పొంచి ఉన్న జలక్షామం | - | Sakshi
Sakshi News home page

పొంచి ఉన్న జలక్షామం

Apr 2 2025 12:23 AM | Updated on Apr 2 2025 12:23 AM

పొంచి

పొంచి ఉన్న జలక్షామం

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ప్రధాన జలాశయాలన్నీ నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. మార్చి నెలాఖరు నాటికి భారీ, మధ్య తరహా జల వనరులు ఎండిపోయాయి. ఈ ఏడాది వేసవి తాపం అధికంగా ఉంది. ఏప్రిల్‌, మే నెలలో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. మలప్రభ, ఘటప్రభ, తుంగభద్ర, కృష్ణా నదుల్లో నీటి నిల్వలు కనీస స్థాయికి దిగజారాయి. ఉత్తర కర్ణాటక, కళ్యాణ కర్ణాటకలో జలక్షామంతో నీటి ఎద్దడి నెలకొనే పరిస్థితి ఏర్పడింది. విజయపుర జిల్లాలోని ఆల్మట్టి డ్యాంలో ఆశించినంత మేర నీరు అందుబాటులో లేదనే విషయం తేటతెల్లమైంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది జలాశయంలో నీటి నిల్వ తక్కువగా ఉంది.

పల్లెల్లో దాహాకారాలు

డ్యాం గరిష్ట నీటిమట్టం 519.60 మీటర్లు, నీటి నిల్వ సామర్థ్యం 123.081 టీఎంసీలు కాగా ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 490.70 మీటర్లు, నీటి నిల్వ 32.400 టీఎంసీలు ఉంది. డెడ్‌ స్టోరేజీ 10.600 టీఎంసీలు పోను మిగిలిన 21.800 టీఎంసీల నీరు నిల్వ ఉన్నాయి. కళ్యాణ కర్ణాటకలోని కొప్పళ, బీదర్‌, యాదగిరి, కలబుర్గి, రాయచూరు, ఉత్తర కర్ణాటకలోని ధార్వాడ, బెళగావి, బాగల్‌కోటె, గదగ్‌ జిల్లాల్లో తాగునీటి పథకాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. గతంలో వానలు కురువక పోవడంతో కళ్యాణ కర్ణాటకలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొంది. కలబుర్గి జిల్లాలో ఘటప్రభ, మలప్రభ, బెణ్ణెతోర, అమర్జా, భీమా నదులున్నా తాగునీటికి తిప్పలు తప్పడం లేదు. రాయచూరు జిల్లాలోని లింగసూగూరు తాలూకా యరగుంటె, సింధనూరు తాలూకా మల్లనగుడ్డల్లో ట్యాంకర్లతో నీటి సరఫరా చేపడుతున్నారు.

15 జిల్లాలకు తప్పని నీటి గండం

పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం

మౌనం వహించిన ప్రజాప్రతినిధులు

పొంచి ఉన్న జలక్షామం1
1/3

పొంచి ఉన్న జలక్షామం

పొంచి ఉన్న జలక్షామం2
2/3

పొంచి ఉన్న జలక్షామం

పొంచి ఉన్న జలక్షామం3
3/3

పొంచి ఉన్న జలక్షామం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement