేష అలంకరణ నిర్వహించి పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి నిమ్మకాయల ప్రమిదలతో దీపారాధన చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి అన్నదానం చేశారు. అటవీ ప్రాంతంలో కార్చిచ్చు మైసూరు; చామరాజనగర జిల్లా, హనూరు తాలూకాలోని బైలూరు జోన్లో బీఆర్టీ టైగర్ రిజర్వ్ ఫారెస్టు గుండిమల, నెల్లికత్రి అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. 80 ఎకరాల్లో భారీ ఎత్తున చెట్లు, చేమలు కాలి బూడిదయ్యాయి. బైలూరు వన్యప్రాణి జోన్కు చెందిన ఆర్ఎఫ్ఓ ప్రమోద్, అతని సిబ్బంది సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అగ్నిమాపక కేంద్ర సిబ్బంది చేరుకొని అటవీ శాఖ సిబ్బందితో కలిసి మంటలను ఆర్పివేశారు. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య ● విజయపుర జిల్లాలో విషాదం సాక్షి,బళ్లారి: నవ మాసాలు మోసి కనిపెంచిన తల్లి తన పిల్లల కోసం ఎన్నో కలలు కనింది. వారిని చదివించి, మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆశపడింది. కాని జీవితంలో ఎదురైన కఠిన పరిస్థితులు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేదా మరే ఇతర కారణాలో కాని ఆ తల్లి తన కన్న బిడ్డలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. విజయపుర జిల్లా ఇండి తాలూకా మిరిగి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శంక్రప్ప భార్య రాజశ్రీ శంక్రప్ప హళ్లూరు (28) అనే మహిళ ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు గ్రామంలో ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. భర్త గ్రామంలో లేనప్పుడు తల్లి రాజశ్రీ పిల్లలతో పాటు ఆత్మహత్యకు ఒడిగట్టింది. విషయం తెలిసిన వెంటనే అక్కడి పోలీసులు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతి చెందిన తల్లి, పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అక్కడి ఆస్పత్రికి తరలించారు. -
అంతా రామమయం
బనశంకరి: రాష్ట్రవ్యాప్తంగా శ్రీరామనవమి పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శ్రీరాముని దేవస్థానాలు రామజపంతో మారుమోగాయి. బెంగళూరు నగరంలోని ఇస్కాన్ దేవస్థానం, చామరాజపేటె శ్రీరామేశ్వర దేవస్థానంలో సీతారామ లక్ష్మణుడికి ప్రత్యేక అలంకరణ చేపట్టి విశేష పూజలు నిర్వహించారు. రాజాజీనగర శ్రీరామమందిర, రాగిగుడ్డ అంజనేయ దేవస్థానం, కోటె ఆంజనేయ దేవస్థానం, హనుమంతనగర గుట్టె ఆంజనేయ స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. రాజాజీనగర శ్రీరామ మందిర దేవస్థానంలో భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరి నిలిచారు. మైసూరు రోడ్డు గాలి ఆంజనేయ దేవస్థానం వద్ద భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా రామాలయాలకు ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ చేపట్టారు. భక్తులు ఉదయం నుంచి దేవస్థానాలకు వెళ్లి స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. బెంగళూరు నగర వ్యాప్తంగా పలు వీధులు, కూడళ్లలో సీతా, రామ, లక్ష్మణుల చిత్రపటాలను పెట్టి పూజలు చేపట్టిన వివిధ సంఘాలు ప్రజలకు పానకం, మజ్జిగ, ప్రసాదాలను అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు ఆలయాల్లో స్వామి వారి దర్శనానికి భక్తుల బారులు -
తుంగభద్రలో మునిగి నలుగురు మృతి
రాయచూరు రూరల్: జిల్లాకు చెందిన నలుగురు తుంగభద్ర నదిలో మునిగి దుర్మరణం పాలైన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. మాన్వి తాలూకా కుర్డి గ్రామానికి చెందిన 18 మంది కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్లో ఓ వివాహానికి వెళ్లారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం కుందకూరు వద్ద తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు జల సమాధి అయ్యారు. మాన్వి తాలూకా కుర్డికి చెందిన దాసరి ఉమాపతి(28), దాసరి రత్నమ్మ (26), దాసరి శివానంద(20), దాసరి మహేష్(20) నదిలో సరదాగా స్నానానికి వెళ్లి లోతట్టు ప్రాంతంలోకి దిగి పోవడంతో అక్కడికక్కడే మరణించారు. ఆ ప్రాంతంలో తెప్ప సహాయంతో గాలించి మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనలో మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
మెత్తబడిన సాదిక్ ఫైల్వాన్
శివాజీనగర/సాక్షి, బళ్లారి : దావణగెరె దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగుబాటుకు ట్విస్ట్ లభించింది. ఎస్ఎస్ మల్లికార్జున కుమారుడు సమర్థకు టికెట్ ఇచ్చినందుకు తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలోకి దిగిన సాదిక్ పైల్వాన్ ఎట్టకేలకు మెత్తబడ్డారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిశారు. శుక్రవారం సీఎం ప్రభుత్వ నివాస కార్యాలయానికి ఆయనను పార్టీ నాయకులు రిజ్వాన్ అర్షద్, సలీం అహమ్మద్ ఖాన్ పిలుచుకొచ్చారు. సాదిక్ పైల్వాన్తో సీఎం కొంతసేపు చర్చించారు. ఏమైనా సమస్య ఉంటే పరిష్కరించుకొందామని, అండగా ఉంటామని సాదిక్కు భరోసా ఇచ్చారని తెలిసింది. కాంగ్రెస్ ఉన్నత వర్గాల కథనం ప్రకారం సీఎం సిద్దరామయ్యతో సాదిక్ పైల్వాన్ చర్చలు ఫలించాయి. దీంతో సాదిక్ తాను పోటీ నుంచి తప్పుకుని, కాంగ్రెస్ అభ్యర్థి సమర్థ్కు మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారని విధాన పరిషత్ ప్రభుత్వ చీఫ్విప్ సలీం అహమ్మద్ సమాచారం అందించారు. దావణగెరె దక్షిణ కాంగ్రెస్ తిరుగుబాటులో ట్విస్ట్ సీఎం సిద్దరామయ్యను కలిసిన రెబల్ అభ్యర్థి -
ఉచ్చులో చిక్కుకుని పులి మృతి
మైసూరు: ఉచ్చులో చిక్కుకుని పులి మరణించిన ఘటన మైసూరు జిల్లా హుణసూరు తాలూకా నాగరహొళె టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోని మెట్టికుప్పె రేంజ్ సమీపంలోని అసనగుండిలో జరిగింది. ఇక్కడ గిరీష్ అనే వ్యక్తికి చెందిన ఫామ్హౌస్లో అడవి పందిని పట్టుకోవడానికి ఉచ్చు ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చిన మూడేళ్ల మగ పులి ఆ ఉచ్చులో చిక్కుకుని మరణించింది. డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్, నాగరహొళె ఫీల్డ్ డైరెక్టర్ సీమ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. పులి కళేబరానికి అక్కడే పశువైద్యులు పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. భారీ అవినీతి కేసులో మలుపు ● సస్పెండైన ఇంజనీర్కు 10 రోజుల్లోనే రిలీఫ్ ● సస్పెన్షన్ ఆదేశాల రద్దుపై సర్వత్రా విమర్శలు సాక్షి,బళ్లారి: కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై సదరు అధికారి సస్పెండైన కేసు కొత్త మలుపు తిరిగింది. కొప్పళ నగరసభ జూనియర్ ఇంజనీర్ దాదాపు రూ.10 కోట్ల మేర అక్రమాలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తడంతో పాటు అందుకు సంబంధించిన రికార్డులు కూడా సాక్ష్యాధారాలతో బయటపడటంతో మార్చి 16న సంబంధిత అధికారి సోమలింగప్పను సస్పెండ్ చేశారు. లోకాయుక్త తనిఖీల్లో వాస్తవాలు వెలుగులోకి రావడంతో సస్పెండ్ అయిన అధికారి పది రోజుల్లోనే మళ్లీ సస్పెన్షన్ ఆర్డర్ను రద్దు చేయించుకోవడం పలు ప్రశ్నలకు దారి తీసింది. భార్యపై అవినీతి అరోపణలు ఉన్నప్పటికీ రాజకీయ పలుకుబడి, పాలన అధికారుల ఒత్తిళ్లతో పది రోజుల్లోనే సస్పెన్షన్ ఆదేశాలు రద్దు చేయించుకోవడం పెను వివాదానికి దారి తీయడమేగాక సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. రాత పరీక్ష వాయిదాదొడ్డబళ్లాపురం: దావణగెరె, బాగల్కోటె నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల నేపథ్యంలో వాయువ్య కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆరోజు జరగాల్సిన పరీక్షలను ఏప్రిల్ 10కి వాయిదా వేస్తున్నట్టు కేఈఏ ప్రకటించింది. మొత్తం 33 పోస్టులకు బెంగళూరు, ధారవాడల్లో పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు తదుపరి కొత్త తేదీ, పరీక్ష వేళలను దృష్టిలో పెట్టుకుని పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. 444 ఎకరాల అటవీ భూమి స్వాధీనం● వాయుసేనకు మంజూరు ఆదేశాలు రద్దు ● అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రె వెల్లడి శివాజీనగర: బెంగళూరు ఉత్తర తాలూకా జారకబండ శ్రీగంధపు కావల్లో వాయుసేన ఆధీనంలో ఉన్న 444 ఎకరాల అటవీ భూమిని పునర్ స్వాధీనం చేసుకునేందుకు కర్ణాటక అటవీ చట్టం–1963 సెక్షన్–64ఏ కింద తక్షణం ప్రక్రియ ఆరంభించాలని సూచించినట్లు అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రె తెలిపారు. ఈ భూమిని వాయుసేనకు రాష్ట్ర ప్రభుత్వం 2017 అక్టోబరు 9న మంజూరు చేసిన ఆదేశాలను రద్దు చేశామన్నారు. పర్యావరణ దృష్టితో ఈ ప్రాంతాన్ని ప్రధాన లంగ్స్పేస్గా ఉంచటం అవసరం అన్నారు. ఎలాంటి ఆలస్యం చేయకుండా ఖాళీ చేసే చర్యలు తీసుకోవాలి. జాతీయ శ్రేయస్సు దృష్ట్యా మంజూరు రద్దు అయిన తరువాత అవసరమైన నియమాల ప్రకారం పిటిషన్ సమర్పించిన భూమిని వినియోగించటం తీవ్ర విషయం. అందువల్ల సెక్షన్– 64ఏ నోటీస్ జారీ చేసి అక్రమణలు తొలగించాలని అధికారులను ఆదేశించామన్నారు. నిధి కోసం విగ్రహాలు ధ్వంసం దొడ్డబళ్లాపురం: నిధి కోసం దుండగులు దేవాలయంలో విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటన కలబుర్గి జిల్లా అఫ్జల్పుర తాలూకా బడదాళ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని బసవణ్ణ దేవాలయంలో జొరబడ్డ దుండగులు శివలింగం, ఆంజనేయస్వామి విగ్రహాలను ధ్వంసం చేసి తవ్వకాలు జరిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. -
1న తుమకూరుకు రాష్ట్రపతి ముర్ము రాక
తుమకూరు: ఏప్రిల్ 1న సిద్ధగంగ మఠంలో లింగైక్య శ్రీశివకుమార స్వామీజీ జయంతి కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు. ఆ రోజు తుమకూరు నగరం అంతటా పోలీసు భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. శుక్రవారం జిల్లా కమిషనర్ కార్యాలయంలో ప్రముఖుల భద్రతపై జరిగిన ప్రాథమిక సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లాధికారిణి శుభా కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రపతి కార్యక్రమానికి, ప్రముఖులకు ప్రస్తుతం ఉన్న భద్రతలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకునే బాధ్యతను జిల్లా స్థాయి అధికారులకు ఆమె అప్పగించారు. దేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి రాకను దృష్టిలో ఉంచుకుని నగరం అంతటా పోలీసు బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎస్పీ కేవీ అశోక్ తెలిపారు. రాష్ట్రపతి భద్రత కోసం సుమారు 15 వేల మంది పోలీసు సిబ్బందిని మోహరిస్తున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో పాల్గొన్న సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన సుహాస్ సూడ మాట్లాడుతూ రాష్ట్రపతి పర్యటనలో భద్రత అత్యంత కీలకం. జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర నిఘా శాఖ ఎస్పీ సురేష్, అదనపు కమిషనర్ డాక్టర్ ఎన్.తిప్పేస్వామి, సిద్ధగంగ మఠం ప్రతినిధి మల్లికార్జున్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం ప్రతినిధుల బందం తుమకూరు వర్సిటీ హెలిప్యాడ్, సిద్ధగంగ మఠంలో కార్యక్రమం జరిగే వేదికలను పరిశీలించింది. -
కూరగాయలు విషతుల్యం.!
బనశంకరి: బెంగళూరు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో పండించే కూరగాయల్లో సీసీం అనే ప్రమాదకర భారీ లోహంతో కూడిన అంశాలు, క్రీమినాశక అంశాల అవశేషాలు వెలుగుచూశాయి. వీటిని భుజిస్తే కిడ్నీ, మెదడు సంబంధిత రోగాలు వస్తాయనే దిగ్భ్రాంతికర అంశం వెలుగులోకి వచ్చింది. బెంగళూరు నగర మార్కెట్లలో కూరగాయలను పరిశీలించిన సమయంలో భారీ ప్రమాణంలో విషకారక అంశాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) కమిటీ పరీక్ష నిర్వహించి ధృవీకరించింది. ఇందులో 72 తరహాలో 19 విషకార అంశాలు కనబడ్డాయి. వంకాయలు, సొరకాయలు, అనపకాయలు, దొండకాయలు తదితర వివిధ రకాల ఆకుకూరల్లో సీసం అంశం ఉన్నట్లు తెలిసింది. పరిసర నిర్వహణ పరిశోధన సంస్థ(ఈఎంపీఆర్ఐ) కూరగాయల్లో భారీలోహాలు ఉండటంపై రెండేళ్ల క్రితం హెచ్చరించింది. ప్రస్తుతం అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రాధికార కమిటీ నిర్వహించిన పరిశీలనలో కూరగాయల్లో ప్రమాదకర సీసం(లెడ్)తో కూడిన నిషేధిత కీటక నాశక అంశాలు ఉన్నట్లు కనబడింది. దీనిపై 2023లో మీడియాలో ప్రకటించిన నివేదిక ఆధారంగా జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) సుమోటో కేసు నమోదు చేసింది. వాస్తవ పరిస్థితిని పరిశీలించడానికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా ఐదు మంది సభ్యులతో కూడిన కమిటీ ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తింపు పొందిన లాబొరేటరీల ద్వారా పరీక్షలు చేపట్టింది. ఎక్కడెక్కడ శాంపిల్స్ సేకరణ? బెంగళూరు నగరంలోని నెలమంగల, రాజాజీనగర, కోలారు, చిక్కబళ్లాపుర మార్కెట్లు, వ్యవసాయ భూముల నుంచి మొత్తం 72 కూరగాయల శాంపిల్స్ సేకరించింది. ల్యాబొరేటరీ పరీక్షల్లో 72 శాంపిల్స్ పైకి 19లో నిర్ణయించిన దానికంటే అధిక ప్రమాణంలో సీసం వెలుగు చూసింది. మట్టి కూడా కలుషితం కూరగాయలు మాత్రమే కాకుండా కోలారు, చిక్కబళ్లాపుర, నెలమంగలలో 13 చోట్ల సేకరించిన 26 మట్టి శాంపిల్స్కు గాను 23 శాంపిల్స్ కలుషితమైనట్లు ల్యాబ్ పరీక్షల్లో వెలుగుచూసింది. నిషేధిత కీటకనాశకాల ఆచూకీ లభ్యం ఆహార సురక్షత, నాణ్యత నిబంధనలు(ఎఫ్ఎస్ఎస్ఆర్) పరిమితిని దాటి 12 రకాల కీటకనాశకాల అవశేషాలు కూరగాయల్లో లభ్యమయ్యాయి. లావైన వంకాయలు, అల్లం, కీరదోసకాయలు, బజ్జీ మిరపకాయల్లో అత్యధిక కీటకనాశకాలు కనబడ్డాయి. భారత్లో 2023లో నిషేధిత విషకార మోనోక్రోటోపాస్ కీటక నాశకాలు బజ్జీమిరపకాయల్లో నిర్ణయించిన దానికంటే రెండు రెట్లు అధికంగా ఉంది. యూరోపియన్ యూనియన్లో విషకారి అని నిషేధించిన అసిపేట్, ఇదియాన్, పిప్రోనిల్, ప్రోపెనోపాస్ లాంటి రసాయనాలు లభ్యమయ్యాయి. ఇది కేవలం ప్రారంభ దశ నివేదిక కాగా వ్యవసాయ శాఖ, వ్యవసాయ యూనివర్శిటీల నేతృత్వంలో స్థానిక స్థాయిలో మరింత సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉందని కమిటీ అభిప్రాయపడింది. అంతేగాక రైతుల్లో కీటకనాశకాల వినియోగంపై జాగృతం చేయాలని సిఫార్సు చేసింది. బెంగళూరు మార్కెట్ల కూరగాయల్లో విషకార అంశాలు వెలుగులోకి భారీ ప్రమాణంలో సీసం ఆచూకీ లభ్యం, సీపీసీబీ పరీక్షల్లో ధృవీకరణ కిడ్నీ, మెదడు తదితర అవయవాలు వ్యాధుల బారిన పడే అవకాశం ఏయే కూరగాయల్లో ఎంతమేర విషం అంటే.... సేంద్రియంగా పండించి విక్రయిస్తున్న వంకాయల్లో 1.953 ఎంజీ/ కేజీ మేర సీసం లభ్యమైంది. ఇది నిర్ణయించిన దాని కంటే 20 రెట్లు అధికంగా ఉంది. దొండకాయల్లో సుమారు 18 రెట్లు అధికంగా సీసం కనబడింది. అనపకాయల్లో నిర్ణయించిన దాని కంటే 9 రెట్లు అధికం. ఆకుకూరలు, క్యాబేజీలో నిర్ణయించిన దాని కంటే 5 రెట్లు సీసం లభ్యమైంది. కీరదోస, బీరకాయ, బీట్రూట్, కాలీఫ్లవర్, బీన్స్, బజ్జీ మిరపకాయల్లో సీసం అంశాలు అధికంగా ఉన్నాయి. -
ఇకపై టెన్త్ మార్కులు 525 మాత్రమే
శివాజీనగర: రాష్ట్రంలో ఎస్ఎస్ఎల్సీ విద్యార్థులపై విద్యా ఒత్తిడిని తగ్గించే దిశలో పాఠశాల విద్యా, సాక్షరత మంత్రి ఎస్.మధు బంగారప్ప శుక్రవారం అతి ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించారు. ఇకపై ఎస్ఎస్ఎల్సీ పరీక్షల్లో తృతీయ భాషకు గ్రేడింగ్ పద్ధతి అమలు చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 625 మార్కుల్లో తృతీయ భాషకు 100 మార్కులను నిర్ణయించారు. ఇకపై తృతీయ భాషలో పాస్ గాని ఫెయిల్ అనే పద్ధతి ఉండదు. అంటే ఫైనల్ ఫలితాల మార్కులకు తృతీయ భాష మార్కులను పరిగణించబోరు. అలా కాకుండా గ్రేడింగ్ ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. హిందీ, సంస్కృతం, తుళు, మరాఠి, అరబిక్తో పాటు పాఠ్యక్రమంలో ఉన్న అన్ని తృతీయ భాషలకూ ఈ నియమం అన్వయిస్తారన్నారు. అధికారిక ఆదేశాలను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. పిల్లలకు నైతిక విద్య : ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా నైతిక విద్య పుస్తకాలను అందిస్తామన్నారు. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విద్యార్థుల మానసిక ఆరోగ్యం, భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని 16 సంవత్సరాలలోపు పిల్లలకు సామాజిక మాధ్యమాల వినియోగాన్ని నిషేధిస్తూ అతి ముఖ్యమైన ప్రతిపాదనను అసెంబ్లీ సమావేశాల్లో చర్చించామన్నారు. అందరి నుంచి సానుకూల అభిప్రాయం వ్యక్తమైంది. ఈ సమస్య కేవలం ప్రభుత్వ స్థాయిలో పరిష్కారం కాదు. తల్లిదండ్రులు తమ పిల్లల మొబైల్ వినియోగం అరికట్టే విషయంపై ఎక్కువ బాధ్యత వహించాలని మంత్రి పేర్కొన్నారు. గతంలో మాదిరిగా మొత్తం 625 కాదు హిందీ పరీక్ష మార్కులు లెక్కలోకి రావు -
ఉద్యానవనంలో మొసలి ప్రత్యక్షం
హొసపేటె: విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా బసవేశ్వర దేవస్థానం సమీపంలో ఉన్న ఉద్యానవనంలో మొసలి కనిపించడంతో కొంతసేపు ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఉదయం తోటను తనిఖీ చేస్తుండగా, పొలంలో పని చేస్తున్న సిబ్బంది నీడగల చెట్టు కింద మొసలి పడుకుని ఉండటాన్ని చూసి భయపడ్డారు. వారు వెంటనే ఈ విషయాన్ని తోట యజమాని, అటవీ శాఖ పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో చుట్టు పక్కల ప్రాంతాల గ్రామస్తులు మొసలిని చూడటానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు మొసలిని సురక్షితంగా రక్షించారు. అనంతరం సహాయక బృందం సాయంతో మొసలిని తుంగభద్ర డ్యాంలో విడిచి పెట్టారు. నేడు ఉద్యోగాలకు నేరుగా ఇంటర్వ్యూలు హుబ్లీ: నవనగర జిల్లా ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉద్యోగాలకు నేరుగా ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశారు. అపోలో ఫార్మసిస్ లిమిటెడ్, ఎస్బీఐ లైఫ్ ఉద్యోగ దాతలు తమకు కావాల్సిన ఉద్యోగులను ఎంపిక చేస్తారు. వివరాలకు సెల్ నెంబర్–6362923462లో సంప్రదించాలని సదరు కార్యాలయ అధికారి ఓ ప్రకటనలో కోరారు. రిజర్వేషన్ ఇచ్చేవరకు నియామకాలు తగదు రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ, రిజర్వేషన్ ప్రకటించే వరకు ప్రభుత్వ కొలువుల్లో నియామకాలకు అవకాశం కల్పించడం తగదని కర్ణాటక మాదిగ పోరాట ఐక్య వేదిక మహాసభ సంచాలకుడు రామన్న పేర్కొన్నారు. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. నివేదిక ఆధారంగా రోస్టర్ పద్ధతిలో రిజర్వేషన్ల కేటాయింపులు జరిగే వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఈ విషయంలో ఆచితూచి అడుగు ముందుకు వేయాలని కోరుతూ అదనపు జిల్లాధికారి శివానందకు వినతిపత్రం అందించారు. జిందాల్ విద్యానగర్లో ఎలుగుబంటి, పిల్లల పట్టివేత బళ్లారిటౌన్: తోరణగల్లు జిందాల్ విద్యానగర్లోని ఓ టౌన్షిప్లో గత 10 నెలలుగా తన రెండు పిల్లలతో సంచరిస్తున్న ఆడ ఎలుగుబంటితో సహా మూడు ఎలుగుబంట్లను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఇదే మొదటి సారిగా ఆటోమేటిక్ మొబైల్ యాప్ బేస్డ్ లాకింగ్ సిస్టమ్తో మూడు ఎలుగుబంట్లను ఏకకాలంలో పట్టుకున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. ఈ పట్టివేత కార్యక్రమంలో అటవీ శాఖ డీసీఎఫ్ కేఎన్.బసవరాజు, ఐఎస్ఎస్ ఏసీఎఫ్ చరణ్కుమార్, ఆర్ఎఫ్ఓ అయ్యద్ దాదా ఖలందర్, మంజునాథ్, మోహన్, గురుస్వామి, వెంకటేష్, శ్రీధర్ పాల్గొన్నారు. వాటికి పశువైద్యురాలు డాక్టర్ ప్రకృతి వైద్యం అందించి అనంతరం వాటిని అటవీ ప్రదేశంలోకి వదిలినట్లు అధికారులు తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఏడో వేతన శ్రేణి చెల్లించాలి రాయచూరు రూరల్: కేంద్ర ప్రభుత్వం రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు వేతన శ్రేణిని చెల్లించాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. జిల్లాధికారి కార్యాలయం వద్ద రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మహదేవప్ప మాట్లాడారు. పదవీ విరమణ చేసిన కుటుంబ సభ్యులకు పింఛన్ అందే విధంగా ఉన్న చట్టానికి సవరణ తెచ్చారని, దానిని విరమించుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. -
వైభవంగా ఆంజనేయ స్వామి రథోత్సవం
హొసపేటె: నగరంలోని 1వ వార్డులోని అఖండ చిత్తవాడ్గి ఆంజనేయ స్వామి రథోత్సవం బుధవారం సాయంత్రం వేలాది మంది ప్రజల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. నూతన సంవత్సర పండుగ అయిన ఉగాది సందర్భంగా ఏడు రోజుల పాటు నిర్వహించే ఈ రథోత్సవాన్ని బుధవారం సాయంత్రం 6 గంటలకు అక్కడకు చేరుకున్న వేలాది మంది భక్తుల సమక్షంలో లాగారు. దీనికి ముందు జెండా వేలం నిర్వహించారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, రథాన్ని లాగడానికి ఆదేశించారు. ప్రధాన వీధి నుంచి రథాన్ని బసవన్న పాదగట్టె వరకు లాక్కొచ్చారు. రథోత్సవం సాగే మార్గంలో, ఆ మార్గానికి దిగువన ఉన్న ఇళ్ల నుంచి వేలాది మంది ప్రజలు రథం పైకి పూలు, పండ్లు విసురుతూ తమ భక్తిని చాటుకున్నారు. చిత్తవాడ్గి యువకులు వివిధ రకాల చెక్క వాయిద్యాలను వాయిస్తూ జనసమూహాన్ని ఆకట్టుకున్నారు. మరోవైపు రథాన్ని లాగడంలో యువకుల బృందాల మధ్య పోటీ నెలకొంది. ఈ సందడి మధ్యే జాతరలో వివిధ రకాల బెలూన్లు, పిల్లనగ్రోవులు, ఇతర పిల్లల ఆట వస్తువులను ప్రత్యేకంగా విక్రయించారు. తీవ్రమైన ఎండవేడిమిని తట్టుకునేందుకు గాను గోవింద నగర్, సంతె బయలు ప్రాంతాలకు చెందిన పునీత్ రాజ్కుమార్ అభిమానులు, రథోత్సవానికి విచ్చేసిన భక్తులకు మజ్జిగ, శీతల పానీయాలను పంపిణీ చేశారు. చిత్తవాడ్గి, అమరావతి, ఎరెబయలు, హొసూరు తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు తరలి వచ్చి ఈ రథోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. -
టిప్పర్ను ఢీకొన్న ఐచర్
గుత్తి రూరల్: మండలంలోని కొత్తపేట గ్రామ శివారులో జాతీయ రహదారి–67పై గురువారం తెల్లవారు జామున ముందు వెళ్తున్న టిప్పర్ను వెనుక నుంచి ఐచర్ వాహనం ఢీకొన్న ప్రమాదంలో క్లీనర్ అభిజిత్(23) మృతి చెందగా, డ్రైవర్ అక్షయ్కు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ సురేష్ తెలిపిన మేరకు వివరాలు... కర్ణాటకలోని హొసపేటెకు చెందిన డ్రైవర్ అక్షయ్, విజయపుర జిల్లా తికోటా తాలూకా కనమాడి గ్రామానికి చెందిన అభిజిత్ ఐచర్ వాహన డ్రైవర్, క్లీనర్లుగా పని చేసేవారు. ఈ క్రమంలో వారు ఐచర్లో హొసపేటె వైపునకు వెళ్తూ మండలంలోని కొత్తపేట గ్రామ శివారులో జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న టిప్పర్ను గమనించకుండా వెళ్లి వెనుక నుంచి ఢీకొన్నారు. ఎదురుగా వస్తున్న లారీ వెలుతురుతో పాటు ఐచర్ డ్రైవర్ అక్షయ్ నిద్ర మత్తులో కునుకు తీసి నేరుగా వెళ్లి ముందున్న టిప్పర్ని ఢీకొన్నాడు. ప్రమాదంలో డ్రైవర్ అక్షయ్, క్లీనర్ అభిజిత్ ఐచర్లో ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న ఎస్ఐ ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భారీ క్రేన్ను తెప్పించి ఐచర్లో ఇరుక్కున్న ఇద్దరిని బయటకు తీశారు. అయితే క్లీనర్ అభిజిత్ అప్పటికే మృతి చెందగా, డ్రైవర్ అక్షయ్ తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ అక్షయ్ని గుత్తి ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తరలించారు. ముందు వెళ్తున్న టిప్పర్ని ఢీకొని ఐచర్ రోడ్డుకు అడ్డంగా నిలిచి పోవడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎస్ఐ సురేష్ ఐచర్ను పక్కకు తొలగించి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లీనర్ మృతి, డ్రైవర్కు తీవ్ర గాయాలు -
ఆ వదంతులను నమ్మొద్దు
హొసపేటె: జిల్లాలో పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలకు కొరత లేదు. ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగలేదు. ఇంధన కొరత అనేది కేవలం ఒక వదంతి మాత్రమే, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లాధికారిణి కవిత ఎస్ మన్నికేరి అన్నారు. బుధవారం ఇక్కడ జిల్లాధికారి కార్యాలయంలో ఆమె అధ్యక్షతన జరిగిన ఇంధన సరఫరా సంస్థల యజమానులు, పంపిణీదారుల అత్యవసర సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయి. ఎప్పటిలానే వినియోగదారులకు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయి. అందువల్ల ప్రజలు ఆందోళన చెంది పెట్రోల్ పంపుల ముందు క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. రాబోయే కొన్ని రోజులకు సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయి. రవాణా, సరఫరాలో కూడా ఎలాంటి అంతరాయాలు లేవు. గందరగోళానికి గురికావద్దు ప్రజలు గందరగోళానికి గురికావద్దని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ పంపులకు నిరంతరాయంగా ఇంధన సరఫరా ఉండేలా చూడాలని ఆయన చమురు కంపెనీ అధికారులకు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని ప్రతి పెట్రోల్ బంకులో అందుబాటులో ఉన్న ఇంధన నిల్వల వివరాలను ప్రదర్శించాలి. ఇంధన సరఫరాలో కృత్రిమ కొరత సృష్టించకూడదు. ఒక వేళ కృత్రిమ కొరత సృష్టించినా, ఇంధన కొరత ఉందని తప్పుడు వందతులు వ్యాప్తి చేసినా లేక నిర్దేశించిన ధర కంటే ఎక్కువ వసూలు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ రంగంలో ఇలాంటి కేసు కనబడితే పోలీస్ హెల్ప్లైన్ నంబర్– 112కు లేదా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. సమావేశంలో ఆహార, పౌర సరఫరాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రియాజ్, వివిధ చమురు కంపెనీల ప్రతినిధులు, జిల్లా పెట్రోలియం పంపిణీదారుల సంఘం కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. పెట్రోల్, డీజిల్ కొరత లేదు జిల్లాధికారిణి కవిత మన్నికేరి -
శ్రీరామ నవమికి సర్వం సిద్ధం
రాయచూరు రూరల్: జిల్లాలో శుక్రవారం శ్రీరామ నవమి వేడుకలకు సర్వం సిద్ధమైంది. భక్తులు ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకోనున్నారు. రాయచూరు గ్రామీణ నియోజకవర్గంలోని పంచముఖ గాణదాళ ఆంజనేయ స్వామి ప్రాణ దేవర ఆలయం, నగరంలోని రామ మందిరం, పాతాళ ఆంజనేయ, కోటలో వెలసిన రామాలయంలో ప్రత్యేక పూజలు నెరవేరనున్నాయి. తాగునీటి ఎద్దడి తలెత్తనీయొద్దు రాయచూరు రూరల్: జిల్లాలోని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రానీయ వద్దని, దాని నియంత్రణకు అధికారులు జాగ్రత్తలు పాటించాలని రాయచూరు జిల్లాధికారి నితీష్ అధికారులకు సూచనలు జారీ చేశారు. జిల్లాధికారి కార్యాలయంలో జరిగిన టాస్క్ఫోర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి కాలం ప్రారంభమైందని, నాలుగు నెలల పాటు ప్రజలు తాగునీటి ఇబ్బందులు పడకుండ చూడాలని ఆదేశించారు. నీటి సౌకర్యాలు లేని గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరందించేందుకు యజమానులతో చర్చించాలన్నారు. ఎక్కడా కూడా ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడరాదన్నారు. అన్ని చెరువులను నీటితో నింపాలని సూచించారు. విశ్వకర్మలను ఎస్టీ జాబితాలో చేర్చాలి రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అఖిల కర్ణాటక విశ్వకర్మ మహా సభ సమాజం డిమాండ్ చేసింది. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకులు మారుతి మాట్లాడారు. కుల శాస్త్ర అధ్యయనం చేపట్టాలని, తింథిణి మౌనేశ్వర ప్రాధికార ఏర్పాటుపై మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుని అమలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రికి పంపదలచిన వినతిపత్రాన్ని జిల్లాధికారికి సమర్పించారు. గర్భకోశ క్యాన్సర్ను నివారిద్దాం రాయచూరు రూరల్: మహిళల్లో గర్భకోశ క్యాన్సర్ వ్యాధి నివారణకు 16 ఏళ్ల లోపు బాలికలకు టీకాలు వేయించడంతో పాటు వ్యాధి నియంత్రణకు ముందురండాలని రాయచూరు తహసీల్దార్ సురేష్వర్మ సూచించారు. జిల్లా ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కరపత్రాలను విడుదల చేసి మాట్లాడారు. అధిక శాతం మహిళల్లో గర్భకోశ క్యాన్సర్ వ్యాధి కనపడుతోందన్నారు. స్తన క్యాన్సర్ను గుర్తించినట్లు, గర్భకోశ క్యాన్సర్ను గుర్తించడం కష్టమని తెలిపారు. తాలూకా ఆరోగ్య వైద్యాధికారులు అమృత, ప్రజ్వల్, అనూషా, ఈఽశ్వర్, గుండమ్మ, నాగరాజ్, సరోజ, సురేష్, ఈరమ్మ, రామకృష్ణ, సునీల్, అష్పక్, పరాన్ నస్రీన్ ఖాజీలున్నారు. -
అధికారులు ప్రజా సమస్యలపై స్పందించాలి
రాయచూరు రూరల్: అధికారులు ప్రజల సమస్యలపై స్పందించాలని మానవ హక్కుల కమిషన్ అధ్యక్షుడు శ్యాం భట్ సూచించారు. గురువారం జిల్లాధికారి కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలో బాలింతల మరణాల నియంత్రణ, స్కానింగ్ కేంద్రాలపై నిఘా, పోక్సో చట్టం, ఇతరత్ర అంశాలపై అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం సాయంత్రం నగరంలోిని బస్టాండ్ను సందర్శించి ప్రయాణికులతో మాట్లాడారు. సరైన సమయంలో బస్లను నడపరని, ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. బాలికల హాస్టల్లో సరైన భోజనం వడ్డించ కుండా ఉండడం, సరైన మౌలిక సౌకర్యాలు కల్పించక పోవడంపై అధికారులపై చిందులు తొక్కారు. జిల్లా జైలును పరిశీలించి ఖైదీలతో పూర్తి స్థాయి వివరాలు సేకరించారు. సదర్ బజార్ మహిళా పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసి మహిళలపై దౌర్జన్యం కేసులు, వరకట్నం, బాల్య వివాహాలు వంటి కేసుల వివరాలు తెలుసుకున్నారు. రాత్రి ఒపెక్ ఆస్పత్రిలో నేలపై పడుకున్న రోగితో మాట్లాడారు. సమావేశంలో కమిషన్ సభ్యులు వంటగోడి, జిల్లాధికారి నితీష్, ఎస్పీ అరుణాంగ్షు గిరి, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, నగర కమిషనర్ జుబిన్ మహాపాత్రో, సంతోష్ రాణి, సురేంద్రబాబు, నందిత, నవీన్ కుమార్లున్నారు. -
బెంగళూరులో బాలుని హత్యాకాండ
మైనర్ కాదు... కిల్లర్ మృతులు యమున, ఆమె తమ్ముడు సుదీప్ (ఫైల్)యశవంతపుర: రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవలో మహిళ, ఆమె సోదరున్ని ఓ మైనర్ బాలుడు నరికి హత్య చేశాడు. సిలికాన్ సిటీలో పెరిగిపోతున్న హత్యా సంస్కృతికి, మైనర్లలో నేర ప్రవృత్తికి ఈ దుర్ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. పీణ్యా పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం ఈ జంట హత్యలు జరిగాయి. బాలుడు (16) దాడిలో యమున (36), ఆమె తమ్ముడు సుదీప్ (34) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బ్యాడనహళ్లి పరిధిలో యమున, భర్త మల్లేగౌడ నివసిస్తుండేవారు, వీరికి 18 ఏళ్ల కూతురు, 17 ఏళ్ల కొడుకు ఉన్నారు. అయితే మల్లేగౌడ, పీణ్యాలో ఛాయా అనే మహిళతో ఆక్రమ సంబంధం నడుపుతున్నాడు. ఈ విషయం తెలిసి యమున భర్తతో గొడవ పడుతోంది. గత 3, 4 నెలల నుంచి రెండు కుటుంబాల మధ్య పోట్లాటలు జరిగి పోలీసు స్టేషన్ల వరకూ వెళ్లారు. ప్రశ్నించడానికి వెళ్లగా.. కానీ చాయా మాయలో పడి భర్త పద్ధతి మార్చుకోలేదనే కోపంతో యమున, తమ్ముడు సుదీప్ను తీసుకుని ఛాయా ఇంటికి వెళ్లింది. అక్కడ ఛాయా, యమునల మధ్య వాగ్వాదం మొదలై పెద్ద రగడగా మారింది. ఛాయా కొడుకు ఇంట్లోని మచ్చు కొడవలి తీసుకుని యుమున, సుదీప్లను ఇష్టానుసారం నరికివేశాడు. ఇద్దరూ రక్తపు మడుగులో మరణించారు. పీణ్యా పోలీసులు చేరుకుని బాలున్ని, అతని తల్లిని, మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మహిళ, ఆమె తమ్ముని నరికివేత తన తల్లితో గొడవ పడ్డారని కిరాతకం -
ఘాటి స్వామికి రూ.39 లక్షల రాబడి
దొడ్డబళ్లాపురం: దొడ్డ తాలూకాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఘాటి సుబ్రమణ్య దేవాలయంలో గురువారంనాడు హుండీలను లెక్కించారు. మొత్తం రూ.39.49 లక్షల నగదు, 830 గ్రాముల వెండి కానుకలు, 4 గ్రాముల బంగారం, 10 సింగపూర్ డాలర్లు లభించాయి. ఆర్టీసీ బస్సు కింద పడ్డ చిన్నారి దొడ్డబళ్లాపురం: బెళగావి జిల్లా సవదత్తి బస్టాండులో ఘోరం జరిగింది. బస్సు కదులుతుండగా ఓ మహిళ మూడేళ్ల పాప ఎత్తుకుని పరుగున వచ్చి బస్సు ఎక్కబోయింది. అయితే పాప చేజారి కిందపడడం, బస్సు చక్రాలు పాప మీద నుంచి వెళ్లడంతో చిన్నారి రక్తగాయాల పాలైంది. పాప రెండు కాళ్లు చిదిగిపోయాయి. రక్తమోడుతున్న పాపను స్థానికులు తక్షణం ఎత్తుకుని ఆస్పత్రికి తరలించారు. తల్లి ఆతృత, బస్సుల్లో రద్దీ వల్ల ఈ ఘోరం జరిగిందని అందరూ వాపోయారు. పాప గాయపడిన వీడియోలు వైరల్ అయ్యాయి. బాలున్ని చిదిమిన లారీ దొడ్డబళ్లాపురం: లారీ రూపంలో మృత్యువు బాలున్ని బలిగొంది, ఈ విషాదం రామనగర తాలూకా బిడదిలో జరిగింది. విజయ్ (13) అనే బాలుడు గురువారం ఉదయం పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుండి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ప్రమాదంలో విజయ్ తీవ్రగాయాలతో అక్కడే మరణించాడు. పాఠశాలకు వెళ్తూ టాటా చెప్పిన చిన్నారి కొంతసేపటికే కన్నుమూయడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. లారీ డ్రైవర్పై బిడది పోలీసులు కేసు నమోదు చేశారు. కారు మోసగాళ్లకు కటకటాలుమైసూరు: కార్ల మోసాలకు పాల్పడుతున్న ముఠాను మైసూరు పోలీసులు పట్టుకున్నారు. మైసూరులోని గౌసియానగర నివాసి, పండ్ల వ్యాపారి రుమాన్ షరీఫ్, రాజీవ్నగర నివాసి, కారు డీలర్ ముజాహిద్ పాషా, లష్కర్ మొహల్లా నివాసి, కార్ మెకానిక్ షహబుద్దీన్ నిందితులు. వారి నుంచి రూ.1.10 కోట్ల విలువైన 8 కార్లను స్వాధీనపరచుకున్నట్లు జిల్లా ఎస్పీ మల్లికార్జున్ బాలదండి తెలిపారు. వీరు సెకండ్ హ్యాండ్ కార్లను యజమానుల నుంచి కొంటామని చెప్పి మొదట కొంత డబ్బు ఇస్తారు. మిగతా సొమ్మును ఆర్సీ బుక్ తీసుకునేటప్పుడు చెల్లిస్తామనేవారు. తరువాత ఆ కార్లను ఫేస్బుక్లో పోస్టుచేసి తక్కువ ధరకు మంచి కార్లు లభిస్తున్నాయని చెప్పి అమ్మి సొమ్ము చేసుకునేవారు. అయితే కారు ఆర్సీ, ఇన్సూరెన్స్ తదితర దాఖలాలను ఇచ్చేవారు కాదు. వీరి చేతిలో రూ.5.50 లక్షలను కోల్పోయిన అభిషేక్ అనే వ్యక్తి బన్నూరు ఠాణాలో ఫిర్యాదు చేయగా డొంక కదిలింది. నిందితులు బెంగళూరుతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కార్లను తెచ్చి మైసూరులో అధిక ధరలకు విక్రయించేవారు. ఈ ముఠా చేతిలో పలువురు మోసపోయారని తెలిపారు. పెట్రోలు, సిలిండర్ల కోసం టెన్షన్ యశవంతపుర: వారం రోజుల తరువాత పెట్రోల్ దొరకదని ప్రచారం జరగడంతో ద్విచక్ర వాహనదారులు బంకుల వద్ద ఎగబడ్డారు. మామూలుగా రూ.100 పెట్రోల్ను నింపుకొనే వాహనదారులు ట్యాంక్ ఫుల్ చేయించుకొంటున్నారు. బెంగళూరులో పెట్రోల్ బంకుల వద్ద జన జాతరగా మారింది. చిక్కబళ్లాపుర, బీదర్, రాయచూరు, బళ్లారి, బెళగావి, దావణగెరెలోనూ కొన్నిరోజులుగా బంకుల్లో రద్దీ ఏర్పడింది. వైరల్ అవుతున్న వీడియోలను చూసి ఇతర వాహనదారులు కూడా బంకులకు పరుగులు పెడుతున్నారు. పెట్రోల్ కొరత లేదని అధికారులు చెబుతున్నారు. కొందరు పెట్రోలు దొరకని సోషల్ మీడియాలో రీల్స్ పెడుతూ టెన్షన్ పుట్టిస్తున్నారు. మరోవైపు గ్యాస్ సిలిండర్లు మాత్రం నిజంగానే దొరకడం లేదు. బెంగళూరులో ఏజెన్సీల వద్ద పెద్దసంఖ్యలో జనం సిలిండర్ల కోసం వచ్చారు. -
గోమాతల సంజీవిని
సాక్షి,బళ్లారి: భారతీయ సంస్కృతిలో గోవుకు అత్యున్నత స్థానం ఉంది. గోవులో మూడు లక్షల మంది దేవతలు నివసిస్తారనే ప్రాచీన నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. అందుకే గోవును గోమాతగా పూజిస్తూ మనం ఆరాధిస్తుంటాం. గోవులకు ఆహారం పెట్టడం, సంరక్షించడం మహాపుణ్యకార్యంగా భావిస్తూ పూజించడం చూస్తుంటాం. అలాంటి గోవులను కొందరు వయస్సు దాటిన తర్వాత కసాయిఖానాకు తరలించడం కూడా జరుగుతున్న నేటి రోజుల్లో గోవులను పూజించి, ఆరాధించే ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతుంది. పురాణాలు, వేదాల్లో గోవుకు విశేష ప్రాధాన్యం కూడా ఉంది. గోవులో అన్ని దేవతలకు స్థానం ఉందని భావిస్తూ, దానిని పూజించడం ద్వారా అన్ని దేవతలను ఆరాధించిన ఫలితం లభిస్తుందని కూడా పెద్దలు చెబుతున్నారు. గోమాతకు ఇచ్చే గౌరవం కేవలం ఆధ్యాత్మికమే కాదు, అది మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబం. గోవులకు ఆహారం పెట్టడం, నీరు ఇవ్వడం, వాటిని సంరక్షించడం ఎంతో గొప్ప సేవగా భావిస్తూ, ఆ దిశగా రాజస్థాన్ సమాజ్ వారు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కసాయిఖానాలకు పంపకుండా ఆశ్రయం నగర శివార్లలోని ఆంధ్రాళ్ సమీపంలో రాజస్థాన్ సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోశాల దాదాపు 100 సంవత్సరాలకు చేరుకుంది. బాగా పాలు పిండుకుని, చాలా సంవత్సరాలు ఇంటి వద్దనే పెంచిన ఆవులు వయస్సు దాటి వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొందరు రైతులు కసాయిఖానాలకు పంపండం చూసి చలించపోయిన రాజస్థాన్ సమాజం గోశాలను ఏర్పాటు చేసింది. వృద్ధాప్యం వచ్చిన అవులే కాకుండా రోడ్లలో గాయపడిన గోవులను, సంరక్షణలో లేని గోవులను గోశాలకు తీసుకు వచ్చి వాటికి అన్ని విధాలుగా ఆహారం అందిస్తు కాపాడుకుంటూ వస్తున్నారు. పదుల సంఖ్యలో ప్రారంభించిన గోశాల నేడు దాదాపు 500 గోవులకు సంజీవినిగా మారింది. రాజస్థాన్ సమాజ్కు చెందిన వారు దాదాపు 40 మంది వరకు సంఘాన్ని ఏర్పాటు చేసుకుని వారి సొంత డబ్బులతో గోశాలను నడుపుతున్నారు. కొందరు దాతలు దానం చేసిన వాటిని స్వీకరించి గోరక్షణకు ఉపయోగిస్తున్నారు. గోరక్షణ సంఘం ఏర్పాటు చేసుకుని దినాదినాభివృద్ధి చేస్తున్నారు. మంచినీరు, వైద్య సేవలు అందుబాటులో గోవులకు మంచి ఆహారం, మంచినీరు, అవసరమైనప్పుడు వైద్య సేవలు అందిస్తూ కాపాడుతున్నారు. కసాయిఖానాలకు తరలించే గోవులను కాపాడటంతో పాటు రోడ్లలో వదిలివెళ్లిన గోవులను కూడా తీసుకుని వచ్చి వాటిని సాకుతున్నారు. దాదాపు ఐదు ఎకరాల సువిశాల స్థలంలో గోవులకు ప్రత్యేక షెడ్లు వేసి, గడ్డి వేసేందుకు విశాలమైన స్థలం, మంచినీరు అందించేందుకు, గోవులకు స్నానాలు చేయించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రతి నెల దాదాపు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేస్తూ గోవులను సంరక్షిస్తూ, మన సంస్కృతి వారసత్వాలను కాపాడటంతో పాటు, గోవులను కాపాడుతూ, మానవత్వానికి ప్రతీకగా నిలుస్తూ కీర్తి పొందుతున్నారు. ఈ సందర్భంగా గోరక్షణ సంఘం అధ్యక్షుడు వినయ్ కుమార్, మేనేజర్ సరోజ్, ప్రముఖులు భరత్, అశోక్ తదితరులు మాట్లాడుతూ గోవులను కసాయిఖానాలకు తరలించకూడదన్నారు. ఇంట్లో తల్లిదండ్రులు వృద్ధులైన తర్వాత ఏవిధంగా ఆలనాపాలన చూసుకుంటామో అదే తరహాలో వృద్ధాప్యంలోకి వచ్చిన గోవులను కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తమ సమాజానికి చెందిన పూర్వీకులు స్థాపించిన గోశాలను తాము విధిగా ముందుకు తీసుకెళుతున్నామన్నారు. గోవులను పూజిస్తే సాక్షాత్తు దేవతలందరికీ పూజలు చేసినట్లు అవుతుందన్నారు. ఆ దిశగా తాము అన్ని విధాలుగా గోవులను రక్షిస్తూ పూజిస్తున్నామన్నారు. గోశాలకు ఎవరైనా సాయం చేసే వారు వచ్చినా తాము వాటిని స్వీకరించి గోవులను రక్షించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఆంధ్రాళ్ సమీపంలో 100 ఏళ్లుగా సురక్షితమైన గోశాల రాజస్థాన్ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైనం 500 పశువులకు ఆశ్రయం ఇస్తున్న అతిపెద్ద గోశాల గోసంరక్షణలో ఆధునిక, ఆరోగ్యకర ఆహార పద్ధతులు -
బెంగళూరు ప్రగతికి అంకితం
శివాజీనగర: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈ నెల 28న ఆర్సీబీ– హైదరాబాద్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగనుండగా, టికెట్ల కోసం ఎమ్మెల్యేలు ఆశగా ఉన్నారు. తమకు, కుటుంబ సభ్యులకు టికెట్లు ఇవ్వాలని గురువారం విధానసభలో ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా డిమాండ్ చేయడం గమనార్హం. బెంగళూరులోని జక్కూరు ఏరోడ్రోమ్ చర్చ టికెట్లకు దారితీసింది. ఏరోడ్రోమ్ని మరోచోటుకు తరలించి ఢిల్లీలో ఉన్న భారత్ మండపం తరహాలో భారీ సభా మందిరం, తపోవనం నిర్మించాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సలహా ఇచ్చారని, కేంద్రం నుంచి రూ.300 కోట్ల సహాయం ఇస్తామన్నారని, కానీ తాను ఏరోడ్రోమ్ను మార్చడానికి ఒప్పుకోనని డీసీఎం డీకే శివకుమార్ తెలిపారు. మంత్రి కేజే జార్జ్ స్పందిస్తూ ఏరోడ్రోమ్లో 40 మంది పైలట్ శిక్షణార్థులు ఉన్నారని, అక్కడ పై వంతెన ఉన్నందున డీజీసీఏ విమానాల రాకపోకలకు అనుమతించలేదని చెప్పారు. ఏరోడ్రోమ్ను మరో చోటికి మార్చేదిలేదు, అక్కడ లక్ష సీట్లు కలిగిన క్రికెట్ స్టేడియాన్ని నిర్మించాలనే సలహాలు వచ్చాయన్నారు. మరో స్టేడియం వద్దు ఆ సమయంలో ఆర్.అశోక్ స్పందించి, అక్కడ స్టేడియం నిర్మిస్తే 60 వేల కార్లు సంచరిస్తాయి, ఎయిర్పోర్ట్కు వెళ్లేందుకు ఇబ్బంది అవుతుందన్నారు. జక్కూరు దేశంలోనే తొలి విమానం విహార ట్రైనింగ్ కేంద్రం, దానికి చారిత్రక నేపథ్యం ఉంది. దానిని మూసివేయరాదని డిమాండ్ చేశారు. నగరంలో క్రికెట్ మ్యాచ్లు జరిగితే మేము ఒక టికెట్ కోసం ఎదురుచూడాలి, ఇంక మరో స్టేడియం అవసరం లేదు అని చెప్పారు. చిన్నస్వామి మైదానంలో క్రికెట్ శిక్షణ కోసం 16 ఎకరాలను బాడుగకు ఇచ్చి డబ్బు సంపాదిస్తున్నారు, మద్యం అమ్ముతున్నారు అని అశోక్ ఆరోపించారు. టికెట్లకు స్పీకర్ భరోసా ఈ సమయంలో విజయానంద కాశప్పనవర్, కోనరెడ్డితో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు ఐపీఎల్ క్రికెట్ పోటీలను చూసేందుకు ఎమ్మెల్యేలకు, వారి కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాలి, వీఐపీ గ్యాలరీలో చోటివ్వాలని కోరగా, అన్ని పార్టీల వారు మద్దతు తెలిపారు. స్పీకర్ ఖాదర్ మాట్లాడుతూ, ఈ డిమాండ్ను తీవ్రంగా పరిగణించాలని, క్రికెట్ సంఘం అధికారులను పిలిపించి చర్చించాలి. ఎమ్మెల్యేకు నాలుగు టికెట్లు ఇచ్చేలా చూడాలని ఆదేశించారు. సరేనంటూ డీసీఎం శివకుమార్ తెలిపారు. శివాజీనగర: బెంగళూరు ప్రపంచస్థాయి నగరం, ఇక్కడి సదుపాయాలను మరింతగా పెంచేందుకు, బెంగళూరు పేరును కాపాడుకునే దిశలో పలు పథకాలను రూపొందించినట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. విధానసభలో బెంగళూరు అభివృద్ధిపై జరిగిన చర్చకు సమాధానమిచ్చిన ఆయన, బెంగళూరు కొత్త రహదారులు, సొరంగ రోడ్డు నిర్మాణం, పై వంతెనల పథకాలను రూపొందించామన్నారు. ట్రాఫిక్ ఒత్తిడి నియంత్రణకు కొత్తగా పార్కింగ్ విధానం అమలు చేస్తున్నామని తెలిపారు. బెంగళూరులో జనసంఖ్య 1 కోటి 40 లక్షలు, నగరంలో వాహనాలు 1 కోటి 30 లక్షలు ఉండగా, ఆ నిష్పత్తితో పోలిస్తే 8 శాతం రోడ్లు మాత్రమే ఉన్నాయన్నారు. దీనికి పరిష్కారంగా వివిధ రోడ్లు, వంతెనల పథకాలను చేపట్టామన్నారు. ఇప్పుడున్న రోడ్ల వెడల్పు, భూ స్వాధీనానికి అధిక ఖర్చు అవుతోంది, అందుచేత ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తున్నామన్నారు. బెంగళూరులో ఆస్తి పన్నును పెంచలేదని, ఈ దఫా రూ1,271 కోట్ల అధిక ఆస్తి పన్ను వసూలైందని, దీనికి ఓటీఎస్ కారణమని తెలిపారు. ప్రపంచంలో బెంగళూరు 6వ స్థానంలో ఉంది. హైదరాబాద్ 16వ స్థానంలో ఉంది. బెంగళూరుకు మరే నగరంతో పోల్చరాదన్నారు. రాష్ట్రానికి బెంగళూరు హృదయం వంటిదని, అభివృద్ధికి ఏమేమి చేయాలో అన్నీ ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. ఈ–ఖాతాల జారీ సక్రమంగా సాగాలని, లంచం అడిగే ఓ అధికారిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అలాంటి సలహాలను ఒప్పుకోబోమన్న మంత్రులు దానిని అక్కడే కొనసాగించాలని వెల్లడి ఐపీఎల్ టికెట్ల కోసం ఎమ్మెల్యేల ఒత్తిడి మంజూరుకు సభాపతి ఆదేశం అభివృద్ధికి, ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు పథకాలు విధానసభలో డీసీఎం డీకే శివ -
కొత్త కోడలు పరారీ, ఆగిన మామ గుండె
రాయచూరు రూరల్: ఘనంగా బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి జరిగింది. ఇంటిలో అడుగుపెట్టిన కోడలు వంశోద్ధారకున్ని కానుకగా ఇస్తుందని అత్తమామాలు ఆశపడ్డారు. కానీ పెళ్లయిన 2 నెలలకే కోడలు ఇంటి నుంచి పరారు కావడంతో మామ గుండె ఆగిపోయింది. సమాజంలో పెరిగిపోతున్న పెడ ధోరణులకు ఈ విషాద ఘటన అద్దం పడుతోంది. వివరాలు.. కొప్పళలో గౌరిఅంగల నివాసి నాగరాజ్కు, రాయచూరు జిల్లా సింధనూరువాసి సంజన తో ఫిబ్రవరి 8 న కొప్పళలో ఓ కళ్యాణ మండపంలో ఘనంగా పెళ్లి జరిపించారు. కొప్పళలో ఇంటి కింది అంతస్తులో అత్తమామలు, పై అంతస్తులో కొత్త జంట కాపురం ఉంటున్నారు. మార్చి 21న రాత్రి 8 గంటలకు సంజన తనకు సుస్తీగా ఉందని, మెడికల్ షాపుకెళ్లి మాత్రలు తెచ్చివ్వాలని భర్తను కోరింది. సరేనని అతడు వెళ్లి మాత్రలు తీసుకువచ్చాడు, కానీ భార్య కనిపించలేదు. అప్పటి నుంచి పలుచోట్ల గాలించినా జాడ లేదు. ఆరోజు నుంచి కొత్త కోడలు ఇంటి పరువు తీసిందని, కొడుకు జీవితం బజారుపాలైందని తీవ్రంగా బాధపడుతున్న మామ ఖండప్ప గురువారం గుండెపోటుతో కన్నుమూశాడు. సీఎం సిద్దు భార్యకు హైకోర్టు నోటీసులు శివాజీనగర: మైసూరు అర్బన్ అభివృద్ధి అథారిటీ (ముడా) నుంచి అక్రమంగా ఇళ్ల స్థలాలను తీసుకున్నారనే కేసులో సీఎం సిద్దరామయ్య సతీమణి పార్వతికి హైకోర్టు అత్యవసర నోటీసులు జారీచేసింది. అలాగే లోకాయుక్తకు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు కూడా నోటీసులు పంపింది. ఇళ్ల స్థలాల కేసులో పార్వతి, సిద్దరామయ్యల దోషం ఏమీ లేదని లోకాయుక్త ఇటీవల నివేదికను కోర్టుకు సమర్పించింది. దీనిని ప్రశ్నస్తూ ఆ కేసులో ఫిర్యాదిదారు, సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ హైకోర్టుకు పిటిషన్ సమర్పించారు. గురువారం దీనిని విచారించిన న్యాయమూర్తి.. మీ వాదన ఏమిటో తెలియజేయాలని పార్వతితో పాటు ఈడీ, లోకాయుక్తకు నోటీసులు జారీ చేసి విచారణను వాయిదా వేశారు. తుమకూరులో లంచగొండి అరెస్టుతుమకూరు: రూ.12 వేల లంచం తీసుకుంటుండగా జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి (డీహెచ్ఎఫ్ఓ) కార్యాలయంలోని అకౌంట్స్ విభాగం మేనేజర్ ఎం. హెచ్. అరవింద్ను లోకాయుక్త అధికారులు పట్టుకున్నారు. తిపటూరుకు చెందిన రాజశేఖర్ ఆరోగ్యశాఖ తరఫున పలు అవగాహన జాగృతి కార్యక్రమాలను నిర్వహించారు, ఇందుకుగాను రూ.1.98 లక్షల బిల్లును రాజశేఖర్కు చెల్లించాలి. ఆ బిల్లును మంజూరు చేయడానికి అధికారి అరవింద్ లంచం డిమాండ్ చేశారని బాధితుడు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. బుధవారం సాయంత్రం, డిహెచ్ఓ కార్యాలయ ఆవరణలోనే అరవింద్ లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లోకాయుక్త ఎస్పీలు ఎ.వి.లక్ష్మీనారాయణ, డీఎస్పీ కె.ఎం.సంతోష్, ఎం. మంజునాథ్, సీఐలు టి. రాజు, బి. మహమ్మద్ సలీం పాల్గొన్నారు. స్కూటర్లోకి దూరిన నాగుపాము శివమొగ్గ: శివమొగ్గ నగరంలో వాటర్ బోర్డ్ ఆఫీసు ఆవరణలో నిలిపి ఉన్న స్కూటర్లోకి నాగుపాము దూరింది. స్నేక్ కిరణ్ ఆ పామును బయటకు తీశారు. ఆ స్కూటరు ఆఫీసులోని ఓ ఉద్యోగిది. గత కొన్ని రోజులుగా ఒక పాము తిరుగుతున్నట్లు సిబ్బంది చూశారు. మంగళవారం నిలిపి ఉన్న స్కూటీలో పాము వెళ్తుండగా కొందరు చూసి పాముల సంరక్షకుడు కిరణ్కు సమాచారమిచ్చారు. కిరణ్ స్కూటర్ని గాలించి ఫుట్బోర్డ్ కింద దాక్కున్న సుమారు 2 అడుగుల పొడవున్న నాగుపామును పట్టుకుని దూరంగా వదిలివేశాడు. నకిలీ నోట్ల ముఠా అరెస్టు బనశంకరి: బెళగావి సిటీలోని మార్కెట్ పోలీసులు నకిలీ కరెన్సీ నోట్ల ముఠాని గురువారం అరెస్టు చేశారు. మహమ్మద్ అర్బాజ్, రూపేశ్ వాకోడే, మహమ్మద్ హుసేన్ బక్షి, శ్రవణకుమార్ పట్టుబడ్డారు. వీరి నుంచి కారు , రూ.2 లక్షల 40 వేల వేల నకిలీ కరెన్సీనోట్లు, 4 మొబైల్స్ని స్వాధీనం చేసుకున్నారు. గోవాకు చెందిన ఈ నలుగురు నకిలీ నోట్లను ముద్రించి ఎవరైనా రూ. లక్ష అసలైన నోట్లు ఇస్తే రూ.2 లక్షల నకిలీ నోట్లు అందించేవారు. బెళగావి ఖడేబజార్లోని ఓ షాపులో నకిలీ నోట్లు ఇచ్చి వస్తువులు కొనడానికి యత్నించారు. అనుమానంతో దుకాణం యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మార్కెట్ పోలీసులు దాడిచేసి నలుగురినీ పట్టుకున్నారు. ఈ ముఠాలోని ముఖ్యుడు గోవా జైలులో ఉన్నాడని, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బస్సుల్లో దొంగల ముఠా అరెస్టు దొడ్డబళ్లాపురం: బస్సుల్లో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులను మాగడి పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో ఉండే హోసూరువాసి మాలా(40), నరసింహ (19), కోలారు జిల్లా మాలూరు తాలూకావాసి అంజలి (28), కుమార్ (36) నిందితులు. ఇటీవల ఆర్టీసీ బస్సులో బెంగళూరుకు కేఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ నుంచి వీరు 383 గ్రాముల బంగారు నగలు చోరీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మాగడి పోలీసులు గాలించి దొంగల ముఠాను పట్టుకున్నారు. బస్సుల్లో రద్దీగా ఉన్న సమయంలో ప్రయాణికుల సొత్తును కాజేవారు. వారి నుంచి రూ.50 లక్షల విలువైన బంగారు నగలు రికవరీ చేసుకున్నారు. -
యూత్ కాంగ్రెస్ భారీ నిరసన
హొసపేటె: కేంద్ర ప్రభుత్వ చమురు సేకరణ విధానం, విదేశాంగ విధాన వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హొసపేటెలో బుధవారం యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ ఒత్తిళ్లకు తలొగ్గారని ఆరోపిస్తూ ప్రభుత్వం తన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. నగరంలో విజయనగర కళాశాల ముందు నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ప్రదర్శనగా వెళ్లిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు భారీ బ్యానర్లను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చమురు సేకరణపై భారత్ స్వతంత్ర నిర్ణయం తీసుకోవాల్సి రాగా, కేంద్ర ప్రభుత్వం అమెరికా ఆదేశాల మేరకు పని చేస్తోందన్న అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. విదేశాల నుంచి చమురు కొనుగోలు వ్యవహారంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలకు సౌకర్యం కల్పించేందుకు ప్రయత్నం జరుగుతోందన్న అనుమానాన్ని కూడా వారు వ్యక్తం చేశారు. భారత ప్రధాని ఇతర దేశాల ఒత్తిళ్లకు లొంగకూడదని నిరసనకారులు డిమాండ్ చేశారు. దేశ ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంబన కాపాడాలని వారు కోరారు. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని తక్షణమే పునఃపరిశీలించి, దేశ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గణేష్ పాటిల్తో పాటు పాటు పలువురు యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. -
పురాతన సమాధి వెలుగులోకి
సాక్షి,బళ్లారి: కర్ణాటకలోని హావేరి జిల్లాలో చరిత్రను గురించి తెలిపే అరుదైన ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. చరిత్రకారులు, పురావస్తు శాఖ తవ్వకాల సందర్భంగా హావేరి జిల్లా రాణిబెన్నూరు తాలూకా బసలికట్టి గ్రామ సమీపంలో 3200 సంవత్సరాల క్రితం నాటి ఆదిమానవుల సమాధి లభ్యమైంది. రాతి నిర్మాణంతో రూపొందించిన ఈ సమాధి ఆది మానవుల కాలంలో మనుషులు అనుసరించిన అంత్యక్రియల విధానాన్ని ప్రతిబింబిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సమాధి నిర్మాణం ప్రత్యేకతతో పాటు దాని వయస్సు కూడా పరిశోధకులను ఆశ్యర్యానికి గురి చేస్తోంది. పురావస్తు శాఖ అధికారుల అభిప్రాయం ప్రకారం ఈ సమాధి ద్వారా ఆ కాలం నాటి ప్రజల జీవన విధానం, ఆహారపు అలవాట్లు, సామాజిక వ్యవస్థ, మరణానంతరం ఆచరించిన విధానాలు, విశ్వాసాలపై కీలక సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా అధికారులు లోతుగా అధ్యయనం చేస్తుండటం విశేషం. ముఖ్యంగా కర్ణాటకలోనే కాకుండా దక్షిణ భారత దేశంలోనే చారిత్రక నాగరికతలపై మరింత లోతైన అధ్యయనాలకు ఇది దోహదం చేస్తుందని వారంటున్నారు. తవ్వకాలు మరింత వేగవంతం ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో తవ్వకాలు మరింత వేగవంతం చేశారు. ప్రస్తుతం బయట పడిన ఒక సమాధితో పాటు మరిన్ని సమాధులు లేదా పురాతన అవశేషాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆ దిశగా ఈ ప్రాంతంలో లోతుగా అధ్యయనం చేస్తూ చరిత్ర ఆధారాలు, పురాతన ఆదిమానవుల జీవిత విశేషాలు, వైవిధ్యాలు, ఆచారాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. హావేరి జిల్లా చరిత్ర పుటల్లో నిలిచిపోయే దిశగా ఈ పరిశోధనలు ఉపయోపడనున్నాయని కూడా భావిస్తున్నారు. రాతి సమాధి అందులోనే దాదాపు 3200 సంవత్సరాల కిందటిదని తేలడంతో అప్పటి పద్ధతులు, మనిషి జీవన విధానాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. రాతి సమాధి వెనుక ప్రాచీన నాగరికత జాడలు వెలుగులోకి రావడంతో స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఆ కాలంలో ఉన్న సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకునేందుకు ఈ తవ్వకాలు మరింత ఉపయోపడతాయని పురావస్తు శాఖ అధికారులు పేర్కొంటున్నారు. తవ్వకాల్లో బయట పడిన పురాతన సమాధి ఇదే బసలికట్టి వద్ద బయల్పడిన అవశేషాలు 3200 ఏళ్ల క్రితం నాటిదిగా గుర్తింపు హావేరి జిల్లా చారిత్రక నాగరికత ఖిల్లా తవ్వకాల్లో బయటపడిన రహస్యాలు ఆదిమానవులపై లోతుగా అధ్యయనం -
ఉద్యోగాల స్కాంలో నలుగురి అరెస్టు
బనశంకరి: కోర్టుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి వందలాదిమంది నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన స్కాములో మరో నలుగురిని బుధవారం బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్చేశారు. జీఎస్.వెంకటరెడ్డి, తిప్పేస్వామి, సిద్దలింగయ్య, విజయా సిద్దలింగయ్య హిరేమఠ పట్టుబడినవారు. ఇదివరకే జేసన్ డిసౌజా, లవీనా అనే దంపతులను అరెస్టు చేయడం తెలిసిందే. ఈ మోసకారి జంట.. నిరుద్యోగులను గాలించి, డబ్బు వసూలు చేయడానికి పై నిందితులను ఏజెంట్లును నియమించుకున్నారు. నిరుద్యోగులు, ప్రైవేటు కంపెనీల్లో తక్కువ జీతానికి పనిచేసేవారికి ఈ ముఠా మాయమాటలు చెప్పేది. సర్కారీ ఉద్యోగం గ్యారంటీ అని రూ.10 లక్షల నుంచి 25 లక్షల వరకూ దోచుకునేది. నకిలీ నియామకాలను లెటర్లను అందించేవారు. నిందితుల నుంచి పోలీసులు రూ.38 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మోసం చేసిన డబ్బులతో భూములు, స్థలాలు కొన్నట్లు తెలిసింది. వీటిని జప్తు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. స్థలాల పేరుతో మహిళలకు రూ.25 లక్షల మస్కా మైసూరు: తక్కువ ధరకు ఇంటి స్థలం ఇప్పిస్తామని ముగ్గురు మహిళలను నమ్మించిన మోసగాడు.. వారికి రూ.25 లక్షలు టోపీ వేశాడు, ఈ ఘటన మైసూరులో వెలుగు చూసింది. ఏకలవ్యనగర నివాసి అనురాధ, ఆమె స్నేహితురాళ్లు జయమ్మ, శ్వేత అనే మహిళలు అదే బడావణెకు చెందిన శ్రీధర్ అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనురాధ అనే మహిళకు పరిచయం ఉన్న శ్రీధర్ తక్కువ ధరకు ఇంటి స్థలాలు ఇప్పిస్తానని నమ్మించాడు. దీంతో రూ.10 లక్షలు ఇచ్చింది. తన స్నేహితురాళ్లయిన శ్వేత, జయమ్మల నుంచి కూడా రూ.15 లక్షలు ఇప్పించింది. డబ్బు తీసుకుని ఏడాది గడిచినా శ్రీధర్ స్థలాలు ఇప్పించలేదు. డబ్బు తిరిగి ఇవ్వాలని అనురాధ కోరడంతో నిందితుడు, అతని కుటుంబ సభ్యులు ఆమైపె దాడి చేశారు. మేటగళ్లి పోలీసు స్టేషన్లో ఆరుగురిపై కేసు నమోదైంది. -
కాంగ్రెస్ పాలన అవినీతిమయం
బళ్లారిటౌన్: జిల్లాలో కాంగ్రెస్ పాలన అవినీతిమయంగా మారిందని జేడీఎస్ జిల్లా అధ్యక్షుడు మీనళ్లి తాయణ్ణ ఆరోపించారు. జిల్లాలో ఎస్పీ, డీసీ, జెడ్పీ సీఈఓ తప్పా కింది స్థాయి అధికారులంతా సామాన్య ప్రజలను పనుల కోసం డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్నారన్నారు. జిల్లాలో 5 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా విచ్చలవిడిగా జరుగుతున్న లంచావతారాలపై నోరు మెదపకుండా ఉన్నారన్నారు. ఏ అధికారి చూసినా తాము లక్షల్లో లంచాలు ఇచ్చి ఇక్కడికి ఇచ్చామని వారు బహిరంగంగానే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాత్రం ప్రతి సమావేశంలో తాము ఇచ్చిన హామీలను మాట తప్పలేదని గట్టిగా ప్రసంగిస్తున్నా అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వేలల్లో లంచాల డిమాండ్ బళ్లారి తాలూకాలో ప్రజల ఆస్తులను ఈ ఖాతాలోకి చేర్చాలంటే వేలల్లో డిమాండ్ చేస్తున్నారన్నారు. చాలా గ్రామ పంచాయతీల్లో పీడీఓలు పైఅధికారుల పేరుతో వేలల్లో డబ్బు డిమాండ్ చేస్తున్నారన్నారు. తాలూకా పంచాయతీ ఈఓ కూడా తమ పొలానికి చెందిన ఈ ఖాతా చేయడానికి తన కుమారుడితో ఎకరాకు రూ.50 వేలు డిమాండ్ చేశారన్నారు. లంచం ఇవ్వనందునే ఒకటిన్నర సంవత్సరం నుంచి ఫైల్ ముందుకు కదలడం లేదన్నారు. తమ ఫైల్ కదలాలంటే కనీసం రూ.20 వేలు ఇవ్వాలని మీనళ్లికి చెందిన పీడీఓ అధికారి పేరుతో లంచం డిమాండ్ చేసిన ఆడియో కూడా తమ వద్ద ఉందన్నారు. దీనిపై తాము జెడ్పీ సీఈఓతో పాటు జిల్లాధికారికి కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ నేత వండ్రి తదితరులు పాల్గొన్నారు. -
టెన్త్ పరీక్షలకు నై.. పొలం పనికి సై..
రాయచూరు రూరల్: పదో తరగతి పరీక్షలకు గైర్హాజరైన ఓ విద్యార్థిని పొలం పనిలో నిమగ్నమైన ఘటన గదగ్ జిల్లాలో చోటు చేసుకుంది. గదగ్ జిల్లా ముండరిగి తాలూకా పేటాలూరుకు చెందిన విద్యార్థిని తల్లిదండ్రులు పేదవారు కావడంతో రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఆ కుటుంబం నెట్టుకొస్తోంది. ఈ తరుణంలో హైస్కూలు విద్యార్థిని పల్లవి హళ్లికేర ముండరిగి పరీక్ష కేంద్రంలో పరీక్షను రాయకుండా గైర్హాజరై తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటానంటూ పొలం పనికి వెళ్లింది. గమనించిన విద్యా శాఖాధికారి గంగాధర్ వెంటనే ద్రాక్ష తోటలో పనికి వెళ్లిన పల్లవిని ద్విచక్రవాహనంలో పరీక్ష కేంద్రం వద్దకు తీసుకొచ్చి పరీక్షకు పంపారు. అధికారుల చొరవతో ఎట్టకేలకు పరీక్షలకు విద్యార్థిని హాజరు -
మార్ట్ వద్ద ట్రాఫిక్ రద్దీతో విలవిల
హొసపేటె: ఎంపీ ప్రకాష్ నగర్ రోడ్డులోని రిలయన్స్ మార్ట్ ముందు ప్రజలు తమ వాహనాలను అస్తవ్యస్తంగా పార్క్ చేస్తుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నగరంలోని ప్రధాన వ్యాపార కేంద్రమైన ఈ ప్రాంతంలో ప్రతి రోజు వందలాది మంది వినియోగదారులు రిలయన్స్ మార్ట్ను సందర్శిస్తుంటారు. అయితే వినియోగదారులు తమ ద్విచక్ర వాహనాలను రోడ్డు పైనే ఇష్టానుసారంగా పార్క్ చేస్తున్నారు. రోడ్డుపై వాహనాలను పార్క్ చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. వాహనాల కారణంగా రోడ్డులో సగం భాగం పార్కింగ్ స్థలంగా మారిపోయింది. దీని కారణంగా పాదచారులు నడవడానికి స్థలం లేకుండా పోతోంది. ఫలితంగా వాహనదారులు, ముఖ్యంగా రాత్రి పూట ట్రాఫిక్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. సరైన లైటింగ్ వ్యవస్థ ఉన్నా రోడ్డు మధ్యలో వాహనాలను నిలపడం వల్ల చిన్నచిన్న ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని స్థానికులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. -
అమర అభిమానులకు గౌరవం
● చిన్నస్వామిలో శిలాఫలకం బనశంకరి: గత ఏడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయోత్సవాలలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం ముందు తొక్కిసలాట జరిగి 11 మంది పౌరులు మరణించడం తెలిసిందే. ఐపీఎల్ కొత్త సీజన్ టోర్నీ మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. చిన్నస్వామి మైదానంలో 28న మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తొక్కిసలాట మృతుల గౌరవార్థం చిన్నస్వామి స్టేడియంలో బుధవారం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అలాగే మృత్యుంజయ, గణపతి, లక్ష్మీహోమాలు నిర్వహించారు. హోంమంత్రి పరమేశ్వర్, కర్ణాటక క్రికెట్ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ప్రసాద్ తదితరులు శిలఫలకానికి నివాళులు అర్పించారు. మళ్లీ అరిష్టాలు జరగకూడదని స్టేడియం గేట్లకు బూడిద గుమ్మడికాయతో దిష్టితీశారు. -
కమనీయం.. కోదండరాముని రథోత్సవం
మాలూరు: తాలూకాలోని లక్కూరు గ్రామంలో వెలసిన శ్రీ కోదండ రామస్వామి దేవాలయ బ్రహ్మ రథోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. అర్చకులు రఘునాథాచార్య నేతృత్వంలో మూలవిరాట్టుకు అభిషేకం, పంచామృత అభిషేకం, హోమం తదితరాలను నెరవేర్చారు. ఉత్సవమూర్తికి పూలతో అలంకరించి పూజలు జరిపి తేరులో అధిష్టించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జై కోదండ రామా అంటూ తేరును లాగారు.పెళ్లి పేరుతో అఘాయిత్యం.. కామాంధునికి 20 ఏళ్ల జైలుమైసూరు: పెళ్లి కుదిరిందనే సాకుతో బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాంధునికి చామరాజనగర అదనపు జిల్లా సెషన్స్ ఎఫ్టీఎస్సీ 1వ ప్రత్యేక పోక్సో కోర్టు 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. వివరాలు.. దొడ్డ గాజనూరు నివాసి మహేష్ అనే యువకుడు 2021 జూలై 4న బాలికతో పెళ్లి నిశ్చయం చేసుకున్నాడు. ఇదే అదనుగా తరచుగా ఇంటికి వచ్చి బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు అతనిపై చామరాజనగర మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి సీఐ ఎంఎల్ శేఖర్ దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్ సమర్పించారు. బెదిరింపులు, కిడ్నాప్, లైంగికదాడి తదితర అభియోగాలు విచారణలో రుజువు కావడంతో న్యాయమూర్తి ఎస్జే కృష్ణ ఈ మేరకు కఠిన శిక్ష విధించారు. ప్రభుత్వ వకీలు కే.యోగేష్ వాదనలు వినిపించారు. 5 రోజులు భారీ వర్షసూచనబనశంకరి: నడి వేసవి మధ్య వర్షాలు పలకరిస్తున్నాయి. రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు ఉరుములు, పిడుగులతో కూడిన గాలీ వాన కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. వర్షాల సమయంలో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వడగండ్లు పడతాయని పేర్కొంది. దక్షిణ ఒళనాడు, ఉత్తర ఒళనాడు మలెనాడు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన కుండపోత వానలకు ఆస్కారముంది. మంగళవారం సాయంత్రం బెళగావిలో ఆకస్మికంగా పెద్ద వర్షం కురిసింది. కాగా, వర్షం సమయంలో చెట్లు, విద్యుత్ స్థంభాలు పడిపోయే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలోని కొన్ని జిల్లాల్లో వడగండ్ల వర్షాలకు ఎక్కువ అవకాశముంది. పంటలు దెబ్బతినకుండా రైతులు జాగ్రత్తలు పాటించాలి. బెంగళూరు, మైసూరు, హాసన్, కొడగు, బెళగావి, ధార్వాడ, కలబుర్గి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. రాత్రి ధార్వాడలో జడివాన కురిసింది. -
చట్టసభ ముందు చిత్రవేడుక
శివాజీనగర: కాలం కాని కాలంలో పువ్వులు పూసినట్లు అనువుగాని వేళ ఓ వేడుక జరిగింది. విధానసౌధలో మెట్ల ముందు భాగంలో బుధవారం ఎమ్మెల్యేల ఫోటో షూట్తో కోలాహలం రాజ్యమేలింది. సాధారణంగా ప్రభుత్వ పదవీకాలం ముగిసేటప్పుడు ఇలాంటి ఫొటోషూట్ జరుపుతారు. కానీ ప్రభుత్వానికి సుమారు రెండున్నర సంవత్సరాల సమయం ఉండగానే హడావుడిగా ఛాయాచిత్ర వేడుక చేసుకోవడం చర్చకు తావిచ్చింది. స్పీకర్ ఖాదర్ సమక్షంలో ఎమ్మెల్యేలు బృంద చిత్రం తీసుకున్నారు. కేబినెట్ మార్పే ఆలంబనగా.. మంత్రిమండలిని మార్చవచ్చనే చర్చ జరుగుతోంది, మొదటిసారి ఎన్నికై నవారు, మూడు నాలుగు సార్లు ఎన్నికై నవారు తమకు మంత్రి పదవులు కావాలని సమావేశాలు జరిపి హైకమాండ్ను డిమాండ్ చేయడం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య స్పీకర్ ఖాదర్ ఎమ్మెల్యేల ఫొటో షూట్ని జరిపారు. ఏప్రిల్ లేదా, మే నెలలో మంత్రివర్గ పునర్విభజన జరగటం దాదాపుగా ఖాయమని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. స్పీకర్ ఖాదర్కు కూడా మంత్రి పదవి రావచ్చని ప్రచారం జరుగుతోంది. ఆ ఉద్దేశంతో అందరికీ జ్ఞాపకంగా ఉండిపోయేలా ఈ సంబరం జరిపినట్లు ఓ ఎమ్మెల్యే మీడియాకు చెప్పారు. మొత్తం మీద ఎమ్మెల్యేలతో స్పీకర్ చిత్రవేడుక భిన్న వ్యాఖ్యానాలకు చోటిచ్చింది. ఈ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్సీలు, కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు సైతం పాల్గొన్నారు. కొంతమంది హస్తం ఎమ్మెల్యేలు మాత్రమే గైర్హాజరయ్యారు. ఇంకా రెండేళ్లకు పైగా పదవీ కాలం ఉండగానే ఫొటో షూట్ స్పీకర్ ఖాదర్ చొరవ -
హుబ్లీలో యుద్ధ విమానాల విహారం
● భయాందోళనలో వాణిజ్య నగరి వాసులు ● సాధారణ రిహార్సలేనని అధికారి స్పష్టీకరణ హుబ్లీ: పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ల మధ్య ఘోర యుద్ధం ప్రారంభమై 25 రోజులు గడిచిన నేపథ్యంలో అంతటా ఆందోళన నెలకొన్న క్రమంలో హుబ్లీలో బుధవారం ఉదయం యుద్ధ విమానాలు సంచరించి ప్రజల్లో మరింత భయాన్ని పుట్టించాయి. ఉదయం 10 నుంచి 11 గంటల ప్రాంతంలో కర్కశ శబ్దాలను చేస్తూ ఈ విమానాలు సృష్టించిన హల్చల్ అంతా ఇంతా కాదు. మొత్తం 3 యుద్ధ విమానాలు నగరంపై చాలా కింద వరకు వచ్చినట్లుగా స్థానికులు చర్చించుకున్నారు. గోపనకొప్ప, కేశ్వాపుర, నెహ్రు నగర, సుళ్య రోడ్డు, ఉణకల్ తదితర చోట్ల కింద అంతస్తు వరకు విమానాలను చాలా దగ్గరగా చూసి ప్రజలు భీతిల్లిపోయారు. ఈ విషయమై హుబ్లీ విమానాశ్రయం డైరెక్టర్ రూపేష్కుమార్ స్పందిస్తూ గోవా ఏటీసీ నుంచి హుబ్లీ నుంచి ప్రయోగాత్మకంగా మూడు యుద్ధ విమానాలు శిక్షణ కోసం వచ్చాయన్నారు. పశ్చిమ ఆసియా యుద్ధానికి, ఈ విమానాల సంచారానికి సంబంధం లేదు. ప్రతి నెలా లేదా రెండు నెలలకు ఓసారి ఇలాంటి రిహార్సల్ చేయడం సాధారణ ప్రక్రియేనని, అందువల్ల ఎవరూ భయపడాల్సిన పని లేదని ఆయన తెలిపారు. రోడ్ల మరమ్మతుకు డిమాండ్రాయచూరు రూరల్: నగరంలో దుస్థితికి చేరిన రోడ్ల మరమ్మతు చేపట్టాలని రాయచూరు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కమల్కుమార్ జైన్ డిమాండ్ చేశారు. బుధవారం పాత్రికేయుల భనవంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో మూడేళ్లలో 866 మంది మరణించారన్నారు. రహదారులు, రైల్వే స్టేషన్లో మౌలిక సౌకర్యాలు లోపించాయని ఆరోపించారు. రాయచూరు గంజ్ నుంచి శక్తినగర వరకు చతుష్పథ రహదారి పనులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయన్నారు. నగరంలో ఐదు జాతీయ రహదారుల పనులు జరుగుతున్నా నగరంలో ఏ ఒక్క రహదారి సక్రమంగా లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. పండ్ల దుకాణంలోకి దూరిన బస్సు ● బ్రేక్ ఫెయిలైన ఫలితం ● మహిళకు తీవ్రగాయాలు బళ్లారిఅర్బన్: నగరంలోని గవియప్ప సర్కిల్ వద్ద బుధవారం బ్రేక్ ఫెయిలైన బస్సు పండ్ల దుకాణంలోకి దూసుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. మస్కి నుంచి బళ్లారికి వస్తున్న కేకేఆర్టీసీ బస్సు గవియప్ప సర్కిల్ వద్ద ప్రయాణికులను దింపిన అనంతరం బస్టాండ్ వైపు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అకస్మాత్తుగా బ్రేకులు పని చేయక పోవడంతో అదుపు తప్పింది. ఈ క్రమంలో అక్కడ ఉన్న పండ్ల దుకాణాన్ని బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. అయితే బస్సు సమీపంలోని ప్రకటన ఫలకానికి కూడా ఢీకొనడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఘటనపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మోసంపై చర్యలు చేపట్టండి రాయచూరు రూరల్: నగరంలో కుట్టు మిషన్లను ఇప్పిస్తానని మహిళలను మోసం చేసిన వ్యక్తిపై చర్యలు చేపట్టాలని మహిళలు డిమాండ్ చేశారు. బుధవారం జెడ్పీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళన సందర్భంగా జిల్లాధికారి నితీష్కు మహిళలు తమ గోడు వినిపించారు. స్కిల్ ఇండియా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న మారెప్ప అనే వ్యక్తి కుట్టుమిషన్ల పంపిణీకి రూ.400 చెల్లించాలని ఆశ చూపి మోసం చేశాడన్నారు. గత ఐదు నెలల నుంచి కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందన్నారు. దీనిపై జిల్లాధికారి స్పందిస్తూ నిందితునిపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఏఎస్పీ కుమారస్వామికి ఆదేశించారు. పథకాలు ప్రజల దరి చేర్చాలి రాయచూరు రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని వివిధ సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రజలకు వివరించాలని జిల్లాధికారి నితీష్ పేర్కొన్నారు. బుధవారం జెడ్పీ సభాభవనంలో పాత్రికేయులకు ఏర్పాటు చేసిన శిబిరాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. వికసిత భారత్ జీరామ్జీ చట్టం– 2025పై జెడ్పీ అధికారి శరణ బసవ, నేర వార్తల సేకరణ బాధ్యతపై ఏఎస్పీ కుమారస్వామి, వ్యాధుల వార్తలపై జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్రబాబు మాట్లాడారు. పంచ గ్యారెంటీల అమలు సమితి అధ్యక్షుడు పవన్ పాటిల్ మాట్లాడుతూ పథకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ కొరత వల్ల ప్రజలకు వాటి గురించి పూర్తిగా తెలియదన్నారు. హక్కులు, విధులు, సమానత్వం, విద్యా, సామాజిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి వీలవుతుందన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, కేంద్ర ప్రభుత్వ వార్త అధికారి రవీంద్ర, జిల్లా వార్త సార్వజనిక సంబంధాల శాఖ అధికారి గవిసిద్దప్ప, గుర్నాథ్, విజయ్ జాగటగల్లున్నారు. -
వెనక్కి తగ్గేదేలే.!
సాక్షి,బళ్లారి: మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత, దావణగెరె దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్యామనూరు శివశంకరప్ప(91) మృతితో ఖాళీ పడిన నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రెబల్ అభ్యర్థి సాదిక్ పైల్వాన్ గట్టి సవాల్ విసురుతున్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించిన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన సంగతి విదితమే. ఆయన్ను బుజ్జగించి నామినేషన్ ఉపసంహరిస్తామని సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ ప్రకటించిన నేపథ్యంలో సాదిక్ స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. తాను లాలిపప్ తినే పిల్లాడిని కానని, ఎవరో ఒప్పిస్తే నామినేషన్ వెనక్కి తీసుకునే వాడిని కాదని, ఎట్టి పరిస్థితుల్లో ఉప పోరు బరిలో ఉండి తన సత్తా చాటతానని హెచ్చరించారు. సీనియర్ నేత శ్యామనూరు మనవడు సమర్థ్కు కాంగ్రెస్ టికెట్ కేటాయించడంపై ఆయన రగిలిపోతున్నారు. టికెట్ ఆశిస్తే తప్పేంటి? తాను కూడా కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘంగా సేవ చేశానని, ముఖ్యంగా శ్యామనూరు శివశంకరప్పకు ఎన్నో ఏళ్లుగా ఆప్తుడుగా పని చేశానని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో తాను టికెట్ ఆశించడంలో తప్పేం ఉందని ప్రశ్నించారు. మైనార్టీలు అధికంగా ఉన్న దావణగెరె దక్షిణ నియోజకవర్గంలో ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరామని, అయితే కాంగ్రెస్ పార్టీ పెద్దలు తనను పట్టించుకోలేదన్నారు. ముస్లిం సోదరులు, అహింద సమాజ ప్రజలు తనకు వెన్నంటి ఉన్నారని, కచ్చితంగా కాంగ్రెస్కు బుద్ధి చెబుతారన్నారు. పోటీ నుంచి తప్పుకునేది లేదని సాదిక్ ప్రకటించిన తరుణంలో కాంగ్రెస్ అభ్యర్థి శ్యామనూరు సమర్థ్ ఈ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారోనన్న దానిపై అందరూ చర్చించుకుంటున్నారు. పెరుగుతున్న ఉత్కంఠ మైనార్టీలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో సాదిక్ పోటీ నుంచి తప్పుకోకపోతే ఆ వర్గానికి చెందిన వారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎలా ఆకట్టుకుంటారు? లేక సాదిక్ మైనార్టీలను తన వైపునకు తిప్పుకుని కాంగ్రెస్కు గట్టి దెబ్బ కొడతారా అన్న ఉత్కంఠ నెలకొంది. ముస్లింలకు టికెట్ కేటాయించకపోవడంతో ఇప్పటికే పలువురు మైనార్టీ నాయకులు, కార్యకర్తలు బీజేపీ కండువా కూడా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ టీ.దాస్కరియప్ప కాంగ్రెస్లో ఏర్పడిన అంతర్గత విభేదాలను తనకు అనుకూలంగా మలుచుకునే దిశగా పావులు కదుపుతున్నారు. ఈనేపథ్యంలో వచ్చే నెల 9న జరగనున్న దావణగెరె ఉప పోరు రసవత్తరంగా మారింది. రాష్ట్రంలో దావణగెరె, బాగల్కోటె రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగనున్న ఉప ఎన్నికల్లో అందరి దృష్టి దావణగెరె నియోజకవర్గంపై పడింది. నామినేషన్ విరమించుకోనంటున్న కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి శ్యామనూరు సమర్థ్కు టికెట్ ఇవ్వడంపై సాదిక్ పైల్వాన్ ఆగ్రహం అహింద ఓట్లపై దృష్టి, నన్ను గెలిపించాలని వీడియో విడుదల అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్గా మారిన ఈ పరిణామం -
యుద్ధం.. హోటల్ రంగం కకావికలం
హొసపేటె: ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా అన్ని చోట్ల వంటగ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాణిజ్య సిలిండర్ల కొరత హోటళ్లు, బ్రెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. యుద్ధం రోజురోజుకి విస్తరిస్తోంది. వివిధ కారణాల వల్ల మధ్యప్రాచ్య దేశాల చమురుపై ఆధారపడిన దేశాలపై ఈ యుద్ధ కర్మఫలం పడింది. హర్మూజ్ జలసంధి ద్వారా అనేక దేశాలకు రవాణా చేయాల్సిన సరుకులు కంటైనర్లలో నిల్వ ఉన్నాయి. ప్రధానంగా భారత దేశానికి విదేశాల నుంచి వచ్చే ఎల్పీజీ, ముడి చమురు కొరత ప్రభావం ప్రజలపై పడుతోంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత పెరగడం వల్ల హోటల్ పరిశ్రమ నష్టాలను చవిచూస్తోంది. ప్రశ్నార్థకంగా హోటళ్ల భవిష్యత్తు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల తీవ్ర కొరత కారణంగా కార్మికులు, హోటల్ యజమానుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, హోటళ్లు మూతపడతాయనే భయాన్ని కాదనలేం. గ్యాస్ కొరత కారణంగా వారు ఇడ్లీ, వడ, సాంబార్, మిర్చిలను కట్టెల పొయ్యి మీద తయారు చేయడానికి ప్రత్యామ్నాయ పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. కట్టెల పొయ్యికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం టీ, కాఫీలను తయారు చేయడం లేదు. కొన్ని హోటళ్లు ఇప్పటికే కట్టెల పొయ్యిలకు మారాయి. మెనూలో కూడా మార్పు వచ్చింది. తక్కువ ఇంధనం వాడే వంటకాలను మాత్రమే ఎంపిక చేసి తయారు చేస్తున్నారు. పూరీ, దోసె, పడ్డుల ఉత్పత్తిని నిలిపి వేశారు. దీని వల్ల వాటిని తయారు చేసే వారి ఆదాయంపై దుష్ప్రభావం పడి భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతోంది. కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు నిస్సహాయ స్థితిలో యజమానులు -
భారతీయ సంస్కృతి దేదీప్యమానం
● గవర్నర్ గెహ్లాట్ మైసూరు: భారతదేశ మహా నాగరికత, సంస్కృతి ప్రపంచస్థాయిలో ఎంతో ఖ్యాతి గడించిందని గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ అన్నారు. బుధవారం మైసూరు ముక్త గంగోత్రిలోని కర్ణాటక సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ‘ఏకాత్మ మానవ దర్శనం: భారతదేశం విశ్వదృష్టి’ అనే సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ మాట్లాడుతూ కాలానుగుణంగా ఎంతోమంది మహానుభావులు దేశంలో జన్మించి దేశం వారసత్వం, సంస్కృతిని ప్రపంచ వేదికలపై చాటిచెప్పారని తెలిపారు. దీనదయాల్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవ దర్శనం దేశ ఆత్మ, సంస్కృతి, ఆలోచన, జీవిత శైలికి మూలాధారంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో సుత్తూరు పీఠాధిపతి శివరాత్రి దేశికేంద్ర మహాస్వామి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణ, పలువురు స్వామీజీలు పాల్గొన్నారు. చాముండేశ్వరి దేవి దర్శనం నాడశక్తి దేవత చాముండేశ్వరీ అమ్మవారిని గవర్నర్ దర్శించుకున్నారు. చాముండిబెట్ట మీద అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ఆలయ ప్రాధికార ప్రతినిధులు గవర్నర్ను సన్మానించారు. -
ఇంట్లో గ్యాస్ పేలుడు.. బాలిక మృతి
● తల్లిదండ్రులు, పిల్లలకు గాయాలు ● ముళబాగిలులో విషాదం కోలారు: ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో బాలిక మరణించగా, మరో నలుగురు గాయాల పాలయ్యారు. ఈ దుర్ఘటన కోలారు జిల్లా ముళబాగిలులోని జహంగీర్ మొహల్లాలో బుధవారం జరిగింది. వంట చేయడానికి స్టవ్ను వెలిగిస్తుండగా, గ్యాస్ లీకై ఉండడంతో పెద్ద శబ్ధంతో పేలుడు జరిగింది. పేలుడుకు పైకప్పు కూలి మీద పడడంతో మాహిన్ (12) అనే బాలిక మరణించింది. తండ్రి సుహేల్, తల్లి కౌసర్తాజ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి,. వీరి కుమారులు అబూజర్, ఆయాన్లకు కూడా గాయాలు కావడంతో వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలిని ఎస్పీ కన్నికా సిక్రివాల్ పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రూ.6 లక్షలతో సౌధలోకి వెళ్లేయత్నం బనశంకరి: రూ.6 లక్షల నగదు తీసుకుని అసెంబ్లీలోకి వెళ్లడానికి ప్రయత్నించాడో వ్యక్తి. కెంగల్ గేట్ ద్వారా వెళ్తున్న యువకున్ని పోలీసులు తనిఖీ చేయగా బ్యాగులో నగదు లభించింది. ఇండి ఎమ్మెల్యే యశవంతరాయగౌడ పాటిల్ నుంచి లెటర్హెడ్ను తీసుకోవడానికి వచ్చినట్లు అతడు చెప్పాడు. ఇంత పెద్ద మొత్తం నగదుతో విధానసౌధలోకి వెళ్లరాదని, వెనక్కి వెళ్లాలని పోలీసులు సూచించారు. కానీ యువకుడు ఎమ్మెల్యే ను చూడాలని పట్టుబట్టారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని ఏసీపీ కృష్ణయ్య ఆఫీసులో విచారణ చేపట్టారు. పెదనాన్నను ఆసుపత్రిలో చేర్చామని, చికిత్స కోసం డబ్బు తీసుకువచ్చానని చెప్పాడు. ఎమ్మెల్యే తో పని ఉండడంతో వచ్చానని తెలిపాడు. నగదు గురించి దర్యాప్తు చేస్తున్నారు. మంత్రి శివరాజ్కు శస్త్రచికిత్స దొడ్డబళ్లాపురం: మంత్రి శివరాజ్ తంగడగికి గుండె నాళాల్లో పూడుకుపోవడంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి స్టెంట్ను అమర్చారు. ఆయన మూడు రోజులుగా గుండె అస్వస్థతతో బాధపడుతున్నారు. మంగళవారం ఆయన కుటుంబ వైద్యుడు గుండెలో బ్లాకేజ్ ఉందని తెలిపారు దీంతో బుధవారంనాడు మంత్రి శివరాజ్ బెంగళూరులో ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆపరేషన్ చేసి స్టెంట్ను అమర్చారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కారు సీజ్ చెల్లదన్న హైకోర్టు దొడ్డబళ్లాపురం: ఇంటి ముందు నిలిపిన లంబోర్గిని కారును సీజ్ చేసిన ఆర్టీఓ అధికారులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని, వారంలోపు సీజ్ చేసిన కారు తిరిగి యజమానికి ఇవ్వాలని ఆదేశించింది. బెంగళూరులో కారు ఏజెన్సీ నడిపే పిటిషనర్ ఇంటి ముందు నిలిపిన లంబోర్గిని కారుని ఆర్టీఓ అధికారులు సీజ్ చేసి తీసికెళ్లారు. ఈ చర్య నిబంధనల ఉల్లంఘన అని జడ్జి పేర్కొన్నారు. సిటీలో రేపు నాన్వెజ్ బంద్ దొడ్డబళ్లాపురం: శుక్రవారంనాడు బెంగళూరులో మాంసం విక్రయాలను నిషేధిస్తూ గ్రేటర్ బెంగళూరు అధికారులు ఆదేశించారు. 27న శుక్రవారంనాడు శ్రీరామనవమి పండుగ కావడంతో అన్ని మాంసం దుకాణాలను మూసి ఉంచాలని తెలిపారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని చెప్పారు. ఓపెన్ వర్సిటీ అక్రమాలపై దర్యాప్తు మైసూరు: మైసూరులోని కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయంలో జరిగిన అవినీతి, విచ్చలవిడిగా తాత్కాలిక సిబ్బంది నియామకంపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. విశ్రాంత న్యాయమూర్తి బీఏ పాటిల్ను విచారణకు నియమించింది. ఈ నేపథ్యంలో కేఎస్ఓయూ బ్యాంకు ఖాతాల నుంచి ఎవరూ డబ్బులు డ్రా చేయకుండా సీజ్ చేయాలని వివిధ బ్యాంకుల అధికారులకు ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి లేఖ రాశారు. అంబులెన్సు లేక.. క్షతగాత్రునికి యాతన బనశంకరి: బెంగళూరులో అంబులెన్సు రాక క్షతగాత్రుడు విలవిలలాడాడు. విండ్సర్ మ్యానర్ బ్రిడ్జ్ వద్ద మంగళవారం రాత్రి ఓ డెలివరీ బాయ్ బైక్ అదుపుతప్పి కింద పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డుపై కంకర పడి ఉండడమే కారణం. కొందరు 108 అంబులెన్స్కు ఫోన్ చేశారు, కానీ ముప్పావు గంట గడిచినప్పటికీ అంబులెన్స్ రాకపోవడంపై ప్రజలు మండిపడ్డారు. రక్తగాయాలై బాధితుడు ఎంతో బాధపడ్డాడు. అసెంబ్లీ సమావేశాలను ముగించుకుని కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు ఇదే దారిలో వెళ్లారు, కానీ బాధితుని గురించి పట్టించుకోలేదని జనం ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇంటికి కూతవేటు దూరంలోనే ఘటనాస్థలి ఉంది, అయినా అంబులెన్స్ సమయానికి రాలేదు. చివరికి ఎలాగో అతన్ని కేసీ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
గంజాయి విక్రేత అరెస్ట్
రాయచూరు రూరల్: నగరంలో గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అరుణాంగ్శు గిరి వెల్లడించారు. బుధవారం నగరంలోని నేతాజీనగర్ పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. తిమ్మాపూర్పేటలో నివాసం ఉన్న కృష్ణ(25)ను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నేత్రపర్వంగా ఎర్రితాత రథోత్సవంబళ్లారిటౌన్: తాలూకాలోని కొళగల్లు గ్రామంలో బుధవారం సాయంత్రం ఎర్రితాత రథోత్సవం కన్నుల పండువగా సాగింది. గత మూడేళ్లుగా స్తంభించిన రథోత్సవం తిరిగి ప్రారంభించడంతో గ్రామంతో పాటు చుట్టు పక్కల ఇతర గ్రామాల భక్తులు కూడా వేలాదిగా తరలి వచ్చారు. భక్తులు ఎప్పటిలా రథానికి పూల మాలలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సారి రథం కనబడకుండా భారీగా పూలతో అలంకరించారు. రథోత్సవం శాంతి యుతంగా జరగాలని ముందు జాగ్రత్త చర్యగా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. అంతేగాక చాలా చోట్ల సీసీ కెమెరాలను, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి ఎక్కడా ఎలాంటి అలజడి రాకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టారు. ఇక ఉదయం ముత్తైదు మహిళలతో కుంభోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో వీరభద్ర వేషధారిణి నృత్యం ఆకట్టుకుంది. అకాల వర్షంతో పంట నష్టం రాయచూరు రూరల్: జిల్లాలో అకాల వర్ష బీభత్సంతో కోతకొచ్చిన వరి పైరుకు నష్టం వాటిల్లింది. దేవదుర్గ తాలూకాలో వేలాది ఎకరాల్లో పంట నేలకొరిగింది. పలు ప్రాంతాల్లో పంట నష్టం జరిగిందని దేవదుర్గ తాలూకా జాలహళ్లి, చప్పళికి ప్రాంతాల్లో రైతులు వేసుకున్న వరి పంట దెబ్బ తిందని, నష్ట పరిహారం అందించాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడిహళ్లి చంద్రశేఖర్ అసిస్టెంట్ కమిషనర్ హంపన్నను కోరారు. బుధవారం పంట దెబ్బ తిన్న పొలాల్లో పర్యటించి నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వం ఎకరాకు రూ.25 వేలు పరిహారం అందించి మద్దతు ధరతో కొనుగోలు చేయాలన్నారు. రైతులు మాట్లాడుతూ నష్టం అంచనాలను తయారు చేసి సర్కార్కు నివేదిక పంపాలని కోరారు. వారి వెంట డీఎస్పీ దత్తాత్రేయ కర్నాడ్, మరిలింగ పాటిల్, రైతులుపాల్గొన్నారు. అంగన్వాడీ నియామకాల్లో అక్రమాల నిగ్గు తేల్చండి రాయచూరు రూరల్: జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు, సహాయకుల నియామకాల్లో అక్రమాలు జరిగాయని కన్నడ సేన ఆరోపించింది. బుధవారం మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు బసవరాజ్ మాట్లాడారు. గ్రామాల్లో స్థానిక అభ్యర్థులున్నా ఇతర గ్రామాల వారిని ఎందుకు నియమించుకున్నారని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం నియమించిన ఆదేశాలను రద్దు చేసి నూతనంగా దరఖాస్తులను పిలిచి న్యాయసమ్మతంగా నియామకాలు చేపట్టాలని కోరుతూ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి నవీన్కు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో అనిత, హనుమేష్, మంజునాథ్, శివరాజ్, అమరేష్, నివేదిత, శరణు, పద్మ, చౌడమ్మలున్నారు. ప్రాథమిక విద్య పునాది కావాలి రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు విద్య గట్టి పునాది కావాలని డయట్ కళాశాల ప్రొఫెసర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. యరమరస్లో జరిగిన విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి మాట్లాడారు. పిల్లలకు విద్యతో పాటు కళలు, సాహిత్యం, క్రీడల్లో రాణించడంలో ఉపాధ్యాయుల ప్రోత్సాహం అవసరమన్నారు. పిల్లలను భవ్య భారత నిర్మాతలుగా రూపొందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సయ్యద్ సిరాజ్, గోవిందరెడ్డి, బసప్ప పాల్గొన్నారు. -
ఆస్తి కోసం అమానుషం
సాక్షి,బళ్లారి: తాలూకాలోని కారేకల్లు గ్రామంలో ఆస్తి, డబ్బు కోసం సొంత అవ్వ(బామ్మ)ను మనవడు దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. ఈ నెల 21న గ్రామానికి చెందిన వీరమ్మ(60) అనే వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మరణించడంతో అది సహజ మరణమని భావించిన పరమదేవనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో పలువురు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ముమ్మరంగా విచారణ చేయడంతో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోస్టుమార్టం నివేదికలో వీరమ్మది సహజమరణం కాదని, హత్య అని తేలడంతో పోలీసుల మరింత ముమ్మరంగా విచారణ చేయడంతో ఒక్కొక్క నిజం బయట పడింది. జిల్లా ఎస్పీ సుమన పన్నేకర్ తదితర పోలీసు అధికారులు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. వీరమ్మ ఇంటిని పరిశీలించారు. సొంత మనవడు ఎం.వీరేంద్ర(21)ను విచారణ చేయగా, వీరమ్మను బంగారం, నగదు కోసం తానే హత్య చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించడంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సొంత అవ్వను హత్య చేసిన మనవడు బంగారం, డబ్బు కోసమే చంపినట్లు పోలీసుల ఎదుట వెల్లడి -
స్వచ్ఛతకు పెద్దపీట వేయాలి
రాయచూరు రూరల్: నగరంలో స్వచ్ఛతకు ప్రాధాన్యత కల్పించాలని మైసూరు సిటీ కార్పొరేషన్ ఇంజినీర్ నవీన్ కుమార్ సూచించారు. మంగళవారం నగరంలోని సిటీ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మైసూరు సిటీ కార్పొరేషన్ స్వచ్ఛతలో దేశ స్థాయిలో ప్రథమ స్థానం అలంకరించిందన్నారు. ఈ విషయంలో మైసూరు సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాయచూరు సిటీ కార్పొరేషన్తో ఒప్పందాలు కుదుర్చుకొందన్నారు. అధికారులు మహదేవమ్మ, జ్యోతి, యోగేష్, అశ్వఽథ్, శివ ప్రసాద్, నగరసభ అధికారులు భరత్ కుమార్, సంతోష్ రాణి, మల్లికార్జున రెడ్డిలున్నారు. -
మాజీ ఎమ్మెల్యే కుమారుడి అనుమానాస్పద మృతి
హుబ్లీ: ధార్వాడ జిల్లాలోని రామపుర గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో బెళగావి జిల్లా బైలహొంగల మాజీ ఎమ్మెల్యే కుమారుడు తన సొంత కారులోనే పూర్తిగా కాలిపోయిన స్థితిలో శవంగా లభించారు. ఇది పథకం ప్రకారం చేసిన హత్యగా అనుమానిస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన ఇటు ధార్వాడ, అటు బెళగావి జిల్లాల్లో సంచలనం సృష్టించింది. బైలహొంగల మాజీ ఎమ్మెల్యే బాబూరావ్ బొళశెట్టి కుమారుడు రాజు బొళశెట్టి(53) మృతుడు. ధార్వాడ తాలూకా రామపుర గ్రామం వద్ద రైల్వే ట్రాక్ పక్కన దట్టమైన అరణ్యంలో ఆయన సొంత వ్యాగనార్ కారులో కాలిపోయిన స్థితిలో ఆయన శవం లభ్యమైంది. దుండగులు రాజును ముందుగా హత్య చేశాక సాక్ష్యాలు నాశనం చేయాలన్న ఉద్దేశంతో నిర్మానుష్య ప్రాంతానికి తెచ్చి ఆయన సొంత కారులోనే నిప్పుపెట్టి కాల్చినట్లుగా అనుమానిస్తున్నారు. ఆయన దేహంతో పాటు కారు కూడా పూర్తిగా కాలిపోయిన స్థితిలోనే కనిపించింది. కాగా ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ గుంజన్ ఆర్య పరిశీలించారు. విధి విజ్ఞాన, డాగ్ స్క్వాడ్ ఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సాక్ష్యాలను సేకరించారు. ధార్వాడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. కాగా రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబానికి చెందిన వ్యక్తిపై జరిగిన ఈ నిగూఢ హత్య ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోంది. కాలిపోయిన స్థితిలో కారుతో పాటు మృతదేహం లభ్యం పథకం ప్రకారం చేసిన హత్యగా అనుమానాలు -
పరిశ్రమలకు భూములను ఇవ్వొద్దు
సాక్షి,బళ్లారి: అనాది కాలంగా అన్నం పెట్టే భూములను అమ్ముకోవడం, లీజుకు ఇవ్వడం సరికాదని, పరిశ్రమల పేరుతో భూమాఫియాలు రైతులను మోసం చేసి తక్కువ ధరకు భూములను కొనుగోలు చేసి రైతులను నాశనం చేస్తున్నారని సిరివార, చాగనూరు భూ పోరాట సమితి నాయకుడు, సీనియర్ న్యాయవాది మల్లికార్జునరెడ్డి, కర్ణాటక ప్రాంత రైతు సంఘం ఉపాధ్యక్షుడు ఆర్.మాధవరెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాత్రి తాలూకాలోని చాగనూరు గ్రామంలో భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్ల 95వ వీరమరణ దినోత్సవం సందర్భంగా స్థానికంగా భూపోరాటం చేసిన రైతు అంజని మృతికి ఏర్పాటు చేసిన శ్రద్ధాంజలి సమావేశంలో వారు మాట్లాడారు. మారుతున్న కాలానుగుణంగా శాస్త్ర, సాంకేతిక రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్న నేటి రోజుల్లో వ్యవసాయానికి యువత దూరం అవుతుండటం సరి కాదన్నారు. రైతులు లేకపోతే ప్రపంచానికే అన్నం లేదు రైతులు లేకపోతే దేశానికే కాదు, ప్రపంచానికే అన్నం దొరకదని ఆవేదన వ్యక్తం చేశారు. మనం ఎంత స్థాయికి ఎదిగినా పంటలు పండే భూములను కాపాడుకుని, భావి తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమల పేరుతో భూమాఫియా రైతులను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. ఇటీవల రైతుల నుంచి భూమిని కొనడం లేదన్నారు. లీజుకు ఇవ్వాలని సరికొత్తగా రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పరిశ్రమలకు భూములు అమ్మినా, లీజుకు ఇచ్చినా ఎలాంటి తేడా లేదన్నారు. లీజుకు ఇచ్చిన భూములు వెనక్కి తీసుకున్న సందర్భాలు ఎక్కడా లేవన్నారు. మోసపూరితంగా అన్ని విధాలుగా రాయించుకుని, లీజు పేరుతో రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. భూపోరాటంలో అంజని ధైర్యం మరవలేనిది సిరివార, చాగనూరులో విమానాశ్రయానికి భూములు తీసుకునే సందర్భంలో అంజని అనే రైతు ఎంతో పోరాటం చేశారన్నారు. ఆయన్ను మనందరం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమెరికా విధానాలను అవలంభిస్తున్నాయన్నారు. రైతులను కాపాడాల్సిన పాలకులు రైతులను నట్టేట ముంచుతున్నారన్నారు. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప అని గుర్తు చేశారు. భగత్సింగ్, రాజ్గురు సిద్ధాంతాలు నేటికీ ఎందుకు ఆదర్శంగా ఉన్నాయో వివరించారు. దేశం కోసం ఆ మహానుభావులు తమ ప్రాణాలను త్యాగం చేశారని కొనియాడారు. వారి అడుగు జాడల్లో మనందరం నడుస్తూ, దేశాభివృద్ధికి పాటు పడదామని పిలుపునిచ్చారు. పలువురు ప్రముఖులు, రైతు సంఘం నాయకులు నాగభూషణ, చంద్రకుమారి, సోమశేఖర్గౌడ తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్న రైతు సంఘం కార్యకర్తలు, హాజరైన జనంమాట్లాడుతున్న సీనియర్ న్యాయవాది మల్లికార్జునరెడ్డి భూములను పరిశ్రమలకు లీజుకు ఇచ్చినా.. అమ్మినా ఒకటే భగత్సింగ్, రాజ్గురు శ్రద్ధాంజలి సభలో వక్తలు -
శాంతియుతంగా శోభాయాత్ర చేపట్టండి
రాయచూరు రూరల్: నగరంలో శాంతియుతంగా శోభాయాత్ర చేయాలని హిందూ పర సంఘాల నేతలకు డీఎస్పీ శాంతవీర్ సూచించారు. మంగళవారం నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 27న శ్రీరామ నవమి సందర్భంగా ఏర్పాటు చేస్తున్న శోభాయాత్రను విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను జరగకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. సమావేశంలో పీఐ నాగరాజ్, ఉమేష్ కాంబ్లే, సాబయ్యలున్నారు. లంచగొండి ఎఫ్డీఏపై సస్పెన్షన్ వేటుహుబ్లీ: లావాదేవీల వ్యవహారానికి అనుమతి ఇవ్వడానికి లంచం తీసుకున్న ఆరోపణలకు సంబంధించి జిల్లా సహకార సంఘాల సహాయ రిజిస్ట్రార్ కార్యాలయం ఎఫ్డీఏ మధుసూధన్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఆ సంఘాల రిజిస్ట్రార్ టీహెచ్ఎం కుమార్ ఆదేశాలు వెల్లడించారు. మధుసూధన్ వివిధ పనులకు వచ్చే ప్రజల నుంచి లంచం స్వీకరించడంతో పాటు నియమాలను ఉల్లంఘించినట్లుగా తెలవడంతో ఈ సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. వైభవంగా కాళికాదేవి రథోత్సవం హొసపేటె: తాలూకాలోని మరియమ్మనహళ్లి పట్టణానికి సమీపంలోని గొల్లరహళ్లి గ్రామంలో సోమవారం సాయంత్రం వేలాది మంది భక్తుల సమక్షంలో కాళికాదేవి రథోత్సవం అత్యంత వైభవంగా, ఉత్సాహంగా జరిగింది. రథోత్సవంలో భాగంగా ఉదయం కాళికాదేవికి ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం దగ్గర గుమిగూడిన భక్తులు పండ్లు, కూరగాయలు సమర్పించారు. అనంతరం వారు ఆలయానికి వచ్చి గతసారి వేలంలో గెలుచుకున్న జెండాను అమ్మవారికి అప్పగించారు. దేవత ఉత్సవ విగ్రహాన్ని అన్ని వాయిద్య పరికరాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి, రకరకాల పూలమాలలతో అలంకరించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు గొల్లరహళ్లి, జీ.నాగలాపుర, గరగ, బైలకుండి, చిలకనహట్టి, డణాయకనకెరె, తిమ్మలాపుర, దేవలాపుర, మరియమ్మనహళ్లి, హొసపేటె, బళ్లారి, సండూరు పట్టణాలతో పాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యథేచ్ఛగా టీసీల విక్రయం ● విద్యుత్ శాఖలో రూ.కోట్లాది మేర అవకతవకలు ● జెస్కాం ఉద్యోగి గురురాజ్ నాయక్పై భార్య ఫిర్యాదు రాయచూరు రూరల్: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న జెస్కాం ఉద్యోగులు విద్యుత్ శాఖలో ట్రాన్స్ఫార్మర్లు(టీసీలు), స్తంభాలను అక్రమంగా విక్రయించుకొని రూ.కోట్లలో అక్రమాలకు పాల్పడ్డారని మాన్వి జెస్కాం ఉద్యోగి గురురాజ్ నాయక్పై భార్య అమృత నాయక్ ఆరోపించారు. మంగళవారం మాన్వి జెస్కాం కార్యాలయం వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. మాన్వి తాలూకా మద్లాపూర్లో జేఈగా విధులు నిర్వహిస్తున్న నాయక్ తన ఇష్టమొచ్చినట్లు విద్యుత్ పరికరాలు, యంత్రాలను అక్రమంగా అమ్ముకుంటూ పైఅధికారులకు మామూళ్లు ముట్టచెప్పడంతో వారు మౌనం వహించారని అన్నారు. 1800కు పైగా టీసీలను అక్రమంగా విక్రయించి ప్రభుత్వానికి, జెస్కాం కంపెనీకి మోసం చేశారన్నారు. విద్యుత్ శాఖలో టీసీల విక్రయాలలో రూ.కోట్లలో అక్రమాలు జరిగాయని జెస్కాం మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు ఫిర్యాదులు చేసినా విచారణ జరపకుండా నిర్లక్ష్యం వహించారన్నారు. -
ఎట్టకేలకు ఎర్రితాత ఉత్సవానికి అనుమతి
బళ్లారిటౌన్: తాలూకాలోని కొళగల్ గ్రామంలో గత 25 ఏళ్లుగా నూతన రథోత్సవాన్ని జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే గత మూడేళ్లుగా ఈ రథోత్సవం స్తంభించి పోవడంతో గ్రామస్తులతో పాటు ఇతర గ్రామాల భక్తుల్లో కూడా అసంతృప్తి నెలకొంది. ఎర్రితాత శిష్యుడు ఎరియప్ప తాత మృతి చెందడంతో ఆయన ఆ మఠంలోని సమాధి వద్ద విగ్రహ ప్రతిష్టాపన ఏర్పాటు చేసే విషయంలో గ్రామంలో ఇరువర్గాలకు మధ్య చెలరేగిన వివాదంతో గత మూడేళ్ల నుంచి రథోత్సవాన్ని జరుపుకోవడం రద్దు చేశారు. గ్రామంలో శాంతి భద్రతల రక్షణ కోసం జిల్లా యంత్రాంగం ఈ రథోత్సవాన్ని రద్దు చేసింది. అయితే మూడేళ్లుగా ఉత్సవాలు జరుపుకోవడం రద్దు చేయడంతో చాలా మంది గ్రామస్తులు జిల్లా యంత్రాంగానికి, పోలీస్ అధికారులకు కూడా ఉత్సవాలు జరపాలని విజ్ఞప్తి చేశారు. అయితే మరో వర్గం వారు ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఉత్సవాలు నిర్వహించడం సబబు కాదని అధికారులతో వాదించారు. చివరకు ఫలించిన చర్చలు దీంతో గత వారం రోజులుగా జిల్లా పోలీస్ శాఖ, జిల్లా యంత్రాంగం మూడు నాలుగు రౌండ్ల పాటు చర్చలు జరిపారు. తహసీల్దార్ సమక్షంలో పోలీసు బలగాలతో పాటు గ్రామస్తుల సమక్షంలో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. చివరికి మంగళవారం సాయంత్రం రథోత్సవం జరపాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో రథాన్ని షెడ్లో నుంచి పోలీసుల సమక్షంలో బయటకు తీశారు. కాగా 25 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ నూతన రథానికి గతంలో సుమారు 10 ఏళ్ల పాటు సామూహిక వివాహాలు జరిపి ఎంతో భక్తిని చాటారు. ఇతర జిల్లాల నుంచి కూడా వేలాది మంది భక్తులు కోరిన కోర్కెలను నెరవేర్చే ఎర్రితాతను దర్శించుకుని మొక్కులను తీర్చుకొనే వారు. అయితే మూడేళ్ల క్రితం విగ్రహ ప్రతిష్టాపన విషయంలో ఇరు వర్గాల్లో వివాదం చెలరేగడంతో ఈ కేసు హైకోర్టులో విచారణలో ఉంది. దీంతో జిల్లా యంత్రాంగం కూడా గత మూడేళ్లుగా ఎంత ప్రయత్నించినా అప్పట్లో చర్చలు విఫలం అయ్యాయి. ఈసారి నాలుగు, ఐదు రౌండ్లు జరిపిన చర్చలు సఫలం కావడంతో గ్రామస్తుల్లో చాలా వరకు హర్షం వ్యక్తమైంది. భక్తుల్లో వెల్లివిరిసిన ఆనందం మూడేళ్లుగా స్తంభించిన వైనం -
భారతీయ సంస్కృతిలో మహిళకు ప్రత్యేక స్థానం
బళ్లారిటౌన్: భారతీయ సంస్కృతిలో ఆది నుంచి మహిళలకు ప్రత్యేక స్థానం లభిస్తుందని డాక్టర్ జగ్జీవన్ రాం చర్మ పారిశ్రామిక అభివృద్ధి మండలి అధ్యక్షుడు ముండ్రిగి నాగరాజ్ పేర్కొన్నారు. మంగళవారం వాల్మీకి భవనంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. స్వాతంత్య్ర పూర్వంలో పోర్చుగీస్ వారికి వ్యతిరేకంగా పోరాడిన మహిళలు తమిళనాడు రాణి అబ్బక, కిత్తూరు రాణి చెన్నమ్మ, ఝాన్సీలక్ష్మీబాయి లాంటి ఎంతో మహిళలు ఉన్నారని గుర్తు చేశారు. డాక్టర్ అంబేడ్కర్ మహిళలకు సమాన హక్కులను కల్పించి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు వంటి బిల్లులు ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మహిళలకు ప్రభుత్వాలు కల్పిస్తున్న అనేక సదుపాయాలను సద్వినియోగ పరుచుకోవాలన్నారు. జెడ్పీ సీఈఓ మహమ్మద్ హ్యారీస్ సుమేరా, పాలికె మేయర్ పీ.గాదెప్ప, జిల్లా గ్యారెంటీ పథకాల అమలు అధ్యక్షుడు చిదానందప్ప, ఏడీసీ మహమ్మద్ ఝుబేర తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
హుబ్లీ: స్థానిక గోకుల్ రోడ్డులోని అర్బన్ ఒయాసిస్ మాల్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఆ రోడ్డుపై కేబుల్ వైర్లు తెగిపడిన ఫలితంగా సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. మృతులను తాజ్నగర్ నివాసులు ఫయాజ్(25), మోహిద్(27)గా గుర్తించారు. రోడ్డుపై అడ్డదిడ్డంగా కేబుల్ వైర్లు పడటం వల్లే ఈ ప్రమాదం వాటిల్లింది. బైక్ చక్రానికి సదరు వైరు చిక్కుకోవడంతో బైక్ అదుపు తప్పి కింద పడి తీవ్రంగా గాయపడటమే కాకుండా ఘటనాస్థలంలోనే మరణించారు. ఘటనపై హుబ్లీ ఉత్తర ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చిరుత సంచారంతో కలకలంహొసపేటె: విజయనగర జిల్లా కమలాపురం సమీపంలోని హెచ్ఎల్సీ కాలువ వద్ద మంగళవారం చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. అక్కడ చిరుత సంచారాన్ని చూసిన పలువురు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీస్, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న అటవీ, పలువురు రెవెన్యూ అధికారులు చిరుత పులి పాదముద్రలను గుర్తించి, వాటిని పరిశీలించారు. సమీప ప్రాంతంలోనే చిరుత సంచరిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిసర గ్రామాల ప్రజలు పులి సంచారంతో తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఉద్యోగులు, సిబ్బంది సమస్యలు తీరుస్తాం రాయచూరు రూరల్ : జిల్లాలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న జెస్కాం ఉద్యోగులు, సిబ్బంది సమస్యలపై స్పందిస్తామని కర్ణాటక విద్యుత్ మండలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బలరాం హామీ ఇచ్చారు. సోమవారం జెస్కాం కార్యాలయంలో జరిగిన ప్రతిభా పురస్కార సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన పింఛన్ పథకం, కేపీసీ ప్రకారం పని భారం తగ్గింపు, సీ, డీ గ్రూప్ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. క్యాష్లెస్ ఆరోగ్య భాగ్య కార్డుల ద్వారా జెస్కాం ఉద్యోగుల కుటుంబానికి అవకాశం కల్పించడానికి ప్రామాణిక ప్రయత్నం చేస్తామన్నారు. విద్యార్ధుల ప్రతిభను గుర్తించి ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. ఇటీవల మరణించిన మరిదేవ్ కుటుంబానికి ప్రమాద బీమా పథకం కింద రూ.కోటి చెక్ను అందించారు. గోపి, కార్తీక్, గురురాజ్లన్నారు. గండి మరమ్మతులు సత్వరం పూర్తి చేయాలిరాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువకు గండి పడిన చోట మరమ్మతు పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొప్పళ తాలూకా బసాపుర వద్ద కాలువకు గండి పడిన పది రోజుల తర్వాత మంత్రుల పర్యటనలతో పనుల వేగవంతానికి అధికారులు శ్రీకారం చుట్టడాన్ని తప్పుబట్టారు. రాయచూరు జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు తుంగభద్ర డ్యాం నుంచి కాలువ ద్వారా 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా బసాపుర వద్ద కాలువకు గండి పడడంతో నీరంతా వృథా అయిందన్నారు. 60 అడుగుల మేర పడిన కాలువ గండి పూడ్చడానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఒత్తిడి చేశారు. జొన్న కొనుగోలు కేంద్రాల్లో గందరగోళం నివారించాలన్నారు. టెన్త్ పరీక్షలకు 160 మంది గైర్హాజరు హుబ్లీ: హుబ్లీ నగర, గ్రామీణ ప్రాంతాల్లోని వివిధ పరీక్ష కేంద్రాల్లో 10వ తరగతి సైన్స్ పరీక్షల కు 160 మంది గైర్హాజరయ్యారు. హుబ్లీ టౌన్ పరిధిలో 8,148, అలాగే హుబ్లీ గ్రామీణ భాగంలో 3,872 విద్యార్థులు పరీక్షల కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే వీరిలో హుబ్లీ టౌన్ పరిధిలో 120, అలాగే గ్రామీణ భాగంలో 40 మంది విద్యార్థులు సైన్స్ పరీక్షకు హాజరు కాలేదని పాఠశాల విద్యా శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. -
పొలంలో నీళ్లు తాగాడని రగడ
సాక్షి,బళ్లారి: తమ పొలంలో ఓ ఎస్సీ యువకుడు నీళ్లు తాగాడనే చిన్న కారణానికి రెండు కులాల మధ్య వాగ్వాదం చెలరేగి తీవ్ర ఘర్షణకు దారి తీసింది. దీంతో 24 మందికి తీవ్ర గాయాలు కాగా ఇరు వర్గాల వారు ఆస్పత్రి పాలైన ఘటన గదగ్ జిల్లా ముండరిగి తాలూకా చిక్కవద్దట్టి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. ఎస్టీ సముదాయానికి చెందిన రైతు పొలంలో ఎస్సీ సముదాయానికి చెందిన ఓ యువకుడు నీళ్లు తాగడానికి వెళ్లాడు. దీంతో రెండు కులాలకు చెందిన యువకులు తాగునీటి విషయమై గొడవ పడ్డారు. అది చినికి చినికి గాలి వానగా మారి రెండు కులాల మధ్య రగడ పతాక స్థాయికి చేరింది. పొలంలో చోటు చేసుకున్న ఘర్షణతో గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరగడంతో రెండు కులాలకు చెందిన వారు దాదాపు 24 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం పోలీసు స్టేషన్కు చేరింది. ఘటన స్థలానికి చేరుకున్న అక్కడి పోలీసు అధికారులు, సిబ్బంది రెండు వర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిని అక్కడి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ ఘటన గదగ్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పొలంలో మంచినీరు తాగడానికి వెళ్లిన వ్యక్తిపై రగడకు దిగడమేంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. గదగ్ జిల్లాలో కుల ఘర్షణ ఎస్సీ, ఎస్టీ వర్గాల మధ్య ఘర్షణ 24 మందికి తీవ్ర గాయాలు -
ఉసురు తీసిన ఆన్లైన్ గేమ్
సాక్షి,బళ్లారి/రాయచూరు రూరల్: శాస్త్ర శాంతికేతిక రంగం అభివృద్ధి చెందుతూ యువతకు కొత్త అవకాశాలు తీసుకు వస్తున్నా, అదే సమయంలో అదే సాంకేతికతతో ప్రమాదం బారిన పడే పరిస్థితులను కూడా సృష్టిస్తోంది. అతను చదువు అన్నింటిలో ఫస్ట్ వచ్చేవాడు. 10వ తరగతి, పీయూసీ, అనంతరం ఎంబీబీఎస్ సీటు కూడా మంచి ర్యాంకుతో బీదర్ మెడికల్ కళాశాలలో సాధించాడు. నాలుగేళ్ల ఎంబీబీఎస్ పూర్తి చేసి, మరో ఏడాదిలో వైద్య విద్యార్థి నుంచి వైద్యుడుగా మారి ఉద్యోగం కూడా తెచ్చుకునే సమయం దగ్గరకు వస్తున్న శుభ తరుణంలో ఆ మంచి వైద్య విద్యార్థి స్నేహితుల మాయలో పడి ఆన్లైన్ గేమ్కు బానిస అయ్యాడు. గత కొన్ని నెలలుగా ఆన్లైన్ గేమ్తో పాటు నిత్యం సెల్మాయలో కూడా పడిపోవడంతో మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. గేమ్లో రూ.80 వేలు పోగొట్టుకున్న వైనం ఆన్లైన్ గేమ్లో రూ.80 వేల వరకు డబ్బులు కూడా పోగొట్టుకోవడంతో వైద్య విద్యార్థి చివరికి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కలబుర్గి జిల్లా చించోళి తాలూకా సలగర్ తాండాకు చెందిన అనిష్కార్ చౌహాన్(21) అనే విద్యార్థి బీదర్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఆన్లైన్ గేమ్లో డబ్బులు పోగొట్టుకోవడంతో వసతి నిలయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో తోటి విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ ప్రదీప్తో పాటు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వసతి నిలయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న దృశ్యాన్ని గమనించి, మృతదేహాన్ని కిందకు దింపి పరిశీలించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం అక్కడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శోకసంద్రంగా ఆస్పత్రి ప్రాంగణం తల్లిదండ్రులకు విషయం తెలియగానే బీదర్లోని ఆస్పత్రి వద్దకు చేరుకుని తమ కుమారుడు విగతజీవిగా పడి ఉన్న దృశ్యాన్ని చూసి భోరున విలపించారు. తమ బిడ్డ బాగా చదువుకునేవాడని, ఎలాంటి చెడు అలవాట్లు కూడా లేవని, మరో ఏడాదిలో వైద్య విద్యా కోర్సు ముగుస్తుందని, మంచి ఉద్యోగం వస్తుందని చెప్పేవాడని, అంతలోనే ఇలా తన జీవితాన్ని చాలించాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారి రోదనలను ఆపడం ఎవరి తరం కాలేదు. విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు, తోటి వైద్య విద్యార్థులు అందరూ కంటతడి పెట్టారు. మంచి భవిష్యత్తు ఉన్న యువకుడు ఆన్లైన్ మాయా ప్రపంచపు వలలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది. ఈ ఘటనపై బీదర్ న్యూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బీదర్ వసతి నిలయంలో వైద్య విద్యార్థి బలి మరో ఏడాదిలో ముగియనున్న ఎంబీబీఎస్ విద్యాభ్యాసం ఓటమి, నిరాశ, మానసిక ఒత్తిడితో బలవన్మరణం చేసుకున్న వైనం -
కేకేఆర్డీబీలో అవినీతిపై విచారణకు డిమాండ్
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక ప్రాంత అభివృద్ధి మండలి(కేకేఆర్డీబీ)లో రూ.కోట్లలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని హైదరాబాద్ కర్ణాటక జనాందోళన సమితి అధ్యక్షుడు రాఘవేంద్ర కుష్టిగి డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భనవంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 12 ఏళ్ల క్రితం జారీ చేసిన రాజ్యాంగంలోని ఆర్టికల్–371(జె) అమలు విషయంలో నిర్లక్ష్యం వహించారన్నారు. 2025–26లో రూ.5 వేల కోట్ల నిధులున్నా దానికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించకుండా కాలయాపన చేశారని దుయ్యబట్టారు. కేవలం రూ.862.93 కోట్ల పనులకు అనుమతి పొంది మిగిలిన రూ.4,137 కోట్ల నిధులకు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని, నైతిక బాధ్యతగా కేకేఆర్డీబీ అధ్యక్షుడు అజయ్సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నాసిరకంగా చేపట్టిన పనులపై థర్డ్ పార్టీ తనిఖీ చేయకుండా నిధులు గోల్మాల్ చేశారని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఒత్తిడి చేశారు. బసవరాజ్, భీమ రాయ, జాన్వెస్లీ, ఖాజా అస్లాం పాషాలున్నారు. -
నాణ్యమైన ఉత్పత్తులనే కొనండి
హొసపేటె: వినియోగదారులు ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేసే ముందు ఆ ఉత్పత్తి పరిమాణం, నాణ్యతను నిర్ధారించుకోవాలని అదనపు జిల్లాధికారి ఈ.బాలకృష్ణ అన్నారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయ హాలులో నిర్వహించిన ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రతి వినియోగదారుడు తాను కొనుగోలు చేసే వస్తువు నాణ్యత, బరువు గురించి తెలుసుకోవాలన్నారు. వినియోగదారులు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలన్నారు. వినియోగదారులు వివిధ మాధ్యమాల్లో ప్రసారమయ్యే ఆకర్షణీయమైన ప్రకటనలకు మోసపోరాదన్నారు. అందుకు బదులుగా ఉత్పత్తి నాణ్యత, భద్రతను తనిఖీ చేసి కొనుగోలు చేయాలన్నారు. ఏదైనా వస్తువు లేదా ఉత్పత్తిని కొనుగోలు చేసేటప్పుడు వారు ఎల్లప్పుడూ అధికారిక బిల్లు లేదా రసీదును పొందాలన్నారు. ఉత్పత్తి, కొనుగోలులో లోపం ఉంటే ఫిర్యాదు చేయాలన్నారు. వ్యాపారులు తప్పనిసరిగా స్టాంప్ వేసిన ఎలక్ట్రానిక్ తూనికల యంత్రాలను ఉపయోగించాలన్నారు. వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చైర్మన్ ఎన్.తిప్పేస్వామి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. సీనియర్ న్యాయవాది కరుణానిధి, ఆహార పౌర సరఫరాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రియాజ్, లీగల్ మెట్రాలజీ శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ మనోజ్కుమార్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుజ్జల నాగరాజ్, కార్యదర్శి కృష్ణదేవరాయలు, వివిధ శాఖల అధికారులు, వినియోగదారులు హాజరయ్యారు. -
బెళగావిలో కుండపోత
● కలెక్టరేటులోకి వాననీళ్లు సాక్షి, బళ్లారి: బెళగావిలో భారీ కురిసింది. మంగళవారం సాయంత్రం వడగండ్లు, ఈదురు గాలలులతో కుండపోత కురవడంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎండలు, వేడి మాయమై చల్లని వాతావరణం ఏర్పడింది. అనేక రోడ్లతో పాటు జిల్లాఽధికారి కార్యాలయంలోకి నీరు పెద్ద ఎత్తున చేరడంతో రికార్డులు, కంప్యూటర్లు తడిసిపోయాయి. దీంతో కంప్యూటర్లు పనిచేస్తాయో లేదోనని అధికారులు చెబుతున్నారు. నగరంలో లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. కొన్ని చోట్ల చెట్లు నేలకూలినట్లు స్థానికులు తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ అకాల వర్షం కురిసింది. -
గ్యాస్, పెట్రోలు కోసం రద్దీ
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో అనేక ప్రాంతాల్లో ఇంటి గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. ఏజెన్సీల ముందు జనం క్యూలు కట్టారు. మంగళవారంనాడు లింగరాజపురలోని వినయ్ గ్యాస్ ఏజెన్సీ ముందు జనం కిలోమీటరు వరకూ నిలబడ్డారు. వారం రోజులుగా సిలిండర్ల సరఫరా లేకపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మంత్రి మునియప్ప రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని చెబుతుంటే వాస్తవం అలా ఉండడం లేదు. ఏజెన్సీల ముందు గంటల తరబడి నిలబడినా సిలిండర్లు ఇవ్వడం లేదని పలువురు వాపోయారు. చిక్కమగళూరులోనూ తీవ్రంగా కొరత ఉంది. ఇక పెట్రోలు దొరకదని వదంతులు రావడంతో అనేక పట్టణాలలో వాహనదారులు బంకులకు రావడంతో కిటకిటలాడాయి.హిందూ ర్యాలీలో యత్నాల్ ఫైర్ మండ్య: 2028 నాటికి హిందూ కార్యకర్తలు అధికారం చేపడితే, కర్ణాటక అంతటా విప్లవం వచ్చే అవకాశం ఉందని హిందూ నేత, బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే బసవరాజ్ పాటిల్ యత్నాల్ అన్నారు. జిల్లాలోని మద్దూరు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద హిందూ సంస్థలు నిర్వహించిన బలిదాన్ దివస్లో యత్నాల్ పాల్గొన్నారు. తాజ్మహల్ను నిర్మించిన వారు మన హీరోలయ్యారు, ఒక దొంగ కొడుకును నాయకుడంటూ చరిత్రను మలిచారని విమర్శించారు. చంద్రశేఖర్ ఆజాద్, భగత్సింగ్, వీర రాణి కిత్తూరు చెన్నమ్మ, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, స్వతంత్ర వీర సర్వకర్, ఛత్రపతి శివాజీ మహారాజ్ వంటివారు దేశం కోసం పోరాడి అమలరులయ్యారన్నారు. దేశంలో గాంధీ, నెహ్రూల శకం ముగిసింది, గాంధీజీ దేశానికి ఏమీ చేయలేదు. ఆయన ఖైదీగా జైలులో ఉన్నారు. గాంధీలో నాకు మహాత్ముని లక్షణాలు ఏవీ కనిపించలేదని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చెప్పేవారని యత్నాల్ అన్నారు. దేశవ్యాప్తంగా హిందువులపై అఘాయిత్యాలు, అణచివేతలు, సజీవ దహనం వంటి దురాగతాలు జరుగుతున్నాయని యత్నాల్ ఆరోపించారు. మద్దూరు స్ఫూర్తితో బీదర్లో హిందువుల ఐక్యత కోసం, హిందూ ప్రభుత్వం కోసం లక్షలాది మందిని సమీకరిస్తాను, పోరాటం చేస్తాను అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కెంకేరి విశ్వ ఒక్కలిగర మఠం అధ్యక్షుడు నిశ్చలానందనాథ్ స్వామిజీ, మైసూరు ఎస్.బి. నిత్యానంద, మాజీ ఎంపీ అనంత్కుమార్ హెగ్డే సహా పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తొక్కిసలాట మృతులకు మ్యాచ్ వేళ నివాళులుశివాజీనగర: ఈ నెలాఖరులో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ టోర్నీలో ఆర్సీబీ– హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కొన్ని నెలల కిందట ఆర్సీబీ విజయోత్సవాలలో ఇదే స్టేడియంలో తొక్కిసలాట జరిగి 11 మంది పౌరులు చనిపోవడం తెలిసిందే. మృతులకు ఈ టోర్నీలో గౌరవం సమర్పిస్తారు. మ్యాచ్కు ముందు 11 మంది పేర్లను తెరపై ప్రదర్శించి, ఆటగాళ్లు, ప్రేక్షకులు ఒక నిమిషం మౌనం పాటిస్తారు. స్టేడియంలో ప్రీమియం స్టాండ్లో 11 సీట్లను ఖాళీగా ఉంచుతారు. ఆ సీట్లకు ఏ మ్యాచ్లనూ టికెట్లు ఇవ్వరని స్టేడియం వర్గాలు తెలిపాయి. మృతుల జ్ఞాపకార్థం స్టేడియంలో ఓ స్మారక నిర్మాణాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. టికెట్ల అమ్మకాల నుంచి మ్యాచ్ ముగిసేవరకు రద్దీ నియంత్రణకు గట్టి చర్యలు చేపడతామని క్రికెట్ సంఘం అధికారులు చెప్పారు. మైనర్ల లవ్ జిహాద్ చిచ్చు యశవంతపుర: మైనర్ల ప్రేమ గొడవ చిచ్చు రేపుతోంది. ఇంటర్ అబ్బాయి, టెన్త్ అమ్మాయి ప్రేమ వ్యవహారం లవ్ జిహాద్గా మారి పోలీసుస్టేషన్కు చేరిన ఘటన చిక్కమగళూరు జిల్లా మూడిగెరె పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. స్థానిక గ్రామానికి చెందిన విద్యార్థి, మూడిగెరె పట్టణ బాలికకు మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరిద్దరివీ వేర్వేరు మతాలు, ఇది లవ్ జిహాద్ అని హిందూ సంఘాల నాయకులు అరోపిస్తున్నారు. ఆ అబ్బాయిని వారు మందలించారు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. దేవేగౌడకు సర్కారు ఖరీదైన కారుయశవంతపుర: రాజ్యసభ సభ్యుడు, మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ రాష్ట్రంలో పర్యటించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఖరీదైన ఓల్వో కారును సమకూర్చింది. ఈ వాహనం ఖరీదు రూ.1.25 కోట్లు అని మంత్రి కృష్ణబైరేగౌడ తెలిపారు. దేవేగౌడ, ఆయన కుటుంబంతో కాంగ్రెస్ సర్కారుకు వైరం ఉండడం తెలిసిందే. తరచూ ఆరోపణలు చేసుకుంటారు. కానీ కారు విషయంలో ఉదారంగా వ్యవహరించింది. లంబోర్గిని కేసులో విచారణ యశవంతపుర: బెంగళూరు ఎంజీ రోడ్డులో లంబోర్గిని కారుతో డ్రిఫ్టింగ్ చేసిన కేసులో కారు నడిపిన రిక్కీ రై కబ్బన్ పార్క్ ఠాణాలో విచారణకు హాజరయ్యాడు. బ్రేక్ వేయడంతో కారు అదుపు తప్పినట్లు పోలీసులకు చెప్పాడు. ఆయన లాయరు నారాయణస్వామి సృజనాత్మకంగా డ్రైవింగ్ చేయడంతో అలా జరిగిందని చెప్పారు. అయితే సృజనశీలత ప్రదర్శనకు ట్రాఫిక్ సిగ్నల్ వేదిక కాదంటూ పోలీసులు ఓ పోస్టు పెట్టారు. -
27 కాదు.. 26నే అసెంబ్లీ ముగింపు
శివాజీనగర: అభివృద్ధి అంటూ ప్రకటించబడిన బ్రాండ్ బెంగళూరుకు విరుద్ధంగా నగరంలో ఈ–ఖాతా వ్యవస్థలో అవినీతి, అక్రమాలు అధికమయ్యాయి, పాలికె అధికారుల లంచం దందా వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని విధానసభలో బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ ఆరోపించారు. మంగళవారం విధానసభలో బెంగళూరు సమస్యలపై ఆయన మాట్లాడారు. ‘మా ప్రభుత్వంలో లంచం తీసుకొన్న ఒక్కరినైనా చూపించండి అని డీసీఎం డీ.కే.శివకుమార్ సవాల్ చేసిన వీడియో ప్రచారమవుతోంది, హెచ్బీఆర్ లేఔట్లో ఓ భవన యజమాని ఖాతా కోసం వెళ్లగా, ఇది ఏ– ఖాతా కాలేదు, బీ–ఖాతా చేయాలని అధికారులు చెప్పారు, చివరకు రూ.30 వేల లంచం అడిగారు. అధికారికి ఫోన్ పేలో రూ.15,000 లంచం పంపించారు. అయితే దరఖాస్తును జిల్లాధికారి తిరస్కరించారు. మళ్లీ రెండోసారి రూ.20,000 లంచం ఇచ్చారు. పని జరగలేదు, లంచం డబ్బు వెనక్కి వ్వాలని కోరగా అధికారి ఇవ్వలేదు’ అని అశోక్ పలు ఉదాహరణలను వివరించారు. ఆఫీసులోనే వసూళ్ల దందా దేవనహళ్లిలో ఈ–ఖాతా చేయించేందుకు రూ.50 వేల లంచం తీసుకొంటున్నారు. నంజుండప్ప అనే రిటైర్డ్ అధికారి కార్యాలయంలో మకాం వేసి ఖాతా చేసేందుకు రూ, 30, 40 వేల లంచం వసూలు చేస్తున్నారు. ప్రతి వార్డులో ఇటువంటి దందా జరుగుతోందని అశోక్ ఆరోపించారు. ఇంటికి కుమారుడు సక్రమంగా పన్ను చెల్లిస్తున్నా కూడా తండ్రికి నోటీసులు పంపించారు, వేలం వేస్తామని బెదిరించారని ఆరోపించారు. ఇలా అన్నిచోట్లా ఖాతా మాఫియా ఉంది, నా ఆఫీసుకు ఎంతోమంది వచ్చి ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. కర్ణాటకలో 65 శాతం ఆదాయం బెంగళూరు నుంచి వస్తుంది, సౌలభ్యాలు లేవని అనేక కంపెనీలు నగరాన్ని వదులుతున్నాయి, చెత్త రాశులు, గుంతల రోడ్ల సమస్యలున్నాయి. ఉప ముఖ్యమంత్రి అనేకసార్లు నగర ప్రదక్షిణ చేసినా గుంతల రోడ్లు బాగుచేయలేదు, స్కూటర్ల నుంచి బస్సుల కిందపడి అనేక మంది మరణించారన్నారు. డంపింగ్ యార్డ్ లేదు చెత్త సమస్య నివారణకు డంపింగ్ యార్డ్ నిర్మిస్తామని మూడేళ్ల కింద చెప్పినా ఆ పని జగరలేదని అశోక్ ఆరోపించారు. నేడు నగరంలో వెయ్యి టన్నుల చెత్త డంపింగ్ యార్డ్కు వెళ్లకుండా నిలిచిపోయిందన్నారు. జీబీఏలో అన్ని విభాగాల్లో తీవ్రంగా అధికారుల కొరత ఉందని చెప్పారు. నగరంలో నీటి ట్యాంకర్ మాఫియా అధికమైందని అన్నారు. ఉద్యోగుల ప్రమోషన్కు షరతులు శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం కొత్త నియమాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై ప్రమోషన్ను పొందాలంటే నిర్ధారించిన శిక్షణను పూర్తి చేయాలి. ఇది గ్రూప్ ఏ, గ్రూప్ బీ, గ్రూప్ సీ ఉద్యోలులకు వర్తిస్తుంది. పదోన్నతి పొందేందుకు నిర్ధారించిన ట్రైనింగ్ను పూర్తిచేయడం అదనపు అర్హత అయిఉంటుంది. రిటైర్మెంట్కు రెండేళ్లు ఉన్న ఉద్యోగులకు ఈ షరతును మినహాయించారు. వయనాడుకు సాయంపై ప్రతిపక్షాల భగ్గు శివాజీనగర: కేరళలోని వయనాడులో వరదలు, కొండచరియలు విరిగిన దుర్ఘటనలో బాధితులకు కర్ణాటక ప్రభుత్వం రూ.10 కోట్ల సాయం చేయడంపై ప్రతిపక్షాలు బీజేపీ, జేడీఎస్ భగ్గుమన్నాయి. రెండేళ్ల కిందట ప్రకృతి విపత్తు వల్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరగడం తెలిసిందే. అప్పట్లో రూ.10 కోట్ల సాయాన్ని ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు మరో రూ.10 కోట్ల కేటాయించింది. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉపాధ్యాయులు, అంగన్వాడి కార్యకర్తలు, చిరుద్యోగులకు జీతాలు ఇవ్వలేని సర్కారు, కాంగ్రెస్ హైకమాండ్ను సంతోషపరిచేందుకు కేరళకు నిధులు ఇస్తోందని దుయ్యబట్టాయి. ఇది కన్నడిగులకు ద్రోహం చేయడమేనని ఆరోపించారు. పశ్చిమ ద్వారం ప్రారంభోత్సవంలో సీఎం, డీసీఎం, సభాపతులు మంగళవారం అసెంబ్లీ ఆవరణలో విద్యార్థుల సంబరం ● ఉప ఎన్నికల వల్లనే: సభాపతి శివాజీనగర: ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి 27న కాకుండా, 26నే ముగించనున్నట్లు స్పీకర్ యూ.టీ.ఖాదర్ మంగళవారం విధానసభలో ప్రకటించారు. బడ్జెట్పై చర్చ పూర్తయింది, బుధవారం సీఎం సిద్దరామయ్య బడ్జెట్పై చర్చకు సమాధానం ఇస్తారని తెలిపారు. సమావేశాలను ఒక రోజు తగ్గించాలని సలహా కమిటీ భేటీలో నిర్ణయించినట్లు చెప్పారు. దావణగెరె దక్షిణ, బాగల్కోటె అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు రావడంతో నాయకులు ప్రచారానికి వెళుతున్నందున అసెంబ్లీని ముందే ముగిస్తున్నట్లు సభాపతి తెలిపారు. ఇందుకు ఎమ్మెల్యేలు కూడా ఆమోదం తెలిపారు. పశ్చిమ ద్వారం షురూ కాగా, మంగళవారం అసెంబ్లీలో పలు కార్యక్రమాలు జరిగాయి. కొత్త హంగులు అద్దిన విధానసౌధ భవనం పశ్చిమ ద్వారాన్ని సీఎం సిద్దరామయ్య, డీసీఎం శివకుమార్, సభాపతులు, మంత్రులు ప్రారంభించారు. పదవీ కాలం పూర్తవుతున్న ఎమ్మెల్సీలతో గ్రూప్ ఫోటో తీసుకున్నారు. బెంగళూరులో ఖాతాల అవినీతి విధానసభలో బీజేపీ నేత అశోక్ ఆరోపణ -
బెంగళూరులో వాహనదారులూ.. జాగ్రత్త
బనశంకరి: బెంగళూరులో ఇకనుంచి రోడ్ల పక్కన బైక్లు, కార్లు వంటి సొంత వాహనాలను నిలిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నిబంధనలను మీరితే పోలీసులు వాటిని టోయింగ్ వాహనాలకు బిగించి తీసుకెళ్తారు. బుధవారం నుంచి నగరంలో నో పార్కింగ్ ఏరియాలలో వాహనాలను పార్కింగ్ చేస్తే జరిమానా తప్పదు. టోయింగ్ వ్యవస్థ మళ్లీ అమల్లోకి వస్తోంది. జీబీఏ, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా నగర రోడ్లలో నో పార్కింగ్ ప్రదేశాల్లో నిలిపే వాహనాలను టోయింగ్ చేసి జరిమానా విధిస్తారు. దీంతో పాటు టోయింగ్ చేసే సమయంలో వాహనదారులు, పోలీసుల మధ్య గొడవలు జరిగే బెడద ఉంది. ఇకపై టోయింగ్ వాహనాల్లో కెమెరాలను అమరుస్తారు. దీనివల్ల వాహనాల తరలింపులో వాహనాలు దెబ్బతినడం, లేదా వివాదాలు జరగడం వంటివి రికార్డు అవుతాయి. పారదర్శకత ఉంటుందని అధికారులు చెప్పారు. టోయింగ్ ఫీజు రూ.1000 , నో పార్కింగ్ జరిమానా రూ వెయ్యి కలిపి రూ.2 వేలు జరిమానా చెల్లించాలి. గతంలో రద్దయి... గతంలో టోయింగ్ గురించి ప్రజల నుంచి పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. వాహనాలు దెబ్బతినడం, అనవసరంగా జరిమానా విధించి తరలించడం చేస్తున్నారని జనం దుయ్యబట్టారు. దీంతో ప్రభుత్వం టోయింగ్ను నిలిపివేసింది. నేటి నుంచి టోయింగ్ ప్రక్రియ షురూ -
వెంటాడుతున్న లెప్టోస్పిరోసిస్
శివాజీనగర: రాష్ట్రంలో లెప్టో స్పిరోసిస్ జ్వరం కేసులు గత ఐదు సంవత్సరాల్లో ఆందోళనకర రీతిలో అధికమయ్యాయి. 16 వేలకు పైగా కేసులు నమోదు కాగా సుమారు 30 మంది దాని ప్రభావంతో మరణించారు. ఏటేటా వ్యాప్తి పెరుగుతోందే తప్ప తగ్గకపోవడం వైద్య ఆరోగ్య అధికారులను కలవరపరుస్తోంది. ఏ ఏడాది ఎంతమందికి? 2020లో 544 కేసులు నమోదు కాగా, 2021లో 906 మందికి సోకింది. 2022లో 3,174 మంది, 2023లో 5,404 మంది, 2024లో 5,088 మంది ఈ జబ్బు బారినపడ్డారు. 2025లో ఈ సంఖ్య 6,525కు పెరిగింది. గత ఏడాదిలో ఏకంగా 19 మంది దీని కాటుకు ప్రాణాలు వదిలారు. లెప్టో స్పిరోసిస్ అంటే ఏమిటి? లెప్టోస్పిరోసిస్ అనేది జంతువులు, ముఖ్యంగా ఎలుకల ద్వారా వ్యాపించే ప్రమాదకరమైన బ్యాక్టీరియా. వాటి మలమూత్రాల వల్ల మలినమైన నీరు, ప్రదేశం ద్వారా మనుషులకు సోకుతుంది. మొదట్లో మామూలు జ్వరం, ఒళ్లు నొప్పులు వస్తాయి, దీనివల్ల డెంగీ, లేదా మలేరియా జ్వరమని వైద్యులు పొరబడే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. లక్షాలు ఇలా ఉంటాయి బ్యాక్టీరియా సోకిన తరువాత 2 నుంచి 14 రోజుల మధ్య లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, తీవ్ర తొలనొప్పి, ఒళ్లునొప్పులు, చలి లేదా వణుకు, వాంతులు, నీరసం, కళ్లు ఎర్రగా కావడం, కడుపు నొప్పి, విరేచనాలు వంటివి బాధిస్తాయి. చికిత్స లభించని పక్షంలో సమస్య తీవ్రమవుతుంది. కాలేయం, మూత్రపిండాల వైఫల్యం, శ్వాశకోస సమస్య, మెదడు లోపల రక్తస్రావం వంటివి కూడా సంభవిస్తాయని వైద్యులు తెలిపారు. రాష్ట్రంలో ఏటేటా కేసుల పెరుగుదల గతేడాది 6 వేల మందికి పరిశుభ్రతతోనే పరిష్కారం ఎలా అరికట్టవచ్చు వాననీటిలో, కలుషిత నీటిలో చెప్పులు లేకుండా నడవరాదు. ఇంటిలో చెత్త, మట్టి పనులు చేశాక చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. ఇంటి చుట్టుపక్కల శుభ్రతను కాపాడుకోవాలి, ఎలుకలను అరికట్టాలి, వాటిద్వారానే ఇది ఎక్కువగా వ్యాపిస్తుంది. పరిశుభ్రమైన నీటినే తాగాలి. లెప్టో స్పిరోసిస్ నిర్ధారణకు ల్యాబ్ పరీక్షలు అవసరం. జ్వరం తదితర లక్షణాలు కనిపిస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులతో చికిత్స చేయించుకోవాలి. -
ప్రపంచ శాంతికై బాహుబలికి విశేష పూజలు
బొమ్మనహళ్లి: హాసన్ జిల్లాలోని ప్రఖ్యాత శ్రావణ బెళగోళలో వింధ్యగిరిలో బాహుబలి గోమటేశ్వరుని విగ్రహం ముందు విశేష పూజలు నిర్వహించారు. ప్రముఖ జైన గురువులు పాల్గొని అనేక నైవేద్యాలను సమర్పించి పూజించారు. మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య భక్తులు బాహుబలి పాదాలకు కొబ్బరి నీరు, పండ్లరసాలు, కల్కచూర్ణం, పసుపు పొడి, కషాయం, ఔషధాలతో అభిషేకం నిర్వహించారు. రక్త చందనం, అష్టగంధం, కేసరి, శ్రీగంధంతో అభిషేకం చేసి, ప్రపంచ శాంతి కోసం మహాశాంతిధారణ చేశారు. బసవేశ్వరస్వామి రథోత్సవం తుమకూరు: సోంపుర ఫిర్కాలో సుప్రసిద్ధ నిడవంద గ్రామంలో వెలసిన శ్రీబసవేశ్వర స్వామి ఆలయం బ్రహ్మరథోత్సవం వేలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తిని 40 అడుగుల ఎత్తైన తేరులో ఉంచి ఊరేగించారు. తేరును లాగగానే భక్తులు అరటిపండ్లు, దవనాన్ని విసిరారు. ఆదివారం రాత్రి వందలాది భక్తులు అగ్నిగుండంలో నడిచారు. స్థానికులు భక్తులకు చల్లని పానీయాలు, అన్నదానం సంతర్పణ చేశారు. దాబస్పేటె పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కొత్త స్నేహాల వైపు చూపు● సిలికాన్ సిటీలో డేటింగ్ యాప్లకు గిరాకీ సాక్షి, బెంగళూరు: సిలికాన్ సిటీలో కొత్త కొత్త స్నేహాల కోసం పురుషులు, మహిళలు డేటింగ్ యాప్లను ఆశ్రయిస్తున్నారు. ఈ మేరకు ఓ డేటింగ్ యాప్ గణాంకాలను విడుదల చేసింది. డేటింగ్ యాప్ల వినియోగదారుల్లో సుమారు 65 శాతం మంది పురుషులు, 35 శాతం మంది మహిళలు ఉన్నట్లు తెలిసింది. బెంగళూరులో ఈ ట్రెండ్ అధికంగా ఉండడం గమనార్హం. బెంగళూరు తరువాత హైదరాబాద్ వాసులు ఉన్నారు. గత రెండేళ్లలో ఈ అప్లికేషన్లో చేరుతున్న మహిళల సంఖ్య 148 శాతం పెరిగినట్లు తెలిసింది. ఇందులో వైద్యులు, చార్టెడ్ అకౌంటెంట్ వంటి ప్రొఫెషనల్స్ కూడా జోడు కోసం వెతుకులాడడం విశేషం. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు ఆధునిక సంబంధాల వైపు చూస్తున్నట్లు సామాజిక నిపుణులు తెలిపారు. యాప్ వాడకందారులు రోజులో ఒక గంటకు పైగా చాటింగ్లో గడుపుతున్నట్లు తెలిపారు. -
రూ.3.80 కోట్ల డ్రగ్స్ సీజ్
కృష్ణరాజపురం: చాక్లెట్ల కవర్లలో డ్రగ్స్ను ఉంచి అమ్ముతున్న విక్రేతను బెంగళూరు కృష్ణరాజపురం పోలీసులు పట్టుకున్నారు. బీదర్కు చెందిన కిరణ్ కాంబ్లె (28) ఢిల్లీ నుంచి డ్రగ్స్ను తెప్పించి సిలికాన్ సిటీలో విక్రయిస్తుండేవాడు. ఉప్పారపేటె పోలీసు స్టేషన్ పరిధిలోని గాంధీనగర్లో ఓ వ్యక్తికి డ్రగ్స్ సరఫరా చేస్తుండగా పోలీసులు దాడి చేసి కిరణ్ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.3.80 కోట్ల విలువ చేసే 3.9 కేజీల ఎండీఎంఏ మత్తు పదార్థాన్ని సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.రూ.7 కోట్ల డ్రగ్స్ స్వాధీనంబెంగళూరులో ఐదుమంది విక్రేతల అరెస్టు బనశంకరి: రాజధానిలో ఎండీఎంఏ, గంజాయి వంటి మత్తు పదార్థాలను విక్రయిస్తున్న ఐదుమంది డ్రగ్ పెడ్లర్లను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.7.4 కోట్ల విలువచేసే డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ తెలిపారు. ఆయన డ్రగ్స్ను పరిశీలించి మాట్లాడారు. 343 కేజీల గంజాయి బస్తాలు, గూడ్స్ వ్యాన్ తదితరాలను సీజ్ చేశారు. మైసూరు రోడ్డులోని నాయండహళ్లి సిగ్నల్ వద్ద, ఉప్పారపేటే ఆర్కే.పురం లాడ్జీలో, చెన్నసంద్ర మెయిన్రోడ్డులో డ్రగ్స్ను అమ్ముతుండగా పట్టుకున్నారు. విదేశాలకు చెందిన గుర్తుతెలియని వ్యక్తి నుంచి మత్తు పదార్థాలను తెప్పించేవారు. తక్కువ ధరతో కొనుగోలుచేసి ప్రజలకు, కాలేజీ విద్యార్థులకు విక్రయించేవారు. -
సంఘ సంస్కర్త దేవర దాసిమయ్య
సాక్షి,బళ్లారి: నాడు సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న అసమానతలు, కులవివక్షపై పోరాటం చేయడంతో పాటు ఆధ్యాత్మిక, భక్తిమార్గంలో పయనిస్తూ, శివభక్తిని జనంలో పెంపొందించడానికి దేవర దాసిమయ్య ఎంతో కృషి చేశారని పలువురు వక్తలు పేర్కొన్నారు. సోమవారం దేవర దాసిమయ్య జయంత్యుత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం రోడ్డులోని కల్చరల్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన దేవర దాసిమయ్య జయంతిని నగర మేయర్ గాదెప్ప, లిడ్కర్ అధ్యక్షుడు ముండ్రిగి నాగరాజు, జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు అవ్వార మంజునాథ తదితరులు పాల్గొని ప్రారంభించి మాట్లాడారు. చేనేత సమాజంలో సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకున్నారన్నారు. జిల్లా నేకార సంఘం అధ్యక్షుడు దేవానంద, నేకార సమాజ ప్రముఖులు ఎల్ఐసీ రాజు, చంద్రశేఖర్, ప్రముఖ చార్టెర్డ్ అకౌంటెంట్ పన్నారాజ్, మాజీ కార్పొరేటర్ సుధాకర్ దేశాయి, డీసీసీ మహిళా అధ్యక్షురాలు మంజుల తదితరులు పాల్గొన్నారు. విజయనగరలో.. హొసపేటె: నగరంలోని నీలకంఠ దేవస్థానంలో తాలూకా నేకార సంఘం ఆధ్వర్యంలో సోమవారం దేవర దాసిమయ్య జయంతిని నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు హంపీ నుంచి జ్యోతిని తెచ్చారు. ఈ వేడుకల్లో దేవర దాసిమయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ 12వ శతాబ్దపు సన్యాసి, వచన రచయిత, బసవేశ్వరుని సీనియర్ సమకాలీకుడైన దేవర దాసిమయ్య సమానత్వం, శాంతి సందేశాన్ని వ్యాప్తి చేయడానికి రాసిన 176 వచనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. సమాజ ప్రముఖులు కాశీ విశ్వనాథ్, విజయకుమార్, బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు. రాయచూరులో.. రాయచూరు రూరల్: నగరంలో దేవర దాసిమయ్య జయంతిని ఆచరించారు. సోమవారం అంబేడ్కర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన జయంతిని పురస్కరించుకుని దేవర దాసిమయ్య చిత్రపటానికి తహసీల్దార్ సురేష్ వర్మ పూలమాలలు వేశారు. పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో జ్యోతి వెలిగించి ఏడీసీ శివానంద, సమాజం అధ్యక్షులు, ఇతరులున్నారు. కులవివక్ష, అసమానతలపై పోరాటం వచనాలు, బోధనలతో జనానికి చైతన్యం జయంత్యుత్సవంలో పలువురు వక్తలు -
సిలిండర్ల కొరత నివారించండి
బళ్లారిఅర్బన్: జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరా సమస్య తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో జిల్లా వాణిజ్య పారిశ్రామిక సంస్థ ఆధ్వర్యంలో హోటల్, బేకరీ యజమానుల సంఘం సోమవారం అదనపు జిల్లాధికారికి వినతిపత్రాన్ని అందించారు. అనంతరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు అవ్వారు మంజునాథ్, గౌరవ కార్యదర్శి కేసీ సురేష్బాబు సమక్షంలో హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు విక్రమ్ పోలా తదితరులు మాట్లాడారు. హోటళ్లు, బేకరీలకు అవసరమైన ఎల్పీజీ సిలిండర్ల సరఫరాను పెంచాలని కోరారు. పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ఎల్పీజీ సరఫరాలో అంతరాయం ఏర్పడిందన్నారు. దీని ప్రభావం హోటల్, బేకరీ తదితర వ్యాపారాలపై తీవ్రంగా పడిందన్నారు. ఆయా రంగాలపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల జీవనోపాధి దెబ్బ తింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంయుక్త కార్యదర్శి మర్చేడ్ మల్లికార్జునగౌడ్, సంఘం ప్రతినిధులు, హోటల్ యజమానులు పాల్గొన్నారు. -
సర్కిల్లో అంబేడ్కర్ ప్రతిమ ఏర్పాటు చేయండి
బళ్లారి అర్బన్: నగరంలోని ప్రధాన సర్కిల్లో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దళిత సంఘాల నాయకులు జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని కొత్త జిల్లాధికారి కార్యాలయంలో బాబు జగ్జీవన్ రాం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ముందస్తు సన్నాహాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. వాల్మీకి సర్కిల్లో వాల్మీకి ప్రతిమను ఏర్పాటు చేసినట్లుగానే ప్రధాన సర్కిల్లో అంబేడ్కర్ ప్రతిమను కూడా ఏర్పాటు చేయాలని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కొందరు మోతీ సర్కిల్ మధ్య భాగంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. తాళూరు రోడ్డు సర్కిల్లో పెట్టండి మరి కొందరు తాళూరు రోడ్డుకు అంబేడ్కర్ పేరు పెట్టి ఆ సర్కిల్లో అంబేడ్కర్ ప్రతిమను ప్రతిష్టించాలని కోరారు. దీనిపై ప్రతిపాదనలు అందజేస్తే ప్రభుత్వానికి పంపిస్తామని జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. ఏప్రిల్ 5న హరిత విప్లవ నేత బాబూ జగ్జీవన్ రాం జయంతిని కూడా డాక్టర్ జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో ఏడీసీ మహ్మద్ జుబేర్, మున్సిపల్ కమిషనర్ మంజునాథ్, జిల్లా అంబేడ్కర్ సంఘం ప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరేయాలి
సాక్షి,బళ్లారి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బళ్లారి నగరంతో పాటు జిల్లాలోని అన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఆయన సోమవారం నగరంలోని తన నివాస గృహ కార్యాలయంలో బీజేపీ నూతన కార్యవర్గం ఎంపిక, నియామక పత్రాలను సంబంధితులకు అందజేసి మాట్లాడారు. పార్టీలో కష్టపడి పని చేసిన వారిని గుర్తించి పదవులు కట్టబెడతామన్నారు. పార్టీ కోసం ఎవరెంత పని చేశారన్నది ప్రతి ఒక్కరి చిట్టా పార్టీ పెద్దల వద్ద ఉంటుందన్నారు. సామాన్య వ్యక్తిని సైతం అందలం ఎక్కించే పార్టీ బీజేపీ అన్నారు. నూతనంగా పార్టీ బాధ్యతలు తీసుకున్న పదాధికారులు నగరంలో బూత్ స్థాయి నుంచి ప్రతి వార్డులో పార్టీని బలపరచాలన్నారు. సంక్షేమాన్ని ప్రజల దరిచేర్చాలి కేంద్రంలో బీజేపీ చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సూచించారు. పార్టీలో పదవులు తీసుకున్న వారు ఆయా వార్డులు, బూత్ల్లో పార్టీ సభ్యత్వ నమోదును కూడా పెంచాలన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులను సమష్టిగా ముందుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు పాటుపడాలన్నారు. కాంగ్రెస్ పార్టీపై జనం విసిగిపోతున్నారన్నారు. మాజీ మేయర్, నగర బీజేపీ అధ్యక్షుడు గుర్రం వెంకటరమణ, పాలికె ప్రతిపక్ష నాయకుడు మోత్కూరు శ్రీనివాసరెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీని మరింతగా బలోపేతం చేయాలి మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పిలుపు -
అనారోగ్యంతో మాజీ ఎమ్మెల్సీ మృతి
రాయచూరు రూరల్: మాజీ ఎమ్మెల్సీ, కొప్పళ జెడ్పీ మాజీ అధ్యక్షుడు కరియణ్ణ సంగటి(61) అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున బెంగళూరులోని అపోలో ఆస్పత్రిలో మరణించారు. కొప్పళ తాలూకా యలమగేరిలో మంగళవారం ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరుగుతాయి. కరియణ్ణ 1998లో కొప్పళ జిల్లా పంచాయతీ అధ్యక్షుడిగా విధులు నిర్వహించారు. ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణకు ఆప్తుడిగా ఉండడంతో 2000లో ఆయనను ఎమ్మెల్సీగా నియమించారు. 2008లో కొప్పళ నుంచి ఇండిపెండెంట్గా, 2018లో గంగావతి నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 2023 ఎన్నికల్లో జనార్దనరెడ్డి తరపున ప్రచారం చేసి ఆయన విజయానికి సహకరించారు. ఉమ్మడి రాయచూరు జిల్లాలో 1982 నుంచి సేవాదళ్ కార్యకర్తగా, 1985–89 వరకు కొప్పళ తాలూకా యువజన కాంగ్రెస్ నాయకుడిగా పని చేశారు. కాగా కరియణ్ణ సంగటి మృతదేహానికి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. దోపిడీ వ్యవస్థ మార్పే భగత్సింగ్ కల హొసపేటె: దోపిడీ వ్యవస్థను మార్చి భగత్సింగ్ దేశ ప్రజలకు నూతన సామ్యవాద వ్యవస్థను అందించారని ఏఐడీవైఓ నిర్వాహకుడు మరబ్బిహాళ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం పట్టణంలోని శాంతినికేతన్ ఐటీఐ కళాశాల, గ్రంథాలయం సమీపంలో స్వాతంత్య్ర సమరయోధులు, మహనీయ విప్లవకారులు భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల అమరత్వ దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. స్వాతంత్య్ర సమరయోధులందరూ విప్లవకారులు కారు. పోరాట యోధుల లక్ష్యం భారతదేశం నుంచి బ్రిటిష్ వారిని తొలగించడమేనని అన్నారు. ఏఐడీవైఓ ఆర్గనైజర్ జిల్లా సభ్యుడు ప్రకాష్ బసవనదుర్గ మాట్లాడుతూ నేటి యువత భగత్సింగ్ ఆదర్శాలను అనుసరించాలన్నారు. పోరాట సంఘం నేతలు పాల్గొన్నారు. రాయచూరు రూరల్: భగత్సింగ్ జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని సంచాలకుడు శరణప్ప పేర్కొన్నారు. ఏఐడీవైఓ, ఏఐడీఎస్ఓ, ఏఐఎంఎస్ఎస్ల ఆధ్వర్యంలో సోమవారం భగత్సింగ్ సర్కిల్ వద్ద భగత్సింగ్ ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. భగత్సింగ్ ఆశలు, ఆశయాలు, ఆదర్శాలను పుణికి పుచ్చుకోవాలన్నారు. ఈ సఽందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. సరోజ, చెన్నబసవ తదితరులున్నారు. గర్భకోశ క్యాన్సర్ నివారణకు టీకాల పంపిణీహుబ్లీ: చిన్నారులు, మహిళలను గర్భకోశ క్యాన్సర్ రూపంలో కబళిస్తున్న సదరు మహ్మమారి కట్టడికి ప్రభుత్వం టీకాల రూపంలో తగిన చర్యలు తీసుకుంటోందని డీఎంహెచ్ఓ డాక్టర్ హొనకేరి తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ దేశంలో ఈ వ్యాధి రెండవ స్థానంలో ఉందని, అందువల్ల వ్యాధి కట్టడికి పరిణామాత్మక హెచ్పీవీ టీకా మార్కెట్లో ప్రియం అయినా కూడా ప్రభుత్వం పేద మహిళలందరికీ లభించాలన్న ఉద్దేశంతో తగిన చర్యలు చేపట్టిందన్నారు. 14 నుంచి 15 ఏళ్ల లోపు బాలికలకు ఉచితంగా టీకాలు ఇస్తారన్నారు. ప్రతి బాలికకు సదరు టీకా ఒక్క డోస్ మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం సూచించిందన్నారు. జిల్లా కుటుంబ సంక్షేమ శాఖ ఆరోగ్య శాఖ ఈ మేరకు జిల్లా, తాలూకా, ప్రాథమిక, కమ్యూనిటీ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో టీకాలను అందుబాటులో ఉంచిందన్నారు. -
వైభవంగా రాచోటి శివాచార్య ఉత్సవాలు
రాయచూరు రూరల్: జిల్లాలోని సిరవార తాలూకా అత్తనూరులో సోమవారం రాచోటి శివాచార్య 22వ వర్థంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. సోమవార పేట హిరేమఠ బృహన్మఠాధిపతి అభినవ రాచోటి వీర శివాచార్యులు ఊరేగింపునకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. గ్రామంలో తాగునీటి కోసం బావి, చెరువులు తవ్వించి దాహార్తిని తీర్చారన్నారు. హిందూ సామ్రాజ్య స్థాపనకు నడుం బిగించిన మహా స్వామి రాచోటి శివాచార్య అన్నారు. సామూహిక వివాహాల్లో 25 నవ జంటలకు ఆశీస్సులు పలికారు. శాంతమల్ల శివాచార్య, వీర సంగమేశ్వర, నవలకల్ స్వామీజీ, మహంతేష్ పాటిల్, గిరిజా శంకర్, బుడ్డనగౌడ, చంద్రశేఖర్లున్నారు. ఆస్తుల కబ్జాపై కేసులు పెట్టాలిరాయచూరు రూరల్: జిల్లాలోని మాన్వి తాలూకా అరోలిలో ఉన్న మఠం ఆస్తులు కబళించిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని దళిత సంఘాల జిల్లా సమితి సంచాలకుడు నరసింహులు డిమాండ్ చేశారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అరోలిలో సర్వే నంబర్–175లో 16.5 ఎకరాల భూమికి నకిలీ రికార్డులు సృష్టించి భూములను ఆక్రమించారన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా ఉరవకొండ గవిమఠం జగద్గురు చెన్నబసవ రాజేంద్ర స్వామీజీకి చెందిన భూములను భీమణ్ణకు గుత్తాధిపత్యం ఇచ్చారన్నారు. సిద్దనగౌడ తండ్రి బసిరెడ్డి, అక్కలు, చెల్లెళ్ల పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నారన్నారు. మఠం ఆస్తులను కబళించిన, ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. ఆంజనేయ, హనుమేష్, మంజునాథ్, భీమన్న, రామమూర్తి, జంబయ్య, నాగేంద్ర, సురేష్, శ్రీనివాస్లున్నారు. అంగన్వాడీ కార్యకర్తలను పర్మినెంట్ చేయాలిరాయచూరు రూరల్: అంగన్వాడీ కార్యకర్తలను పర్మినెంట్ చేయాలని రాష్ట్ర అంగన్వాడీ కార్యకర్తల సంఘం డిమాండ్ చేసింది. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలను బంద్ చేిసి సోమవారం బెంగళూరు ఫ్రీడం పార్కులో ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీ్త్రశిశు సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తున్న వారిని పర్మినెంట్ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలన్నారు. ఎల్కేజీ, యూకేజీ పాఠశాలలను అంగన్వాడీలకు కేటాయించాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 60:40 శాతం పద్ధతిలో వేతనాలు పెంచాలని ఒత్తిడి చేశారు. రిజర్వేషన్లకు మద్దతివ్వాలని హితవురాయచూరు రూరల్: రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మహదేవప్పను మాజీ మంత్రి శివనగౌడ నాయక్ అవమానించలేదని, రిజర్వేషన్లకు మద్దతు పలకాలని మంత్రికి హితవు పలికారని నాయక్ సమాజ సంచాలకుడు రంగనాథ్ పేర్కొన్నారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల దావణగెరెలో జరిగిన ఎస్సీ, ఎస్టీ నాయకుల సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ రిజర్వేషన్ల అమలులో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేశారన్నారు. మంత్రి మహదేవప్ప మంత్రివర్గంలో ఉంటూ కాలయాపన చేయకుండా అందరికీ సమ న్యాయం చేయాలని చెప్పడం తప్పా? అని ప్రశ్నించారు. లాలెప్ప నాయక్, రవి కుమార్, రాజశేఖర్, అరుణ్, వెంకటేష్లున్నారు. రిజర్వేషన్ ఇచ్చేవరకు నియామకాలు వద్దు రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేసి, రిజర్వేషన్ ప్రకటించే వరకు ప్రభుత్వ కొలువుల్లో నియామకాలకు అవకాశం కల్పించరాదని అంబేడ్కర్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు మహేంద్ర కుమార్ మిత్ర పేర్కొన్నారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నివేదిక ఆధారంగా రోస్టర్ పద్ధతిలో రిజర్వేషన్ల కేటాయింపులు జరుగుతాయని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 56 శాతం రిజర్వేషన్లు దాటితే ఉద్యోగాల్లో నియామకాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. 1995లో కోర్టు ఆదేశాల జారీ చేసిన 50 శాతం మేరకే ఉద్యోగాలు ఇవ్వాలని, కుల ధ్రువీకరణ పత్రాలను అందించాలని కోరారు. -
రెండు ఆటోలు పల్టీ.. యువతి మృతి
హొసపేటె: హిరేబెణకల్ సమీపంలోని వరి పొలంలో సోమవారం సాయంత్రం రెండు ఆటోలు అదుపు తప్పి బోల్తా పడటంతో ఓ మహిళ మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. మృతురాలిని ఇక్కడి మహబూబ్ నగర్లోని జెండాకట్ట ప్రాంతానికి చెందిన రేష్మా(24)గా గుర్తించారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం ఇక్కడి సబ్ డివిజనల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అయేషా, మినియాజ్ అనే ఇద్దరితో సహా నలుగురిని తదుపరి చికిత్స కోసం బళ్లారి ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. 20 మందికి పైగా గాయాలు -
మిన్నంటిన ఉప కోలాహలం
సాక్షి, బళ్లారి: రాష్ట్రంలో వచ్చే నెల 9న జరగనున్న దావణగెరె, బాగల్కోటె అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఆయన సోమవారం దావణగెరెలో కాంగ్రెస్ అభ్యర్థి శ్యామనూరు సమర్థ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని విలేకరులతో మాట్లాడారు. దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి మైనా ర్టీలు టికెట్ ఆశించిన మాట వాస్తవమేనన్నారు. అయితే పార్టీ అన్ని కోణాల్లో ఆలోచించి, సీనియర్ నాయకుడు శ్యామనూరు శివశంకరప్ప మృతితో ఖాళీ అయిన స్థానం నుంచి ఆయన కుటుంబానికి టికెట్ ఇచ్చిందన్నారు. మైనార్టీలు వేరే పార్టీకి మద్దతు ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. నూటికి నూరు శాతం కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు ఖాయం అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి ఎలాంటి అవకాశాలు లేవని, కాబట్టి ఫలితాలు దిక్సూచి కాదని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. బీజేపీ విజయం తథ్యం: యడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిచడంతో పాటు అభివృద్ధి పూర్తిగా లేకుండా పోయిందని బీజేపీ నేత, మాజీ సీఎం యడియూరప్ప విమర్శించారు. ఆయన దావణగెరెలో బీజేపీ అభ్యర్థి శ్రీనివాస దాసకరియప్ప నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దావణగెరెతో పాటు బాగల్కోటలో కూడా బీజేపీ అభ్యర్థి గెలవడం ఖాయమన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందని, ప్రజలకు సౌకర్యాలలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. ఈ ఉప ఎన్నికలతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిచి అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుతున్నారన్నారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల అభ్యర్థుల ర్యాలీలు జనసాగరాన్ని తలపించాయి. రెండు నగరాల్లోనూ కోలాహలం నెలకొంది. దావణగెరె, బాగల్కోటెలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల నామినేషన్ ర్యాలీలు తమదే గెలుపన్న సీఎం సిద్దు -
అట్టహాసంగా నామినేషన్లు
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగే రెండు నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. దావణగెరె దక్షిణ, బాగల్కోటె రెండు నియోజకర్గాలకు ఉప ఎన్నిక వచ్చే నెల 9న జరగనున్న నేపథ్యంలో సోమవారం నామినేషన్లు సమర్పించేందుకు ఆఖరి రోజు కావడంతో దావణగెరె కాంగ్రెస్ అభ్యర్థి శ్యామనూరు సమర్థ్, బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ టీ.దాస్కరియప్ప అట్టహాసంగా నామినేషన్లు సమర్పించారు. ఇది వరకే వీరిద్దరూ గత శుక్రవారం మంచి రోజు కావడంతో ఒక సెట్టు సమర్పించిన సంగతి తెలిసిందే. దావణగెరె దక్షిణ నియోజకవర్గానికి మైనార్టీ అభ్యర్థి తీవ్రంగా పోటీ పడిన నేపథ్యంలో ఒక రోజు ముందుగా అభ్యర్థి పేరును ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో టికెట్ను నామినేషన్ల సమర్పణకు చివరి రోజున కాంగ్రెస్ అభ్యర్థి శ్యామనూరు సమర్థ్ భారీ జన సందోహం మధ్య ర్యాలీగా తరలిరావడంతో పాటు ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్లతో పాటు పలువురు మంత్రులు హాజరై జిల్లాధికారి కార్యాలయంలో నామినేషన్లు సమర్పించారు. బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ కూడా.. దావణగెరె దక్షిణ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ టీ.దాస్ కరియప్ప కూడా భారీ జన సందోహంతో తరలివచ్చి నామినేషన్లు సమర్పించారు. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా మాజీ సీఎం యడియూరప్ప, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, మాజీ కేంద్ర మంత్రులు తరలి రావడంతో బీజేపీ అభ్యర్థి కూడా ఉత్సాహంగా నామినేషన్లు దాఖలు చేశారు. రెండు పార్టీల అభ్యర్థులు ఒకే రోజు నామినేషన్లు సమర్పించిన నేపథ్యంలో దావణగెరె నగరంలో ఎటు చూసినా భారీ జనసందోహంతో వీధులన్నీ నిండిపోగా బీజేపీ, కాంగ్రెస్ జెండాలు, బ్యానర్లు రెపరెపలాడాయి. కాంగ్రెస్ రెబల్గా సాధిక్ ఫైల్వాన్ రెండు పార్టీల్లో అసమ్మతి బెడద కనిపించడంతో కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన మైనార్టీ నేత సాధిక్ పైల్వాన్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్లు వేశారు. సాధిక్ పైల్వాన్కు టికెట్ ఇవ్వాలని మంత్రి జమీర్ అహమ్మద్ కూడా తీవ్రంగా పట్టుబట్టారు. అయితే శ్యామనూరు కుటుంబానికే టికెట్ కేటాయించగా మంత్రి జమీర్ అహమ్మద్ కూడా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా నామినేషన్లు వేసే కార్యక్రమంలో పాల్గొనకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మైనార్టీలకు కాంగ్రెస్ టికెట్ కేటాయించలేదనే ఆగ్రహంతో దావణగెరెలో 12వ వార్డుకు చెందిన పలువురు ముస్లిం సమాజానికి చెందిన యువకులు పెద్ద సంఖ్యలో బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ టీ.దాస్కరియప్ప సమక్షంలో బీజేపీలో చేరారు. ఉమేష్ మేటి నామినేషన్ బాగల్కోటె నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న ఉమేష్ మేటి అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆర్.బీ.తిమ్మాపుర, డీసీసీ అధ్యక్షుడు ఎస్.జీ.నంజయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ ప్రముఖులు హాజరు కావడంతో పాటు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో బాగల్కోటెలోని వీధులు ఎటు చూసినా కాంగ్రెస్ జెండాలు, మద్దతుదారులతో కిటకిటలాడాయి. నామినేషన్ సమర్పిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సమర్థ్, చిత్రంలో సీఎం, డీసీఎం నామినేషన్ వేస్తున్న బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్, చిత్రంలో మాజీ సీఎం యడ్డి ముగిసిన ఆయా పార్టీ అభ్యర్థుల నామినేషన్ల ఘట్టం కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా హాజరైన సీఎం, డీసీఎం బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా మాజీ సీఎం, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు భారీ ర్యాలీలతో అభ్యర్థుల శక్తి ప్రదర్శన, ప్రధాన పార్టీలకు వీడని అసమ్మతి దావణగెరెలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా సాధిక్ ఫైల్వాన్ నామినేషన్ దాఖలు -
డివైడర్కు ప్రైవేటు బస్సు ఢీ
● నలుగురు దుర్మరణం ● మైసూరు ఎక్స్ప్రెస్వేలో ప్రమాదం దొడ్డబళ్లాపురం: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డివైడర్ను ఢీకొన్న ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు దుర్మరణం చెందిన సంఘటన బెంగళూరు–మైసూరు ఎక్స్ప్రెస్ వేపై చన్నపట్టణ తాలూకా పుట్టప్పనదొడ్డి వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది. కేరళకు చెందిన మహ్మద్ ఫరాన్ (22), రఫీజ్ (45), బెంగళూరుకు చెందిన రశీద్ (45), షాకీర్ (27) అనేవారు మరణించారు. కేరళలోని పీకే ట్రావెల్స్కి చెందిన బస్సు కోజికోడ్ నుంచి బెంగళూరు వైపు వెళ్తుండగా వేగం కారణంగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో ఈ నలుగురు చనిపోగా, ముగ్గురు గాయపడ్డారు. డ్రైవరు నిద్రమత్తులోకి జారుకోవడమే కారణమని అనుమానాలున్నాయి. చెన్నపట్టణ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితులను ఆస్పత్రికి తరలించారు. కాబోయే భార్య హత్య.. నిందితుడు అరెస్టు యశవంతపుర: కాబోయే భార్య (18)ని అనుమానంతో అత్యంత కిరాతకంగా హత్య చేసి పరారైన నిందితున్ని బెంగళూరు డీజే హళ్లి పోలీసులు రాజస్థాన్లోని అజ్మీర్లో అరెస్ట్ చేశారు. నిందితుడు శబీల్ (20)ను బెంగళూరుకు తీసుకొచ్చారు. ఈ నెల 17న డీజే హళ్లిలోని చక్కెర మండీ వద్ద పాడుబడిన ఇంటిలోకి యువతిని తీసుకెళ్లిన నిందితుడు ఆమెను కత్తితో 20 సార్లకు పైగా పొడిచి చంపి పరారయ్యాడు. వారిద్దరికీ ఇదివరకే నిశ్చితార్థమైంది, బక్రీద్ పండుగ తరువాత పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. కానీ ఆమైపె అనుమానం పెంచుకున్న శబీల్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్సాహంగా పికిల్బాల్ టోర్నీ బొమ్మనహళ్ళి: బెంగళూరు నగరం బొమ్మనహళ్ళి హెచ్ఎస్ఆర్ లేఔట్లో పికిల్బాల్ టోర్నీ సందడి నెలకొంది. దక్షిణ భారతదేశంలోని అగ్రశ్రేణి క్రియేటర్లను ఒకచోట చేర్చింది. ఇందులో యువతతోపాటు చిన్నరులు సైతం పాల్గొని పికిల్బాల్ ఆడారు. అలాగే లైఫ్ స్టైల్, ఫిట్నెస్, కామెడీ, బ్యూటీ, ఫ్యాషన్, సిటీ గైడ్ రంగాలకు సంబంధించి కార్యక్రమాలు జరిగాయి. రోజంతా ఉత్సాహంగా కార్యకలాపాలు కొనసాగాయి. బంధువు దాష్టీకం, తల్లయిన బాలిక మైసూరు: రాష్ట్రంలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. చామరాజనగర జిల్లా గుండ్లుపేటె తాలూకాలోని ఒక గ్రామంలో కడుపునొప్పితో బాధపడుతున్న 17 ఏళ్ల బాలికను ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్స్లోనే ఆడబిడ్డను ప్రసవించింది. ఆమెను గర్భవతిని చేశాడన్న ఆరోపణపై బంధువైన సురేష్ (46)పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేసి జైలుకు పంపారు. బాలిక కాన్పు గురించి గుండ్లపేట ఆసుపత్రి సిబ్బంది, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పోలీసులకు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ప్రేమపేరుతో బాలికను లోబర్చుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడని, గర్భం దాల్చిన బాలిక తల్లిదండ్రులకు చెప్పకుండా మౌనంగా ఉందని తెలిసింది.రామదండు పాదయాత్ర చింతామణి: తాలూకాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమయిన కై వార యోగినారేయణస్వామి మఠంలో తాతయ్య 300 జయంతి సందర్భంగా కోలారు, చిక్కబళ్లాపుర భక్తుల ఆధ్వర్యంలో శ్రీరామ దండు సంకీర్తన పాదయాత్ర ఘనంగా జరిగింది. కోటకల్ శింగరె లక్ష్మీ వెంకటరమణస్వామి ఆలయంలో పాదయాత్రను ప్రారంభించి కై వారం వరకూ భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ నడిచి వచ్చారు. -
కమర్షియల్ గ్యాస్ సరఫరాకు చర్యలు
బనశంకరి: పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం వల్ల కమర్షియల్ సిలిండర్లకు కొరత ఏర్పడింది, కర్ణాటకకు నిత్యం 10 వేల సిలిండర్లు సరఫరా చేయడానికి రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుందని, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి కేహెచ్.మునియప్ప తెలిపారు. గ్యాస్ సమస్యపై సోమవారం తమ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. గత వారం వెయ్యి సిలిండర్లను హోటల్స్ కు అందించామని ప్రస్తుతం హోటల్, డాబా, హాస్టళ్లు, ఇందిరా క్యాంటీన్, ఆసుపత్రులకు సరఫరా చేయడానికి ప్రతి నిత్యం 10 వేల కమర్షియల్ సిలిండర్లు సరఫరా చేస్తామని తెలిపారు. నమోదు తప్పనిసరి కమర్షియల్ వినియోగదారులు వచ్చే శనివారంలోగా గ్యాస్ కంపెనీల వద్ద తప్పనిసరిగా వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. నమోదు చేసుకోకపోతే వాణిజ్యానికి వినియోగించే సిలిండర్లు లభించవని మంత్రి తెలిపారు. ఎవరు ఎన్ని సిలిండర్లు వాడుతున్నారు అనే సమాచారం ఉండాలన్నారు. హోటల్ యజమానులకు కరెంటు బిల్లులను తగ్గించే విషయం తమ దృష్టికి రాలేదని, దీనిపై సీఎం సిద్దరామయ్యతో చర్చిస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిత్యం రాష్ట్రానికి 10 వేల సిలిండర్లు అందిస్తుందని మంత్రి తెలిపారు. అదనంగా 20 శాతం సిలిండర్లు ఇస్తామని తెలిపిందన్నారు. కేంద్రం నుంచి రోజూ 10 వేల సిలిండర్లు పౌరసరఫరాల మంత్రి మునియప్ప -
ప్రభుత్వానికి నా బలం చూపిస్తా: రేవణ్ణ
శివాజీనగర: అత్యధిక బడ్జెట్సార్లు బడ్జెట్ను సమర్పించి రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య అత్యధిక అప్పులు చేసిన సీఎం కూడా అయ్యారు అని బీజేపీ ఎమ్మెల్యే సునీల్కుమార్ విధానసభలో ఆరోపించారు. రెండురోజుల విరామం తరువాత సోమవారం అసెంబ్లీ సమావేశాలు ఆరంభమయ్యాయి. ఆర్థిక పరిస్థితి మీద ప్రతిపక్షాలు ప్రశ్నల వర్షం కురిపించాయి. బడ్జెట్పై చర్చలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే సునీల్, సిద్దరామయ్య ప్రభుత్వం వచ్చాక రూ. 1.32 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఇదో రికార్డు, అంతే కాకుండా అధిక సమస్యలను సృష్టించిన సీఎం కూడా ఆయనే అని ఆరోపించారు. బడ్జెట్లో 56 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. అయితే అందుకు నిఽధులను కేటాయించలేదు, దీనిని బట్టి ఉద్యోగాల భర్తీ అనేది అబద్ధమన్నారు. ధర్నాలు చేసిన నిరుద్యోగ యువతను బుజ్జగించేందుకు ఉద్యోగాల భర్తీ అన్నారు, నిధులు లేకుండా ఎలా సాధ్యమని విమర్శించారు. కులగణన ఏమైంది? వీబీజీ రామ్ జీని వ్యతిరేకిస్తున్న సిద్దరామయ్య నరేగా కింద పెండింగ్లో ఉన్న 5 లక్షల పనులకు నిధులు ఇవ్వలేదని సునీల్ ఆరోపించారు. గృహలక్ష్మీ పథకం పెండింగ్ కంతుల గురించి ఊసే లేదన్నారు. సిద్దరామయ్య బడ్జెట్లో కొత్త కొత్త శబ్దాలను వినియోగించారు, వచ్చే బడ్జెట్లో శబ్ధకోశం అవసరముంది. సభాపతి శబ్ధకోశాన్ని పంపిణీ చేయాలి అని వ్యాఖ్యానించారు. సీఎం హడావుడిగా కులగణన జరిపించారు, ఇది ముగిసి 7 నెలలు గడచినా కూడా ఆ నివేదిక ఏమైందనేది తెలియదని ఆయన మండిపడ్డారు. కులగణనకు రూ.500 కోట్లు ఖర్చు చేశారన్నారు. బడ్జెట్లో కులగణన గురించి ప్రస్తావనే లేదన్నారు. వెనుకబడిన 177 తాలూకాలకు ప్రత్యేక నిధులను కేటాయించలేదన్నారు. ఎస్సీ ఎస్టీల అంతర్గత రిజర్వేషన్ల వివాదాన్ని ఇంతవరకూ పరిష్కారం చేయలేదన్నారు. ఖాతాల్లో అవినీతి మాకు కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానం వద్దు, రాష్ట్ర విద్యా విధానాన్ని అమలుపరుస్తామని చెప్పారు, బడ్జెట్లో ఆ విధానం ఏమిటో ప్రకటించలేదన్నారు. రెవెన్యూ శాఖలో కంప్యూటర్ సర్వర్ల సమస్య నెలకొంది, పల్లెలే కాదు, బెంగళూరులో ఖాతా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. ఈ ఖాతాల్లో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. టాక్సీ డ్రైవర్లు ప్యానిక్ బటన్ అమర్చుకోవాలన్నారు, వాటి ధర చాలా ఎక్కువ, పేద డ్రైవర్లు ఎలా భరిస్తారని ఆయన ప్రశ్నించారు. సిద్దరామయ్య ఖరీదైన శాలువా వేసుకొని తిరుగుతూ రాష్ట్ర ప్రజలపై అప్పులు మోపుతున్నారని దుయ్యబట్టారు. కేంద్రం నుంచి రూ.19వేల కోట్లు రావాలి దొడ్డబళ్లాపురం: జలజీవన్ మిషన్ కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.19,101 కోట్లు నిధులు రావాల్సి ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్ఎన్ నారాయణస్వామి అసెంబ్లీలో తెలిపారు. కేంద్రం ఇప్పటి వరకూ రూ.11,770 కోట్లు విడుదల చేసిందన్నారు. రూ.12 వేల కోట్లతో బెంగళూరులో మెట్రో రైలు మార్గాన్ని 96 కిలోమీటర్లు పెంచుతున్నామన్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తగ్గించారని, దీంతో రాష్ట్రానికి రూ.15 వేల కోట్ల నష్టం కలిగిందన్నారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యేలు,ఎంపీలు మాట్లాడక పోవడం బాధాకరమన్నారు. సర్కారీ ఆస్పత్రుల్లో మందుల్లేవుదొడ్డబళ్లాపురం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మందుల సమస్య లేకుండా చేసేందుకు జూన్ నెలలోనే మందుల కొనుగోలుకు టెండర్లు పిలుస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావ్ తెలిపారు. విధాన పరిషత్లో జిల్లాస్పత్రుల్లో మందుల కొరత తీవ్రంగా ఉందని కొందరు సభ్యులు తెలిపారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతాల్లో జ్వరం, న్యుమోనియా, కుక్కకాటు మందులు దొరకడం లేదన్నారు. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇందుకు మంత్రి పై సమాధానం ఇచ్చారు. ఆస్పత్రులకు 234 రకాల మందులను సరఫరా చేస్తున్నామన్నారు. సమస్యల ఊసులేని బడ్జెట్ విధానసభలో బీజేపీ ధ్వజం దొడ్డబళ్లాపురం: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని, 2028లో తన బలం ఏంటో కాంగ్రెస్కి తెలుస్తుందని మాజీ మంత్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ అన్నారు. సోమవారంనాడు అసెంబ్లీలో మాట్లాడిన ఆయన తనను సంబంధం లేని కేసుల్లో ఇరికించారని మండిపడ్డారు. హోంమంత్రి పరమేశ్వర్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. హాసన్ జిల్లాలో ప్రతిపక్షాల నేతలను,కార్యకర్తలను వేధిస్తున్నారన్నారు. తనపై ఇంకా 10 కేసులు పెట్టినా భయపడేది లేదని, తనను అణచివేయడం ఎవరివల్లా కాదన్నారు. హాసన్ జిల్లాలో రెవెన్యూ శాఖలో సుమారు రూ.3 వేల కోట్ల మేరకు అవినీతి జరిగిందని, తమ జిల్లాలో భూకబ్జాలు మితిమీరిపోయాయన్నారు. అధికారులు రియల్ ఎస్టేట్ మాఫియాతో కుమ్మక్కయ్యారన్నారు. -
ఉద్యోగినుల ఆరోగ్య రక్షణే పాలనకు పునాది
హొసపేటె: మహిళా ఉద్యోగులు ఆఫీసు పని హడావిడిలో వారు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం లేదు. ఆరోగ్యంగా ఉన్న ఉద్యోగులు మాత్రమే ప్రజలకు మంచి సేవలు అందించగలరని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి అభిప్రాయపడ్డారు. నగరంలో సోమవారం రోటరీ ఆస్పత్రిలో నిర్వహించిన మహిళా ఉద్యోగులకు ప్రత్యేక వైద్య పరీక్ష శిబిరాన్ని ప్రారంభిస్తూ ఆమె మాట్లాడారు. మహిళ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండటానికి కనీసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమగ్ర ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, శారీరక అనారోగ్యాల కంటే పని ఒత్తిడి మానసిక ఆరోగ్యానికి ఎక్కువ హానికరం అని సలహా ఇచ్చారు. అందువల్ల ప్రతి మహిళా ఉద్యోగి రోజుకు కనీసం అరగంట యోగా, ధ్యానం కోసం కేటాయించాలి. ఇది రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను నియంత్రించడంలో సహాయపడుతుంది. హొసపేటె ఇన్నర్వీల్ క్లబ్ అధ్యక్షురాలు నైమిష, కార్యదర్శి డాక్టర్ ఆర్తి రాజ్పూత్, ఆయుష్ శాఖ వైద్య అధికారి డాక్టర్ మునివాసుదేవ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. -
కొబ్బరి కాయల ధర పతనం
● పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో ఆగిన ఎగుమతులు ● పడిపోయిన డిమాండ్ ● లబోదిబోమంటున్న రైతులు హొసపేటె: ఏ రుచికరమైన వంట చేయాలన్నా కొబ్బరి వాడకం తప్పనిసరి. ఇక పూజల్లో టెంకాయలను విరివిరిగా వాడుతుంటాం. అలాంటి కొబ్బరి కాయల ధరలు అకస్మాత్తుగా పడిపోయాయి. దీనికి కారణం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రధానం కారణం అని చెప్పుకోవచ్చు. యుద్ధం ప్రభావం సామాన్య రైతులపై కూడా పడింది. కొబ్బరి కాయలను మన దేశం నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసేవారు. యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం ఎగుమతులు ఆగిపోవడంతో కొబ్బరి కాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. ఎగుమతి కావాల్సిన కొబ్బరి అంతా స్థానిక మార్కెట్లకు చేరుతోంది. దీనివల్ల మార్కెట్లో సరుకు ఎక్కువై డిమాండ్ పడిపోయింది. ఉత్తర కర్ణాటకలో గత రెండు వారాలుగా ధరలు పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి క్వింటాల్కు రూ.2,000 మేర ధర తగ్గింది. క్వింటాల్కు రూ.7,000 నుంచి రూ.4,500లకు పడిపోయింది. కొబ్బరి కాయ సైజ్ను బట్టి రూ.30 నుంచి రూ.20 వరకూ విక్రయిస్తున్నారు. గత ఏడాది తమ వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధరలు పొందుతున్న రైతులు, ప్రస్తుత మార్కెట్ పరిణామాలతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోతుల బెడదతో కొబ్బరి పంట ఇప్పటికే తీవ్రంగా దెబ్బతింటోంది. ఎంత తగ్గుదల? విజయనగర జిల్లాలో హొసపేట, అగిరి బొమ్మనహళ్లి, కూడ్లిగి, అడగళి, కొట్టూరులో కొబ్బరి మార్కెట్లు ఉన్నాయి. గత సంవత్సరం జనవరిలో, లేత కొబ్బరి మార్కెట్లో క్వింటాల్ కొబ్బరి ధర సుమారు రూ.5,500 నుంచి రూ.6,000 మధ్య ఉండేది. అది క్రమంగా పెరిగి, కొన్ని నెలల పాటు ధర రూ.7 వేలు కూడా దాటింది. ఆ తర్వాత అది కొద్దిగా తగ్గి, సుమారు రూ.6,500 నుంచి రూ.7,000 చేరుకుంది. ఎగుమతులు లేకపోవడం, దిగుబడుల్లో హెచ్చుతగ్గులు, పండుగల నేపథ్యంలో ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం సగటు ధర క్వింటాల్కు రూ.5,000 కంటే తక్కువకు పడిపోయింది. కనిష్ట ధర రూ.4,500గా నమోదైంది. కొబ్బరి ఉత్పత్తుల ఎగుమతికి అంతరాయం కలగడంతో కొనుగోలుదారులు వెనుకాడుతున్నారని రైతులు చెబుతున్నారు. -
యాదగిరి జిల్లాలో కుల వివక్ష
● దేవాలయం మెట్లపై కూర్చున్నందుకు దళిత యువకులపై దాడి సాక్షి, బళ్లారి: సమాజం ఆధునికత వైపు అడుగులు వేస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కుల వివక్ష కొనసాగుతోంది. తాజాగా యాదగిరి జిల్లాలో దేవాలయం మెట్లపై కూర్చున్న ఇద్దరు దళిత యువకులపై దాడి జరిగింది. యాదగిరి జిల్లా గురమిటకల్ తాలూకా యంపాడ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యంపాడ గ్రామంలో శుభకార్యం నిమిత్తం విచ్చేసిన అనిల్ కుమార్, సిద్ధలింగప్ప అనే ఇద్దరు దళిత యువకులు ఎండవేడిమి తట్టుకోలేక సమీపంలో దేవాలయం మెట్లపై కూర్చొన్నారు. అదే సమయంలో దేవాలయ పూజారి అక్కడ ఎందుకు కూర్చొన్నారని వాదించాడు. అనంతరం పక్కనే ఉన్న కొందరు యువకులు కలగచేసుకుని పూజారితో కలిసి దళిత యువకులపై దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన దళిత యువకులను చికిత్స నిమిత్తం యాదగిరి ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాహిత్యంపై ఆసక్తి పెంచుకోండి హొసపేటె: ఆధునిక పరిజ్ఞాన యుగంలో నేటి యువత సాహిత్య రంగాలపై ఆసక్తి చూపించాలి. సాహిత్య రంగాలను మరింత అభివృద్ధి చేసేందుకు నడుం బిగించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత జోగతి మంజమ్మ తెలిపారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం, నూర్ జహాన్ షష్టి పూర్తి కార్యక్రమం సందర్భంగా సండూర్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో ఆశా ప్రకాశన్–సిద్ధలింగప్ప చౌకి ఆధ్వర్యంలో పుస్తక ఆవిష్కరణ, కవి సమ్మేళనం నిర్వహించారు. పాఠకులను ఆకట్టుకునే పుస్తకాలకు సమాజంలో మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు. ఉత్తమ పుస్తకాలు నిరంతరం వెలుగులోకి రావాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో జిల్లా సాహిత్య పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ నిష్టి రుద్రప్ప, రచయితలు డాక్టర్ ముంతాజ్బేగం, సుధా, చిదానంద గౌడ వెంకమ్మ చంద్రశేఖరయ్య రొనద మఠ్, షేక్షావలి మణిగర్, యత్నల్లి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఉల్లాసంగా క్రీడా పోటీలు బళ్లారి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం బళ్లారి జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సదరు సంఘం జిల్లా అధ్యక్షుడు నెలకుంద్రి సదానంద మాట్లాడుతూ.. ఉద్యోగ నిర్వహణలో ఉద్యోగులు వివిధ రకాల ఒత్తిళ్లు, సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటారన్నారు. నేపథ్యంలో ఆడ విడుపుగా వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటు ఉద్యోగ నిర్వహణ, అటు కుటుంబ బాధ్యతలు రెండింటిలోనూ మహిళలు రాణిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. పలువురు మహిళలు పోటీల్లో ఉల్లాసంగా పాల్గొని అందరికి స్ఫూర్తినిచ్చారు. కార్యక్రమంలో ఆ సంఘం ప్రముఖులు తిప్పారెడ్డి, హనుమంతరాయ సురేష్ కుమార్, ఎంటి మల్లేశ్, రాజశేఖర గాణిగెర, రామకృష్ణ, విజయ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఏడు శాతం రిజర్వేషన్ కల్పించాలి రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం నాయక్లకు ఏడు శాతం రిజర్వేషన్ కల్పించిన అనంతరం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని కర్ణాటక వాల్మీకి మహర్శి నాయక్ పోరాట ఐక్యవేదిక మహాసభ సంచాలకుడు వి.ఎస్.ఉగ్రప్ప పేర్కొన్నారు. ఆదివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నాయక్లకు 7 శాతం రిజర్వేషన్ కేటాయింపు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపకుండా కాలయాపన చేయడం తగదన్నారు. రాజకీయాలకు అతీతంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె.శివ కుమార్ వెంటనే అఖిలపక్ష నాయకులతో, ప్రధానమంత్రితో చర్చించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర సర్కార్లు నాయక్ సమాజంపై మౌనం వహిహించడం తగదన్నారు. సమావేశంలో వరదానేశ్వర స్వామి, సంజయ్ కుమార, రాజశేఖర్ నాయక్, రఘవీర్ నాయక్, వెంకటేష్ నాయక్, రాజప్ప, హనుమంతరాయ, రాజణ్ణ తదితరులు పాల్గొన్నారు. -
వార్డుల్లో కనీస వసతులు కల్పించాలి
సాక్షి, బళ్లారి: తమ వార్డు పరిధిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే నారా భరత్రెడ్డికి మహిళలు విన్నవించారు. ఆదివారం నగరంలోని 18వ వార్డు పరిధిలో ఉన్న వివిధ కాలనీల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఆయా కాలనీలకు చెందిన ప్రజలు ఎమ్మెల్యే వద్దకు వచ్చి సమస్యలు విన్నవించుకున్నారు. వార్డులో డ్రైనేజీ, రోడ్లు, రాజాకాలువ అధ్వానంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి నీటి సమస్య తాండవిస్తోందన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వార్డుల్లో సమస్యలు పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వేసవిలో మంచి నీటి సమస్య తలెత్తకుండా అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. నీటి సమస్య తలెత్తితే తమ దృషికి తీసుకురావాలని సూచించారు. ప్రతి కాలనీల్లో సీసీ రోడ్డు, డ్రైనేజీ వసతి, మంచినీటి సమస్య తీర్చేందుకు తగిన చొరవ తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నందీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవింద్, గుంతకల్లు సురేష్, కట్టమనే నాగేంద్ర, బసిలహళ్లి మంజు తదితరులు పాల్గొన్నారు. వైభవం.. పుష్ప పల్లకీ ఉత్సవం శ్రీనివాసపురం: పట్టణంలోని కాళికా కమటేశ్వరి అమ్మవారి పుష్ప పల్లకీ ఉత్సవాన్ని శనివారం రాత్రి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం అమ్మవారికి విశేష పూజలు చేశారు. రాత్రికి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ఉంచి పట్టణంలోని వీధుల్లో ఊరేగించారు. దేవాలయ ప్రధాన అర్చకులు మోహనాచారి, రవీంద్రాచారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు చేపట్టారు. -
లకామాపురలో విషాదం
హుబ్లీ: రంజాన్ పండుగ రోజు లకామాపురంలో విషాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. కెలగెరి వంతెన వద్ద జరిగిన ఈ ప్రమాదంలో లకామాపుర నివాసి ఇమామసాబ్ హెబ్బళి (21) అతడి స్నేహితుడు, మోహ నివాసి యునుస్ ముల్లానవర (17) మృతి చెందారు. ఈ ఘటనతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఇమామ్ సాబ్ అన్న పెళ్లి నిశ్చయం అయిన కబ్బార గణవిలోని ఇంటికి పండుగ సందర్భంగా ప్రార్థనల కోసం స్నేహితులతో కలిసి వెళ్లారు. పని ముగించుకుని బైక్లో వస్తుండగా కెలగెరి వంతెన వద్ద గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇమామ్ సామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడి యూనుస్ను నగరంలో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. బైక్ను ఢీకొట్టిన అనంతరం సదరు గుర్తు తెలియని వాహనం ఆపకుండా వెళ్లిపోయింది. సదరు వాహన డ్రైవర్ కోసం ధార్వాడ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా పండుగ రోజే ఇద్దరు యువకులు మృత్యువాత పడటంతో లకామాపురలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు దుర్మరణం -
క్రీడల్లో గెలుపోటములు సమానం
కోలారు: క్రీడలతో ఆరోగ్యంగా ఉండవచ్చు. క్రీడలు మానసిక, దైహిక ఆరోగ్యానికి, నాయకత్వ లక్షణాలు పెంపొందడానికి ఎంతో సహకారి అవుతాయని జేడీఎస్ నాయకుడు సీఎంఆర్ శ్రీనాథ్ తెలిపారు. ఆదివారం తాలూకాలోని దొద్దహసాళ గ్రామంలో గంగోత్రి క్రికెటర్స్ యువకర బళగ ఆధ్వర్యంలో క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు కొరత లేదన్నారు. వారిలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. క్రీడల్లో గెలుపోటములు సమానం అని తెలిపారు. -
శికారిపురలో చిరుతల హల్చల్
శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలోని శికారిపుర తాలూకాలోని తడసనహళ్లి, అడగంటి, ముత్తగి గ్రామాల్లో శనివారం ఒక్కరోజే ముగ్గురిపై చిరుతపులి దాడి చేయగా, వారిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ● అడగంటి గ్రామానికి చెందిన సుదీప్ సాయంత్రం ముత్తగి గ్రామం సమీపంలోని మొక్కజొన్న పొలానికి వెళ్లగా చిరుత అతనిపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతను శివమొగ్గలోని మెగ్గన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ● శనివారం ఉదయం తన వరి పొలానికి నీరు పెట్టడానికి వెళ్లిన తడసనహళ్లి గ్రామ రైతు ముత్తన్నపై చిరుత దాడి చేసింది. కొరికి, గోళ్లతో రక్కడంతో తీవ్రంగా గాయపడిన అతడిని కూడా తదుపరి చికిత్స కోసం మెగ్గన్ ఆసుపత్రిలో చేర్చారు. ● సాయంత్రం, తడసనహళ్లి, అడగంటి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై బైక్పై వెళ్తున్న హూవ్య నాయకపై కూడా చిరుత దాడి చేయగా, స్వల్ప గాయాలు అయ్యాయి. బోనులు ఏర్పాటు దాడులతో మేలుకున్న అటవీ సిబ్బంది చిరుతను పట్టుకోవడానికి తాడసనహళ్లిలో పొలాలు, తోటల్లో 3 చోట్ల బోనులను ఏర్పాటు చేశారు. చిరుతలు అరుదుగా మనుషులపై దాడి చేస్తాయి, దానికి ఏదైనా వ్యాధి సోకి ఉండవచ్చు లేదా ఆందోళనకు గురై మనుషులపై దాడి చేసి ఉండవచ్చు అని జోనల్ ఫారెస్ట్ ఆఫీసర్ జావిద్ అంగడి చెప్పారు. అయితే రైతులు పొలాలకు వెళ్లడానికి భయపడుతున్నారు. వేర్వేరుచోట్ల ముగ్గురిపై దాడులు -
బంగారం ఇస్తామని మోసగించిన నిందితుల అరెస్ట్
హొసపేటె: బంగారం ఇస్తామని చెప్పి ఓ వ్యక్తి నుంచి రూ.30 లక్షలు దోచుకుని పరారైన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడంలో హోసహళ్లి పోలీసులు విజయం సాధించారు. నిందితుల నుంచి రూ.29,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. చైన్నెలోని అయ్యప్పాక్కం నివాసి అయిన జి.కుమార్కు లింగనహళ్లిలోని కొరచరహట్టికి చెందిన సురేష్ అలియాస్ రమేష్, సోమన్నతో పరిచయం ఉంది. తమకు ఇంటి కూల్చివేత సమయంలో సుమారు కిలో బంగారు ఆభరణాలు దొరికాయని రమేష్, సోమన్న నమ్మబలికారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు బంగారం ఇస్తామని కుమార్కు చెప్పారు. జనవరి 28న కాయసనకెరె గ్రామం సమీపంలోని ఒక అటవీ ప్రాంతానికి వస్తే బంగారు ఆభరణాలు ఇస్తామని తెలిపారు. అక్కడికి చేరుకున్న కుమార్ నుంచి నిందితులు బలవంతంగా రూ.30 లక్షలు లాక్కొని పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించి మార్చి 14న హోసహళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. విజయనగర జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎస్.జాహ్నవి, అదనపు పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ మంజునాథ్ మార్గదర్శకత్వంలో ఈ కేసు దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు నిందితులు సురేష్ అలియాస్ రమేష్, సోమన్నను అరెస్ట్ చేశారు. కూడ్లిగి డీవైఎస్పీ మల్లేష్ దొడ్డమణి నేతృత్వంలో కొట్టూరు సీపీఐ దురుగప్ప, పీఎస్ఐ సిద్ధరామ బిదరాని, సిబ్బంది సభ్యులు అంజన మూర్తి, మంజునాథ్, సురేష్ సహా పలువురు ఆపరేషన్లో పాల్గొన్నారు. రూ.29.50 లక్షల నగదు స్వాధీనం -
చురుకుగా గండి పూడ్చివేత పనులు
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువకు గండి పడిన ప్రాంతంతో మరమ్మతులు చురుకుగా కొనసాగుతున్నాయి. రాయచూరు జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు తుంగభద్ర డ్యాం నుంచి ఈనె 11 తేదీన కాలువ ద్వారా 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కొప్పళ తాలుకా బసాపూర్ వద్ద కాలువకు గండి పడటంతో నీరు వృథాగా ప్రవహించిన విషయం తెలిసిందే. మంత్రుల ఆదేశాలతో 60 అడుగుల మేర కాలువ కోతను పూడ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. టిప్పర్లతో మట్టిని తీసుకెళ్లిని గండిని పూడుస్తున్నారు. గండి పూడ్చివేత పనులను త్వరగా పూర్తి చేస్తామని సంబంధిత శాఖ ఇంజనీర్లు తెలిపారు. -
ఆరోగ్య సాధనకు యోగాభ్యాసం
మైసూరు: నేటి వేగవంతమైన జీవితం వల్ల కలిగే ఒత్తిడిని నివారించడానికి యోగా సహాయపడుతుందని, నెమ్మదైన జీవనశైలిని పాటించడం ద్వారా మంచి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వక్తలు పేర్కొన్నారు. జిల్లాలోని నంజనగూడులో దక్షిణ కాశీగా పేరుపొందిన శ్రీకంఠేశ్వర ఆలయం ముందు ఆదివారం గరళ్పురి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా వందలాది మందితో సామూహిక యోగాభ్యాసం జరిగింది. జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు గొప్ప ఓర్పును యోగా ఇస్తుందని, నిత్యం యోగా సాధన చేయాలని గురువులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధృవ నారాయణ పాల్గొన్నారు. నంజనగూడును యోగా నగరంగా తీర్చిదిద్దడమే తమ ఆశయమన్నారు. మహాశివుడు విషాన్ని తన కంఠంలో దాచుకుని గరళకంఠుడు అయ్యాడని, అందుకు గుర్తుకు శ్రీకంఠేశ్వరుని సన్నిధిలో గరళ్పురి ఉత్సవాలను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. పలువురు స్వామీజీలు, ప్రముఖులు పాల్గొన్నారు. నంజనగూడులో గరళ్పురి ఉత్సవాలు -
సాహిత్య సేవలు అనన్యం
రాయచూరు రూరల్: సన్మానాలు ముఖ్యం కాదు.. సాహ్యిత సేవలు అనన్యమని కవయిత్రి హెచ్.జి.లక్ష్మి తెలిపారు. ఆదివారం కన్నడ భవనంలో జిల్లా, తాలుకా కన్నడ సాహిత్య పరిషత్తు ఆధ్వర్యంలో బరగూరు రామచంద్రప్ప దత్తి అవార్డు అందుకుని ప్రసంగించారు. సాహిత్యం రాసే ముందు భావితరాల వారికి ఉపయెగపడే విధంగా చూడాలన్నారు. కవులకు హెచ్.జి.రాధా దేవి మార్గదర్శి అని.. కవితలు సమాజానికి పనికొచ్చేలా ఉండాలని తెలిపారు. యువకుల మనస్సులను దోచే విధంగా పుస్తకాలు రాయాలని సూచించారు. కార్యక్రమంలో రంగణ్ణ పాటిల్, బాబు బండారీ గల్, భీమన గౌడ, లక్ష్మీదేవి శాస్త్రి, విజయ రాజేంద్ర, దానమ్మ, వీర హనుమాన్, రావుత్ రావు, దండెప్ప బిరదార్ పాల్గొన్నారు. బేగం తలాబ్ వాటర్ పార్కు ప్రారంభం రాయచూరు రూరల్: వేసవి కాలంలో పిల్లలు, యువత సేద తీరేందుకు విజయపుర (బీజాపూర్)లోని బేగం తలాబ్ చెరువు సమీపంలో కొత్తగా ఒక వాటర్ పార్క్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ వెల్లడించారు. శనివారం సాయంత్రం విజయపుర బేగం తలాబ్ చెరువు వాటర్ పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో వేసవి తాపాన్ని తట్టుకోవడానికి తోడు మూడు నెలల పాటు వేసవిలో కాలక్షేపం కోసం బేగం తలాబ్ వాటర్ పార్కును ప్రారంభించడం జరిగిందన్నారు. వివిధ రకాలైన జల క్రీడలు ఆడేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. 31న మహిళా దినోత్సవం రాయచూరు రూరల్: ఈనెల 31న ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ శావంత గేర పేర్కొన్నారు. ఆదివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 31న పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, మహిళా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సావిత్రి బాయి పూలే సంఘం ఆద్వర్యంలో జరిగే కార్యక్రమంలో మహిళలను సన్మానించడం జరుగుతుందన్నారు. వారం రోజుల పాటు మహిళలకు క్రీడలు, సాంస్క్రతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో రత్న, చాయదేవి, జయశ్రీ, యంకప్ప, సంతోష్, నీలమ్మ, రాజ శేఖర్, సరసుబాయి పాల్గొన్నారు. జై భజరంగ భళిరాయచూరు రూరల్: నగరంలోని జవహర్ నగరలో భజరంగి యువసేన ఆధ్వర్యంలో శనివారం రాత్రి సీతారామ కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా భారీ భజరంగ బళి (ఆంజనేయుడు) విగ్రహాన్ని ఊరేగించారు. వివిధ కూడళ్లలో ఆంజనేయుడిని దర్శించుకున్న భక్తులు పూజలు చేశారు. శ్రీరామ నవమి ఉత్సవాలకు అందరు సిద్ధం కావాలని భజరంగి బళి యువసేన నాయకులు పిలుపునిచ్చారు. పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ప్రాధాన్యత రాయచూరు రూరల్: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లోని పవిత్ర ధర్మ స్థలాలు, దేవాలయాల, యాత్రికుల సంక్షేమానికి ప్రాధాన్యత కల్పించిందని కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు లక్ష్మీకాంత రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం, వారణాసి, తుళజా భవాని యాత్రికుల భవన నిర్మాణాలు, మంత్రాలయంలో నూతన కర్ణాటక భవన నిర్మాణాలకు రాష్ట్ర ముుఖ్యమంత్రి సిద్దరామయ్య, దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి రామలింగా రెడ్డి సహకారంతో పనులకు నిధులు విడదుల చేశారన్నారు. మహ వైష్ణవి దేవి ఆలయ దర్శనం కోసం వెళ్లే భక్తులకు ప్రభుత్వం రూ.5 వేల ప్రోత్సాహక ధనం ఇస్తుందని వివరించారు. -
వాటి మధ్యనే తనువు చాలించి..
మూగజీవులను ప్రేమించి.. బొమ్మనహళ్లి: బెంగళూరు శివార్లలోని ఆనేకల్కు చెందిన పశు వైద్యురాలు డా.సమీక్షా రెడ్డి (27)కి కన్నీటితో వీడ్కోలు పలికారు. శుక్రవారం శివమొగ్గలోని త్యావరెకొప్ప పులి–సింహాల జూ పార్క్లో జంతువులకు చికిత్స చేస్తుండగా నీటి ఏనుగు (హిప్పో) దాడి చేయడంతో ఆమె తీవ్ర గాయాలతో కన్నుమూయడం తెలిసిందే. ఆనేకల్ తాలూకాలోని బన్నేర్ఘట్ట సమీపంలోని సకలవారలో శనివారం సాయంత్రం అంతిమ సంస్కారాలు జరిగాయి. సమీక్షారెడ్డి మృతదేహం గ్రామానికి చేరుకోగానే తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు పెట్టుకున్నారు. గ్రామంలో తీవ్ర విషాదం ఆవరించింది. గ్రామస్తులు, అటవీ సిబ్బంది ఆమె భౌతికాకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. తమ ఏకైక కుమార్తెను కోల్పోయిన తల్లిదండ్రులు ధృవకుమార్, శైలజను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. మూగజీవులంటే అమిత ప్రేమ సమీక్షారెడ్డికి చిన్నప్పటి నుంచే జంతువులు, పక్షులంటే అమితాసక్తి. ఆమె పట్టుదలతో చదివి పశు వైద్యురాలు అయ్యింది. ఆమె ఎంతో ఉత్సాహంతో పశువైద్య కోర్సును పూర్తి చేసి, పశుపక్ష్యాదుల సేవకు అంకితమైందని బంధువులు తెలిపారు. కానీ వాటి సేవలోనే అకాల మరణం చెందడం బాధాకరంగా ఉందని వాపోయారు. డా.సమీక్షారెడ్డికి కన్నీటి వీడ్కోలు -
టీబీ డ్యాంలో పూడికతీతపై పట్టించుకోరా?
సాక్షి, బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిధిలోని బళ్లారి, రాయచూరు, కొప్పళ, విజయనగర, అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాలకు తాగు, సాగు నీరందించే ఉమ్మడి ప్రధాన జలాశమైన తుంగభద్ర డ్యాంలో పూడికతీతపై మూడు రాష్ట్రాలకు చెందిన పాలకులు పట్టించుకోవడం లేదు. సవతి తల్లి ధోరణి అవలంభిస్తున్నారని తుంగభద్ర ఆయకట్టు రైతు సంఘం అధ్యక్షుడు దరూరు పురుషోత్తం గౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలోని పత్రికా భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తుంగభద్ర డ్యాం నుంచి ఏటా దాదాపు 300 టీఎంసీలకు పైగా నీరు వృథాగా కిందకు పోతోందన్నారు. శ్రీశైలం డ్యాంలోకి వెళ్లి అక్కడ నుంచి సముద్రంలోని నీరు చేరుతోందని తెలిపారు. వృథాగా వెళ్తున్న నీటిని నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. డ్యాం కట్టించి 76 సంవత్సరాలు దాటగా.. ఏటేటా డ్యాంలో పూడిక పెరిగిపోయిందన్నారు. ప్రారంభంలో డ్యాం గరిష్ట నీటి నిల్వ 133 టీఎంసీలు ఉండగా.. పూడిక చేరడంతో 101 టీఎంసీలకు చేరిందన్నారు. డ్యాంలో 30 టీఎంసీల మేర నీరు చేరడానికి వీలు లేకుండా పూడిక చేరిందని పేర్కొన్నారు. ఈసారి మళ్లీ మే నెలలో తుంగభద్ర డ్యాంలో నీటిని ఉపయోగిస్తున్న పరిశ్రమల యజమానులతో కలిసి పూడికతీత పనులు చేపడుతామన్నారు. పెద్ద ఎత్తున రైతులు పూడికతీత చేసేందుకు తరలివస్తారన్నారు. డ్యాంలో పూడిక తీసిన మట్టిన చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు ఉచితంగా తీసుకెళ్లవచ్చని తెలిపారు. తుంగభద్ర డ్యాం గేట్లకు అమర్చిన చైన్లను కూడా మార్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతుల సంఘం నాయకులు జాళిహాల్ శ్రీధర్, వీరనగౌడ, వీరభద్ర నాయక్, దరూరు వీరేష్ తదితరులు పాల్గొన్నారు. -
తీర్థయాత్రకు వెళ్తూ పరలోకాలకు
దొడ్డబళ్లాపురం: బెంగళూరు పరిధిలో యాక్సిడెంట్లతో రహదారులు నెత్తురోడాయి...మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 7 మంది దుర్మరణం చెందారు. యూ టర్న్లో విషాదం శనివారం అర్ధరాత్రి బెంగళూరు సమీపంలో దేవనహళ్లి సమీపంలోని రాణి క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు చనిపోగా, 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులను తుమకూరు జిల్లాలోని తిపటూరు తాలూకాకు చెందిన జయమ్మ(60), యశోదమ్మ (60), గంగ (38)గా గుర్తించారు. 12 మంది మహిళలు సీ్త్ర శక్తి సంఘంలో రుణం తీసుకుని కాశీతో పాటు ఉత్తర భారతదేశ యాత్ర చేయాలని నిర్ణయించారు. కెంపేగౌడ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం 6 గంటలకు విమానంలో బయలుదేరాల్సి ఉంది. ఇందుకోసం శనివారం రాత్రి 10గంటల సమయంలో బాడుగ టెంపో వాహనంలో ఎయిర్పోర్టుకు బయలుదేరారు. వాహనం డ్రైవర్కి ఈ దారి కొత్త కావడంతో మొబైల్లో గూగుల్ మ్యాప్ చూసుకుంటూ బయలుదేరాడు. దేవనహళ్లి రాణి క్రాస్ యూటర్న్లో గందరగోళానికి గురయ్యాడు. కాస్త ముందుకు వెళ్లి టర్న్ తీసుకోవడంతో వెనుక వేగంగా వస్తున్న లారీ వేగంగా ఢీకొంది. క్యాంటర్ పల్టీలు కొట్టగా అందులోని ముగ్గురు తీవ్ర గాయాలతో చనిపోయారు. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వంతెన మీద.. ముగ్గురు మృతి బెంగళూరు కేఆర్ పురం మేడళ్లి వద్ద శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. కేఆర్ పురం సమీపంలోని మేడళ్లి బ్రిడ్జ్పైన కోలారు నుండి ఉర్లగడ్డల లోడ్తో బెంగళూరుకు వస్తున్న ఈచర్ వాహనం పంక్చర్ కావడంతో రోడ్డుపక్కన నిలిపారు. అదే సమయంలో హొసకోట నుంచి కేఆర్ పురం వస్తున్న టాటా ఇంట్రా వాహనం ఈచర్ను వెనుక నుంచి వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో వైట్ ఫీల్డ్కి చెందిన మణికంఠ, సురేశ్, శ్రీనివాస్ అనే ముగ్గురు చనిపోయారు. ● బెంగళూరు ఇస్కాన్ వద్ద కమలమ్మనగుండి సమీపంలో 24 ఏళ్ల యువకుడు బైక్ పై వస్తూ డివైడర్ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడే మరణించాడు. ఈ ప్రమాదాలపై స్థానిక పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. మహిళలతో విమానాశ్రయానికి వస్తున్న టెంపోను లారీ ఢీ ముగ్గురు మహిళలు దుర్మరణం 8 మందికి తీవ్ర గాయాలు దేవనహళ్లి వద్ద ప్రమాదం


