శివాజీనగర: అప్పా, అమ్మా నన్ను క్షమించండి.. అని డెత్నోట్ రాసి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నగరంలోని బెంగళూరు విశ్వవిద్యాలయం (జ్ఞానభారతి) మహిళా హాస్టల్లో ఈ సంఘటన జరిగింది. మైసూరు జిల్లా హెచ్డీ కోట హెబ్బలగుప్పహళ్లికి చెందిన హెచ్.ఎన్ పావన (23) మృతురాలు. ఆమె కన్నడ అధ్యయన కేంద్రంలో పీజీ ఫైనలియర్ చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం హాస్టల్లో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. స్థానిక పోలీసులు చేరుకొని గాలించగా డెత్నోట్ లభించింది. అందులోని అంశాలను గోప్యంగా ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment