Karnataka Latest News
-
అంబేడ్కర్కు నివాళులు
బనశంకరి: బెంగళూరులో అంబేడ్కర్ ప్రదర్శనశాలను నెలకొల్పాలని కర్ణాటక బహుజన సమాఖ్య(కేబీఎఫ్) రాష్ట్రాద్యక్షుడు, సేవారత్న జీహెచ్.శంకర్ డిమాండ్ చేశారు. విధానసౌధ వద్ద డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. బెంగళూరులో 50 ఎకరాల విస్తీర్ణంలో 200 అడుగుల డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ విగ్రహం, జీవిత చరిత్ర తెలియజేసే ప్రత్యేక ప్రదర్శనశాల ఏర్పాటు చేయాలన్నారు. విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో ఎత్తైన అంబేడ్కర్ విగ్రహాలు ఉన్నట్లు తెలిపారు. బైకును ఆటో ఢీకొని ఒకరికి గాయాలుచింతామణి: అతివేగంగా వచ్చిన ఆటో బైకును ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఉప్పారపేట దగ్గర సోమవారం తెల్లవారు జామున జరిగింది. వివరాలు.. శిడ్లఘట్ట నుంచి చింతామణికి వస్తున్న ఆటో తాలూకాలోని నాయనహళ్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి బెంగళూరుకు బైకులో వెళుతుండగా ప్రమాదం సంభవించడంతో బైకు ఆటో డీకొన్న ప్రమాద తీవ్రతకు నుజ్జునుజ్జుయింది. బైకు చోదకుడు శ్రీకాంత్ తీవ్రంగా గాయపడడంతో చింతామణి డాక్టర్లు ప్రధమ చికిత్స నిర్వహించి పరిస్ధితి విషమంగా ఉండడంతో బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ తప్పించుకొని పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
వైభవంగా కరగ ఉత్సవం
కోలారు: నగరంలోని కఠారు పాళ్యలో ఉన్న ద్రౌపదమ్మ దేవి ఆలయంలో ఆదివారం రాత్రి కరగ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవాలయంలో కరగకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పూజారి కరగను తలపై మోసుకుని వచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై మేళతాళాలకు అనుగుణంగా చేసిన నృత్యం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. పెద్ద సంఖ్యలో నగర ప్రజలు కరగ ఉత్సవాన్ని చూడడానికి తరలి వచ్చారు. కరగలో వీర కుమారుల గోవింద నామ స్మరణ మారుమోగింది. దళిత నాయకుల ధర్నా కోలారు: అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని తమను పరిగణనలోకి తీసుకోకుండా నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ ఆవణి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు సోమవారం ధర్నా చేశారు. ఆవణిలో అంబేడ్కర్ జయంతిని ఆచరించే విషయంలో, తాలూకా కేంద్రానికి పల్లకీని పంపించడంలో దళిత సముదాయాన్ని పంచాయతీ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. పంచాయతీ పీడీఓను బదిలీ చేసి దళిత సముదాయానికి క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. ఫిర్కా కేంద్రం అయిన ఆవణి గ్రామం నుంచి తాలూకాకు పల్లకీని పంపించాల్సి ఉండగా ఈ విషయంలో పీడీఓ దళిత సముదాయాన్ని సంప్రదించలేదన్నారు. అనంతరం టీపీ ఈఓ సర్వేష్ గ్రామానికి వెళ్లి ఆందోళనకారులతో చర్చించి ఆందోళన విరమింప చేశారు. -
అంబేడ్కర్ జయంతిలో ఒక్కటైన జంట
రాయచూరు రూరల్ : ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వివాహాలు చేసుకోవడం జరుగుతుంది. కొందరు సామూహికంగా దేవాలయాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేసుకుంటారు. అయితే డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా ఓ జంట ఒక్కటైంది. సోమవారం అంబేడ్కర్ వృత్తం వద్ద అంబేడ్కర్ ప్రతిమ ముందు బంతేజాలు, ధర్మభిక్షువులు, ప్రజల సాక్షిగా రాయచూరు నందీశ్వరాలయం వద్ద అయ్యణ్ణ, ఆమె అక్క కూతురు శాంభవి అనే ఓ జంట దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ పట్టి, భాస్కర్, సంతోష్, వెంకటేష్, విశ్వనాథ్ పట్టిలున్నారు. ఆర్టీపీఎస్లో అగ్నిప్రమాదం..భారీ నష్టం● నాలుగో యూనిట్లో విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్ రాయచూరు రూరల్: రాయచూరు ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం(ఆర్టీపీఎస్)లో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగో యూనిట్లో వేసవి తాపం అధికం కావడంతో అగ్ని ప్రమాదం జరిగి జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా కాలిపోయింది. దీంతో రూ.కోట్లాది మేర నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. మూడు నెలల నుంచి చెడిపోయిన బాయిలర్ ట్యూబ్ను మార్పు చేసి ఆదివారం ఉదయం దానిని ప్రారంభించారు. ఆకస్మికంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుని ఆర్టీపీఎస్లో నాలుగో యూనిట్లో 210 మె.వా. విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఎదురైంది. వైభవంగా రామలింగేశ్వర రథోత్సవం రాయచూరు రూరల్: నగరంలోని ఐబీ రోడ్డులో రామలింగేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. ఆదివారం రాత్రి వేలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం నిర్వహించారు. నగరంలో వెలసిన రామలింగేశ్వర ఆలయంలో సోమవారపేట మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్య, శాంతమల్ల శివాచార్య, వీరసంగమేశ్వర శివాచార్య ప్రత్యేక పూజలు నెరవేర్చారు. రథోత్సవంలో వీరశైవ సమాజం జిల్లాధ్యక్షుడు శరణు భూపాల నాడగౌడ, కల్లయ్య, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సభా వేదికపైకి దూసుకెళ్లి హల్చల్రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా లింగసూగూరులో ఆదివారం రాత్రి హిందూ సామ్రాజ్యోత్సవ కార్యక్రమంలో సభా వేదికపైకి ఉన్నఫళంగా ఓ వ్యక్తి దూసుకెళ్లి హల్చల్ చేసిన ఘటన సంభవించింది. విజయపుర శాసన సభ్యుడు బసవనగౌడ పాటిల్ యత్నాళ్ మాట్లాడుతుండగా శ్రీనివాస్ పూజారి అనే వ్యక్తి కత్తి పట్టుకొని వేదికను అలంకరించడంతో అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. సమావేశంలో గందరగోళం రేపిన శ్రీనివాస్ను పోలీసులు పట్టుకొని విచారణ చేపట్టినట్లు అదనపు ఎస్పీ హరీష్ తెలిపారు. కమిషనర్, ఎస్ఐలపై ప్రశంసలుహుబ్లీ: ఇంటి ముందు ఆడుకుంటున్న 5 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసి, ఆపై హత్య చేసిన నిందితుడిని ఎన్కౌంటర్లో హతం చేయడంపై పోలీస్ కమిషనర్ శశికుమార్, తుపాకీతో కాల్పులు జరిపిన అశోక్నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అన్నపూర్ణలపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసిన ప్రముఖ నటుడు ధృవసర్జ ఈ అధికారులిద్దరిని అభినందిస్తూ వారి బృందానికి అభినందనలు తెలిపారు. ఇలాంటి కిరాతకాలకు పాల్పడే సంఘ విద్రోహ శక్తులకు ఎన్కౌంటర్ ద్వారా హెచ్చరిక జారీ చేసినట్లయిందని ధృవసర్జ తన ట్వీట్లో పేర్కొన్నారు. -
ఆకట్టుకున్న పల్లకీల ఊరేగింపు
కోలారు : నగరంలో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, కన్నడ సంస్కృతి శాఖ, సాంఘీక సంక్షేమ శాఖ, వివిధ దళిత సంఘాల ఆధ్వర్వంలో అంబేడ్కర్ జయంతిని వైభవంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు జిలా ఇంఛార్జి మంత్రి భైరతి సురేష్ నగరంలోని బంగారుపేటె సర్కిల్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి మాలార్పణ చేసిన అనంతరం అంబేడ్కర్ పల్లకీల ఊరేగింపును ప్రారంభించారు. నగరంలోని ప్రధాన వీధుల్లో ఊరేగింపు బయలుదేరింది. డూం లైట్ సర్కిల్, ఎంజీ రోడ్డు, బస్టాండు సర్కిల్, మెక్కె సర్కిల్ మీదుగా టి.చెన్నయ్య రంగమందిరానికి చేరుకుంది. అక్కడ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 50కి పైగా పల్లకీలు ఊరేగింపులో సాగాయి. ఊరేగింపులో కళా బృందాల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఊరేగింపును ప్రారంభించిన అనంతరం మంత్రి భైరతి సురేష్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ మహా మానవతా వాది అనడంలో తప్పు లేదన్నారు. అణగారిన వర్గాల వారి అభ్యున్నతి కోసం ఆయన విశేషంగా కృషి చేశారన్నారు. సామాజిక తారతమ్యాన్ని రూపుమాపడానికి పాటు పడ్డారన్నారు. అంటరానితనానికి వ్యతిరేకంగా ఆయన నిరంతర పోరాటం సాగించారన్నారు. దళిత సముదాయానికి న్యాయం చేయడం, వారిని సమాజంలో ఉన్నత స్థానానికి తీసుకు రావడం ఆయన ధ్యేయం అన్నారు. రాజ్యాంగ పరిధిలో జీవిస్తున్న మనం అందరం ఆయన ఆదర్శ వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. కోలారు ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్, ఎమ్మెల్సీ ఎంఎల్ అనిల్కుమార్, మాజీ ఎంపీ ఎస్ మునిస్వామి, కలెక్టర్ ఎంఆర్ రవి, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
రాజ్యాంగంతో ప్రతి ఒక్కరికీ గౌరవం
కోలారు : దేశంలో ప్రతి వ్యక్తి సమాజంలో గౌరవంగా జీవించడానికి రాజ్యాంగం ద్వారా అంబేడ్కర్ అవకాశం కల్పించారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అంబేడ్కర్ 134వ జయంతి వేడుకల్లో ఆయన అంబేడ్కర్ చిత్రపటానికి మాలార్పణ చేసి మాట్లాడారు. సమాజంలోని అన్ని సముదాయాలు ఒక్కటై అంబేడ్కర్ జయంతిని ఆచరించాలన్నారు. మంత్రి కెహెచ్ మునియప్ప సూచనల మేరకు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంతో పాటు అన్ని తాలూకా కేంద్రాల్లోని కాంగ్రెస్ కార్యాలయాల్లో అంబేడ్కర్ జయంతిని ఆచరిస్తున్నట్లు తెలిపారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ఇతర దేశాల్లో కూడా మన్నన పొందిందన్నారు. కాంగ్రెస్ జిల్లా కార్యాధ్యక్షుడు ఊరుబాగిలు శ్రీనివాస్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు జయదేవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రసాద్బాబు తదితరులు పాల్గొన్నారు. జేడీఎస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో.. జేడీఎస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నగరంలో సోమవారం అంబేడ్కర్ జయంతిని ఆచరించారు. ఉదయం నగరంలోని బంగారుపేటె సర్కిల్లోని అంబేడ్కర్ ప్రతిమకు మాలార్పణ చేయడం ద్వారా అంబేడ్కర్కు నివాళి అర్పించారు. జేడీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు యలువళ్లి నాగరాజ్, హారోహళ్లి నాగరాజ్, జయనగర మునియప్ప, నరసింహయ్య తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం ఉన్నంత వరకు అంబేడ్కర్ పేరు చిరస్థాయి మాలూరు: రాజ్యాంగం ఉన్నంత వరకు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పేరు దేశంలో చిరస్థాయిగా నిలిచి ఉంటుందని, దేశంలోని ప్రతి ఒక్కరి హృదయాల్లో అంబేడ్కర్ కొలువై ఉన్నారని ఎమ్మెల్యే కేవై నంజేగౌడ తెలిపారు. సోమవారం పట్టణంలోని మహారాజ సర్కిల్లో తాలూకా జాతీయ పండుగల ఆచరణ సమితి, సాంఘిక సంక్షేమ శాఖ, దళిత పర సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేడ్కర్ 134వ జయంతిలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం వల్ల ప్రతి ఒక్కరికీ ఏదో విధంగా ప్రయోజనం కలిగిందన్నారు. రాజ్యాంగంలో అన్ని కులాలు, మతాలకు సమాన అవకాశాలను కల్పించారన్నారు. రాజ్యాంగ రచన వల్లనే నేడు ఎంతో మంది సామాన్యులు ఉన్నత స్థానాలకు చేరుకోగలిగారన్నారు. అంబేడ్కర్ నేడు మన మధ్య లేకున్నా ఆయన రచించిన రాజ్యాంగం నేటికీ శాశ్వతంగా నిలిచి ఉందన్నారు. కొంతమంది రాజ్యాంగాన్ని మారుస్తామని పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వారి ఆశలు ఎన్నటికీ నెరవేరవన్నారు. కార్యక్రమంలో వివిధ రంగాల్లో సాధన చేసిన వారిని గుర్తించి సన్మానించారు. కార్యక్రమంలో సాహితీవేత్త కోటిగానహళ్లి రామయ్య. తహసీల్దార్ ఎంవీ రూప, టీపీ ఈఓ కృష్ణప్ప తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ జీవితం స్పూర్తిదాయకం కేజీఎఫ్ : రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని నగరంలో వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రూపా శశిధర్ నగరంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఉన్న అంబేడ్కర్ ప్రతిమకు మాలార్పణ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేడ్కర్ యావత్ ప్రపంచం మెచ్చిన రాజ్యాంగాన్ని భారత దేశానికి అందించారన్నారు. అంబేడ్కర్ స్పూర్తిదాయకమైన జీవితాన్ని గడిపారన్నారు. దేశంలో అంటరానితనంపై అంబేడ్కర్ యుద్ధం ప్రకటించి దానిని రూపుమాపడానికి శ్రమించారన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేశారని కొనియాడారు. దేశంలోని పేదలు, దీన, దళితులు, అణగారిన వర్గాలు నేడు స్వాభిమానంతో జీవించడానికి ముఖ్య కారణం అంబేడ్కర్ అన్నారు. అంబేడ్కర్ కేవలం రాజ్యాంగ రచయితగా, కార్మిక మంత్రిగా పని చేసి కార్మికుల అభ్యున్నతి కోసం కృషి చేశారన్నారు. రాజ్యాంగంలో మహిళలకు సమాన హక్కులను కల్పించారన్నారు. తహసీల్దార్ నాగవేణి, నగరసభ కమిషనర్ పవన్కుమార్, నగరాభివృద్ధి ప్రాధికార కమిషనర్ ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ జయంతిలో వక్తలు రాజ్యాంగ నిర్మాతకు నివాళులు -
రూ.5 కోట్లతో అంబేడ్కర్ భవన్ నిర్మాణం
శ్రీనివాసపురం : పట్టణంలో రూ.5 కోట్ల వ్యయంతో అంబేడ్కర్ భవన్ను నిర్మిస్తామని ఎమ్మెల్యే జీకే వెంకటశివారెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలోని తాలూకా కార్యాలయంలో జాతీయ పండుగల ఆచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేడ్కర్ 134వ జయంతి కార్యక్రమంలో భాగంగా అంబేడ్కర్ ప్రతిమకు మాలార్పణ చేసిన అనంతరం మాట్లాడారు. అంబేడ్కర్ గొప్ప మానవతా వాది. దీన దళితుల అభ్యున్నతి కోసం శ్రమించారు. రాజ్యాంగ రచన ద్వారా అందరికీ సమాన అవకాశాలు కల్పించారన్నారు. ఆయన ఉత్తమ ఆదర్శ వ్యక్తిత్వాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. తాలూకాలో యువ సముదాయానికి ఉద్యోగాలు లభించాలనే ఉద్దేశంతో పారిశ్రామిక వలయాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. తాలూకా ప్రజలు అభివృద్ధి కార్యక్రమాలకు తమ సహకారం అందించాలన్నారు. టీపీ ఈఓ ఎస్.శివకుమారి, పురసభ అధ్యక్షుడు బీఆర్ భాస్కర్, ముఖ్యాధికారి వి.నాగరాజ్ తదితరులు ఉన్నారు. -
ఉత్తమ సేవలకు అవార్డుల ప్రదానం
శివాజీనగర: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని సమాజంలో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న సాధకులను గుర్తించి ఐదు మందికి అవార్ుడ్స అండ్ డాక్టరేట్ ఫోరమ్ రాష్ట్ర శాఖ ద్వారా నేషన్స్ ప్రైడ్ అవార్డును ప్రదానం చేశారు. సోమవారం హుబ్లీలోని గాంధీవాడ ఏబీఎం తెలుగు చర్చిలో జరిగిన అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో ఉత్తమ సమాజ సేవకుడిగా గుర్తింపు పొందిన సాల్మన్రాజ్కు, ఉత్తమ గాయకుడు ఆనందరావు పంబా, ఉత్తమ మ్యూజిషియన్ షడ్రక్ జుంజు, ఉత్తమ ఉపాధ్యాయుడు, సమాజ సేవకుడు టీ.జెర్మియా, ఉత్తమ గాయకుడు, సమాజ సేవకుడు విజయ భాస్కర్ మలాపురంలకు ఈ సంవత్సరం నేషన్స్ ప్రైడ్ అవార్డు అందించారు. ప్రతి సంవత్సరం వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందిస్తున్న వారిని గుర్తించి ఈ అవార్డులు ప్రదానం చేస్తున్నామని ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ వరల్డ్ వైడ్ ఫౌండేషన్ సభ్యుడు డాక్టర్ పెండెమ్ దానియేల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గాబ్రియేల్ పిళ్లై, రెవరెండ్ డెవిడ్సన్, రెవరెండ్ జాన్ మరికంటి, డీ.సాముయేల్ పాల్గొన్నారు. -
షేర్ల పేరుతో నిండా మోసం
మైసూరు: మైసూరు నగరంలో జరిగిన రెండు వేర్వేరు సైబర్ మోసాల్లో పెట్టుబడి పెట్టి రు.1.52 కోట్లను పోగొట్టుకున్నారు. సులభంగా అధిక డబ్బు సంపాదించవచ్చనే దురాశకు పోయి ఉన్న సొమ్మును నష్టపోయారు. వివరాలు.. గాయత్రిపురానికి చెందిన ఇంజినీర్ ఇన్స్టా గ్రాంలో వచ్చిన యాడ్ను చూసి లింక్ నొక్కారు. దీంతో ట్యాక్స్ వ్యాల్యూ అనే గ్రూప్లో చేర్చారు. తమ యాప్ ద్వారా షేర్లలో నగదు పెట్టుబడి పెట్టాలని, విపరీతంగా లాభాలు వస్తాయని మోసగాళ్లు మెసేజ్లు పంపేవారు. బాధితుడు నమ్మి వారు చెప్పినట్లుగా ఆన్లైన్లో నగదు బదిలీ చేశాడు. మొదట భారీగా లాభాలు వచ్చినట్లు చూపించడంతో ఆశ పెరిగి మొత్తం రూ 1.26 కోట్లను పెట్టుబడి పెట్టాడు. తరువాత అవతల నుంచి ఎలాంటి సమాధానం రాక పోవడంతో మోసపోయినట్లు గుర్తించాడు. నిరుద్యోగికి రూ.15 లక్షలు రెండవ కేసులో.. టెలిగ్రామ్లో వచ్చి యాడ్ను చూసి కనకదాస నగరకు చెందిన యువకుడు పార్ట్టైం పని కోసమని సంప్రదించాడు. మొదట మోసగాళ్లు కొన్ని టాస్కులు ఇచ్చి కొంచెం నగదు వేశారు. తమ ద్వారా షేర్లలో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని నమ్మించారు. దీంతో యువకుడు రూ. 15 లక్షలను వారి ఖాతాలకు బదిలీ చేశాడు. ఆ తరువాత వంచకుల నుంచి స్పందన కరువైంది. మోసపోయానని గుర్తించి సైబర్ ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైసూరువాసికి రూ.1.26 కోట్ల టోపీ -
తగ్గిన మెట్రో ట్రిప్పులు.. ప్రజలకు చిక్కులు
బనశంకరి: అంబేడ్కర్ జయంతి ప్రభుత్వ సెలవు అనే కారణంతో నమ్మ మెట్రో రైలు సర్వీసులు తగ్గించి ప్రయాణికులకు ఇబ్బంది పెట్టింది. మెట్రోరైళ్లు తగ్గడంతో ప్రయాణికులు ఉన్నవాటిలో కిక్కిసిరి ప్రయాణించారు. బీఎంఆర్సీఎల్ తీరుపై శాపనార్థాలు పెట్టారు. సాధారణ రోజుల్లో ఉదయం పీక్ అవధిలో 3 లేదా 5 నిమిషాలకు ఒక మెట్రోరైలు సంచరిస్తుంది. సోమవారం 10 నుంచి 15 నిమిషాలకు ఒక రైలు తిరగడంతో ప్రయాణికులు తెల్లమొహం వేశారు. మెజెస్టిక్ మెట్రోస్టేషన్ ప్రయాణికులతో నిండిపోయింది. ప్లాట్పారం నిండిపోయి ఇతర అంతస్తుల్లో బారులు తీరారు. ప్రభుత్వ సెలవురోజు, ఆదివారం ట్రిప్పుల మధ్య అవధిని పెంచుతారు. ఒకరైలు వెళ్లిన తరువాత 10 నిమిషాలకు మరో రైలు వస్తుంది. సోమవారమూ అదే జరిగింది. కానీ అంబేడ్కర్ జయంతి కి ప్రైవేటు రంగం, ఐటీ బీటీ సంస్థలు మామూలుగానే పనిచేశాయి. యథావిధిగా ఉద్యోగులు, జనం వచ్చినా రైళ్లు లేక అవస్థలు పడ్డారు. జనం ఆగ్రహావేశాలు దీనిపై సోషల్ మీడియాలో ప్రయాణికులు మండిపడ్డారు. ప్రజాప్రతినిధులారా, చూడండి అని ఫిర్యాదు చేశారు. దిలీప్ అడిగ అనే ప్రయాణికుడు ట్వీట్ చేసి, మెజస్టిక్ మెట్రోస్టేషన్లో అస్తవ్యస్తంగా మారిందని, ఎక్కడ చూసినా ప్రయాణికులే ఉన్నారని, బీఎంఆర్సీఎల్ కు టికెట్ ధరలు ముఖ్యం తప్ప ప్రజలు కాదని మండిపడ్డాడు. కాగా రద్దీ వల్ల అదనంగా రైలు సర్వీసులను నడిపినట్లు మెట్రో అధికారులు చెప్పారు. మెట్రో స్టేషన్లలో విపరీత రద్దీ ప్రయాణికుల మండిపాటు -
5 వేల ఎకరాల రికార్డులు ఉన్నాయి
మైసూరు: చామరాజనగర జిల్లాలో మైసూరు మహారాజులకు సుమారు 5 వేల ఎకరాల భూములు ఉన్నాయి. అన్ని రకాల పత్రాలు మా వద్ద ఉన్నాయి, ఆ భూములను సాగుచేసుకుంటున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించం అని మైసూరు రాజవంశీకురాలు ప్రమోదాదేవి ఒడెయార్ అన్నారు. సోమవారం మైసూరు ప్యాలెస్లోని తమ నివాసంలో మీడియా సమావేశం భూముల విషయమై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మీద అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఆ జిల్లాలో ఉన్న భూముల గురించి 1950లోనే జిల్లాధికారికి, సర్కారుకు లేఖ రాశం, అన్ని దాఖలాలను 2014లో అందజేశాం. 4,500 ఎకరాల కంటే ఎక్కువగా భూములకు చెందిన రికార్డులు తమ వద్ద భద్రంగా ఉన్నాయని తెలిపారు. వాటి ఆధారంగా భూములకు ఖాతా చేసి ఇవ్వాలని లేఖ రాశామన్నారు. దీని వల్ల రైతులకు ఎలాంటి భయం వద్దని తెలిపారు. ఆ భూమి కావాలని ఎవరూ రైతులను బెదిరించరని, అనుమానాలు ఉంటే తనను నేరుగా కలవవచ్చని ఆమె భరోసా ఇచ్చారు. మైసూరు మహారాజులు ప్రజల కోసం దానంగా ఇచ్చిన భూములను తాము లాక్కోవడం అనేది జరగదని చెప్పారు. అయితే ఆ భూములను ప్రభుత్వం రెవెన్యూ భూములుగా చేయాలని చూస్తోంది. ఆ భూములు ఉంటే రైతుల వద్ద ఉండాలి, లేదా మా వద్ద ఉండాలి అంతే తప్ప ప్రభుత్వం వద్ద కాదు అని స్పష్టంచేశారు. ఆ భూములను రెవెన్యూ ఖాతాలోకి చేయరాదని పేర్కొన్నారు. రైతుల నుంచి భూములను తీసుకోం రాజమాత ప్రమోదాదేవి -
మండ్యలో చైన్ స్నాచింగ్
మండ్య: బైకులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు రోడ్డు మీద నడిచి వెళుతున్న మహిళ మెడలో ఉన్న బంగారం చైన్ను లాక్కొని పారిపోయారు. మండ్య నగరంలోని కళ్ళహళ్ళి ఎపిఎంసి వద్ద సోమవారం ఉదయం జరిగింది. స్థానికురాలు సీ.ఎస్.కావ్యశ్రీ కూరగాయలు తీసుకుని నడుచుకుంటూ వస్తుండగా, బైకులో వేగంగా వచ్చిన దుండగులు ఆమె మెడలో ఉన్న 35 గ్రాముల బరువైన చైన్ను లాక్కెళ్లారు. దీని విలువ రూ. 1.75 లక్షలు ఉంటుందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దుండగులు బైక్లో వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి.పోకిరీ అరెస్టు యశవంతపుర: రోడ్డుపై యువతిని వేధించిన పోకిరీని సుద్దగుంటెపాళ్య పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కేరళలో ఉండగా పట్టుకున్నారు. వివరాలు.. బెంగళూరు తిలక్నగర లేఔట్లో నివాసం ఉన్న యువతి ఏప్రిల్ 3న తెల్లవారుజామున 2 గంటల సమయంలో మరో యువతితో కలిసి సుద్దగుంటపాళ్య భారతీ లేఔట్లోని ఫస్ట్ క్రాస్లో నడిచి వెళ్తోంది. ఓ అపరిచిత వ్యక్తి వచ్చి ఆమెను పట్టుకుని గోడకు నెట్టి లైంగికంగా వేధించాడు. కేకలు వేయడంతో పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో విచారణ చేపట్టారు. నిందితుడు కారు షోరూంలో డ్రైవర్గా పని చేస్తున్నట్లు తేలింది. కేరళలో అరెస్టు చేసి తరలించినట్లు ఆగ్నేయ డీసీపీ సారా ఫాతిమా తెలిపారు. బీడీఎస్ విద్యార్థిని ఆత్మహత్యయశవంతపుర: బాగా చదవలేకపోతున్నాను, పరీక్షలు రాయలేను అనే భయంతో దంత వైద్య విద్యార్థిని అత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. రాజాజీనగరలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీడీఎస్ రెండో ఏడాది చదువుతున్న సౌమ్య గణేశ్ (20) మృతురాలు. ఆదివారం సాయంత్రం హెబ్బాళలోని తమ అపార్టుమెంటు 5వ అంతస్తు నుంచి దూకడంతో గాయాలతో చనిపోయింది. పరీక్షలు సరిగా రాయలేనేమో అనే భయంతో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఆమె ఆదుర్దాను గుర్తించి 15 రోజుల క్రితం తల్లిదండ్రులు ఇంటి వద్ద కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ భయం వీడలేదు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. కాంగ్రెస్ది కపట నాటకం శివాజీనగర: కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు కేంద్ర సర్కారు మీద పోరాటానికి సిద్ధం కావడం కపట నాటకమని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర ఆరోపించారు. సోమవారం బెంగళూరులో మాట్లాడారు. కాంగ్రెస్వారు కేంద్రానికి వ్యతిరేకంగా 17న ధర్నా చేస్తారట, రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ధరలు పెరుగుతున్నాయి, ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమన్నారు. పెట్రోల్, డీజల్ ధరలను పెంచి ఇప్పుడు పోరాటం చేసేందుకు నైతిక హక్కు లేదని అన్నారు. -
వలస కూలీల వల్లనే నేరాలు
హుబ్లీ: హుబ్లీ నగరంలో అశోక్నగర ఠాణా పరిధిలోని అధ్యాపక నగరిలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల బాలికను అపహరించి, ఓ పాడుబడిన ఇంట్లో అత్యాచారం చేసి ప్రాణాలు తీసిన దారుణ ఉదంతం స్థానికంగానే కాదు రాష్ట్రంలోనూ తీవ్ర దుమారం రేకెత్తించింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన కార్చిచ్చులా ఆగ్రహాన్ని రేకెత్తించింది. వేలాది ప్రజలు పోలీస్స్టేషన్ను ముట్టడించి హంతకున్ని తమకు అప్పగించాలని నిరసనకు దిగారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా దిక్కుతోచకుండా చేసింది. ప్రజలు ఇంత రౌద్రరూపం దాల్చుతారని ఎవరూ ఊహించలేకపోయారు. ఈ నేపథ్యంలో పోలీసులు కార్యాచరణను ప్రారంభించారు. విచారణకు తీసుకెళ్తుండగా దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు, అందువల్ల కాల్పులు జరిపితే మరణించాడని ప్రకటించారు. సీసీ కెమెరాలలో దృశ్యాలు మొదట సీసీ టీవీ కెమెరాల దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితున్ని కనిపెట్టారు. బిహార్కు రితేష్కుమార్ (35)గా గుర్తించారు. అతడు మూడు నాలుగు నెలల కిందటే హుబ్లీకి వచ్చి కూలీ పనులు చేస్తున్నాడు. హత్యాచారం ఘటన తరువాత పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా, హంతకుడు బాలికను ఎత్తుకుని వెళ్తున్న దృశ్యాలు లభించాయి. దీంతో సాక్ష్యాలు దొరికాయి. రాళ్లతో దాడి చేసి తప్పించుకునే యత్నం ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో నిందితుడు నివసించే తారిహళలోని అద్దె ఇంటికి తీసుకెళ్లి విచారణ చేపట్టారు. ఈ సమయంలో దుండగుడు రితేష్ పోలీసులపై రాళ్లతో దాడి చేసి పరారు కావడానికి ప్రయత్నించాడు. దీంతో అశోక్ నగర ఎస్ఐ అన్నపూర్ణ.. పారిపోవద్దంటూ హెచ్చరిస్తు గాలిలో మూడు రౌండ్లు కాల్చులు జరిపారు. అయిన నిందితుడు ఆగక పోవడంతో రెండు రౌండ్లు పేల్చారు. ఓ తూటా కాళ్లకు, రెండవ తూటాను వెన్ను వద్ద దిగబడ్డాయి. నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కేఎంసీ ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. వైద్యులు పరిశీలించి మృతి చెందాడని నిర్ధారించారు. పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్ ఘటనాస్థలిని పరిశీలించారు. దుండగుని దాడిలో ఎస్ఐ, ఇద్దరు పోలీసులకు స్వల్పగాయాలై ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. బాలిక కుటుంబానికి సర్కారు రూ.10 లక్షల పరిహారం ఇస్తుందని ఎమ్మెల్సీ సలీమ్ అహ్మద్ విలేకరులకు తెలిపారు. ఇల్లు మంజూరు చేస్తామని హుబ్లీ ధార్వాడ తూర్పు ఎమ్మెల్యే ప్రసాద్ అబ్బయ్య తెలిపారు. పలువురు నేతలు చిన్నారి మృతదేహానికి నివాళులర్పించారు. హుబ్లీలో బాలికపై అత్యాచారం, హత్య పోలీసు కాల్పుల్లో వలస కూలీ మృతి నియంత్రణపై త్వరలో సమావేశం హోంమంత్రి పరమేశ్వర్ వెల్లడిఅమాయక చిన్నారిని చెరబట్టి చిదిమేసి, వాణిజ్యనగరి హుబ్లీలో అల్లరికి కారణమైన వలస కూలీ కథ కొన్ని గంటల్లోనే ముగిసింది. కామాంధుడు పోలీసు తూటాలకు ప్రాణాలు వదిలాడు. దీని వల్ల బాలిక తల్లిదండ్రులకు గర్భశోకం తీరకపోయినా, హంతకునికి శిక్ష పడిందని జనం నిట్టూర్చారు. ఈ ఎన్కౌంటర్ అలాంటి ఆలోచన కలిగిన కామాంధులకు గుణపాఠం అవుతుంది.ఎన్కౌంటర్పై విచారణ ఆదివారం హుబ్లీలో బిహార్కు చెందిన వ్యక్తి 5 సంవత్సరాల బాలికను ఎత్తుకెళ్లి హత్య చేశాడు. కొంత సమయంలోనే అతనిని అరెస్ట్ చేయడమైనది. స్థలం మహజరుకు నిందితున్ని పిలుచుకొని వెళ్లేటపుడు అతడు పోలీసులపై దాడి చేశాడు. ఆ సమయంలో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు అని ఎన్కౌంటర్ గురించి తెలిపారు. కాల్పులపై ఉన్నతస్థాయి విచారణ జరిపిస్తామని, ఆ తరువాత వాస్తవ సమాచారం తెలుస్తుందని హోంమంత్రి చెప్పారు.శివాజీనగర: ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి పని, ఉద్యోగం నిమిత్తం వచ్చేవారి ద్వారానే నేరాలు అధికంగా జరుగుతున్నాయని, దీనిని అరికట్టే దిశలో ప్రత్యేక సమావేశం జరుపనున్నట్లు హోం మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. హుబ్లీ అమానుష ఘటన నేపథ్యంలో సోమవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. కర్ణాటకలో వలస కార్మికులచే నేరాలు అధికం కావడం ప్రభుత్వం గమనిస్తోంది. వలసదారులకు ఇక్కడి సంస్కృతి, భావాలు అర్థం కావటం లేదేమో అనిపిస్తుంది. భవన నిర్మాణ పనుల కార్మికులు, ఇతరులు ఇటువంటి నేర కార్యకలాపాల్లో పాల్గొనటాన్ని అరికట్టేందుకు కార్మిక శాఖతో ప్రత్యేక సమావేశం జరిపి, ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది పరిశీలిస్తామన్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
హొసపేటె: విజయనగర జిల్లాలో కొట్టూరు–హరపనహళ్లి రోడ్డులోని అయ్యనహళ్లి గ్రామంలో శనివారం అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వాహనంపై అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితులు షబ్బీర్, జిందూసాబ్, మంజునాథ్ బియ్యం రవాణా చేస్తుండగా ఎస్ఐ గీతాంజలి షిండే, ఫుడ్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ దాడి చేసి రూ.25,604 విలువ చేసే 740 కేజీల బియ్యం, రూ.70 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కొట్టూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నియామకం రాయచూరు రూరల్: రాయచూరు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఉన్న బసవరాజరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఏడాది పాటు ఖాళీగా ఉన్న పదవిని భర్తీ చేస్తూ నగరసభ సభ్యుడిగా కొనసాగుతున్న శ్రీనివాసరెడ్డిని నియమించి శనివారం కేపీసీసీ అధ్యక్షుడు ఆదేశ పత్రం విడుదల చేశారు. గత 25 ఏళ్లుగా పార్టీ కార్యకర్తగా విధులు నిర్వహించిన శ్రీనివాసరెడ్డిని నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. అగ్నిప్రమాదంలో గడ్డివాములు బుగ్గి హొసపేటె: విజయనగర జిల్లా హడగలి తాలూకా హరవి బసాపుర తాండాలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో మూడు గడ్డివాములు కాలిబూడిదయ్యాయి. గ్రామానికి చెందిన హావనూరు నింగప్ప, మైలార లింగప్పలకు చెందిన రెండు ట్రాక్టర్ల మొక్కజొన్న గడ్డి, రెండు ట్రాక్టర్ల వరిగడ్డి, యల్లవ్వకు చెందిన నాలుగు ట్రాక్టర్ల వరిగడ్డి, రెండు ట్రాక్టర్ల మొక్కజొన్నగడ్డి, పుట్టప్పకు చెందిన గడ్డివాములు కాలిపోయాయి. నిరాడంబర వివాహాలే ముద్దు రాయచూరు రూరల్: నేటి ఆధునిక సమాజంలో ముఖ్యంగా కళ్యాణ కర్ణాటకలో సరళ వివాహాలకు ప్రాధాన్యత కల్పించాలని మాజీ లోక్సభ సభ్యుడు బీ.వీ.నాయక్ పిలుపునిచ్చారు. ఆదివారం యాదగిరి జిల్లా హేమనాళలోని దేవర గుండ్లగుర్తి మైలార లింగేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన సామూహిక వివాహాల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, కర్షకులు, కార్మికులు అధికంగా ఉన్న సమాజంలో దుబారా వ్యయంతో పెళ్లిళ్లు చేయడం కష్టకరమన్నారు. సామూహిక వివాహాల్లో బూది బసవేశ్వర, శాంత నిజలింగ, శివశంకరప్ప, పంచాక్షరి, శంభు సోమనాథ స్వామీజీలు, శ్రీనివాస్, వరదానంద, శివణ్ణ, దానయ్యలున్నారు. తాగునీటి కోసం నిరసన రాయచూరు రూరల్: వేసవిలో తాగునీటి ఎద్దడి తీర్చాలని ఒత్తిడి చేస్తూ ఆదివారం యాపలదిన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రజలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. 15 రోజుల క్రితం వదిలిన తాగునీటిని నేటికీ వదలక పోవడంతో అధికారుల తీరుపై మండిపడుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నీటి ఎద్దడి నెలకొనకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినా స్పందించక పోవడాన్ని ఖండించారు. క్రీడలతో శారీరక ఆరోగ్యం రాయచూరు రూరల్: క్రీడలు శారీరక ఆరోగ్యానికి నాంది పలుకుతాయని దేవసూగూరు కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ముజాహిద్ అన్నారు. ఆయన ఆదివారం ఎలిమినేటర్ క్రీడా పోటీల్లో పాల్గొని మాట్లాడారు. క్రీడల్లో గెలుపు ఓటమిలను సమానంగా స్వీకరించి ప్రత్యర్థికి మానసిక స్థైర్యాన్ని నింపాలన్నారు. నెల రోజుల పాటు జరిగే క్రికెట్ లీగ్ పోటీల్లో 8 జట్లు పాల్గొనడం అభినందనీయమన్నారు. పోటీల్లో బాషానాయక్, శాలం, బందే నవాజ్, రజాక్, బాబు, మొయినుద్దీన్లున్నారు. -
వడగళ్ల వాన బీభత్సం
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని గుడేకోటె పరిధిలో శనివారం సాయంత్రం వడగళ్లతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కలిసి గంటకు పైగా కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడింది. గత వారం రోజులుగా తాలూకాలోని గుడేకోటె, అప్పేనహళ్లి, కాసాపుర, హాలసాగర, కానాహొసహళ్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి వాన నీరు చేరింది. పంట నష్టపరిహారం అందించండి రాయచూరు రూరల్: జిల్లాలో అకాల వర్షాలు సృష్టించిన బీభత్సంతో కోతకొచ్చిన వరి పైరుకు నష్టం సంభవించిందని, ప్రభుత్వం ఎకరాకు రూ.50 వేలు చొప్పున పరిహారం అందించాలని రైతు సంఘం అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ డిమాండ్ చేశారు. ఆదివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాన్వి, మస్కి, దేవదుర్గ, సింధనూరు తాలూకాలో వేలాది ఎకరాల్లో పంట నేల పాలైందన్నారు. మస్కి తాలూకాలో రైతులు వేసుకున్న వరి పంటలు చేతికొచ్చే సమయంలో వరుణ దేవుడు గట్టి దెబ్బ కొట్టాడన్నారు. ప్రభుత్వం మద్దతు ధరతో రైతుల నుంచి వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. తహసీల్దార్లు నష్టం అంచనాలను తయారు చేసి సర్కార్కు నివేదిక పంపాలని ఒత్తిడి చేశారు. -
కారు ఢీకొని బైక్ చోదకుడు మృతి
హొసపేటె: జాతీయ రహదారి– 50లోని విరుపాపుర గ్రామం సమీపంలో శనివారం సాయంత్రం అతి వేగంగా వస్తున్న కార్ అదుపు తప్పి బైక్ను ఢీకొట్టడంతో బైక్ చోదకుడు స్థలంలోనే మృతి చెందిన ఘటన విజయనగర జిల్లా కూడ్లిగిలో జరిగింది. బైక్ రైడర్ గెద్దలగట్టె నుంచి కూడ్లిగికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు ఢీకొంది. మృతుడిని గెద్దలగట్టెకు చెందిన రాకేష్(22) గా పోలీసులు గుర్తించారు. పట్టణంలో కొత్త బేకరీని ప్రారంభించిన రాకేష్ తన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అతను గెద్దలగట్టె నుంచి బైక్పై పట్టణానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హైవే టోల్, పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ సి.ప్రకాష్ సహా పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. మృతుడి తాత సదాశివప్ప ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అక్కడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. డాక్టర్ రాజ్కుమార్ చిత్రపటానికి పుష్పాంజలి రాయచూరు రూరల్: కన్నడ సినీ నటుడు దివంగత డాక్టర్ రాజ్కుమార్ 19వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి అభిమానులు పుష్పాంజలి ఘటించారు. ఆదివారం నగరంలోని డాక్టర్ పునీత్ రాజ్కుమార్ ట్రస్టు కార్యాలయంలో డాక్టర్ రాజ్కుమార్ చిత్రపటానికి ట్రస్టు అధ్యక్షుడు సాదిక్ఖాన్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సభ్యులు బసవరాజ్, సంతోష్, చేతన సంస్థ సంచాలకుడు సబ్జలీ, నాసిర్లున్నారు. విద్యా రంగంలో రాణించాలి రాయచూరు రూరల్: నేటి ఆధునిక సమాజంలో పోటీకి తగినట్లుగా కళ్యాణ కర్ణాటక భాగంలోని విద్యార్థులు విద్యారంగంలో రాణించాలని లోక్సభ సభ్యుడు కుమార నాయక్ సూచించారు. ఆదివారం సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో ఎస్కేఎస్ గ్రూప్ ఏర్పాటు చేసిన జేఈఈ, ఇతర పోటీ పరీక్షలను ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై విద్యార్థులతో ముఖాముఖిగా చర్చించడానికి హరీష్వర్మ రావడం గర్వకారణమన్నారు. దక్షిణ భారత విద్యార్థులు ఉత్తర భారత విద్యార్థులతో పోటీని తట్టుకోవడానికి తర్ఫీదు అవసరమన్నారు. యువకులు, విద్యార్థులు కఠిన పరిశ్రమతో చదువుకోవాలని సూచించారు. ఇలాంటి ఉచిత పోటీ శిబిరాలను సద్వినియోగ పరచుకోవాలన్నారు. సమావేశంలో బాబురావ్ శేగుణశి, నీలమణి శ్రీవాస్తవ్లున్నారు. మెగా వైద్య పరీక్ష శిబిరం రాయచూరు రూరల్: భారతీయ వైద్య సంఘం(ఐఎంఏ) ఆధ్వర్యంలో నగరంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆదివారం మహాత్మ గాంధీ క్రీడా మైదానంలో భారతీయ వైద్య సంఘం, ఒపెక్ ఆస్పత్రి, రిమ్స్ కళాశాల పరిశోధన ఆస్పత్రి, నవోదయ ఆస్పత్రి, జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో చర్మం, చెవులు, ముక్కు, గొంతు, చిన్న పిల్లల వ్యాధులు, గుండెపోటు, బీపీ, షుగర్, నేత్ర, ఈసీజీ పరీక్షలను ప్రజలకు ఉచితంగా అందించారు. ఐఎంఏ అధ్యక్షుడు శ్రీశైలేష్ అమర్ఖేడ్, జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షక్షేమ శాఖాధికారి సురేంద్రబాబు, మనోహర్ పత్తార్, వైద్యులు దీపశ్రీ, రాఘవేంద్ర, శ్రీధర్ వైట్ల, నీలోఫర్, వీరనగౌడలున్నారు. -
మహోన్నత వ్యక్తి డాక్టర్ అంబేడ్కర్
● మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి సాక్షి,బళ్లారి: భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ అని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఒక రోజు ముందుగా ఆదివారం నగరంలోని హొసపేటె రోడ్డులోని అంబేడ్కర్ భవన్ ఆవరణలోని అంబేడ్కర్ ప్రతిమకు పాలాభిషేకం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. పేద కుటుంబంలో జన్మించిన అంబేడ్కర్ ఎంతో కష్టపడి అత్యున్నత విద్యాభ్యాసం చేసిన తర్వాత భారతదేశానికి రాజ్యాంగాన్ని రాశారన్నారు. న్యాయవాదిగా పని చేశారన్నారు. దేశ విదేశాల్లో తన ప్రతిభ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. అణగారిన వర్గాలకు ఆశాజ్యోతి అని కొనియాడారు. అంబేడ్కర్ కేవలం ఒక వ్యక్తి కాదు, శక్తి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. భారత దేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించడంతో పాటు సమానత్వం కోసం పాటుపడ్డారన్నారు. దళితులను ఆలయాల్లోకి ప్రవేశించడానికి ఎంతో కృషి చేశారన్నారు. చదువును అవపోసన పట్టారన్నారు. ఎన్నో డిగ్రీలు సంపాదించుకుని, నిస్వార్థంగా దేశానికి సేవ చేశారన్నారు. ఆయన అడుగుజాడల్లో మనందరం నడుస్తూ దేశ సర్వతోముఖాభివృద్దికి పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మోత్కూరు శ్రీనివాసరెడ్డి, గోవిందరాజులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
బీజేపీ నేతలు పశ్చాత్తాప యాత్ర చేపట్టాలి
హుబ్లీ: ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ జనాక్రోశయాత్ర చేయడానికి బీజేపీకి నైతిక హక్కు లేదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ సలీం అహ్మద్ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో గత 11 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ కర్ణాటక ప్రజల పట్ల చాలా అన్యాయం, పక్షపాత ధోరణితో వ్యవహరించిందన్నారు. అందువల్ల వారు పశ్చాత్తాప యాత్ర చేపట్టడం మంచిదని ఆయన అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర తక్కువగా ఉన్నా కేంద్రంలోని బీజేపీ సర్కారు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినా ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారన్నారు. బీజేపీపైనే అంతటా జనాక్రోశం కేంద్రంలోని బీజేపీ సర్కారుపై అంతటా జనాక్రోశం వ్యక్తమవుతోందన్నారు. ఎగువ కృష్ణ తదితర నీటి పారుదల ప్రాజెక్ట్లకు ఆర్థిక సహాయం, నగర, స్థానిక సంస్థలకు ప్రత్యేక నిధులు తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీఎం సిద్దరామయ్య ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించారన్నారు. ఇందులో ఒకే ఒక డిమాండ్ను కూడా ప్రధాని నెరవేర్చలేదన్నారు. మహదాయి, మేకెదాటు పథకాలకు అనుమతి ఇవ్వలేదన్నారు. కేంద్రం ఎంతో అన్యాయం చేసినా రాష్ట్రానికి చెందిన 5 మంది కేంద్ర మంత్రులు, 18 మంది బీజేపీ ఎంపీలు కాంగ్రెస్పై జనాక్రోశ యాత్ర చేపట్టడం హాస్యాస్పదం అన్నారు. కాంగ్రెస్తోనే తండ్రీకొడుకులకు అందలం కాంగ్రెస్ కావాలంటూ హెచ్డీ దేవేగౌడ ప్రధాని, ఆయన కుమారుడు హెచ్డీ కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ఇప్పుడేమో దారి తప్పిన పిల్లలు నిఖిల్ కుమారస్వామి, బీవై విజయేంద్ర కాంగ్రెస్ చాలు అంటూ ఆందోళన చేపట్టడం దురదృష్టకరం అంటున్నారు. చిన్నచితకా విషయాలకు బీజేపీ గ్యారెంటీ పథకాలపై విమర్శించడం సరికాదన్నారు. బీజేపీకి ధైర్యం ఉంటే గ్యారెంటీ పథకాలను ఆపమని చెప్పాలన్నారు. ఈ పథకాలకు రూ.52 వేల కోట్లు సేకరణకు మేం స్వల్పంగా పన్నులు విధించాం. అయితే కేంద్ర సర్కారు గత 11 ఏళ్ల నుంచి సామాన్య ప్రజలను దోపిడీ చేస్తోందని ఆరోపించారు. సమావేశంలో ఎమ్మెల్యే కోనరెడ్డి, కేపీసీసీ ప్రధాన కార్యదర్శి సదానంద డంగనవర, భాస్కర్ శరణప్ప కోటగి, అనిల్కుమార్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ సలీం అహ్మద్ -
లక్ష్యంతో ఉత్తమ భవిత సాధ్యం
బళ్లారి రూరల్ : లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఉత్తమ భవిత కోసం శ్రమించాలని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ సంచాలకుడు ఐఏఎస్ డాక్టర్ కే.రాజేంద్ర తెలిపారు. శనివారం రాత్రి దావణగెరె జేజేఎంఎంసీ(జైజగద్గురు మురుఘ రాజేంద్ర మెడికల్ కాలేజ్) గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎంబీబీఎస్ ముగించుకొని వైద్యులుగా సమాజంలో అడుగు పెడుతున్న యువవైద్యులు ముందు లక్ష్యాన్ని నిర్థేశించుకొని ఆ దిశగా శ్రమించాలన్నారు. నేటి యువత మాదకద్రవ్యాలు, మత్తుకు లోనై భవితను చిత్తు చేసుకొంటున్నారన్నారు. డ్రగ్స్ వ్యవసం కంటే ఇప్పుడు సోషల్ మీడియా వ్యసనం ప్రమాదకరంగా మారింది. దీంతో రియల్ హీరోల్లా ఉండాల్సిన వారు రీల్స్ చేసుకొంటున్నారన్నారు. తాను 2008లో ఇదే కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసినట్లు తెలిపారు. 2013లో సివిల్స్ రాసి బళ్లారి, మైసూరు తదితర జిల్లాల్లో పని చేసినట్లు తెలిపారు. గౌరవ అతిథి, దావణగెరె ఎంపీ డాక్టర్ ప్రభా మల్లికార్జున్ మాట్లాడుతూ తాను ఇక్కడే దంత వైద్యురాలిగా చదివినట్లు తెలిపారు. సమాజంలో వైద్య వృత్తి అత్యంత గౌరవ ప్రదం అని తెలిపారు. తల్లిదండ్రులను, గురువులను ఎప్పటికీ గౌరవించాలన్నారు. డాక్టర్ రాజేంద్ర, డాక్టర్ ప్రభా మల్లికార్జున్లను సన్మానించారు. జూనియర్ వైద్యులకు డాక్టర్ పట్టాలను ప్రదానం చేశారు. వైద్యకళాశాల ప్రిన్స్పాల్ డాక్టర్ శుక్లా ఎస్.శెట్టి, మాజీ ప్రిన్స్పాల్ డాక్టర్ మంజునాథ ఆలూరు, ప్రొఫెసర్ శ్రీనివాస్ ఎల్.డి, వైద్యులు, జూనియర్ వైద్యులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. రోగులతో ఆత్మీయులుగా ఉత్తమ వైద్యులుగా ఎదగాలి పర్యాటక అభివృద్ధి శాఖ సంచాలకుడు డాక్టర్ రాజేంద్ర -
బాలిక కిడ్నాప్, అత్యాచారం, హత్య
హుబ్లీ: మహిళలు, చిన్నారులపై కామాంధుల దాడులు ఆగడం లేదు. రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట వేధింపుల ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాణిజ్య నగరి హుబ్లీలో కిరాతకం సంభవించింది. ఐదేళ్ల బాలిక ఓ కామాంధునికి దారుణానికి బలైంది. బాలికను కిడ్నాప్చేసి, అత్యాచారం చేసి ఆపై ప్రాణాలు తీశాడో నరరూప రాక్షసుడు. దీంతో స్థానిక ప్రజలు అగ్రహోదగ్రులయ్యారు. దుండగున్ని తక్షణం శిక్షించాలని బృహత్ ధర్నా నిర్వహించడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఏం జరిగింది? వివరాలు.. కొప్పళకు చెందిన ఓ కుటుబం విశ్వేశ్వర నగరలో నివసిస్తోంది. భర్త పెయింటర్గా, భార్య ఇళ్లలోను, ఓ బ్యూటీపార్లర్లోనూ పనిచేసేది, వీరికి ఐదేళ్ల కూతురు ఉంది. తల్లి ఓ ఇంట్లో పనిచేస్తుండగా బాలిక బయట ఆడుకుంటోంది. బిహార్కు చెందిన ఓ వలస కూలీ బాలిక మీద కన్నేశాడు. చాక్లెట్ కొనిస్తానని చెప్పి బాలికను దగ్గరలోని ఓ రేకుల షెడ్డులోని టాయ్లెట్లోకి ఎత్తుకెళ్లాడు. చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి ప్రాణాలు తీసి ఉడాయించాడు. తల్లి బయటకు వచ్చి చూడగా బాలిక కనిపించలేదు. స్థానికులకు చెప్పడంతో అందరూ గాలించగా టాయ్లెట్లో బాలిక శవం కనిపించింది. దీంతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపించగా ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఠాణాని ముట్టడించిన ప్రజలు ఈ ఘటనతో విశ్వేశ్వర నగర్తో పాటు అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతాలు అట్టుడికి పోయాయి. పోలీసుల అదుపులో ఉన్న కామాంధున్ని తమ స్వాధీనం చేయాలని వందలాది మహిళలు ఆ అశోక్నగర ఠాణాని ముట్టడించారు. అంతవరకు కదిలేది లేదని మొండికేశారు. అంతకంతకు జనం పెరగడంతో అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. పోలీసు ఉన్నతాధికారులు, మీడియావారు చేరుకున్నారు. పోలీస్ కమిషనర్ శశికుమార్ మాట్లాడుతూ ఇంటి వద్ద ఆటలాడుతున్న చిన్నారిని సదరు యువకుడు చాక్లెట్ ఇప్పిస్తానని తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నామన్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. బాలిక శవాన్ని కేఎంసీ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించామన్నారు. కామాంధునికి వైద్య పరీక్షలు చేపట్టామన్నారు. ప్రజలతో కమిషనర్ మాట్లాడి నచ్చజెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. హుబ్లీ నగరంలో ఘోరం వలస కూలీ కిరాతకం వెల్లువెత్తిన ప్రజాగ్రహం, ధర్నా -
ఎయిర్పోర్టులో హిందీ మాయం?
దొడ్డబళ్లాపురం: బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయం డిస్ప్లే బోర్డులో ఇంగ్లీష్, హిందీలో మాత్రమే సమాచారం ఇచ్చేవారు. ఆకస్మాత్తుగా హిందీ భాషను తీసివేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కన్నడలో సమాచారం వస్తోంది. ఎయిర్పోర్టు అథారిటీ అధికారికంగా ఏమీ ప్రకటన చేయకపోయినా దక్షిణాదిలో బలవంతంగా హిందీ అని విమర్శలు వస్తుండడంతో ఆ భాషను తీసివేసినట్లు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. కొందరు హిందీ తీసివేయడాన్ని సమర్థించారు. కన్నడలో మాత్రమే కనిపిస్తున్న డిస్ప్లే బోర్డు వీడియోను ఎక్స్లో 20 లక్షల మంది వీక్షించారు. మలప్రభ నదిలో బాలుడు, జవాన్ జలసమాధి దొడ్డబళ్లాపురం: నదిలో స్నానానికి దిగిన బాలుడు నీటమునగగా రక్షించబోయి ఒక సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోయిన సంఘటన బాగలకోట జిల్లా బాదామిలో చోటుచేసుకుంది. శేఖప్ప (15), మహంతేశ్ హొసమని (25) మృతులు. శనివారం సాయంత్రం బాలుడు శేఖప్ప స్నానం చేయడానికి మలప్రభ నదిలో కి దిగాడు. అయితే జారి నీటమునిగాడు. ఈ దృశ్యాన్ని చూసిన ఆర్మీ జవాన్ మహంతేశ్ బాలున్ని రక్షించాలని నదిలోకి దిగాడు, కానీ ఇద్దరూ నీటమునిగి మరణించారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు గాలింపు జరిపి మృతదేహాలను వెలికి తీశారు. జవాన్ మహంతేశ్ మూడేళ్ల కిందట సైన్యంలో ఉద్యోగంలో చేరి కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. సెలవు మీద ఊరికి వచ్చి ప్రాణాలు పొగొట్టుకున్నాడని కుటుంబీకులు విలపించారు. పసిగుడ్డును వదిలేసిన తల్లి దొడ్డబళ్లాపురం: కాన్పు జరిగి ఆడపిల్ల పుట్టినా, మగ పిల్లాడే అయినా తల్లి ప్రేమగా ఒడిలోకి తీసుకుని లాలిస్తుంది. కానీ ఈ రాక్షసి తల్లి మాత్రం పాప పుట్టిందని ఆగ్రహించి పురిటి బిడ్డను ఆస్పత్రిలోనే వదిలి వెళ్లిపోయిన అమానుష సంఘటన బాగలకోటలోని ప్రైవేటు ఆస్పత్రిలో చోటుచేసుకుంది. కాన్పు అయిన తరువాత ఆస్పత్రి సిబ్బంది కళ్లుగప్పి బాలింత ఒక్కటే పరారైంది. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. కూతురు జన్మించడం వల్లే ఇలా చేసిందని ఆస్పత్రి సిబ్బంది అనుమానిస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది పోలీసులు, మహిళా– శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు పాపను ఆశ్రయ కేంద్రానికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. నేత్రపర్వంగా ఎల్లమ్మ కరగ విజయపుర: ఇక్కడి శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి ఆలయంలో 86వ పూల కరగ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా పూలతో అలంకరించారు. ప్రత్యేకంగా పలువురు భక్తులు పూల, ముత్యాల పల్లకీలను ఏర్పాటు చేశారు. మల్లెలు, కనకాంబరాలతో తీర్చిదిద్దిన కరగను పూజారి ఎత్తుకుని మేళతాళాలకు అనుగుణంగా నాట్యమాడుతూ పురవీధుల్లో ముందుకు సాగారు. గోపురం నుంచి దూకాలని యత్నం మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని మలేమహదేశ్వర బెట్టలో ఉన్న ప్రసిద్ధ మలెమహదేశ్వర దేవస్థానం గోపురం ఎక్కి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. ఆ వ్యక్తిని ఆలయ సిబ్బంది రక్షించారు. మైసూరు జిల్లా హెచ్డీ కోటెకు చెందిన మృత్యుంజయ అనే వ్యక్తి గోపురం నుంచి ఎక్కి దూకాలని యత్నించాడు. ఇతడు గోపురం ఎక్కుతున్నట్టు గుర్తించిన సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని బుజ్జగించి కిందకి దిగేలా చేశారు. ఇతడు కుటుంబ సమస్యలతో మానసికంగా కుంగిపోయి ఉన్నట్లు తెలిసింది. శరీరంపై ఎలాంటి దుస్తులు లేకపోవడంతో పోలీసులే కొత్త దుస్తులు తెప్పించి ఇచ్చారు. బస్సు చార్జీలు కూడా ఇచ్చి ఇంటికి పంపించారు. -
ఒకే దూడ, రెండు తలలు
కోలారు: సృష్టిలో వింతలకు లోటు ఉండదు. అలాంటిదే ఈ సంఘటన. ఓ ఆవు రెండు తలల దూడకు జన్మనిచ్చింది. ఈ ఉదంతం కోలారు జిల్లాలోని ముళబాగిలు తాలూకా రామసంద్ర గ్రామంలో జరిగింది. యల్లప్ప అనే రైతుకు చెందిన ఓ జెర్సీ ఆవు ఆదివారం ప్రసవించింది. విచిత్రంగా రెండు తలల దూడ జన్మించింది. దేహం ఒకటే, రెండు తలలు, రెండు నోళ్లు, రెండు చెవులు, నాలుగు కళ్లు కలిగి ఉంది. వింత దూడను చూడడానికి చుట్టుపక్కల ఊళ్ల నుంచి జనం తండోపతండాలు రైతు ఇంటికి వస్తున్నారు. ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. పశు వైద్యులు వచ్చి ఆవు, దూడ ఆరోగ్యాన్ని పరీక్షించారు. తల్లీ బిడ్డ రెండూ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. రెండు తలలతో ఆశ్చర్యపరుస్తున్న దూడ -
కృష్ణా వంతెనలకు మోక్షమెన్నడో?
రాయచూరు రూరల్: దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వలేదన్న సామెత చందంగా ప్రజా ప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంతో రూ.38 కోట్లతో కృష్ణా నది పాయలపై చేపట్టిన వంతెనల నిర్మాణ పనులు అర్థంతరంగా ఆగిపోయాయి. రాయచూరు తాలూకాలోని అత్కూరు, కురువపుర మధ్య కృష్ణా నదికి అడ్డంగా వంతెన నిర్మాణాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. నది మధ్యలో 24 సిమెంట్ దిమ్మెలను నిర్మించారు. కురువపురలోని నారదగడ్డ దత్తాత్రేయుని ఆలయ దర్శనార్థం వెళ్లడానికి సుగమమైన మార్గం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 2011లో 675 మీటర్ల పొడవున వంతెన నిర్మాణ పనులను రూ.14.25 కోట్లతో శ్రీకారం చుట్టారు. తడిసి మోపైడెన వ్యయం 2022 నాటికి ఆ నిర్మాణ వ్యయం రూ.22 కోట్లకు చేరుకుంది. అర్థాంతరంగా ఆగిన వంతెన నిర్మాణ పనులను శాసన సభ్యుడి సోదరులు కాంట్రాక్ట్ పొందారు. శాసన సభ్యుడికి భయపడి అధికారులు వంతెన నిర్మాణ పనులకు సంబంధించి గత మూడేళ్ల నుంచి నోరు మెదపక పోవడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. ఇక మరో వంతెనను రాయచూరు తాలూకా దొంగరాంపుర వద్ద కృష్ణా నదికి అడ్డంగా 2008లో రూ.7 కోట్లతో దొంగరాంపుర, కుర్వకుర్ద మధ్య 285 మీటర్ల పొడవున నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినా పూర్తి కాకుండా పోయింది. టెండర్ ప్రకటనలో నిర్లక్ష్యంతో దాని వ్యయం నేడు రూ.14 కోట్ల మేర పెరిగింది. బిల్లుల మంజూరులో జాప్యం మొత్తం రూ.21 కోట్లతో పనులు చేయడానికి కాంట్రాక్టర్కు బిల్లులు మంజూరు చేయక పోవడంతో రెండు వంతెనల పనులు అర్థాంతరంగా నిలిచాయి. కురువపుర నారదగడ్డ దత్తాత్రేయుడు, కుర్వకుర్ద హనుమాన్ ఆలయ దర్శనార్థం వెళ్లే భక్తులు వర్షాకాలంలో నాటు పడవలు, తెప్పల్లో ప్రయాణం చేయాల్సి వస్తోంది. వంతెనల నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో నదిలో వరద ఎక్కువగా ఉన్నప్పుడు తెప్పలు, నాటు పడవలు మునిగి భక్తులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. కాగా ప్రతినిత్యం ట్రాక్టర్లు, జేసీబీలతో అక్రమంగా నదిలో నుంచి ఇసుక రవాణా మాత్రం యథేచ్ఛగా కొనసాగుతోంది. రూ.38 కోట్లతో నిర్మాణానికి శ్రీకారం అర్థంతరంగా ఆగిన వారధ ుల పనులు -
షరా మామూలేనా?
సైబర్ చీటింగ్ రూ.40 లక్షలు స్వాహా బనశంకరి: సిలికాన్ సిటీపై సైబర్ మోసగాళ్లు పంజా విసురుతున్నారు. తేలికగా డబ్బులు పడిపోతాయని మాటలతో మభ్యపెట్టి ప్రజలను లూటీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తమదైన పంథాలో పెట్రేగిపోతుంటే బాధితులు బిక్కమొగం వేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల మాయలో పడకండి... అని కాలర్ ట్యూన్స్, మీడియాలో ప్రకటనలు, హోర్డింగుల ద్వారా ప్రభుత్వాలు ప్రజలను ఎంత జాగృతం చేసినప్పటికీ షరా మామూలే అన్నట్లు అయిపోయింది. ఒకరికే రూ.2.68 కోట్ల శఠగోపం యూట్యూబ్ వీక్షించే సమయంలో ప్రకటన గమనించి మోసపూరిత ట్రేడింగ్ యాప్లో రూ.2.68 కోట్లు పెట్టుబడి పెట్టిన వ్యక్తి నిండా మునిగిపోయాడు. బెంగళూరు సుబ్రమణ్యపుర గుబ్బిలాళ అపార్టుమెంట్ నివాసి బేలూరు నరసింహమూర్తి రవీంద్ర అనే వ్యక్తి ఈ మేరకు దక్షిణ విభాగ సీఈఎన్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. జనవరి 3వ తేదీన ఇంట్లో నరసింహమూర్తి యూట్యూట్ చానల్ చూస్తుండగా అబాన్స్ స్మార్ట్స్ ట్రేడర్స్ అనే ప్రకటన వచ్చింది. దీనిపై క్లిక్చేయగానే శార్దూల్ జానీ అనే వ్యక్తి మొబైల్ నంబరు ఉంది. కాల్ చేసి మాట్లాడగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేసుకున్నారు. తమ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని నగదు పెట్టుబడి పెట్టాలని సలహా ఇచ్చారు. బాధితుడు కొంత మొత్తం పెట్టుబడి పెట్టగా 5 శాతం లాభం వచ్చింది. దీంతో మరింత ఆశ పెరిగి దశలవారీగా రూ.2.68 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఓసారి రూ.50 వేల కమీషన్ ఇచ్చారు. మిగిలిన నగదు వాపస్ ఇవ్వలేదు. తన డబ్బును విత్డ్రా చేయబోగా మరింత పెట్టుబడి పెడితే విత్డ్రా చేయవచ్చునని షరతు విధించారు. ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పైగా మోసగాళ్లు యాప్ను బ్లాక్ చేసి అడ్రస్ లేకుండా పోయారు. మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. బాధితుల కష్టార్జితం మోసగాళ్లపరం సిలికాన్ నగరంలో కేటుగాళ్ల పంజా ముగ్గురికి రూ. 3.74 కోట్ల టోకరా షేర్ల పేరుతో చీటింగ్ యాప్లలో పెట్టుబడులు ఫలితమివ్వని జాగృతి చర్యలు రూ.66 లక్షలు అంతే బనశంకరి మూడో స్టేజ్వాసి శ్రీనివాసపుర మంజునాథ్ అనే వ్యక్తి వాట్సాప్కు ఓ మెసేజ్ వచ్చింది. తమ యాప్ ద్వారా పెట్టుబడి పెట్టాలని సూచించారు. నమ్మిన అతడు రూ.66.51 లక్షలు ధారపోసి లబోదిబోమన్నాడు. ఫిబ్రవరి 17 తేదీన మంజునాథ్ వాట్సాప్కు మిరే అసెట్ షేర్ఖాన్ సెక్యురిటీస్లో పెట్టుబడి పెడితే చాలా లాభం లభిస్తుందని ఆశపెట్టారు. దీనిని నమ్మిన మంజునాథ్ లింక్పై క్లిక్చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకుని దశలవారీగా షేర్లు కొనుగోలు, విక్రయాలు నిర్వహించాడు. అలాగే రూ.66.51 లక్షలు విలువచేసే షేర్లు కొనుగోలు చేశారు. యాప్లో రూ.1.08 కోట్ల లాభం గడించినట్లు చూపించారు. ఇటీవల కొంతసొమ్ము డ్రా చేయడానికి ప్రయత్నించగా కుదరలేదు. వారికి కాల్ చేయగా అందుబాటులోకి రాకుండా పోవడంతో వంచించారని గ్రహించిన మంజునాథ్ దక్షిణ విభాగం సీఈఎన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బనశంకరి మూడోస్టేజ్ ఐటీఐ లేఔట్ నివాసి వాదిరాజ్రావ్ అనే వ్యక్తి యాప్లో రూ.5.19 కోట్లు లాభం గడించినట్లు ఆశచూపించి రూ.40 లక్షల వంచనకు పాల్పడ్డారు. ప్రైవేటు కంపెనీ జనరల్ మేనేజర్ అయిన వాదిరాజ్రావ్ వాట్సాప్లో వచ్చిన లింక్పై క్లిక్చేసి ఓ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. షేర్లను కొనుగోలు, విక్రయాలు చేయడం కోసం నగదు బదిలీ చేశాడు. ఫిబ్రవరి 24 నుంచి ఏప్రిల్ 02 తేదీ వరకు దశలవారీగా సుమారు రూ. 40 లక్షలు పెట్టుబడి పెట్టారు. అప్లికేషన్లో రూ.5.19 కోట్లు లాభం వచ్చిందని చూపించారు. కానీ విత్డ్రా చేయడానికి అవకాశం ఇవ్వలేదు. దీనిపై ప్రశ్నించగా వంచకులు ఆయనను బ్లాక్ చేశారు. బాధితుడు దక్షిణ విభాగ సీఈఎన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
తీర్థయాత్రలో పెను విషాదం
పుంగనూరు: ఉపాధ్యాయ దంపతులు నూతన కారు కొనుగోలు చేశారు. అదే సమయంలో కుమార్తె ఇంటర్లో అధిక మార్కులు సాధించడంతో సంతోషంగా తీర్థ యాత్రకు వెళ్లి ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో తీర్థయాత్ర అంతిమ యాత్రగా మారింది. ఓ లారీ మృత్యువు రూపంలో వచ్చి ఆ సంతోషాన్ని క్షణాల్లో చిదిమేయడంతో తల్లి మృతి చెందగా భర్త, కుమార్తె తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ విషాదకర సంఘటన ఆదివారం జరిగింది. తిరువణ్నామలైకి వెళ్లి వస్తుండగా.. వివరాలిలా ఉన్నాయి. శ్రీసత్యసాయి(పుట్టపర్తి) జిల్లా కదిరి పట్టణంలో నివాసం ఉన్న వెంకటరమణ (48) , శారద (45) ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. వీరికి కుమార్తె కీర్తన (17), కుమారుడు శ్రీకర్ (12) ఉన్నారు. వెంకటరమణ నూతనంగా కారు కొనుగోలు చేశారు. కుమార్తె ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 976 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. కుమారుడు శ్రీకర్ విజయవాడలో 7వ తరగతి చదువుతున్నాడు. శనివారం తమిళనాడులోని తిరువణ్నామలైలో గిరి ప్రదక్షిణానికి వెళ్లారు. స్వామి వారిని దర్శించుకుని ఆదివారం ఉదయం అక్కడి నుంచి కదిరికి బయలు దేరారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు.. పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్దకు కారు రాగానే ఎదురుగా మదనపల్లె నుంచి వస్తున్న ఐషర్ లారీ, కారు ఢీకొన్నాయి. కారు నుజ్జునుజ్జు కాగా ఈ ప్రమాదంలో శారద అక్కడికక్కడే చనిపోయింది. వెంకటరమణ, కుమార్తె కీర్తన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి బాధితులను మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేపట్టారు. శారద కదిరి మండలం బాలప్పగారిపల్లెలో టీచర్గా పని చేస్తున్నారు. వెంకటరమణ అన్నమయ్య జిల్లా సోంపల్లెలో స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. కాగా వెంకటరమణ స్వగ్రామం కలకడ మండలం ఎర్రయ్యగారిపల్లె కావడంతో అంత్యక్రియలు అక్కడ నిర్వహించనున్నారు. ఈ ఘటనతో బంధుమిత్రుల రోదనలు చూపరులను కలచివేశాయి. కొత్త కారు, ఐషర్ లారీ ఢీ మహిళా టీచర్ దుర్మరణం భర్త, కూతురికి తీవ్రగాయాలు పుంగనూరు వద్ద విషాదం బాధితులు కదిరివాసులు -
పెళ్లి చేసుకుంటున్న ప్రేమ జంటపై దాడి
రాయచూరు రూరల్: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకోవడానికి వచ్చిన ప్రేమ జంటపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేసి గాయపరిచిన ఘటన బాగల్కోటె జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. జమఖండి ఉళ్లాగడ్డి కాలనీలో గాణిగ సమాజానికి చెందిన లక్ష్మి, మరాఠ సముదాయానికి చెందిన అప్పాజీ ప్రేమించుకున్నారు. యువతి కుటుంబ సభ్యుల వ్యతిరేకత మధ్య ఆ జంట పెళ్లి చేసుకోడానికి సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న యువతి లక్ష్మి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని యువకుడిపై దాడి చేశారు. యువతిని కూడా రక్తం కారేలా కొట్టి తమ వెంట తీసుకెళ్లారు. ఈ విషయంలో యువకుడు అప్పాజీని తన చేయి వదల వద్దని రక్తం కారుతున్నా ఆటోలో కూర్చొని చేయి చూపుతూ తనను రక్షించాలని అభ్యర్థించిన లక్ష్మి తీరు చూపరులందరి మనస్సులను కదిలించింది. ఘటనపై జమఖండి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతి కుటుంబ సభ్యుల చేతిలో యువతీ యువకులకు గాయాలు -
చట్టాన్ని విరమించుకోకుంటే ఉగ్ర పోరాటం
హొసపేటె: కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అంజుమన్ ఖిద్మతే ఇస్లాం కమిటీ ఆధ్వర్యంలో వేలాది మంది ముస్లిం సమాజ సభ్యులు శుక్రవారం నగరంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని దిగ్బంధించి నిరసన తెలిపారు. నగరంలోని ఈద్గా మైదానం నుంచి ర్యాలీ ప్రారంభించి డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సర్కిల్ గుండా వెళ్లిన నిరసనకారులు తహసీల్దార్ కార్యాలయం ముందు రోడ్డును దిగ్బంధించారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హుడా అధ్యక్షుడు హెచ్ఎన్ఎఫ్ ఇమామ్ నియాజీ మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు భారత రాజ్యాంగంపై దాడి అన్నారు. మైనార్టీలను అవమానించి వారి హక్కులను హరించడమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం అని తెలిపారు. భారత సమాజాన్ని విభజించే లక్ష్యంతో ఉన్న వక్ఫ్ సవరణ బిల్లు–2025పై రాష్ట్రపతి సంతకం చేయకూడదని, దానిని రద్దు చేయాలని తెలిపారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అంటోంది బీజేపీ. అయితే నిరసనలో పాల్గొన్న సంఘం ఒక వర్గంపై వివక్ష చూపుతోందని ఆరోపించారు. రాజ్యాంగ ప్రాథమిక ఉద్దేశ్యానికి విరుద్ధంగా ఉన్న చట్టాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చట్టాన్ని కర్ణాటకలో అమలు చేయకుండా నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. డాక్టర్ మైనుద్దీన్ దుర్వేష్, బడావలి, ఫిరోజ్ఖాన్, సద్దాం హుస్సేన్, గచ్చాఖాదర్, ఖాజా మహ్మద్ నియాజ్, రామచంద్రప్ప, భాస్కర్ రెడ్డి, జంబయ్య నాయక్, కరుణానిధి తదితరులు ఉన్నారు. -
అవార్డు నా బాధ్యతను పెంచింది
హొసపేటె: బెంగళూరులోని కర్ణాటక ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ నిర్వహించిన రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో విజయనగర జిల్లా హొసపేటె తాలూకా తుంగభద్ర ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యురాలు పార్వతి సేవలకు గుర్తింపుగా ఛాయాశ్రీ అవార్డును అందుకున్నారు. శనివారం బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్లోని ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి సంజయ్కుమార్ ఈ అవార్డును ప్రదానం చేశారు. అవార్డును స్వీకరించిన తర్వాత పార్వతి మాట్లాడుతూ ప్రతి రోజూ కష్టపడి పని చేసే వారికి ఇలాంటి అవార్డులు ఇవ్వాలని అన్నారు. అప్పుడే వారికి వృత్తిపై బాధ్యత పెరుగుతుందన్నారు. ఛాయాశ్రీ అవార్డు అందుకోవడం నాకు లభించిన వరం. ఈ అవార్డు తన బాధ్యతను పెంచిందని ఆమె అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. బైక్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఒకరి మృతి హుబ్లీ: ద్విచక్ర వాహనాన్ని కేఎస్ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఎరబలి గ్రామం వద్ద శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. మృతుడిని మంజునాథ్(35)గా గుర్తించారు. భార్య పుట్టింట్లో ప్రసవానికి మచ్చురళ్లికి వెళ్లింది. మంజునాథ్ 20 రోజుల శిశువు, భార్యను చూసుకొని రాత్రి తిరిగి బైక్లో వస్తుండగా తుమకూరు వైపు నుంచి మనసూరళ్లికి వెళుతున్న ఆర్టీసీ బస్సు, బైక్ ముఖాముఖిగా ఢీకొన్నాయి. ఘటన విషయం తెలియగానే బేలూరు స్టేషన్ ఎస్ఐ నాగరాజ్ తమ సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని తదుపరి చర్యలను చేపట్టారు. అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య రాయచూరు రూరల్: అప్పుల బాధ తాళ లేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలబుర్గి జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడిని జేవర్గి తాలూకా సొన్న గ్రామానికి చెందిన రైతు కరెప్ప పూజారి(58)గా పోలీసులు గుర్తించారు. పొలం కౌలుకు తీసుకోవడంతో మూడేళ్ల నుంచి పంటలు పండక పోవడంతో వాణిజ్య బ్యాంకుల్లో రూ.5 లక్షల మేర రుణాలు తీసుకున్నారు. బ్యాంకు అధికారులు తీసుకున్న రుణాలను చెల్లించాలని ఒత్తిడి తేవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పుష్కరిణిలో పడి బాలుడు దుర్మరణంరాయచూరు రూరల్: కాలు జారి పుష్కరిణిలో పడి అభిషేక్(8) అనే బాలుడు దుర్మరణం పాలైన ఘటన జిల్లాలోని లింగసూగూరు తాలూకాలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. విజయపుర నుంచి దైవ దర్శనం కోసం గురుగుంట అమరేశ్వర ఆలయానికి వచ్చిన కుటుంబం ఆలయ ఆవరణలోని పుష్కరిణిలో స్నానం కోసం దిగారు. బాలుడు పైభాగంలో ఆడుకుంటుండగా అకస్మాత్తుగా కాలు జారి పుష్కరిణిలో పడి మరణించాడు. తారానాథ్ సేవలు చిరస్మరణీయంహుబ్లీ: ఎవరిపైనా పక్షపాతం చూపకుండా అందరిని కలుపుకొని పోయే పండిత్ రాజీవ్ తారానాథ్ మాటలు తనను ఆకర్షించాయని, ఆయన మాటలు వింటూనే తాను ఆయన శిష్యుడిగా మారిపోయానని సీనియర్ సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ చంద్రశేఖర్ కంబార అన్నారు. ధార్వాడ సృజన రంగమందిరంలో పండిత్ రాజీవ్ తారానాథ మెమోరియల్ ట్రస్ట్, జీబీ జోషి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తారానాథ పుస్తకాన్ని ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. సంగీత సాహిత్య రంగాలకు పండిత్ రాజీవ్ తారానాథ్ అందించిన సేవలు అపారం అన్నారు. ఆయన ఓ మేధావి అని, ఎప్పుడు గలగలా మాట్లాడుతూ అందరి ప్రేమ, స్నేహాలను దక్కించుకున్న అపూర్వ వ్యక్తిత్వం ఆయనది అన్నారు. ఉత్తర, దక్షిణ కర్ణాటక అన్న భేదం లేకుండా అందరితో కలిసిన సమగ్ర కర్ణాటక, అఖండ భారతం మాటలను సదా మాట్లాడేవారు. గురువుపై అపారమైన గౌరవం కలిగిన పండిత్ రాజీవ్ తారానాథ్ ఓ గురువుగా ఎంతో మంది శిష్యులను తీర్చిదిద్దారన్నారు. హిందూ ముస్లిం భేదభావాలు లేకుండా శిష్యులందరికీ చక్కటి మార్గదర్శనం చేసి కీర్తి గడించారన్నారు. సదరు పుస్తకం గురించి డాక్టర్ బసవరాజ్ కల్గుడి మాట్లాడారు. రాజీవ్ తారానాథ్ జీవితంపై నిర్మించిన సాక్ష్య చిత్ర ప్రదర్శన నిర్వహించారు. ప్రముఖ వేణుగాన వాదకులు పండిత్ ప్రవీణ్ గోడ్ఖిండి వేణుగానం అందరిని మంత్రముగ్ధులను చేసింది. పద్మశ్రీ పండిత్ వెంకటేష్ కుమార్, సాహితీవేత్త కాకండికి, డాక్టర్ రమాకాంత్ జోషి, డాక్టర్ బసవరాజ్ కల్గుడి, సమీర్ జోషి, ఉదయ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు. -
శ్రీఆంజనేయం.. ప్రసన్నాంజనేయం
హొసపేటె: హనుమ జయంతిలో భాగంగా శనివారం కొప్పళ జిల్లా గంగావతి తాలూకా ఆనెగుంది సమీపంలోని అంజనాద్రి కొండను భక్తులు పెద్ద సంఖ్యలో సందర్శించి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. హనుమ జయంతి, రెండో శనివారం ప్రభుత్వ సెలవు దినం కావడంతో, ప్రతి సంవత్సరం కంటే ఈ సారి ఎక్కువ మంది హనుమ భక్తులు కొండకు వచ్చారు. తెల్లవారు జాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో కాలినడకన తరలివచ్చారు. జిల్లా నుంచి, జిల్లా వెలుపల, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. గంగావతి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి జనార్ధనరెడ్డి అంజనాద్రిలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాలా మంది మాలధారులు కొండ వద్దకు చేరుకుని మాల విసర్జన చేశారు. హనుమంతుని విగ్రహానికి అభిషేకం చేసి, పూలమాలలతో, దీపాలతో పూజలు చేసి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. అంజన్నకు ప్రత్యేక పూజలు రాయచూరు రూరల్: జిల్లాలో హనుమ జయంతిని ఘనంగా ఆచరించారు. శనివారం నగరంలోని ఐబీ రోడ్డులో వెలసిన వరసిద్ధి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. హనుమంతుడికి ప్రత్యేక అలంకరణతో పూజలు చేశారు. భక్తులు ఊయల సేవ, అభిషేకం తదితర పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవానికి స్వామీజీ, మాజీ ఎమ్మెల్యే హాజరు నగరంలోని వీరాంజనేయ దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవంలో కిల్లె బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు, మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి, శానన సభ్యుడు శివరాజ్ పాటిల్ పాల్గొని హనుమంతుడికి పూజలు చేశారు. ప్రభుత్వ ఉద్యానవనంలో, హనుమాన్ ఆలయంలో అర్చకుడు నరేంద్ర భక్తులకు పూజలు జరిపి అన్నప్రసాదం చేశారు. బసవన బావి చౌక్లోని ఆలయంలో హిందూ జన జాగృతి సంస్థ ఆధ్వర్యంలో గద పూజలు జరిపి అన్నసంతర్పణం గావించారు. భక్తులతో అంజనాద్రి కొండ కిటకిట ఘనంగా హనుమ జయంతి వేడుక -
తాగునీటి ఎద్దడి తలెత్తనీయొద్దు
రాయచూరు రూరల్: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తనీయ వద్దని, దాని నియంత్రణకు అధికారులు తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ అధికారులకు సూచించారు. శనివారం జిల్లాధికారి కార్యాలయంలో జరిగిన టాస్క్ఫోర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి కాలం ప్రారంభమైందన్నారు. నాలుగు నెలల పాటు ప్రజలు తాగునీటి ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశించారు. నీటి సౌకర్యాలు లేని గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరందించేందుకు యజమానులతో చర్చించాలన్నారు. ఎక్కడా కూడా ప్రజలు నీటితో ఇబ్బందులు పడుతున్నారనే విషయం తన దృష్టికి రాకుండా చూడాలన్నారు. సింధనూరు, మస్కి, మాన్వి తాలూకాల్లో అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్టం అంచనాలను తయారు చేసి పరిహారం అందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులను నీటితో నింపాలన్నారు. జల్ జీవన్ మిషన్, జలధారె పథకాలను సక్రమంగా అమలు చేయాలన్నారు. సమావేశంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, లోక్సభ సభ్యుడు కుమార నాయక్, శాసన సభ్యులు బసన గౌడ, శివరాజ్ పాటిల్, హంపయ్య నాయక్, హంపనగౌడ బాదర్లి, విధాన పరిషత్ సభ్యులు వసంత కుమార్, బసనగౌడ, జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారాం పాండే, ఎస్పీ పుట్టమాదయ్య, ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున, ఉపాధ్యక్షుడు బషీర్లున్నారు.అధికారులకు మంత్రి శరణ ప్రకాష్ సూచన -
మఠంలో రూ.300 కోట్లు ఉన్నాయని..
● దోపిడీకి యత్నించిన ముఠా.. అరెస్టు శివమొగ్గ: తీర్థహళ్లి తాలూకాలోని మహిషిలోని ఉత్తరాది మఠంలో జరిగిన దోపిడీ ఘటనలో 13 మంది నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ జీకే మిథున్ కుమార్ తెలిపారు. డీఏఆర్ సభాంగణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిషి మఠంలో సుమారు రూ.300 కోట్ల నగదు ఉన్నట్లు అనుమానించిన దుండగులు ఈనెల 5న అర్థరాత్రి మఠంలోకి చొరబడ్డారు. పలుచోట్ల గాలించగా అంత మొత్తం నగదు ఏదీ దొరకలేదు. చివరకు రూ. 50 వేల నగదుతో పరారయ్యారు. మఠంలోని సీసీ కెమెరాలు, డీవీఆర్, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను కూడా ఎత్తుకెళ్లారు. పోలీసులు సురేష్ అలియాస్ నేరలె సురేష్, సతీష్ అలియాస్ సత్యనారాయణ, పృథ్విరాజ్, సిరి అలియాస్ శ్రీకాంత్, అభిలాష్ అలియాస్ అభి, రాకేష్, భరత్ అలియాస్ చిట్టి, పవన్ అలియాస్ గిడ్డ పవన్, రమేష్ అలియాస్ నవీన్, నవీన్ కుమార్ అలియాస్ డైమండ్ నవీన్, దర్శన్, కరిబసప్ప, శీనాను పట్టుకున్నారు. వీరంతా శికారిపుర, ఆనందపుర, హొసనగర నివాసులు. కేసులో మొత్తం 21 మంది నిందితులున్నట్లు తెలిసింది. దోపిడీకి వాడిన టెంపో ట్రాక్స్ వాహనం, మహేంద్ర స్కార్పియో కారులను స్వాధీనపరచుకున్నారు. సాకప్ప సాకు.. జేడీఎస్ ధర్నా శివాజీనగర: రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ జేడీఎస్ సాకప్ప సాకు కాంగ్రెస్ ప్రభుత్వం అనే అభియానను కేంద్ర మంత్రి, జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు హెచ్.డీ.కుమారస్వామి ప్రారంభించారు. శనివారం నగరంలోని ఫ్రీడం పార్కులో యువ జనతాదళ రాష్ట్రాధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి నేతృత్వంలో ఆందోళనను నిర్వహించారు. వందలాదిగా కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ దుష్ట పరిపాలన, అవినీతితో పాటుగా ఐదు గ్యారెంటీల పేరుతో రాష్ట్రంలో సంపదను దోచుకొంటున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ ధర్నా చేస్తున్నట్లు నిఖిల్ చెప్పారు. ముట్టడికి యత్నంనిఖిల్, నాయకులు, కార్యకర్తలు విధానసౌధ ముట్టడికని బయలుదేరగా, పోలీసులు అడ్డుకున్నారు. నిఖిల్తో ఎమ్మెల్యేలు, నాయకులను అదుపులోకి తీసుకొని తరువాత విడుదల చేశారు. బీజేపీ జనాక్రోశ యాత్రతో రాష్ట్రంలో జిల్లాల్లో ర్యాలీలు, సభలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో జేడీఎస్ కూడా ధర్నాల బాట పట్టింది. రెండు పార్టీలు మిత్రపక్షాలు అయినప్పటికీ వేర్వేరుగా కార్యక్రమాలు చేపట్టడం గమనార్హం. క్యాంటర్ను ఢీకొన్న బస్సు యశవంతపుర: క్యాంటర్, కేఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో 20 మంది ప్రయాణికులు గాయడిన ఘటన రామనగర జిల్లా మాగడి తాలూకా సోలూరు వద్ద శనివారం జరిగింది. బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. క్యాంటర్ వాహనం పంచరై మంగళూరు–బెంగళూరు హైవేలో నిలిచి ఉండగా వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొంది. డ్రైవర్ ఇరుక్కుపోయాడు. స్థానికులు, పోలీసులు జేసీబీతో రెండు వాహనాలను వేరు చేసి బాధితులను నెలమంగల ఆస్పత్రికి తరలించారు. మరిది కోసం.. భర్త హతం మైసూరు: చెల్లెలి భర్తతో అనైతిక సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను భార్య, ప్రియునితో కలిసి హత్య చేసిన ఘటన చామరాజనగర జిల్లా గుండ్లుపేటె తాలూకా తెరకణాంబి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. మూడగూరు గ్రామానికి చెందిన సిద్దేశ్ హత్యకు గురైన వ్యక్తి. సిద్దేశ్, సవిత దంపతులు కాగా సవితకు చెల్లెలి భర్తతో అక్రమ సంబంధం ఏర్పడింది. తమ ఆనందానికి సిద్దేశ్ అడ్డుగా ఉన్నాడని భావించారు. 3వ తేదీన అర్ధరాత్రి ఇంటిలో సిద్దేశ్ గాఢనిద్రలో ఉన్న సమయంలో ప్రియుడు సిద్దరాజుతో కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించింది. కాలిన గాయాలతో సిద్దేశ్ను ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించాడు. అగ్ని ప్రమాదంలో గాయాలైనట్లు భార్య అందరికీ చెప్పింది. కానీ సిద్దేశ్ తల్లి మహదేవమ్మ కోడలిపై అనుమానంతో ఫిర్యాదు మేరకు తెరకణాంబి పోలీసులు విచారణ చేశారు. సవిత, సిద్దరాజు నేరకృత్యం తెలిసి అరెస్టు చేసి జైలు తరలించారు. -
నమో లక్ష్మీ వేంకటరమణ..
● ఆలంబగిరి రథోత్సవం చింతామణి: తాలూకాలోని ఆలంబగిరి గ్రామంలో కొలువైన పురాణ ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ వెంకటరమణస్వామి ఆలయం బ్రహ్మ రథోత్సవం శనివారం నేత్రపర్వంగా జరిగింది. ధర్మాధికారి జయరాం దంపతులు శ్రీ కృష్ణ గంధోత్సవం సేవలను చేశారు. పండితులు రథ శాంతి, రథపూజ, హోమాలు, పూర్ణాహుతిను సమర్పించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటరమణస్వామి ఉత్సవ మూర్తులను పల్లకీలో దేవస్థానంలో ఊరేగించారు. ఉత్సవమూర్తులను తేరులో ఉంచి ఊరేగించారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తజనం తరలివచ్చారు. -
మంత్రి గారూ.. న్యాయం చేయండి
చింతామణి: ప్రభుత్వ పాఠశాలలో టీచరమ్మ బెత్తంతో కొట్టడంతో తమ కొడుకు కంటిచూపు పోయిందని, కారకులపై చర్యలు తీసుకొని మంత్రి సుధాకర్ న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరారు. తాలూకాలోని ఎగువకోట గ్రామంలో రెండవ తరగతి చదువుతున్న యశ్వంత్ అనే బాలున్ని ఉపాధ్యాయురాలు కట్టెతో కొట్టడంతో తలలో నరాలు దెబ్బతిని కంటి చూపు పోవడం తెలిసిందే. ఈ ఘటన రాజకీయంగానూ వేడెక్కిస్తోంది. బాలునికి న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పోలీస్స్టేషన్ ఎదుట ధర్నా చేయగా ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకొంటున్నారని జిల్లా మంత్రి సుధాకర్ చెప్పడం బాధాకరమని తల్లిదండ్రులు అంజలి, నటరాజ్ ఆవేదన చెందారు. మంత్రి ఒక తండ్రి మాదిరిగా తమ బిడ్డకు న్యాయం చేయాలని కోరారు. కళ్లుపోయిన చిన్నారి కన్నవారి మొర -
హుబ్లీ– ధారవాడకు కొత్త పథకం!
బనశంకరి: జంట నగరాలైన హుబ్లీ– ధారవాడ మధ్య ప్రయోగాత్మకంగా ఎలక్ట్రిక్ రాపిడ్ ట్రాన్సిట్ ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. శనివారం బెంగళూరులో నివాసంలో సీఎం సిద్దరామయ్య, ఉన్నతాధికారులు, కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. హుబ్లీ– ధారవాడ మధ్య ఎలక్ట్రిక్ రాపిడ్ ట్రాన్సిట్ పథకం అమలు చేయడం గురించి మూడు నెలల్లోగా పూర్తి నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేయాలని సీఎం సూచించారు. హుబ్లీ, ధారవాడలో ఈ పథకం విజయవంతమైతే ఇతర నగరాల్లోనూ కల్పిస్తామని తెలిపారు. మెట్రో తరహాలోని ఈ సంచార వ్యవస్థ యూరప్లోని అనేక దేశాల్లో నడుస్తోందని నిపుణులు తెలిపారు. మంత్రులు రామలింగారెడ్డి, సంతోష్లాడ్ తదితరులు పాల్గొన్నారు. ట్రామ్ల మాదిరిగా బ్యాటరీ బస్సులను నిర్ణీత మార్గంలో నడిపించడమే ఈ ట్రాన్సిట్ పథకం లక్ష్యం. కొన్ని దేశాల్లో ట్రాక్ల మీద నడుస్తాయి, కొన్ని దేశాల్లో ట్రాక్లు లేవు. -
ఉత్సాహంగా క్రికెట్ పోటీలు
బళ్లారిటౌన్: కర్ణాటక వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు హాసన నగరంలో శనివారం ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో మొత్తం 22 జట్లు పాల్గొనగా, తొలి రోజున 3 గంటల వరకు క్రికెట్ ఫోటీలు జరిగాయి. వర్షం కురవడంతో అర్ధంతరంగా నిలిచి పోయాయి. ఆదివారం సెమీ ఫైనల్, ఫైనల్ క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. తొలి రోజున ప్రారంభం అయిన ఈ క్రికెట్ పోటీలను హాసన ఎంపీ శ్రేయస్ పాటిల్, మాధ్యమ సలహాదారుడు కేవీ ప్రభాకర్, పలువురు ప్రజాప్రతినిధులతో పాటు వర్కింగ్ జరల్నిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శివానంద తగడూరు, ప్రధాన కార్యదర్శి లోకేష్, మదనగౌడ, జిల్లాధ్యక్షుడు వేణుకుమార్ తదితరులు ప్రారంభించి మాట్లాడారు. విలేకరులు తమ వార్తల సేకరణతో పాటు ఇలాంటి క్రీడల్లో పాల్గొనాలని పలువురు పేర్కొన్నారు. కాగా రాష్ట్ర స్థాయి విలేకరులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. సవదత్తి యల్లమ్మ దేవికి ప్రత్యేక పట్టు చీర●బంగారు లేపనపు చీరను కానుకగా సమర్పించిన స్వామీజీ రాయచూరు రూరల్: 70 ఏళ్ల క్రితం కన్న కలలకు నేడు అంకురార్పణ లభించడంతో సవదత్తి యల్లమ్మ దేవికి పట్టు చీరను బహూకరించినట్లు రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా వీరగోటె అడవిలింగ మహాస్వామీజీ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం బెళగావి జిల్లా సవదత్తిలోని యల్లమ్మ దేవి ఆలయంలో అమ్మవారికి రూ.4.5 లక్షలు విలువ చేసే బంగారు లేపనంతో కూడిన ప్రత్యేక పట్టు చీరను కానుకగా అర్చకుల చేతుల మీదుగా సమర్పించారు. వక్ఫ్బిల్లుపై వ్యాఖ్యలు.. ఇద్దరు అరెస్ట్సాక్షి,బళ్లారి: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని లోక్సభ, రాజ్యసభల్లో బిల్లును ఆమోదింపజేసినందున వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఇద్దరిని దావణగెరె పోలీసులు అరెస్ట్ చేశారు. దావణగెరెలోని మాజీ కార్పొరేటర్ కబీర్ఖాన్తో పాటు మరో ఇద్దరు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి, కబీర్ఖాన్ ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అకాల వర్షానికి పంటనష్టం రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో అకాల వర్ష బీభత్సంతో కోతకొచ్చిన వరి పైరుకు నష్టం సంభవించింది. మాన్వి, మస్కి, దేవదుర్గ, సింధనూరు తాలూకాల్లో వేలాది ఎకరాల్లో పంట నేల పాలైంది. శనివారం మస్కి శాసన సభ్యుడు బసనగౌడ తుర్విహాళ అకాల వర్షం వల్ల తాలూకాలో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించారు. మస్కి తాలూకా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వేసుకున్న వరి పంట చేతికొచ్చే సమయంలో వరుణ దేవుడు కరుణించకుండా కాటు వేశాడని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఎకరాకు రూ.25 వేలు చొప్పున పరిహారం అందించి మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. తహసీల్దార్కు నష్టం అంచనాను తయారు చేసి సర్కార్కు నివేదిక పంపాలని ఆదేశించారు. 80 లీటర్ల కల్తీ కల్లు స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్రాయచూరు రూరల్: నగరంలో కల్తీ కల్లు విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ పోలీసులు దాడులు జరిపి 80 లీటర్ల కల్తీ కల్లు స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం రైల్వే స్టేషన్ వద్ద మంగళవారపేట కాలనీ రవి, రాముల నుంచి 80 లీటర్ల కల్తీ కల్లును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
ప్రైవేటు చదువు.. మరింత భారం
శివాజీనగర: బెంగళూరులో ప్రైవేటు స్కూళ్లలో నర్సరీ, ఎల్కేజీల ఫీజులు రూ. 80 వేల కంటే ఎక్కువగా ఉన్నాయి. పై తరగతులకు వెళ్లేకొద్దీ మరింత అధికం. రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో ఇదే తీరు. అన్నిరకాల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజలకు మరో షాక్ ఎదురైంది. ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చదివించే తల్లిదండ్రులకు ఈ సంవత్సరం నుండి ఆర్థిక భారం మరింత అధికం కానున్నది. రాష్ట్రంలో పలు ప్రైవేట్ పాఠశాలు ఫీజులను భారీ మొత్తంలో పెంచడమే కారణం. అనేక ప్రైవేటు పాఠశాలల్లో 15 నుంచి 20 శాతం వరకు అడ్మిషన్ ఫీజులను పెంచాయి. స్కూళ్ల నిర్వహణ ఖర్చు, సిబ్బంది జీతం, వాహనాలు, డీజిల్ ధరల భారం అని పలు కారణాలు చూపుతూ బాదుడును సమర్థించుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల డీజిల్పై సుంకాన్ని పెంచడం తెలిసిందే. నీరు, ఆస్తిపన్ను సహా పలు రకాల సుంకాలను చెల్లించడం, ఉపాధ్యాయులు, సిబ్బంది జీతాల చెల్లింపులు అధికం అయినందున ఫీజులను పెంచడం అనివార్యమైందని ప్రైవేట్ పాఠశాలల సంఘాల ప్రతినిధులు తెలిపారు. కొన్ని స్కూళ్లలో 30 శాతం వరకూ పెంచడం గమనార్హం. డీజిల్ సుంకం చూపి వాహన ఫీజు పెంపు స్కూల్ వాహనంపై ఇదివరకే ఫీజు పెంచారు, ప్రతి కుటుంబానికి నెలకు 500 నుంచి 600 రూపాయల వరకు అదనంగా భారం పడుతోంది. వాహన ఫీజు పెంచినందుకు తల్లిదండ్రులు వ్యతిరేకతను వ్యక్తం చేసినా స్పందన లేదు. ఇలా ఉండగా పుస్తకాల, నోటు బుక్ల ధరలను కూడా ఇష్టానుసారం పెంచడమైనది. పిల్లల తల్లిదండ్రులకు ఇది తీవ్ర భారమవుతోంది. ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయి, స్కూలు ఫీజులను పెంచడం సరి కాదని తెలిపారు. 20 శాతం ఫీజులు పెంచిన వైనం ఇప్పటికే బాదుడుతో జనం లబోదిబో విద్యార్థుల తల్లిదండ్రులకు భారీ షాక్ నియంత్రణ ఎక్కడ? సిలికాన్ సిటీ అనే పేరును సాకుగా తీసుకుని బెంగళూరులోని వేలాది ప్రైవేటు స్కూళ్లు ఇష్టారాజ్యంగా ఫీజులను వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఆకర్షణీయమైన పేర్లు పెట్టుకున్న స్కూళ్లు ఏబీసీడీలను ఏర్పడానికే ఏటా లక్షల రూపాయలను తల్లిదండ్రుల నుంచి పిండుకుంటున్నాయి. ఫీజుల వసూలుకు ఎలాంటి ప్రాతిపదిక ఉండదు. ప్రభుత్వ నియంత్రణ అసలే ఉండదు. పెద్దలకు ముడుపులు చెల్లిస్తూ, పిల్లలపై ఫీజుల దోపిడీని కొనసాగిస్తుంటారు. ఆయా స్కూళ్ల వెబ్సైట్లలో చూస్తే ఫీజులు నామమాత్రమేనని సమాచారం ఉంటుంది. నమ్మి వెళ్తే.. పది ఇరవై అంశాలను ప్రస్తావించి రుసుము రూ.లక్ష పైనే అంటారు. ఇది ఎల్కేజీ, యూకేజీకి మాత్రమే. ఆరు ఏడు తరగతుల ఫీజులు ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ విద్యార్థులు చెల్లించే రుసుముల కంటే అధికమైనా ఆశ్చర్యం లేదు. మధ్య తరగతి, వేతన జీవులు గత్యంతరం లేక చదివిస్తుంటారు. -
పుణ్యప్రదం తీర్థస్నానం
మండ్య: ప్రఖ్యాత మేలుకోటె దేవస్థానంలో చెలువనారాయణ స్వామికి వైరముడి బ్రహ్మోత్సవ తీర్థస్నానం మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ శనివారం జరిగింది. సుమారు 50 వేల మందికి పైగా భక్తులు తీర్థ స్నానంలో పాల్గొన్నారు. కన్నడనాడు సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ, మంగళవాయిద్యాలు, వేదమంత్రాల ఘోషణ నడుమ అభిషేకం జరిగింది. మధ్యాహ్నం 2.30 గంటలకు ఉత్సవ కళ్యాణికి విచ్చేసి తీర్థ స్నాన ప్రక్రియలు ప్రారంభించారు. పుష్కరిణి నాలుగు వైపుల భక్తులు పవిత్ర స్నానం ఆచరించారు. చెలువనారాయణ స్వామి, అమ్మవారి సన్నిధిలో సంధానసేవ చేపట్టారు. ఈ సందర్భంగా పల్లకీ ఉత్సవం నిర్వహించారు. మేలుకోటెలో భక్త సాగరం -
యువకుని దారుణ హత్య
సాక్షి,బళ్లారి: దావణగెరె జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన జరిగింది. వివరాలు.. చిత్రదుర్గ జిల్లా హెగ్డేహాళ్ గ్రామానికి చెందిన శివకుమార్(28), పరిమళ ప్రేమించుకున్నారు. అయితే పరిమళ పెళ్లి దావణగెరె జిల్లా హొన్నూరుహట్టి గ్రామానికి చెందిన జయప్పతో జరిగింది. పెళ్లి అయినప్పటికీ పరిమళ, శివకుమార్ ఇరువురి మధ్య స్నేహం, ప్రేమ దూరం కాకపోవడంతో పాటు శుక్రవారం ఇద్దరు కలిసి ఉన్న సమయంలో జయప్ప చూడటంతో పెద్ద బండరాయి తీసుకుని శివకుమార్ తలపై వేసి హత్య చేశాడు. భార్య ప్రియుడి వ్యామోహం నుంచి బయట పడకపోవడంతో కోపంతో ఈ హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కూతురితో కలిసి ఆత్మాహుతియత్నం ●● తల్లి మృతి, కుమార్తెకు తీవ్ర గాయాలు హొసపేటె: కొప్పళ జిల్లా గంగావతిలోని జయనగర్లో ఒక మహిళ తన కూతురితో కలిసి శుక్రవారం ఇంటిలో నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని సుమంగళగా పోలీసులు గుర్తించారు. భర్త నిరంతర వేధింపుల కారణంగానే తన ఐదేళ్ల కుమార్తెతో కలిసి ఒంటికి నిప్పు అంటించుకొంది. ఈ ఘటనలో సుమంగళ తీవ్ర గాయాలతో మరణించగా, ఆమె కుమార్తె ప్రాణాపాయం నుంచి బయటపడింది. గాయపడిన కుమార్తెను బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. పదవి కోసమే సీఎం కులగణన అస్త్రం ● కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వీ.సోమణ్ణ హుబ్లీ: తమ పదవిని కాపాడుకోవడానికి సీఎం సిద్దరామయ్య కులగణన అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వీ.సోమణ్ణ ఆరోపించారు. హుబ్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల బాగు కోసం ఆలోచించాల్సిన సిద్దరామయ్య కేవలం తన స్వార్థం కోసం రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కులగణన విషయంలో కాంగ్రెస్లోనే ఏకాభిప్రాయం కరువైందన్నారు. సాధక బాధకాలపై అవగాహన లేకుండా మంత్రివర్గంలో సదరు నివేదికను ప్రతిపాదిస్తున్నారన్నారు. కమిషన్ విషయంలో కాంట్రాక్టర్ల ఆరోపణలపై స్పందించిన ఆయన కాంట్రాక్టర్లు బీజేపీ సర్కారును తొలగించారు. ఇప్పుడు వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తారన్నారు. సిద్దరామయ్యతో కలిసి ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశాను, పాత సిద్దరామయ్య ఇప్పుడు లేరు. ఇప్పటి సిద్దరామయ్య ఎవరు అన్నది తనకు తెలియదని అన్నారు. బీజేపీ జనాక్రోశ యాత్రకు పోటీగా కాంగ్రెస్ చేపట్టిన యాత్రపై ఆయన మాట్లాడుతూ డీకే.శివకుమార్ ఇలాంటి కుయుక్తుల్లో మాస్టర్ మైండ్ అని అన్నారు. పైగా కాంగ్రెస్ నేతలకు చేసేందుకు ఏం పని లేదన్నారు. ఆర్థిక సమస్యతో వారి దుకాణం మూసివేశారన్నారు. బంద్ చేసిన దుకాణాన్ని ఏ విధంగా చెప్పుకోవాలి. లక్ష్యాథభిలు, ఉద్దేశాలు లేకుండా కొన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. రెండేళ్లలోపే ప్రజలు వీధుల్లో పథకాల వైఫల్యంపై చర్చించుకుంటున్నారన్నారు. వేసవి కాలంలో తాగునీరు, పశువుల రోగాలు, రైతుల గురించి ఆలోచించకుండా సమస్యలను దారి తప్పిస్తున్నారన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ నేతల తీరును చూసి ప్రజలు ఏవగించుకుంటున్నారన్నారు. కూలింగ్ వాటర్ యూనిట్ వితరణ రాయచూరు రూరల్: రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్) కళాశాల, పరిశోధన ఆస్పత్రికి జేసీఐ ఆధ్వర్యంలో కూలింగ్ వాటర్ యూనిట్ను వితరణ చేశారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి జేసీఐ సభ్యులు కమల్ కుమార్ ఈ యూనిట్ను అందించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులు, వారి సహాయకులకు చల్లని నీటిని అందించాలనే ఉద్దేశ్యంతో పంపిణీ చేశామన్నారు. గౌతమ్ కుమార్, సందీప్, వీరేంద్ర, బసవరాజ్లున్నారు. ఉపాధ్యాయ సేవలకు క్రమశిక్షణ ప్రధానం రాయచూరు రూరల్: నేటి సమాజంలో ఉపాధ్యాయ సేవలకు క్రమశిక్షణ ప్రధానం అని తాలూకా విద్యా శాఖాధికారి ఈరణ్ణ పేర్కొన్నారు. శుక్రవారం హష్మియా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బీఈఓ ఆధీనంలో ఉపాధ్యాయుల సేవా జ్యేష్టత పట్టిక, గురు స్పందన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ 2025–26వ విద్యా సంవత్సరంలో విద్యార్థులను పాఠశాలల్లో చేర్చడానికి కార్యరూపం దాల్చాలన్నారు. సేవానుభవం, వయోమితి ఆధారంగా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాఘవేంద్ర, శివరాజ్, ఆనంద్ కుమార్, భీమేష్ నాయక్, మల్లేష్ నాయక్, రావుత్రావ్లున్నారు. -
రేపు మెగా వైద్య పరీక్ష శిబిరం
రాయచూరు రూరల్: నగరంలో ఈనెల 13న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు భారతీయ వైద్య సంఘం అధ్యక్షుడు శ్రీశైలేష్ అమర్ఖేడ్ వెల్లడించారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ క్రీడా మైదానంలో భారతీయ వైద్య సంఘం, ఒపెక్ ఆస్పత్రి, రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్) కళాశాల, పరిశోధన ఆస్పత్రి, నవోదయ ఆస్పత్రి, జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో చర్మం, చెవులు, ముక్కు, గొంతు, చిన్న పిల్లల వ్యాధులు, గుండెపోటు, రక్తపోటు, చక్కెర, నేత్ర, ఈసీజీ వంటి సేవలను ప్రజలకు ఉచితంగా శిబిరంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైద్యులు దీపశ్రీ, రాఘవేంద్ర, శ్రీధర్ వైట్ల, నీలోఫర్, వీరనగౌడలున్నారు. చోరీ కేసుల్లో ముగ్గురు అరెస్టు ●● బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి పోలీసులు నాలుగు ఇళ్లలో జరిగిన చోరీ కేసులను ఛేదించి బంగారు ఆభరణాలను జప్తు చేసుకున్నారు. కూడ్లిగితో పాటు హగరిబొమ్మనహళ్లిలో నాలుగు ఇళ్లలో చోరీ కేసులను చేధించిన అక్కడి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, రూ.కోట్లాది విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని వారి నుంచి రూ.22 లక్షలు వసూలు చేశారు. హగరిబొమ్మనహళ్లికి చెందిన ఎం.ఇంద్ర, మరియమ్మనహళ్లికి చెందిన జీ.సతీష్గౌడ్, యడ్రమ్మనహళ్లికి చెందిన సుభాష్లను అరెస్టు చేశారు. 215 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి ఆభరణాలు, రూ.2 లక్షలు, రూ.10 లక్షలు విలువైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై కూడ్లిగి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గాయత్రి తపోభూమి రజతోత్సవాలకు శ్రీకారం హుబ్లీ: గాయత్రి మాతను కొలిచే ప్రధాన క్షేత్రాల్లో హుబ్లీలోని తడసద గాయత్రి తపోభూమి ప్రధానమైంది. ఈ శ్రీక్షేత్రం స్థాపించి రజతోత్సవాలకు చేరుకుంటున్న శుభవేళ శుక్రవారం వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. శ్రీచక్ర ప్రతిష్టాపన, శ్రీదక్షిణామూర్తి, నవగ్రహాల ప్రతిష్టాపన, ధర్మధ్వజ ప్రతిష్టాపన కార్యక్రమాలను శృంగేరి విధుశేఖర భారతి గురు తమ అమృత హస్తాలతో శ్రీకారం చుట్టడంతో శుక్రవారం నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. సవదత్తి చిదంబరం క్షేత్రం ప్రసన్న దీక్షిత స్వామి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ప్రవచనం చేశారు. సిందగి దత్తప్పయ్య స్వామి, యరగళ్ల సిద్దరాజ స్వామి, శృంగేరి మురగోడ, దివాకర శంకర, దీక్షితులు, ఆనందవన అగడి, గురుదత్త మూర్తి చక్రవర్తి తదితరులతో పాటు గాయత్రి తపోభూమి ట్రస్ట్ అధ్యక్షుడు వినాయక ఆకళవాడి, కార్వాడ పద్మ పుష్ప గురుకుల కులపతి శివమూర్తి జోయ్స్, శ్రీక్షేత్రం ఉపాధ్యక్షుడు అశోక హర్పనహళ్లి, పూర్ణచంద్ర గంటశాల, నీలకంఠ, అరవింద ముతగి తదితరులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. వేగ నిరోధకాలు ఏర్పాటు చేయండి బళ్లారిటౌన్: నగరంలోని ఆంధ్రాళ్ బైపాస్ నుంచి బోవిగేరి సర్కిల్ వరకు ఇటీవల లారీలు అతి వేగంగా సంచరిస్తున్నాయని, ఈ రోడ్డులో స్పీడ్బ్రేకర్లు వేయాలని జిల్లా జనజాగృతి సంఘం అధ్యక్షుడు హుండేకర్ రాజేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాధికారి కార్యాలయానికి స్థానికులతో పాటు తరలి వచ్చి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ ప్రాంతంలో నూతనంగా రోడ్డు నిర్మించినందున వాహనాలు వేగంగా సంచరిస్తున్నాయని, దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అంతేగాక 13వ వార్డు పరిధిలో గంగప్ప జిన్ నుంచి బోవిగేరి వరకు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆలయాలు ఉన్నందున చాలా రద్దీ ఉంటుందని తెలిపారు. దీంతో అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు వేస్తే వాహనాల వేగానికి కళ్లెం వేసినట్లు అవుతుందన్నారు. సంఘం పదాధికారులు స్వామి నాయక్, గాదిలింగ, దుర్గప్ప, నాగరాజ్, మిథున్ కుమార్, కాశిం, అనిల్రెడ్డి, దస్తగిరి, అన్వర్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
వరుణుడి విలయ తాండవం
సాక్షి,బళ్లారి/హొసపేటె : ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందుతున్న సమయంలో అకాల వర్షాలతో పంటలు పూర్తిగా దెబ్బతినడంతో పాటు పిడుగు పాటుకు ముగ్గురు మృతి చెందటంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురుసిన భారీ వర్షం కొప్పళ జిల్లాలో పలు గ్రామాల్లో బీభత్సం సృష్టించింది. భారీ ఎత్తున ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పిడుగుపాటుకు గురై కొప్పళ జిల్లాకు చెందిన మంజునాథ్(48), గోవిందప్ప మేగళమనె(62) అనే ఇద్దరు రైతులు మరణించారు. వర్షం కురుస్తున్న సమయంలో తోటలోని ఇంటికి తాళం వేయడానికి వెళ్లినప్పుడు పిడుగు పడి వీరిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విజయనగర జిల్లాలో.. విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా బండె బసాపుర గ్రామానికి చెందిన పాండేనాయక్(16) అనే బాలుడు ఇంటి ముందు నిలబడిన సమయంలో పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. భారీ వర్షంతో ముగ్గురు పిడుగుపాటుకు గురై మృతి చెందడంతో పాటు పశువులు కూడా మృతి చెందాయి. కొప్పళ తాలూకా పరిధిలో పలు గ్రామాల్లో అరటి తోటలు, వరి చేలు నేలకొరగడంతో రైతులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. పంట చేతికందే సమయంలో వరి చేలల్లో కుప్పలు, కుప్పలుగా రాశులు పడిపోయాయి. అరటి తోటలు నేలకొరిగిపోవడంతో రైతులకు లక్షలాది రూపాయల మేర నష్టం వాటిల్లింది. అకాల వర్షంతో బళ్లారి, విజయనగర, కొప్పళ జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, పిడుగుపాటుకు మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పిడుగు పాటుకు ముగ్గురు మృతి పంట నష్టంతో రైతులు విలవిల -
ఘనంగా జంబునాథ స్వామి రథోత్సవం
హొసపేటె: నగర శివార్లలోని పురాతన కాలపు జంబునాథ స్వామి ఆలయ రథోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో స్వామి వారికి పంచామృతాభిషేకం, అర్చనలతో పాటు ప్రత్యేక పూజలు నెరవేర్చారు. స్వామి వారికి పూలమాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. సాయంత్రం రథోత్సవం జరిపారు. రథోత్సవాన్ని తిలకించేందుకు నగరంలోని వివిధ వార్డుల నుంచే కాకుండా చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ శ్రీహరిబాబు ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ప్రజారోగ్యానికి పెద్దపీట
హొసపేటె: తన నియోజకవర్గంలోని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంతో, మంచి ఆస్పత్రులతో పాటు స్పెషలిస్ట్ వైద్యులు పని చేసేలా చూసుకోవడంపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని కూడ్లిగి ఎమ్మెల్యే శ్రీనివాస్ తెలిపారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం తాలూకాలోని నరసింహనగరి గ్రామంలో దొడ్డమనె కుటుంబం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గుడిమలయాలి ప్రాంతానికి చెందిన గర్భిణులు, ఆశా కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. వైద్యులు, నర్సులు ఇచ్చే సలహాలను పాటించాలి. గర్భిణులు శిశువు ఆరోగ్యం, సరైన అభివృద్ధి కోసం వైద్యులు ఇచ్చే చికిత్స, సలహాలను పాటించాలని ఆయన అన్నారు. గర్భిణులకు ఒడి నింపే పరిమిత కార్యక్రమాన్ని నిర్వహించడం, గ్రామీణ ప్రాంత గర్భిణులతో సహా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునే ఆశా కార్యకర్తలను గౌరవించడం దొడ్డమనె కుటుంబానికి గర్వకారణమని అన్నారు. గతంలో తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే ఎన్టీ.బొమ్మణ్ణ కూడా ప్రజలకు ఉత్తమ సేవలను అందించారని గుర్తు చేశారు. ప్రొఫసర్ ఎన్టీ గంగప్ప, వెంకటేష్, వైద్యులు ప్రదీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి హామీ పనుల కోసం ధర్నా
రాయచూరు రూరల్: ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ కూలీలకు పనులు కేటాయించాలని మానవ హక్కుల సంరక్షణ అధ్యక్షుడు రాఘవేంద్ర డిమాండ్ చేశారు. శుక్రవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో ఆందోళన చేపట్టి మాట్లాడారు. నరేగ పనుల్లో లోపాలను సవరించాలని, అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. కూలీ కార్మికుల పేరుతో గోల్మాల్ చేయడంలో అధికారులది అందె వేసిన చెయ్యిగా మారిందన్నారు. కాలువల్లో పూడికతీత పనులకు వ్యవసాయ కూలీ కార్మికులు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో డూప్లికేట్ ఫొటోల కోసం ఎన్ఎంఎంఎస్లకు కార్మికుల హాజరు పట్టికను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉందని, ఈ తతంగానికి అధికారులు నరేగ పనులు చేపట్టారని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. -
పెట్రో ధరల పెంపుపై నిరసన
బళ్లారిఅర్బన్: బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం యథేచ్ఛగా పెట్రోల్ ధరలపై ఎకై ్సజ్ సుంకాన్ని పెంచిందని, తక్షణమే దీన్ని రద్దు చేయాలని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్ సూచనల మేరకు యూత్ కాంగ్రెస్ నేతృత్వంలో మోకా రూపనగుడి బ్లాక్ అధ్యక్షుడు ఎస్జే కోటె ఉమేష్గౌడ, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేంద్ర, ఫైరోజ్ఖాన్, ఫాజిల్, అబ్దుల్ బారి తదితరుల సమక్షంలో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి రాయల్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టి వినతిపత్రాన్ని అందజేశారు. శ్రీకాంత్ మాట్లాడుతూ పెట్రోల్ ధరను రూ.2, ఎల్పీజీ సిలిండర్పై రూ.50 చొప్పున పెంచిన కేంద్ర తీరును యూత్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో పాటు ఆర్థికమాంద్యం, నిరుద్యోగంతో సామాన్యులు, రైతులు, కూలీ కార్మికులు, మధ్య, పేద తరగతి కుటుంబాలు మోయలేని భారంగా మారిందన్నారు. తక్షణమే పెంచిన ధరలను రద్దు చేసి పాత ధరలకే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు సిద్దు హళ్లెగౌడ, సునీత, సమీర్, కవిత, బసవరాజ్, అసుండి హనుమేష్ తదితరులు పాల్గొన్నారు. -
వాటర్ బూస్టర్ కేంద్రాల్లో తనిఖీ
రాయచూరు రూరల్: నగరంలో తాగునీటి ఎద్దడి నెలకొనడంతో రాంపుర జలాశయం, చిక్కసూగూరు, యరమరస్ల్లోని వాటర్ బూస్టర్ కేంద్రాలను నగర శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, నగరసభ సభ్యులు, అధికారులతో కలసి పరిశీలించారు. శుక్రవారం గణేకల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేశారు. రాంపుర జలాశయానికి నీరు చేరుకున్న నేపథ్యంలో నగరానికి తాగునీటిని అందించే రాంపూర్ చెరువులోని నీటిని వృథా చేయకుండా వినియోగించాలని సిబ్బందికి సూచించారు. నగరసభ సభ్యుడు శశిరాజ్, నాగరాజ్, నేతలు రవీంద్ర జాలదార్, నరసింహులు, ఆంజనేయ, శ్రీనివాసరెడ్డి, ఉప కమిషనర్ గురుసిద్దయ్యలున్నారు. -
మంత్రుల శాఖల్లో పుత్రుల ప్రమేయం?
● ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన కాంట్రాక్టర్లు ● చిన్న నీటిపారులల, పీడబ్ల్యూడీ శాఖల్లో జోక్యం రాయచూరు రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్కు మరోసారి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పాలక మండళిలో ఆధిపత్యం చలాయిస్తున్న అమాత్యుల పుత్రులు, కుటుంబ సభ్యుల జోక్యం మితిమీరిందంటూ గురువారం బెంగళూరులో కాంట్రాక్టర్లు ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఫిర్యాదు చేశారు. చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు పుత్రుడు రవి, ప్రజా పనుల శాఖ మంత్రి సతీష్ జార్కిహోళి కుటుంబ సభ్యుల ప్రమేయం అధికమైందని కాంట్రాక్టర్ల సంఘం ఆరోపించింది. కాంట్రాక్టర్లు చేసిన పనులకు పెండింగ్లో ఉన్న బిల్లులను పాస్ చేయమని అడిగితే మంత్రుల శాఖలో పుత్రుల, కుటుంబ సభ్యుల ప్రమేయంతో బిల్లులు పాస్ కావడం లేదని ధ్వజమెత్తారు. రూ.కోట్లాది అప్పులు తెచ్చి వడ్డీలు కట్టలేని స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే మధ్యవర్తులకు ఒత్తాసు పలుకుతూ అధికారులు బిల్లుల చెల్లింపులకు అమాత్యుల పుత్రులు, కుటుంబ సభ్యులు చెబితేనే ఇస్తామని, అది కూడా 60 శాతం కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. -
నేటి నుంచి దత్తాత్రేయ ఉత్సవాలు
రాయచూరు రూరల్: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతి రూపమే దత్తాత్రేయుడని భక్తుల విశ్వాసం. గురుదేవ దత్తుని మొదటి అవతార పురుషుడు శ్రీ వల్లభ స్వామి. కర్మభూమిలో ద్వీపకల్పంలో నివసించిన నాథుడుగా కురువపుర శ్రీవల్లభ నాథుడు ప్రసిద్ధి చెందాడు. రాయచూరు తాలూకా సరిహద్దుల్లోని కురవపుర కృష్ణా నది మధ్యలో వెలసింది. అక్కడ హనుమ జయంతికి ప్రత్యేక ఉత్సవాలు చేపడుతున్నారు. రాయచూరు నుంచి 25 కి.మీ.ల దూరంలో ఉన్న కురువపురకు బస్సులో వెళ్లి అక్కడ నుంచి నదిలో కి.మీ.దూరం తెప్పలో ప్రయాణించి భక్తులు దేవాలయానికి చేరుకుంటారు. తెలంగాణలోని మక్తల్ నుంచి కూడా కురువపురకు తరలి వస్తారు. తాలూకాలోని నారదగడ్డలో వెలసిన శ్రీ పాదవల్లభ దత్తాత్రేయ స్వామి దర్శనం కోసం భక్తులు బూడిదపాడు, ఆత్కూరు, దొంగరాంపూర్ల నుంచి పెద్ద సంఖ్యలో కృష్ణా నదిలో తెప్పల్లో వెళతారు. ప్రత్యేకత సంతరించుకున్న కురువపుర వల్లభ నాథుడు నేడు హనుమ జయంతి సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు -
నయన మనోహరం హసికరగ ఊరేగింపు
శనివారం అర్థరాత్రి చారిత్రక ద్రౌపదీ దేవి పూలకరగ బనశంకరి: బెంగళూరు తిగళరపేటె ధర్మరాయ స్వామి దేవస్థానంలో వెలసిన ద్రౌపదీ దేవి కరగ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. గురువారం అర్థరాత్రి నుంచి కబ్బన్ పార్కులోని సంపంగి చెరువు శక్తిపీఠంలో కరగ పూజలు నిర్వహించారు. శుక్రవారం వేకువ జామున హసికరగను కరగ పూజారి ఏ.జ్ఞానేంద్ర ఎత్తుకుని వీరకుమారుల సమక్షంలో ఊరేగింపుగా ధర్మరాయ దేవస్థానానికి చేరుకున్నారు. కరగ పూజారి ఏ.జ్ఞానేంద్ర ఒక చేతిలో కత్తి పట్టుకుని నడుముపై హసికరగను ఎత్తుకుని వీరకుమారుల సమక్షంలో ఊరేగింపుగా బయలుదేరారు. సంపంగి చెరువు అనంతరం హడ్సన్ సర్కిల్ వరకు ఊరేగింపుగా వెళ్లి బీబీఎంపీలో ఉన్న ఆదిశక్తి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ధర్మరాయ స్వామి ఆలయానికి హసికరగ చేరుకుంది. ఆలయంలో మల్లెపూల మధ్యలో హసికరగను అధిష్టించి ప్రత్యేక పూజలు చేపట్టారు. అతి పురాతన చారిత్రక నేపథ్యం కలిగిన ద్రౌపదీ దేవి కరగ శక్త్యోత్సవం శనివారం అర్థరాత్రి ధర్మరాయ స్వామి దేవస్థానం నుంచి కరగ పూజారి ఏ.జ్ఞానేంద్ర ఎత్తుకుని నగర ఊరేగింపునకు బయలుదేరుతుంది. అంతకు ముందు తిగళర పేటెలో ధర్మరాయ స్వామి రథోత్సవం ప్రారంభమౌతుంది. ద్రౌపదీ దేవి కరగ గణపతి దేవస్థానం, ముత్యాలమ్మ దేవస్థానంలో పూజలు చేపట్టి హలసూరుపేటె ఆంజనేయస్వామి, రామ దేవస్థానం, నగర్తపేటె, కబ్బన్పేటె, గాణిగరపేటె, దొడ్డపేటె నుంచి కేఆర్.మార్కెట్కు చేరుకుంటుంది. మస్తాన్సాబ్ దర్గాను సందర్శించి అక్కడ నుంచి బళేపేటె పాత గరడి, అణ్ణమ్మ దేవస్థానం, కిలారు రోడ్డు, యలహంక గేట్, అవెన్యూ రోడ్డు, కుంబారపేటె, గొల్లరపేటె, తిగళరపేటెలోని ధర్మరాయ స్వామి దేవస్థానానికి చేరుకోవడంతో కరగ మహోత్సవం ముగుస్తుంది. -
బీరు వద్దు.. మద్యం ముద్దు
సాక్షి బెంగళూరు: రాష్ట్రంలో ప్రస్తుతం కరెంట్, నీరు, రవాణా చార్జీల ధరలు మోతమోగిపోతున్నాయి. ధరల పెంపుపై ప్రజలు ఆగ్రహంతో మండిపోతున్నారు. ఇదే సమయంలో మందుబాబులు కూడా సర్కార్పై మండిపడుతున్నారు. ఎందుకంటే మందు ధరలు ముఖ్యంగా బీర్ ధరను ప్రభుత్వం పెంచడమే కారణం. మండు వేసవిలో చల్లచల్లగా బీరు తాగుదామా అని ఆశపడ్డ మందు బాబులకు ఈ ధర పెంపు చుక్కెదురైంది. దీంతో బీర్ల కొనుగోలుపై మద్యం ప్రియులు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా బీర్ల విక్రయాలు తగ్గిపోయాయి. రూ.10 నుంచి 50 వరకు పెంపు బీర్ల కంటే మద్యం బెటర్ అంటూ మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఈసారి ఆల్కహాలు మద్యంతో పోలిస్తే బీర్ల విక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ ధరల పెంపు నిర్ణయం బీర్ల విక్రయాలపై పెద్ద ప్రభావం చూపించింది. ఈ ఏడాది జనవరి నుంచే బీర్ల అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. ఈ ఏడాది జనవరి 20 నుంచి బీర్లపై అదనపు అబ్కారీ పన్నును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో సహజంగానే బీర్ల ధరలు పెరిగాయి. సాధారణ బ్రాండ్ల నుంచి ప్రీమియం బ్రాండ్ల వరకు అన్ని రకాల బీర్ల ధరలు పెరిగాయి. ప్రతి బీర్ బాటిల్పై ధర కనిష్టంగా రూ.10 నుంచి రూ.50 మేర పెరిగింది. అందులోనూ ఆల్కహాలు ప్రమాణం ఎక్కువగా ఉండే బీర్ల ధరలు అయితే ఇంకాస్త పెరిగాయి. గత ఆర్థిక ఏడాది తొలి 9 నెలల్లో అబ్కారీ శాఖ నుంచి ఆశించిన మేర ఆదాయం రాలేని కారణంగా బడ్జెట్ కంటే ముందుగానే బీర్ల ధరలను సర్కార్ పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇలా పదేపదే ధరలు పెంచుతూ తమ జేబులు గుల్ల చేస్తోందని మండిపడుతున్నారు. గత ఏడాది 1,024 లక్షల లీటర్ల బీరు విక్రయం రాష్ట్రంలో గతేడాది జనవరి 1 నుంచి ఏప్రిల్ 7 వరకు 1,024 లక్షల లీటర్ల (131.41 లక్షల బాక్సులు) బీర్ల విక్రయం జరిగింది. ఈ ఏడాది ఇదే సమయానికి కేవలం 836 లక్షల లీటర్లు (107.23 లక్షల బాక్సులు) బీర్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 188 లక్షల లీటర్ల బీర్లు విక్రయం తక్కువగా జరిగింది. బార్ అండ్ రెస్టారెంట్, చిల్లర దుకాణాల నుంచి కూడా రాష్ట్ర బివరేజెస్ కార్పొరేషన్కు బీర్ల కొనుగోలుకు డిమాండ్ బాగా తగ్గిపోయింది. ఇదే సమయంలో రాష్ట్రంలో కొనుగోలు సమర్థ్యం కూడా బాగా తగ్గిపోవడంతో బీర్ల కొనుగోలు తగ్గిపోయింది. మద్యం విక్రయాలు ఇలా.. ఒకవైపు బీర్ల వైపు నిరాసక్తి ఏర్పడితే మరోవైపు ఆల్కహాలు మద్యంపై మందుబాబుల చూపు పడింది. బీర్లకు ప్రత్యామ్నాయంగా మద్యం కొనుగోలుకు ఆసక్తి కనపరుస్తున్నారు. పెరిగిన బీర్ల కంటే మద్యం తాగడమే ఉత్తమమని అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది జనవరి 1 నుంచి ఏప్రిల్ 7 వరకు 1,580 లక్షల లీటర్ల మద్యం అమ్ముడవగా ఈ ఏడాది అదే కాలానికి ఏకంగా 1,660 లక్షల లీటర్ల మద్యం అమ్ముడయింది. ఈ ఏడాది సుమారు 80 లక్షల లీటర్ల అదనపు మద్యం అమ్ముడవడం విశేషం. -
2015లో కులగణనకు శ్రీకారం
శివాజీనగర: పలు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న శాశ్వత వెనుకబడిన వర్గాల కమిషన్ ఆర్థిక, విద్యా, సామాజిక (కులగణన) నివేదికకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధ్యక్షతన విధానసౌధలోని మంత్రుల సభా భవనంలో శుక్రవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో కులగణన నివేదికను ప్రవేశపెట్టారు. కులగణన నివేదికపై ముందు జరిగే మంత్రి మండలి సమావేశంలో చర్చించి తీర్మానాలను చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కులగణన నివేదికను అంగీకరించాలనే డిమాండ్లు వినిపించాయి. కుల గణన నివేదిక అమలుకు బలమైన సామాజిక వర్గాలు వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. ఈ పరిణామాలన్నింటి మధ్య కులగణన నివేదిక శుక్రవారం మంత్రి మండలి సమావేశంలో ప్రవేశపెట్టారు. నివేదిక ముందు రూపురేఖలపై ముందు జరిగే మంత్రి మండలి సమావేశంలో తీర్మానించాలని మంత్రి మండలి నిర్ణయించినట్లు ఉన్నత వర్గాలు తెలిపాయి. కేబినెట్ ముందుకు నివేదిక శుక్రవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో వెనుకబడిన, ఎస్సీల సంక్షేమ మంత్రి శివరాజ్ తంగడగి కులగణన నివేదిక పత్రాలను తెరిచి మంత్రి మండలి సమావేశం ముందుంచారు. ఈ నివేదికపై సమావేశంలో సూచకప్రాయంగా శాఖ కార్యదర్శి వివరాలను ఇచ్చారని తెలిసింది. నివేదికను ప్రవేశపెట్టిన తరువాత ముందు జరిగే మంత్రి మండలి సమావేశంలో కూలంకుషంగా చర్చించి, దీనిపై తీర్మానించాలని మంత్రి మండలి సమావేశంలో నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. కులగణన వివరాలను రాష్ట్రంలో ఉన్న బలమైన సామాజిక వర్గాలైన ఒక్కలిగ, లింగాయిత, బ్రాహ్మణులు వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఈ సమీక్ష శాసీ్త్రయంగా జరగలేదు. నివేదికను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించరాదు. ఒకవేళ ప్రభుత్వం ఈ నివేదికను ఆమోదిస్తే బహిరంగ పోరాటం చేపడుతామని ఈ సముదాయ నాయకులు, స్వామీజీలు హెచ్చరించారు. రాష్ట్రంలో శాశ్వత వెనుకబడిన వర్గాల కమిషన్ అధ్యక్షుడైన జయప్రకాశ్ హెగ్డే 2024లో లోక్సభ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వానికి సీల్డ్ కవర్లో నివేదికను సమర్పించారు. కేబినెట్ సమావేశంలో నివేదిక ప్రవేశం తదుపరి భేటీలో చర్చించి నిర్ణయం17న మంత్రి మండలి ప్రత్యేక సమావేశం శుక్రవారం మంత్రి మండలిలో ప్రవేశపెట్టిన కులగణన నివేదికపై తగిన తీర్మానం తీసుకునేందుకు ఈనెల 17న మంత్రి మండలి ప్రత్యేక సమావేశం జరుగనుంది. ఆరోజు కులగణన నివేదికపై సమగ్రంగా చర్చించి ప్రభుత్వం తగిన తీర్మానాలను చేస్తుంది. గతంలో 2015లో సిద్దరామయ్య తొలిసారిగా ముఖ్యమంత్రి అయినపుడు శాశ్వత వెనుకబడిన వర్గాలకు కులగణన జరిపేందుకు సూచించారు. ఆ ప్రకారం అప్పటి అధ్యక్షుడు హెచ్.కాంతరాజు సమీక్ష జరిపి నివేదికను సిద్ధం చేశారు. అయితే దానిని ప్రభుత్వానికి సమర్పించలేదు. ఆ తరువాత వచ్చిన కుమారస్వామి నేతృత్వపు సంకీర్ణ ప్రభుత్వం కులగణన నివేదిక స్వీకారానికి ఆసక్తి చూపించలేదు. బీజేపీ ప్రభుత్వం కూడా నివేదిక జారీ చేసేందుకు మనస్సు చేయలేదు. బీజేపీ అధికారావధిలో జయప్రకాశ్ హెగ్డేను శాశ్వత వెనుకబడిన వర్గాల అధ్యక్షుడిగా నియమించారు. సిద్దరామయ్య 2వ సారి ముఖ్యమంత్రి అయిన తరువాత శాశ్వత వెనుకబడిన వర్గాల అధ్యక్షుడు జయప్రకాశ్ హెగ్డే మాజీ అధ్యక్షుడు కాంతరాజు సేకరించిన దత్తాంశాల ఆధారంగా ప్రభుత్వానికి సీల్డ్ కవర్లో నివేదికను అందజేశారు. ఆ నివేదికను ఇప్పటి వరకు అంగీకరించలేదు. శుక్రవారం జరిగిన మంత్రి మండలి సమాశంలో నివేదికను ప్రవేశపెట్టారు. నివేదిక రూపురేఖలను తదుపరి జరిగే మంత్రి మండలి సమావేశంలో నిర్ణయించనున్నారు. ఈ అన్ని పరిణామాల మధ్య ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వపు ప్రభుత్వం కులగణన నివేదికను శుక్రవారం మంత్రి మండలి సమావేశంలో ప్రవేశపెట్టగా, భవిష్యత్తులో ఎలాంటి తీర్మానాలు జరుగుతాయనేది కుతూహలానికి దారి తీసింది. -
కనుల పండువగా వైరముడి బ్రహ్మోత్సవం
మండ్య : జిల్లాలోని మేలుకోటెలో వెలసిన చెలువ నారాయణ స్వామి వారి తీర్థస్నానం అయిన శుక్రవారం సమీపంలోని నారాయణపుర గ్రామంలో ఉన్న కరువు భూమిలో తీర్థోద్భవం జరిగింది. ఈ అద్భుతాన్ని చూడటానికి భక్తులు తరలి వచ్చారు. మేలుకోటెకు సమీపంలో సుమారు 12 కి.మీ. దూరంలో ఉన్న నారాయణపుర అనే గ్రామంలో గ్రామానికి చెందిన దళితుడు కుమార్ అనే రైతు భూమిలో ఒకటి రెండు అడుగులు తవ్వగానే గుంతలో రామానుజాచార్యుల కాలం నుంచి కూడా తీర్థోద్భవం జరుగుతోందని తెలిపారు. ప్రతి సంవత్సరం వైరముడి బ్రహ్మోత్సవం చివరిరోజున శ్రీచెలువ నారాయణ స్వామి వారి దర్శనం, అనుగ్రహానికి ప్రశస్తి అయిన శనివారం 12వ తేదీ తీర్థస్నానం చేసే రోజున ఈ అశ్వర్యకరమైన అద్భుతం జరుగుతుంది. భూ యజమాని శనివారం తీర్థోద్భవం ఉన్నందున శుక్రవారం మధ్యాహ్నం నారాయణపుర గ్రామానికి పరిశీలన కోసం వచ్చారు. మీడియాతో మాట్లాడుతూ కరువు భూమిగా పేరొందిన ఈ భూమిలో ఎక్కడా కూడా చుక్క నీరు ఉండదని, కాని ఇలాంటి కరువు భూమిలో రెండు అడుగులు కూడా తవ్వకుండానే తీర్థోద్భవం జరిగిందని అన్నారు. -
యాదగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,బళ్లారి: దైవదర్శనానికి వెళుతూ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. యాదగిరి జిల్లా వక్రనహళ్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు కలబుర్గి తాలూకా ఘత్తరిగి భాగ్యవంతి దేవాలయ దర్శనం కోసం వెళుతుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వక్రనహళ్లి నుంచి బోలెరో వాహనంలో 10 మందికి పైగా వెళుతుండగా యాదగిరి జిల్లా శహాపుర తాలూకా మద్దరికి సమీపంలో బోలెరో వాహనం, కేఎస్ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో శరణప్ప(30), సునీత(19), సోమవ్వ(50), తంగమ్మ(55) అనే నలుగురు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ పృథ్వీ శంకర్తో పాటు పలువురు పోలీసు అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అక్కడి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని యాదగిరి జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. దైవ దర్శనానికి వెళుతూ మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మృతుల కుటుంబాలతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బోలెరో వాహనం, కేఎస్ఆర్టీసీ బస్సు ఢీ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి -
అట్టహాసంగా మహావీర్ జయంతి
తుమకూరు: భగవాన్ మహావీర్ భారత్కు మాత్రమే కాదని, ప్రపంచానికే అహింసా తత్వాలను చాటిచెప్పారని భక్తులు కొనియాడారు. గురువారం మహావీర్ జయంతిని రాష్ట్రమంతటా జైనులు అట్టహాసంగా నిర్వహించారు. బెంగళూరులో టౌన్హాల్ ముందు నుంచి బైక్లు, కార్లు, గుర్రాలను మహిళలు, యువతులు అధిరోహించి ర్యాలీ జరిపారు. పలు నగరాలలో కోలాహలంగా ర్యాలీలు సాగించారు. మహిళలు ఎక్కువసంఖ్యలో పాల్గొన్నారు. తుమకూరులోనూ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రదర్శన సాగింది. భోగ లాలస జీవితం నుంచి బయటకి రావడానికి సత్యం, అహింస, బ్రహ్మచర్యం ముఖ్యమని మహావీరుడు బోధించారని వక్తులు తెలిపారు. ఆయన చెప్పిన అంశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. -
రైతు కష్టాలను చూడలేక కొడుకు ఆత్మహత్య
గౌరిబిదనూరు: అన్నదాతల ఇంట ఆత్మహత్యలు ఆగడం లేదు. ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం కనిపించక, బతికే దారి కానరాక అవస్థలు పడుతున్నారు. వివరాలు... తాలూకాలోని తొండేబావి గ్రామంలో యువ రైతు పవన్ (22) చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి రామ్కుమార్కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్నకుమారుడైన పవన్ వ్యవసాయంలో తండ్రికి చేదోడుగా ఉండేవాడు. గత మూడేళ్లుగా పంట సరిగా చేతికందక, వచ్చినా ధరలేక నష్టపోతున్నారు. సహకార బ్యాంకులో రూ.రెండు లక్షల వరకు రుణాలున్నాయి. సేద్యానికి, కుటుంబ పోషణకు తండ్రి పడుతున్న బాధలను చూడలేక విరక్తి చెందిన పవన్ కఠోర నిర్ణయం తీసుకున్నాడు. గురువారం ఉదయం ఓ చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. బాధిత కుటుంబాన్ని తహసీల్దారు మహేశ్ పత్రి, కొచిముల్ డైరెక్టర్ కాంతరాజు కుటుంబ పరామర్శించారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. పవన్ (ఫైల్) -
పూలజ్యోతుల సంభ్రమం
బనశంకరి: ఇతిహాసిక బెంగళూరు ద్రౌపదీ దేవి కరగ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం తెల్లవారుజామున వహ్నికుల క్షత్రియ సముదాయానికి చెందిన మహిళలు ద్రౌపదీదేవికి హారతి దీపాలతో పూజలు చేపట్టారు. తిగళరపేటే ధర్మరాయస్వామి ఆలయానికి వేలాదిగా సుందరంగా అలంకరించిన మల్లె పూల జ్యోతులను మోసుకు వచ్చి అమ్మవారికి సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి ఊరేగింపుగా బయలుదేరి ఆలయానికి చేరుకున్నారు. హారతి దీపాలతో ద్రౌపదీదేవికి పూజలు నిర్వహించారు. కే.సతీశ్, కరగ పూజారి ఏ.జ్ఞానేంద్ర, బాలకృష్ణ, బీ.సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ద్రౌపదీదేవి కరగ ఉత్సవాలు -
ఎట్టకేలకు చిరుత బందీ
హొసపేటె: కొప్పళ జిల్లా గంగావతి తాలూకా ఆనెగుందిలో గత వారం రోజులుగా జనావాస ప్రాంతంలో కనిపిస్తూ ఆందోళన కలిగించిన చిరుత పులి ఎట్టకేలకు బందీ అయింది. అర్ధరాత్రి ఆహారం కోసం వెదుక్కుంటూ వచ్చిన చిరుతపులి ఆనెగుందిలోని తళవార ఘాట్ వద్ద అటవీ శాఖ ఉంచిన బోనులో చిక్కింది. ఉదయం నడకకు వెళ్లిన కొందరు యువకులు బోనులో చిక్కుకున్న చిరుతను గమనించారు. వారు వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన అటవీ శాఖ అధికారులు చిరుతను సురక్షితంగా వడ్డరహట్టిలోని ఫారానికి తరలించారు. బందీగా ఉన్న చిరుత పులి వయస్సు దాదాపు మూడేళ్లు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు అటవీ శాఖ సిబ్బంది తెలిపారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు చిరుతను సురక్షిత అటవీ ప్రదేశంలో వదిలివేస్తామని తెలిపారు. చిరుతపులి కనిపించిన నేపథ్యంలో ఆనెగుంది గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు హులిగెమ్మ నాయక్ అటవీ శాఖ అధికారులకు లేఖ రాసి చిరుతను పట్టుకోడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో చేపట్టిన ఆపరేషన్ చీతా చివరకు విజయవంతమైంది. -
రెవెన్యూ సిబ్బంది సమర్థంగా పనిచేయాలి
బనశంకరి: లైసెన్సు పొందిన భూసర్వేయర్లను పర్మినెంట్ చేయడంతో పాటు 36 ఏడీఎల్ఆర్లను నియమిస్తామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. గురువారం విధానసౌధ ఆవరణలో భూసర్వే, రెవెన్యూ శాఖ ఉద్యోగుల సంఘాలు ఏర్పాటుచేసిన 36వ జాతీయ భూసర్వే దినోత్సవాన్ని సిద్దరామయ్య ప్రారంభించి మాట్లాడారు. చెరువుల ఆక్రమణలను తొలగించాలని అధికారులకు ఆదేశించారు. త్వరితగతిన భూముల సర్వే పూర్తిచేయాలని, లైసెన్సు పొందిన సర్వేయర్లను పర్మినెంట్ చేయడంతో పాటు ఏడీఎల్ఆర్లు నియామకం చేస్తామని హామీ ఇచ్చారు. తహశీల్దార్లు, ఏసీ కార్యాలయ సిబ్బంది సమర్థంగా పనిచేస్తే ప్రజలు, రైతు సముదాయం ప్రశాంతంగా ఉంటుందన్నారు. ఖాళీ సర్వేయర్ పోస్టుల నియామకం పారదర్శకంగా జరిగిందని, త్వరలో నియామకపత్రాలు అందిస్తామని తెలిపారు. -
దంపతులు, కూతురు దుర్మరణం
దొడ్డబళ్లాపురం: అదుపుతప్పిన కారు డివైడర్ను ఢీకొన్న ప్రమాదంలో దంపతులు, వారి కూతురు బలైన సంఘటన బెంగళూరు– తుమకూరు రహదారి మార్గంలోని అంచెక్రాస్ వద్ద జరిగింది. బెంగళూరు మల్లేశ్వరానికి చెందిన గోపాల్ (60), భార్య శశికళ(54), వీరి కుమార్తె దీప (25) మృతి చెందారు. వివరాలు.. వీరందరూ తుమకూరు జిల్లా హిరియూరులోని బంధువుల ఇంట్లో నామకరణం వేడుకకు కారులో వెళ్లి చూసుకుని తిరిగి వస్తున్నారు. గోపాల్ కారు నడుపుతుండగా అతి వేగం కారణంగా అదుపుతప్పిన కారు ఎడమవైపు డివైడర్ను ఢీకొంది. ప్రమాదంలో శశికళ అక్కడికక్కడే చనిపోగా గోపాల్, దీప తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మరణించారు. కారులో ఉన్న ఒకటిన్నర ఏడాది, ఐదేళ్లు వయసు గల ఇద్దరు పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నెలమంగల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. డివైడర్ను ఢీకొన్న కారు తుమకూరు హైవేలో ఘటన -
కెంకెర గ్రామోత్సవం
తుమకూరు: జిల్లాలోని హులియూరు సమీపంలోఉన్న కెంకెరెలో గ్రామ దేవత కాళమ్మ దేవి కలశ ఉత్సవం గురువారం రమణీయంగా జరిగింది. కాళికాంభ దేవి, గొల్ళరహట్టి కరియమ్మ, గౌడగెరె దుర్గమ్మ, ఈరబొమ్మక్క దేవి, అంబికా దేవి తదితర దేవతల విగ్రహాలను భక్తులు సుందరంగా అలంకరించి ఊరేగించారు. 111 మంది మహిళలు కలశాలను ఎత్తుకొని ఊరేగించారు. డ్రగ్స్ కేసులో ఇద్దరికి 15 ఏళ్ల జైలుశిక్ష బనశంకరి: సిలికాన్ సిటీలో డ్రగ్స్ కేసులో ఇద్దరు నిందితులకు నగర ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు జైలుశిక్ష, జరిమానా విధించింది. నైజీరియా పౌరుడు ఒకోరో క్రిస్టియాన్ ఇపియాని, బెంగళూరు టీసీ పాళ్య నివాసి రోహిత్ క్రిస్టొఫర్ శిక్షపడినవారు. 2021 ఫిబ్రవరిలో కబ్బన్రోడ్డులో డ్రగ్స్ను విక్రయిస్తుండగా ఇద్దరిని కమర్షియల్స్ట్రీట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 350 గ్రాములు బరువుగల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. క్రిస్టియాన్ 2018లో 3 నెలలు వీసా తీసుకుని భారత్కు వచ్చాడు, వీసా అవధి ముగిసినా తిరిగి వెళ్లలేదు. టీసీ.పాళ్య ఫుట్బాల్ అకాడమీలో పరిచయమైన రోహిత్తో కలిసి డ్రగ్స్ వ్యాపారం చేపట్టారు. నేరం రుజువు కావడంతో క్రిస్టియాన్కు 15 ఏళ్ల జైలు శిక్ష, రూ.1.75 లక్షల జరిమానా, రోహిత్ క్రిస్టొఫర్కు 14 ఏళ్ల జైలుశిక్ష, రూ.1.50 లక్షల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. మెడికో బలవన్మరణం చిక్కబళ్లాపురం: తాలూకా పరిధిలోని పట్రేనహళ్లి గ్రామంలో ఉన్న హేమంత్ (18) అనే మెడికో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ ముద్దేనహళ్లిలోని సత్యసాయి వైద్య కాలేజీ ప్రథమ ఎంబీబీఎస్ చదువుతున్నాడు, ఇతని తల్లి వైద్యురాలు. ఇటీవల ఇద్దరు వియత్నాం దేశంలో పర్యటించి బుధవారం ఉదయం వచ్చారు. ఏమైందో కానీ హేమంత్ మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో తమ తోటలోని ఇంటిలో ఉరి వేసుకొని బలవన్మరణం చెందాడు. మాజీ ఎమ్మెల్యే కెపి బచ్చేగౌడకు బంధువులు అని తెలిసింది. చదువులో టాపర్గా పేరుపొందాడు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిక్క రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కుమారుని మరణంతో తల్లి, బంధువుల రోదనలు మిన్నంటాయి. నకిలీ పత్రాలతో ఇల్లు కబ్జా ● ముడాలో మరో బాగోతం ● అధికారి సస్పెండ్ మైసూరు: మైసూరు ముడాలో తరచూ ఏదో ఒక కుంభకోణం బయటపడుతూ ఉంటుంది. మరణించిన వ్యక్తి పేరిట ఉన్న ఇంటిని కబ్జా చేసుకునేందుకు నకిలీ దాఖలాలను సృష్టించేందుకు వంచకునితో ముడా మేనేజర్ సోమసుందర్ చేతులు కలిపాడు. దీంతో అతనిని ముడా కమిషనర్ ఏఎన్ రఘునందన్ సస్పెండ్ చేశారు. ఆర్టీ కార్యకర్త బీఎన్ నాగేంద్ర దాఖలాలతో సహా ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి ఈ చర్యలు చేపట్టారు. గోకులం 3వ స్టేజీ బడావణెలో మోడల్ హౌన్ నంబర్–867లోని భవనం యజమాని లిలియన్ శారద జోసెఫ్ది. ఆమె 1983 సెప్టెంబర్లో మరణించారు. ఆమె బంధువైన నెవిల్ మార్కస్ జోసెఫ్ గతేడాది నకిలీ ఫౌతి ఖాతా చేసిచ్చి, బిట్ ఆఫ్ ల్యాండ్ను కూడా మంజూరు చేసుకుని హక్కుపత్రాలు పొందాడు. అతనికి మేనేజర్ సోమసుందర్ అన్ని విధాలా సహకరించాడు. ఆ ఇంటిని మమత, శ్యాం దంపతులకు కోట్లాది రూపాయలకు విక్రయించాడు. ఈ స్కాంలో భాగస్తుడైన ప్రత్యేక తహసీల్దార్ రాజశేఖర్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ముడా కమిషనర్ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. -
ఆదమరిస్తే.. సైబర్ కొరడా
బనశంకరి: టెక్నాలజీ ఎంతగా విస్తరిస్తుంటే డిజిటల్ మోసాలు కూడా అంతే వేగంతో వెంటాడుతున్నాయి. సైబర్ దొంగల తాకిడికి అందరూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆర్థిక సేవలు డిజిటల్మయం కావడంతో మోసగాళ్లకు అడ్డు లేదు. జనం అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని దోచేస్తున్నారు. రాష్ట్రంలో సైబర్ నేరాలు మొదలైనప్పటి నుంచి 2025 ఫిబ్రవరి 28 వరకు సైబర్ వంచకులు రూ.4,151 కోట్లు దోచేశారు. పోలీసులతో పాటు అన్నిరంగాలకు చెందిన ఉద్యోగులు, విద్యావంతులు, సీనియర్ సిటిజన్లు మోసపోయినవారిలో ఉన్నారు. కరువు పరిహారం, గృహలక్ష్మీ పథకం సొమ్ము పేరుతో పేదల ఖాతాలకు కన్నంవేసే ఘటనలు పెరిగాయి. పోలీసులు సైబర్నేరాల గురించి ఎంత జాగృతం చేసినప్పటికీ అడ్డుకట్ట పడటం లేదు. ఎక్కువగా విద్యావంతులు, ఐటీబీటీ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, యువతీ యువకులు చిక్కుకుని లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్న ఘటనలు నిత్యం రాష్ట్రంతో పాటు బెంగళూరు నగరంలో వెలుగుచూస్తున్నాయి. రూ.9.54 లక్షలు టోకరా పెట్టుబడి పేరుతో ఇటీవల రూ.9.54 లక్షలు కాజేశారు. శివమొగ్గ నగరానికి చెందిన బాధితుడు (56) వాట్సాప్కు ఒక లింక్ వచ్చింది. క్లిక్ చేయగా షేర్లలో పెట్టుబడి పెట్టాలని మోసగాళ్లు సూచించారు. ఆ మేరకు పై మొత్తం నగదు పెట్టుబడి పెట్టాడు. నాలుగురోజుల తరువాత అతని ఖాతాను బ్లాక్ చేశారు. బాధితుడు శివమొగ్గ సీఈఎన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువకునికి రూ.6.43 లక్షలు శివమొగ్గ యువకునికి ఆన్లైన్లో ఉద్యోగం ఇస్తామని మెసేజ్ పంపి దుండగులు ఓ టెలిగ్రామ్ గ్రూప్లో చేర్చారు. మొదట్లో కొన్ని టాస్కులు ఇవ్వగా యువకుడు పూర్తి చేయగా అతని అకౌంట్లోకి కొంత నగదు జమైంది. తాము చెప్పినట్లు పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయని మోసగాళ్లు సూచించారు. ఆ మేరకు బాధితుడు నాలుగురోజుల్లో రూ.6,43,600 నగదు జమచేశాడు. లాభంతో కలిపి రూ.8,10,700 వచ్చిందని యాప్ ఖాతాలో కనిపించింది. డ్రా చేయడానికి ప్రయత్నించగా సాధ్యం కాలేదు. మరో రూ.5 లక్షలు జమచేస్తే డ్రా చేసుకోవచ్చని మోసగాళ్లు సూచించారు. మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. అంబర్గ్రీస్, కారు, ఇతర సామగ్రి రాష్ట్రంలో తగ్గని సైబర్ మోసాలు ఇప్పటివరకు రూ.4 వేలకోట్లకు పైగా లూటీరూ.10 కోట్ల అంబర్గ్రీస్ స్వాధీనం కొడగు జిల్లాలో 10 మంది అరెస్టు బనశంకరి: సుమారు రూ.10 కోట్ల విలువ చేసే అంబర్గ్రీస్ (తిమింగలం వాంతి)ని గురువారం కొడగు జిల్లాలో విరాజపేటేలో పోలీసులు స్వాధీనం చేసుకుని 10 మందిని అరెస్ట్ చేశారు. కేరళలోని తిరువనంతపురం నుంచి వచ్చిన వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ లేదా బెంగళూరులో విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు దాడి చేశారు. షంషుద్దీన్, ఎం.నవాజ్, వీకే.లతీశ్, ప్రశాంత్, ఏవీ షంషుద్దీన్, బాలచంద్రనాయక్, జోబీస్, మరో ముగ్గురిని వారిని అరెస్ట్చేశారు. 10 కిలోల 390 గ్రాములు బరువు గల తిమింగలం వాంతి ముద్దని వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. కారును, నోట్లను ఎంచే యంత్రాలను కూడా పట్టుకున్నారు. ఈ పదార్థానికి అంతర్జాతీయ మార్కెట్లో చాలా విలువ ఉంది. అరుదైన సుగంధ ద్రవ్యాల తయారీలో వినియోగిస్తారు. కొన్ని దేశాల్లో కామోద్దీపన మందుల తయారీలో వాడతారు. సముద్రంలో తిమింగళం వాంతి చేసుకున్నప్పుడు గట్టి పడి అది తీరానికి కొట్టుకువస్తుంది. దీనిని కలిగి ఉండడం నేరం. -
డామిట్.. కథ అడ్డం తిరిగిందా.!
సాక్షి,బళ్లారి: వాల్మీకి అభివృద్ధి మండలిలో రూ.187 కోట్ల అవినీతి ఆరోపణలతో మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు జైలుకు కూడా వెళ్లి వచ్చిన బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే బీ.నాగేంద్రకు మళ్లీ మంత్రి అయ్యే యోగంపై సందిగ్ధత నెలకొంది. ఉమ్మడి బళ్లారి జిల్లాలో ఎస్టీ సామాజిక వర్గంలో కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడుగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నాగేంద్రకు వాల్మీకి అభివృద్ధి మండలిలో జరిగిన అవినీతి మాయని మచ్చగా మారింది. ఆయన తనపై వచ్చిన ఆరోపణలతో రాజీనామా చేయడంతో మళ్లీ మంత్రి అయ్యే వరకు జిల్లాలోకి అడుగుపెట్టనని, గత కాలంగా ఆయన బళ్లారి వైపు రాకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తల్లోనే కాకుండా గ్రామీణ నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. మంత్రి అయిన తర్వాత నియోజకవర్గానికి వస్తానని తన సన్నిహితులతో ఆయన చెప్పినట్లు సమాచారం. ప్రతిబంధకంగా గవర్నర్ ఆదేశాలు మళ్లీ మంత్రి కావడానికి నాగేంద్ర తన వంతు తీవ్ర ప్రయత్నాలు చేశారు. సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ కూడా నాగేంద్రకు మళ్లీ మంత్రి పదవి ఇప్పించాలని భావించారు. ఈ క్రమంలో హైమాండ్ దృష్టికి కూడా సీఎం ఈ విషయం తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో త్వరలో ఆయనకు మంత్రి పదవి ఖాయమని ఆయన వర్గీయుల్లో సంతోషం వెల్లివిరుస్తున్న సమయంలో రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన ప్రాసిక్యూషన్ ఆదేశాలతో నాగేంద్రకు మంత్రి అయ్యే యోగం సందిగ్ధత నెలకొందని చెప్పవచ్చు. వాల్మీకి అభివృద్ధి మండలిలో అవినీతిపై నాగేంద్రను ప్రాసిక్యూషన్ చేయాలని ఈడీ గవర్నర్ను కోరింది. నాగేంద్రతో పాటు 24 మందిపై కూడా కేసు నమోదు చేసి విచారణ జరిపిన సంగతి తెలిసిందే. కేసు నమోదైనప్పుడు నాగేంద్ర మంత్రిగా పని చేస్తున్న తరుణంలో ఆయనపై ఈడీ కేసు నమోదు చేయడం, ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వాలని కోరడం తెలిసిందే. తాజాగా చెక్బౌన్స్ కేసులో తీర్పు షాక్ ఈ నేపథ్యంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన నాగేంద్ర జైలుకు వెళ్లడం, బెయిల్పై బయటకు రావడం జరిగిపోయింది. ప్రస్తుతం ఆయన బెంగళూరులో ఉంటూ మంత్రి పదవి కోసం పైరవీలు చేస్తున్న సమయంలో ఆయనకు గవర్నర్ ఇచ్చిన ప్రాసిక్యూషన్ ఆదేశాలు గుదిబండగా మారనున్నాయి. ఈడీ చేసిన వినతికి నాగేంద్రపై ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వడంతో మళ్లీ నాగేంద్ర మంత్రి కావడానికి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని చర్చ సాగుతోంది. అంతేకాకుండా నాగేంద్రపై చెక్బౌన్స్ కేసులో ఆయనకు రూ.1.25 కోట్ల జరిమానా విధించడం కూడా కలకలం రేపింది. నాగేంద్రపై ప్రైవేటు కంపెనీ దాఖలు చేసిన చెక్బౌన్స్ కేసులో జరిమానా కట్టకపోతే ఒక ఏడాది పాటు జైలు శిక్ష విధించాలని కోర్టు ఆదేశాలు కూడా జారీ చేయడంతో ఆయన పరిస్థితి గోరుచుట్టుపై రోకటి పోటులా మారింది. ఒక కేసు తర్వాత మరొకటి మీద పడటంతో మళ్లీ మంత్రి పదవి దక్కుతుందా, లేదా అన్నది ప్రశ్నార్థకంగా తయారైంది. మంత్రి అయ్యే వరకు బళ్లారికి రానన్న నాగేంద్ర శపథం నెరవేరేనా? ఒకటి తర్వాత మరొకటిలా మాజీమంత్రిని చుట్టుముడుతున్న కేసులు -
ఉద్యోగులకు క్రీడా పోటీలు అవసరం
హొసపేటె: ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలు ఎంతో అవసరమని విజయనగర జిల్లాధికారి ఎంఎస్ దివాకర్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఆయన బుధవారం క్రీడా జ్యోతిని వెలిగించి, క్రీడా జెండాను ఎగురవేసి, జెండా వందనాన్ని స్వీకరించి మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు క్రీడా పోటీలను మండుటెండల్లో జాగ్రత్తగా ఆడాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో క్రీడలకు అత్యుత్తమ స్థానం ఇవ్వాలని అన్నారు. ఉద్యోగులు క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా శారీరక ఎదుగుదలతో పాటు మానసికంగా పని ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందేందుకు వీలవుతుందన్నారు. అనంతరం ఉద్యోగులకు పరుగు పందెం, వాలీబాల్, బ్యాడ్మింటన్ తదితర పోటీలు నిర్వహించారు. జెడ్పీ సీఈఓ నోంగ్జాయ్ మహమ్మద్ అలీ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జి.మల్లికార్జునగౌడ, రాష్ట్ర పరిషత్ సభ్యుడు రాఘవేంద్ర, జిల్లా కోశాధికారి కే.మల్లేశప్ప పాల్గొన్నారు. మజ్జిగ పంపిణీ కేంద్రం ప్రారంభంరాయచూరు రూరల్ : నగరంలో పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని గురువారం వెనుక బడిన వర్గాల విభాగం అధ్యక్షుడు శాంతప్ప ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలోని అంబిగర చౌడయ్య సర్కిల్లో మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించడం అబినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి అధికంగా ప్రజలు వస్తుంటారన్నారు. వేసవిలో చల్లని మజ్జిగను అందించడానికి చేస్తున్న సేవలు మరువరానివన్నారు. కార్యక్రమంలో గోవిందరాజ్, వెంకటేష్, సూర్యనారాయణ, మునిచంద్ర, నాగరాజ, కాంచాణం, రాధమ్మ, గాయత్రి, నరసింహులు, వనజాక్షి, సరళ, పార్వతమ్మలున్నారు. అంబులెన్స్ సేవకు శ్రీకారంరాయచూరు రూరల్ : మానవుడు ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని నగర శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ పేర్కొన్నారు. గురువారం నగరంలోని ఉప్పారవాడిలో సేవా ట్రస్ట్, విస్తార ఫైనాన్స్, బాలంకు ఆస్పత్రి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబులెన్సు సేవను ప్రారంభించి మాట్లాడారు. ఆదివారం జరగనున్న మెగా ఆరోగ్య ఉచిత శిబిరాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మాజీ శాసన సభ్యుడు బసనగౌడ, నాగరాజ్, బి.వినాయక్, బండేష్లున్నారు. దళితులపై దాడి జరిగినా పట్టదా? రాయచూరు రూరల్ : యాదగిరి జిల్లాలో దళితులపై దాడులు జరిగినా పోలీసులు కేసులు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించడం తగదని దళిత సంఘర్ష సమితి అధ్యక్షుడు హనుమంతప్ప ఆరోపించారు. గురువారం సురపుర డీఎస్పీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. యాదగిరి జిల్లా సురపురలో 15 రోజుల క్రితం అగ్రవర్ణాల వారు దళితులపై దాడులు చేశారన్నారు. తమకు రక్షణ కల్పించాలని విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేసి దళితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. మానవత్వమే శ్రేష్ట ధర్మం హుబ్లీ: సద్గురు సంస్థ భావోసాహేబా మహారాజుల బ్రహ్మశాలలో జరిగిన జ్ఞానయజ్ఞ సప్తాహం రెండో రోజు కార్యక్రమంలో డాక్టర్ శివకుమార స్వామి సాన్నిధ్యం వహించి మాట్లాడారు. జిల్లాలోని అణ్ణిగేరి అమృతేశ్వర ఆలయంలో ఆయన మాట్లాడుతూ మానవత అన్నిటి కన్నా శ్రేష్టమైన ధర్మం అన్నారు. శివమొగ్గ కగ్గ నటేశ, సిద్దన్న సిరసంగి తత్వపదాలను పాడి భక్తిసంద్రంలో ఓలలాడించారు. వివిధ రంగాల్లో కృషి చేసిన సాంబయ్య హిరేమఠ కుటుంబానికి గిరివరదశ్రీ ప్రశస్తిని ప్రదానం చేసి సన్మానించారు. అంతకు ముందు ముత్తైదువులకు ఒడినింపారు. ప్రముఖ వీధుల్లో ప్రదర్శన కూడా నిర్వహించారు. కార్యక్రమంలో వరదశ్రీ ఫౌండేషన్ మల్లికార్జున, ఈరణ్ణ, మహేష్, వీరేష్ పాల్గొన్నారు. -
ధర పతనం.. దిగుబడి అధికం
రాయచూరు రూరల్: రాష్ట్రానికే తలమానికంగా ఉన్న రాయచూరు ఏపీఎంసీ మార్కెట్లో ఉల్లిగడ్డల ధరలు పెరగడం లేదు. గత ఐదేళ్ల నుంచి జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొనడంతో ఈఏడాది వానలు కురిిసినా తడిసిన ఉల్లిగడ్డలకు ధరలు తగ్గాయి. రాయచూరు, మాన్వి, సింధనూరు, లింగసూగూరు, మస్కి, దేవదుర్గల్లో రైతులు ఉల్లిగడ్డలను అధికంగా పండించారు. ప్రతి నిత్యం వేలాది బస్తాలు రాయచూరు వ్యవసాయ మార్కెట్కు వచ్చి పడుతున్నా ధర మాత్రం రైతులకు నిరాశ కల్గిస్తోంది. రాశులుగా పడి ఉన్న సరుకు విక్రయానికి వచ్చిన సరుకు మార్కెట్లో రాశులుగా పడి ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మార్కెట్లో క్వింటాల్కు నాణ్యతను బట్టి రూ.1010–1400 వరకు ఉంది. రైతులు తాము పండించిన ఉల్లిగడ్డలకు మార్కెట్లో ఉన్న ధరపై విచారం వ్యక్తం చేస్తున్నారు. సింధనూరు మార్కెట్లో ధర రూ.1,600 కాగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కేవలం రూ.1010గా ఉంది. రాయచూరు ఏపీఎంసీలో కేవలం ముగ్గురు వర్తకులు మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల నుంచి ఉల్లిగడ్డల విక్రయాలకు అవకాశం లేదంటూ అధికారులు, వర్తకులు ప్రకటించారు. నిరాశాజనకంగా మద్దతు ధర ఉల్లిగడ్డల రైతన్న కంట కన్నీరు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి రాయచూరు ఏపీఎంసీ మార్కెట్లో నిల్వ ఉంచిన ఉల్లిగడ్డ చిరు జల్లులకు తడిచి పోయినందున ప్రభుత్వం ఉల్లి రైతులకు నష్టపరిహారం అందించాలి. – లక్ష్మణగౌడ, రైతు సంఘం అధ్యక్షుడు -
మానవత, దానగుణంతో జీవించాలి
హోసపేటె: ఒక వ్యక్తి ముందుగా మానవతా లక్షణాలను పెంపొందించుకుని దానగుణంతో జీవించాలని లోక్సభ సభ్యుడు ఈ.తుకారాం అన్నారు. గురువారం నగరంలోని బసవేశ్వర సర్కిల్ సమీపంలో సిద్దిప్రియ కళ్యాణ మంటపంలో జరిగిన 6 జిల్లాల హజ్ యాత్రికులకు నిర్వహించిన శిక్షణా శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముస్లిం సమాజానికి హజ్ యాత్ర చాలా పవిత్రమైనదన్నారు. ఈ తీర్థయాత్రకు వెళ్లే వారికి శిక్షణ ఇవ్వడం చాలా అవసరమన్నారు. అలాంటి పనిని హుడా అధ్యక్షుడు, అంజుమాన్ కమిటీ అధ్యక్షుడు హెచ్ఎన్ఎఫ్ ఇమాం చేపట్టారన్నారు. కర్ణాటక హజ్ శిక్షణా వేదిక యాత్రలను నిర్వహించడం, మార్గనిర్దేశం చేయడం అభినందనీయం అన్నారు. అన్ని మతాల సారాంశం ఒకటే, అదే మానవ సూత్రం. అందరితో కలిసి జీవించడం నిజమైన మానవుని లక్షణం అన్నారు. మన నైతికంగా భిన్నంగా ఉండవచ్చు, కానీ మనందరం మనుషులం అని అన్నారు. నేను అన్ని కులాలు, మతాలకు ప్రతినిధిని అన్నారు. నాకు అందరూ సమానమే అయినా ఎవరికీ అన్యాయం జరగకుండా అందరికీ సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ జుల్ఫికర్ అహ్మద్ ఖాన్ (టిప్పు) మాట్లాడుతూ ప్రభుత్వం హజ్ యాత్రికులకు సహాయం అందిస్తోందన్నారు. ముస్లిం సోదరులు ప్రభుత్వం అందించే విద్యా, ఆర్థిక సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని యాత్రను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. బళ్లారి, విజయనగర, చిత్రదుర్గ, కొప్పళ, గదగ, బాగలకోటె జిల్లాల నుంచి 639 మంది యాత్రికులు వచ్చారన్నారు. వచ్చిన యాత్రికులకు శిక్షణ ఇచ్చి హజ్ యాత్రకు పంపుతామన్నారు. -
పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలి
రాయచూరు రూరల్: నగరంలో పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని 2వ వార్డు నగరసభ సభ్యులు జయన్న పేర్కొన్నారు. గురువారం వార్డులో ఇంటింటికెళ్లి చెత్తను వేసేందుకు నీలం, ఆకు పచ్చ రంగులతో కూడిన బకెట్లను పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా విభజించి పౌర కార్మికుల చెత్త సేకరణ బండిలో వేసి పరిఽశుభ్రతకు సహకరించాలన్నారు. కార్పొరేటర్తో పాటు 11 మందికి మూడేళ్ల జైలు శిక్ష● పాతకక్షల నేపథ్యంలో దాడి ఘటనలో తీర్పు హుబ్లీ: హుబ్లీ గాంధీ వాడలో పాతకక్షల నేపథ్యంలో 2010 ఆగస్టు 21న శంషాద్ మనోహర్ మునగేటి తదితర 10 మంది ఇళ్లల్లోకి చొరబడి హత్యాయత్నంతో పాటు ప్రజల ఆస్తులకు హాని కలిగించిన ఆరోపణలపై హుబ్లీ ధార్వాడ సిటీ కార్పొరేటర్ సువర్ణ కల్వకుంట్లతో పాటు 11 మందికి హుబ్లీ 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఒక్కొక్కరికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చింది. కేశ్వాపుర సాగర కాలనీ లాజరస్, డేవిడ్, క్లమత్ జంగమ్, శ్యామస్, శశిధర్, సుషాసుసేరాజ్, సువర్ణ కల్వకుంట్ల, మరియమ్మ, నిర్మల, యోగరాజ్, రాజు ఆర్య శిక్షకు గురైన వారు. కేసులో 14 మంది నిందితులకు గాను 5వ నిందితుడైన అబ్రహామ్ లూంజలాల్, 7వ నిందితుడు శ్రీధర్ రాథోడ్ మృతి చెందారు. 8వ నిందితుడు శబ్బి షేక్ తప్పించుకు పోయారు. ఈ ముగ్గురిపై విచారణ పెండింగ్లో ఉంచిన కోర్టు 11 మందికి శిక్ష విధించింది. -
పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య
హొసపేటె: నగరంలో గత ఏడాది రైల్వే స్టేషన్ రోడ్డులో జరిగిన హత్య మరువ ముందే నగరంలో మరోసారి హత్య జరగడం నగర ప్రజలను హడలెత్తించింది. పాతకక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిని కత్తితో పొడిచి, తలపై బండరాయిని విసిరి దారుణంగా హత్య చేసిన సంఘటన బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో నగరంలోని జంబునాథ రోడ్డులోని అంబేడ్కర్ నగర్ 4వ క్రాస్ వద్ద జరిగింది. హత్యకు గురైన వ్యక్తిని హొన్నూరుస్వామి(30)గా పోలీసులు గుర్తించారు. హత్య తర్వాత నిందితుడు పారిపోయాడు. ఆరేళ్ల క్రితం మృతుడిపై హత్యాయత్నం కూడా జరిగింది. మొదట కత్తితో పొడిచి హత్య చేయడానికి ప్రయత్నించారు. సంఘటనా స్థలంలో రెండు కత్తులు విరిగిపోయినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన వ్యక్తి హొన్నూరు స్వామి దావణగెరెలో నివాసం ఉంటున్నారు. జంబునాథ జాతర కోసం బుధవారం హొసపేటెకు వచ్చాడు. హత్యకు పాల్పడిన వ్యక్తి నగర నివాసి కాళీ అని తెలియడంతో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జంబునాథ రోడ్డు శివారులో దాకొన్నాడు. ఈ విషయంను గ్రహించిన పోలీసు బృందం హత్య చేసిన నిందితుడిని పట్టుకొనేందుకు ప్రయత్నించారు. నిందితుడు పోలీస్ సిబ్బందిపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో టౌన్ పోలీస్ స్టేషన్ పీఐ హులుగప్ప ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపి నిందితుడిని పట్టుకొని స్వాధీన పరచుకొని నగరంలోని వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య చికిత్స చేయించారు. హత్య సంఘటన స్థలానికి ఎస్పీ శ్రీహరిబాబు, అదనపు ఎస్పీ సలీం పాషా, డీఎస్పీ మంజునాథ్ చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. -
సమస్యల సాధనకు 21, 22 తేదీల్లో అహోరాత్రి ధర్నా
బళ్లారిఅర్బన్: బెంగళూరులో ఈ నెల 21, 22 తేదీల్లో అలెమారి, అరె అలెమారి సామాజిక వర్గాల వివిధ సమస్యల పరిష్కారం కోసం రాత్రింబగళ్లు ఆందోళన చేపడుతున్నట్లు ఆ సంఘాల సమాఖ్య రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కే.రవీంద్ర శెట్టి తెలిపారు. గొల్లర సంఘం కార్యాలయంలో గురువారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బీసీ 1లో చేరిన సదరు వర్గాల్లోని 46 కులాలను కలుపుకొని ఉన్న కుటుంబాలు, ఎన్నో ఏళ్ల నుంచి వీధుల్లో గుడారాలను వేసుకొని దుర్భరమైన జీవితం గడుపుతున్నారన్నారు. జీవనోపాధి కోసం గ్రామాల్లో పాత్రలు, సామానుల వ్యాపారం, పశువులు, మేకల పెంపకం, వలలు నిర్మించడం ఇలా వివిధ వృత్తులను ఆధారంగా బతుకు సాగిస్తూ రాజకీయ, సామాజిక, ఆర్థిక, విద్యా పరంగా చాలా వెనుకబడి ఉన్నారన్నారు. ఈ వర్గాలకు ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాలు కల్పించి సమాజంలో ప్రధాన స్రవంతిలోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో రాష్ట్ర వ్యాప్తంగా సమాజ బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రముఖులు వెంకటేష్ యాదవ్, కేఈబీ బసరెడ్డి, కే.శ్యామలయాదవ్, బైలు పత్తార్ పరశురామ, బైలు పత్తార్ రేణుక తదితరులు పాల్గొన్నారు. -
ఐక్యతతోనే గుర్తింపు సాధ్యం
బళ్లారిటౌన్: పురోహితులు ఐక్యతతో ఉంటే ప్రభుత్వ సదుపాయాలను పొందవచ్చని అఖిల భారత అసంఘటిత పురోహిత కార్మిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జే.శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. గురువారం సత్యనారాయణ పేటలోని సత్యనారాయణ ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మనమందరం భేదభావాలను విడనాడి ఐక్యతతో ఉంటే ప్రభుత్వాలు మనలను గుర్తిస్తాయన్నారు. బ్రాహ్మణ సముదాయం రాత్రింబగళ్లు శ్రమిస్తుందన్నారు. మన సమస్యలపై రాష్ట్ర స్థాయిలో పోరాటాలను చేపట్టాల్సి ఉందన్నారు. బెంగళూరులో జరిగే ఫ్రీడం పార్కులో అహోరాత్రి ధర్నాలో అందరూ ప్రామాణికంగా పాల్గొనాలన్నారు. ఇంత వరకు 18 వేల మంది అర్చకులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, ఇంకా నమోదు చేసుకోవాల్సి ఉందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్లాడ్ను కలిసి తమ సమస్యలపై చర్చిస్తామన్నారు. సంస్థాపక జాతీయ అధ్యక్షుడు అనంతమూర్తి, ప్రధాన కార్యదర్శి మహేష్కుమార్, నేతలు సతీష్, అరుణ్కుమార్ శర్మ, వేణుగోపాల్ శర్మ, ద్వారకనాథ్, కేశవ వర్మ, హేమంత్కుమార్, మంజునాథ్ భట్ తదితరులు పాల్గొన్నారు. -
పిల్లలకు మాతృభాష అవసరం
బళ్లారిటౌన్: నేడు పోటీతత్వ ప్రపంచం వల్ల ఇంగ్లిష్పై వ్యామోహంతో మాతృభాషను కనుమరుగు చేస్తున్నారని, పిల్లలకు మాతృభాషను కూడా పెంపొందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వీరశైవ విద్యావర్థక సంఘం కార్యదర్శి, సాహితీవేత్త డాక్టర్ అరవింద్ పాటిల్ పేర్కొన్నారు. బుధవారం కొట్టూరు స్వామి ఉపాధ్యాయ కళాశాలలో కన్నడ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిరిగేరి బసవరాజ్ స్మారక దత్తి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. త్రిభాష కంటకాలతో మాతృభాషకు ప్రాధాన్యత లభించడం లేదన్నారు. దేశ వ్యాప్తంగా హిందీ, ఇతర దేశాల్లో పని చేసేందుకు ఇంగ్లిష్ భాషల వల్ల మన ప్రాంతీయ భాషలపై నేటి విద్యార్థుల్లో పట్టు సడలిందన్నారు. ఇలాంటి దత్తి కార్యక్రమాలు కన్నడ భాషకు ఊపిరి పోస్తాయన్నారు. కసాప జిల్లా అధ్యక్షుడు నిష్టిరుద్రప్ప మాట్లాడుతూ సిరిగేరి బసవరాజ్ కన్నడ భాష అభివృద్ధి కోసం పోరాడిన మహనీయుడన్నారు. అంతేగాక క్రీడలకు కూడా ఎంతో ప్రోత్సాహం కల్పించేవారని గుర్తు చేశారు. ఆయన పేరిట గత ఐదేళ్లలో 221 దత్తి కార్యక్రమాలు జరిగాయన్నారు. డిసెంబర్ నెలలో జిల్లాలో రాష్ట్ర స్థాయి కసాప సమ్మేళనానికి అందరూ సహకారం అందించి విజయవంతం చేయాలన్నారు. దత్తి దాతలు సిరిగేరి పన్నరాజు, సిరిగేరి జయన్న, అసిస్టెంట్ ప్రొఫెసర్ గాదెప్ప, గంగావతి వీరేష్, ప్రిన్సిపాల్ సతీష్ హిరేమఠ, బసవరాజు పాల్గొన్నారు. -
మొక్కుబడిగా మున్సిపల్ సమావేశం
హొసపేటె: 72 అంశాలతో కూడిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం కేవలం 2 నిమిషాల్లో ముగిసి ప్రత్యేక సర్వసభ్య సమావేశంగా మారింది. మేయర్ చంద్రప్ప అందరినీ స్వాగతిస్తూ అధ్యక్షుడు రూపేష్ కుమార్ అధ్యక్షతన హొసపేటె మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ప్రారంభమైందని చెబుతుండగా, సభ్యుడు హనుమంత(బుజ్జి) ఈరోజు సమావేశంలో 589 నుంచి 670 వరకు ఉన్న సబ్జెక్టు నంబర్లలో 632వ సబ్జెక్టు నంబర్ను తిరిగి టెండర్ చేయాలని, సబ్జెక్టు నంబర్ 665న తదుపరి సమావేశానికి వాయిదా వేయాలని అన్నారు. సమావేశం ముగిసిందని చెప్పి సభ్యులందరూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. సమావేశం ముగిసినా ధన్యవాద తీర్మానం జరగలేదు. సమావేశం ముగిసిందని ఎలా చెప్పగలం? అని సభ్యుడు మున్నిఖాసిం మండిపడ్డారు. ప్రతిపక్ష సభ్యులందరికీ మెజారిటీ ఉంది, వారు మాట్లాడినప్పటికీ సమావేశం ఏర్పాటు చేశారని, కానీ సభా మర్యాద పాటించలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. సభ్యుల సూచనలను ఆమోదించామని, రాబోయే రోజుల్లో సభ నియమాలను పాటిస్తామని పేర్కొంటూ మున్సిపల్ కమిషనర్ చంద్రప్ప సమావేశం ముగిసినట్లు ప్రకటించారు. ఉపాధ్యక్షుడు జేఎస్.రమేష్కుమార్, సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. చర్చ లేదు, సవాలు అసలే లేదు ప్రారంభమైన వెంటనే ముగిసింది -
రహదారి నిర్మాణంలో లోపాలు
రాయచూరు రూరల్: జాతీయ రహదారి–167 నిర్మాణంలో లోపాలు జరిగాయని సామాజిక కార్యకర్త తలెకాయ మారెప్ప ఆరోపించారు. బుధవారం ఆయన రోడ్డు పనులను పరిశీలించి మాట్లాడారు. గిల్లేసూగూరు క్యాంప్ నుంచి శక్తినగర్ వరకు రహదారి నిర్మాణం కోసం రూ.51 కోట్లు నిధులు కేటాయించినా పనులు మాత్రం నాసిరకంగా చేపడుతున్నారన్నారు. అంబేడ్కర్ సర్కిల్లో జిబ్రా క్రాసింగ్ ఏర్పాటు చేయలేదన్నారు. రహదారిపై స్పీడ్ బ్రేకర్లు, ట్రాఫిక్ సూచన ఫలకాలు ఏర్పాటు చేయక పోవడాన్ని తప్పు బట్టారు. నాసిరకంగా పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాలన్నారు. పెండింగ్ పనుల పూర్తికి వినతి రాయచూరు రూరల్: అరకొరగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ను ఉన్నఫళంగా ప్రారంభించడం తగదని, మూడు నెలల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలని కరవే డిమాండ్ చేసింది. బుధవారం ఆర్టీసీ బస్టాండ్లో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు రాజు మాట్లాడారు. అరకొరగా పనులు చేపట్టారని, మరుగుదొడ్లు, షెల్టర్, రక్షణ గోడ, బస్ డిపోల వంటి నిర్మాణాలను మూడు నెలల్లో పూర్తి చేస్తామని ఆర్టీసీ అధికారులు హామీ ఇచ్చారు. పనులు పూర్తి చేయాలని కోరుతూ తహసీల్దార్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. మహ్మద్ ప్రవక్తపై నిందన.. యత్నాళ్పై కేసు హుబ్లీ: బీజేపీ బహిష్కృత నేత, ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాళ్పై మహ్మద్ ప్రవక్తను చులకనగా నిందించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈనెల 7న హుబ్లీలోని బాని వీధిలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న యత్నాళ్ మాట్లాడుతూ ఇస్లాం మతం, మహ్మద్ ప్రవక్త గురించి ఉద్రేకంతో చులకనగా మాట్లాడిన వ్యాఖ్యలపై విజయపురలోని గోల్గుంబజ్ పోలీసు స్టేషన్లో మహ్మద్ ఉన్నన్ ఫిర్యాదు చేశారు. హైఓల్టేజీతో గ్రామంలో అంధకారం●విద్యుత్ పరికరాలు బుగ్గి రాయచూరు రూరల్: ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు వీచి, వానలు కురవడంతో హైఓల్టేజీ సమస్యతో గ్రామం చీకటిగా మారడమే కాకుండా వందలాది ఇళ్లలో విద్యుత్ పరికరాలు కాలిపోయిన ఘటన యాదగిరి జిల్లా జాలహళ్లిలో చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి కురిసిన గాలి వానకు 330 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ షార్ట్ సర్క్యూట్ కావడంతో గ్రామంలోని ఇళ్లలో టీవీలు, ఫ్రిజ్లు కాలిపోయాయి. ఒక్కసారిగా ఇళ్లలో ఏర్పడిన మంటలను చూసిన సురపుర తాలూకా జాలహళ్లి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. మహిళల వేషాల్లో పురుషులకు ఉపాధిరాయచూరు రూరల్: మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ కూలీలకు పనులు కేటాయించాల్సి ఉంది. అధికారులు తమ స్వార్థం కోసం మగ కూలీలను మహిళల వేషాల్లో వచ్చి నరేగ పనులు చేపట్టిన వైనం యాదగిరి జిల్లాలో సంచలనం రేపింది. యాదగిరి తాలూకా మల్హారలో కూలీ కార్మికుల పేరుతో గోల్మాల్ చేయడం అధికారులకు అందె వేసిన చెయ్యిగా మారింది. పూజారి పొలంలోని కాలువల్లో పూడికతీత పనులకు వ్యవసాయ కూలీ కార్మికులు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో డూప్లికేట్ ఫొటోల కోసం ఎన్ఎంఎంఎస్లకు కార్మికుల హాజరు జాబితాను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. ఈ తతంగానికి అధికారి వీరేష్ పురుషులను మహిళల వేషాల్లో నరేగ పనులు చేయించారు. మహిళా కార్మికుల పేరుతో పురుష కార్మికులకు చీరలు కట్టించి ఫొటోలు దిగడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. -
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలోని రాయచూరు, కలబుర్గి, యాదగిరి జిల్లాల్లో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. దీనిపై అధికారులు, ప్రజా ప్రతినిధులు మౌనం దాల్చారు. జిల్లాలో తుంగభద్ర, కృష్ణా నది తీరంలోని ప్రాంతాల్లో రోజుకు వందలాది టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా నిరాటంకంగా సాగుతోంది. జిల్లాలోని మాన్వి, రాయచూరు, దేవదుర్గ, యాదగిరి జిల్లాలోని సురపుర, యాదగిరి తాలూకాల్లో అక్రమంగా ఇసుక రవాణా నేటికీ కొనసాగుతోంది. జోళదహెడగి, కరిహళ్లి, పర్వతాపురల్లో కాంట్రాక్టర్లు స్టాక్ యార్డులకు నది నుంచి ఇసుకను దొంగతనంగా తరలించి నిల్వ చేసుకుంటున్నారని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. యంత్రాలతో ఇసుక తవ్వకం పట్టపగలే నదిలో పొక్లెయినర్లు, జేసీబీలతో పెద్ద ఎత్తున గుంతలు పడేలా తవ్వి ఇసుకను తరలిస్తున్నారు. రెండు వాహనాలకు రాయల్టీని పొంది మిగిలిన వాహనాలకు లేకుండా వందలాది టన్నుల ఇసుకను సరఫరా చేస్తున్నారు. కొంత మంది కాంట్రాక్టర్లు నేరుగా ఇసుకను తరలిస్తారు. దీంతో ప్రభుత్వానికి వచ్చే రూ.కోట్లాది ఆదాయంలో కోత పడుతోంది. ఈ విషయంలో జిల్లాధికారి, ఎస్పీ, తహసీల్దార్లు మౌనం వహిస్తున్నారు. శాసన సభ, లోక్సభ, జెడ్పీ సభ్యులు కుమ్మక్కు కావడంతో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణా సరఫరా వల్ల నదుల స్వరూపం మారుతుందనే భయం ప్రజల్లో నెలకొంది. పోలీస్ అధికారులపై దాడులు ఇటీవల అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న వాహనాలను అడ్డుకున్న పోలీస్ కానిస్టేబుల్ౖపై దాడి జరిగిన ఘటన మాన్విలో చోటు చేసుకుంది. మాన్వి తాలూకా చీకలపర్వి వద్ద తుంగభద్ర నదీ తీరం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా నియంత్రించిన పోలీస్ కానిస్టేబుల్పై ఇసుక మాఫియా దాడి చేశారు. ఈ విషయంలో వాస్తవాల నిర్ధారణకు హైదరాబాద్ కర్ణాటక పోరాట సమితి నేత రాఘవేంద్ర కుష్టిగి తాజాగా తమ ప్రతినిధి బృందంతో వివిధ ప్రాంతాల్లో నిల్వ ఉంచిన అక్రమ ఇసుక మేటలను పరిశీలించారు. ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లాది గండి పట్టించుకోని అధికారులు, పాలకులు -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
సాక్షి,బళ్లారి: విజయపుర జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక బీఎస్ఎఫ్ సైనికుడు, అంబులెన్స్ డ్రైవర్ మృతి చెందారు. బుధవారం విజయపుర జిల్లా నిడగుంది పట్టణంలో ద్విచక్ర వాహనానికి లారీ ఢీకొనడంతో బీఎస్ఎఫ్ సైనికుడు మౌనేష్ రాథోడ్(35), అదే సమయంలో లారీకి అంబులెన్స్ ఢీకొనడంతో డ్రైవర్ రితీష్(34) అనే ఇద్దరు మృతి చెందారు. ద్విచక్ర వాహనం, అంబులెన్స్ను ఒకే లారీ దూసుకుని వచ్చి ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. గుజరాత్లో పని చేస్తున్న బీఎస్ఎఫ్ సైనికుడు సెలవులు ఉండటంతో సొంత ఊరుకు రాగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకుని వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. బీఎస్ఎఫ్ సైనికుడు, అంబులెన్స్ డ్రైవర్ దుర్మరణం -
విద్యార్థుల కోసం అదనపు బస్సులు నడుపుతాం
● శక్తి పథకం కింద రూ.450 కోట్లు లాభం ● రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి రాయచూరు రూరల్: రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలల సమయాల్లో అదనపు బస్సులు నడుపుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం జిల్లాలోని సిరవారలో నూతన బస్టాండ్ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. సిరవారలో బస్డిపోను నరేగ పథకం కింద నిర్మించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే శక్తి పథకం కింద రూ.450 కోట్ల లాభం గడించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాన్వి శాసన సభ్యుడు హంపయ్య నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లాధ్యక్షుడు బసవరాజ పాటిల్, నిర్మల, ఆర్టీసీ ఎండీ రాచయ్య, భూపనగౌడ, లక్ష్మి, అధికారులు శశిధర్, రవికుమార్, తిమ్మప్ప, శరణప్ప, చెన్నప్ప, రమేష్, రేణుకలున్నారు. సెల్ అతిగా వాడొద్దన్నందుకు యువకుడి ఆత్మహత్య హుబ్లీ: బుద్ధిగా కాలేజీకి వెళ్లు బాబు, మొబైల్ను అతిగా వాడవద్దు అని మందలించినందుకు సదరు యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెళగావి జిల్లా చిక్కోడి తాలూకాలో చోటు చేసుకుంది. మృతుడిని సాగర్ తుకారాం కురడే (20)గా గుర్తించారు. సాగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ చదివేవాడు. మొబైల్ను విపరీతంగా వాడేవాడు. ఎప్పుడూ ఇంట్లో మొబైల్ను చేతపట్టుకొని అందులో మునిగి పోయేవాడు. బాబూ కాలేజీకి వెళ్లు అని తల్లిదండ్రులు మందలించినందుకు మొబైల్ నుంచి బయట పడలేదు. ఈ క్రమంలో సాగర్ నగ్రల్ గ్రామం తన ఇంటి ముందు ఉన్న పాత ఇంట్లోనే సాగర్ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాగర్ తండ్రి చిక్కోడి సీబీ కోరె సహకార చక్కెర కర్మాగారంలో కాపలాదారుడిగా పని చేస్తున్నాడు. ఈయనకు సాగర్తో పాటు మరో కుమారుడు ఉన్నారు. ఇసుక అక్రమ రవాణపై నిఘా ఏదీ?రాయచూరు రూరల్: జిల్లాలో తుంగభద్ర, కృష్ణా నదీ తీర ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై జిల్లాధికారి నిఘా పెట్టాలని జనసేవా ఫౌండేషన్ అధ్యక్షుడు జావేద్ ఖాన్ పేర్కొన్నారు. బుధవారం పాత్రికేయుల భవనంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయచూరు జిల్లాలో ఐదేళ్ల పాటు 65 బ్లాక్ల్లో కాంట్రాక్ట్ పొందిన కాంట్రాక్ట్లను రద్దు చేయాలన్నారు. అక్రమ ఇసుక రవాణాతో రాజకీయ నాయకుల మద్దతుదారులు లబ్ధి పొంది రాష్ట్ర ప్రభుత్వానికి రూ.15 వేల కోట్ల ఆదాయానికి నష్టం కలిగిస్తున్నారని, వారిపై చర్యలు చేపట్టాలన్నారు. ధరలు తగ్గించాలని నిరసన రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచిన సామాన్యులు వినియోగించే నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని యువజన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన నిరసనలో అధ్యక్షుడు మరిస్వామి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందువల్ల పెంచిన ధరలను తగ్గించాలని కోరుతూ ప్రధానమంత్రికి తహసీల్దార్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. సీపీఐ(ఎంఎల్) కార్యకర్తల ధర్నారాయచూరు రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు వినియోగించే వస్తువుల ధరలను పెంచిందని, వాటి ధరలు తగ్గించాలని సీపీఐ(ఎంఎల్) డిమాండ్ చేసింది. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో కార్యదర్శి నాగరాజ్ మాట్లాడారు. పంచ గ్యారెంటీలతో రాష్ట్ర ఖజానాను లూటీ చేసి, నేడు విద్యుత్, బస్ చార్జీలు, పాల ధరలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెంచిన నిత్యావసరాల ధరలను తగ్గించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్కు తహసీల్దార్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. -
మహనీయుల జయంతులను ఆచరిద్దాం
హొసపేటె: జిల్లా యంత్రాంగం ఏప్రిల్ 30న బసవణ్ణ జయంతిని సరళంగా జరుపుకుంటుందని, మే 10న మహాసాధ్వి హేమారెడ్డి మల్లమ్మ జయంతితో పాటు ఇద్దరు మహానుభావుల జయంతులను ఘనంగా నిర్వహిస్తుందని జిల్లాధికారి ఎంఎస్ దివాకర్ తెలిపారు. నగరంలోని తన కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన గురు బసవేశ్వర జయంతి, హేమారెడ్డి మల్లమ్మ జయంతి ఉత్సవాలపై సన్నాహక సమావేశానికి బుధవారం ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. తల్లిదండ్రులు నేటి యువతరానికి, పిల్లలకు బసవణ్ణ ఆలోచనలు, తత్వాల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఏప్రిల్ 30న బసవణ్ణ విగ్రహానికి పూలమాల వేసి, ఆపై కొట్టూరేశ్వర మఠంలో జరిగే సామూహిక వివాహ వేడుకలను నిర్వహిస్తారన్నారు. మే 10న మహాసాధ్వి హేమారెడ్డి మల్లమ్మ జయంతి, బసవణ్ణ జయంతులను ఘనంగా జరుపుకుందామన్నారు. నగరంలోని సన్నక్కి వీరభద్రేశ్వర ఆలయం నుంచి బసవేశ్వర సర్కిల్ వరకు భారీ ఊరేగింపు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ పి. వివేకానంద, కన్నడ, సంస్కృతి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సిద్దలింగేష్ రంగన్నవర్, తహసీల్దార్ ఎం.శృతి తదితరులు పాల్గొన్నారు. -
14న కేఆర్ఎస్ భీమోత్సవం
బళ్లారిటౌన్: కర్ణాటక రాష్ట్ర సమితి (కేఆర్ఎస్) పార్టీ భీమోత్సవ సమావేశాన్ని ఈ నెల 14న రాఘవ కళామందిరంలో ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు పాయ గణేష్ తెలిపారు. బుధవారం నగరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆ రోజు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 134వ జయంతి పురస్కరించుకొని మొదటి సారిగా బళ్లారి నగరంలో డివిజన్ స్థాయి భీమోత్సవ సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాంతంలో బళ్లారి జిల్లాతో పాటు విజయనగర, రాయచూరు, కొప్పళ, చిత్రదుర్గ జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఎక్కువగా ఉన్నందున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అమలు చేసిన రాజ్యాంగం ప్రకారం మహిళలకు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సరైన సదుపాయాలు అందటం లేదన్నారు. రిజర్వేషన్ ఉన్నా రాజ్యాంగ బద్ధంగా పలు పథకాలు కాని ఉద్యోగాలు కాని దక్కడం లేదన్నారు. వీటన్నింటిపై చర్చించేందుకు ఆ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు రవి కృష్ణారెడ్డి, రాష్ట్ర నేతలు రఘు జడిగేరి, దీపక్, ఆశా వీరేశ్ తదితరులు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా పార్టీ నేతలు సంతోష్కుమార్, ప్రకాష్ రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. -
బస్సును ట్యాక్సీ ఢీ..
● ఎయిర్లైన్స్ ఉద్యోగిని మృతి దొడ్డబళ్లాపురం: ఎయిర్పోర్టుకు వెళ్తున్న కారు రోడ్డుపక్కన నిలిపి ఉన్న బస్సును ఢీకొన్న ప్రమాదంలో ఓ యువతి చనిపోయింది, ఈ సంఘటన చిక్కజాల సమీపంలోని ఐటీసీ ఫ్యాక్టరీ వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. ఇండిగో ఎయిర్లైన్స్లో పని చేసే ఐ. స్నేహా (24), సహోద్యోగి అయిన కౌసర్ ఖానుం, కంపెనీ ట్యాక్సీ డ్రైవర్ వినయ్ (28)లు కెంపేగౌడ ఎయిర్పోర్టుకు వెళ్తున్నారు. త్వరగా వెళ్లాలని సర్వీసు రోడ్డులో వెళ్తుండగా ఆగి ఉన్న ప్రైవేటు బస్సును కారు ఢీకొట్టింది. కారు నుజ్జు కాగా స్నేహా అక్కడే మరణించింది. కౌసర్, వినయ్లు తీవ్రంగా గాయపడ్డారు. స్నేహ తమిళనాడులోని మధురైవాసి, అని బెంగళూరులో ఉంటూ ఉద్యోగం చేస్తోందని పోలీసులు తెలిపారు. చిక్కజాల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బీటెక్ విద్యార్థి దుర్మరణం కారు బైక్ను ఢీకొన్న ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం చెందాడు. వివరాలు.. చిక్కజాలలో ప్రైవేటు కాలేజీలో ఏరో స్పేస్ ఇంజినీరింగ్ రెండో ఏడాది విద్యార్థి, కేరళ త్రిసూర్ నివాసి ఎల్దస్ (21) మృతుడు. శ్రీపాల్ అనే మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. బైక్పై రూంకి వెళ్తుండగా గుమ్మనహళ్లి వద్ద కేఐఏడీబీ అపార్ట్మెంటు ముందు వేగంగా వచ్చిన కారు ఢీకొంది. పోలీసులు కారు డ్రైవర్ను అరెస్టు చేశారు. -
మాజీ మంత్రి నాగేంద్రకు రూ.1.25 కోట్ల జరిమానా
బనశంకరి: చెల్లని చెక్కు కేసులో బళ్లారి రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బీ.నాగేంద్ర కు బెంగళూరు నగర 42వ ఏసీజేయం కోర్టు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. బుధవారం చెక్ బౌన్స్ కేసు విచారించిన కోర్టు.. బీ నాగేంద్ర దోషిత్వం రుజువు కావడంతో రూ.1 కోటి 25 లక్షల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో ఏడాది జైలు శిక్ష అనుభవించాలని జడ్జి శివకుమార్ ఆదేశించారు. వీఎస్ఎల్ స్టీల్ అనే సంస్థ యాజమాన్యం బీ.నాగేంద్ర మీద ఈ చెక్బౌన్స్ కేసు వేసింది. గతంలో నాగేంద్ర వందల కోట్ల రూపాయల వాల్మీకి అభివృద్ధి మండలి కుంభకోణంలో చిక్కుకుని మంత్రి పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. తరువాత ఆయనను ఈడీ అరెస్టు చేసి విచారించింది. బాలికపై దురాగతం.. మృగానికి 20 ఏళ్ల జైలు మండ్య: బాలికను అత్యాచారం చేసిన కామాంధునికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.1.30 లక్షల జరిమానా విధిస్తూ ఇక్కడి అదనపు సెషన్స్, రెండో ఫాస్ట్ట్రాక్ కోర్టు తీర్పు ఇచ్చింది. జిల్లాలోని కేఆర్ పేట తాలూకా అక్కిహెబ్బాళు హోబళి నందిపుర కి చెందిన అప్పు గౌడ అనే వ్యక్తి మైనర్ బాలిక కాలేజీకి వెళ్లివచ్చేటప్పుడు వెంటపడి పరిచయం చేసుకున్నాడు. ప్రేమిస్తున్నానని నమ్మించాడు. బాలికకు మాయ మాటలు చెప్పి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కూతురు కనిపించలేదని తండ్రి కేఆర్పేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు జరిపి నిందితుడిని గుర్తించి పోక్సో కేసు కింద కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో జడ్జి దిలీప్ కుమార్ ఈ మేరకు కఠిన తీర్పు వెలువరించారు. హనుమ రథోత్సవం తుమకూరు: జిల్లాలోని చిక్కనాయకనహళ్లి తాలూకా హుళియారు హోబళి దసోడి గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి బ్రహ్మరథోత్సవం భక్త జనసందోహం నడుమ ఘనంగా జరిగింది. రథోత్సవం సందర్భంగా తెల్లవారుజాము నుంచే స్వామివారికి ధార్మిక కై ంకర్యాలు చేపట్టారు. గౌడగెరె దుర్గమ్మ, ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తులను అలంకరించి మంగళ వాయిద్యాలతో దేవాలయం ప్రదక్షిణం చేశారు. శుభముహూర్తంలో ఆంజనేయస్వామివారిని బ్రహ్మరథంపై ప్రతిష్టించి తేరును లాగారు. ఈద్గా వివాదం సుఖాంతం: ఎస్పీ శివమొగ్గ: నగరంలోని సవళంగ రోడ్డులోని కలెక్టరేటు ఎదుట ఉన్న ఈద్గా మైదాన వివాదం ఎట్టకేలకు సుఖాంతమైంది. గతంలో మాదిరిగా వాహనాల నిలుపుదలకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ జీకే మిథున్ కుమార్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కలెక్టరేట్ ముందు భాగంలోని స్థల సమస్యను సౌహార్ధయుతంగా పరిష్కరించామని తెలిపారు. అన్ని వర్గాలతోను చర్చించగా పరిష్కారానికి అంగీకరించారని తెలిపారు. సీసీ కెమెరాలు, లైట్ల ఏర్పాటుతో పాటు పరిశుభ్రత కాపాడాలనే డిమాండ్కు సమ్మతించారని తెలిపారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి గతంలో మాదిరిగా ఆ స్థలంలో వాహనాల పార్కింగ్కు అనుమతిస్తామని చెప్పారు. సన్ రూఫ్ తెరిచి షికారు.. జరిమానా యశవంతపుర: కారు సన్ రూఫ్ తెరిచి చేతులు ఊపుతూ జాలీరైడ్ చేస్తున్న వ్యక్తులపై బెంగళూరు పోలీసులు జరిమానా విధిస్తున్నారు. ఆర్టీ నగరలో మూడు రోజుల క్రితం రాత్రి సమయంలో జాలీరైడ్ చేసిన కారును గుర్తించారు. జయమహాల్ రోడ్డులో కారు సన్ రూఫ్ తెరిచి ముగ్గురు కేకలు వేస్తూ వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. కారును గుర్తించిన ఆర్టీనగర ట్రాఫిక్ పోలీసులు డ్రైవర్కు రూ.వెయ్యి జరిమానా విధించి ఇంకోసారి ఇలా చేయరాదని హెచ్చరించారు. -
ఏటీఎంను కట్ చేసి రూ.18 లక్షలు లూటీ
దొడ్డబళ్లాపురం: కల్బురిలోని ఎస్బీఐ ఏటీఎంని గ్యాస్ కట్టర్తో పగలగొట్టిన దుండగులు రూ.18 లక్షలు దోచుకుని పరారయ్యారు. బుధవారం తెల్లవారుజామున హరియానా దోపిడీదొంగలు చొరబడి 48 నిమిషాల్లో ఏటీఎంని ఛేదించి డబ్బు ఎత్తుకెళ్లారు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. దుండగులు కారులో వచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులు రాగానే సీసీ కెమెరాలకు నల్ల రంగు చల్లారు. ఏటీఎంలో సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో దొంగల పని సులువైంది. జనవరిలో బీదర్లో రూ. కోటి చోరీ ఉత్తర కర్ణాటకలో నగదు దోపిడీ ముఠాలు ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 16వ తేదీన పట్టపగలు బీదర్ నగరంలో నడిబొడ్డున శివాజీనగరలోని ఓ ఏటీఎం సిబ్బంది రూ కోటి నగదు తీసుకుని ఏటీఎంలో నింపేందుకు వచ్చారు. ఈ సమయంలో బైక్పై వేచి ఉన్న ఇద్దరు దొంగలు తుపాకులతో కాల్పులు జరపడంతో ఓ ఉద్యోగి అక్కడే చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తరువాత దొంగలు తాపీగా రూ.కోటి నగదు పెట్టెను బైక్పై తీసుకుని ఉడాయించారు. వీరు బిహార్కు చెందిన దొంగలని గుర్తించారు కానీ ఇంతవరకు పట్టుకున్నది లేదు. పొరుగున తెలంగాణ నుంచి సులువుగా ప్రవేశిస్తున్న ఉత్తరాది దొంగల ముఠాలు నగదు దోపిడీలకు పాల్పడుతుంటే, పోలీసులు అడ్డుకోలేకపోతున్నారని ఆరోపణలున్నాయి. ఎప్పుడు బందిపోట్ల ముఠాలు విరుచుకుపడతాయోనని ప్రజలు ఆందోళనలో ఉన్నారు. కలబుర్గిలో హరియానా ముఠా దోపిడీ ఉత్తర కర్ణాటకలో బందిపోట్ల బెడద -
బెంగళూరులో నీటి చార్జీల బాదుడు
బనశంకరి: రాష్ట్ర ప్రభుత్వం బెంగళూరు నగరవాసులకు మరోషాక్ ఇచ్చింది. కావేరి జలమండలి నీటిచార్జీలను పెంచింది. మండలి అధ్యక్షుడు రామ్ప్రసాత్ మనోహర్ మాట్లాడుతూ బెంగళూరులో నీటి ధరలను పెంచుతున్నట్లు తెలిపారు. ఇళ్లకు వదిలే నీటిపైన లీటర్పై పైసా పెంపు, 8 వేల లీటర్ల నీరు వాడేవారిపై లీటరుపై 15 పైసలు పెంపు. 8 వేల నుంచి 25 వేల లీటర్లు వాడేవారికి 40 పైసలు చొప్పున పెంపు, 25 వేల నుంచి 55 వేల లీటర్లు వాడేవారికి లీటరుపై 80 పైసలు పెంచుతామని తెలిపారు. ఇక పై ప్రతి ఏడాది ఏప్రిల్ లో నీటి చార్జీలను సవరిస్తామని చెప్పారు. త్వరలో పెంపు ఉత్తర్వులు వెలువడనున్నాయి. -
నంజనగూడు భక్తసంద్రం
మైసూరు: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన జిల్లాలోని నంజనగూడులో బుధవారం వేలాదిమంది భక్తుల మధ్య శ్రీకంఠేశ్వర స్వామి గౌతమ పంచ మహా రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. తెల్లవారుజామునే రుత్వికులు ఆలయంలో లింగాకారునికి అభిషేకం, వివిధ పూజలను నిర్వహించారు. తరువాత ఉత్సవమూర్తిని పల్లకీలో ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయం ముందున్న గౌతమ రథంలో ప్రతిష్టించారు. తెల్లవారుజామున 5 నుంచి 5.40 గంటల మధ్య శుభ మీన లగ్నంలో పండితులు నాగచంద్ర దీక్షిత్ పూజలు సమర్పించారు. నంజనగూడు ఎమ్మెల్యే దర్శన్ ధ్రువనారాయణ రథానికి కొబ్బరికాయను కొట్టి శ్రీకారం చుట్టారు. వేలాది మంది భక్తులు జై శ్రీకంఠేశ్వర, నంజుండేశ్వర అంటూ తేరును లాగారు. వేకువనే శ్రీకంఠేశ్వర రథోత్సవం -
నాణ్యత భ్రమ
బ్రాండెడ్ జలం.. బొమ్మనహళ్లి: మార్కెట్లో అనేక రకాల బ్రాండ్ల పేరుతో ప్లాస్టిక్ బాటిళ్లలో తాగునీరు లభిస్తోంది. ఆ నీరు శుభ్రంగా ఉంటుందని అనుకుంటారు. అయితే ఆ నీరు సురక్షితం కాదని రాష్ట్ర ఆహార సురక్షత శాఖ తెలిపింది. ఆ శాఖ ఫిబ్రవరి, మార్చి నెలల్లో నీరు, కొన్ని ఆహారాలపై తనిఖీలు చేసి ఫలితాలను విడుదల చేసింది. ఫిబ్రవరిలో సుమారు 3,698 ఆహార పదార్థాల నమూనాలను సేకరించి ల్యాబ్లో పరీక్షించారు. 236 తాగునీటి బాటిళ్ల నీటి నమూనాలను పరీక్షలకు పంపారు. అందులో 255 నమూనాల విశ్లేషణ పూర్తయింది. ఇందులో 72 నమూనాలు సురక్షితమని తేలాయి. 95 నమూనాలు సురక్షితం కాదని వెల్లడైంది. 88 నమూనాలలో నాణ్యత లేని నీరు ఉందని తెలిపారు. పచ్చి బఠానీలు సమస్యే ●మార్చిలో మొత్తం 3,204 ఆహార పదార్థాలను సేకరించి ల్యాబ్లో పరీక్షలు చేయించారు. 49 రకాల నెయ్యి శాంపిళ్లను ల్యాబ్కు పంపగా అందులో 6 నమూనాల పరీక్షలు పూర్తయ్యాయి. అవి సురక్షితమని తేలింది. ● ఇక పచ్చి బఠానీలలో 115 నమూనాలను పరీక్షించగా, 69 నమూనాలు సురక్షితం కాదని వెల్లడైనట్లు తెలిపారు. ● 43 పాలకోవా స్వీట్లను సేకరించి ప్రయోగాలయానికి పంపారు. వాటిలో 9 పరిశీలన పూర్తయింది. అందులో 3 నమూనాలలో నాణ్యత చాలా తక్కువగా ఉందని వెల్లడైంది. 6 సురక్షితమని తేలింది. మిగతా ఫలితాలు రావాల్సిఉంది. ● 231 పన్నీరు నమూనాలను పంపగా, 32 నమూనాలలో అసలు నాణ్యత లేదు, తినడానికి పనికిరావని నివేదిక వచ్చింది. 30 నమూనాలు సురక్షితమని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ విభాగం తనిఖీలలో వెల్లడి -
లంచగొండి ఇంజినీరు, లెక్కాధికారి అరెస్టు
మైసూరు: కావేరి నీరావరి నిగమ ఈఈ కావేరి రంగనాథ్, లెక్కాధికారి ఉమా మహేశ్వర్ లోకాయుక్త వలలో చిక్కారు. వివరాలు.. జిల్లాలోని నంజనగూడులో కాంట్రాక్టర్ అబ్దుల్ అజీజ్ నుంచి రూ.1.45 లక్షల లంచం సొమ్మును తీసుకుంటుండగా ఇద్దరినీ అరెస్టు చేశారు. చామరాజనగర తాలూకాకు చెందిన అబ్దుల్ అజీజ్ నీరావరి నిగమలో క్లాస్–1 కాంట్రాక్టర్గా ఉన్నారు. నిగమ నుంచి ఆయన చేసిన ఐదు పనులకు రూ.23 లక్షల బిల్లు బకాయి ఉంది. ఆ బిల్లును చెల్లించేందుకు అధికారులు 6 శాతం కమీషన్ చొప్పున రూ.1.45 లక్షల లంచం డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ ఈ విషయాన్ని లోకాయుక్త అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈఈ ఆఫీసులోనే లంచం తీసుకుంటూ ఉండగా లోకాయుక్త డీఎస్పీ మ్యాథ్యూ థామస్, ఇన్స్పెక్టర్ శశికుమార్, రవికుమార్, సిబ్బంది దాడి జరిపి లంచగొండి అధికారులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి విచారణ చేపట్టారు. -
విద్యార్థులపై తేనెటీగల దాడి
చింతామణి: పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్లో హఠాత్తుగా తేనెటీగలు దాడి చేసి సుమారు 20 మందికి విద్యార్థులను కుట్టాయి. బాధితులు చింతామణి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం పాలిటెక్నిక్ ఆవరణలో ఉన్న చెట్టుపై ఉండే తేనెపుట్టను కోతులు కదిలించాయి. దీంతో తేనెటీగలు చెలరేగిపోయాయి. ఆవరణలో ఉన్న విద్యార్ధులను కరిచాయి. విద్యార్ధులు నొప్పితో కేకలు వేసుకొంటూ పరుగులు తీశారు. కాలేజీ సిబ్బంది బాధితులను ఆస్పత్రిలో చేర్పించారు. అపాయం లేదనడంతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకొన్నారు. రియల్ మోసగాడు అరెస్టుదొడ్డబళ్లాపురం: నకిలీ పత్రాలు తయారుచేసి ఇతరుల స్థలాలను తనవిగా చెప్పుకుని అమ్మేసిన వంచకున్ని యలహంక పోలీసులు గోవాలో అరెస్టు చేశారు. ప్రదీప్ అలియాస్ పాయిజన్ ప్రదీప్ నిందితుడు. ఇతడు విద్యారణ్యపుర, యలంక, యలహంక న్యూటౌన్ పరిసర ప్రాంతాల్లో బోగస్ డాక్యుమెంట్లు తయారు చేసి కొన్ని స్థలాలు విక్రయించి మోసం చేశాడు. నిందితుడు ఆటో రామ అనే మరో రౌడీషీటర్తో కలిసి రియల్ ఎస్టేట్ పేరిట జనాన్ని కోట్ల రూపాయల మేర వంచన చేశాడు. బాధితుల్లో కొందరు పోలీసులు ఉన్నారు. పలువురు బాధితులు ఫిర్యాదు చేయగా గాలించి ఒకరిని పట్టుకున్నారు. కరెంటు కంచెకు ఏనుగు బలి మైసూరు: పొలంలో పంటల రక్షణ కోసం రైతులు అమర్చిన విద్యుత్ కంచెను తాకి ఓ అడవి ఏనుగు మృత్యువాత పడిన ఘటన చామరాజనగర జిల్లా గుండ్లుపేటె తాలూకా బండీపుర అభయారణ్యంలోని ఆలత్తూరు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన రాజేష్ అనే రైతు పొలంలో సుమారు 40 ఏళ్ల వయస్సుగల అడవి ఏనుగు చనిపోయింది. సోమవారం రాత్రి ఆహారం కోసం వచ్చిన ఏనుగు పొలానికి అమర్చిన కరెంటు కంచెను తాకడంతో షాక్ కొట్టి చనిపోయింది. ఓంకార వలయపు అటవీ అధికారులు పరిశీలించి రైతుపై కేసు నమోదు చేశారు. ఏనుగు కళేబరాన్ని పూడ్చిపెట్టారు. తప్పయితే విచారిస్తున్నా: హోంమంత్రి శివాజీనగర: సుద్దగుంటెపాళ్య ఘటన గురించి తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడమైనది. ఎప్పటికీ మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యతను ఇస్తానని హోం మంత్రి జీ.పరమేశ్వర్ చెప్పారు. అర్ధరాత్రి రోడ్డుపై వెళ్తున్న యువతిని ఓ దుండగుడు అసభ్యంగా తాకిన ఘటన కలకలం రేపుతోంది. బెంగళూరు వంటి నగరంలో ఇటువంటివి జరుగుతుంటాయని హోంమంత్రి చెప్పడం తెలిసిందే. దీనిపై పలు వర్గాల నుంచి విమర్శలు రావడంతో మంగళవారం వివరణ ఇచ్చారు. బీజేపీవారు రాజకీయం చేస్తున్నారని, ఒకవేళ రాష్ట్రంలో తల్లుల మనస్సుకు బాధ కలిగించి ఉంటే విచారం వ్యక్తం చేస్తానని తెలిపారు. పెట్రో, గ్యాస్ ధరలపై నిరసన శివాజీనగర: కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ సిలిండర్ల ధరను పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం బెంగళూరులోని గాంధీ విగ్రహం ముందు ధర్నా చేశారు. ధరలను నిత్యం పెంచి పేదల జీవితాల మీద భారం పెంచుతున్నారు, ఇది అవినీతి కేంద్ర ప్రభుత్వ సాధన అని నేతలు ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీ పరిపాలనలో అచ్చే దిన్ పేరుతో నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం ద్వారా రికార్డు సృష్టించింది. ప్రతి వ్యక్తిపై నేడు లక్షలాది రూపాయలు రుణ భారాన్ని నరేంద్ర మోదీ మోపారు అని ఆరోపించారు. ఈ సందర్భంగా మహిళా కార్యకర్తలు గ్యాస్ సిలిండర్లతో, పురుష కార్యకర్తలు ఎద్దుల బండి ఎక్కి నిరసన తెలిపారు. -
నీటి కుంటలో పడి అక్కాచెల్లి మృతి
చిక్కబళ్లాపురం: పొలాల్లో ఫారం పాండ్స్ పేరుతో నీటి గుంతలను నిర్మించడం పెరిగింది. ప్లాస్టిక్ షీటు పరిచి నీరు త్వరగా ఇంకిపోకుండా చేస్తారు. కానీ ఇది చిన్నారుల పాలిట మృత్యుకూపమవుతోంది. వాటిలో పడిపోయి, ప్లాస్టిక్ పేపరు మీద నుంచి బయటకు రాలేక చనిపోతున్నారు. ఇలాంటి దుర్ఘటన చిక్కబళ్లాపురం జిల్లాలోని చేళూరు తాలూకా కురప్పల్లి గ్రామంలో జరిగింది. రాధ (17), సాహితీ (14) అనే అమ్మాయిలు మరణించారు. రాధ, సాహితీ వేసవి సెలవులు కావడంతో తల్లితో కలిసి పొలానికి వెళ్లారు. అక్కడ నీటి కుంటలోకి జారిపడిపోయారు. వారికి ఈత రాకపోవడం వల్ల నీటిలో మునిగిపోయారు. తల్లి గట్టిగా కేకలు వేస్తూ చుట్టుపక్కల ఉన్న వారిని పిలిచింది. వారు చేరుకుని ఇద్దరినీ బయటకు తీసేటప్పటికి ఊపిరి వదిలారు. కళ్లముందే కూతుళ్లు దూరం కావడంతో తల్లి గుండెలవిసేలా రోదించింది. ఘటనాస్థలిని చేళూరు పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
పీయూసీ ఉత్తీర్ణత 73 శాతం
శివాజీనగర: 2025వ సంవత్సర ద్వితీయ పీయూసీ పరీక్ష–1 ఫలితాలు ప్రకటించగా 73.45 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఎప్పటిలాగే బాలికలే పైచేయి సాధించారు. మంగళవారం బెంగళూరులోని కర్ణాటక పాఠశాల పరీక్ష, మూల్యాంకన నిర్ణయ మండలి కార్యాలయంలో విద్యా మంత్రి మధు బంగారప్ప ఫలితాలను విడుదల చేశారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. ఉడుపి అగ్రస్థానం ● ఉడుపి జిల్లా 93.90 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండగా, దక్షిణ కన్నడ 93.57 శాతం ఫలితాలతో 2వ స్థానంలో ఉంది. బెంగళూరు దక్షిణ 85.36 శాతంతో 3వ స్థానంలో ఉన్నది. యాదగిరి జిల్లా 48.45 శాతంతో చివరిలో నిలిచింది. ● గ్రామీణ ప్రాంతాల కంటే నగర ప్రాంతాల విద్యార్థుల ఉత్తీర్ణత ఎక్కువగా ఉంది. ● 3,45,694 మంది బాలికలు పరీక్ష రాయగా, 2,69,202 మంది ఉతీర్ణులయ్యారు. ● 2,92,111 బాలురు పరీక్ష రాయగా, 1,99,227 మంది పాసయ్యారు. ● కన్నడ మాధ్యమంలో ఉత్తీర్ణత 56.37 శాతం ఉండగా, ఆంగ్ల మాధ్యమంలో ఉత్తీర్ణత శాతం 81.75 శాతం ఉంది. ● 85 శాతం కంటే అధిక మార్కులు పొందినవారు 1,00571, ప్రథమ శ్రేణి అంటే 85 కంటే తక్కువ, 60 శాతం కంటే అధిక మార్కులు పొందిన విద్యార్థుల సంఖ్య 2,78,058 గా ఉంది. ● ఈసారి కన్నడ పరీక్ష 5,414 మంది విద్యార్థులు 100కు 100 మార్కులు సాధించారు. అర్థశాస్త్రంలో 613 మంది, కెమిస్ట్రీలో 613 మంది సాధించారు. ● ప్రభుత్వ పీయూ కాలేజీలలో ఉత్తీర్ణత 57.11 శాతం, ఎయిడెడ్ పీయూసీ కాలేజీల ఉత్తీర్ణత 62.69 శాతం, అన్ఎయిడెడ్ కాలేజీలలో 82.66 శాతంగా ఉంది. బీబీఎంపీ పీయూ కాలేజీలలో 68.88 శాతం పాసయ్యారు. ● ఎస్సీ విద్యార్థుల్లో 62.43 శాతం, ఎస్టీ విద్యార్థుల్లో 63.07 శాతం పాసయ్యారు. జనరల్లో 87 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. దివ్యాంగ విద్యార్థుల ఉత్తీర్ణత 64.40 శాతంగా ఉంది. ఇక్కడ జీరో ఫలితాలు ● ఈసారి పరీక్షల్లో 8 ప్రభుత్వ పీయూసీ కాలేజీలు, 20 ఎయిడెడ్ పీయూసీ కాలేజీలు, 90 అన్ఎయిడెడ్ కాలేజీలు, 5 రెసిడెన్షియల్ పాఠశాల పీయూ కాలేజీలు సున్నా ఫలితాలు పొందాయి. ● సమాధాన పత్రాల మూల్యాంకనం మొత్తం 76 కేంద్రాల్లో మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగింది. ● ఫలితాలను వెబ్సైట్లో వీక్షించవచ్చు. అన్ని కాలేజీల్లో కూడా మంగళవారం మధ్యాహ్నం తరువాత ప్రకటించారు. అందులో బాలికలే అధికం ఫలితాల విడుదల విద్యార్థిని ఆత్మహత్య మైసూరు: ద్వితీయ పీయూసీలో ఫెయిలైన ఆవేదనతో మైసూరు నగరంలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కళామందిర ఆపార్ట్మెంటులో నివాసం ఉంటున్న ఐశ్వర్య (17) అనే అమ్మాయి ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఈమె ఒంటికొప్పలిలో ఉన్న ప్రభుత్వ పియు కళాశాల్లో సైన్స్ గ్రూపు చదివేది. మంగళవారం ఫలితాలలో ఫెయిల్ అయినట్లు తెలుసుకుని ఇలా చేసింది.టాపర్లు వీరే ఈ ఏడాది 6,37,805 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వీరిలో 4,68,439 మంది ఉత్తీర్ణులయ్యారు. 73.45 శాతం ఉత్తీర్ణత వచ్చింది. రాష్ట్రస్థాయి టాప్ ర్యాంకులు అమ్మాయిలకే దక్కాయి. సైన్స్లో 600కు 599 మార్కులతో అమూల్య కామత్, కామర్స్లో 599 మార్కులతో దీపశ్రీ, ఆర్ట్స్లో 597 మార్కులతో సంజనా బాయి టాపర్లుగా నిలిచారు. మొత్తం ఆర్ట్స్ విభాగంలో 53.29 శాతం, వాణిజ్య విభాగంలో 76.03 శాతం, సైన్స్లో 82.48 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణ శాతం 77.88 శాతం అయితే బాలల ఉత్తీర్ణత శాతం 68.20 శాతమే. రీకౌంటింగ్కు ఈ నెల 17లోగా దరఖాస్తు చేయాలి. -
నకిలీ బంగారంతో లోన్లు.. ఈడీ దాడులు
శివమొగ్గ: శివమొగ్గ డీసీసీ బ్యాంకు నగర శాఖలో జరిగిన నకిలీ బంగారం కుంభకోణం కేసులో మంగళవారం శివమొగ్గ, బెంగళూరులో పలు చోట్ల ఈడీ అధికారులు దాడులు జరిపారు. వివరాలు.. శివమొగ్గ నగరంలోని గోపాలగౌడ బడావణెలో డీసీసీ బ్యాంకు శాఖ మాజీ మేనేజర్, కామాక్షి వీధిలోని బ్యాంకు వాహన డ్రైవరు, భద్రావతిలోని సిబ్బంది నివాసం, బీహెచ్ రోడ్డులోని డీసీసీ బ్యాంకులో సోదాలు జరిపారు. మరో వైపు బెంగళూరులోని అపెక్స్ బ్యాంకు కార్యాలయం, శివమొగ్గ డీసీసీ బ్యాంకు అధ్యక్షుడు ఆర్ఎం మంజునాథగౌడల నివాసాలలో గాలింపు జరిపారు. మంజునాథగౌడను విచారణ చేపట్టారు. 2023లో కూడా ఈడీ అధికారుల బృందం ఆర్ఎం మంజునాథగౌడకు చెందిన తీర్థహళ్లిలోని నివాసంతో పాటు పలు చోట్ల ఆకస్మిక దాడులు నిర్వహించింది. కేసు ఏమిటంటే... 2014లో డీసీసీ బ్యాంకు శివమొగ్గ నగర శాఖలో నకిలీ బంగారు రుణాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు పెద్దలు నకిలీ బంగారాన్ని కుదువ పెట్టి కోట్లాది రూపాయలను రుణంగా తీసుకుని స్వాహా చేసినట్లు తెలిసి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అప్పట్లో డీసీసీ బ్యాంకు అధ్యక్షునిగా ఉన్న ఆర్ఎం మంజునాథగౌడతో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు అప్పగించింది. ఆ తర్వాత మంజునాథగౌడను నిర్దోషిగా ప్రకటించారు. ఆ తరువాత ఈడీ రంగంలోకి దిగి కేసును దర్యాప్తు చేసింది. ఈడీ దర్యాప్తుపై మంజునాథగౌడ హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చారు. తరువాత స్టేను ఎత్తివేయడంతో ఈడీ దాడులు మొదలయ్యాయి. శివమొగ్గ, బెంగళూరులో సోదాలు -
ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ గరం
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తూ ప్రజలను నట్టేట ముంచుతోందని బీజేపీ నాయకులు మండిపడ్డారు. మంగళవారం జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లాధికారి కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, ఎమ్మెల్సీ వై.ఎం.సతీష్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్కుమార్ మోకా తదితరులు ధర్నా చేపట్టారు. అనంతరం బీజేపీ ప్రముఖులు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం పని చేయడం లేదన్నారు. వారి జేబులు నింపుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. పాల ధరలను పెంచుతున్నారే కాని రైతులకు మేలు చేయడం లేదన్నారు. పాడి రైతులకు ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వడం లేదన్నారు. రైతులను పట్టించుకోని కాంగ్రెస్ సర్కార్కు జనం బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు. అన్ని ధరలు ౖపైపెకి.. అన్ని ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. సామాన్యులు జీవించేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను తప్పుదారి పట్టించి ఆ వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో అమలు కాలేని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేక, చివరికి ఎస్సీ, ఎస్టీ నిధులు కూడా గ్యారెంటీలకు మళ్లించడం శోచనీయం అన్నారు. గ్యారెంటీలు కూడా ఎప్పుడు ఇస్తారో, ఎప్పుడు ఆపేస్తారో వారికే తెలియడం లేదన్నారు. కొందరికే పథకాలు అందుతున్నాయని, మరికొందరికి అందడం లేదన్నారు. వారి స్వలాభం కోసం పథకాలను అమలు చేస్తూ కాలం గడుపుతున్నారన్నారు. మైనార్టీలను సంతృప్తి పరిచేందుకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేస్తున్నారన్నారు. ఈ సర్కార్ కేవలం మైనార్టీల కోసమే పని చేస్తున్నట్లు కనబడుతోందన్నారు. మెగా డైరీని తరలిస్తే ఊరుకోం బళ్లారి జిల్లాకు మెగా డైరీని కేటాయించాలన్నారు. ఈ జిల్లా చుట్టుపక్కల అపారమైన పాడి సంపద ఉందన్నారు. ఎందరో రైతులు ఆశలు పెట్టుకున్నారని, మెగా డైరీని తరలిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. నగరంలో ఇంటి పన్నులు తగ్గించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ధరలు అమాంతంగా పెంచేశారన్నారు. బస్సు ఛార్జీలు పెంచడం శోచనీయమన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని చెబుతూ పురుషులతో రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఽరేట్లు మరింత పెంచారన్నారు. దీంతో మహిళల నుంచి కూడా టికెట్ ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు. తక్షణం పెంచిన ధరలు తగ్గించకపోతే, బళ్లారికి మెగా డైరీ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. మాజీ బుడా అధ్యక్షులు డాక్టర్ మహిపాల్, మారుతీ ప్రసాద్, కార్పొరేటర్ గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. మెగా డైరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ ఎస్సీ, ఎస్టీ నిధుల స్వాహాపై మండిపాటు -
ధరలు తగ్గించాలని సంతకాల సేకరణ
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన పేదలు వినియోగించే నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని అఖిల భారత మహిళా సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన సంతకాల సేకరణ ఆందోళనలో కార్యదర్శి ఈరమ్మ మాట్లాడారు. పంచ గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ఖజానాను లూటీ చేసి, నేడు విద్యుత్, బస్ చార్జీలు, పాల ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిత్యావసరాల ధరలను తగ్గించేలా రాష్ట్ర సర్కార్ను ఆదేశించాలని రాష్ట్ర గవర్నర్కు తహసీల్దార్ ద్వారా సంతకాల సేకరణ చేసి వినతిపత్రం సమర్పించారు. చోరీ సొత్తు వారసులకు అప్పగింత రాయచూరు రూరల్: నగరంలో గతనెల 2న ఆభరణాలను పోగొట్టుకున్న వ్యక్తికి విచారణ జరిపి చోరీ సొత్తును సొంతదారుకు అప్పగించిన ఘటన జరిగింది. మంగళవారం సదర్ బజార్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ పుట్టమాదయ్య బంగారు నగలను వారసులకు అప్పగించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ కార్యాలయం వద్ద బంగారు దుకాణంలో పని చేస్తున్న సహదేవప్ప 2.5 తులాల బరువైన 6 జతల తాళిబొట్లు పోగొట్టుకున్నారు. ఈ విషయంపై సదర్ బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సీసీ టీవీ కెమెరాలతో శ్రీకాంత్ అనే వ్యక్తికి దొరకడంతో అతని నుంచి వాటిని స్వాధీనం చేసుకొని సహదేవప్పకు తిరిగి అప్పగించామన్నారు. సీఐ ఉమేష్ నారాయణ కాంబ్లే, పోలీసులు శ్రీనివాస్, రవి కుమార్, బసవరాజ్, శివానందలున్నారు. బకాయి వేతనాలు చెల్లించరూ రాయచూరు రూరల్: జెస్కాం 33 కేవీ విద్యుత్ ఉప కేంద్రాల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వహిస్తున్న కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలని జెస్కాం కాంట్రాక్ట్ కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం రాయచూరు జెస్కాం కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు వీరేష్ మాట్లాడారు. జిల్లాలో 20 ఏళ్ల నుంచి జెస్కాంలోని 33 కేవీ విద్యుత్ ఉప కేంద్రాల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వహిస్తున్న 500 మంది కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు లేక వెట్టి చాకిరీ చేస్తున్నారన్నారు. పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. జెస్కాం ప్రైవేటీకరణను మానుకోవాలని కోరుతూ జెస్కాం అధికారికి వినతిపత్రం సమర్పించారు. 16న ఉద్యోగ మేళా రాయచూరు రూరల్: కలబుర్గిలో జరగనున్న ఉద్యోగ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు సూచించారు. మంగళవారం మంత్రి తమ కార్యాలయంలో ఈనెల 16న కేసీటీ ఇంజినీరింగ్ కళాశాల వద్ద జరుగనున్న కలబుర్గి డివిజన్ ఉద్యోగ మేళాలో 125 కంపెనీలు, స్థానికంగా 216 కంపెనీలు పాల్గొంటాయన్నారు. 22 వేల మందికి పైగా నిరుద్యోగులు పాల్గొంటారన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షురాలు నిర్మల, జెడ్పీ అధికారులు రాహుల్ తుకారాం పాండే, శశికాంత్ శివపురె, రోణ, హుడేద్, రాజశేఖర్, జయప్రకాష్, తిరుమల, బడిగేర, సంగమేష్, ఆరతి, విజయ కుమార్, అనిల్లున్నారు. చెత్త తొలగింపునకు బకెట్ల పంపిణీ రాయచూరు రూరల్: నగరంలో పరిశుభ్రత పెంపునకు ప్రజలు సహకరించాలని 23వ వార్డు నగరసభ సభ్యురాలు సరోజమ్మ పేర్కొన్నారు. మంగళవారం వార్డులో ఇంటింటికెళ్లి చెత్త తరలింపునకు నీలం, ఆకు పచ్చ రంగుతో కూడిన బకెట్లను సంచాలకుడు నరసింహారెడ్డి అందించి మాట్లాడారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా విభజించి పక్కన పెట్టి పౌర కార్మికులు బండిలో వేసి పరిఽశుభ్రతకు సహకరించాలన్నారు. -
లాభాల బాటలో ఆర్డీసీసీ బ్యాంక్
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా కేంద్ర సహకార(ఆర్డీసీసీ) బ్యాంక్కు 2024–25వ ఆర్థిక సంవత్సరంలో రూ.12.11 కోట్ల మేర లాభాలు వచ్చినట్లు బ్యాంక్ అధ్యక్షుడు విశ్వనాథ్ పాటిల్ పేర్కొన్నారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని లావాదేవీల నుంచి రూ.రూ.23.84 కోట్ల మేర లావాదేవీలు జరగగా రూ.11.73 కోట్లు వ్యయం చేయగా రూ.12.11 కోట్లు లాభం గడించామన్నారు. 574 సంఘాలు, షేర్ క్యాపిటల్ రూ.51.52 కోట్లు, డిపాజిట్లు రూ.1381 కోట్లు ఉండగా, నాబార్డ్, అపెక్స్ బ్యాంకుల నుంచి రూ.119.93 కోట్ల రుణాలు తీసుకున్నామన్నారు. 2025 మార్చి నాటికి బ్యాంక్ నుంచి రూ.1023.20 కోట్ల రుణాలిచ్చామన్నారు. గతంలో ఇచ్చిన రూ.1031.63 కోట్ల రుణాల్లో మార్చి నాటికి రూ.974.67 కోట్లు వసూలు చేశామన్నారు. బ్యాంక్లో రుణాలు పొంది మరణించిన రైతులకు రూ.50 వేల చొప్పున 262 మందికి మాఫీ చేశామన్నారు. డైరెక్టర్ విజయ్ కుమార్, సీఈఓ మల్లికార్జునలున్నారు. -
సూర్యోదయాన్నే కాల్పుల మోత
హుబ్లీ: కత్తిపోట్ల కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించిన క్రమంలో పోలీసులపై దాడి చేసి పరారవడానికి ప్రయత్నించిన నిందితుడి కాళ్లపై తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానిక హెగ్గేరి నివాసి, ఆటో డ్రైవర్ మల్లిక్ ఆదోనిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ విశ్వనాథ హాలదమట్టి, కానిస్టేబుల్ షరీఫ్ నదాఫ్ గాయపడ్డారు. ఈ ముగ్గురిని కేఎంసీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మల్లిక్తో పాటు 7, 8 మంది గుంపు సోమవారం రాత్రి హెగ్గేరి వద్ద ఇర్ఫాన్పై దాడి చేసి చాకుతో పొడిచారు. ఘటనపై పాత హుబ్లీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు తప్పించుకోబోగా కాల్పులు కీలక నిందితుడు మల్లిక్ను రాఘవేంద్ర కాలనీ శ్మశానం వద్ద అదుపులోకి తీసుకోడానికి వెళ్లగా పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. ఈ విషయమై పోలీస్ కమిషనర్ శశికుమార్ మాట్లాడుతూ నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు కాల్పులు జరిపారన్నారు. ఈ ఘటనలో నిందితుడితో పాటు పోలీసులు గాయపడ్డారన్నారు. ఇర్ఫాన్తో డబ్బులు తీసుకున్న మల్లిక్ డబ్బులు ఇవ్వకుండా తన సహచరులతో కలిసి సదరు ఇర్ఫాన్పై దాడి చేశారు. అయితే నిందితుడు మల్లిక్ తానే బ్లేడ్తో చేయి కోసుకొని తనపైనే దాడి చేశారని ఆస్పత్రికి వచ్చి అడ్మిట్ అయ్యాడు. అతడి ఫిర్యాదుపై దర్యాప్తు జరపగా అతడే నిందితుడని గుర్తించామన్నారు. ఇద్దరూ రౌడీషీటర్లే అతనిని అదుపులోకి తీసుకోడానికి ప్రయత్నిస్తుండగా ఈ క్రమంలో తప్పించుకోడానికి ప్రయత్నించగా రెండు రౌండ్లు కాల్పులు జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇర్ఫాన్, మల్లిక్ ఇద్దరూ రౌడీషీటర్లే అన్నారు. ఇర్ఫాన్పై హత్య తదితర కేసులు ఉండగా మల్లిక్పై హత్యాయత్నం, ఇతర కేసులు ఉన్నాయన్నారు. వీరిద్దరిపై పాత హుబ్లీ పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారన్నారు. ఆటో డ్రైవర్ అని చెప్పుకొని వడ్డీ వ్యాపారాలు, వాహనాల సీజింగ్ తదితర పనులకు పాల్పడేవారు. ఇతడిపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుందని, సరిహద్దుల నుంచి బహిష్కరించిందన్నారు. ఇలాంటి కృత్యాల్లో పాల్గొనే వారి జాబితా సిద్ధం చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ వివరించారు. ఆత్మరక్షణ కోసం పోలీసు కాల్పులు రౌడీషీటర్ కాళ్లపైకి తూటాల వర్షం -
హత్య కేసులో నిందితుల అరెస్ట్
సాక్షి,బళ్లారి: పాత కక్షలతో ఓ యువకుడు హత్యకు గురైన ఘటన జరిగింది. తన అక్కను వేధిస్తున్నాడనే కారణంతో స్నేహితులతో కలిసి సోదరిని వేధిస్తున్న యువకుడిని దారుణంగా హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా నల్లూరు గ్రామంలో ఇటీవల మహమ్మద్ జావేద్ అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు. పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేసి హత్య కేసు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు హత్య ఎందుకు చేశారో కనుగొన్నారు. తన సోదరిని వేధించడంతో పాటు పాతకక్షల కారణంగా మహమ్మద్ జావేద్ను మహమ్మద్ నిహాల్, రోషన్ఖాన్, మహమ్మద్ అబూ, మమహ్మద్ సమీర్ అనే నలుగురు దారుణంగా హత్య చేసినట్లు వెలుగులోకి రావడంతో పోలీసులు హత్య చేసిన వారిని అరెస్ట్ చేసి కేసును లోతుగా విచారణ చేస్తున్నారు. లిఫ్ట్లో చిక్కుకున్న వ్యక్తి క్షేమం హుబ్లీ: హావేరి నగర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి లిఫ్ట్లో కొద్ది సేపు చిక్కుకున్న ఘటన హావేరి జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. రోగితో కలిసి ఆస్పత్రికి వచ్చిన మంజునాథ్ లిఫ్ట్లో చికుక్కొని తీవ్రంగా గాభరా పడ్డాడు. అక్కడికి వచ్చిన అగ్నిమాపక దళ సిబ్బంది కార్యాచరణ చేసి మంజునాథ్ను కాపాడింది. 1వ, 2వ అంతస్తు మధ్యలో లిఫ్ట్ స్తంభించడంతో కొంత సమయంలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. జిల్లా ఆస్పత్రి సాంకేతిక సిబ్బంది లిఫ్ట్ను సక్రమంగా నిర్వహణ చేయక పోవడం వల్ల ఈ ఇబ్బంది తలెత్తిందని స్థానికులు ఆరోపించారు. ఖజానా లూటీ ఘనత పాలకులదే రాయచూరు రూరల్: ప్రభుత్వ ఆదాయాన్ని పంచ గ్యారెంటీలకు మళ్లించి ఖజానాను లూటీ చేసిన ఘతన పాలకులదేనని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు నరసింహ నాయక్ ఆరోపించారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విద్యుత్ బిల్లును యూనిట్కు 36 పైసలు, పాల ధరను లీటరుకు రూ.9 చొప్పున, బస్ చార్జీలు, స్టాంప్ డ్యూటీలు పెంచడం తగదన్నారు. పంచ గ్యారెంటీలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పాలకులు దిగజార్చారన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని కోరారు. వీరభద్రేశ్వర ఎత్తిపోతల పథకం, నవలి వద్ద సమాంతర జలాశయం నిర్మాణాలు చేపట్టాలని ఒత్తిడి చేశారు. బెళగావిలో విద్యార్థి ఆత్మహత్య హుబ్లీ: హాస్టల్లో ఉరి వేసుకొని ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెళగావి రామనగర్లోని చంద్రకాంత కాగవాడ బాయ్స్ హాస్టల్లో చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని ప్రజ్వల్ కుప్పనట్టి(20)గా గుర్తించారు. సోమవారం కళాశాలకు వెళ్లకుండా తన గదిలో ఉన్నాడు. ఆ సాయంత్రం స్నేహితుడు వచ్చి గది తలుపులు తట్టినా ప్రజ్వల్ తలుపులు తీయలేదు. దీంతో కిటికీ నుంచి తొంగి చూడగా ప్రజ్వల్ ఉరి వేసుకున్నట్లు కనిపించింది. రాయబాగ తాలూకా బావన సౌదత్తి గ్రామ నివాసి అయిన ప్రజ్వల్ బెళగావి ఇంజినీరింగ్ కళాశాలలో చదివేవాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటన స్థలాన్ని మాళమారుతీ పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని బెళగావి బిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. విజయనగర జిల్లా వాసులకు ర్యాంకుల పంట హొసపేటె: రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం వెలువడిన ద్వితీయ పీయూసీ ఫలితాల్లో విజయనగర జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఆర్ట్స్ విభాగంలో రాష్ట్రంలో మొదటి, రెండో స్థానాలు సాధించారు. విజయనగర జిల్లాలోని కొట్టూరు తాలూకాకు చెందిన పీయూ విద్యార్థిని సంజనాబాయి ఆర్ట్స్ విభాగంలో 600 మార్కులకుగాను 597 మార్కులు సాధించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. విజయనగర జిల్లా ఇటగికి చెందిన హుబ్లీలోని పంచమసాలి పీయూ కళాశాల విద్యార్థిని నిర్మల ఆర్ట్స్ విభాగంలో 600 మార్కులకుగాను 596 మార్కులు సాధించి రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. -
కూలీ కార్మికుడి కూతురికి రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంక్
హుబ్లీ: కట్టడ కార్మికుడిగా పని చేస్తున్న ఆయనకు కూతురు మంగళవారం తెచ్చి పెట్టిన సంతోషం అంతా ఇంత కాదు. హుబ్లీ గోపనకొప్పలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని నాగవేణి రాయచూరు మంగళవారం వెల్లడైన ద్వితీయ పీయూసీ ఆర్ట్స్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంక్ సాధించి చదువుతున్న కళాశాలకు, కన్న తల్లిదండ్రులకు ఎంతో కీర్తిని తెచ్చింది. కాగా కూతురి పరీక్ష ఫలితాలు తెలిసిన వెంటనే కళాశాల సిబ్బంది నాగవేణి తండ్రిని పని చేసే చోటకి వెళ్లి మీ కుమార్తె మా కళాశాలకు ఎంతో పేరు తెచ్చిందంటూ అక్కడికక్కడే ఘనంగా సన్మానించారు. నాగవేణి ఈ సందర్భంగా మాట్లాడుతూ తన కృషికి తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపక బృందం కారణమని అభిప్రాయపడింది. అసలు ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఆశించానని తెలిపింది. కన్నడలో 99, హిందీలో 96, భౌగోళికశాస్త్రంలో 100, రాజనీతి శాస్త్రం 100, ఎడ్యుకేషన్లో 99 మార్కులు సాధించినట్లు తెలిపింది. -
నీటిని పొదుపుగా వాడుకోండి
బళ్లారి రూరల్: మండువేసవిలో జీవనాధారమైన నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడాలని దావణగెరె ఎంపీ డాక్టర్ ప్రభా మల్లికార్జున్ తెలిపారు. సోమవారం తాలూకాలోని కనగొండనహళ్లి గ్రామంలో జెడ్పీ, గ్రామీణ నీటి సరఫరా విభాగం, జల జీవన్ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో కర్ణాటక సుస్థిర తాగునీటి సరఫరా యోజనలో 24 గంటలు, వారం రోజులు మంచినీటి సరఫరాను ప్రారంభించి మాట్లాడారు. నిరంతర మంచినీటి సరఫరా వల్ల మహిళలకు అనుకూలమని తెలిపారు. శుద్ధి చేసిన నీటిని తాగడం వల్ల అనేక వ్యాధులను అరికట్టవచ్చన్నారు. గ్రామంలో రోజంతా మంచినీటి సరఫరా ఉన్నందున గ్రామస్తులు నీటిని పొదుపుగా వాడుకోవాలని తెలిపారు. మంచినీటిని ఇంట్లో ఎక్కువగా నిల్వ ఉంచడం వల్ల ఆ నీటి నుంచి దోమలు ఉత్పత్తి అయి డెంగీ వ్యాధి ప్రబలే అవకాశం ఉందన్నారు. జిల్లాలో నిత్యం మంచినీటి సరఫరా అయ్యే గ్రామాల్లో కనగొండనహళ్లి రెండోదన్నారు. జిల్లాలో 100 గ్రామాలకు నిత్యం మంచినీటి సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు తెలిపారు. ఆగస్టు నెలాఖరుకు అన్ని గ్రామాలకు మంచినీరు సరఫరా అయ్యేలా చూస్తామన్నారు. జిల్లాధికారి గంగాధరస్వామి, జెడ్పీ సీఈఓ సురేశ్ బి.హిట్నాళ్, కుప్పళ విశ్వ బ్యాంకు టాస్క్ఫోర్స్ మరియప్ప, ఫీడ్ బ్యాక్ సంస్థ సీఈఓ అజయ్సింహ, జీపీ అధ్యక్షురాలు జలజాక్షి తదితర అధికారులు, సభ్యులు పాల్గొన్నారు. కలుషిత నీటితో వ్యాధుల బారిన పడొద్దు అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకోవద్దు దావణగెరె ఎంపీ డాక్టర్ ప్రభా మల్లికార్జున్ -
మోసకారి బ్యాంక్ మేనేజర్ అరెస్ట్
● ఖాతాదారులకు తెలియకుండా రూ.10 కోట్ల మేర టోపీ ● బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో వెలుగు చూసిన ఉదంతం రాయచూరు రూరల్: బంగారు రుణాలు పొందిన ఖాతాదారులకు బ్యాంక్ మేనేజర్ రూ.10 కోట్ల మేర మోసం చేసిన ఉదంతంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖ మేనేజర్ నరేంద్ర రెడ్డిని శ్రీశైలంలో అరెస్ట్ చేసినట్లు ఎస్పీ పుట్టమాదయ్య తెలిపారు. రాయచూరు శాఖలో విధులు నిర్వహిస్తూ ఖాతాదారులకు తెలియకుండా 105 మంది ఖాతాదారుల పేరు మీద రుణాల రికార్డుల్లో రూ.10.67 లక్షల మేర కుచ్చు టోపీ పెట్టి పరారయ్యారు. 29 బినామి ఖాతాదారుల పేరు మీద బంగారు నగల రుణాలను బదిలీ చేశారన్నారు. నరేంద్రరెడ్డి 8 మంది కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నిధులను బదిలీ చేశారని తెలిపారు. హుబ్లీ రీజనల్ మేనేజర్ సుచేత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రెం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి మేనేజర్ను అరెస్ట్ చేశారన్నారు. జూన్లో ముంగారు ఉత్సవాలురాయచూరు రూరల్: నగరంలో జూన్ నెలలో ఐదు రోజుల పాటు ముంగారు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు మాజీ శాసన సభ్యుడు పాపారెడ్డి వెల్లడించారు. జూన్ 8 నుంచి 12వ తేదీ వరకు ముంగారు మున్నూరు కాపు సమాజం ఆధ్వర్యంలో చేపట్టే ముంగారు సాంస్కృతిక ఉత్సవాలను చేపట్టడానికి సమాజం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు. ముంగారు సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభమై 25 ఏళ్లు కానున్న సందర్భంగా ఉత్సవాలను ముఖ్యమంత్రి సిద్దరామయ్య చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఘనంగా హనుమంతుని జాతర ఉత్సవాలుహుబ్లీ: బిడనాళలో హనుమంతుని ఆలయ కమిటీ అధ్వర్యంలో సోమవారం నుంచి ఈ నెల 13 వరకు హనుమంతుని జాతర ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి రోజు సాయంత్రం 7 గంటలకు మరిగమ్మ ఆలయం వద్ద ఆధ్యాత్మిక ప్రవచనం సోమవారం సాయంత్రం నుంచి ప్రారంభమైంది. హుబ్లీ శాంతాశ్రమం అభినవ సిద్దరూఢ స్వామి ప్రవచన కార్యక్రమానికి శుభారంభం పలికారు. హావేరి హుక్కేరి మఠం సదాశివ స్వామి సాన్నిధ్యం వహించారు. మంగళవారం గ్రామ దేవత పూజ, 10న ఉదయం 7.30 గంటలకు హనుమంతునికి వెండి కవచం, తేరు కలశం, ప్రదర్శన నిర్వహించనున్నారు. 11న ప్రవచన మంగళోత్సవం జరగనుంది. మనకవాడ అన్నదానేశ్వర మఠం అభినవ మృత్యుంజయ స్వామి సాన్నిధ్యం వహించనున్నారు. 12న ఉదయం హనుమంతునికి ఊయలోత్సవం ఆ తర్వాత ధార్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు హనుమంతుని రథోత్సవం జరగనుంది. రుద్రాక్షిమఠం బసవలింగ స్వామి, మూరుసావిర మఠం జగద్గురు డాక్టర్ గురుసిద్ద రాజయోగేంద్ర స్వామి పాల్గొననున్నారు. 13న ఉదయం కడుబిన కాళగతో పాటు మహిళలతో ప్రత్యేకంగా రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. నాలుగుకు పెరిగిన కారు ప్రమాద మృతులు హుబ్లీ: నగర శివారులోని జాతీయ రహదారిపై నూల్వి క్రాస్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. దీంతో కారు ప్రమాద మృతుల సంఖ్య నాలుగుకు పెరిగినట్లయింది. కారు డ్రైవర్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో కారులో ఉన్న లింగరాజనగర నివాసులు సుజాత హిరేమఠ(60), శకుంతల హిరేమఠ(72), గాయత్రి (67), ఘటన స్థలంలో చనిపోగా గాయపడిన సంపత్ కుమార్(68) చికిత్స పొందుతూ కేఎంసీ ఆస్పత్రిలో కన్నుమూశారు. తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్ వీరబసయ్య హిరేమఠకు (65) చికిత్స కొనసాగుతోంది. కాగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతిపై కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. రైలు పట్టాలపై వ్యక్తి మృతదేహంహొసపేటె: హొసపేటె, మునిరాబాద్ రైలు స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై సుమారు 50 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించినట్లు బళ్లారి రైల్వే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మృతుడు 5.6 అడుగుల ఎత్తు, గుండ్రని ముఖం, సాధారణ శరీరాకృతి, గోధుమ రంగు శరీరఛాయ, పొగవాటి ముక్కు, విశాలమైన నుదురు, 2 అంగుళాల తెలుపు, నలుపు మిశ్రిత జట్టు, చిన్న మీసం కలిగి కాలర్ మీద ఎంఆర్ అనే లేబుల్ ఉంది. నీలం రంగు ఫుల్ ఓవర్ షర్ట్, తెల్లటి ఆఫ్ వైట్ వెస్ట్, గోధుమ రంగు ప్యాంటు, ఆకు పచ్చ చారల రుమాలు, గోధుమ రంగు లోదుస్తులు, నడుము చుట్టు గోధుమ రంగు బెల్ట్ ధరించి ఉన్నాడు. మృతుడి వారసులు ఎవరైనా ఉంటే రైల్వే పోలీస్ స్టేషన్లో పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ను లేదా 9480802131 నెంబరులో సంప్రదించాలని ఓ ప్రకటనలో కోరారు. -
అంబేడ్కర్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలు ప్రారంభం
బళ్లారిఅర్బన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా బళ్లారిలో తొలిసారిగా అంబేడ్కర్ క్రికెట్ ప్రీమియర్ లీగ్–2025 సీజన్–1 పోటీలు విమ్స్ మైదానంలో సోమవారం ప్రారంభం అయ్యాయి. ఈ పోటీలు ఈనెల 14వ తేదీ వరకు జరగనున్నాయి. జీకే ఫౌండేషన్, జీకే గ్రూప్ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ పోటీలను యువనేత కట్టెస్వామి ప్రారంభించి మాట్లాడారు. నగరంలో తొలి సారిగా భారీ స్థాయిలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతి వేళ పోటీలను నిర్వహించడం హర్షనీయం అని జట్టు యజమానిని, క్రీడాకారులను అభినందించారు. ప్రముఖురాలు మల్లేశ్వరి, నిర్వాహకులు చంద్రన్న మాట్లాడుతూ ఈ టోర్నీలో 14 జట్లు పేర్లు నమోదు చేసుకున్నాయన్నారు. 8 రోజుల పాటు పోటీలు జరుగుతాయన్నారు. ఫైనల్ పోటీ ఈ నెల 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా నిర్వహిస్తామన్నారు. క్రికెట్ పోటీల నిర్వాహకులు మహేష్ కురువళ్లి, కే.వెంకటేష్, ఏకే.తిప్పయ్య, ఎస్.ప్రకాష్, రత్తయ్య, శివరామ, గురు, దుర్గప్రసాద్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. -
చెరువులో మునిగి యువకుడు మృతి
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని జమ్మోబనహళ్లి శివార్లలోని చెరువులో స్నానానికి దిగి ఓ యువకుడు నీటిలో మునిగి చనిపోయిన ఘటన జరిగింది. యువకుడి మృతదేహాన్ని సోమవారం పోలీసులు వెలికితీశారు. మృతుడిని జమ్మోబనహళ్లి గ్రామానికి చెందిన శ్రీధర్(22)గా గుర్తించారు. శనివారం నుంచి శ్రీధర్ ఇంటికి తిరిగి రాలేదు. ఈ విషయంపై శ్రీధర్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతను గ్రామ శివార్లలోని చెరువులో స్నానానికి వెళ్లి ఉండవచ్చని అనుమానంతో కూడ్లిగి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక కేంద్రం అసిస్టెంట్ సూపరింటెండెంట్ శరణ బసవ రెడ్డిని ఘటనా స్థలానికి పంపారు. అధికారులు, స్థానికుల సహాయంతో గంట సేపు గాలించి శ్రీధర్ మృతదేహాన్ని నీటిలో నుంచి బయటకు తీశారు. మృతుడి తండ్రి తిప్పేస్వామి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
కాలువలో పడి ఇద్దరు దుర్మరణం
రాయచూరు రూరల్: రాజోలిబండ డైవర్షన్ స్కీమ్(ఆర్డీఎస్) కాలువలోకి కాలు జారి పడి ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన సోమవారం రాయచూరు తాలూకాలో చోటు చేసుకుంది. మృతులను తెలంగాణలోని గద్వాలకు చెందిన అంజలి(14), వెంకటేష్(13)లుగా గుర్తించారు. ఆదివారం శ్రీరామ నవమి నిమిత్తం పంచముఖి గాణదాళ ఉత్సవాలకు గద్వాల నుంచి భక్తులు తరలి వచ్చారు. కాలువ వద్ద స్నానానికి వెళ్లగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతదేహాల ఆచూకీ కోసం గాలింపు చేపట్టామన్నారు. పిల్లల మరణ వార్త విని తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. -
చమురు ధరల పెంపుపై నిరసన
హొసపేటె: చమురు ధరలను ఉన్నఫళంగా కేంద్ర ప్రభుత్వం పెంచడంపై విజయనగర జిల్లా లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లాధికారి కార్యాలయం ముందు నిరసన తెలిపారు. సంఘం అధ్యక్షులు మహబూబ్ సాబ్ మాట్లాడుతూ డీజిల్పై అమ్మకపు పన్ను పెంపు సరుకు రవాణా పరిశ్రమను కుంగదీసిందన్నారు. తాజా పెరుగుదల సరుకు రవాణాలో ప్రతి వస్తువుపై ఆర్థిక భారాన్ని రెట్టింపు చేస్తుందన్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులను కలిగిస్తుందన్నారు. వాహన ఫైనాన్సింగ్, పన్నులు, అధిక ఖర్చులతో ట్రక్కు యజమానులు తక్కువ అద్దెలకు తమ వాహనాలను నిర్వహించడం కష్టకరం అవుతుందన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని కోరారు. అనంతరం జిల్లాధికారి దివాకర్కు వినతిపత్రాన్ని అందజేశారు. -
త్వరలో చెన్నమ్మ సర్కిల్లో సంచారం బంద్
హుబ్లీ: నగర నడిబొడ్డున జరుగుతున్న పైవంతెన నిర్మాణ పనులతో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్థం అయింది. ఈ క్రమంలో నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు నాలుగు నెలల పాటు చెన్నమ్మ సర్కిల్కు ట్రాఫిక్ బంద్ చేయాలని జిల్లా యంత్రాంగం తీర్మానించింది. దీంతో ట్రాఫిక్ సంచారానికి తీవ్రమైన ఇబ్బందులతో పాటు వాణిజ్య వ్యాపారాలకు భారీగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇటీవల కేంద్ర మంత్రి ప్రహ్లాద్జోషి నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో ఈ నెల 19 నుంచి ఆగస్ట్ 20 వరకు చెన్నమ్మ సర్కిల్ నుంచి పాత కోర్టు సర్కిల్, బసవన సర్కిల్, హొసూరు గాళి దుర్గమ్మ దేవస్థానం వరకు రోడ్డును చాలా వరకు బంద్ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే చెన్నమ్మ సర్కిల్లోని ఓ భాగాన్ని పూర్తిగా బంద్ చేసి సర్కిల్ వద్ద రూటర్ నిర్మాణం, పిల్లర్ల జోడింపు పనులు జరుగుతున్నాయి. ముందుస్తు జాగ్రత్తగా అయోధ్య హోటల్ నుంచి చెన్నమ్మ సర్కిల్ ద్వారా వాహనాల సంచారం స్తంభించనుంది. ఈ మార్గంలో సంచరించే వాహనాలు ప్రస్తుతం నిలిజన్ రోడ్డు గుండా వెళుతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గ అన్వేషణకు సూచన ఈ విషయంలో జిల్లా యంత్రాంగం చెన్నమ్మ సర్కిల్ నుంచి పాత బస్టాండ్కు రాకపోకలు నిలిపి వేయాలని తీర్మానం చేసింది. అంతేగాక ప్రత్యామ్నాయ మార్గం గుర్తించి ఆర్టీసీ బస్సులు ఇతర వాహనాల కార్యాచరణకు తగిన వ్యవస్థ రూపొందించాలని పోలీస్ శాఖకు సమావేశంలో సూచించారు. ఎమ్మెల్యే మహేష్ టెంగినకాయి మాట్లాడుతూ నిర్ణీత వ్యవధిలోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని సదరు కంపెనీకి సూచించారు. ఈ పనులు పూర్తి అయ్యాక ల్యామింగ్టన్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ దిశలో అవసరమైన భూస్వాధీన ప్రక్రియకు శ్రీకారం చుడుతామన్నారు. జిల్లాధికారిణి దివ్యప్రభు మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో జాప్యం, త్వరగతిన పూర్తి చేయడానికి సమావేశంలో విస్తృతంగా చర్చించామన్నారు. 15 రోజుల్లోగా చెన్నమ్మ సర్కిల్ నుంచి విజయపుర రోడ్డు వరకు ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని కంపెనీకి సూచించారు. సజావుగా ట్రాఫిక్ నిర్వహణకు రూపు లేఖలు రూపొందించాలని పోలీస్ శాఖకు సూచించామన్నారు. ఈనెల 19 నుంచి ఆగస్టు 20 వరకు ట్రాఫిక్ నిలిపివేతకు తీర్మానం -
అకాల వర్షం.. అపార నష్టం
సాక్షి,బళ్లారి: గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో తుంగభద్ర ఆయకట్టు కింద పంటల సాగుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. సాధారణంగా ప్రతి ఏటా తుంగభద్ర ఆయకట్టు కింద ఖరీఫ్, రబీ రెండు పంటలకు నీరు అందించే విధంగా డ్యాంలో తగినంత నీరు నిల్వ చేరేది. గత ఏడాది ఖరీఫ్ పంటకు సరిపడే విధంగా మాత్రమే నీరు చేరడంతో రబీకి క్రాప్ హాలీడే ప్రకటించారు. దీంతో ఒకే ఒక పంట పండించుకుని రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది భారీ వర్షాలు కురవడంతో ఖరీఫ్తో పాటు రబీకి కలిపి రెండు పంటలకు సరిపడేంత నీరు చేరడంతో రైతులు రెండు పంటలు పండించుకునేందుకు మార్గం సుగమమైంది. ఖరీఫ్లో ఆయకట్టు కింద వరి, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలు చేతికందాయి. ప్రస్తుతం రబీలో ఆయకట్టు కింద సాగు చేసిన వరి కోత దశకు చేరుకుంటోంది. నాలుగు జిల్లాల్లో భారీగా వరి సాగు తుంగభద్ర ఆయకట్టు పరిధిలో ఎల్ఎల్సీ, ఎల్బీఎంసీ పరిధిలోని బళ్లారి, రాయచూరు, కొప్పళ, విజయనగర నాలుగు జిల్లాల్లో పెద్ద ఎత్తున వరి సాగు చేశారు. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలు, వీస్తున్న ఈదురు గాలులకు వరి పంట అక్కడక్కడ నేలకొరుగుతోంది. పంట చేతికందే దశలో ఆకాల వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లుతుందనే భయం రైతుల్లో నెలకొంది. ప్రస్తుతం కురిసిన వర్షాలకు పెద్దగా నష్టమేమీ జరగకపోయినా మళ్లీ ఇదే తరహాలో పెద్ద ఎత్తున ఈదురు గాలులు వీచి వర్షాలు కురిస్తే ముప్పు తప్పదని రైతులు భావిస్తున్నారు. ఈదురుగాలి, వానలకు నేలకొరుగుతున్న వరి పంట కోతలు పూర్తయ్యే వరకు రైతులకు గుండె దడ వర్ష బీభత్సంతో పంట నష్టం పరిశీలనరాయచూరు రూరల్: రాయచూరు, యాదగిరి జిల్లాలో సంభవించిన అకాల వర్ష బీభత్సంతో కోతకొచ్చిన వరి పైరుకు నష్టం సంభవించింది. మాన్వి, సురపుర, శహపుర, హుణసిగి, దేవదుర్గ, సింధనూరు తాలూకాల్లో వేలాది ఎకరాల్లో పంట నేలకొరిగింది. ఆదివారం చిన్న నీటి పాదరుల శాఖ మంత్రి బోసురాజు, మాజీ మంత్రి వెంకట్రావ్ నాడగౌడ, విధాన పరిషత్ సభ్యుడు బసనగౌడ బాదర్లి అకాల వర్షం వల్ల దెబ్బ తిన్న వరి పంటలను పరిశీలించారు. సింధనూరు తాలూకా రౌడకుంద, జవళగేర, రాగలపర్వి, బూదిహాళ క్యాంప్, హుడా, గొరేబాళ్, సోమలాపుర, మాన్వి ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది. దేవదుర్గ తాలూకా జాలహళ్లి, చప్పళికి ప్రాంతాల్లో రైతులు వేసుకున్న వరి పంటలు చేతికొచ్చే సమయంలో వరుణ దేవుడు కాటు వేశాడని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఎకరాకు రూ.25 వేలు చొప్పున పరిహారం అందించి తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. బసనబాదర్లి మాట్లాడుతూ తహసీల్దార్ నష్టం అంచనాలను తయారు చేసి సర్కార్కు నివేదిక పంపాలని ఆదేశించారు. -
కవిగోష్టులతో ప్రతిభ బహిర్గతం
రాయచూరు రూరల్: నేటి రోజుల్లో జిల్లాలో కవిత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని రిటైర్డ్ ప్రిన్సిపాల్ వెంకట్రావ్ కులకర్ణి పిలుపునిచ్చారు. కన్నఢ సంఘంలో వసంత కావ్య కవిగోష్టులను ప్రారంభించి ఆయన మాట్లాడారు. కన్నడ సంఘం, హొసమని ప్రకాశన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. కవుల కవితలను గుర్తించి వారి కళా నైపుణ్యత వెలికితీతకు అవకాశం కల్పించే ఇలాంటి వేదికలు అవసరమన్నారు. కార్యక్రమంలో కన్నడ సంఘం అధ్యక్షులు శాంతప్ప, హొసమని ప్రకాశన అధ్యక్షుడు బషీరుద్దీన్, అరవింద్ కులకర్ణి, బసవరాజ్, శ్రీనివాస్ గట్టు, మురళీధర్, రాజశ్రీ, అశోక్ కుమార్ జైన్లున్నారు. గుడిగంటి మర్రిస్వామి రథోత్సవంరాయచూరు రూరల్: నగరంలో ఆదివారం వందలాది మంది భక్తుల సమక్షంలో ఆశాపుర రోడ్డులో గుడిగంటి మర్రిస్వామి మఠంలో గుడిగంటి నామకరణ ఊయల సేవ వైభవంగా జరిగింది. పురాణ ప్రవచనంలో భాగంగా మహిళలతో గుడిగంటి నామకరణం చేశారు. కార్యక్రమంలో ఒప్పత్తేశ్వర స్వామి మఠాధిపతి సదానంద శివాచార్య, శ్రీదేవి, శాంభవి పూజలు జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రథోత్సవం నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో సిద్దారూఢ ఊయలోత్సవం హుబ్లీ: ఆరాధ్య దైవం సిద్దారూఢ 190వ జయంతి సందర్భంగా నగరంలోని సిద్దారూఢ మఠంలో వివిధ ధార్మిక కార్యక్రమాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం సిద్దారూఢ స్వామి గురునాథారూఢ స్వామి సన్నిధికి అభిషేకం, విశేష పూజలు, మధ్యాహ్నం ముత్తైదువులకు ఒడినింపే కార్యక్రమం, ఉభయ స్వాముల ఉత్సవమూర్తులకు పల్లకీ ఉత్సవాలను పల్లకీ ప్రదర్శనను సకల వాయిద్య మేళాలతో వివిధ చోట్ల ప్రదర్శనలు నిర్వహించారు. సకాల మఠానికి పల్లకీ ఉత్సవం తిరిగి వెళ్లిన వేళ మహిళలు కుంభాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సాయంత్రం కై లాస మంటపంలో ఏర్పాటు చేసిన ఊయలోత్సవాన్ని మఠం చైర్మన్ చెన్నవీర ముంగరవాడి ప్రారంభించారు. ట్రస్ట్ కమిటీ ఉపాధ్యక్షుడు వినాయక ఘోర్చే, గౌరవ కార్యదర్శి రమేష్ బెళగావి, ధర్మకర్తలు బాలు మగజికొండి, బసవరాజ కళ్యాణ శెట్టర్, డాక్టర్ గోవింద మన్నూర, సర్వమంగళ పాఠక్, ఈరణ్ణ తుప్పదలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. పీహెచ్డీ ప్రదానంహొసపేటె: నగరంలోని 8వ వార్డులోని కొండనాయకనహళ్లికి చెందిన బసవరాజ్కు విజయనగర శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం పీహెచ్డీని ప్రదానం చేసింది. వాణిజ్య విభాగం వ్యాపార అధ్యయన విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంఏ.వీణాశ్రీ మార్గదర్శకత్వంలో దేశంలోని ఇనుము, ఉక్కు కంపెనీలపై ఐఎన్డీఏ అధ్యయనాన్ని స్వీకరించడానికి ముందు, తరువాత ఆర్థిక నివేదికల నాణ్యత అనే అంశంపై సమర్పించిన వ్యాసానికి ఈ పట్టాను ప్రకటించింది. నేత్రపర్వంగా కొత్తల ఆంజనేయ రథోత్సవం హొసపేటె: కూడ్లిగి పట్టణ ప్రజల ఆరాధ్య దైవం కొత్తల ఆంజనేయ స్వామి రథోత్సవం తోటి భక్తుల సమక్షంలో ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. తెల్లవారు జామున స్వామీజీ ఊరేగింపు ప్రారంభమైంది. రాహుకాలం కారణంగా సాయంత్రం 6.30 గంటలకు రథోత్సవం ప్రారంభమైంది. స్వామి వారి జెండాను వేలంలో రూ.4 లక్షల ధరకు భక్తుడు సునీల్ కొనుగోలు చేశారు. సాయంత్రం, పల్లకీలో స్వామి వారిని ఊరేగింపుతో రథం వద్దకు తీసుకొచ్చారు. స్వామి వారిని రథంలో కూర్చొండ బెట్టిన తరువాత రథోత్సవం ప్రారంభించారు. భక్తులు రథంపైకి అరటిపండ్లు విసిరి తమ భక్తిని చాటారు. -
కనువిందుగా రథోత్సవం
బొమ్మనహళ్ళి: బెంగళూరు నగరజిల్లా పరిధిలోని ఆనేకల్ తాలూకాలోని ముగళూరు పంచాయతీ పరిధిలో ఉన్న దొడ్డతిమ్మసంద్ర గ్రామంలో వెలసిన తిరుమల వీరాంజనేయ స్వామి, జేష్టాదేవి సమేతంగా వెలసిన శని మహాత్మస్వామి బ్రహ్మరథోత్సవం వేలాది మంది భక్తుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఉత్సవ మూర్తిని గరుడ వాహనం మీద ఊరేగింపుగా తీసుకొచ్చి తేరులో ఆసీనుల్ని చేసి రథాన్ని లాగారు. జానపద కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. అదృశ్యమైన బాలల ఆచూకీ లభ్యం శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలోని భద్రావతి గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న ఒక గ్రామంలో కనిపించకుండా పోయిన ఐదుమంది బాలల ఆచూకీ దొరకడంతో తల్లిదండ్రులు హమ్మయ్య అనుకున్నారు. ఓ గ్రామంలోని 8 నుంచి 14 సంవత్సరాల వయసులో ఉన్న ఐదు మంది బాలలు ఈ నెల 6వ తేదీన సాయంత్రం దగ్గరలోని నీటి కాలువలో చేపలు పట్టడానికి వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు రాత్రంతా చెరువులు, నీటికుంటల్లో గాలించినా జాడ లేదు. దీంతో ఏమైపోయారోనని విలపించారు. గ్రామస్తులు కూడా చుట్టుపక్కల అడవిలో వెతికారు. సోమవారం ఉదయం ముగ్గురు బాలలు కనిపించారు. మరో ఇద్దరు చెరుకు తోటలో ఉన్నట్లు చెప్పారు. చేపలు పట్టుకోవడానికి వెళ్లినట్లు తెలిస్తే ఇంటిలో తిడతారని భయపడి ఇంటికి రాలేదని చెప్పారు. కాంట్రాక్టు ఉపాధ్యాయుని అఘాయిత్యం దొడ్డబళ్లాపురం: బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచారం జరిపిన సంఘటన కలబుర్గి జిల్లా ఆళంద తాలూకా మాదనహిప్పరగా గ్రామంలో జరిగింది. నిందితుడు శివరాజ్ ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్టు ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాడు. పాఠశాల పక్కనే ఉన్న ఇంట్లో ఉంటున్న 14 ఏళ్ల బాలికపై కన్నేసిన శివరాజ్ ఇంట్లో ఎవరూలేని సమయంలో చొరబడి బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులతో చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివరాజ్పై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అమ్మవారికి విశేష పూజలు బొమ్మనహళ్లి: బొమ్మనహళ్ళి పరంగిపాళ్యలో గ్రామదేవత మారమ్మదేవి అమ్మవారికి సోమవారం విశేషంగా అలంకరించి పూజలు చేశారు. మహామంగళ హారతి తరువాత భక్తులకు దర్శనాలు కల్పించారు. ఉత్తర కన్నడలో కోతిజ్వరం కేసులు దొడ్డబళ్లాపురం: ఉత్తర కన్నడ జిల్లాలో నలుగురికి మంకీ ఫివర్ సోకింది. సిద్ధాపురలో 14 ఏళ్ల బాలునికి, శిరసిలో 58 ఏళ్ల మహిళకు, హొన్నావరలో ఇద్దరు మహిళలకు కోతి జ్వరం సోకినట్టు అధికారులు తెలిపారు. వీరు జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరారు. పరీక్షలు చేయగా ఇది నిర్ధారణ అయ్యింది. ఎండ తీవ్రత పెరిగే కొద్దీ ఈ రోగం ప్రబలుతోంది. దీంతో కొన్ని రోజులపాటు రైతులు, గ్రామాల ప్రజలు అడవుల్లోకి వెళ్లరాదని తెలిపారు.మంత్రి.. అయ్యారు కూలీ శివమొగ్గ: ప్రభుత్వ పాఠశాలకు కాంపౌండ్ నిర్మాణంతో పాటు మధ్యాహ్నం భోజనం వండే గదుల నిర్మాణం జరుగుతోంది. ఇంతలో మంత్రి వచ్చి కొంతసేపు కూలీగా మారిపోయారు. ఈ అరుదైన సంఘటన సోమవారం మధ్యాహ్నం జిల్లాలోని సొరభ తాలూకా హురళి గ్రామంలో జరిగింది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప తలపాగా కట్టుకుని పనిలోకి దిగారు. గడారుతో మట్టిని తవ్వి, తట్టలో ఎత్తుకుని పక్కకు పడేశారు. ఎండలోనూ పనిచేశారు. -
వైరముడి వైభవోపేతం
మండ్య: మండ్య జిల్లాలో పేరుమోసిన ఐతిహాసిక మేలుకోటె శ్రీ చెలువనారాయణ స్వామివారి వైరముడి ఉత్సవం సోమవారం రాత్రి వేలాది మంది భక్తుల సమక్షంలో నేత్రపర్వంగా జరిగింది. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుని కీరిటం అని కీర్తించే వైరముడి కిరీటాన్ని చెలువనారాయణ స్వామి తల మీద అలంకరించారు. జిల్లా కలెక్టరు కుమార్.. పూజలు చేసి అంకురార్పణ చేశారు. గరుడ ఊరేగింపు, మంగళహారతి తరువాత రాత్రి సుమారు 8.08 గంటలకు వైరముడి ఉత్సవం ప్రారంభమైంది. తెల్లవారుజామున 3.30 గంటల వరకు ఏకధాటిగా కొనసాగింది. దేవాలయం ఎడమ వైపున ఉన్న మండపంలో స్వామికి హారతినిచ్చి చతుర్ వీధుల్లో స్వామివారిని ఊరేగించారు. భక్తజనం పోటెత్తడంతో వేడుక నెమ్మదిగా కొనసాగింది. అంతకుముందు గర్భగుడిలో జిల్లా ప్రముఖులు వైరముడికి విశేష పూజలు చేయించి అర్చకులకు అందజేశారు. ఆలయ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటైంది. మేలుకోటెలో భక్తసంద్రం -
పౌర కార్మికుల సేవలు రెగ్యులర్
శివాజీనగర: తాత్కాలిక విధానంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల ఉద్యోగాలను రెగ్యులర్ చేయనున్నట్లు సీఎం సిద్దరామయ్య చెప్పారు. సోమవారం ప్యాలెస్ మైదానంలో పౌరకార్మికుల మహా సంఘం 25వ వార్షికోత్సవం జరిగింది. సీఎం పాల్గొని మాట్లాడుతూ మే నెల ఒకటిన కార్మిక దినోత్సవమని, ఆ రోజున ఉద్యోగాల క్రమబద్ధీకరణ ఆదేశాలను ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపారు. మీరు బసవణ్ణ వచనం ప్రకారం కాయకవే కై లాస అని శ్రమిస్తున్నారని, మీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. తనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా, పౌర కార్మికులు అయినా ఎలాంటి వ్యత్యాసం లేదు. అందరి సేవలు కూడా పవిత్రమే అన్నారు. ఎవరూ మీతో కించపరిచేలా నడచుకోరాదన్నారు. పారిశుధ్య కార్మిక సముదాయానికి ఉచిత వైద్యసేవల కార్డు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా పౌర కార్మికులు పాల్గొన్నారు. -
విద్యార్థులతో పారిశుధ్య పనులు వద్దు
శివాజీనగర: విద్యాబుద్ధులు నేర్పాల్సిన పాఠశాలల్లో పిల్లల ద్వారా చెత్త ఊడ్పించడం, మరుగుదొడ్లను శుభ్రం చేయించడం బాగా పెరిగింది. ఉపాధ్యాయులు పిల్లలను గదమాయించి టాయ్లెట్లను క్లీన్ చేయిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. చదువుకోవాల్సిన చిట్టి చేతులు పౌర కార్మికులుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలతో అలాంటి పనులు చేయించిన ఉపాధ్యాయుల మీద కేసులు నమోదు చేయిస్తామని విద్యాశాఖ కఠిన ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ బడిలో ఇటువంటి పని చేయించరాదని ఉపాధ్యాయులు, హెచ్ఎంలు, విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీచేసింది. గతంలోనే ఇటువంటి ఆదేశాలు ఉన్నా కూడా ఉల్లంఘించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ, అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎక్కడైనా పిల్లలతో ఆ పనులు చేయించినవారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయిస్తామని తెలిపారు. ఏం జరుగుతోంది? పాఠశాలలకు టాయ్లెట్ల శుభ్రతకు నిధులు మంజూరవుతాయి. బాలలతో క్లీన్ చేయించి, ఆ డబ్బును హెచ్ఎంలు, టీచర్లు స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ పని చేయించిన బాలలను మిగతా విద్యార్థులు కించపరచడం, ఇంట్లో తెలిసి మందలించడం జరుగుతోంది. ఇటువంటి ఘటనల్లో పలువురు ఉపాధ్యాయుడు కూడా సస్పెండ్ అయినా మార్పు రావడం లేదు. చేయించే ఉపాధ్యాయులపై కేసులు -
రంగస్థలంలో తేనెటీగల దాడి
చిక్కబళ్లాపురం: తాలూకా పరిధిలోని రంగస్థలం పుణ్యక్షేత్రంలో వెలసి శ్రీ రంగనాథస్వామి ఆలయంలో సోమవారం భక్తులపై తేనెటీగలు ఆగ్రహించాయి. మైసూరు నుంచి భక్తులు ఆలయానికి వచ్చి రంగనాథున్ని దర్శించుకున్నారు. ఈ సమయంలో హోమం జరపాలని వారు అగ్గి రాజేశారు. అగ్నికీలలు కొంచెం ఎత్తు వరకు లేచాయి, పైన చెట్టు మీద ఉన్న తేనెపుట్టలో అజలడి మొదలైంది. వెంటనే వందలాది తేనెటీగలు లేచి భక్తులపై దాడి చేశాయి. ఈ ఆకస్మిక సంఘటనతో భక్తులు తలోదిక్కుకు పరుగులు తీసినా తేనెటీగలు వదల్లేదు. తీవ్రంగా కుట్టడంతో నొప్పితో కేకలు వేశారు. స్థానికులకు తెలిసి అంబులెన్సును పిలిపించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుమారు పది మంది తేనెటీగల దాడితో ఇబ్బంది పడ్డారు. చికిత్స తరువాత కోలుకున్నారు. చెట్ల మీద తేనెపట్లను తొలగించాలని ఎంతమంది కోరినా ఆలయ సిబ్బంది పట్టించుకోవడం లేదు, దీంతో తరచూ ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. భక్తులకు అస్వస్థత -
ఊరూరా శ్రీరామ నవమి వేడుకలు
సాక్షి,బళ్లారి: అఖిల ప్రపంచానికి ఆరాధ్యుడైన శ్రీరాముడి జన్మదినం సందర్భంగా శ్రీరామ నవమి వేడుకలను ఆదివారం జిల్లా వ్యాప్తంగా వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి ఊరులోనూ రామాలయం అందంగా సింగారించుకుంది. ఆలయాలను మామిడి తోరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయాల్లో కల్యాణవేదికలు ఏర్పాటు చేసి సీతారామ కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఆలయం శ్రీరామనామంతో మార్మోగింది. సీతారాములను అలంకరించి వేద పండితులు శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించగా భక్తులు భక్తితో వీక్షించి తరించారు. శ్రీసీతారామ ఆలయాలతో పాటు, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు, భజనలు జరిగాయి. భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు. బళ్లారిలోని శ్రీకనక దుర్గమ్మ ఆలయ సమీపంలోని శ్రీరామ దేవాలయం, మోతీ సర్కిల్ వద్ద ఉన్న సీతారామ ఆలయం, సత్యనారాయణపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, మిల్లార్పేట శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీవేంకటేశ్వర్ నగర్లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం, సిరుగుప్ప రోడ్డులోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు శివాలయాల్లో, అనంతపురం రోడ్డులోని అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రీ సీతారామ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అష్టోత్తర, మహాపూజ, మంగళహారతులు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీరామ నామాన్ని జపిస్తూ భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఆలయాల్లో అన్నప్రసాదాలు, బెల్లంతో తయారు చేసిన పానకాలు, పెసరబేడలు అందజేశారు. అంధ్రాలులో శ్రీరామ రథోత్సవం బళ్లారి నగర శివార్లలోని ఆంధ్రాలలో వెలసిన శ్రీ రామ దేవాలయంలో శ్రీరామ నవమి సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి కల్యాణం నిర్వహించారు. వేలాది మందికి అన్నప్రసాదాలు అందజేశారు.సాయంత్రం రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానికులతోపాటు ఇతర ప్రాంతాలనుంచి భక్తులు తరలిరావడంతో ఆంధ్రాలు పరిసరాలు జనంతో నిండిపోయాయి. బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆర్ వెంకటరెడ్డి, కార్పొరేటర్ ఎం.రామాంజినేయులు, ఆలయ కమిటీ సభ్యులు జయరాములు, రేణమ్మసీతమ్మ, వెంకటేశులు, శరణయ్య, ప్రభయ్య, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. రాయచూరు రూరల్: రాయచూరు నగరంలోని రైల్వే స్టేషన్లో రామాలయం, కోటలోని బాలాంజనేయ, పాతాళాంజనేయ, బెట్టద్ రామాలయం,మంగళవార పేట మారుతీ ఆలయాల్లో సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయస్వామికి అభిషేకాలు, అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య గీతా మందిర్, రామాలయంలో పూజలు చేపట్టారు. అనంతరం రథోత్సవం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. రాయచూరు రూరల్లో పంచముఖి ఆంజనేయ స్వామి, ప్రాణ దేవర ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే బసనగౌడ, మాజీ ఎమ్మెల్యే తిప్పరాజ్, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణం ఆలయాల్లో మార్మోగిన సీతారామ నామస్మరణ -
పేదలను దోపిడీ చేస్తున్న సర్కార్
హొసపేటె: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్, పాల ధరను నిరసిస్తూ విజయనగర బీజేపీ మండలం ఆధ్వర్యంలో శనివారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా జరిగింది. బీజేపీ నేత శంకర్ మేటి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయన్నారు. దీంతో ప్రజలు దోపిడీకి గురవుతున్నారన్నారు. వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లాలో అకాల వర్షాలతో పంటలు నష్టపోయినా ఎమ్మెల్యే లేదా అధికారులు పరిశీలించలేదన్నారు. దెబ్బతిన్న పంటలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతిపత్రాన్ని తహసీల్దార్ శృతికి అందజేశారు. -
పార్టీలకు అతీతంగా సముదాయ అభివృద్ధి
●పౌరసరఫరాల శాఖ మంత్రి కేహెచ్ మునియప్ప హొసపేటె: అంతర్గత రిజర్వేషన్లను అమలు చేస్తామని, దాని గురించి ఎటువంటి సందేహం అవసరం లేదని ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కేహెచ్.మునియప్ప సూచించారు. హోస్పేటలోని ఏఆర్ఎస్ హోమ్స్టే ఆడిటోరియంలో మాదర చెన్నయ్య సేవా సమితి ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. షెడ్యూల్డ్ కులాలకు సామాజిక న్యాయం అందించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నామన్నారు. 1991 నుంచి 7 పర్యాయాలు ఎంపీగా ఈ సంఘం తరపున నిరంతరం కృషి చేస్తున్నానన్నారు. సముదాయంలోని అందరూ ఎంపీలు అప్పటి ప్రధానులు పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి, డాక్టర్.మన్మోహన్ సింగ్లకు ప్రతినిధి బృందాన్ని పంపించి సముదాయం సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ముందు అడుగు వేసేందుకు కృషి చేశామన్నారు. అంతర్గత రిజర్వేషన్లను అమలు చేయడానికి సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పును ఇచ్చిందని తెలిపారు. మాదార చెన్నయ్య స్వామీజీ, ఎంపీ గోవిందా కారజోళ, మాజీ మంత్రి నారాయణ స్వామి, చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడితే కేసులా?
హుబ్లీ: ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని, సర్కార్కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తే బీజేపీ కార్యకర్తలపై ప్రభుత్వం కేసులు బనాయిస్తోందని, దీంతో రాష్ట్రంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి నెలకొందని మాజీ సీఎం, ఎంపీ బసవరాజ్ బొమ్మై అన్నారు. హావేరిలో ఆదివారం పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ 45వ సంస్థాపన దినంలో పాల్గొని ఆయన మాట్లాడారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి అమలు చేయడంతో ఎవరికి స్వాతంత్ర ఉండేది కాదన్నారు. దీంతో విద్యార్థులతో ప్రారంమైన పోరాటాలు పూర్తిగా క్రాంతిగా మారి ఏబీ వాజిపేయి నేతృత్వంలో అద్వాని సహా అందరు ఉధ్యమంలో పాల్గొన్నారన్నారు. అంతకు ముందు 1925లోనే ఆర్ఎస్ఎస్ స్థాపన అయిందని గుర్తు చేశారు. 45 ఏళ్ల పాటు పార్టీ ప్రస్తానం సాగడం ప్రతి కార్యకర్తకు గర్వకారణం అన్నారు. కాంగ్రెస్తో ఓబీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి తాండవం ఆడుతుంతోందని సర్కారుపై మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవాలని ఆయన పిలుపునిచ్చారు. -
ఉద్యోగ మేళాతో ఉపాధి అవకాశాలు
బళ్లారిఅర్బన్: ఉద్యోగ మేళాతో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మేయర్ ముళ్లంగి నందీష్ అన్నారు. స్థానిక డాక్టర్ రాజ్కుమార్ రోడ్డు పబ్లిక్ స్కూల్, కాలేజిలో క్యాడ్మ్యాక్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నిరుద్యోగులు ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని నైపుణ్యాన్ని సాధించాలన్నారు. ఆ విద్య సంస్థ ముఖ్యస్థుడు డాక్టర్ మహిపాల్, గ్యారంటీ పథకాల అమలు కమిటీ జిల్లాధ్యక్షుడు చిదానందప్ప, జోగిన్ చంద్రప్ప, బట్టి ఎర్రిస్వామి, శేఖర్ సంగనకల్లు విజయ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి రాయచూరురూరల్: మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని సోమవారి పేట మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్యులు సూచించారు. నగరంలోని పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో నిర్వహించిన న్యాయవాది నాగప్ప ప్రతిష్టాన 21వ వార్షికోత్సవంలో స్వామీజీ పాల్గొని పంచాక్షరయ్యకు ఉత్తమ వ్యక్తి అదర్శ అవార్డు అందించి మాట్లాడారు. న్యాయవాది నాగప్ప బడుగువర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. కసాప మాజీ అధ్యక్షుడు మహంతేష్ మస్కి, న్యాయవాది నాగప్ప ప్రతిష్టాన అధ్యక్షుడు తిప్పారెడ్డి, నాగరాజ్, అంబాపతిపాటిల్, మల్లికార్జున పాల్గొన్నారు. -
నీటి సమస్య తలెత్తకుండా చూడండి
హొసపేటె: కొప్పళ జిల్లాలోని ఏ గ్రామంలోనూ తాగునీటి సమస్య లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని, సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించాలని వెనుకబడిన తరగతుల సంక్షేమ, కన్నడ, సాంస్కృతిక శాఖ మంత్రి, కొప్పళ జిల్లా ఇన్చార్జి మంత్రి శివరాజ్ తంగడి ఎస్ సూచించారు. కొప్పళ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి తాగునీరు, పశుగ్రాసం సమస్యలపై ఆరా తీశారు. తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై చర్చించారు. జిల్లా పంచాయతీ పరిధిలో నీటి సమస్య కనిపిస్తే తాలూకా పంచాయతీ కార్యనిర్వహాక అధికారులు స్వయంగా గ్రామాలను సందర్శించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. నీటి సమస్యలు తలెత్తే గ్రామాల్లో ఏం చేయాలో అధికారులు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రజలు ఫోన్ చేసినప్పుడు, వారి స్పందించి వారు చెప్పిన సమస్యలను పరిష్కరించాలన్నారు. వడ్రంగి, కనకగిరి ప్రాంతంలో నీటి సమస్య సర్వసాధారణమైందన్నారు. ప్రజలకు తాగునీరు అందించడానికి శాశ్వత పరిష్కారం కనుగొనడానికి అధికారులు కృషి చేయాలన్నారు. ప్రతి సంవత్సరం వేసవిలో నీటి సమస్యలు తలెత్తుతున్నాయని, గ్రామాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా నీటి ఎద్దడి కనిపిస్తే అధికారులు సమావేశం నిర్వహించి నీటి సమస్యకు పరిష్కారం కనుగొనాలని సూచించారు. కొప్పళ జిల్లా ఇన్చార్జి మంత్రి శివరాజ్ తంగడి -
బాలుడిని చెట్టుకు కట్టేసి దాడి
● మర్మాంగంపైకి కందిరీగలు ● దావణగెరె జిల్లాలో అమానుష ఘటన ● తొమ్మిది మంది అరెస్ట్ సాక్షి,బళ్లారి: బాలుడిని చెట్టుకు కట్టేసి దాడిచేసి అతనిపైకి కందిరీగలు విడిచిన అమానుష ఘటన దావణగెరె జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెన్నగిరి తాలూకా నల్లూర సమీపంలోని అస్తాపనహళ్లిలో నివసిస్తున్న 16 సంవవత్సరాల వయసున్న బాలుడు దొంగతనాలు చేస్తున్నాడని, మహిళల పట్ల అసభ్యప్రవరిస్తున్నాడనే ఆరోపణలతో స్థానికులు అతన్ని పట్టుకుని చెట్టుక కట్టేసి విక్షణారహితంగా కొట్టారు. దుస్తులు ఉడదీసి మర్మాంగానికి కందరీగలను వదిలారు. దీంతో బాలుడు అపస్మారస్థితిలోకి వెళ్లడంతో కొందరు వ్యక్తులు స్పందించి ఆస్పత్రికి తరలించి,పోలీసులకు ఫిర్యాదు చేశారు.దర్యాప్తు చేసిన పోలీసులు 9 మందిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. జీపీ సభ్యుడి హత్య కేసులో నిందితుల అరెస్ట్హుబ్లీ: బీదర్ శివారు ప్రాంతంలో శుక్రవారం రాత్రి జరిగిన జీపీ సభ్యుడు, వణ్ణికేరి నివాసి వైజినాథ్ హత్య కేసును పోలీసులు ఏడు గంటల్లోనే ఛేదించారు. ఈమేరకు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. బీదర్ నావదగేరి చెందిన ఇద్దరు, తాలూకాలోని వణ్ణికేరి చెందిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశామని, కీలక సూత్రాధారి పరారీలో ఉన్నాడని ఆ జిల్లా ఎస్పీ ప్రదీప్ గుంటి మీడియాకు తెలిపారు. వణ్ణకేరిలో జరిగిన ఎస్సీ,ఎస్టీ దౌర్జన్య కేసులో బాధిత కుటుంబాల తరపున వైజినాథ్ నిలబడటంతో అదే గ్రామానికి చెందిన వారు కక్ష పెంచుకొని హత్య చేసినట్లుగా నిందితులు వెల్లడించారని ఎస్పీ వివరించారు. డీఎస్పీలు శివన్నగౌడపాటిల్, ఎస్ఎన్ సనాధి నేతృత్వంలో నూతన నగర పోలీస్ స్టేషన్ సీఐ విజయ్కుమార్ బావగి, ఎస్ఐలు ప్రభాకర్ పాటిల్ సయ్యద్ పటేల్, అబ్దుల్ సమద్, హులెప్పలు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్ట్చేశారని తెఇపారు. హనీట్రాప్పై ఆధారాలున్నాయి● బీజేపీ బహిష్కృత నేత బసవనగౌడ పాటిల్ యత్నాళ్ హుబ్లీ: సహకార శాఖ మంత్రి కేఎన్.రాజన్నపై హనిట్రాప్ జరిగిందన్న వ్యవహారంలో తన వద్ద తగిన సాక్ష్యాలు ఉన్నాయని బీజేపీ బహిష్కృత నేత బసవనగౌడ పాటిల్ యత్నాళ్ తెలిపారు. హుబ్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ నేతలను అంతం చేసిందే కాంగ్రెస్ అని అన్నారు. హనిట్రాప్ వెనుక రెండు పార్టీల్లోని మహానేతలు హస్తం ఉందన్నారు. తన వద్ద కొన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. నాకు హాయ్ చెబితే బై అంటానని యత్నాళ్ అన్నారు. తనకు వ్యతిరేకంగా కేరళలోని రాజరాజేశ్వరి ఆలయంలో యాగం జరిగిందని ఆరోపించారు. హుబ్లీలో కూడా ఓ యాగం చేశారని, అయితే తనకు ఎలాంటి హాని జరగదని జాతకంలో ఉందన్నారు. యాగం జరిగాక శత్రు సంహారం జరగలేదని, అయితే సిద్దరామయ్యకు కాళ్ల నొప్పులు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఉపాధి పనులను వినియోగించుకోండి హొసపేటె: ఉపాధి హామీ పథకం పనులను కూలీలు సద్వినియోగం చేసుకొని స్థానికంగా ఉపాధి పొందాలని జిల్లా పంచాయతీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రకాష్ వి. సూచించారు. కొప్పళ్ తాలూకాలోని ఇందరగి గ్రామ పంచాయతీ ఇందరగి గ్రామంలో హోసకరేలో జరుగుతున్న పూడిక తీత పనులను ఆయన పరిశీలించారు. రోజుకు రూ. 370 కూలీతో వంద రోజులపాటు పనులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి కూలీ 40 క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వితేనే రూ. 370 చెల్లిస్తారన్నారు. కొలత తక్కువగా ఉంటే వేతనాలు తక్కువగా చెల్లిస్తామని తెలిపారు. ఉపాధి పనుల్లో మహిళల భాగస్వామ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈత కొలను ప్రవేశ రుసుము రెట్టింపుహుబ్లీ: రాష్ట్ర ప్రభుత్వం పాలు, విద్యుత్, డీజిల్ ధరలు పెంచడంతో ఇప్పటికే ప్రజల్లో సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతుండగా హుబ్లీ ధార్వాడ కార్పొరేషన్ ఈతకొలను ప్రవేశ రుసుమును రెట్టింపు చేసింది. ఒకే పర్యాయం రూ.50 నుంచి రూ.100కు పెంచడంతో ప్రజలు కార్పొరేషన్పై మండిపడుతున్నారు. ఆరోగ్యం, వ్యాయమం కోసం రోజూ దాదాపు 500 మంది, సెలవు రోజుల్లో 600 మంది ఈత కొట్టేందుకు వస్తుంటారు. పెంచిన ధరతో వెనుకడుగు వేస్తున్నారు. ఈ విషయమై పాలికె కమిషనర్ రుద్రేష్ గాలి మాట్లాడుతూ ఈతకొలను నిర్వహణకు ప్రతినెల రూ.2.5 లక్షలు ఖర్చు అవుతోందన్నారు. ప్రవేశ రుసుము ద్వారా కేవలం రూ. లక్ష మాత్రమే సమకూరుతోందన్నారు. నిర్వహణ, సిబ్బంది వేతనాల ఖర్చును భరించడానికి ప్రత్యేక రుసుమును పెంచామని తెలిపారు. -
చుక్కనీరు లేక ఆర్డీఎస్ వెలవెల
రాయచూరు రూరల్: కర్ణాటక, ఏపీ, తెలంగాణ ప్రాంతాలను సస్యశ్యామలం చేసే ఆర్డీఎస్( రాజోలి బండ డైవర్షన్ అనకట్ట) చుక్కనీరు లేక వెలవెలపోతోంది. మాన్వి తాలుకాలోని రాజోలి వద్ద నిర్మించిన ఈ ఆనకట్టలో నీరు ప్రవహించక ఏడాది అయ్యింది. 1966లో తుంగభద్ర నదికి అడ్డంగా 31 అడుగుల ఏత్తుతో 2690 మీటర్ల పొడవుతో అనకట్ట(గోడ) నిర్మించారు. నదికి లక్ష క్యూసేక్కుల నీరు వదలినప్పుడు 17 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది. కర్ణాటకలోని మాన్వి, రాయచూరు తాలుకాల్లో 10 వేల ఏకరాలకు ఈ ఆనకట్ట ద్వారా సాగునీరు అందుతుంది. ఏపీలోని మంత్రాలయం, మాదవరం, తుంగభద్ర, తెలంగాణలోని శాంతినగర్, ఐజ ప్రజల దాహార్తి తీర్చుతోంది. అయితే ఆర్డీఎస్లో నీటి ప్రవాహం లేక ఆయకట్టు భూములు నెర్రెలు పోతున్నాయి. ఆయా ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చుతోంది. ఆనకట్టలో పూడిక పేరుకుపోవడం, ఇసుక మాఫీయా తవ్వకాలు చేపట్టడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.ఘనంగా బీజేపీ సంస్థాపన దినంరాయచూరురూరల్: యాదగరి, రాయచూరులో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ శంకరప్ప, జిల్లాధ్యక్షుడు వీరన గౌడ, యాదగిరిలో నగరసభ అధ్యక్షురాలు లలిత బీజేపీ జెండాలను ఆవిష్కరించారు. పండిత్ దీన్ దయాళ్, శివ ప్రసాద్ ముఖర్జి, భారత మాత చిత్ర పటాలకు పూజలు జరిపారు.మహాత్ముడి అదర్శాలను ఆలవర్చుకోవాలిరాయచూరు రూరల్: మహాత్ముడి అదర్శాలను విద్యార్థులు అలవర్చుకోవాలని అక్కమహదేవి విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ శాంత దేవి పిలుపునిచ్చారు. మహాత్ముడి ఆలోచనలు అనే అంశంపై కలబుర్గిలోని శరణేశ్వరి రేష్మ మహిళా కళాశాలలలో గాంధీ స్మారక నిధి, బెంగళూరు, యన్యన్యస్, యవజన సేవా సర్వీస్ శాఖల ఆధ్వర్యంలో జరిగిన విచారణ సంకీర్ణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. మహాత్ముడి పోరాటాలు, ఆయన పాటించిన నైతిక విలువలపై విద్యార్థులు అధ్యయనం చేయాలన్నారు. కార్యక్రమంలో సిద్దరామయ్య, ప్రిన్సిపాల్ గీతా, జావేద్ జాందార్, భారతి, అశోక్ కుమార, మహేష్, ఉదయ్ కుమార్, ధర్మణ్ణ, అబ్దుల్, అబిదా బేగం, శివలీల పాల్గొన్నారు.వ్యక్తి అనుమానాస్పద మృతిపై సీఐడీ విచారణరాయచూరు రూరల్: నగరంలోని పశ్చిమ పోలీస్ స్టేషన్లోలో లాకప్డెత్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో సీఐడీ విచారణ చేపట్టింది. ఓ కేసులో విచారణ కోసం తీసుకువచ్చిన వీరేష్ అనే వ్యక్తి మృతి చెందగా అది లాకప్డెత్గా మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టేందుకు కేసును సీఐడీకి అప్పగించారు. ఈ ఘటనకు ఎవరు బాధ్యులనే విషయంపై ఎస్పీ పుట్టమాదవయ్యతో ఆదివారం సీఐడీ అధికారులు సమావేశమై చర్చించారు. అంతకుముందు సీఐడీ అధికారులు పోలీస్స్టేషన్లోని సీసీకెమెరాలను పరిశీలించారు.ధరల పెంపుపై బీజేపీ నిరసనకోలారు: ధరల పెరుగుదల, బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ను నిరసిస్తూ ఆ పార్టీ నేతలు తహసీల్దార్ కార్యాలయం ముందు ప్రతిఘటన నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చలపతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలను నిరంతరం పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తోందన్నారు. దీంతో ప్రజలు ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నారన్నారు. శాసన సభ సమావేశాల నుంచి 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండు చేయడం చట్టవిరుద్దమన్నారు. మైనారిటీ ఓటు బ్యాంకును భద్ర పరచుకోవడం కోసం ముస్లింలకు ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో 4 శాతం రిజర్వేషన్లు తీసుకు వచ్చారన్నారు. పెంచిన ధరలను తగ్గించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిఘటనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. -
పండ్లకు రారాజు, మామిడి పండ్లు అనగానే నోట్లో నీళ్లూరడం సహజం. అందరూ ఎంతో ఇష్టపడే మామిడి పండ్లు ఈ వేసవిలో ఇంకా మార్కెట్లోకి రావడం లేదు. దీంతో మామిడి ప్రియులు కళ్లుకాయలు కాచేలా నిరీక్షించాల్సి వస్తోంది.
బెంగళూరు జయమహల్ రోడ్డులో మామిడి స్టాల్ (ఫైల్) సాక్షి బెంగళూరు: ఎండాకాలం రాగానే మామిడి పండ్లు తినొచ్చనే ఆశ అందరిలోనూ ఉంటుంది. కానీ ఈ దఫా ఆశ ఇంకా తీరేలా లేదు. మామూలుగా మొదట రామనగర మామిడి, ఆపై కోలారు జిల్లా మామిడి కాయలు, పండ్లు మార్కెట్లోకి ప్రవేశిస్తాయి. రాష్ట్రంలో ఈ ఏడాది మామిడి దిగుబడి భారీగా క్షీణించినట్లు అంచనా. ఎంత అంటే 30 నుంచి 50 శాతం వరకూ పడిపోయింది. మార్కెట్లో లభిస్తున్న కొద్దిపాటి పండ్లు కూడా పొరుగున ఏపీ నుంచి వస్తున్నాయి. 15– 20 రోజుల్లో కన్నడనాడు తోటల మామిడి పండ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మార్చి నుంచే రావాలి మరి సాధారణంగా మార్చి నెల ప్రారంభం కాగానే రాష్ట్రంలో మొదటి మామిడి (రామనగర జిల్లా మామిడి) మార్కెట్లో లభ్యం అవుతుంది. అయితే పలు కారణాల వల్ల తోటల్లో పూత, పండ్లు దిగుబడి బాగా తగ్గిపోయింది. కొన్నిచోట్ల మామిడి పండ్ల కోతకు రైతులు సిద్ధమవుతున్నారు. రామనగర నుంచి ఈ ఏడాది సుమారు 1.65 లక్షల టన్నుల మామిడి దిగుబడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రామనగర జిల్లా నుంచి సింధూర, రసపురి, మల్లిక, బాదామి, తోతాపురి, మలగూబా, నీలం జాతుల మామిడి ఏప్రిల్ నుంచి జూలై వరకు నోళ్లను తీపి చేస్తాయి. ఇక కోలారు జిల్లా మామిడి పండ్లు జూన్ నుంచి ఆగస్టు వరకు విపణిలో ఉంటాయి. కోలారు నుంచి ఎక్కువగా సింగపూర్, అరబ్ దేశాలకు ఎగుమతి అవుతాయి. కొప్పళ మామిడి ప్రత్యేకం మామిడి పండ్లలో విశిష్ట జాతికి చెందిన మామిడిని కొప్పళ జిల్లాలో సాగు చేస్తున్నారు. కేసర్, బాదమి, రత్నగిరి జాతుల పండ్లు నోరూరిస్తాయి. వాటిని సాగుదారులు అధిక ధరకు ఇతర రాష్ట్రాల వ్యాపారులకు అమ్మేస్తారు. అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. వేచి చూడాలి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దిగుబడి బాగా తగ్గిపోయింది. మండుటెండలే కారణమని రైతులు, హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు మామిడిని తెప్పిస్తున్నందున సహజంగానే రవాణా చార్జీలు , ఇతర పన్నులు కలిపి ధరలు చుర్రుమంటున్నాయి. స్థానిక మామిడి పండ్లు వస్తే ధరలు దిగిరావచ్చు. అందుకు కొద్ది రోజులు వేచి చూడక తప్పదు. రాష్ట్రంలో ఇంకా మార్కెట్లోకి రాని పండ్లు మ్యాంగో ప్రియుల్లో అసహనం మరో 15–20 రోజులు తప్పదు! బాగా క్షీణించిన దిగుబడి -
సాధ్విగా మారిన యువతి
సాక్షి, బళ్లారి: సంపన్న కుటుంబానికి చెందిన యువతి అన్నింటినీ త్యజించి సన్యాసినిగా దీక్ష స్వీకరించింది. యాదగిరి నగరంలో ఈ సంఘటన జరిగింది. స్థానికంగా స్థిరపడిన మార్వాడీ కుటుంబానికి చెందిన నిఖిత (26) సన్యాస దీక్షను తీసుకుంది. ఈ సందర్భంగా నగరంలో వైభవంగా ఆమెను ఊరేగించారు. తరువాత జైన సన్యాసినులు ఆమెకు దీక్షను ఇచ్చారు. ఎన్నో కఠిన నియమాలతో కూడిన దీక్షను ఆచరించేందుకు కుమార్తెను తల్లిదండ్రులు కన్నీటితో సాగనంపారు. ఈఎంఐ గొడవ.. బ్యాంకు ఉద్యోగిపై దాడి బనశంకరి: రుణం కంతు చెల్లించాలని అడిగినందుకు బ్యాంకు సిబ్బంది మీద దౌర్జన్యం చేసిన ఘటన అన్నపూర్ణేశ్వరినగర పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. నాగరబావి రెండోస్టేజ్ బీడీఏ కాంప్లెక్స్లో దాడి చోటుచేసుకుంది. వివరాలు.. బైక్ కొనడానికి ప్రైవేటు బ్యాంక్ ద్వారా రమేశ్ అనే వ్యక్తి రుణం తీసుకున్నాడు. గత రెండునెలలుగా రమేశ్ ఈఎంఐ కట్టలేదు. దీంతో సొమ్ము వసూలు చేయడానికి బ్యాంకు ఉద్యోగి బీఎం చందన్ వెళ్లాడు. వెంటనే పెండింగ్ సొమ్ములు కట్టాలని కోరగా గొడవ మొదలైంది. కోపోద్రిక్తుడైన రమేశ్ నా ఇంటికే వచ్చి రగడ చేస్తావా అని రాయి తీసుకుని చందన్ మీద దాడి చేశాడు. బాధితుడు అన్నపూరేశ్వరినగర ఠాణాలో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. నేడే వైరముడి సంభ్రమంమండ్య: ప్రపంచ ప్రసిద్ధి చెందిన వైరముడి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు సాగుతున్నాయి. భక్తులకు స్వాగతం పలుకుతూ మండ్య తాలూకాలోని హోళలు గ్రామంలో కమాను నిర్మాణం చేశారు. నేడు సోమవారం మేలుకోటె కొండపై దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవం ఘనంగా జరుగుతుంది. జిల్లా ట్రెజరీలో భద్రపరచిన బంగారు, వజ్ర వైరముడి, రాజముడి అలంకారాలు, ఇతర ఆభరణాలను ఇదే మార్గంలో కొండ మీదకు తరలిస్తారు. ఇందుకు దేవాదాయ, పోలీసు సిబ్బంది సన్నాహాలు చేశారు. భద్రా నిధులు ఇవ్వాలని కోరాం: డీకే శివాజీనగర: రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి ఇతర రాష్ట్రాల ప్రతినిధులను పిలిపించి చర్చలు జరిపి, పరిష్కరిస్తామని కేంద్ర జలశక్తి మంత్రి భరోసా ఇచ్చారని డీసీఎం డీకే శివకుమార్ తెలిపారు. ఆదివారం సదాశివనగర తన ఇంటి వద్ద విలేకరులతో మాట్లాడిన ఆయన, భద్రా అప్పర్ ప్రాజెక్ట్కు గతంలో ప్రకటించిన రూ.5,300 కోట్లు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరినట్లు చెప్పారు. కేంద్ర మంత్రిమండలి ముందు ప్రవేశపెట్టినట్లు తెలిపారన్నారు. భద్రా అప్పర్ ప్రాజెక్ట్కు రాష్ట్రం ఎంత ఖర్చు చేసిందో అన్ని నిధులు ఇవ్వాలని విన్నవించామన్నారు. మేకెదాటు, కళసా బండూరి, అప్పర్ భద్రా ప్రాజెక్ట్లు చాలా అవసరమని చెప్పామన్నారు. అప్పుల బాధతో ఆత్మహత్యాయత్నం తుమకూరు: హోం మంత్రి జీ.పరమేశ్వర్ సొంత జిల్లా తుమకూరులో వడ్డీ వ్యాపారుల వేధింపులకు సామాన్యుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలు... మండ్యకు చెందిన ముజీబ్ అనే పండ్ల వ్యాపారి ఇక్కడ పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మండ్యలో పండ్ల వ్యాపారం చేసే ముజీబ్ మీటర్ వడ్డీకి అప్పులు ఇచ్చే వారి నుంచి రూ.10 లక్షల వరకూ అప్పులు చేశాడు. సకాలంలో వాయిదాలు కట్టకపోవడంతో రుణదాతలు వేధించసాగారు. దీంతో తుమకూరుకు వచ్చాడు. సెల్ఫీ వీడియోలో బాధలు చెప్పుకుని పురుగుల మందును తాగాడు. సురేష్, చన్నెగౌడ, రాజన్న అనేవారు సతాయిస్తున్నారని, తన మరణానికి వారే కారణమని చెప్పాడు. అతన్ని జిల్లా ఆస్పత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం బెంగళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. -
నేటి నుంచి బీజేపీ జనాక్రోశ యాత్ర
శివాజీనగర: రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు సోమవారం నుంచి ప్రజావేశ యాత్రను జరుపనున్నారు. ఆదివారం బెంగళూరులోని బీజేపీ కార్యాలయంలో పార్టీ సంస్థాపనా దినోత్సవంలో రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర మాట్లాడుతూ ఈ మేరకు తెలిపారు. మైసూరులో నాడదేవత చాముండేశ్వరి దేవికి పూజలు చేసి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి జనాక్రోశ యాత్రను ప్రారంభిస్తారని తెలిపారు. అన్ని జిల్లాల్లో కూడా యాత్ర జరుగుతుందన్నారు. కాంగ్రెస్ నాయకులకు అధికార మదం ఎక్కువై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్త వినయ్ సోమణ్ణది ఆత్మహత్య కాదు హత్య, సీబీఐతో విచారణ జరిపించాలని అన్నారు. రాష్ట్రంలో పర్యటిస్తా: యడ్డి బీజేపీ నాకు అన్నింటినీ ఇచ్చిందని, మునుముందు పార్టీ బలోపేతానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని మాజీ సీఎం యడియూరప్ప చెప్పారు. ఆయన మాట్లాడుతూ ఏ వనరులు లేని రోజుల్లో ఊరూరా తిరిగి బీజేపీని బలోపేతం చేశానని చెప్పారు. ఎన్నో గెలుపు ఓటములను చూశామని, ఏనాడు నమ్మిన ధైర్యం, సిద్ధాంతాన్ని విడచిపెట్టలేదని అన్నారు. విజయేంద్ర వెల్లడి -
జగదభిరాముడు శ్రీరాముడే
మండ్య/ తుమకూరు: సుందర రామా.. సుగుణభిరామా, సుగుణధామ సూర్యామయ సోమా.. అని భక్తి తన్మయత్వంలో ప్రజలు శ్రీరామనవమిని ఆచరించారు. రాజధానితో పాటు రాష్ట్రంలో అన్నిచోట్లా భక్తిరసం పొంగిపొర్లింది. శ్రీరాముడు జన్మదినోత్సవమైన నవమిని పలుచోట్ల మరింత వినూత్నంగా జరిపారు. బెంగళూరులో రామాంజనేయ ఆలయం నుంచి పిల్లలు, పెద్దలు మనోహరంగా నృత్యం చేస్తూ శోభాయాత్ర సాగించారు. మండ్య నగరంతో పాటు జిల్లాలో రామ, హనుమ ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. నెహ్రు నగరలో ఉన్న రామమందిరంలో రాముల వారికి ప్రత్యేక అలంకారం, అర్చనలు జరిపారు. భక్తులకు పానకం, ప్రసాదాలు పంపిణీ చేశారు. ఓళిగల నైవేద్యం తుమకూరు జిల్లాలోని చిక్కనాయకనహళ్లి తాలూకాలోని హులియూరు వద్ద లింగప్పనపాళ్యలో నవమి వేడుకలు కోలాహలంగా సాగాయి. రాముల దేవాలయం నుంచి స్వామివారి ఊరేగింపును నిర్వహించారు. ఓళిగలు చేసుకుని స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. ఇక బెళగావిలో హిందూ సంఘాలు భారీ ఆర్భాటంగా ఊరేగింపులు చేశారు. నవమి సందర్భంగా చిక్కమగళూరులో ఎద్దులబండ్ల పందేలు అలరించాయి. వాడవాడలా శ్రీరామ నవమి వేడుకలు అట్టహాసంగా శోభాయాత్రలు -
పెద్ద హనుమంతుని శోభాయాత్ర
కోలారు: శ్రీరామ నవమి సందర్భంగా శ్రీరామసేన ఆధ్వర్యంలో కోలారు గాంధీవనంలో బృహత్ వేదిక మీద బాల రాముని మూర్తిని ప్రతిష్టించి మూడు రోజుల పాటు రామోత్సవం నిర్వహించారు. ఆదివారం రోజున నగరంలో శోభాయాత్రను నేత్రపర్వంగా జరిపారు. సినీ నటుడు వశిష్టసింహ ప్రారంభించారు. వశిష్టసింహ మాట్లాడుతూ ధర్మరక్షణ కార్యం నేడు అత్యంత ఆవశ్యకమన్నారు. సమాజంలో హిందూ ధర్మ మహత్వాన్ని తెలియజేయాలన్నారు. సమాజంలో యువత దారి తప్పకుండా జాగ్రత్త వహించాలన్నారు. విశ్వంలో హిందూ ధర్మం వంటి పురాతన ధర్మం మరొకటి లేదు. బృహత్ హనుమాన్ విగ్రహంతో కూడిన శోభాయత్ర నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.రాఘవ మఠంలో నవమి శోభ బనశంకరి: బెంగళూరు జయనగర ఐదోబ్లాక్లో వెలసిన నంజనగూడు శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో శ్రీరామోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సీతారామలక్ష్మణ విగ్రహాలకు ప్రత్యేక అభిషేకం, బంగారు తొట్టెలలో శ్రీరామునికి అలంకారం, పల్లకీ ఉత్సవం, గజవాహనోత్సవం తదితరాలను భక్తజనం మధ్య కనులవిందుగా నిర్వహించారు. మఠం సిబ్బంది, భక్తులు ఉత్సవంలో పాలొన్నారు. కోలారులో నవమి కోలాహలం -
టెక్కీనని చెప్పి రెండో పెళ్లి
కర్ణాటక: సోషల్ మీడియాలో పరిచయమైన యువతిని ప్రేమించిన వివాహితుడు, చివరకు ఆమెను చంపిన ఘటన జిల్లాలోని హుణసూరు తాలూకా బిళికెరె ఫిర్కా బూచనహళ్లి గ్రామంలో జరిగింది. తుమకూరుకు చెందిన పవిత్ర (26)ను ఆమె భర్త సచిన్ (26) హత్య చేశాడు. కొబ్బరి బోండాల వ్యాపారి సచిన్కు ఆరు నెలల క్రితం ఇన్స్టాలో పరిచయమైన పవిత్ర తనకు ఎవరూ లేరని, తాను ఇన్ఫోసిస్లో టెక్కీనని చెప్పుకుంది. సచిన్కు అదివరకే పెళ్లయినా ఆమెతో ప్రేమాయణం నడిపాడు. చివరకు ఆమె కుటుంబ సభ్యుల సమక్షంలో తాళికట్టాడు.రోజూ ఆఫీసుకు డ్రాప్సచిన్ ఆమెను మైసూరులోని ఇన్ఫోసిస్లో రోజూ డ్రాప్ చేసి వచ్చేవాడు. పవిత్ర పెద్దమ్మగా చెప్పుకున్న ఆమెకు సచిన్ ఫోన్ చేయగా, పవిత్ర ఎవరో తమకు తెలియదని చెప్పింది. ఆమె అన్నగా చెప్పుకున్న వ్యక్తితో మాట్లాడగా, పవిత్రకు ఇదివరకే పెళ్లయి విడాకులు తీసుకుందని తెలిపాడు. ఆమె ఇన్ఫోసిస్ ఉద్యోగిని కాదని, ఆమె వద్ద ఉన్నది నకిలీ ఐడీ కార్డు అని తెలుసుకున్నాడు. తనను నమ్మించేందుకు ఉత్తుత్తిగా ఆఫీసుకు వెళ్తోందని తెలిసి రగిలిపోయాడు. దీనిపై భార్యను ప్రశ్నించగా గొడవ జరిగింది. చివరకు బయట టిఫిన్ తిందాం రా అని భార్యను ఆటోలో తీసుకెళుతూ మార్గమధ్యంలో పొలంలోకి తీసుకెళ్లి పవిత్రకు తాడుతో గొంతు బిగించి చంపాడు. ఓ బాలుడు కూడా ఇందుకు సహకరించాడు. తరువాత సచిన్ బిళికెరె పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. స్థలాన్ని ఎస్పీ విష్ణువర్ధన్, ఏఎస్పీ మాలిక్, డీఎస్పీ గోపాలకృష్ణ, ఇన్స్పెక్టర్ లోలాక్షి చేరుకుని పరిశీలించారు. నిందితులను అరెస్టు చేసి విచారణ చేపట్టారు.భార్యను గొంతుకోసి హతమార్చిన భర్తబొమ్మనహళ్లి: భార్యను నడిరోడ్డుపై చాకుతో గొంతు కోసి హత్య చేసిన భర్త ఉదంతం బెంగళూరులోని ఎలక్ట్రానిక్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలోని దొడ్డతోగూరులో శుక్రవారం రాత్రి జరిగింది. ఆగ్నేయ విభాగం డీసీపీ సారా ఫాతిమా విలేకరులకు తెలియజేసిన వివరాలు.. బాగేపల్లికి చెందిన కృష్ణ, శారద (35) దంపతులు దొడ్డతోగూరులో ఉంటున్నారు. శారద పనికివెళ్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటోంది. కృష్ణ మరో మహిళపై మోజులో పడ్డాడు. ఈక్రమంలో భార్యను అడ్డు తొలగించుకోవాలని పథకం రచించాడు. శుక్రవారం రాత్రి శారద పనికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రగతి నగరలో దారి కాచిన కృష్ణ రెండు చాకులతో దాడి చేశాడు. భార్యను కింద పడేసి గొంతు కోసి హత్య చేసి ఉడాయిస్తుండగా స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి నిందితుడు కృష్ణను అరెస్ట్ చేశారు. హత్యోదంతంపై విచారణ చేపట్టామన్నారు. దారుణ హత్యతో స్థానికంగా తీవ్ర కలకలం ఏర్పడింది. -
ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం కావాలి
బళ్లారి అర్బన్: అన్ని రంగాల్లో అత్యంత వెనుకబడిన ఉత్తర కర్ణాటకలోని 13 జిల్లాలను కలిపి ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని అఖిల భారత జనగణ సమాఖ్య సంస్థాపక జాతీయ అధ్యక్షుడు ఎన్.గంగిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముండ్లూరు రామప్ప మీటింగ్ హాల్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. కళ్యాణ కర్ణాటకలోని 6 జిల్లాలు, ముంబై కర్ణాటకలోని 7 జిల్లాలను కలిపి మొత్తం 13 జిల్లాలతో కొత్త రాష్ట్రాన్ని ప్రకటిస్తేనే ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధికి నోచుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. బెంగళూరు, మైసూరు తదితర ప్రాంతాల అభివృద్ధినే ఇప్పటి వరకు వచ్చిన పాలకులు చేశారన్నారు. ఇప్పటికై నా ప్రత్యేక రాష్టాన్ని ప్రకటించాలని ఒత్తిడి చేశారు. అలాగే 4 జిల్లాలతో కూడిన కేఎంఎఫ్ కర్ణాటక సహకార పాల ఉత్పత్తిదారుల పాలక మండలి మొదటి నుంచి బళ్లారిలో ఉంది. ప్రస్తుతం కొందరు రాజకీయ నేతలు తమ పబ్బం గడుపుకోడానికి విజయనగర జిల్లాకు మార్చాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇంతకు ముందు బీ.నాగేంద్ర బళ్లారి ఇన్చార్జి మంత్రిగా ఉన్న వేళ కొళగల్లు గ్రామం దగ్గర మెగా డైరీ ఏర్పాటు చేయాలని భూమిని మంజూరు చేశారు. అయితే ఇప్పటి వరకు అక్కడ ఎటువంటి పనులు చేపట్టలేదన్నారు. తక్షణమే అక్కడ కేటాయించిన 20 ఎకరాల్లో మెగా డైరీని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
గ్యారెంటీలతో ఖజానా లూటీ
రాయచూరు రూరల్: కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ ధరల పెంపుతో వచ్చే ఆదాయాన్ని పంచ గ్యారెంటీల పేరుతో ప్రజలకు ఉచితంగా ఇవ్వడం ద్వారా ఖజానాను లూటీ చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరనగౌడ ఆరోపించారు. శనివారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లును యూనిట్కు 36 పైసలు, పాల ధర లీటరుకు రూ.9, బస్ చార్జీలు, స్టాంప్ డ్యూటీ ధరలు పెంచండం తగదన్నారు. పాల రైతులకు రూ.662 కోట్ల బకాయిలున్నట్లు తెలిపారు. జాతీయ కాంగ్రెస్కు కర్ణాటక సర్కార్ ఏటీఎంగా మారిందన్నారు. పంచ గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మంత్రులు, శాసన సభ్యులు దిగజార్చారని విమర్శించారు. పెంచిన ధరలను తగ్గించాలని కోరుతూ తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో నగర అధ్యక్షుడు రాఘవేంద్ర, సభ్యులు శంకరరెడ్డి, నాగరాజ్, చంద్రశేఖర్, మల్లికార్జునలున్నారు. -
ఆదర్శప్రాయుడు బాబూ జగ్జీవన్ రామ్
బళ్లారిటౌన్: మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ ఆదర్శప్రాయుడని, బాబూజీ వ్యక్తిత్వం, జీవిత చరిత్రను తెలుసుకుని యువత వారి ఆదర్శాలు, గుణగణాలను అలవరుచుకోవాలని జిల్లాధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా పేర్కొన్నారు. శనివారం జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా బాబూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన మాట్లాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో పాలికె మేయర్ ముల్లంగి నందీష్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఏప్రిల్ 5న ఈ జయంతిని జరుపుకుంటున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీల హక్కుల కోసం పోరాడి రాజకీయ నేతగా ఎదిగారని గుర్తు చేశారు. జెడ్పీ సీఈఓ మహమ్మద్ హ్యారీస్ సుమైరా, నేతలు చిదానందప్ప, టి.పంపాపతి, అధికారులు మల్లికార్జున, బీ.నాగరాజు, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు మున్సిపల్ కళాశాల మైదానం నుంచి వివిధ శాఖల స్తబ్ద చిత్రాలతో ప్రారంభించిన భారీ ఊరేగింపు వివిధ రహదారుల గుండా సాగి దొడ్డనగౌడ రంగమందిరానికి చేరుకుంది. సుదీర్ఘ కాలం మంత్రిగా పని చేసిన నేత బళ్లారి రూరల్ : సుదీర్ఘ కాలం మంత్రిగా పని చేసిన నాయకుడు బాబూ జగ్జీవన్ రామ్ అని బళ్లారి కాంగ్రెస్ ప్రముఖుడు వెంకటేశ్ హెగ్డె తెలిపారు. శనివారం భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ప్రతిమకు పూలమాలలు వేసి మాట్లాడారు. భారత చరిత్రలోనే అత్యంత ఎక్కువ కాలం దాదాపు 30 ఏళ్లు మంత్రిగా పని చేసిన ఘనత బాబూజీకే దక్కిందన్నారు. జవహర్లాల్ నెహ్రూ హయాంలో అత్యంత చిన్న వయస్సులో మంత్రి పదవి పొందిన వ్యక్తి బాబూజీ అని గుర్తు చేశారు. ఉప ప్రధానిగా కీర్తి ప్రతిష్టలు పొందిన మహనీయుడు జగ్జీవన్ రామ్. అప్పటి ఆహార సమస్యను సవాలుగా తీసుకొని పరిష్కార దిశగా మార్గాలను అన్వేషించిన వ్యక్తిగా బాబూజీకి పేరుందని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబ్కేర్, బాబూ జగ్జీవన్ రామ్ ఈ దేశానికి పెద్ద ఆస్తి అని నేటి యువత తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రముఖులు ఎం.ఎరుకులస్వామి, మల్లికార్జున, బళ్లారి సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు టి.ఆనంద్, ప్రముఖులు రాజ, తిప్పేస్వామి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. హరిత విప్లవ సృష్టికర్త జగ్జీవన్ రామ్ బళ్లారి రూరల్ : ఆహార శాఖలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన నాయకుడిగా బాబూ జగ్జీవన్ రామ్ పేరొందారని దావణగెరె ఎంపీ డాక్టర్ ప్రభా మల్లికార్జున్ తెలిపారు. శనివారం దావణగెరెలో రాధమ్మ చెన్నగిరి రంగప్ప స్మారక రంగమందిరంలో ఏర్పాటు చేసిన బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అంటనరానితనాన్ని రూపుమాపడానికి సమానత్వ సమాజం కోసం శ్రమించిన వ్యక్తిగా బాబూజీ కృషి చేశారన్నారు. 8 సార్లు లోక్సభ స్థానానికి ఎన్నికై ఎక్కువ కాలం మంత్రిగా పని చేశారన్నారు. ముఖ్యంగా అప్పట్లో దేశంలోని ఆహార కొరత సమస్యకు తనదైన శైలిలో పరిష్కారం చూపారన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా విశిష్ట సేవలను అందించారన్నారు. జిల్లాధికారి రాజ్యాంగ సందేశాన్ని చదివి ప్రమాణం చేశారు. కార్యక్రమంలో భాగంగా విశ్రాంత ప్రొఫెసర్ రామచంద్రయ్య జగ్జీవన్ రామ్ గురించి మాట్లాడారు. కార్యక్రమంలో దుడా అధ్యక్షుడు దినేశ్ కె.శెట్టి, జెడ్పీ సీఈఓ సురేశ్ బి.హిట్నాళ్, ఏఎస్పీ విజయకుమార్ బి.సంతోష్, దుడా కమిషనర్ హులమని తమ్మణ్ణ, దళిత ప్రముఖులు మల్లేశ్, హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు. బాబూజీ ఆదర్శాలను అలవర్చుకోవాలి రాయచూరు రూరల్: నేటి ఆధునిక సమాజంలో బాబూజీ ఆశయాలు, ఆదర్శాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖా మంత్రి బోసురాజు అన్నారు. శనివారం బాబూ జగ్జీవన్ రామ్ సర్కిల్ వద్ద జరిగిన బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకొని విగ్రహానికి పూల మాలలు వేసి మాట్లాడారు. అనంతరం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో ఎమ్మెల్సీ వసంత్ కుమార్ ప్రసంగిస్తూ భారత దేశంలో దళిత, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన మహా నేత బాబూజీ అన్నారు. కుల, మత, వర్గ, వర్ణ వ్యవస్థల నిర్మూలనకు ప్రథమ ప్రాధాన్యత కల్పించడంతో పాటు దేశంలో అహార పదార్థాల కొరత ఏర్పడినప్పుడు హరిత విప్లవాన్ని సృష్టించిన మహాన్ మేధావి అన్నారు. స్టేషన్ సర్కిల్లో బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి జిల్లాఽధికారి నితీష్, ఎస్పీ పుట్టమాదయ్య, సీఈఓ రాహుల్ తుకారాం పాండే, నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, కమిషనర్ జుబిన్ మహాపాత్రో పూలమాలలు వేశారు. -
క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం
బళ్లారిఅర్బన్: నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ శారీరకంగా, మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఉపయోగపడతాయని, ప్రతి రోజు క్రీడలకు, వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలని మేయర్ ముల్లంగి నందీష్ సూచించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో జిల్లా స్టేడియంలో శనివారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం అందరూ మొబైల్ ఫోన్కు బానిసలుగా మారి శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణలో సోమరితనంతో వెనుకబడి పోయారన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా తీరిక చేసుకొని నిర్ణీత సమయంలో వ్యాయామం, క్రీడల్లో పాల్గొనాలన్నారు. జెడ్పీ సీఈఓ మహమ్మద్ హ్యారిస్ సుమైరా, అదనపు జిల్లాధికారి మహమ్మద్ జుబేర్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ కార్యదర్శి జీవై తిప్పారెడ్డి, ఉద్యోగులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ముందుగా క్రీడా ధ్వజంతో ఆకర్షణీయమైన పరేడ్ను నిర్వహించారు. మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను ఆచరించారు. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్, డీహెచ్ఓ డాక్టర్ యల్లా రమేష్బాబు, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు ఎంఏ అసీఫ్, యువజన సేవా క్రీడా శాఖ అధికారి కే.గ్రేసీ, వివిధ తాలూకాల అధ్యక్షులు, పదాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఏఐడీఎస్ఓ కార్యకర్తల ర్యాలీ
రాయచూరు రూరల్ : రాయచూరులో రెండు రోజుల పాటు ఏఐడీఎస్ఓ ఆధ్వర్యంలో సాంస్కృతిక ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం నగరంలోని మహిళా సమాజ్ నుంచి నగరంలోని వివిధ మార్గాల్లో సంచరిస్తూ ఏఐడీఎస్ఓ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. అంతకు ముందు కర్ణాటక సంఘం భవనంలో జరిగిన సమావేశంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర సంచాలకుడు శశిధర్ మాట్లాడారు. దేశంలో మనమంతా ఒక్కటే అని చాటి చెప్పి కళలకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. కుల, మత, వర్గ, ప్రాంతీయ భేదాలు, పేద ధనికులు అనే భావాలను విడనాడాలన్నారు. కార్యక్రమంలో శరణప్ప, సరోజ, చంద్ర గిరీష్, వీరేష్, మహేష్, చెన్నబసవలున్నారు.రాష్ట్రానికి ఎయిమ్స్ప్రతిపాదన లేదురాయచూరు రూరల్: రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటు విషయంలో రాజకీయాలు చేయకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎయిమ్స్ పోరాట సమితి ప్రధాన సంచాలకుడు బసవరాజ్ కళస డిమాండ్ చేస్తున్న సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రతాప్ రావ్ జాధవ్ రాష్ట్రానికి ఎలాంటి ఎయిమ్స్ ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. శుక్రవారం లోక్సభలో దావణగెరె లోక్సభ సభ్యురాలు ప్రభా మల్లికార్జున్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. రాయచూరుకు ఎయిమ్స్ మంజూరు కాదు కదా రాష్ట్రానికే ఎయిమ్స్ కేటాయింపు విషయంలో ఎలాంటి చర్చ, ప్రతిపాదన జగరలేదని వివరించారు. న్యూఢిల్లీలో రాష్ట్ర ఎంపీలు, రాజ్యసభ సభ్యుల పూర్తి మద్దతు లభించిన నేపథ్యంలో మహాత్మ గాంధీ మైదానంలో 1060 రోజుల పాటు ఆందోళన చేపట్టినా ఫలితం లేకపోయిందని ఆందోళనకారులు వాపోయారు.విద్యా శాఖాధికారిగా ఈరణ్ణ కోస్గిరాయచూరు రూరల్: రాయచూరు తాలూకా విద్యా శాఖాధికారి(బీఈఓ)గా ఈరణ్ణ కోస్గి బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం రాయచూరు తాలూకా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాయచూరు డయట్లో అధ్యాపకుడిగా, అక్షర దాసోహ అధికారిగా విధులు నిర్వహించానన్నారు. తాలూకా స్థాయిలో పాఠశాలల అభివృద్ధికి తోడు ఉపాధ్యాయులకు సరైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటానన్నారు. బాధ్యతలు చేపట్టిన ఈరణ్ణ కోస్గిని మహంతేష్, నందీష్, తాయిరాజ్, కృష్ణ, రాఘవేంద్ర, వెంకటేష్, గూళప్పలు అభినందించారు.పుట్పాత్పై ఆక్రమణల తొలగింపురాయచూరు రూరల్ : నగరంలో పుట్పాత్ను ఆక్రమించి పెట్టుకున్న డబ్బా అంగళ్లు, హోటళ్లు, తోపుడుబండ్ల తొలగింపునకు సిటీ కార్పొరేషన్ అధికారులు శ్రీకారం చుట్టారు. శనివారం కేంద్ర బస్టాండ్ నుంచి నగరసభ కార్యాలయం రోడ్డు, జైల్ రోడ్డు, ఏక్ మినార్ రోడ్డు, జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమాధికారి కార్యాలయం రోడ్డులో సూపర్ మార్కెట్ వరకు రహదారికి ఇరు వైపులున్న వాటిని తొలగించారు. ఈ విషయంపై వీధివ్యాపారుల సంఘం అధ్యక్షుడు ఏసుమిత్ర బస్టాండ్ వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడుతూ తమకు ప్రత్యామ్నాయ వ్యవస్థను కల్పించి తొలగించాలని అధికారులకు విన్నవించారు.కారు, బైక్ ఢీ.. ఒకరి మృతిహుబ్లీ: కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో బైక్ చోదకుడు అక్కడే మరణించిన ఘటన ధార్వాడ హైకోర్టు వద్ద జాతీయ రహదారిలో జరిగింది. మృతుడిని తాలూకాలోని తేగూరుకు చెందిన హనుమేష్ నాయక్(42)గా గుర్తించారు. తేగూరు గ్రామానికి వెళుతుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొనడంతో హనుమేష్ తీవ్రంగా గాయపడ్డాడు. తక్షణమే ఆస్పత్రికి తరలించారు. అయినా చికిత్స ఫలించక మృతి చెందాడు. గరగ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
బాలా హోటల్పై పోలీసు దాడులు
సాక్షి,బళ్లారి: నగరంలోని పేరుగాంచిన బాలా హోటల్లో పోలీసు బృందం తనిఖీ చేసింది. శనివారం సాయంత్రం బాలా హోటల్ను జిల్లా ఎస్పీ శోభారాణి, ఏఎస్పీ రవికుమార్, డీఎస్పీ, సీఐలు పరిశీలించి అక్కడ నడుపుతున్న స్పా కేంద్రాన్ని, గదులను పరిశీలించారు. స్పా మసాజ్ పేరుతో వేశ్యావాటిక వంటి అసాంఘిక కార్యకలాపాలు నడుపుతున్నట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మహిళలతో ఇక్కడ స్పా మసాజ్ చేయిస్తుండటం వెలుగు చూసింది. మహిళలను స్పా పేరుతో లైంగికంగా ఉపయోగించుకుంటున్నట్లు బయట పడింది. బళ్లారికి చెందిన ఎం.డీ. మతిల్, ముంబైకి చెందిన మీనజ్ అనే మహిళ ఈ స్పా నడుపుతూ లైంగికంగా మహిళలను ఉపయోగించుకుంటున్నట్లు తేలింది. 5 మందిని పోలీసులు అరెస్ట్ చేసి ముగ్గురు మహిళలను రక్షించారు. ఈ దాడుల్లో గాంధీనగర్ సీఐ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. మసాజ్ పేరుతో వేశ్యావాటిక తనిఖీలో వెలుగు చూసిన వైనం ఐదుగురి అరెస్ట్, ముగ్గురు మహిళలకు విముక్తి -
లోకాయుక్త వలలో సీడీపీఓ
రాయచూరు రూరల్: లోకాయుక్త వలలో సీడీపీఓ వనజాక్షి చిక్కిన ఘటన యాద గిరిలో చోటు చేసుకుంది. యాదగిరి సీడీపీఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వనజాక్షి అంగన్వాడీ కేంద్రంలో పని చేస్తున్న సహాయకురాలి అటెండెన్సు పుస్తకంలో హాజరును సక్రమం చేయడానికి రూ.లక్ష డిమాండ్ చేసింది. శుక్రవారం సాయంత్రం యాదగిరి ఆర్టీసీ బస్టాండ్లో రూ.80 వేలు లంచం సొమ్ము తీసుకుంటున్న సమయంలో లోకాయుక్త అధికారి ఇనాందార్ ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఘటనపై సీఐ సంగమేష్, సిద్దరాయ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బళ్లారిలో వర్షం .. ప్రజల్లో హర్షం బళ్లారిటౌన్: నగరంలో శనివారం ఓ మోస్తరు వర్షం కురిసింది. గత నెల రోజులుగా ఎండ తీవ్రతతో సతమతమవుతుండగా రెండు మూడు రోజులుగా ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురుస్తుండటంతో ప్రజలకు వేసవి ఎండల నుంచి కొంత ఉపశమనం లభించింది. కాగా సాయంత్రం కూడా మళ్లీ వర్షం కురవడంతో నగరవాసులకు ఉక్కపోత నుంచి ఊరట కలిగింది. భర్తను చంపిన భార్య అరెస్ట్సాక్షి,బళ్లారి: అక్రమ సంబంధం వ్యామోహంలో కట్టుకున్న భర్తను కిరాతకంగా హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. బెళగావి జిల్లా శహాపుర పోలీస్ స్టేషన్ పరిధిలో భర్త శివనగౌడ పాటిల్ అనే వ్యక్తిని భార్య శైల దారుణంగా హత్య చేసి ఏమీ తెలియనట్లుగా నటించింది. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో రుద్రప్ప, శైల మధ్య ఏర్పడిన అక్రమ సంబంధంతో రుద్రప్ప సహాయంతో భర్తను హత్య చేయించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య హుబ్లీ: బీదర్ శివారు ప్రాంతంలోని చిక్కపేటె అలియాబాద్ రింగ్ రోడ్ సమీపంలో ఢాబా వద్ద శుక్రవారం రాత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య జరిగింది. ఆ తాలూకాలోని వక్కికేరి నివాసి, గ్రామ పంచాయతీ సభ్యుడు వైజనాథ దత్తాత్రేయ(50) హతుడు. గుర్తు తెలియని వ్యక్తులు అతడి తల, కడుపు భాగంలో మారణాయుధాలతో నరికి, చాకుతో పొడిచి దారుణంగా దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటన స్థలాన్ని పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించారు. ఘటనపై నూతన నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
లబ్ధిదారులకు ప్రత్యామ్నాయం చూపండి
హొసపేటె: నగరంలోని హంపీ రహదారిలో ఉన్న అనంతశయనగుడి వద్ద చేపడుతున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఇళ్లు కోల్పోయిన వారికి నగరంలో స్థలాలను కేటాయించాలని ఎమ్మెల్యే గవియప్ప సంబంధ అధికారులకు సూచించారు. శనివారం నగరంలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన అధికారులు, అనంతశయన గుడి ప్రజలతో సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా ఇళ్లు కోల్పోయే లబ్ధిదారులకు ప్రత్యామ్నాయంగా తగిన ప్రదేశంలో తగిన కొలతల ఇంటిని అందించాలని నిర్ణయించామన్నారు. స్థలాన్ని సిద్ధం చేయమని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వానికి గరిష్ట పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతశయనగుడి గ్రామస్తుల రాకపోకలకు వీలుగా సప్తాంజనేయ ఆలయ సమీపంలో ఒక చిన్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధిత అధికారులు, రైల్వే మంత్రితో చర్చించి ఆమోదం పొందుతామని తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ వివేక్, తహసీల్దార్ శృతి, డీఎస్పీ మంజునాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
జైలులో జామర్.. ఎమ్మెల్యే ధర్నా
యశవంతపుర: జైలు అధికారులు కారాగారం చుట్టు వేసిన జామర్లతో ప్రజలకు ఇబ్బందిగా ఉందంటూ మంగళూరు నగర బీజేపీ నాయకులు శనివారం స్థానిక జైలు ముందు ధర్నా చేశారు. ఒక జామర్ వల్ల ప్రజలకు సమస్యగా ఉందని ఎమ్మెల్యే వేదవ్యాస కామత్ అరోపించారు. సమస్యను పరిష్కరించండి, లేదా జామర్ను తొలగించండి అని ఆయన డిమాండ్ చేశారు. జైలు అధికారులు, పోలీసు ఉన్నత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జైలుకు జామర్ అవసరం లేకున్నా ఎందుకు కొనసాగిస్తున్నరో అర్థం కావటంలేదన్నారు. జామర్ల వల్ల పరిసర ప్రాంతాల ప్రజల మొబైల్ఫోన్లకు అంతరాయం కలుగుతోందని తెలిపారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని తరలించారు. సీఐ సస్పెన్షన్ శివమొగ్గ: శివమొగ్గ నగరంలో ఉన్న వినోభనగర పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ చంద్రకళ సస్పెండ్ అయ్యారు. విధులలో నిర్లక్ష్యం చూపినట్లు ఆరోపణలు రావడంతో తూర్పు విభాగం ఐజిపి రవికాంత్గౌడ ఈ మేరకు చర్య తీసుకున్నారు. ఈద్గా మైదానం వివాదం గురించి ఎస్పీ అన్ని స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలతో సమావేశం నిర్వహించారు. ఇందుకు చంద్రకళ హాజరు కాలేదు. ఎస్పీ ఫిర్యాదు చేయడంతో వేటు పడింది. సిద్ధలింగేశ్వర జాతర తుమకూరు: ప్రసిద్ధ యడియూరు శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో శనివారం మధ్యాహ్నం రథోత్సవం కనులపండువగా జరిగింది. ఏటా మాదిరిగానే ఉగాది పండుగ ముగిసిన తరువాత స్వామి జాతర, తేరు జరుగుతుంది. మంగళవాయిద్యాలతో, వీరగాసె కళాకారుల నృత్యాల మధ్య రథోత్సవం జరిగింది. పలువురు స్వామీజీ పాల్గొని టెంకాయలు కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. పలు జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు పాల్గొన్నారు.వాకింగ్ చేస్తుండగా చైన్స్నాచింగ్ మైసూరు: మైసూరులో చైన్స్నాచర్లు తెగబడ్డారు. ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ ఘటన నగరంలోని మండి పోలీసు స్టేషన్ పరిధిలోని వెస్లి రోడ్డు వద్ద జరిగింది. లలిత (53) అనే మహిళ ఇంటి వెనుక రోడ్డులో వాకింగ్ చేస్తుండగా స్కూటర్పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని రూ.1.45 లక్షల విలువ చేసే 35 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని లాక్కొని పరారయ్యారు. ఘటన అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది. లలిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు మండి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. బజార్లకు నవమి కళ చింతామణి: శ్రీరామనవమి పండుగ రావడంతో బజార్లు కిటకిటలాడుతున్నాయి. చింతామణి పట్టణంలో పూలు పండ్లు తదితర వస్తువులను కొనుగోలుకు ప్రజలు తరలివచ్చారు. పూలు పండ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా పండుగ కావడంతో కొనుగోళ్లు చేశారు. కావేరి జలాల్లో అన్యాయమే ● కేంద్రమంత్రి కుమారస్వామి శివాజీనగర: మన నీరు మన హక్కు, ప్రజల పన్నుల సొమ్ముతో ఆనకట్టలను నిర్మించి తమిళనాడుకు నీరు విడుస్తున్నాము అని కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి అన్నారు. బెంగళూరు కువెంపు కళాక్షేత్రలో కావేరి నది రక్షణ సమితి చేపట్టిన కావేరి నది నీటి పంపకాల గురించి చర్చాగోష్టిలో పాల్గొని మాట్లాడారు. కావేరి నీటి విషయంలో మనకు అన్యాయం అయింది. పొరుగు రాష్ట్రానికి అనుకూలం అవుతోంది. కన్నడిగుల్లో ఐక్యత లేదు, నీటి విషయంలో కూడా అదే జరుగుతోందన్నారు. మేకెదాటు ప్రాజెక్ట్పై రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ విధానాన్ని అనుసరిస్తున్నదని ఆరోపించారు. మనలో ఐక్యత రాకపోతే కావేరి నీటిలో న్యాయం జరగదన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మలానందనాథ స్వామి, సౌమ్యనాథ స్వామి, సిద్దరామేశ్వర స్వామి, నిశ్చలానందనాథ స్వామి, బీజేపీ పక్ష నాయకుడు ఆర్.అశోక్, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి వీ గోపాలగౌడ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
నివేదికలోని కొన్ని అంశాలు..
సాక్షి, బెంగళూరు: ప్రతి గర్భిణి పండంటి బిడ్డను చేతుల్లోకి తీసుకోవాలని కలలు కంటుంది. కానీ ఆస్పత్రుల్లో వివిధ కారణాల వల్ల వారి కలలు ఛిద్రమయ్యాయి. తల్లీ బిడ్డల అనుబంధం శాశ్వతంగా ఆవిరైంది. కన్నడనాడును ఎక్కువగా వేధిస్తున్న సమస్యల్లో గర్భిణులు, బాలింతల మరణం ఒక్కటి. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది కాలంగా ఎక్కువసంఖ్యలో మరణించడం కలలకం రేపింది. 2024 ఏప్రిల్ నుంచి డిసెంబర్ 31 మధ్యకాలంలో రాష్ట్రంలో మొత్తం 464 మంది మహిళలు ప్రసవానికి ముందు, లేదా ప్రసవానంతరం మరణించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 70 శాతం మరణాలను ఆపగలిగేవి అని ప్రభుత్వానికి రాష్ట్ర స్థాయి నిపుణుల కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక వెల్లడించింది. దీంతో వైద్యశాఖ నిర్లక్ష్యం తేటతెల్లమైంది. ఈ ఏడాది మరణాలను కలిపితే 550 దాటుతుందని అంచనా. గత నవంబర్లో బళ్లారి నుంచి.. గత ఏడాది నవంబర్లో బళ్లారి జిల్లా ఆస్పత్రిలో 5 మంది బాలింతలు వరుసగా చనిపోయారు. 9 నుంచి 11 తేదీల మధ్య జరిగిన సిజేరియన్ శస్త్రచికిత్సల తరువాత అధిక రక్తస్రావం, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో మరణించారు. తరువాత ఉత్తర కర్ణాటక జిల్లాల వ్యాప్తంగా మృత్యుకేకలు అధికమయ్యాయి. దీంతో కర్ణాటక ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ మరణాలపై పూర్తి స్థాయి తనిఖీ జరగాలని అందుకోసం ప్రభుత్వం ఒక విస్తృత రాష్ట్ర స్థాయి తనిఖీ కమిటీని ఏర్పాటు చేసింది. బెంగళూరు వాణివిలాస్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సవితా నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు అయింది. ఆరోగ్య మంత్రి ఏమన్నారు కమిటీ విచారణ జరిపి ఒక మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికపై శుక్రవారం వైద్యారోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు స్పందించారు. ఈ మరణాలకు కేవలం రింగర్ లాక్టేట్ (ఆర్ఎల్) ద్రావణం మాత్రమే ఒక్కటే కారణం కాదని, మరిన్ని కారణాలు ఉన్నాయని చెప్పారు. పనిభారం ఎక్కువగా ఉన్న తాలూకా ఆస్పత్రులకు ఒత్తిడి తక్కువగా ఉన్న తాలూకా ఆస్పత్రుల వైద్యులు, సిబ్బందిని బదిలీ చేస్తామన్నారు. మొత్తానికి ప్రతి తాలూకా ఆస్పత్రికి ఇద్దరు నిపుణులైన వైద్యులు, ఒక పీడియాట్రీషియన్, ఒక అనస్థీసియా నిపుణుడు ఉండేలా చూస్తామన్నారు. మధ్యంతర నివేదికలోని కొన్ని సిఫారసులు ఇప్పటికే అమల్లో ఉన్నట్లు చెప్పారు. 70 శాతం బాలింతల మరణాలను అరికట్టి ఉండవచ్చు సర్కారీ ఆస్పత్రుల్లో వసతుల లేమి బాలింతల మరణాలపై కమిటీ మధ్యంతర నివేదిక గత ఏడాది కుదిపేసిన మృత్యుహేల 70 శాతం గర్భిణులు, బాలింతల మరణాలను తప్పించవచ్చు గ్లూకోజ్గా ఎక్కించే రింగర్ లాక్టేట్ ద్రావణంలో సమస్యల వల్ల 18 మంది మరణించారు. బళ్లారి 5, రాయచూరులో నలుగురు, బెంగళూరులో ముగ్గురు, ఉత్తర కన్నడ, యాదగిరి, బెళగావిల్లో చెరో ఒకరు చనిపోయారు. మరో పది కేసుల్లో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణం. మరణాల్లో 50 శాతం కేసుల్లో తల్లులు 19 నుంచి 25 ఏళ్ల లోపువారు. 68 శాతం మరణాలు అధిక బీపీ, హృద్రోగం, మధుమేహం వల్ల జరిగాయి. భవిష్యత్తులో తల్లుల మరణాలు తప్పించేందుకు 27 సిఫారసులు చేశారు. ముఖ్యంగా ఆయా ఆస్పత్రుల్లో మౌలికవసతుల పెంపు, ఉపకరణాలు, మందులు, రక్తనిధి వంటి సౌకర్యాలు ఉండాలని కమిటీ సూచించింది. సాధారణ ప్రసవం అయిన వారికి మూడు రోజులు, సిజేరియస్ ప్రసవం అయిన వారు ఏడు రోజులు ఆస్పత్రిలోనే ఉండేలా తప్పనిసరి చేయాలి. మరణానికి స్పష్టమైన కారణాలు లేని సందర్భాల్లో పోస్టుమార్టమ్ తప్పనిసరి చేయాలి. -
జూనియర్ భోగేశ్వర్ కన్నుమూత
మైసూరు: రెండు ఏనుగుల మధ్య జరిగిన పోట్లాటలో పొడవాటి దంతాలు కలిగిన జూనియర్ భోగేశ్వర్గా పేరొందిన ఏనుగు అసువులు బాసింది. ఈ దుర్ఘటన జిల్లాలోని కబిని డ్యాం పరిధిలోని డీబీ కుప్పె, అంతరసంతె అటవీ వలయంలో జరిగింది. ఈ ప్రాంతంలో పొడవాటి దంతాలు కలిగిన కొన్ని ఏనుగులు ఉన్నాయి. వాటిలో ఆసియాలోనే ఎక్కువగా.. 8 అడుగుల అతి పొడవైన దంతాలు కలిగిన మిస్టర్ కబిని లేదా భోగేశ్వర్ అనే 68 ఏళ్ల ఏనుగు ఖ్యాతి పొందింది. ఈ ఏనుగు 2022 జూన్ 10న మరణించింది. ఆ తరువాత భోగేశ్వర్ ఏనుగును పోలినట్లుగా ఉన్న పొడవైన దంతాల మరో ఏనుగు ఒకటి సంచరిస్తోంది. దీనికి కొందరు వన్యజీవి ఛాయాగ్రాహకులు జూనియర్ భోగేశ్వర్గా పేరు పెట్టారు. ఫలించని చికిత్సలు డీబీ కుప్పె వన్యజీవి వలయపు కబిని పోటు జలాల ప్రాంతంలోని కొల్లి అనే చోట ఈ మగ ఏనుగు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని అటవీ సిబ్బంది గమనించారు. మరో అడవి ఏనుగుతో జరిగిన పోట్లాటలో గాయపడినట్లుగా తెలిసింది. చికిత్స చేపట్టినప్పటికీ అది గాయాల తీవ్రతతో కన్నుమూసింది. జూనియర్ నేలకొరగడం స్థానికులకు, అటవీ సిబ్బందికి బాధ కలిగించింది. సోషల్ మీడియాలో జూనియర్ భోగేశ్వర్ ఏనుగు మరణ వార్త చిత్రాలతో వైరల్గా మారింది. ప్రజలు నివాళులర్పించారు. పులుల సంరక్షిత ప్రదేశం డైరెక్టర్ పీఏ సీమా, మేటికుప్పె ఉప విభాగపు ఏసీఎఫ్ ఎస్డీ మధు, ఆర్ఎఫ్ఓ ఎస్ఎస్ సిద్దరాజు పరిశీలించారు. నియమాల ప్రకారం ఏనుగు కళేబరాన్ని వన్యజీవులకు ఆహారంగా అడవిలోనే వదిలేశారు. అతి పెద్ద దంతాల ఆసియా ఏనుగుగా ఖ్యాతి మరో గజరాజుతో పోరాటంలో మృతి -
ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు ప్రశాంతం
సాక్షి,బళ్లారి: రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. గత నెల 21 తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలు ఏప్రిల్ 4వ తేదీతో బళ్లారి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏకకాలంలో ముగిశాయి. పరీక్షలు ముగిశాయని విద్యార్థులు ఆనందంగా పరీక్ష కేంద్రాల నుంచి బయటకు వచ్చి కేరింతలు కొట్టారు. అయితే ఎస్ఎస్ఎల్సీ పరీక్ష చివరి రోజున హావేరి జిల్లాలో ఇద్దరు విద్యార్థులు అశ్రునయనాల మధ్య పరీక్ష రాశారు. హావేరి జిల్లా పద్మావతిపుర తాండాకు చెందిన రక్షిత, ధనరాజ్ అనే ఇద్దరు అన్నా చెల్లెళ్లు పుట్టెడు దుఃఖంలోనూ పరీక్ష రాయడం కలిచివేసింది. వారి తండ్రి హనుమంతప్ప శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించగా 10 గంటలకు పరీక్ష ఉండటంతో తండ్రి మరణవార్త నడుమ పరీక్షకు వెళ్లేందుకు నిరాకరించడంతో బంధువులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు ధైర్యం నూరిపోసి నచ్చచెప్పి పరీక్షకు పంపించారు. తమను పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి పరీక్ష కేంద్రానికి తీసుకుని వచ్చి, పరీక్ష ముగిసిన తర్వాత ఇంటికి తీసుకెళ్లేవారని, ఉన్నఫళంగా గుండెపోటుతో మృతి చెందారని ఆ విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు. తండ్రి మృతితో పుట్టెడు దుఃఖంలోనూ పరీక్ష రాసిన అన్నా చెల్లెళ్లు -
ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు ప్రశాంతం
సాక్షి,బళ్లారి: రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. గత నెల 21 తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలు ఏప్రిల్ 4వ తేదీతో బళ్లారి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏకకాలంలో ముగిశాయి. పరీక్షలు ముగిశాయని విద్యార్థులు ఆనందంగా పరీక్ష కేంద్రాల నుంచి బయటకు వచ్చి కేరింతలు కొట్టారు. అయితే ఎస్ఎస్ఎల్సీ పరీక్ష చివరి రోజున హావేరి జిల్లాలో ఇద్దరు విద్యార్థులు అశ్రునయనాల మధ్య పరీక్ష రాశారు. హావేరి జిల్లా పద్మావతిపుర తాండాకు చెందిన రక్షిత, ధనరాజ్ అనే ఇద్దరు అన్నా చెల్లెళ్లు పుట్టెడు దుఃఖంలోనూ పరీక్ష రాయడం కలిచివేసింది. వారి తండ్రి హనుమంతప్ప శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించగా 10 గంటలకు పరీక్ష ఉండటంతో తండ్రి మరణవార్త నడుమ పరీక్షకు వెళ్లేందుకు నిరాకరించడంతో బంధువులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు ధైర్యం నూరిపోసి నచ్చచెప్పి పరీక్షకు పంపించారు. తమను పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి పరీక్ష కేంద్రానికి తీసుకుని వచ్చి, పరీక్ష ముగిసిన తర్వాత ఇంటికి తీసుకెళ్లేవారని, ఉన్నఫళంగా గుండెపోటుతో మృతి చెందారని ఆ విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు. తండ్రి మృతితో పుట్టెడు దుఃఖంలోనూ పరీక్ష రాసిన అన్నా చెల్లెళ్లు -
అందని నీరు.. ఎండిన పైరు
రాయచూరు రూరల్: నారాయణపుర కుడి గట్టు కాలువ(ఎన్ఆర్బీసీ) ఆయకట్టు చివరి భూములకు నీరందక పోవడంతో రైతులు బిక్కముఖం వేసుకున్నారు. మూడు జిల్లాల్లో లక్షలాది హెక్టార్లలో పంట నష్టం సంభవించే అవకాశాలున్నాయి. నీటి గేజ్ నిర్వహణ సామర్థ్యాన్ని బట్టి ఆయకట్టు భూములకు నీరందేలా అధికారులు జాగ్రత్తలు పాటించడం లేదు. అధికారులు ఆయకట్టు చివరి భూములకు నీరందించక పోవడంతో పంటలు వాడుముఖం పట్టాయి. పంట నష్టం వివరాలు: యాదగిరి జిల్లాలో శహాపుర, సురపుర, హుణసిగి, వడగేర, నారాయణపుర, రాయచూరు జిల్లాలోని లింగసూగూరు, దేవదుర్గ, రాయచూరు ప్రాంతాల్లో వరి, మిరప, సజ్జ పంటలు పండిస్తున్నారు. యాదగరి జిల్లాలో దాదాపు రెండు లక్షలు, రాయచూరు జిల్లాలో లక్ష, విజయపుర జిల్లాలో రెండు లక్షల హెక్టార్లలో వరి, సజ్జ, మిరప పంటలను పండిస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు రోజుకు 3500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే పంటలు చేతికొచ్చే అవకాశం ఉండేది. కాలువకు నీటి సామర్థ్యం, గేజ్ నిర్వహణ చేయడంలో అధికారుల నిర్లక్ష్యంతో పంటలు చేతికొచ్చే సమయంలో నీటి లభ్యత కరువైంది. ఆల్మట్టి జలాఽశయం నుంచి నారాయణ పుర డ్యాంకు ఆరు టీఎంసీల నీటిని విడుదల చేస్తే రైతులు కష్టాల నుంచి గట్టెక్కుతారు. సుమారు ఆరు లక్షల హెక్టార్లలో పంట నష్టం రాయచూరు, యాదగిరి జిల్లాల్లో రైతులు విలవిల ఏప్రిల్ 20 వరకు నీరు వదలాలి ఎండుతున్న పంటలను చూసైనా అధికారులు ఎన్ఆర్బీసీ చివరి భూములకు ఏప్రిల్ నెలాఖరు వరకు నీటిని విడుదల చేయాలి –కరెమ్మ నాయక్, ఎమ్మెల్యే, దేవదుర్గ ఏప్రిల్ నెలాఖరు వరకు నీరివ్వాలి నారాయణపుర కుడి గట్టు కాలువ(ఎన్ఆర్బీసీ) ఆయకట్టు చివరి భూములకు ఏప్రిల్ నెలాఖరు వరకు నీరందించాలి – రాజుగౌడ, మాజీ మంత్రి -
వేతనాలు చెల్లించాలని వినతి
రాయచూరు రూరల్: జెస్కాంలోని 33 కె.వి.విద్యుత్ సబ్ స్టేషన్లలో కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలని జెస్కాం కాంట్రాక్ట్ కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. శుక్రవారం రాయచూరు జెస్కాం కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు శరణ బసవ మాట్లాడారు. జిల్లాలో గత 20 ఏళ్ల నుంచి జెస్కాంలోని 33 కె.వి. విద్యుత్ ఉప కేంద్రాల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై 500 మంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు లేక వెట్టి చాకిరీ చేస్తున్నారని, వారిని పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ జెస్కాం అధికారికి వినతిపత్రం సమర్పించారు. పాస్టర్ మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించండి బళ్లారిటౌన్: ఆంధ్రప్రదేశ్లో గతనెల 24న కోవూరు టోల్ గేట్ వద్ద అనుమానాస్పదంగా మృతి చెందిన ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని బళ్లారి కర్ణాటక క్రిస్టియన్ వెల్ఫేర్ సంఘం పదాధికారులు డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రముఖులు కే.ఫృద్వీరాజ్ ఆధ్వర్యంలో జిల్లాధికారి కార్యాలయానికి వెళ్లి వినతిపత్రాన్ని అందజేశారు. వారు మాట్లాడుతూ పాస్టర్ హత్య అనుమానాస్పదంగా కనిపిస్తోందన్నారు. ఇది ముందస్తు పథకంతోనే హత్య చేసినట్లు అనుమానం ఉందన్నారు. దీనిపై ఆంధ్రప్రభుత్వం సమగ్ర తనిఖీ నిర్వహించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రముఖులు విజయ్కుమార్, పాస్టర్లు విశ్వనాథ్, సర్జన్ సారథి, నీలప్ప స్వామి, సురేష్, కమలమ్మ, రాజు, ఐవన్ పింటో, రాజన్న, గొండయ్య, కృష్ణ, నాసిర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. హాస్టళ్లు మంజూరు చేయాలి రాయచూరు రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగానికి పెద్ద పీట వేస్తామని గొప్పలు చెప్పడం మాని సిరవారకు అన్ని వర్గాలకు చెందిన హాస్టళ్లను మంజూరు చేయాలని దళిత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేసింది. శుక్రవారం సిరవార తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు బాలస్వామి మాట్లాడారు. సిరవారను తాలూకా కేంద్రంగా ప్రకటించి ఆరేళ్లు గడుస్తున్నా నేటికీ ప్రభుత్వ కార్యాలయాలు రాకపోవడం విచారకరమన్నారు. అధిక శాతం గ్రామీణ విద్యార్థులు ఉన్నందున విద్యా రంగం అభివృద్ధికి సిరవారలో వెనుక బడిన వర్గాల, సాంఘీక సంక్షేమ, మైనార్టీ, అంబేడ్కర్, మొరార్జి, రాణి కిత్తూరు చెన్నమ్మ, కస్తూరిబా గురుకుల హాస్టళ్లను ప్రారంభించడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి తహసీల్దార్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. మొబైల్ లొకేషన్పై ఫిర్యాదు ● చాలా రోజుల నుంచి నాపై నిఘా వేశారు ● పోలీస్ అధికారులపై చర్యకు నగర ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ డిమాండ్ రాయచూరు రూరల్ : ఓ ప్రజాప్రతినిధి వాడే మొబైల్ ఫోన్ లొకేషన్ను కబళిస్తున్నట్లు నగర శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ ఆరోపించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ పుట్టమాదయ్యకు ఆయన ఫిర్యాదు చేశారు. తన మొబైల్ ఫోన్ లొకేషన్కు సంబంధించి ప్రతి నెల 70 సార్లు జాబితాను తీస్తున్నారని, ఈ విషయంలో పోలీస్ స్టేషన్ల నుంచి పోలీస్ అధికారులే ఈ కుట్రలకు పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెస్ట్ పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ కేసులో వీరేష్ ప్రాణాలు కోల్పోయిన అంశంపై చర్చిస్తుండగా తన ఫోన్ను ట్యాపింగ్ చేశారని, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు చేపట్టాలని కోరారు. శాసన సభ్యుడు ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడారు అనే అంశాలను గమనిస్తున్నట్లు తెలిపారు. కారు బోల్తా.. ముగ్గురికి గాయాలు కోలారు : తాలూకాలోని అరాభికొత్తనూరు గేట్ వద్ద జాతీయ రహదారిపై కారు బోల్తా పడి ముగ్గురు గాయపడ్డారు. కోలారు నుంచి బెంగుళూరు వెళుతున్న కారు అతి వేగంగా మరో కారును ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి డివైడర్ను ఢీకొని అవతల రోడ్డుపై వస్తున్న బైక్ను ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో కారులో ఉన్న చుంచదేనహళ్లి గ్రామానికి చెందిన నాగేంద్రబాబు, నాగమణి, లలిత తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అంబులెన్స్కు ఫోన్ చేసినా సకాలంలో రాలేదు. దీంతో క్షతగాత్రులు ప్రమాద స్థలంలోనే నరకయాతనకు గురయ్యారు. కోలారు రూరల్ సీఐ కాంతరాజు, ఎస్ఐ వీ భారతి వచ్చి క్షతగ్రాత్రులను కోలారులోని ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రికి తరలించారు. -
భక్తిభావంతో జీవితం ధన్యం
రాయచూరు రూరల్: మనిషి భక్తిభావం పెంపొందించుకున్నప్పుడే జీవితం ధన్యం అవుతుందని ఎలె బిచ్చాలి మఠాధిపతి వీరభద్ర శివాచార్య పేర్కొన్నారు. సిరవార తాలూకాలోని అత్తనూరు సోమవారపేట హిరేమఠ్ రాచోటి వీర శివాచార్యుల 21వ పుణ్యారాధన ఉత్సవాల్లో భాగంగా సామూహిక వివాహాల్లో పాల్గొన్న 11 జంటలను ఆశీర్వదించి ఆయన మాట్లాడారు. నేడు మానవుడు పని ఒత్తిళ్లతో ప్రతి నిత్యం ఎంతో మదనపడుతున్నాడన్నారు. రోజు కొంత సమయాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేటాయించాలన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు కర్బూజ పండ్లను దానం చేశారు. కార్యక్రమంలో గబ్బూరు బృహన్మఠ బూది బసవేశ్వర శివాచార్య, మహాలింగ, శాంతమల్ల శివాచార్య, చెన్న బసవ శివాచార్య, మహాంత శివాచార్య, వీర సంగమేష్ శివాచార్య స్వామీజీ, మాజీ శాసన సభ్యుడు పాపారెడ్డి, మహంతేష్ పాటిల్, సూగప్ప తదితరులున్నారు. -
మణిమకుటం కన్నడ వర్సిటీ
హొసపేటె: చారిత్రక వారసత్వ పరంపరకు ప్రసిద్ధి చెందిన హంపీలో మణిమకుటం లాంటి కన్నడ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం గర్వకారణమని రాష్ట్ర గవర్నర్ ఽథావర్చంద్ గెహ్లోట్ అభివర్ణించారు. శుక్రవారం హంపీ కన్నడ విశ్వవిద్యాలయం నవరంగ బయలు ప్రదేశంలో ఏర్పాటు చేసిన కన్నడ విశ్వవిద్యాలయం 33వ స్నాతకోత్సవాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సుమారు ఐదు వేల అరుదైన మాన్యుస్క్రిప్ట్లు, విజువల్ ఆర్ట్స్ విభాగం అధ్యాపకులు, విద్యార్థులు సృష్టించి, ప్రదర్శించిన కళా ఖండాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయన్నారు. గిరిజన అధ్యయన విభాగం సేకరించిన గిరిజనుల చరిత్ర, స్వదేశీ కవితా వారసత్వాన్ని భావి తరాలకు అందించడంలో ముఖ్య పాత్ర పోషించారన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కన్నడ జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి, హిందీ, ఆంగ్ల భాషల్లో మరింత విలువైన కన్నడ పుస్తకాలను ప్రచురించాల్సిన అవసరం ఉందన్నారు. విశ్వవిద్యాలయం సమీపంలోని ఐదు గ్రామాలను దత్తత తీసుకొని, వాటిలో విద్యా, సాంస్కృతిక కార్యకలాపాలను గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించడం ఆదర్శనీయమన్నారు. అనంతరం విద్యా శాఖ మంత్రి సుధాకర్ మాట్లాడుతూ హంపీ కన్నడ విశ్వవిద్యాలయం యావత్ కన్నడిగులకు ఆదర్శనీయమన్నారు. ప్రాధ్యాపకులు ఉత్తమ పరిశోధనలపై నిరంతరం దృష్టి పెట్టాలని కోరారు. అనంతరం విశ్వవిద్యాలయ ప్రతిష్టిత నాడోజ బిరుదులను రాష్ట్ర ప్రసిద్ధ కవి కుంబార వీరభద్రప్పకు, సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ శివరాజ్ వీ.పాటిల్, ప్రసిద్ధ హిందూస్థానీ గాయకుడు వెంకటేష్ కుమార్కు అందజేసి సత్కరించారు. రాష్ట్ర గవర్నర్ ఽథావర్చంద్ గెహ్లోట్ అభివర్ణన ఘనంగా హంపీ కన్నడ వర్సిటీ 33వ స్నాతకోత్సవం -
చంద్రమౌళేశ్వరుని సన్నిధిలో నటి సారా అలీఖాన్
హుబ్లీ: వాణిజ్య నగరి హుబ్లీ కేవలం వ్యాపార వ్యవహారాలతో చోటా ముంబైగా పేరు గడించింది. అయితే కళ్యాణ చాళుక్యులు నిర్మించిన అమర శిల్ప కళలకు ప్రసిద్ధి చెందిన ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వాటిలో హుబ్లీలోని ఉణకల్ సుప్రసిద్ధ ప్రాచీన చంద్రమౌళేశ్వర ఆలయం కూడా ఒకటి. ఇలాంటి ప్రముఖ ఆలయానికి బాలీవుడ్ నటి సారా అలీఖాన్ దర్శించుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఆలయానికి వచ్చిన సదరు ఫోటోను తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేశారు. ఈ స్టోరీ స్క్రీన్ షాట్ను హుబ్లీ ఎమ్మెల్యే మహేష్ టెంగినకాయి తన ఫేస్బుక్లో షేర్ చేశారు. నటి సారా అలీఖాన్ చంద్రమౌళేశ్వర ఆలయాన్ని దర్శించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ప్రముఖులు ఆలయాన్ని దర్శించుకుంటున్న నేపథ్యంలో మన దేశ సంస్కృతి, సంప్రదాయాల ఘన చరిత్రను చాటడమే కాకుండా పర్యాటక అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. కాగా ఎమ్మెల్యే షేర్ చేసిన ఫోటోకు స్థానికులు ప్రసంశలు వ్యక్తం చేశారు. అయితే ఎప్పుడు వచ్చి వెళ్లారో మాత్రం వివరాలు మాత్రం తెలియరాలేదు. సారా అలీఖాన్ దేశ వ్యాప్తంగా ఆలయాలకు వెళతారు. మేకప్ లేకుండా నిరాడంబరంగా ఆమె తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు. కేదార్నాథ్కు వెళ్లినప్పుడు శివుడి ఆశశీర్వాదం పొందుతూ ఆలయం మెట్లపై కూర్చొని ఉన్న ఫోటోను గతంలో పోస్టు చేశారు. ఆమె తొలి సినిమా కేదార్నాథ్ దర్శనం అనంతరం పుణ్యక్షేత్రాల్లో పర్యటించడం ఆమె అలవాటుగా పెట్టుకొని సంబంధిత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం హర్షణీయమని స్థానికులు అభిప్రాయ పడ్డారు. -
రహదారి పనుల పూర్తికి మీనమేషాలు
బళ్లారిటౌన్: నగరంలోని కేఈబీ సర్కిల్ నుంచి కర్ణాటక గ్రామీణ బ్యాంక్ వరకు ఎస్హెచ్– 132 బసవేశ్వరనగర్ రోడ్డు వెడల్పు పనులు చేపట్టి దాదాపు 10 నెలలు కావస్తున్నా పనులు నత్తనడకన సాగుతున్నందున స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 400 మీటర్ల పొడవు ఉన్న ఈ రోడ్డు పనులు గతేడాది మే నెలలో ప్రారంభించారు. అయితే ఇంత వరకు రెండు వైపులా ఓపెన్ డ్రైనేజీ, అండర్ డ్రైనేజీ పనుల్లో కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యంతో పనులు ఆలస్యం అవుతున్నాయని సామాజిక కార్యకర్త మేకల ఈశ్వర్రెడ్డి ఆరోపించారు. 21వ వార్డు పరిధిలోని ఈ రోడ్డులో కూరగాయల మార్కెట్, ఆస్పత్రులు, హోటళ్లు, కమర్షియల్ షాపులు ఉన్నందున రోడ్డులో ఉన్న దుమ్ము, ధూళి అంతా దుకాణాల్లోకి చొరబడుతోందని వర్తకులు మండిపడుతున్నారు. ఇక ఈ రోడ్డుకి ఆనుకొని ఉన్న బసవేశ్వరనగర్ వాసులు తమ ఇళ్లలోకి ధూళి, దుమ్ము చేరుతున్నందున ఎప్పుడూ తలుపులు, కిటికీలు మూసుకొని ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు చెల్లించనందుకే జాప్యం పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు సరిగ్గా విడుదల చేయక పోవడంతోనే పనులు ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంట్రాక్టర్లు ముందస్తుగా లక్షల్లో పెట్టుబడి పెట్టినా అధికారులు బిల్లులు మంజూరు చేయక పోవడంతో కాలయాపన జరుగుతున్నట్లు పలువురు వాపోతున్నారు. జాతీయ రహదారిలో ఏడాదిలో వందల కొద్ది కి.మీ. మేర రోడ్డు అభివృద్ధి చేస్తుండగా రాష్ట్ర రహదారిలో 400 మీటర్ల రోడ్డు పనులు నిర్వహించేందుకు 10 నెలలు కావాలా? అని ప్రశ్నిస్తున్నారు. కాగా ఇదే రాష్ట్ర రహదారిలో చాగనూరు వద్ద రాష్ట్ర రహదారుల మండలి టోల్గేట్ను నిర్మించి డబ్బులు దండుకుంటోంది. టోల్గేట్లో డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు టోల్గేట్ నుంచి కేవలం 10–12 కి.మీ. దూరంలో ఉన్న బసవేశ్వరనగర్ రోడ్డును ఎందుకు ఆలస్యం చేస్తున్నారనేది స్థానికుల వాదన. ఇప్పటికై నా రాష్ట్ర రహదారుల నిగమ అధికారులు, మహానగర పాలికె అధికారులు, పాలక మండలి ఈ రోడ్డు పనులను త్వరగా ముగించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 10 నెలలుగా పూర్తి కాని రోడ్డు పనులు దుమ్ము, ధూళితో దుకాణదారుల పాట్లు -
మద్యం అమ్మకందారుల ధర్నా
బళ్లారిటౌన్: తమ డిమాండ్లను పరిష్కరించాలని జిల్లా మద్యం అమ్మకందారులు శుక్రవారం జిల్లాధికారి కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం జిల్లాధికారి ద్వారా సీఎంకు వినతిపత్రాన్ని సమర్పించారు. మద్యం అమ్మకం దారులు జిల్లాధ్యక్షుడు సావుకార్ సతీష్బాబు, ప్రధాన కార్యదర్శి బసవ లింగరెడ్డి తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్ల సాధన కోసం అన్ని జిల్లాల్లోను సాంకేతిక ధర్నా చేపట్టామన్నారు. చిల్లర మద్యం అమ్మకందారులకు కనీసం 20 శాతం లాభాలు కల్పించాలని, అడిషినల్ ఎకై ్సజ్ ట్యాక్స్ను తగ్గించాలని, ఇప్పటికే పలు మద్యం దుకాణాల్లో అమ్మకాలు తగ్గిపోయినందున నష్టాల్లో మద్యం వ్యాపారులు ఉన్నారన్నారు. అయితే ఖాళీ ఉన్న 950 మద్యం దుకాణాలకు టెండర్ ప్రక్రియ ప్రారంభించి ఈ టెండర్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఉపాధ్యక్షుడు కేపీ రామరెడ్డి, కార్యదర్శి బసవలింగ రెడ్డి, జోనల్ కార్యదర్శి గట్టురాము, సూర్యకుమార్ శెట్టి, పీ.లక్ష్మిరెడ్డి పాల్గొన్నారు. హుబ్లీ: వివిధ సమస్యల కోసం పరిష్కారం కోసం మద్యం అమ్మకందారులు ధార్వాడ జిల్లాధికారి కార్యాలయం ఎదుట సంఘం తరపున శుక్రవారం ధర్నా చేపట్టారు. ప్రభుత్వం ఆదాయం గడించుకోవడానికి నియమాలకు తిలోదకాలు ఇచ్చిందన్నారు. 4065 మద్యం దుకాణాల వేలంపాట పాడడం దారుణం అన్నారు. అమ్మకందారుల లాభాల శాతాన్ని 20 శాతం మేరకు పెంచాలన్నారు. ఎకై ్సజ్ చట్టం– 2005కు చేసిన సవరణను పునర్ పరిశీలించాలన్నారు. ఎంఎస్ఐఎల్ అనుమతుల గురించి న్యాయంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఇష్టానుసారంగా మద్యం ధరలను పెంచరాదని వారు డిమాండ్ చేశారు. సంఘం అధ్యక్షుడు హనుమంతసా నిరంజన, ఉపాధ్యక్షులు మహేష్ శెట్టి, గౌరవ కార్యదర్శి సంబాజీ కలాల్, కోశాధికారి వెంకటేష్ ఆర్ నిరంజన, సహకార్యదర్శి హెచ్బీ.గిరిరెడ్డి, రాష్ట్ర సమితి కోశాధ్యక్షుడు, పీఎం మెహరవాడే తదితరులు పాల్గొన్నారు. -
బస్సు పల్టీ.. 50 మందికి గాయాలు
తుమకూరు: కేఎస్ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పల్టీ కొట్టడంతో 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈఘటన తుమకురు జిల్లా పావగడ సమీపంలోని శివరామ గ్రామంలో జరిగింది. శుక్రవారం వేకువజామున 4.30 గంటల సమయంలో 63 మంది ప్రయాణికులతో పావగడ నుంచి బెంగళూరు బయల్దేరిన బస్సు శివరామ గ్రామం వద్దకు రాగానే అతి వేగం వల్ల అదపు తప్పి పల్టీలు కొట్టింది. దీంతో ప్రయాణికులు బస్సు బయటకు చెల్లా చెదురుగా విసిరివేయబడ్డారు. భయాందోళనకు గురైన ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. అయితే 50 మందికి స్వల్పగాయాలు కాగా పావగడ, మడకశిర ఆస్పత్రులకు తరలించారు. సీఎం ఇంటి ముందు బైక్ వీలింగ్ కృష్ణరాజపురం: ముఖ్యమంత్రి సిద్దరామయ్య నివాసం ముందు ఓ వ్యక్తి బైక్ వీలింగ్ చేస్తుండగా హైగ్రౌండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 28వ తేదీ రాత్రి సదరు బైకిస్టు ముఖ్యమంత్రి నివాసం ముందు నుంచి బీడీఏ రోడ్డు వరకు వీలింగ్ చేసుకుంటూ వెళ్లాడు. బైకు నంబర్ ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉసురు తీసిన అనారోగ్యం ● ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య తుమకూరు: అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన తుమకూరు జిల్లా గుబ్బి తాలూకాలోని నిట్టూరు సమీపంలోని ఆదళగెరె గ్రామంలో జరిగింది. చేళూరు పోలీసు స్టేషన్ పరిధిలోని ఆదళగెరె గ్రామంలో మహాదేవయ్య, విజయలక్ష్మి(45) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చూడామణి(23), నరసింహమూర్తి(14) అనే సంతానం ఉంది. విజయలక్ష్మి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతోంది. తాను అనారోగ్యంతో మృతి చెందితే తన ఇద్దరు పిల్లలలను ఎవరు పెంచుతారని ఇటీవల బాధపడింది. ఈక్రమంలో భర్త ఇంటిలో లేని సమయంలో గురువారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో తల్లీపిల్లలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. చేళూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఖరీదైన ఫోన్.. ప్రాణం తీసింది దొడ్డబళ్లాపురం: ఖరీదైన ఫోన్ ఎందుకు కొన్నావని తండ్రి మందలించడంతో మనస్తాపంతో కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బెళగావి పట్టణంలో జరిగింది. న్యూ వైభవ్ నగర్ నివాసి అబ్దుల్ రషీద్ షేక్(24) ఈఎంఐ పెట్టి రూ.70వేలు విలువ చేసే స్మార్ట్ఫోన్ కొనుగోలు చేశాడు. అంత ధర పెట్టి సెల్ఫోన్ ఎందుకు కొనాల్సి వచ్చిందని తండ్రి ప్రశ్నించాడు. మనో వేదనకు గురైన రషీద్ తన ఇంటిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం ఎంతసేపైనా తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు బద్దలుకొట్టి చూడగా ఉరివేసుకున్న విషయం తెలిసింది. ఏపీఎంసీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వాహ్..హంపీ అద్భుతం ● చరిత్రాత్మక సుగ్రీవ గుహల్లో గవర్నర్, మంత్రుల సందర్శన హొసపేటె: గవర్నర్ ఽథావర్చంద్ గెహ్లాట్ శుక్రవారం హంపీలోని చరిత్రాత్మక సుగ్రీవ గుహలను సందర్శించారు. గవర్నర్ వెంట ఉన్నత విద్యా మంత్రి డాక్టర్ ఎంసీ సుధాకర్, విజయనగర జిల్లాధికారి దివాకర్, జిల్లా ఎస్పీ శ్రీహరిబాబు పాల్గొన్నారు. సందర్శన సమయంలో రామాయణంలో ప్రముఖ స్థానాన్ని కలిగిన, కర్ణాటక విలువైన వారసత్వానికి ఒక మైలురాయిగా ఉన్న ఈ ప్రాంత సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారు. -
మేలుకోటెలో ఘనంగా గరుడ ధ్వజారోహణ
మండ్య: జిల్లాలోని మేలుకోటెలో వెలసిన చరిత్ర ప్రసిద్ధ చెలువ నారాయణ స్వామివారి వైరముడి బ్రహోత్సవం సందర్భంగా దేవానుదేవతలను వేడుకలకు ఆహ్వానిస్తూ ఇష్టరథం కరుణించాలని ప్రార్థిస్తూ శుక్రవారం గురుడ ధ్వజారోహణ ఘనంగా నిర్వహించారు. ఉదయం సుమారు 9.30 గంటలకు గరుడ దేవుడి పటంలో ప్రతిష్టాపన చేసి ధ్వజారోహణ పూజలు నిర్వహించారు. 3వ స్థానం నుంచి గరుడ నామ మంత్ర పఠనం నిర్వహించారు. మండ్య జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఎన్ చెలువరాయ స్వామి కుమారుడు సచిన్ దంపతులు పాల్గొని ధ్వజారోహణ పూజలు నిర్వహించారు. అనంతరం గురూజీ మార్గదర్శనంలో చెలువనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. -
సువర్ణరథంలో బాహుబలి ఊరేగింపు
బొమ్మనహళ్లి: శ్రవణబెళగొళలో భగవాన్ బాహుబలి స్వామివారి 1,044వ ప్రతిష్టాపన వేడుకల సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తిని సువర్ణ రథంపైన ఏర్పాటు చేసి ఊరేగింపు నిర్వహించారు. క్షేత్ర పీఠాధిపతి స్వస్తిశ్రీ అభినవ చారుకీర్తి భట్టారక స్వామీజీ గురువారం రాత్రి శ్రీఫలం అర్పించి ఊరేగింపు ప్రారంభించారు. రథం మధ్య భాగంలో ఉత్సవమూర్తిని ప్రతిష్టాపన చేసి చుట్టు అష్టమంగళం ఏర్పాటు చేశారు. సువర్ణ రథం మొత్తం విద్యుత్ కాంతుల వెలుగులు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర ముందు భాగంలో నూతనంగా అర్పించిన రజత దండలు గౌరవ రజతం, చామర మాలలతో ఆకట్టుకున్నాయి. కన్యాశ్రమానికి చెందిన బాలికలు, విద్యాపీఠం బాల బ్రహ్మచారులు ధర్మధ్వజాలు పట్టుకొని సాగారు. వివిధ మంగళ వాయిద్యాల మధ్య మంగళూరు చెండె వాయిద్యం, అరసికెరె చిట్టిమేళ సంగీతం, యువతీ యువకుల నృత్యాలు చేయగా శ్రావణ బాలురు భగవాన్ బాహుబలి స్వామికీ జై అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఊరేగింపు జైన మఠం వద్ద నుంచి భండరి బసది చుట్టు మైసూరు కోనేరు, బెంగళూరు రోడ్డు గుండా ముందుకు సాగింది. అక్కడి నుంచి నేరుగా జైన మఠానికి చేరుకుంది. ఘనంగా 1,044వ ప్రతిష్టాపన దినోత్సవం -
పార్టీ ఆఫీసులో బీజేపీ కార్యకర్త అత్మహత్య
యశవంతపుర: తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని ఆరోపిస్తూ కొడగు జిల్లా సోమవారపేటె తాలూకా గోణిమరూరుకు చెందిన బీజేపీ కార్యకర్త వినయ్ సోమయ్య(35) డెత్నోటు రాసి బెంగళూరు నాగావరలోని పార్టీ కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. ఇతను ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఒక పోస్టింగ్ అప్లోడ్ చేశాడు. అది అపహస్యంగా ఉందంటూ కాంగ్రెస్ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మడికేరి పోలీసులు వినయ్ సోమయ్యపై కేసు నమోదు చేశారు. దీంతో అరెస్ట్ కాకుండా వినయ్ సోమయ్య ముందుస్తు బెయిల్ తీసుకున్నారు. అయితే గురువారం రాత్రి వినయ్ సోమయ్య డెత్నోటును సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి శుక్రవారం వేకువజామున ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను మ్యాన్ పవర్ సప్లే సంస్థలో అతను పని చేస్తున్నట్లు తెలిసింది. భార్య, పిల్లలున్నారు. తన మృతికి విరాజపేట ఎమ్మెల్యే పొన్నణ్ణ, అతడి అప్తుడు తన్నీరా మహినా కారణమని వినయ్ డెత్నోటులో వివరించారు. రాజకీయ ద్వేషంతో తన జీవితంతో చెలగాటమాడారని, బెంగళూరులో ఉద్వోగం చేస్తున్న తనపై మడికేరిలో రౌడీషీట్ తెరవాలని ప్రయత్నాలు చేశారంటూ పేర్కొన్నాడు. వినయ్ సోమయ్య మృతిపై డీసీపీతో విచారణ చేయిస్తామని హోంమంత్రి డాక్టర్ పరమేశ్వర్ తెలిపారు. తప్పు చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నాకు సంబంధం లేదు వినయ్ సోమయ్య ఎవరో తనకు తెలియదని సీఎం న్యాయ సలహాదారుడు, ఎమ్మెల్యే ఏఎస్ పొన్నణ్ణ స్పష్టం చేశారు. తాను ఏవరినీ వేధించలేదన్నారు. బీజేపీ నాయకులకు చేయటానికి పనిలేక నాపై అరోపిణలు చేస్తున్నట్లు అరోపించారు. కాగా వినయ్ ఏవరో తెలియదని, సామాజీక మాధ్యమాలలో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా చేసిన పోస్ట్పై పోలీసులకు ఫిర్యాదు చేశానని ఎమ్మెల్యే అప్తుడు తన్నీరా మహినా తెలిపారు. ఎమ్మెల్యేపై ఫిర్యాదు బీజేపీ కార్యకర్త వినయ్ డెత్నోటులో పేర్కొన్న కొడగు కాంగ్రెస్ ఎమ్మెల్యే పొన్నణ్ణ, మంథర్గౌడతో పాటు రాజీవ్గాంధీ పంచాయతీరాజ్ సంఘటన జిల్లా అధ్యక్షుడు తన్నీరా మహినాపై బెంగళూరు హెణ్ణూరు పోలీసులకు మృతుడు వినయ్ సోదరుడు జీవన్ సోమయ్య ఫిర్యాదు చేశారు. నాగావరలో ఘటన మృతుడు సోమవారపేటె తాలూకా గోణిమరూరు వాసి విరాజపేట ఎమ్మెల్యే పొన్నణ్ణ, అతని అప్తుడు తన్నీరా కారణమని డెత్నోట్కొడుగుకు మృతదేహం తరలింపు మృతుడు వినయ్ సోమయ్య మృతదేహానికి శుక్రవారం బెంగళూరులో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. సోమవారపేటె తాలూకా గోణిమరూరులో శనివారం వినయ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వినయ్ అత్మహత్యను ఖండిస్తూ కొడగు జిల్లా వ్యాప్తంగా బీజేపీ అందోళననలు చేపట్టింది. -
రిటైర్డ్ ఉద్యోగుల ధర్నా
రాయచూరు రూరల్: కేంద్ర ప్రభఽుత్వం బీఎస్ఎన్ఎల్ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సవరించిన పెన్షన్ను పరిశీలించాలని కోరుతూ పదవీ విరమణ చేసిన బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. గురువారం బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు బసవరాజ్ మాట్లాడారు. ప్రభుత్వం 1972 నుంచి అమలులో ఉన్న పెన్షన్ను సవరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనలో కర్లి, ఆదెప్ప, సోమనరెడ్డి, సిద్దప్ప, గురురాజరావ్, ఉక్కలి, లాలప్పలున్నారు. రిమ్స్లో అన్ని సౌకర్యాలు సిద్ధం రాయచూరు రూరల్ : రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్) ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో రోగులకు అన్ని సౌకర్యాలు సిద్ధం చేసినట్లు జిల్లాధికారి నితీష్ పేర్కొన్నారు. గురువారం ఆస్పత్రిని తనిఖీ చేసిన అనంతరం వైద్యులతో మాట్లాడారు. కళ్యాణ కర్ణాటక జిల్లాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి అధికంగా వచ్చే రోగులందరికీ సమానంగా వైద్యం అందిస్తారన్నారు. ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలతో కూడిన వైద్య పద్ధతులను ఏర్పాటు చేశామన్నారు. చిన్న పిల్లల చికిత్స కోసం ప్రత్యేకంగా 20 పడకలను పెంచాలన్నారు. రోగులకు ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందించాలన్నారు. రిమ్స్ వైద్యాధికారి డాక్టర్ రమేష్, విజయ శంకర్, జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్ర బాబు, ఆర్సీహెచ్ అధికారిణి నందిత, భాస్కర్, టీహెచ్ఓ ప్రజ్వల్ కుమార్లున్నారు. సమస్యలు తీర్చాలని ధర్నారాయచూరు రూరల్: జిల్లాలోని మాన్వి తాలూకా గోర్కకల్ పంచాయతీ పరిధిలోని గవిగట్టలో నెలకొన్న సమస్యలపై గ్రామ పంచాయతీ అధికారులు స్పందించడం లేదని రైతు సంఘం జిల్లా సంచాలకురాలు అనిత ఆరోపించారు. బుధవారం రాత్రి పంచాయతీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. గ్రామంలో గత 15 రోజుల నుంచి తాగునీరు, విద్యుత్ సరఫరా, మరుగుదొడ్లు, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. -
రంగస్థల కళాకారులకు సన్మానం
బళ్లారిటౌన్: నాడోజ బెళగల్ ఈరణ్ణ ద్వితీయ వర్ధంతి సందర్భంగా గురువారం సీనియర్ రంగస్థల కళాకారులను సన్మానించారు. సంగనకల్లు గ్రామంలోని ఆదర్శ వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా బెళగల్ ఈరణ్ణ కుమారుడు మల్లికార్జున నేతృత్వంలో కళాకారుల బృందం నగరంలోని సీనియర్ కళాకారిణులు సుజాతమ్మ, కణేకల్ రంగమ్మ, కళాకారుడు చెన్నబసప్పల ఇళ్లకు వెళ్లి సన్మానించారు. సీనియర్ కళాకారులు హెచ్ఎన్ చంద్రశేఖర్, మోకా రామేశ్వర్, కే.జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.బాధ్యతల స్వీకారంహొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె తాలూకా నూతన ఇన్చార్జి బీఈఓగా శేఖర్ హొరపేటె గురువారం అధికార బాధ్యతలు చేపట్టారు. ఇంతకు ముందు బీఈఓగా ఉన్న చిన్నబసప్ప రిటైర్డ్ కావడంతో ఆయన స్థానంలో ఇన్చార్జి బీఈఓగా శేఖర్ హొరపేటెను నియమిస్తూ జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. నూతన అధికారిని ఉపాధ్యాయ సంఘం నేతలు సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షురాలు సుధాదేవి, కార్యదర్శి మల్లయ్య, వరప్రసాద్, విజయకుమారి, కుబేరాచారి, మార్గదప్ప, ప్రకాష్, హేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.విద్యుత్ తీగ తెగి పడి ఉపాధ్యాయిని మృతిహొసపేటె: స్కూల్కి వెళ్తుండగా విద్యుత్ తీగ తెగి మీద పడటంతో పాఠశాల ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన గురువారం జరిగింది. కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలోని జంగమర కల్గుడిలో పాఠశాలకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తెగి ఆమైపె పడటంతో ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే మృతి చెందింది. మరణించిన ఉపాధ్యాయురాలిని జంగమర కల్గుడి గ్రామం హొసకేర రోడ్డుకు చెందిన హరిత శ్రీనివాస్(26)గా గుర్తించారు. ఆమె విద్యానగర్లోని శ్రీగొట్టిపాటి వెంకటరత్నం మెమోరియల్ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు.అభివృద్ధి పనులకు భూమిపూజరాయచూరు రూరల్: నగరాభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని విధాన పరిషత్ సభ్యుడు వసంత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం దేవదుర్గలో బాబూ జగ్జీవన్ రాం భవనంలో మౌలిక సౌకర్యాలకు రూ.52 లక్షలతో రక్షణ గోడ, మరుగుదొడ్డి, స్నానపు గదుల నిర్మాణ పనులకు భూమిపూజ చేసి మాట్లాడారు. జగీజవన్రాం భవన్ను సుందరంగా తీర్చిదిద్దడానికి పాటు పడతామన్నారు. ఈ సందర్భంగా జిల్లాధ్యక్షుడు బసవరాజ్ పాటిల్, అజీజ్, అస్లాంపాషా, సత్యనాథ్లున్నారు.పేదల స్థలం కబ్జాపై చర్యలేవీ?బళ్లారి అర్బన్: బళ్లారి గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 32వ వార్డు బండిహట్టిలో పురాతన దళితుల బావిని, చుట్టు పక్కల స్థలాన్ని అక్రమంగా కబ్జాకు పాల్పడిన వారి నుంచి ఆ స్థలాన్ని రక్షించాలని కోరుతూ బండిహట్టి నుంచి జిల్లాధికారి కార్యాలయం వరకు కర్ణాటక ఏకీకరణ రక్షణ సేన సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పీ.శేఖర్ నేతృత్వంలో భారీ ఆందోళన ర్యాలీ చేపట్టారు. ఆ సంఘం జిల్లాధ్యక్షుడు కృష్ణ వాల్మీకి, మహిళా జిల్లాధ్యక్షురాలు లక్ష్మిదేవి, పద్మావతి, ఆ వార్డు శాఖ పదాధికారులు పేదలకు అండగా పాదయాత్రతో అదనపు జిల్లాధికారికి వినతిపత్రం అందజేసి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. సంఘం ప్రముఖురాలు రోహిణి, ఈరమ్మ, మల్లికార్జున, రమేష్, బసవరాజ్, నీలప్ప, విరుపాక్షిరెడ్డి, గోవింద, తదితరులు పాల్గొన్నారు. -
రేణుకా యల్లమ్మ రథోత్సవం
బొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లాలోని ఆనేకల్ తాలూకాలోని సర్జాపురలో గ్రామ దేవత శ్రీరేణుకా యల్లమ్మ దేవి ఆలయ బ్రహ్మ రథోత్సవం గురువారం నేత్రపర్వంగా జరిగింది. తెల్లవారుజామునే అమ్మవారి మూల విరాట్తో పాటు ఉత్సవమూర్తికి ప్రత్యేక అలంకారం చేసి పూజలు నిర్వహించారు. రాజేశ్వర శివాచార్య స్వామి, తమిళనాడు శివానందశివాచార్య స్వామి విశేష పూజల్లో పాల్గొన్నారు. ఉత్సవమూర్తులను తేరులో ఆసీనుల్ని చేసి రథాన్ని లాగారు. ప్రముఖ వీధుల్లో కోలాహలం మధ్య తేరు ఊరేగింది. వివిధ జానపద కళాకారుల ప్రదర్శనలు, డప్పు వాయిద్యాలు అలరించాయి. సర్జాపురలో కోలాహలం -
పాస్టర్ మృతిపై సీబీఐ విచారణకు డిమాండ్
రాయచూరు రూరల్: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సీబీఐతో విచారణ జరపాలని కల్వరి పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జాన్వెస్లీ వెల్లడించారు. గురువారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్ను హత్య చేయించి దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి సువార్త స్వస్థత కూటమి సమావేశాలకు పాస్టర్ వెళుతుండగా కోవ్వూరు టోల్గేట్ వద్ద ఈ ప్రమాదం జరిగిందన్నారు. పాస్టర్ వాహనానికి ఎలాంటి ముప్పు వాటిల్లకపోయినా పాస్టర్ తలకు బలంగా దెబ్బలు తగిలాయన్నారు. తలకు ఉన్న హెల్మెట్కు ఏమీ కాలేదన్నారు. పాస్టర్ను రాజకీయ కక్షతో హత్య చేశారని, అతని మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ అదనపు జిల్లాధికారి శివానంద ద్వారా వినతిపత్రం సమర్పించారు. -
ఎయిమ్స్కు కేంద్రంపై ఒత్తిడి తెండి
రాయచూరు రూరల్: రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటు విషయంలో రాజకీయాలు చేయకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎయిమ్స్ పోరాట సమితి ప్రధాన సంచాలకుడు బసవరాజ్ కళస డిమాండ్ చేశారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఎంపీలు, రాజ్యసభ సభ్యుల పూర్తి మద్దతు లభించినా రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొండి చెయ్యి చూపడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్, దేశంలో బీజేపీ సర్కార్ కలిసి రాయచూరులో మహాత్మగాంధీ మైదానంలో చేపట్టిన ఆందోళన 1057వ రోజుకు చేరిందన్నారు. రాజకీయ నాయకుల చిత్తశుద్ధి కొరతతో మంజూరుకు అడ్డు తగులుతున్నారని ఆరోపించారు. అశోక్ కుమార్ జైన్, సంతోష్ కుమార్, వినయ్ కుమార్, శాంతనగౌడలున్నారు. -
రాజధానిని ముంచెత్తిన భారీ వాన
బనశంకరి: రాజధాని బెంగళూరును వేసవి వర్షాలు ముంచెత్తాయి. గురువారం మధ్యాహ్నం గాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షం రాకతో వేసవి వేడి కాస్త తగ్గి వాతావరణం చల్లబడింది. గత రెండురోజులుగా నగరంలో మబ్బులతో కూడిన వాతావరణం ఉన్నప్పటికీ వర్షం పడలేదు. గురువారం ఉదయం నుంచి మేఘావృతమైంది, మధ్యాహ్నం 2 గంటలకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో వర్షం ఆరంభమైంది. ఈ ప్రాంతాలలో అధికం హెబ్బాళ, ఆర్టీ.నగర, యలహంక, సదాశివనగర, శివానంద సర్కిల్ తో పాటు అనేక ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. నగర కేంద్రభాగాలైన మెజస్టిక్, ఎంజీ.రోడ్డు, కబ్బన్పార్కు, బసవనగుడి, శ్రీనగర, మైసూరురోడ్డు, బనశంకరి, జేపీ.నగర, పుట్టేనహళ్లి, హలసూరు. హెచ్ఏఎల్ విమానాశ్రయం, యశవంతపుర, పీణ్యా, తుమకూరు రోడ్డు, విజయనగర, రాజాజీనగర తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. వాహనదారులు గంటలకొద్దీ రోడ్లపై చిక్కుకుపోయారు. సాయంత్రం ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. కొన్నిచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాహనాలపై కూలిన చెట్టు రాజాజీనగరలో గాలీ వానకు పెద్ద చెట్టు కూలి స్కార్పియో, స్విఫ్ట్ కారుతో పాటు పక్కన నిలిపిన బైక్లపై పడడంతో దెబ్బతిన్నాయి. ట్రాఫిక్ నిలిచిపోవడంతో పాలికె, కేఈబీ సిబ్బంది చేరుకుని చెట్టును తొలగించారు. ఈజీపుర మెయిన్రోడ్డులో కట్టడంలోని గ్రౌండ్ ఫ్లోర్లోకి నీరు చేరింది. లోపల ఉన్న కార్లు, బైకులు పాక్షికంగా మునిగిపోయాయి. బీటీఎం లేఔట్లో రోడ్లు జలమయం అయ్యాయి. లులు మాల్ ఎదురుగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. బెంగళూరు నుంచి తుమకూరుకు వెళుతున్న కేఎస్ఆర్టీసీ బస్కు యాక్సిల్ కట్ కావడంతో వర్షంలో రోడ్డుపై నిలిచిపోయింది. ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి పోలీసులు, స్థానికులు బస్ను ముందుకు తోసి రోడ్డు పక్కకు చేర్చారు. వర్షంలో వాహనదారులు, ప్రయాణికులు సతమతమయ్యారు. ఎండల నుంచి ఉపశమనం రాష్ట్రంలో మండుతున్న ఎండలతో ప్రజలు బెంబేలెత్తిన తరుణంలో నైరుతి రుతుపవన వర్షాలకు ముందే బెంగళూరుతో సహా కొన్ని జిల్లాలలో వానలు పడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలో రానున్న నాలుగురోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. కరావళి, దక్షిణ ఒళనాడులోని కొన్ని జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, శివమొగ్గ, చిక్కమగళూరు, మైసూరు, బెంగళూరు, హాసన, కొడగు, చామరాజనగర తో పాటు అనేకచోట్ల వర్షాలకు ఆస్కారం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ని జారీ చేసింది. హంపీలో విజయ విఠల ఆలయం సౌందర్యంరాతి రథం, ఇతర స్మారకాల ప్రతిబింబాలువర్షంలో హంపీ అందం రాయల రాజధాని హంపీలో జోరువాన కురిసింది. చారిత్రక శిల్ప కళా కట్టడాలు వాననీటిలో సుందర ప్రతిబింబాలయ్యాయి. పర్యాటకులు ఫోటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. కోలారు, బెళగావి తదితర ప్రాంతాల్లోనూ వర్షం కురిసి ఎండ నుంచి ఉపశమనం ఇచ్చింది. ఆకస్మిక వర్షంతో రోడ్లు జలమయం పలుచోట్ల ట్రాఫిక్ అస్తవ్యస్తం ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం