అంబేడ్కర్‌ క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌ పోటీలు ప్రారంభం | - | Sakshi

అంబేడ్కర్‌ క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌ పోటీలు ప్రారంభం

Apr 8 2025 10:54 AM | Updated on Apr 8 2025 10:54 AM

అంబేడ్కర్‌ క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌ పోటీలు ప్రారంభం

అంబేడ్కర్‌ క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌ పోటీలు ప్రారంభం

బళ్లారిఅర్బన్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 134వ జయంతి సందర్భంగా బళ్లారిలో తొలిసారిగా అంబేడ్కర్‌ క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌–2025 సీజన్‌–1 పోటీలు విమ్స్‌ మైదానంలో సోమవారం ప్రారంభం అయ్యాయి. ఈ పోటీలు ఈనెల 14వ తేదీ వరకు జరగనున్నాయి. జీకే ఫౌండేషన్‌, జీకే గ్రూప్‌ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ పోటీలను యువనేత కట్టెస్వామి ప్రారంభించి మాట్లాడారు. నగరంలో తొలి సారిగా భారీ స్థాయిలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ జయంతి వేళ పోటీలను నిర్వహించడం హర్షనీయం అని జట్టు యజమానిని, క్రీడాకారులను అభినందించారు. ప్రముఖురాలు మల్లేశ్వరి, నిర్వాహకులు చంద్రన్న మాట్లాడుతూ ఈ టోర్నీలో 14 జట్లు పేర్లు నమోదు చేసుకున్నాయన్నారు. 8 రోజుల పాటు పోటీలు జరుగుతాయన్నారు. ఫైనల్‌ పోటీ ఈ నెల 14న అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా నిర్వహిస్తామన్నారు. క్రికెట్‌ పోటీల నిర్వాహకులు మహేష్‌ కురువళ్లి, కే.వెంకటేష్‌, ఏకే.తిప్పయ్య, ఎస్‌.ప్రకాష్‌, రత్తయ్య, శివరామ, గురు, దుర్గప్రసాద్‌, హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement