బళ్లారిటౌన్: పురోహితులు ఐక్యతతో ఉంటే ప్రభుత్వ సదుపాయాలను పొందవచ్చని అఖిల భారత అసంఘటిత పురోహిత కార్మిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జే.శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. గురువారం సత్యనారాయణ పేటలోని సత్యనారాయణ ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మనమందరం భేదభావాలను విడనాడి ఐక్యతతో ఉంటే ప్రభుత్వాలు మనలను గుర్తిస్తాయన్నారు. బ్రాహ్మణ సముదాయం రాత్రింబగళ్లు శ్రమిస్తుందన్నారు. మన సమస్యలపై రాష్ట్ర స్థాయిలో పోరాటాలను చేపట్టాల్సి ఉందన్నారు. బెంగళూరులో జరిగే ఫ్రీడం పార్కులో అహోరాత్రి ధర్నాలో అందరూ ప్రామాణికంగా పాల్గొనాలన్నారు. ఇంత వరకు 18 వేల మంది అర్చకులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, ఇంకా నమోదు చేసుకోవాల్సి ఉందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్లాడ్ను కలిసి తమ సమస్యలపై చర్చిస్తామన్నారు. సంస్థాపక జాతీయ అధ్యక్షుడు అనంతమూర్తి, ప్రధాన కార్యదర్శి మహేష్కుమార్, నేతలు సతీష్, అరుణ్కుమార్ శర్మ, వేణుగోపాల్ శర్మ, ద్వారకనాథ్, కేశవ వర్మ, హేమంత్కుమార్, మంజునాథ్ భట్ తదితరులు పాల్గొన్నారు.