karnataka
-
సద్గురు ఈవెంట్కు డీకే.. ఉలిక్కిపడ్డ కాంగ్రెస్
బెంగళూరు: మహా శివరాత్రి సందర్బంగా నిన్న(బుధవారం) కోయంబత్తూరులో జగ్గీ వాసుదేవ్(సద్గురు) నిర్వహించిన ఈవెంట్ కు కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ కీలక నేత డీకే శివ కుమార్ హాజరుకావడం ఆ పార్టీలో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ఆ ఈవెంట్ కు సద్గురుతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో డీకే శివకుమార్ స్టేజ్ షేర్ చేసుకున్నారు. దీనికి కర్ణాటక కాంగ్రెస్ తో పాటు జాతీయ కాంగ్రెస్ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావాజాలాలతో ఏర్పాటు చేసిన సద్గురు ఈవెంట్ కు డీకే శివ కుమార్ వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందనేది కాంగ్రెస్ ప్రశ్నగా ఉంది.దీనిపై ఏఐసీసీ సెక్రటరీ పీవీ మోహన్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’లో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. శివ కుమార్ ట్యాగ్ చేసి మరీ పీవీ మోహన్ వివరణ అడిగారు. కాంగ్రెస్ సీనియర్ రాహుల్ గాంధీని పదే పదే విమర్శించే వారి ఈవెంట్ వెళ్లడమే కాకుండా, అందుకు థాంక్యూ చెప్పడాన్ని ఇక్కడ పీకే మోహన్ ప్రశ్నించారు.రాహుల్ చెప్పేది అదే.. అలా ఉంటే పార్టీని వదిలేయండని..శివ కుమార్ టార్గెట్ చేస్తూ చేసిన పోస్ట్ పై పీకే మోహన్ వివరణ ఇచ్చారు. ‘ నేను ఇక్కడ ఎవర్నీ విమర్శించడం లేదు. శివ కుమార్ భావజాలంపై నా అభిప్రాయం ఏమిటో నేను చెప్పాను. జగ్గీవాసుదేవ్ భావజాలం.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ల భావజాలమే. దీనికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకం. మాది సెక్యులర్ పార్టీ. మా నాయకుడు రాహుల్ గాంధీ పదే పదే చెప్పేది కూడా అదే. ఎవరైనా ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉంటే పార్టీని వదిలేయొచ్చని చెబుతూనే ఉన్నారు. అదే నేను నా పోస్ట్ ద్వారా తెలియజేశాను’ అని పీకే మోహన్ పేర్కొన్నారు. Thanking for an invitation from someone who mocks RG, the hope of the nation&aligns with RSS’s narratives,while serving as a president of a secular party, it misleads party workers. It is Conviction rather than compromise ensures the party’s growth. Otherwise, it damages the core pic.twitter.com/x9hnxhbfF6— PV.MOHAN (@pvmohanINC) February 26, 2025 -
పని మాత్రమే కాదు.. నిద్ర కూడా ముఖ్యమే: కర్ణాటక హైకోర్టు
విధి నిర్వహణలో ఒక ఉద్యోగి నిద్రపోవడం తప్పేలా అవుతుందని, సామర్థ్యానికి మించిన పని అప్పగించినప్పుడు మనిషికి విశ్రాంతి కచ్చితంగా అవసరమని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో డ్యూటీలో నిద్రపోయి సస్పెండ్ అయిన ఓ కానిస్టేబుల్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తీర్పు వెల్లడించింది.‘‘ఇవాళ ఈ కానిస్టేబుల్ కావొచ్చు. రేపు మరొకరు కావొచ్చు. మనిషికి నిద్ర సహజం. అలాంటిది మనిషికి నిద్రను దూరం చేస్తే ఎలా?. ఈరోజుల్లో పని-జీవితం మధ్య సమతుల్యం(Worklife Balance)లో నిద్ర-విశ్రాంతి కీలక అంశం. షిఫ్ట్లవారీగా పని చేసినప్పుడు.. ఇలాంటి ఉద్యోగులకు వాటిని దూరం చేస్తే ఎలా?’’ అని జస్టిస్ ఎం నాగప్రసన్న(Justice M Nagaprasanna) ధర్మాసనం వ్యాఖ్యానించింది.వైరల్ వీడియోతో మొదలై..కిందటి ఏడాది మార్చి 23వ తేదీన కల్యాణ్ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో పని చేసే చంద్రశేఖర్ అనే కానిస్టేబుల్ నిద్రపోతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది. ఈ ఘటనపై చంద్రశేఖర్ను ఉన్నతాధికారులు వివరణ కోరారు. వరుస షిఫ్ట్లలో డ్యూటీ చేయడం మూలంగా తన ఆరోగ్యం బాగా దెబ్బతిందని, వైద్యుల సలహా మేరకు మందులు వాడుతున్నానని, వాటి మూలంగానే నిద్ర ముంచుకొచ్చిందని, అయినా తాను 10 నిమిషాలపాటే విశ్రాంతి తీసుకున్నానని వివరణ ఇచ్చారాయన.అయితే కానిస్టేబుల్ వివరణతో అధికారులు సంతృప్తి చెందలేదు. డ్యూటీలో ఉండగా పడుకోవడం తప్పేనని, పైగా ఈ చర్యలో డిపార్ట్మెంట్ ప్రతిష్టకు భంగం వాటిల్లిందని చెబుతూ సస్పెండ్ చేశారు. ఆపై ఘటనపై విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించారు. దీంతో సస్పెన్షన్పై ఆయన హైకోర్టుకు ఆశ్రయించారు.అయితే.. విజిలెన్స్ నివేదికలో ఆసక్తికర విషయం వెల్లడైంది. సదరు విభాగంలో ముగ్గురు కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారని, వరుసగా మూడు షిఫ్ట్లలో పని చేస్తున్నారని.. కాబట్టి వారిపై పని ఒత్తిడి తగ్గించడానికి మరో ఇద్దరిని నియమించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇక ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం(High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్టికల్ 24 ప్రకారం.. ప్రతీ ఉద్యోగికి విశ్రాంతి హక్కు ఉంటుంది. అలాగే వేతనంతో కూడిన కాలానుగుణ సెలవులు తీసుకునే హక్కు కూడా ఉంటుంది. అంతర్జాతీయ కార్మిక సంఘ ఒప్పందాల ప్రకారం.. ప్రతీ ఉద్యోగికి వర్క్-లైఫ్ బ్యాలెన్స్ తప్పనిసరి. షిఫ్ట్లవారీగా పని చేసేవాళ్ల విషయంలో ఇది మరీ అవసరం. అసాధారణ సందర్భాలను మినహాయిస్తే.. రోజుకి 8 గంటలు.. వారంలో 48 గంటలకు పని గంటలు మించకూడదు.ఈ కేసులో పిటిషనర్ విధుల్లో నిద్రపోవడంలో ఎలాంటి తప్పిదం కనిపించడం లేదు. వరుస షిఫ్ట్లలో 16 గంటలపాటు పని చేయడం మూలంగా ఆయన అధిక పని ఒత్తిడితో ఇబ్బంది పడ్డారు. అందుకే నిద్రపోయారు.కాబట్టి, సస్పెన్షన్ సరికాదు. తిరిగి ఆయన్ని విధుల్లోకి తీసుకోవాలి అని జస్టిస్ ఎం నాగప్రసన్న ఆదేశాలు జారీ చేశారు. -
కన్నడ రాజకీయంలో ట్విస్ట్.. కుమారస్వామికి ఝలక్!
శివాజీనగర: కర్ణాటకలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. జేడీఎస్ సీనియర్ నేత, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ. కుమారస్వామిని విచారించేందుకు అనుమతివ్వాలని రాష్ట్ర పోలీసు శాఖ గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్కు విజ్ఞప్తి చేసింది. దీంతో, కన్నడ రాజకీయం హీటెక్కింది.గతంలో బళ్లారి జిల్లాలో శ్రీ సాయి వెంకటేశ్వర మినరల్స్ మైనింగ్ కేసులో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కుమారస్వామి అక్రమాలకు పాల్పడినట్లు ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఆరోపిస్తోంది. దీనిపై ఇప్పటికే ఓ కేసు విచారణలో ఉన్నందున ఆయనను విచారించడానికి అనుమతి ఇవ్వాలని సిట్ బృందం రాజ్భవన్కు లేఖ రాసింది. అయితే చార్జ్షీట్ కన్నడలో ఉందని, ఆంగ్లంలోకి అనువదించి అందజేయాలని రాజ్భవన్ అధికారులు సూచించారు. దీంతో సుమారు 4,500 పేజీల చార్జ్షీట్ను ఇంగ్లీష్లోకి మార్చి సమర్పించారు. ఈ నేపథ్యంలో గరవ్నర్ అనుమతి ఇస్తే సిట్ అధికారుల ముందు కుమారస్వామి విచారణకు హాజరుకావలసి ఉంటుంది. ప్రస్తుతం కర్ణాటకలో కేంద్రమంత్రి కుమారస్వామి, కాంగ్రెస్ సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూముల వ్యవహారంలో సీఎం సిద్ధరామయ్యపై ఆరోపణలు రావడం కన్నడ రాజకీయాలను కుదిపేసింది. ఈ కేసులో సిద్ధరామయ్యకు భారీ ఉపశమనం లభించింది. ఈ భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఆయనకు వ్యతిరేకంగా ఆధారాల్లేవని లోకాయుక్త పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో సీఎంతో పాటు ఆయన సతీమణి పార్వతి, తదితరులకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాల్లేవని తేల్చి చెప్పారు. ఈ అంశంపై తుది నివేదికను హైకోర్టుకు సమర్పించనున్నట్లు సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణకు రాసిన లేఖలో పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో తొలి నలుగురు నిందితులపై వచ్చిన ఆరోపణలకు ఆధారాల్లేకపోవడంతో నిరూపితం కాలేదని తెలిపారు.అక్రమాస్తుల కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు ఊరట లభించిన విషయం తెలిసిందే. 2013-2018 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డీకే శివ కుమార్ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఆదాయానికి మించిన ఆస్తుల్ని కూడబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ ఆరోపణల నేపథ్యంలో ఆయనపై సెప్టెంబరు 2020న సీబీఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. విచారణ ప్రారంభించింది. దర్యాప్తు కొనసాగుతుండగానే ఆ కేసు సీబీఐ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలో లోకాయుక్త పోలీసులకు బదిలీ అయ్యింది. ఈ కేసు విచారణలో భాగంగా డీకే శివకుమార్ గత వారం లోకాయుక్త పోలీసుల ముందు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయనకు ఊరట దక్కింది. -
సగౌరవ మరణం నాప్రాథమిక హక్కు
ఆమె మరణించదలుచుకుంది. ‘సగౌరవంగా మరణించే హక్కును ప్రసాదించండి’ అని 24 ఏళ్ల పాటు పోరాడి ఆ హక్కును సాధించుకుంది. ‘రైట్ టు డై విత్ డిగ్నిటీ’ అనే డిమాండ్తో ‘యుథనేసియా’ ద్వారా ప్రాణం విడువనున్న 85 ఏళ్ల కరిబసమ్మ కొత్త చర్చను లేవనెత్తే అవకాశం ఉంది. ‘మన దేశంలో పేదరికం వల్ల వైద్యం చేయించుకోలేక, వైద్యం లేని జబ్బుల వల్ల కోట్ల మంది బాధపడుతున్నారు. వారికి సగౌరవంగా మరణించే హక్కు ఉంది’ అంటోంది కరిబసమ్మ. వివరాలు....‘రాజ్యాంగం జీవించే హక్కు ఇచ్చినట్టుగానే మరణించే హక్కు కూడా ఇచ్చింది. నేనెందుకు గౌరవంగా మరణించకూడదు? నేను మరణించేందుకు ప్రభుత్వం ఎందుకు సాయపడకూడదు? యుథనేసియా (మెర్సీ కిల్లింగ్) నెదర్లాండ్స్, నార్వే వంటి దేశాల్లో ఉంది. అది ఎక్కువ అవసరమైనది మన దేశంలోనే’ అంటుంది 85 ఏళ్ల కరిబసమ్మ. ‘మెర్సీ కిల్లింగ్’ కోసం 24 ఏళ్లుగా పోరాడుతోందామె. ఇప్పుడు ఆమెకు కర్ణాటక ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఈ మేరకు జనవరి 30న ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేస్తూ రాష్ట్రంలో అనివార్యమైన పరిస్థితుల్లో ఉన్న 70 ఏళ్లకు పైబడిన వారు ‘రైట్ టు డై’ హక్కును ఉపయోగించవచ్చని పేర్కొంది. అయితే ఇతర అనుమతులు కూడా ఓకే అయితేనే రెండు వారాల్లో కరిబసమ్మకు దయామరణం ప్రాప్తించవచ్చు.ఎవరు ఈ కరిబసమ్మ?కర్నాటకలోని దావణగెరెకు చెందిన కరిబసమ్మ రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్. ఇప్పుడు వయసు 85 ఏళ్లు. 30 ఏళ్ల క్రితం ఆమెకు డిస్క్ స్లిప్ అయ్యింది. దాంతో నడవడం ఆమెకు పెద్ద సమస్య అయ్యింది. నొప్పికి తట్టుకోలేక చావే నయం అని నిశ్చయించుకుంది. దాదాపుగా 24 ఏళ్లుగా ఆమె ఇందుకై పోరాడుతోంది. 2010లో పదివేల సంతకాలతో ప్రభుత్వానికి మెమొరాండం సమర్పించింది. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఎందరో అధికారులకు, మంత్రులకు, రాష్ట్రపతికి ఆమె లేఖలు రాసింది. రాష్ట్రపతికి లేఖ రాశాక పోలీసులు వచ్చి ఇందుకు మన దేశంలో అనుమతి లేదని, కనుక పిటిషన్లు పంపవద్దని కోరారు. దాంతో కరిబసమ్మ కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ నువ్వు జైలుకెళితే మా మర్యాద ఏం కాను అని వారు ఆమెను నిలదీశారు. దాంతో ఆమె కేర్ హోమ్కు మారింది. తన పోరాటం కోసం ఇంటిని అమ్మి అందులో ఆరు లక్షలు బి.ఎస్.ఎఫ్ జవాన్ల సంక్షేమానికి ఇచ్చింది. మిగిలిన డబ్బుతో తన పోరాటం సాగించింది. ఇప్పుడు ఆమె కేన్సర్తో బాధ పడుతోంది.2018లో సుప్రీంకోర్టురైట్ టు డై హక్కును సుప్రీంకోర్టు 2018లో అంగీకరించింది. ‘రాజ్యాంగపరంగా మరణించే హక్కు పౌరులకు లభిస్తుంది’ అని చెప్పింది. 2023లో ఎవరు ఏ వయసు, పరిస్థితుల్లో ఉంటే ఇటువంటి విన్నపాన్ని కోరవచ్చో మార్గదర్శకాలను సూచించింది. అయితే కర్నాటక ప్రభుత్వం ఇప్పటి వరకూ సుప్రీంకోర్టు డైరెక్షన్ గురించి దృష్టి పెట్టలేదు. అంటే మెర్సీ కిల్లింగ్ పట్ల సంశయ మౌనం దాల్చింది. కాని కరిబసమ్మ పట్టుదల వల్ల ఇన్నాళ్లకు అనుమతినిచ్చింది.70 ఏళ్లు పైబడి‘70 ఏళ్లు పైబడి, వైద్యపరంగా మందులకు స్పందించని స్థితిలో, సపోర్ట్ సిస్టమ్ మీద ఉంటే అటువంటి వారికి మెర్సీ కిల్లింగ్ గురించి ప్రభుత్వం అనుమతిని పరిశీలిస్తుంది. మనది సభ్య సమాజం. బాధితులను ఎన్నో విధాలుగా ఆదుకోవచ్చు. కాబట్టి అడిగిన వెంటనే మరణించే హక్కుకు అనుమతి లభిస్తుందని ఆశించవద్దు. కరిబసమ్మ విషయంలో కూడా ఆరోగ్యశాఖ ఆమెను పరిశీలించి ఆరోగ్యపరంగా దుర్భర స్థితిలో ఉందని తేల్చితేనే ఆమెకు రైట్ టు డై అనుమతి లభిస్తు్తంది’ అని కర్నాటక ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ప్రాణం తీసుకోవడం పాపం కాదా?‘ఆత్మహత్య, మరణాన్ని కోరుకోవడం ఏ మతమూ అంగీకరించదు. దీనిపై మీరేమంటారు?’ అని కరిబసమ్మను అడిగితే ‘అలా మతాచారాలు, విశ్వాసాలు మాట్లాడేవారు రోడ్డు మీద దిక్కు లేక అనారోగ్యంతో బాధపడే వృద్ధులను తీసుకెళ్లి వాళ్ల ఇళ్లల్లో పెట్టుకోవాలి. అప్పుడు మాట్లాడాలి. అనుభవించేవారికి తెలుస్తుంది బాధ. మన దేశంలో పేదరికంలో ఉన్న వృద్ధులు జబ్బున పడితే చూసే దిక్కు ఉండదు. వాళ్లు మలమూత్రాలలో పడి దొర్లుతుండాలా? వారు సగౌరవంగా మరణించాలని కోరుకుంటే మనం ఆ కోరికను ఎందుకు గౌరవించకూడదు? అన్నారామె. -
ఐఏఎస్ రోహిణి Vs ఐపీఎస్ రూపాల వివాదం మళ్లీ తెరపైకి..!
బెంగళూరు: ఒక మహిళా ఐఏఎస్ ఒక మహిళా ఐపీఎస్ ల మధ్య ఎప్పుడో నాలుగేళ్ల క్రితం మొదలైన వివాదం నేటికి కొనసాగుతూనే ఉంది. కన్నడ నాట ఐఏఎస్ రోహిణి, ఐపీఎస్ రూపా డి ల మధ్య సోషల్ మీడియా వేదికగా ఆరంభమైన రచ్చ కాస్తా గాలివానలా మారింది. ప్రస్తుతం బెంగళూరులో మెజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసు విచారణ సాగుతున్న తరుణంలో వీరి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.ఈ కేసు విచారణలో భాగంగా 2021 జనవరి 15వ తేదీ నుంచి 2023 ఫిబ్రవరి 28వ తేదీ వరకూ వీరి మధ్య సంభాషణను భద్ర పరిచాల్సిందిగా మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు భారతి ఎయిర్ టెల్- రిలయన్స్ జియోలకు ఆదేశాలిచ్చింది. తన వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలు పెట్టి పరువు భంగం వాటిల్లేలా చేసిన కారణంగా రూ. కోటి నష్టపరిహారం ఇవ్వాలని ఐఏఎస్ రోహిణి పట్టుబడుతోంది. అదే సమయంలో తమ ఇద్దరి మధ్య వివాదానికి సంబంధించి కాల్ డేటా రికార్డు(సీడీఆర్)ను ఒక్కసారి పరిశీలించాల్సిందిగా ఐపీఎస్ రూపా డి మెజిస్ట్రేట్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. దీనిలో భాగంగా ఈ కేసు విచారణ బెంగళూరు మెజిస్ట్రేట్ కోర్టు ముందుకు వచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన మెజిస్ట్రేట్ కోర్టు.. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి కాల్ డేటా రికార్డును భద్రపరిచి ఉంచాల్సిందిగా ఇరు టెలికాం సర్వీసులకు ఆదేశాలిచ్చింది.ఐపీఎస్ రూపా డి విచారణకు హాజరుకాకుండా జాప్యం చేస్తున్న కారణంగా ఆమెను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే ప్రక్రియను నిలిపివేయాలంటూ ఐఏఎస్ రోహిణి దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. అదే సమయంలో తమ మధ్య చోటు చేసుకున్న వివాదాన్ని కాల్ డేటా ఆధారంగా పరిశీలించాలని రూపా డి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అందులో 2021 జనవరి 15వ తేదీ నుంచి 2023 ఫిబ్రవరి 28వ తేదీ వరకూ తమ మధ్య సాగిన సంభాషణను పరిశీలించాలని కోరుతూ, ఆ మేరకు టెలికాం సంస్థలకు ఆదేశాలివ్వాలని రూపా డి పేర్కొంది. దాంతో ఈ నెల ఆరంభంలో విచారణ చేపట్టిన బెంగళూరు మెజిస్ట్రేట్ కోర్టు.. తాజాగా వారి మధ్య సాగిన సంభాషణ కాల్ డేటా రికార్డును పొందుపరచాల్సిందిగా సదరు టెలికాం సంస్థలకు ఆదేశాల్లో పేర్కొంది.రాజీ కుదరలేదు..!వీరి మధ్య చోటు చేసుకున్న వివాదం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి స్టేను కూడా విదించింది సుప్రీంకోర్టు. అయితే వీరి మధ్య పరస్పర అంగీకారం కుదరకపోవడంతో ఆ కేసుపై అప్పటివరకూ కొనసాగిన స్టేను గతేడాది సుప్రీంకోర్టు ఎత్తివేసింది.కాగా, సుమారు రెండేళ్ల క్రితంఐఏఎస్ రోహిణికి వ్యతిరేకంగా ఐపీఎస్ రూపా ఫేస్బుక్లో తీవ్ర విమర్శలతో పలు పోస్ట్లు చేశారు. అందులో రోహిణి సింధూరి వ్యక్తిగత ఫొటోలను పోస్ట్ చేసి ఆమె పాల్పడుతున్న అక్రమాలు ఇవీ అని పలు ఆరోపణలను గుప్పించారు. ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఇలా కోర్టుల వరకూ వెళ్లిన కేసు నేటికి పరిష్కారం దొరకలేదు. తన పరువుకు భంగం వాటిల్లేలా చేసినందుకు కోటి రూపాయిలు నష్ట పరిహారం ఇవ్వాల్సిందేనని ఐఏఎస్ రోహిణి పట్టుబడుతుండగా, అసలు వివాదానికి కారణం ఏమిటో ఒక్కసారి కాల్ డేటా రికార్డును పరిశీలిస్తే తెలుస్తుందని రూపా డి అంటున్నారు. -
బెంగళూరులో మహిళపై సామూహిక అత్యాచారం
బెంగళూరు: నగరంలో ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగు చూసింది. ఓ హోటల్లో 33 ఏళ్ల మహిళపై కొంతమంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. క్యాటరింగ్ సర్వ్ చేసే మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జ్యోతి నివాస్ కాలేజ్ జంక్షన్ వద్ద వెయిట్ చేస్తున్న ఆ మహిళను ఓ నలుగురు కుర్రాళ్లు ఫాలో అయ్యారు. వారంతా హోటల్ తీసుకున్నామని, అక్కడకి డిన్నర్ కు భోజనం తీసుకురమ్మని చెప్పారు. దాంతో ఆమె డిన్నర్కు భోజనం తీసుకెళ్లగా వారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.డిన్నర్ చేసిన తర్వాత వారంతా ఆమెను లొంగదీసుకున్నట్లు ఆమె ఫిర్యాదు చేసిందని పోలీసులు పేర్కొన్నారు. ఆ హెటల్ టెర్రాస్ పై కి తీసుకెళ్లి ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారన్నారు. ఈ ఉదయం(శుక్రవారం) ఆరు గంటలకు ఆమెను వదిలేశారన్నారు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు తెలియజేయటంతో పాటు పోలీసులకు చెప్పడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఈ ఘటనలో ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.ఆమెపై అత్యాచారానికి పాల్పడిన నిందితులంతా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ హోటల్లో పని చేయడానికి వచ్చిన వారిగా గుర్తించినట్లు సదరు పోలీస్ అధికారి చెప్పారు. -
దేవుడే దిగి వచ్చినా.. డీకేఎస్ వ్యాఖ్యలపై దుమారం
బెంగళూరు: కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. భగవంతుడే స్వయంగా వచ్చినా బెంగళూరు నగరం బాగుచేయలేడంటూ వ్యాఖ్యానించారాయన. దీంతో ఇటు నగరవాసులు.. అటు రాజకీయ వర్గాలు ఆయనపై మండిపడుతున్నాయి. ‘బెంగళూరు నగరాన్ని రాత్రికి రాత్రే మార్చేయలేం. ఈ మహా నగరం ఏ రెండేళ్లకో, మూడేళ్లకో మారదు. ఒకవేళ దేవుడే తల్చుకున్నా(Even God) అది సాధ్యపడదు. నగరాన్ని బాగు చేయాలంటే.. ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో అది జరగాల్సిందే తప్ప మరో మార్గం లేదు’’ అని శివకుమార్ ఓ వర్క్షాప్లో వ్యాఖ్యానించారు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా బెంగళూరులో ట్రాఫిక్జామ్(Bengaluru Traffic Troubles) వాహనదారులకు నిత్యం నరకం చూపిస్తుంటుంది. ఈ మధ్యకాలంలో అది మరీ పెరిగిపోవడంతో.. పలువురు మేధావులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో స్వయానా డిప్యూటీ సీఎం నెగెటివ్ కామెంట్లు చేయడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే ట్రాఫిక్ సమస్య నుంచి గట్టెక్కించేందుకు ప్రాజెక్టులను ప్రకటించారే తప్ప.. వాటిని ఆచరణలోకి తీసుకురావడంలో మాత్రం అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ప్రముఖ ఆర్థిక వేత్త, ఆరిన్ కాపిటల్ చైర్మన్ మోహన్దాస్ పై(Mohan Das Pai) డీకేఎస్ స్టేట్మెంట్పై ఫైర్ అయ్యారు. ‘‘శివకుమార్గారూ.. మీరు మంత్రి అయ్యి రెండేళ్లు కావొస్తోంది. ఒక బలమైన నేతగా మీకు ఆహ్వానం పలికాం. కానీ, మా బతుకులు మరింత హీనంగా తయారవుతున్నాయి’ అంటూ ఎక్స్ ఖాతాలో ఆయనొక సందేశం ఉంచారు. అలాగే.. బెంగళూరులో ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కించే ప్రాజెక్టులెన్నో నిలిచిపోయాయని అంటున్నారాయన. ఫుట్పాత్ల పరిస్థితి దారుణంగా ఉందని, ప్రజా రవాణా వ్యవస్థ కూడా సరిపడా లేదని తెలిపారు. యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టాలని, నగరానికి సుమారు 5,000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు అవసరమని, మెట్రో రైలును విస్తరించాల్సిన అవసరం ఉందని మోహన్దాస్ అభిప్రాయపడ్డారు.Minister @DKShivakumar it has been 2 years since you became our Minister! We applauded and welcomed you as a strong Minister.But our lives have become much worse!Big projects announced!Will take very long and delayed as govt has not completed any project in city on time! Why… https://t.co/32Kqkzrviv— Mohandas Pai (@TVMohandasPai) February 20, 2025ఇక రాజకీయంగానూ డీకే శివకుమార్ వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. ‘‘బ్రాండ్ బెంగళూరు’’ అంటూ నినాదం ఇచ్చిన వ్యక్తి.. ఇవాళ దేవుడు కూడా సరి చేయలేడంటూ వ్యాఖ్యానించడం దురదృష్టకరమని బీజేపీ అంటోంది. ప్రజలకు సేవ చేసే అవకాశం దేవుడు ఇసతే.. ఈ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని బీజేపీ నేత మోహన్ కృష్ణ విమర్శించారు. అయితే విమర్శల నేపథ్యంలో డీకే శివకుమార్ స్పందించారు. బెంగళూరు సమస్యలను పరిష్కరించే బాధ్యతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే నగరంలో కొత్త రోడ్ల నిర్మాణం, ట్రాఫిక్ సమస్యను తప్పించే ప్రణాళికతో కూడిన హ్యాండ్బుక్ను రిలీజ్ చేశామని అంటున్నారు. -
హైదరాబాద్లో విషాదం.. తుంగభద్రలో మునిగి డాక్టర్ అనన్య మృతి
సాక్షి, బెంగళూరు/హైదరాబాద్: సరదాగా విహారయాత్రకు వెళ్లిన వైద్యుల బృందంలో విషాదం చోటుచేసుకుంది. తుంగభద్రలో దూకి ఈత కొట్టే క్రమంలో హైదరాబాద్కు చెందిన డాక్టర్ అనన్యరావు (27) మృతిచెందారు. నదిలో నుంచి రెస్క్యూ టీమ్ తాజాగా ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో, కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీటి పర్యంతమవుతున్నారు.వివరాల ప్రకారం.. డాక్టర్ అనన్యరావు, మరో ఇద్దరు స్నేహితులు సాత్విన్, హషితలతో కలిసి హంపీ టూర్కి వచ్చారు. స్మారకాలను వీక్షించి మంగళవారం రాత్రి సణాపుర గ్రామంలోని ఓ అతిథి గృహంలో బస చేశారు. బుధవారం మధ్యాహ్నం ఈత కొట్టడానికి తుంగభద్ర నది వద్దకు వెళ్లారు. అనంతరం, సుమారు 25 అడుగుల ఎత్తు గల బండరాయి నుంచి అనన్యరావు నీటిలో దూకి ఈత కొట్టాలనుకుంది.దీంతో, రాళ్ల పైనుంచి నీటిలో దూకెసింది. నీటిలో కాసేపు ఈత కొట్టిన అనన్య.. కాసేపటికే నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయింది. ఈ క్రమంలో అనన్య కాపాడేందుకు స్నేహితులు ప్రయత్నించారు. కానీ, వారి ప్రయత్నం ఫలించలేదు. ఇక, ఈ ప్రదేశంలో తుంగభద్ర రాతి గుహల్లో ప్రవహిస్తూ ఉంటుంది. యువతి ఈ గుహల్లో చిక్కుకు పోయింటారని పోలీసులు అనుమానించారు. దీంతో గంగావతి గ్రామీణ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక గజ ఈతగాళ్లు, అగ్నిమాపకదళం సాయంత్రం వరకు ప్రయత్నించినా ఆమె జాడ కనిపించలేదు.తాజాగా గురువారం ఉదయం అనన్యరావు మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో, అనన్య కుటుంబ సభ్యులు, స్నేహితులు బోరున విలపిస్తున్నారు. ఇక, అనన్య నదిలో దూకిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోవైపు.. అనన్యరావు తండ్రి డా.మెహన్రావు అని, ఆమె వీకేసీ ఆస్పత్రిలో వైద్యురాలని తెలిసింది.#KoppalMishap #Sanapur Video showing #AnanyaRao a doctor from #Hyderabad who jumped into the #Tungabhadra river on Tuesday went missing . Rescue operation has not yielded any results so far @NewIndianXpress @XpressBengaluru @Dir_Lokesh pic.twitter.com/Bsd0H9VnzA— Amit Upadhye (@AmitSUpadhye) February 19, 2025 -
భార్య విద్రోహం.. భర్త ప్రాణత్యాగం
తుమకూరు: ప్రేమించుకున్నారు, అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి తాళితో ఒక్కటయ్యారు. కానీ ఆమె మరొకరిపై మోజుపడి కట్టుకున్నోడికి ద్రోహం చేసింది. అంతే, భర్త గుండె పగిలి ప్రాణాలే వద్దనుకున్నాడు. తన స్నేహితుడే భార్యను తీసుకెళ్లడంతో విరక్తి చెందిన భర్త సెల్ఫీ వీడియో తీసి, చావుకు పరారైన భార్య, స్నేహితుడే కారణమని, తనకు న్యాయం చేయాలని స్నేహితులను కోరుతూ ఫేస్బుక్లో అప్లోడ్ చేసి ఉరి వేసుకున్నాడు. చిచ్చుపెట్టిన స్నేహితుడు హృదయ విదారకమైన ఈ ఘటన మంగళవారం జిల్లాలోని గుబ్బి పట్టణంలోని గట్టి లేఅవుట్ బడావణెలో జరిగింది. వివరాలు.. నాగేష్ (35), 12 సంవత్సరాల క్రితం రంజిత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. నాగేష్ ఇటీవల సొంత ఇల్లు విక్రయించి గట్టి లేఅవుట్ బడావణెలో బాడుగ ఇంట్లో ఉంటున్నాడు. అతని స్నేహితుడు భరత్.. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ రంజిత మనసు మార్చాడు, ఇటీవల ఇద్దరూ వెళ్లిపోయారు. ఈ పరిణామంతో విరక్తి చెందిన నాగేష్.. మిత్రుడు భరత్ తన భార్య రంజితతో అనైతిక సంబంధం పెట్టుకున్నాడని, పరారు కావడంతో ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపాడు. గుబ్బి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
అనుమానం.. అంతం చేసింది
బనశంకరి: పచ్చని సంసారంలో అనుమానం, అక్రమ సంబంధాలు నిప్పులు పోస్తున్నాయి. అర్ధాంతరంగా గొడవలు చెలరేగి కుటుంబాలు కూలిపోతున్నాయి. రాష్ట్రంలో రెండు చోట్ల ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్నారు. భర్త ప్రవర్తన పట్ల అనుమానంతో ఆవేదన చెందిన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నగరంలోని బెల్లందూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రాయచూరు కు చెందిన మల్లమ్మ (26) మృతురాలు. ఆమెకు ఆరేళ్ల క్రితం క్యాబ్డ్రైవరు గా పనిచేసే బసవరాజుతో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబంతో కలిసి తిమ్మారెడ్డి లేఔట్లో కుటుంబం నివాసం ఉంటుంది. భర్త ప్రవర్తన పట్ల బార్యకు అనుమానం ఏర్పడింది. వేరే మహిళలతో చనువుగా ఉంటూ తనను పట్టించుకోవడం లేదని మథనపడేది. ఈ వ్యథతో శనివారం ఉదయం ఇంట్లో పై కప్పు ఇనుపరాడ్కు చున్నీతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందిన వెంటనే బెల్లందూరు పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. భార్యను శిక్షించాలని డెత్నోట్ రాసి.. యశవంతపుర: భార్య అక్రమ సంబంధంపై విరక్తి కలిగి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన దావణగెరె జిల్లా జగళూరు పట్టణంలో జరిగింది. భర్త బసవరాజ్ డెత్నోటు రాసి ఇంటిలో ఉరి వేసుకొని తనువు చాలించాడు. తన ఆత్మహత్యకు భార్య కారణం. ఆమె అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకొంటున్నట్లు రాశాడు. భార్య, అనైతిక సంబంధం కలిగి ఉన్న వ్యక్తికి చట్ట ప్రకారం శిక్ష పడాలి. నా పిల్లలను మా అమ్మ చూసుకోవాలని రాశాడు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. -
బెంగళూరులో దారుణం.. టోల్గేట్ వద్ద అరాచకం!
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. టోల్గేట్ వద్ద ఓ వ్యక్తిని కారు కొంత దూరం లాకెళ్లి పడేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. కర్ణాటకలోని నెలమంగళలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. టోల్బూత్ వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది. టోల్గేట్ వద్ద ఓ కారును మరో కారు ఓవర్ టేక్ చేయడంతో సదరు కారులో వ్యక్తి.. ముందుకు వచ్చి కారులో ఉన్న వ్యక్తిని ప్రశ్నించారు. దీంతో, టోల్బూత్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ముందు కారులో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఆవేశంతో రగిలిపోయాడు.ఈ క్రమంలోనే కారు స్టార్ చేసి.. వాగ్వాదానికి దిగిన వ్యక్తి కాలర్ పట్టుకుని కారును ముందుకు నడిపాడు. ఆ తర్వాత కారు ఆ వ్యక్తిని దాదాపు 50 మీటర్ల దూరం కారు ఈడ్చుకెళ్లింది. కొంత దూరం వెళ్లాక అతడిని వదిలిపెట్టడంతో ఆయన కిందపడిపోయాడు. కారు డ్రైవర్ మాత్రం ఆగకుండా వెళ్లిపోయాడు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. Shocking Incident in Bengaluru!A man was dragged for 50 meters by a car at Nelamangala toll booth after an argument over overtaking. The entire incident was caught on CCTV. Police have launched an investigation to identify the accused. #Bengaluru #RoadRage #ViralVideo pic.twitter.com/mFJ8YOMXoQ— Shubham Rai (@shubhamrai80) February 16, 2025 -
ఆటో డ్రైవర్ చెంపదెబ్బ..కుప్పకూలిన మాజీ ఎమ్మెల్యే
బెంగళూరు:కర్ణాటక బెలగావిలో విషాదఘటన జరిగింది. గోవాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సూర్యాజీ(68) మమ్లేదార్ బెలగావిలో ఖాడే బజార్లోని ఓ లాడ్జి బుక్ చేసుకున్నారు. లాడ్జికి కారులో వస్తుండగా అక్కడి ఇరుకైన రోడ్డులో చిన్న ప్రమాదం జరిగింది. సూర్యాజీ కారు ఓ ఆటోను చిన్నగా ఢీకొట్టింది. ఆటోకు పెద్ద నష్టమేమీ జరగకపోయినా ఆ ఆటో డ్రైవర్ సూర్యాజీతో గొడవకు దిగాడు.ఈ గొడవలో సూర్యాజీని ఆ ఆటో డ్రైవర్ చెంపపై కొట్టాడు. ఇది ఇక్కడితో ముగిసిన తర్వాత సూర్యాజీ లాడ్జికి చేరుకుని మెట్లు ఎక్కి తన గదిలోకి వెళుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా సూర్యాజీ చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. సూర్యాజీ చనిపోవడానికి గల కారణాలను డాక్టర్లు వెల్లడించాల్సి ఉంది. పోలీసులు ఆటో డ్రైవర్పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆటో డ్రైవర్తో గొడవతో పాటు సూర్యాజీ కుప్పకూలిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో నమోదయ్యాయి. కాగా, సూర్యాజీ గోవాలోని పొండా నియోజకవర్గానికి 2012 నుంచి 2017 దాకా ఎమ్మెల్యేగా పనిచేయడం గమనార్హం. -
కర్ణాటకలో ప్రారంభమైన కుంభమేళా
మైసూరు: కర్ణాటకలో 13వ చరిత్రాత్మక కుంభమేళా ప్రారంభమైంది. మైసూరు జిల్లా టి.నరసిపురలోని కావేరి, కపిల, స్పటికా సరోవర నదులు కలిసే త్రివేణి సంగమంలో కుంభమేళా మొదలైంది. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు, సాధువులు తరలివచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు వెళ్లడానికి బదులుగా కర్ణాటకలో జరిగే కుంభమేళాకు హాజరుకావాలని భక్తులను కోరారు. ‘‘త్రివేణి సంగమంలో భాగమైన గంగా, యమున, సరస్వతి నదులకు ఎలాగైనా దైవత్వం, స్వచ్ఛత ఆపాదించారో కావేరి నదికి సైతం అంతే ప్రాశస్త్యం ఉందని మన పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే ప్రయాగ్రాజ్ మహాకుంభ్కు వెళ్లి అక్కడ కిక్కిరిసన జనం మధ్య ఇబ్బందులు పడే బదులు కర్ణాటకలో దక్షిణభారత ప్రయాగ్రాజ్గా వినతికెక్కిన టి.నరసిపుర త్రివేణి సంగమ స్థలికి విచ్చేయండి. పుణ్యస్నానాలు ఆచరించండి. అత్యంత పటిష్టవంతంగా, భక్తులకు సౌకర్యవంతంగా ఇక్కడ కుంభమేళాకు ఏర్పాట్లుచేశాం’’అని భక్తులకు శివకుమార్ పిలుపునిచ్చారు. -
‘అమ్మా బంగారు తల్లీ.. కారులో అలా చేయొద్దమ్మా!’
వైరల్: కరోనా టైం నుంచి వర్క్ఫ్రమ్ హోమ్కు ప్రపంచం అలవాటు పడిపోయింది. ఒకానోక టైంకి వచ్చేసరికి.. ఈ తరహా పని తీరు ఉద్యోగుల మానసిక స్థితిపైనా ప్రభావం చూపెట్టడం మొదలుపెట్టింది. అయితే పరిస్థితులు మారుతున్నా కొద్దీ క్రమక్రమంగా కంపెనీలు హైబ్రీడ్ విధానానికి వాళ్లను అలవాటు చేశాయి. ఈ క్రమంలో.. అటు ఆఫీస్.. ఇటు ఇల్లు కాని పరిస్థితుల్లో ఉద్యోగులు నలిగిపోతుండడం చూస్తున్నాం. ఈ క్రమంలోనే ఎక్కడపడితే అక్కడ తమ లాప్ట్యాప్లతో వర్క్ చేస్తున్న దృశ్యాలు తరచూ వైరల్ అవుతున్నాయి. అయితే ఇలాంటి చేష్టలకు దిగిన బెంగళూరు మహిళా టెకీకి పోలీసులు సర్ప్రైజ్ ఇచ్చారు. బెంగళూరులోని ఆర్టీ నగర్ ప్రాంతంలో కారులో వెళ్తూ ఓ మహిళా టెకీ ల్యాప్టాప్లో వర్క్ చేసింది. అదే సమయంలో డ్రైవింగ్ కూడా చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్గా మారింది. ఇది బెంగళూరు పోలీసుల దృష్టికి చేరడంతో.. వాళ్లకు చర్యలకు ఉపక్రమించారు. ఓవర్ స్పీడింగ్, డ్రైవింగ్లో అలసత్వంగా ఆమె చర్యను గుర్తించి రూ.వెయ్యి ఫైన్ విధించారు. వర్క్ఫ్రమ్ ‘హోమ్’.. కారులో కాదమ్మా! అంటూ.. జరిమానా నోటీసు అందిస్తూ.. ఎక్స్లో బెంగళూరు నార్త్ ట్రాఫిక్ డీసీపీ పోస్ట్ చేశారు."work from home not from car while driving" pic.twitter.com/QhTDoaw83R— DCP Traffic North, Bengaluru (@DCPTrNorthBCP) February 12, 2025 -
జ్ఞాపకాల గని
ఆ తరం ఈ తరం అనే తేడా లేకుండా అన్ని తరాలకు స్ఫూర్తినిచ్చే పేరు... రాజేశ్వరి ఛటర్జీ(Rajeshwari Chatterjee). కర్నాటక తొలి తరం మహిళా ఇంజినీర్(woman engineer)గా చరిత్రలో నిలిచిన రాజేశ్వరి ఆనాటి కుటుంబ పరిమితులు, కాలపరిమితులు అధిగమించి పెద్ద చదువులు చదువుకుంది. ఆమె చరిత్ర అంటే... మన దేశంలో కంప్యూటర్ సాంకేతికత తొలి తరం చరిత్ర. అనేకానేక పరిమితులు అధిగమించి విద్యాఉద్యోగాల్లో రాణిస్తూ తమను తాము నిరూపించుకున్న మహిళల చరిత్ర.ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఐఐఎస్సీ, బెంగళూరు) చైర్పర్సన్గా పదవీ విరమణ చేసిన తరువాత రాజేశ్వరి ఎప్పుడూ ఖాళీగా కూర్చోలేదు. విశ్రాంత జీవితంలోనూ విలువైన పనులెన్నో చేసింది. ఆర్కైవ్లకు ఉపయోగపడే పనులెన్నో చేసింది.‘ఆర్కైవ్ తొలినాళ్లలో ఆమె స్వచ్ఛందంగా సహాయం చేసింది. తన సహోద్యోగులు, విద్యార్థుల గురించి తెలుసుకోవడానికి మాకు సహాయపడింది. ఎన్నో వ్యక్తిగత ఫోటోలు సేకరించి ఆర్కైవ్కు బహుమతిగా ఇచ్చింది’ అని గుర్తు చేసుకున్నారు ఐఐఎస్సీ ఆర్కైవ్ అండ్ పబ్లికేషన్స్ సెల్ మాజీ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ శరత్ అహుజా.బెంగళూరులోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్’లో మొదటి మహిళా ఇంజినీర్గా చరిత్రలో నిలిచిన రాజేశ్వరి ఛటర్జీ అత్యంత క్లిష్టమైన పనిని చేపట్టింది. ఐఐఎస్సీ శతాబ్దపు సుదీర్ఘ ప్రయాణానికి గుర్తుగా ఆర్కైవల్ కలెక్షన్తోపాటు పూర్వవిద్యార్థుల పుస్తకాన్ని సంకలనం చేసింది.కంప్యూటర్ల హవా, ఇంటర్నెట్ ఊసులేని కాలంలోనే ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని గురించి తెలుసుకోవడం ద్వారా తన కాలానికి సంబంధించిన పరిమితులు అధిగమించింది.‘1949లో సెలవుల్లో ఎంఐటీకి వెళ్లినప్పుడు విశాలమైన గదుల్లో ఉంచిన తొలితరం కంప్యూటర్లలో ఒకదాన్ని చూశాను. మీ అరచేతిలో పట్టుకోగలిగే ఆధునిక లాప్టాప్లుప్రారంభరోజుల్లోని ఆ భారీ కంప్యూటర్ల కంటే ఎక్కువ పని చేయగలవని ఊహించగలరా?’ అని ఐఐఎస్సీ పూర్వ విద్యార్థుల పుస్తకంలో రాసింది. పీహెచ్డీ చేయాలనే రాజేశ్వరి కల రెండోప్రపంచ యుద్ధంతో భగ్నం అయింది. అయినప్పటికీ ఆమె తన ఆకాంక్షను వదులుకోలేదు. పరిశోధనను కొనసాగించడానికి ప్రత్యామ్నాయాలను అన్వేషించింది. భౌతిక, వాతావరణ శాస్త్రవేత్త అన్నామణి, రసాయన శాస్త్రవేత్త రోషన్ ఇరానీల తర్వాత ఐఐఎస్సీ నుంచి స్కాలర్షిప్ పొందిన మూడో మహిళగా ఛటర్జీ గుర్తింపు పొందింది. -
ఏరో ఇండియా ప్రదర్శన..ఆకట్టుకున్న విమానాల విన్యాసాలు (ఫొటోలు)
-
గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి
కర్ణాటక: నవగ్రహ కన్నడ చలనచిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమై అనేక కన్నడ చిత్రాల్లో నటించిన గిరి దినేస్(45) గుండెపోటుతో మృతిచెందారు. కన్నడ సూపర్ స్టార్ దర్శన్ హీరోగా తన సోదరుడు దినకర్ దర్శకత్వం వహించిన నవగ్రహ చిత్రంతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ మూవీ 2008లో విడుదలైంది. ఆ చిత్రంలో శెట్టి పాత్రను పోషించడం ద్వారా గిరి దినేష్ పాపులర్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత ఆయనకు కోలీవుడ్లో మంచి అవకాశాలే దక్కాయి. ఇంట్లో పూజ గదిలో పూజ చేస్తుండగా హఠాత్తుగా కుప్పకూలిపోయాడు.కుటుంబ సభ్యులు ఆయన్ను తోణం ఆస్పత్రికి తరలించగా అప్పటికే తుదిశ్వాస వదిలినట్లు వైద్యులు నిర్ధారించారు. -
‘కారుణ్యం’ శాపం కారాదు!
వైద్య కారణాల రీత్యా ఎప్పటికీ కోలుకోలేని అచేతన స్థితికి చేరుకుని, మరణం తప్ప మరో దారిలేని రోగులకు ‘కారుణ్య మరణం’ ప్రసాదించే నిబంధనలు దేశంలోనే తొలిసారి కర్ణాటకలో అమల్లో కొచ్చాయి. వాస్తవానికి కేరళ, గోవా, మహారాష్ట్రలు ఇప్పటికే ఇందుకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే కర్ణాటక మరో అడుగు ముందుకేసి సవివరమైన న్యాయ నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఈ విషయంలో 2018లోనూ, 2023లోనూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీచేసింది. ప్రభుత్వాలు తగిన చట్టాలు చేసేవరకూ ఇవి అమల్లో వుంటాయని ప్రకటించింది. ప్రపంచంలో ఇప్పటికే చాలా దేశాలు ఇందుకు సంబంధించిన చట్టాలు తీసుకొచ్చాయి. సమస్య చాలా జటిలమైనది. మంచానికి పరిమితమైపోయిన రోగులు లోలోపల ఎంత నరకం చవి చూస్తున్నారో బయటి ప్రపంచానికి తెలియదు. నిత్యం సేవలందించే వైద్య సిబ్బందికి, నిరంతరం కనిపెట్టుకుని వుండే కుటుంబ సభ్యులకు సైతం ఆ రోగుల అంతరంగం, వారు పడుతున్న యాతనలు అర్థంకావు. వ్యాధి నయమయ్యే అవకాశం ఎంతమాత్రం లేదని, వైద్య ఉపకరణాల సాయంతో కోమాలో మంచంపై వెళ్లదీయటం తప్ప మరో మార్గం లేదని తెలిశాక వారిని ఆ స్థితి లోనే ఉంచటం సరికాదన్న వాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. అందుకు విరుద్ధంగా ప్రాణం పోసే శక్తిలేని మనిషికి ప్రాణం తీసే హక్కు ఎక్కడిదన్న వాదనలూ ఉన్నాయి. ఒక మానవ మృగం సాగించిన లైంగిక హింస పర్యవసానంగా కోమాలోకి వెళ్లి ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (కేఈఎం) ఆసుపత్రి బెడ్పై దాదాపు 42 ఏళ్లపాటు జీవచ్ఛవంలా బతికి 2015లో కన్నుమూసిన అరుణా రామచంద్ర శాన్బాగ్ కేసు ఉదంతంలో తొలిసారి ఈ కారుణ్య మరణం అంశం చర్చ కొచ్చింది. ఆమె దశాబ్దాల తరబడి జీవచ్ఛవంలా రోజులు వెళ్లదీయటం చూడలేకపోతున్నానని,ఇంకా ఎన్నాళ్లపాటు ఆమె ఇలా కొనసాగాల్సి వస్తుందో వైద్యులు కూడా చెప్పలేకపోతున్నారని జర్న లిస్టు పింకీ విరానీ సుప్రీంకోర్టు ముందు 2009లో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె ప్రశాంత మరణా నికి అవసరమైన ఆదేశాలివ్వాలని విరానీ విన్నవించుకున్నారు. కానీ ఆమె శాన్బాగ్ కుటుంబ సభ్యు రాలు కాకపోవటంతో సుప్రీంకోర్టు ఆ పిటిషన్ను తోసిపుచ్చింది. ఇలాంటి స్థితికి చేరుకున్న రోగుల కారుణ్య మరణానికి చట్టబద్ధతను కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించింది. అయితే ఆ తీర్పు అరుణకు ‘పునర్జన్మ’నిచ్చిందంటూ ఆమెకు సేవలు చేస్తున్న నర్సులంతా మిఠాయిలు పంచుకుని పండుగ చేసుకున్నారు. రిటైరవుతున్నవారి స్థానంలో వచ్చే కొత్త నర్సులు సైతం ఆమెను కంటికి రెప్పలా చూసుకునేవారు. కారుణ్య మరణంపైనే కామన్ కాజ్ దాఖలు చేసిన మరో పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 2018లో తొలిసారి మార్గదర్శకాలు రూపొందించింది. ఆ మార్గదర్శకాలను మరింత సరళం చేస్తూ 2023లో మరో తీర్పునిచ్చింది. హుందాగా జీవించటం మాత్రమే కాదు... హుందాగా మరణించటం కూడా రాజ్యాంగంలోని 21వ అధికరణం పరిధిలోకి వస్తుందని చెప్పింది. అయితే కారుణ్య మరణం కేసుల్లో ఇమిడివుండే జటిల సమస్యలేమిటో, వాటిని స్వప్రయోజన పరులు ఎలా ఉపయోగించుకునే ప్రమాదమున్నదో న్యాయమూర్తులు గుర్తించే వుంటారు. అందుకే ఆ మార్గదర్శకాలు అత్యంత జాగ్రత్తగా రూపొందించారు. తిరిగి కోలుకునే అవకాశం లేదని, కేవలం వైద్య సాయంతో జీవచ్ఛవాల్లా బతుకీడ్చక తప్పదని గుర్తించిన రోగులకు ఇది వర్తిస్తుందని ధర్మా సనం తెలిపింది. అలాగే చికిత్స తీసుకునేముందే రోగి ఆ ప్రక్రియలో ఎదురుకాగల ప్రమాదాన్ని గుర్తించి, ఆ పరిస్థితి ఏర్పడిన పక్షంలో వైద్యాన్ని నిలిపేయటానికి అంగీకారం తెలిపే ముందస్తు ఆదేశం(ఏఎండీ)పై సంతకం చేసి ఇవ్వొచ్చు. దాన్ని ‘లివింగ్ విల్’గా పరిగణించాల్సి వుంటుంది. ఒకవేళ అది రోగి ఇవ్వలేని పక్షంలో వైద్యానికి ముందు ఆయన తరఫున కుటుంబంలోని పెద్ద ఎవరైనా ఏఎండీని అందజేయొచ్చు. దాని ఆధారంగా రోగికి అమర్చే ఆక్సిజన్ మాస్క్, వెంటిలేటర్, ఇతరేతర ఉపకరణాల వంటి ప్రాణావసర వ్యవస్థల్ని తొలగిస్తారు. అయితే ఈ ప్రక్రియ సవ్యంగా సాగడానికీ, ఎలాంటి లొసుగులకూ ఆస్కారం లేకుండా ఉండటానికీ ప్రతి ఆసుపత్రిలోనూ ముగ్గు రేసి సీనియర్ డాక్టర్లతో రెండు బోర్డులు ఏర్పాటుచేయాలి. ప్రాథమిక స్థాయి బోర్డు తన అభిప్రాయం చెప్పాక, సెకండరీ బోర్డు మరోసారి పరిశీలించాలి. జిల్లా వైద్యాధికారి ఈ నిర్ణయ ప్రక్రియలో పాలుపంచుకోవాలి. దీన్ని ఫస్ట్క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పరిశీలించాలి. ఆమోదించిన పక్షంలో ఆ సంగతిని హైకోర్టు రిజిస్ట్రార్కి తెలపాలి. ఇలాంటి అంశాల్లో కుటుంబ సభ్యుల మధ్యే ఏకాభిప్రాయం కుదరక పోవచ్చు. అందుకే విడివిడిగా అందరితో మాట్లాడటం, వారిఅంగీకారం విషయంలో ఇమిడి వున్న సమస్యలేమిటో చెప్పటం ఎంతో అవసరం.ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ ప్రక్రియ దుర్వినియోగమయ్యే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. డబ్బు కోసం, ఆస్తుల కోసం ఆరాటపడుతూ ఎంతకైనా తెగించే లోకంలో స్వపరభేదాలుండవు. ఇది గాక వైద్యానికి తడిసి మోపెడవుతుందన్న భయంవల్ల లేదా త్వరగా ‘వదుల్చుకోవాలన్న’ తొందర వల్ల వైద్యులను పక్కదోవ పట్టించే ప్రబుద్ధులుంటారు. కనుక ఈ సమస్య చుట్టూ అల్లుకుని వుండే చట్టపరమైన అంశాలు సరే... నైతిక, సామాజిక, ఆర్థిక అంశాలను సైతం తరచి చూడక తప్పదు. సమాజ పోకడలు ఎలా వుంటున్నాయో గమనించుకోక తప్పదు. ‘హుందాగా మరణించటం’ హక్కే కావొచ్చు... కానీ అది ‘మరణించటానికి గల హక్కు’గా పరిణమించకూడదు. ఈ ‘హక్కు’ నిస్సహాయ రోగుల పాలిట శాపంగా మారకూడదు. -
ఒక స్కూటర్ ట్రాఫిక్ చలాన్లు 311
బెంగళూరు: అరవీర భయంకరంగా బ్యాటింగ్ చేసే బ్యాటర్ క్రికెట్ మైదానంలో 300 పరుగులు చేస్తే అద్భుతం అంటాం. అయితే ఒక గేర్లెస్ స్కూటర్ యజమాని క్రికెట్ గ్రౌండ్లో కాకుండా నడిరోడ్డుపై ట్రిపుల్ సెంచరీచేశాడు. అయితే అది పరుగుల రూపంలో కాకుండా ట్రాఫిక్ చలాన్ల రూపంలో. ఒకే స్కూటర్పై ఏకంగా 311 ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్లు ఉండటం చూసి కర్ణాటకలోని వాహన వినియోగదారులు ఔరా అని అచ్చెరువొందారు. ఈ ఘటనకు బెంగళూరు మహానగరం వేదికైంది. సోమవారం బెంగళూరు సిటీ మార్కెట్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో ఈ స్కూటర్ యజమాని ఈ 311 చలాన్లకు జరిమానా కింద రూ.1,61,500 కట్టేసి జప్తులో ఉన్న వాహనాన్ని తీసుకెళ్లడంతో ఈ కథ సుఖాంతంగా ముగిసింది. ఇన్ని చలాన్లు ఎలా ? కలాసిపాళ్య ప్రాంతానికి చెందిన పెరియస్వామికి ఒక గేర్లెస్ స్కూటర్ ఉంది. ఇతను ట్రావెల్ ఏజెన్సీ వ్యాపారం చేస్తాడు. ఇతనికి సమీప బంధువు సుదీప్ వ్యాపార భాగస్వామిగా ఉన్నాడు. సుదీప్కు తరచూ స్కూటర్పై వెళ్తూనే ఫోన్ మాట్లాడే అలవాటు ఉంది. హెల్మెట్ అస్సలు ధరించడు. ట్రావెల్ ఏజెన్సీ వ్యవహారాలన్నీ బండితోపాటే ఫోన్లోనే నడిపిస్తాడు. అత్యధికంగా ఇతను నడిపేటప్పుడు ఎక్కువ ట్రాఫిక్ చలాన్లు నమోదయ్యాయి. రెడ్ సిగ్నల్ దాటి వెళ్లడం, రాంగ్ రూట్, హెల్మెట్ ధరించకపోవడం, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ ఇలా పలు రకాల చలాన్లు అలా పడుతూనే ఉన్నాయి. సుదీప్గానీ, స్కూటర్ యజమాని పెరియస్వామిగానీ ఏనాడూ ఈ చలాన్లు కట్టలేదు. దీంతో చలాన్లు చాంతాడంత పెరిగిపోయాయి. పెరియస్వామి, సుదీప్, మరో వ్యక్తి ఈ స్కూటర్ను వాడినట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తి ఫిర్యాదుతో శిభమ్ అనే వ్యక్తి సరదాగా చలాన్లను ఆన్లైన్లో చెక్ చేస్తున్న సమయంలో ఈ స్కూటర్ నంబర్ప్లేట్ మీద వేల రూపాయల చలాన్లు నమోదైన విషయం గుర్తించినట్లు తెలుస్తోంది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో శిభమ్ ఇటీవల ఒక భారీ పోస్ట్ పెట్టారు. ‘‘ఈ స్కూటర్పై నమోదైన చలాన్ల సంఖ్యను గత ఏడాది కాలంగా గమనిస్తూ ఉన్నా. ఎప్పటికప్పుడు కొత్త చలాన్లు వస్తూనే ఉన్నాయి. కట్టాల్సిన జరిమానా పెరుగుతూనే ఉంది. ఇప్పుడది రూ.1లక్ష నుంచి రూ.1,60,000 దాటింది. ఇప్పటికైనా పోలీసులు మేలుకొని దానిని సీజ్ చేస్తారా? లేదంటే కొత్త రికార్డ్ సృష్టించేదాకా అలాగే రోడ్లపై తిరగనిస్తారా?’’అంటూ అతను చేసిన పోస్ట్ వైరల్గా మారింది. దీంతో బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం అంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోశారు. విషయం చివరకు పోలీసులకు తెలియడంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఓనర్ను పిలిపించి స్కూటర్ను స్వాదీనం చేసుకున్నారు. అప్పటికిగానీ ఓనర్కు ఈ విషయం తెలియలేదు. పోలీస్స్టేషన్కు బంధువు సుదీప్ను రప్పించి వాళ్ల ముందే చీవాట్లు పెట్టినట్లు వార్తలొచ్చాయి. 311 చలాన్లను ఒకేసారి ప్రింట్ తీస్తే 20 అడుగుల పొడువు పేపర్ బయటికొచి్చంది. ఎట్టకేలకు హెల్మెట్ వందల చలాన్ల గేర్లెస్ స్కూటర్ అంశం నగరంలో హాట్టాపిక్గా మారడంతో పోలీసులు వెంటనే యజమానితో జరిమానా మొత్తాన్ని కట్టేలా ఒప్పించినట్లు వార్తలొచ్చాయి. సోమవారం సుదీప్ ఈ మొత్తాన్ని కట్టేసి వాహనాన్ని వెంటతీసుకెళ్లారు. ఈ సందర్భంగా సుదీప్ ఒక కొత్త హెల్మెట్ను ధరించారు. ‘‘ఇకనైనా చలాన్ల సెంచరీలు కొట్టడం ఆపండి’’అని పోలీసులు అతనికి హితబోధ చేసి పంపించారు. జరిమానా కట్టించుకుని ఊరకే వదిలేయకుండా ఇలాంటి వాళ్లకు కౌన్సిలింగ్ ఇవ్వాలని కొందరు నెటిజన్లు డిమాండ్చేశారు. -
మాట్లాడడం లేదని.. వెంటాడి మరీ!
సాక్షి, బెంగళూరు: పాత స్నేహానికి బ్రేకప్ చెప్పినందుకు కక్ష పెంచుకుని బంగ్లా మహిళను జరిపి హతమార్చిన ఘటన నగరంలో జరిగింది. నిందితుడు ముదుకప్పను రామమూర్తినగర పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. హతురాలు నజ్మా (28), వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా పని చేస్తున్న ముదుకప్ప మధ్య పాత స్నేహం ఉండేది. క్రమేణా ఇద్దరి మధ్య చనువు పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే ఆరు నెలల క్రితం నజ్మా ఉన్న అక్రమ బంగ్లా వలసదారుల గుడిసెలపై పోలీసులు దాడి జరిపారు. తర్వాత నజ్మా, ముదుకప్పల మధ్య స్నేహానికి బ్రేక్ పడింది. నజ్మా పని చేస్తున్న అపార్ట్మెంట్కు నీరు వదిలేందుకు వెళ్లినప్పుడు అక్కడ నజ్మా కనిపించడంతో ముదుకప్ప మళ్లీ ఆమె వెంటపడ్డాడు. అతనితో మాట్లాడేందుకు నజ్మా నిరాకరించింది. వెంటాడి.. హత్య గత నెల 23న నజ్మా విధులు ముగించుకుని కల్కెరె చెరువు మార్గంలో ఇంటికి వెళుతుండగా ముదుకప్ప ఆమెను అనుసరించాడు. ఆమెతో మాటలు కలిపి లైంగిక క్రియకు ఒత్తిడి చేశాడు. అందుకు నజ్మా వ్యతిరేకించడంతో ఆ సమయంలో అటుగా ఎవరూ రాకపోవడాన్ని గమనించిన ముదుకప్ప ఆమెను బలవంతంగా లాక్కెళ్లాడు. అత్యాచారానికి పాల్పడి ఊపిరాడకుండా చేసిన తర్వాత నజ్మా తలపై బండరాయితో కొట్టి చంపి అక్కడి నుంచి పరారయ్యాడు. రామమూర్తినగర పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టి అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్ఎస్ఎల్ పరీక్షలో హతురాలి వంటిపై లభించిన నిందితుడి రక్తం, వీర్యం సరిపోవడంతో ముదుకప్పను అరెస్టు చేశారు. ∙ -
అప్పా, అమ్మా నన్ను క్షమించండి.. మీ పావన
శివాజీనగర: అప్పా, అమ్మా నన్ను క్షమించండి.. అని డెత్నోట్ రాసి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నగరంలోని బెంగళూరు విశ్వవిద్యాలయం (జ్ఞానభారతి) మహిళా హాస్టల్లో ఈ సంఘటన జరిగింది. మైసూరు జిల్లా హెచ్డీ కోట హెబ్బలగుప్పహళ్లికి చెందిన హెచ్.ఎన్ పావన (23) మృతురాలు. ఆమె కన్నడ అధ్యయన కేంద్రంలో పీజీ ఫైనలియర్ చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం హాస్టల్లో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. స్థానిక పోలీసులు చేరుకొని గాలించగా డెత్నోట్ లభించింది. అందులోని అంశాలను గోప్యంగా ఉంచారు. -
రాయల్ డెజర్ట్ "మైసూర్ పాక్" ఎవరు తయారు చేశారో తెలుసా..!
కొన్ని రకాల స్వీట్లు చాలావరకు అందరికీ నచ్చుతాయి. దాని రుచి, సువాసనకి ఫిదా అయిపోతుంటారు. అలాంటి స్వీట్స్లలో ఒకటి మైసూర్ పాక్ ఒకటి. అయితే ఈస్వీట్ పండగలు, వేడుకలలో తప్పనసరిగా ఉంటుంది. తియ్యటి పదార్థాలలో అగ్రస్థానం దీనిది. ఈ స్వీటు పేరుకి తగ్గట్టుగానే రాయల్టీకి చిహ్నంలా ఉంటుంది. అసలు ఈ రెసిపీని ఎలా తయారు చేశారు, ఎవరు చేశారు వంటి ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందామా..!.భారతదేశం అంతటా పండుగలు, పత్యేక సందర్భాల్లో ప్రత్యేక విందుగా ఉండే స్వీటు ఇదే. దీని మూలం రాజుల వంశాలే. కర్ణాటక(Karnataka) రాజుల వంటశాలల నుంచి తయారయ్యిందని అంటుంటారు. మైసూర్ పాక్(Mysore Pak) మొదటిసారిగా 20వ శతాబ్దం ప్రారంభంలో మహారాజా కృష్ణ రాజ వడియార్IV పాలనలో మైసూర్ ప్యాలెస్లోని రాయల్ వంటవాడు కాకాసుర మడప్ప సృష్టించాడట. మహారాజు మెచ్చుకునేలా వంటలు చేసే క్రమంలో మాదప్ప శెనగపిండి, నెయ్యి, చక్కెరతో ప్రయోగాలు చేసేవాడట. ఆ నేపథ్యంలో తయారైందే ఈ మైసూర్ పాక్ అట. అప్పుడు మహారాజు కూడా ఈ స్వీట్ రుచికి అబ్బురపడి దీనిపేరు ఏంటని అడిగితే ఆ వంటవాడు మైసూర్ పాక్ అని చెప్పాడట. అలా దానికి ఆ పేరు స్థిరపడిపోయిందట. ఇక్కడ కన్నడలో పాక్ అంటే చక్కెర సిరప్ ఆధారిత స్వీట్ అని అర్థం. మైసూర్ ప్యాలస్లో చేయడంతో మైసూర్ పాక్(మైసూర్ స్వీట్) అని అన్నాడని పాకనిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాతర క్రమేణ అందరికి నచ్చే వంటకంగా మారింది. స్వీట్ దుకాణాలలో ఈ రెసిపీని చేయడం ప్రారంభించడంతో ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చిందని చెఫ్, రెస్టారెంట్ కన్సల్టెంట్ తర్వీన్ కౌర్ చెబుతున్నారు. అలా దక్షిణ భారత ఉత్సవాలు, వివాహాలు, వేడుకలలో ప్రధానమైన డెజర్ట్(Dessert)గా మారింది. అందువల్ల దీనికి ఇంతలా ప్రజాదరణ అని పాక నిపుణులు చెబుతున్నారు. అలాగే కర్ణాటక కూడా తమ సంస్కృతికి అద్దం పట్టే ఈ మైసూపాక్ తీపి వంటకాన్ని అందరూ గుర్తించేలా తన వంతుగా కృషి చేసిందట. అందువల్ల దీని గురించి అందరికి తెలిసిందని చెబుతున్నారు. దీన్ని వివాహాలు, పండుగల్లో ప్రాముఖ్యత ఇచ్చేలా తప్పనిసరిగా పెట్టడంతో ప్రజల హృదయాల్లో తొందరగా స్థానం సంపాదించుకుందని అంటున్నారు డయాబెటిస్ కన్సల్టెంట్ డైటీషియన్ కనిక్క మల్హోత్రా. అందువల్లే తరతరాలు ఈ స్వీట్ని ఆదరిస్తున్నారని అంటున్నారు. రుచి మాయజాలంలా కట్టిపడేస్తుంది..శెనగపిండి, నెయ్యి పంచదారల మిశ్రమం చక్కగా రోస్ట్ అయ్యి ఒక విధమైన రుచితో కూడిన నిర్మాణాన్ని ఇస్తుంది. ఇది నెయ్యి కలుపుతూ ఓపికగా తిప్పుతూ చేసే వంటకం. మన ఓపికకు పరీక్ష పెట్టే తయారీ విధానం ఇది. మనం ఎంత నిశితంగా ఓపిగ్గా చేస్తున్నామనే దానిపై పర్ఫెక్ట్గా రావడం అనేది ఆధారపడి ఉంటుందని పాక నిపుణులు చెబుతున్నారు.(చదవండి: వ్యవసాయ నేపథ్యం.. కానీ రూ. 52 లక్షల జాబ్ ఆఫర్ని కొట్టేసింది..!) -
కర్ణాటకలో లొంగిపోయిన చివరి మావోయిస్టు
బెంగళూరు:కర్ణాటక మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందని సీఎం సిద్ధరామయ్య ఇటీవల చేసిన ప్రకటన నిజమైంది. రాష్ట్రంలో చివరి మావోయిస్టుగా భావిస్తున్న తొంబట్టు లక్ష్మీ ఆదివారం(ఫిబ్రవరి2) పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఉడుపి పోలీసు ఉన్నతాధికారుల ముందు సరెండర్ అయ్యారు.తనకు ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వానికి లక్ష్మీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.లక్ష్మీ స్వగ్రామం కుందపుర తాలుకాలోని మచ్చట్టు.దాదాపు ఇరవై ఏళ్ల క్రితం కుటుంబాన్ని విడిచి మావోయిస్టు పార్టీలోకి వెళ్లింది. సమీప ప్రాంతాల్లో మావోయిస్టు సాహిత్యం ప్రచారం చేయడంతోపాటు పోలీసులపై దాడి ఘటనల్లో ఆమెపై గతంలో మూడు కేసులు నమోదయ్యాయి.చాలా ఏళ్లుగా ఆమె ఏపీలో తలదాచుకున్నట్లు సమాచారం.ఇటీవల లక్ష్మీ లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు.సరెండర్ కమిటీ సభ్యుడు,గతంలో లొంగిపోయిన ఆమె భర్త సలీంతో కలిసి ఉడుపి పోలీసుల ముందుకు వచ్చారు.కాగా, కర్ణాటకను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మావోయిస్టుల సరెండర్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో లొంగిపోయే మావోయిస్టులకు మార్గం సుగమం అయింది. రెండురోజుల క్రితమే శృంగేరి తాలూకా కిగ్గా గ్రామానికి చెందిన మావోయిస్టు నాయకుడు రవీంద్ర నెమ్మార్ చిక్కమగళూరులో అధికారుల ముందు లొంగిపోయాడు. -
నిరాశపరిచిన కేఎల్ రాహుల్.. మంచి ఆరంభం లభించినా సద్వినియోగం చేసుకోలేని వైనం
చాలాకాలం తర్వాత రంజీ (Ranji Trophy) బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ (KL Rahul) తొలి ఇన్నింగ్స్లోనే నిరాశపరిచాడు. హర్యానాతో ఇవాళ (జనవరి 30) మొదలైన మ్యాచ్లో రాహుల్ 26 పరుగులకే ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో రాహుల్కు మంచి ఆరంభం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రాహుల్ 37 బంతుల్లో 4 సొగసైన బౌండరీలు బాది మాంచి టచ్లో ఉన్నట్లు కనిపించాడు. అయితే అన్షుల్ కంబోజ్ ఓ సాధారణ బంతితో రాహుల్ను బోల్తా కొట్టించాడు. వికెట్కీపర్ రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి రాహుల్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.కాగా, ఈ మ్యాచ్లో రాహుల్ బరిలోకి దిగే సమయంలో అభిమానుల కేరింతలతో స్టేడియం దద్దరిల్లింది. ఈ మ్యాచ్ రాహుల్ సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో (బెంగళూరు) జరుగుతుంది. సొంత మైదానంలో రాహుల్ను చూసేందుకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. రాహుల్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించి వచ్చిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ ఇన్నింగ్స్లో తొలుత రాహుల్ను చూసి అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. వరుస పెట్టి బౌండరీలు బాదడంతో భారీ స్కోర్ చేయడం ఖాయమని అనుకున్నారు. అయితే వారి ఆశలు అడియాశలయ్యాయి. సూపర్ టచ్లో కనిపించిన రాహుల్ కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయకుండానే నిష్క్రమించాడు.ఈ మ్యాచ్లో హర్యానా టాస్ గెలిచి కర్ణాటకను బ్యాటింగ్కు ఆహ్వానించింది. 17 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కేవీ అవనీశ్ ఔట్ కావడంతో కర్ణాటక 45 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం బరిలోకి దిగిన రాహుల్.. మయాంక్ అగర్వాల్తో కలిసి రెండో వికెట్కు 54 పరుగులు జోడించాడు. రాహుల్ ఔటయ్యాక దేవ్దత్ పడిక్కల్ క్రీజ్లోకి వచ్చాడు. ఈ లోగా మయాంక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 40 ఓవర్ల అనంతరం కర్ణాటక స్కోర్ 121/2గా ఉంది. మయాంక్ 63, పడిక్కల్ 9 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. రాహుల్ను ఔట్ చేసిన కంబోజ్ అనీశ్ను కూడా పెవిలియన్కు పంపాడు.బీజీటీలోనూ నిరాశపరిచిన రాహుల్రాహుల్ ఇటీవలికాలంలో వరుసగా విఫలమవుతున్నాడు. తాజాగా ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రాహుల్ 5 టెస్ట్ల్లో కేవలం 2 హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. గాయాలు, ఫామ్ లేమి కారణంగా రాహుల్ ఇటీవలికాలంలో తరుచూ జట్టులోకి వస్తూ పోతున్నాడు. రాహుల్ టీ20 జట్టులో చోటు కోల్పోయి చాలాకాలమైంది. వన్డేల్లోనూ రాహుల్ అడపాదడపా ప్రదర్శనలే చేస్తున్నాడు. రాహుల్కు బీజీటీ 2024-25లో ఐదు టెస్ట్లు ఆడే అవకాశం దక్కినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. తొలి టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్లో (77).. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో (84) మాత్రమే రాహుల్ రాణించాడు. -
వదిలేసిన కారులో రూ. కోటి నగదు
యశవంతపుర (కర్ణాటక): ఖాళీ స్థలంలో వదిలి వెళ్లిన కారులో కోటి రూపాయల నగదు బయట పడిన ఘటన ఉత్తరకన్నడ జిల్లా అంకోలా తాలూకా జాతీయ రహదారి 63లో రామనగుళి వద్ద వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం నుంచి గుర్తు తెలియని కారు నిలిపి ఉంది. అనుమానం పడిన స్థానికులు అంకోలా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చేరుకుని పరిశీలించారు. బెంగళూరు రిజిస్ట్రేషన్ నంబర్ గల హుండై క్రెటా కారులో కోటి రూపాయిల నగదు లభించింది. కారును, నగదును సీజ్ చేశారు. కారు ఎవరిది, నగదుతో పాటు ఎందుకు వదిలేశారు అనేది సస్పెన్స్గా మారింది. కారు నంబరు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. -
Afzalgunj Incident: చెన్నైకి చెక్కేశారు!
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలోని బీదర్తో పాటు నగరంలోని అఫ్జల్గంజ్లో కాల్పులు జరిపిన బీహార్ నేరగాళ్లు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తు అధికారులకు ఎలాంటి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీళ్లు రోషన్ ట్రావెల్స్ వద్ద కాల్పుల తర్వాత తిరుమలగిరి నుంచి ఉత్తరాదికి పారిపోయి ఉంటారని అధికారులు భావించారు. అయితే పోలీసుల్ని తప్పుదోవపట్టిస్తూ చెన్నైకి పారిపోయినట్లు తాజాగా వెలుగులోకి వచ్చిందని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని పట్టుకుంటామని, ప్రత్యేక బృందాలు ఆ కోణంలోనే ముందుకు వెళ్తున్నాయని స్పష్టం చేశారు. బీహార్లోని హాజీపూర్ జిల్లాకు చెందిన ఇరువురు దుండగులు అక్కడ నుంచే ద్విచక్ర వాహనం తీసుకుని నగరానికి చేరుకున్నారు. ఇక్కడే ఓ లాడ్జిలో బస చేసి బీదర్లో రెక్కీ నిర్వహించి మరీ పంజా విసిరింది. ఆపై నగదుతో సహా నగరానికి చేరుకున్న ఇరువురూ బైక్ను ఎంజీబీఎస్ పార్కింగ్లో పెట్టారు. ఆటోలో బయలుదేరి అఫ్జల్గంజ్లోని రోషన్ ట్రావెల్స్ వద్దకు వచ్చారు. ప్రైవేట్ బస్సులో రాయ్పూర్కు టిక్కెట్ బుక్ చేసుకున్న తదనంతర పరిణామాలతో మేనేజర్ జహంగీర్ను కాల్చడం, పారిపోవడం జరిగాయి. దర్యాప్తు అధికారులు నిందితుల రాకపోకలు కనిపెట్టడానికి వందల సంఖ్యలో సీసీ కెమెరాలను జల్లెడపడుతున్నారు. అఫ్జల్గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్కు వెళ్లిన ద్వయం..అక్కడి నుంచి మరో ఆటోలో గజ్వేల్ వెళ్లే ప్రయత్నం చేసింది. అయితే ఆటోడ్రైవర్ వ్యవహార శైలితో అనుమానించి తిరుమలగిరిలో దిగిపోయారు. అక్కడే నగదును మరో బ్యాగ్లోకి మార్చడంతో పాటు తాము ధరించిన వ్రస్తాలను మార్చుకున్నారు. అక్కడ నుంచి బోయిన్పల్లి వరకు వచ్చిన ఇద్దరు దుండగులూ..మరో ఆటోలో కూకట్పల్లి మీదుగా మియాపూర్ చేరుకున్నారు. అర్ధరాత్రి మియాపూర్లో ఆంధ్రప్రదేశ్ ఆరీ్టసీకి చెందిన తిరుపతి వెళ్లే బస్సు ఎక్కారు. టిక్కెట్ సైతం తిరుపతి వరకు తీసుకున్న ఈ ద్వయం.. కడప బైపాస్ రోడ్డులో దిగిపోయారు. ఆ సమయంలో డ్రైవర్ ఇక్కడ ఎందుకు దిగుతున్నారని ప్రశి్నంచగా..పని ఉందంటూ సమాధానం ఇచ్చారు. కడప నుంచి మరో బస్సులో నెల్లూరు, అక్కడ నుంచి ప్రైవేట్ బస్సులో చెన్నై చేరుకున్నట్లు ఇప్పటి వరకు గుర్తించారు. చెన్నై చేరుకున్న నగర పోలీసు బృందాలు అక్కడ నుంచి ఈ ఇద్దరూ ఎక్కడకు వెళ్లారనే కోణంలో ఆరా తీస్తున్నాయి. ఈ ఇద్దరిలో కీలకమైన ప్రధాన నిందితుడు ఏడాదిన్నర క్రితం ఉత్తరప్రదేశ్లోనూ ఓ భారీ నేరం చేశాడు. అప్పటి నుంచి ఇతడి కోసం గాలిస్తున్న అక్కడి స్పెషల్ టాస్్కఫోర్స్ అధికారులు ఆచూకీ చెప్పిన వారికి రూ.4 లక్షల పారితోíÙకం కూడా ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఈ దుండగుల కోసం తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్ పోలీసులు సమన్వయంతో గాలిస్తున్నారు. -
‘ఇన్ఫోసిస్ సేనాపతి’పై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు
బెంగళూరు: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(Indian Institute of Science)లో ఓ ప్రొఫెసర్ విషయంలో హనీట్రాప్కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈ పరిణామం చోటు చేసుకుంది.గతంలో.. సంచలన అభియోగాల మీద ప్రొఫెసర్గా పని చేసిన దుర్గప్పను ఐఐఎస్సీ(IISc) విధుల నుంచి తొలగించింది. అయితే.. సేనాపతి క్రిష్ గోపాలకృష్ణన్(Senapathy Kris Gopalakrishnan)తో పాటు మాజీ ఐఐఎస్సీ డైరెక్టర్ బలరాం సహా మరికొందరు తనపై కుట్ర చేశారని, హనీట్రాప్ కేసులో ఇరికించారని దుర్గప్ప ఆరోపిస్తున్నారు. అంతేకాదు కులం పేరుతో తనను దూషించి బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు..సోమవారం కోర్టును ఆశ్రయించారు. దీంతో.. మొత్తం 18 మందిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు 71వ సిటీ సివిల్ అండ్ సెషన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. బెంగళూరు సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఈ ఆరోపణలపై ఇటు గోపాలకృష్ణన్కానీ, అటు ఐఐఎస్ బోర్డుకానీ స్పందించలేదు. ప్రస్తుతం గోపాలకృష్ణన్ బోర్డులో సభ్యుడిగా కూడా ఉన్నారు.1981, జులై 2వ తేదీన ఇన్ఫోసిస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. నారాయణమూర్తితో పాటు సేనాపతి క్రిష్ గోపాలకృష్ణన్, మరో ఐదుగురు కలిసి ఈ కంపెనీని పుణే(మహారాష్ట్ర)లో తొలుత ప్రారంభించారు. -
‘నాన్నా క్షమించు.. పింకీ టార్చర్ తట్టుకోలేకపోతున్నా’
బెంగళూరు: దేశంలో భార్యా బాధిత మరణాలు పెరుగుతున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన మరువకముందే కర్ణాటక మరో వ్యక్తి ఇలానే ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య వేధింపులు భరించలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నోట్ రాసిపెట్టి చనిపోయాడు.వివరాల ప్రకారం.. కర్ణాటకలోని హుబ్బళ్లికి చెందిన పీటర్ గొల్లపల్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ సందర్భంగా తన మరణానికి భార్య పింకీనే కారణం అంటూ నోట్ రాసి పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో తన పేరెంట్స్ను క్షమించమని కోరాడు. సూసైడ్ నోట్లో.. నాన్న, నన్ను క్షమించండి. పింకీ వేధింపులు భరించలేక నేను చనిపోతున్నాను. తను నా మరణాన్ని కోరుకుంటోంది. అన్నయ్య జోయల్.. మన పేరెంట్స్ను బాగా చూసుకో’ అంటూ రాసిపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు.అనంతరం, పీటర్ చనిపోయిన విషయం తెలుసుకుని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ సందర్బంగా పీటర్ సోదరుడు జోయల్ మాట్లాడుతూ..పీటర్, పింకీ రెండేళ్ల క్రితమే వివాహం జరిగింది. గత కొద్ది నెలలుగా వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో, మూడు నెలలుగా వారిద్దరూ దూరంగా ఉంటున్నారు. పీటర్ నుంచి పింకీ విడాకులు తీసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే పీటర్ వద్ద పరిహారంగా రూ.20 లక్షలు డిమాండ్ చేసింది. దీంతో, పీటర్ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడు. పింకీ వల్లే ఇటీవల పీటర్ తన ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాడు. ఆమె వల్ల చాలా ఒత్తిడిలో ఉన్నట్టు తెలిపాడు.పీటర్ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పీటర్ సూసైడ్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, పీటర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆత్మహత్యకు ప్రేరేపించడంపై వ్యవహరించే భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని సెక్షన్ 108 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
స్టార్ హీరోను కలిసిన సీఎం..
శాండల్వుడ్ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వెద్య చికిత్స కోసం గతేడాది డిసెంబర్లో అమెరికా వెళ్లారు. ప్రముఖ మియామీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఆయన చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. త్వరలోనే మీ అందరినీ కలుస్తానని శివరాజ్ కుమార్ తన భార్యతో కలిసి ఓ వీడియో సందేశం రిలీజ్ చేశారు.తాజాగా శివరాజ్ కుమార్ జనవరి 26న బెంగళూరు చేరుకున్నారు. క్యాన్సర్ నుంచి ఆయన పూర్తిగా కోలుకుని స్వదేశానికి తిరిగొచ్చారు. దీంతో ఆయనను చూసేందుకు వేలాదిమంది అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా తన వైద్య చికిత్స గురించి అభిమానులతో మాట్లాడారు. నా అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రేమ, మద్దతు వల్లే తాను కోలుకున్నానని అన్నారు. మళ్లీ మీ అందరి సినిమాలతో అలరించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని శివరాజ్ కుమార్ తెలిపారు. దాదాపు ఆరుగంటలపాటు తనకు శస్త్ర చికిత్స జరిగిందని..రెండో రోజు నుంచే నడవడం ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ ప్రయాణంలో నా భార్య, కూతురు తనకు అండగా నిలిచారని అన్నారు.కాగా.. శివ రాజ్కుమార్ చివరిగా కన్నడ చిత్రం భైరతి రణగల్లో కనిపించారు. ఈ సినిమా గతేడాది నవంబర్ 15, 2024న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఉత్తరకాండ, 45, భైరవనా కోనే పాటతో సహా పలు చిత్రాలలో పని చేయనున్నారు. అంతేకాకుండా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన చిత్రం ఆర్సీ 16లోనూ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.శివరాజ్ కుమార్ను కలిసిన సీఎం..శివరాజ్ కుమార్ను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కలిశారు. ఆయన నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి ఆరోగ్యం, చికిత్సపై ఆరా తీశారు. -
భర్తను వదిలేసి.. మరో వ్యక్తితో సహజీవనం!
హుబ్లీ: ఇన్స్టా గ్రామ్ ప్రేమ వలలో చిక్కి ధార్వాడలో రామదుర్గకు చెందిన శ్వేత (24) అనే వివాహిత యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. ఆమెకు మూడున్నరేళ్ల క్రితం రామదుర్గకు చెందిన విశ్వనాథ్తో పెళ్లి అయింది. ఇన్స్టాలో శ్వేతకు ధార్వాడ తాలూకా శివళ్లి గ్రామానికి చెందిన విజయ్ నాయకర్తో స్నేహం మొదలై ప్రేమకు దారితీసింది. ఫలితంగా భర్తను వదిలేసి ఆమె శ్రీనగర్లోని ఓ అద్దె ఇంట్లో సహజీవనం ప్రారంభించింది. శ్వేత కుటుంబ సభ్యులు విజయ్ ఇంటికి వెళ్లి ఇది సబబు కాదని మందలించారు. వీలైతే ఆమెను పెళ్లి చేసుకో, ఊరికే ఇలా తమ కుమార్తె సంసారాన్ని నాశనం చేయవద్దు అని బుద్ధిమాటలు చెప్పారు. విజయ్ తమనే బెదిరించినట్లు శ్వేత తల్లి శశి సావంత్ తెలిపారు. శ్వేత ఇటీవల భర్త విశ్వనాథ్కు విడాకుల నోటీసు కూడా పంపింది. అయితే శుక్రవారం నాడు విజయ్, శ్వేత మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ శ్వేత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థలాన్ని ఉప నగర పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకొన్నారు. సంసారంలో చిచ్చు పెట్టిన విజయ్ పరారీలో ఉన్నాడు. -
షాదీ అంటే విధ్వంసం..! బారాత్ అటే బాంబ్!
దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఎక్స్ప్లోజివ్స్ మాడ్యుల్కు కర్ణాటకలోని భత్కల్ వాసి సయ్యద్ ఇస్మాయిల్ అఫాఖీ అలియాస్ డాక్టర్ సాబ్ కీలకంగా వ్యవహరించారు. 2013 ఫిబ్రవరి 21న హైదరాబాద్, దిల్సుఖ్నగర్లోని 107 బస్టాప్, ఏ–1 మిర్చి సెంటర్ పేలుళ్లు సహా దేశ వ్యాప్తంగా జరిగిన ఐదు విధ్వంసాలకు అవసరమైన పేలుడు పదార్థాన్ని ఇతడే సరఫరా చేశాడు. పాకిస్తాన్లో తలదాచుకున్న ఐఎమ్ చీఫ్ రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకు అతడి సోదరుడు యాసీన్ భత్కల్తో కలిసి పనిచేసిన డాక్టర్ సాబ్తో పాటు అతడి ముఠాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 2015 జనవరి 8న అరెస్టు చేసింది. 2024, డిసెంబర్ 16న బెంగళూరులోని ఎన్ఐఏ స్పెషల్ కోర్టు వీరిని దోషులుగా తేల్చింది. రియాజ్–అఫాఖీ మధ్య సంప్రదింపులు జరిగిన విధానంతో పాటు వాళ్లు వినియోగించిన కోడ్ వర్డ్స్ను నిఘా వర్గాలు గుర్తించాయి. హైదరాబాద్లోని గోకుల్చాట్, లుంబినీ పార్క్లో 2007లో జరిగిన విధ్వంసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రియాజ్ భత్కల్ 2008లో పాకిస్తాన్కు పారిపోయాడు. కరాచీలో ఉన్న డిఫెన్స్ ఏరియాలో తలదాచుకుని డాక్టర్ సాబ్ను ఉగ్రవాద బాటపట్టించాడు. భత్కల్ ప్రాంతానికే చెందిన సద్దాం హుస్సేన్, అబ్దుల్ సుబూర్లతో ముఠాను ఏర్పాటు చేయించాడు. హైదరాబాద్ను మరోసారి టార్గెట్గా చేసుకోవాలని రియాజ్ భత్కల్ 2012లో నిర్ణయించుకున్నాడు. దీనిపై తన సోదరుడు యాసీన్ భత్కల్తో పాటు ఆజామ్ఘడ్కు చెందిన అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ, అతడితో ఉంటున్న పాకిస్తానీ జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ వఖాస్లతో సంప్రదింపులు జరిపాడు. యాసీన్ మినహా మిగిలిన ఇద్దరినీ మంగుళూరుకు పంపాడు. ఈ సంప్రదింపులు, సమాచారమార్పిడి కోసం ఫోన్లపై ఆధారపడితే నిఘా వర్గాలకు చిక్కే ప్రమాదం ఉంటుందని భావించిన రియాజ్ వాటికి పూర్తి దూరంగా ఉండటంతో పాటు అనుచరుల్నీ అలానే ఉంచాడు. కేవలం ఈ–మెయిల్తో పాటు నింబస్, పాల్టాక్ వంటి సోషల్ మీడియాలను వినియోగించాలని సూచించాడు. వీటి ద్వారా చాటింగ్ చేయడానికి అవసరమైన ఐడీలను సృష్టించడంలోనూ అతగాడు అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. అప్పటికే వాంటెడ్ లిస్టులో ఉన్న తమ పేర్లను వినియోగించి వీటిని సృష్టించుకుంటే వాటిపై నిఘా వర్గాల కన్ను పడే ప్రమాదం ఉందని భావించాడు. అలాగని ఎవరికి వారు తమకు ఇష్టం వచ్చినట్లు ఐడీలు ఏర్పాటు చేసుకుంటే అవి మిగతా వారికి తెలిసే అవకాశం లేక సమాచార మార్పిడికి అవాంతరాలు ఏర్పడతాయనే ఉద్దేశంతో రియాజ్ భత్కల్ ఓ కొత్త ఆలోచన చేశాడు. పాకిస్తాన్లో ఉన్న రియాజ్ భత్కల్ 2012 సెప్టెంబర్లో తాను వినియోగిస్తున్న మెయిల్ ఐడీ నుంచి మిగిలిన వారికి ఓ మెయిల్ పంపాడు. అందులో పీడీఎఫ్ ఫార్మాట్లో ఉన్న ‘స్టఫ్ మై స్టాకింగ్’ అనే పుస్తకాన్ని జతచేసి, అందులోని ప్రతి పది పేజీలను ఒక్కో సభ్యుడికి కేటాయిస్తున్నట్లు సమాచారమిచ్చాడు. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన వాటిలో మొదటి పేజీలోని మొదటి పదం వినియోగించి ఐడీని సృష్టించుకునేలా చేశాడు. అవసరమనుకుంటే ఆ పదం పక్కన పేజీ నంబర్ లేదా ఏదైనా సంఖ్యను వాడుకోవచ్చని సూచించాడు. ప్రతి నెల రోజులకు కచ్చితంగా ఐడీని మార్చేస్తూ వారికి కేటాయించిన పేజీల్లో రెండో పేజీలో ఉన్న మొదటి పదంతో మరో ఐడీ సృష్టించుకోవాలని స్పష్టం చేశాడు. ఈ పుస్తకం పీడీఎఫ్ కాపీ అందరి దగ్గరా ఉండటంతో ఎవరి ఐడీ ఏంటనేది మిగతా వారికి తేలిగ్గా తెలిసేది. ఈ రకంగా నిఘా వర్గాలకు ఏ మాత్రం అనుమానం రాకుండా కమ్యూనికేషన్ సాగించారు. రియాజ్ భత్కల్ 2013 ఫిబ్రవరి మొదటివారంలో చాటింగ్ ద్వారా హడ్డీకి కీలక ఆదేశాలు జారీ చేశాడు. ఈసారి హైదరాబాద్ను టార్గెట్ చేశామని చెప్పి వఖాస్, బిహార్లోని దర్భంగా వాసి తెహసీన్ అక్తర్ అలియాస్ మోనుతో కలిసి ఈ ఆపరేషన్ పూర్తిచేయాలని నిర్దేశించాడు. ఈ విధ్వంసానికి పేలుడు పదార్థాలను ఇచ్చే బాధ్యతల్ని బెంగళూరులో ఉన్న డాక్టర్ సాబ్కు అప్పగించాడు. అతడినీ ఈ–మెయిల్ ద్వారానే సంప్రదించిన రియాజ్.. ‘హైదరాబాద్ మే షాదీ హై.. బారాత్ హోనా’ (హైదరాబాద్లో పెళ్లి ఉంది. దాని కోసం ఊరేగింపు కావాలి) అంటూ సందేశం ఇచ్చాడు. మరోపక్క మోను, వఖాస్ హైదరాబాద్ చేరుకుని, అబ్దుల్లాపూర్మెట్లో గదిని అద్దెకు తీసుకున్నారు. పేలుడు పదార్థాల కోసం మంగుళూరులోనే వేచి ఉన్న హడ్డీకి రియాజ్ భత్కల్ నుంచి ఆ ఏడాది ఫిబ్రవరి 4న కీలక ఆదేశాలు వచ్చాయి.మంగుళూరులోని యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద ఓ వ్యక్తి పేలుడు పదార్థాలు అందిస్తాడని చెప్పడంతో హడ్డీ అక్కడకు వెళ్లాడు. రియాజ్ సూచించిన ప్రకారం అఫాఖీ 25 కేజీల పేలుడు పదార్థం (అమోనియం నైట్రేట్), 30 డిటొనేటర్లు సమీకరించి, వాటిని బంగారు రంగులో ఉన్న ట్రాలీ బ్యాగ్లో పెట్టి తన అనుచరుడు సద్దాం హుస్సేన్ ద్వారా యూనిటీ హెల్త్ సెంటర్ వద్దకు పంపాడు. అక్కడకు వెళ్లిన హడ్డీ అవి తీసుకుని హైదరాబాద్ చేరుకున్నాడు. దిల్సుఖ్నగర్ పేలుళ్లలో పాలు పంచుకున్న యాసీన్ భత్కల్ (నేపాల్ నుంచి సహకరించాడు), తెహసీన్ అక్తర్ (ఏ–1 మిర్చి సెంటర్ దగ్గర బాంబు పెట్టాడు), వఖాస్ (107 బస్టాప్ దగ్గర బాంబు పెట్టాడు), హడ్డీలకు (నగదు, పేలుడు పదార్థాలు చేరవేశాడు).. ఎజాజ్ షేక్ (నిధులు అందించాడు), డాక్టర్ సాబ్ (పేలుడు పదార్థాలు సరఫరా) వివరాలు తెలియకుండా రియాజ్ భత్కల్ జాగ్రత్తలు తీసుకున్నాడు. వీరిలో ఎవరు చిక్కినా మిగిలిన వారి విషయం బయటపడకుండా ఇలా కుట్ర పన్నాడు. డాక్టర్ సాబ్ మాడ్యుల్కు బెంగళూరు ఎన్ఐఏ కోర్టు త్వరలో శిక్ష ఖరారు చేయనుంది. (చదవండి: షాదీ అంటే విధ్వంసం..! బారాత్ అటే బాంబ్!) -
కాల్పులు బిహార్ ముఠా పనే..
సాక్షి, హైదరాబాద్: కర్నాటకలోని బీదర్, నగరంలోని అఫ్జల్గంజ్లో తుపాకులతో విరుచుకుపడిన ఇద్దరు దుండగులు బిహార్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) పార్కింగ్ నుంచి స్వా«దీనం చేసుకున్న ద్విచక్ర వాహనం ఈ కోణంలో కీలక ఆధారాలను అందించింది. ఆ ఇద్దరి వివరాలు సేకరించిన పోలీసులు ఆచూకీ కనిపెట్టడానికి ముమ్మరంగా గాలిస్తున్నారు. బీహార్లోని హాజీపూర్ జిల్లాకు చెందిన దుండగులు దాదాపు నెల రోజుల క్రితమే తెలంగాణ, కర్ణాటకల్లో పంజా విసరాలని భావించింది. దీంతో అక్కడే ఓ తుపాకీ, ఆరు తూటాలు ఖరీదు చేసుకుని బయలుదేరడానికి సిద్ధమైంది. దీనికోసం తమ స్నేహితుడి ద్వారా అతడి పరిచయస్తుడి ద్విచక్ర వాహనం తీసుకుంది. దాని పైనే బయలుదేరిన ద్వయం దాదాపు 1500 కిలోమీటర్లు ప్రయాణించి నగరానికి చేరుకుంది. ఇక్కడే ఓ లాడ్జిలో బస చేసి బీదర్లో రెక్కీ నిర్వహించి మరీ పంజా విసిరింది. ఆపై నగదుతో సహా నగరానికి చేరుకున్న ఇరువురూ బైక్ను ఎంజీబీఎస్ పార్కింగ్లో పెట్టింది. దాని నిర్వాహకులకు తప్పు పేరు, ఫోన్ నెంబర్ చెప్పింది. ఆపై ఆటోలో బయలుదేరి అఫ్జల్గంజ్లోని రోషన్ ట్రావెల్స్ వద్దకు వచి్చంది. ప్రైవేట్ బస్సులో రాయ్పూర్కు టిక్కెట్ బుక్ చేసుకున్నా తదనంతర పరిణామాలతో మేనేజర్ జహంగీర్ను కాల్చడం, పారిపోవడం జరిగిపోయాయి. ఈ హత్యాయత్నం తర్వాత కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన నగర పోలీసులు నిందితుల రాకపోకలు కనిపెట్టడానికి వందల సంఖ్యలో సీసీ కెమెరాలను జల్లెడపట్టారు. దీంతో ఎంజీబీఎస్ పార్కింగ్లో ఉన్న దుండగులు వినియోగించిన వాహనం పోలీసులకు లభించింది. దీని రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా ముందుకు వెళ్లిన పోలీసులు హాజీపూర్ జిల్లాకు చెందిన యజమాని, దాన్ని దుండగులకు అప్పగించిన స్నేహితుడిని గుర్తించారు. వీరిద్దరికీ దుండగులు వాహనం ఎందుకు అడుగుతున్నారో తెలియని, కేవలం తమకు ఉన్న పరిచయం నేపథ్యంలో కొన్నాళ్ల వినియోగించుకోవడానికి బైక్ కావాలి అంటే ఇచి్చనట్లు పోలీసులు నిర్థారించారు. ఇప్పటికీ పరారీలోనే ఉన్న ఇరువురు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. -
శతకంతో చెలరేగిన శుబ్మన్ గిల్.. కానీ..
టీమిండియా స్టార్ క్రికెటర్, పంజాబ్ కెప్టెన్ శుబ్మన్ గిల్(Shubman Gill) ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. రంజీ మ్యాచ్లో శతకంతో చెలరేగి తనను తాను నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో గిల్ విఫలమైన సంగతి తెలిసిందే. వరుస వైఫల్యాలుగాయం కారణంగా పెర్త్లో జరిగిన తొలి టెస్టుకు దూరమైన ఈ పంజాబీ బ్యాటర్.. రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చినా పెద్దగా రాణించలేకపోయాడు. అడిలైడ్లో జరిగిన ఈ పింక్ బాల్ టెస్టులో రెండు ఇన్నింగ్స్లో కలిపి 59(31, 28) పరుగులు చేశాడు. అయితే, గబ్బాలో జరిగిన మూడో టెస్టులో గిల్ తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అయితే, నాలుగో టెస్టు జట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు. దీంతో బాక్సింగ్ డే టెస్టుకు దూరమైన గిల్.. ఆ తర్వాత సిడ్నీ టెస్టు ఆడినా అందులోనూ విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్లో వరుసగా 20, 13 పరుగులు సాధించాడు.రంజీ బరిలో పంజాబ్ సారథిగాకాగా కంగారూ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్లో ఓవరాల్గా 93 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ నేపథ్యంలో శుబ్మన్ గిల్ ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో బోర్డు నిబంధనలకు అనుగుణంగా రంజీ ట్రోఫీ బరిలో దిగాడు. తాజా ఎడిషన్ రెండో దశ పోటీల్లో భాగంగా కర్ణాటకతో మ్యాచ్ సందర్భంగా ఈ పంజాబ్ ఓపెనర్ రంగంలోకి దిగాడు.మొదటి ప్రయత్నంలో విఫలంఅయితే, మొదటి ప్రయత్నంలో గిల్కు మరోసారి నిరాశే ఎదురైంది. తొలి ఇన్నింగ్స్లో ఎనిమిది బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేసి.. అవుటయ్యాడు. కర్ణాటక పేసర్ అభిలాష్ శెట్టి బౌలింగ్లో క్రిష్ణన్ శ్రీజిత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. గిల్తో పాటు పంజాబ్ మిగతా బ్యాటర్లు కూడా దారుణంగా విఫలం కావడంతో తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకే ఆలౌట్ అయింది.స్మరణ్ డబుల్ సెంచరీఈ క్రమంలో కర్ణాటక స్టార్ రవిచంద్రన్ స్మరణ్ (277 బంతుల్లో 203; 25 ఫోర్లు, 3 సిక్స్లు) డబుల్ సెంచరీతో విజృంభించగా.. జట్టు భారీ స్కోరు సాధించింది. మొదటి ఇన్నింగ్స్లో ఏకంగా 475 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (20), దేవదత్ పడిక్కల్ (27) ఎక్కువసేపు నిలవలేకపోయిన చోట స్మరణ్ చక్కటి ఇన్నింగ్స్తో జట్టుకు భారీ స్కోరు అందించాడు. తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకు ఆలౌటైన పంజాబ్... శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. ప్రభ్సిమ్రన్ సింగ్ (1), అన్మోల్ప్రీత్ సింగ్ (14) అవుట్ అయ్యారు.గిల్ సూపర్ ఇన్నింగ్స్.. కానీఈ నేపథ్యంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న శుబ్మన్ గిల్ మూడో రోజు ఆటలో భాగంగా సెంచరీతో చెలరేగాడు. చిన్నస్వామి స్టేడియంలో శనివారం 159 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో పద్నాలుగు ఫోర్లు, మూడు సిక్స్లు ఉన్నాయి. గిల్ ఓవరాల్గా 171 బంతుల్లో 102 పరుగులు సాధించగా.. మిగతా వాళ్ల నుంచి మాత్రం సహకారం అందలేదు. ఈ క్రమంలో 213 పరుగులకు ఆలౌట్ అయిన పంజాబ్.. కర్ణాటక చేతిలో ఇన్నింగ్స్ 207 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది.చదవండి: అతడిని తప్పించి మంచి పనిచేశారు.. ఇదొక విన్నింగ్ టీమ్: డివిలియర్స్Shubman Gill gets his century.. a fine & confident innings #RanjiTrophy #KarvsPun pic.twitter.com/iA1gm6I1Ib— Manuja (@manujaveerappa) January 25, 2025Shubman Gill Celebration after One of best Hundred under pressure in Ranji trophy match against Karnataka 💥📹📷 @Sebashiyun pic.twitter.com/7IMnWegWSy— JassPreet (@JassPreet96) January 25, 2025 -
173 కిలో మీటర్లు.. నాలుగు లైన్లు..
సాక్షి, హైదరాబాద్ : ఒక్క రైలు మార్గం.. నాలుగు లైన్ల ట్రాక్.. దేశంలోనే అరుదు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు లేదు. ఇప్పుడు తొలిసారిగా నాలుగు రైల్వే లైన్లతో కూడిన కారిడార్ సిద్ధం కాబోతోంది. సికింద్రాబాద్ నుంచి కర్ణాటకలోని వాడీ మధ్య ఉన్న మార్గాన్ని నాలుగు లైన్లకు విస్తరించాలని రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ కన్సల్టెన్సీ ద్వారా డీపీఆర్ను సిద్ధం చేసి ఇటీవలే రైల్వే బోర్డుకు పంపింది. 173 కిలోమీటర్ల పొడవున చేపట్టే ఈవిస్తరణకు దాదాపు రూ.4,446 కోట్లు అవసరమని అంచనా వేశారు. కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదముద్ర వేస్తే.. వచ్చే బడ్జెట్లోనే నిధులు కేటాయించేఅవకాశం ఉంది. ఈ విస్తరణతో వంద అదనపు రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.ప్రస్తుతం రెండు లైన్లతో..సికింద్రాబాద్–వాడీ మధ్య ప్రస్తుతం 183 కిలోమీటర్ల మేర రెండు వరుసల రైల్వే కారిడార్ ఉంది. ఇది ముంబైకి ప్రధాన మార్గం కాగా.. బెంగళూరుకు ప్రత్యామ్నాయ మార్గం. ఈ రూట్లో నిత్యం 66 ప్రయాణికుల రైళ్లు నడుస్తున్నాయి. ఇక తాండూరు– వాడీ మధ్య పదుల సంఖ్యలో సిమెంటు పరిశ్రమలు ఉన్నాయి. కొత్తగా పరిశ్రమలనూ నిర్మిస్తున్నారు. సేడం, నాగులపల్లి ప్రాంతాల్లో స్టీలు, ఇతర పరిశ్రమలు ఉన్నాయి. నిత్యం వందల టన్నుల సిమెంటు, స్టీలు ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతుంది. ఇక ఈ ప్రాంతాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వ్యవసాయ ఉత్పత్తులు తరలుతుంటాయి. వీటన్నింటికీ సంబంధించి నిత్యం 70 వరకు గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ మార్గంలో రైల్వే ట్రాఫిక్ 120 శాతంగా ఉంది. అంటే సామర్థ్యం కంటే 20శాతం అదనంగా రైళ్లు నడుస్తున్నాయి. పైగా సరుకు రవాణాకు, ప్రయాణికుల రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. కానీ రైళ్లను పెంచలేని పరిస్థితి. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం మూడో లైన్ నిర్మించాలని నిర్ణయించారు.రైల్వే బోర్డు జోక్యంతో నాలుగోలైన్..దేశవ్యాప్తంగా కీలక కారిడార్లపై ఇటీవల రైల్వే బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది. అందులో సికింద్రాబాద్–వాడీ సెక్షన్ను పరిశీలించింది. ఇక్కడ మూడోలైన్ నిర్మించిన కొంతకాలానికే నాలుగోలైన్ అవసరం ఏర్పడుతుందని, మళ్లీ భూసేకరణ సహా సమస్యలు వస్తాయని గుర్తించింది. ఒకేసారి రెండు అదనపు లైన్లు నిర్మిస్తే మంచిదని తేల్చింది. పీఎం గతిశక్తిలో భాగంగా ఉన్న రైల్వే నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ దీనికి ఆమోదముద్ర వేసింది. అధికారులు ఇటీవలే ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తి చేసి, డీపీఆర్ రూపొందించి రైల్వే బోర్డుకు సమర్పించారు.హఫీజ్పేట వరకు 4 లైన్లు.. సనత్నగర్ వరకు 3 లైన్లు.. సికింద్రాబాద్ వరకు నాలుగు లైన్లు నిర్మించాలనుకున్నా.. మధ్యలో భారీ నిర్మాణాలు ఉన్నందున భూసేకరణ కష్టమని గుర్తించారు. దీంతో వాడీ నుంచి నగరంలోని హఫీజ్పేట వరకు నాలుగు లైన్లకు విస్తరించి.. అక్కడి నుంచి సనత్నగర్ వరకు మూడు లైన్లకు పరిమితం చేస్తారు. సుమారు 600 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించాల్సి ఉంటుందని, రూ.330 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇక ఈ మార్గంలో చిన్నాపెద్దా కలిపి మొత్తం 202 వంతెనలు ఉన్నాయి. ఆయా చోట్ల కొత్త లైన్ల కోసం వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది. కేంద్రం బడ్జెట్లో నిధులు కేటాయిస్తే నెల రోజుల్లో టెండర్లు పిలిచేందుకు అధికారులు సిద్ధమయ్యారు.భవిష్యత్లో బందరు పోర్టుతో అనుసంధానంమరో రెండేళ్లలో ఏపీలోని బందరు పోర్టు సిద్ధం కాబోతోంది. తెలంగాణకు దగ్గరి పోర్టు ఇదే కావటంతో నేరుగా అనుసంధానం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికి డెడికేటెడ్ రైల్వే కారిడార్ కావాలని ఇటీవలే సీఎం రేవంత్ ప్రధానిని కోరారు.ఆ లైన్ అందుబాటులోకి వస్తే, దానితో వాడీ లైన్ను అనుసంధానించే అవకాశం ఉంది. ఈ మార్గంలో వచ్చే సిమెంటు, స్టీలు, వ్యవసాయ ఉత్పత్తులువేగంగా బందరు పోర్టుకు చేరుతాయి. -
రంజీ బాట పట్టిన మరో టీమిండియా స్టార్ ప్లేయర్
టీమిండియా స్టార్ ప్లేయర్లంతా ఒక్కొక్కరుగా రంజీ బాట పడుతున్నారు. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ (ముంబై), యశస్వి జైస్వాల్ (ముంబై), శుభ్మన్ గిల్ (పంజాబ్), రిషబ్ పంత్ (ఢిల్లీ), రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర), శ్రేయస్ అయ్యర్ (ముంబై) తమతమ జట్ల తరఫున బరిలోకి దిగారు. జనవరి 30న ప్రారంభమయ్యే మ్యాచ్లో టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లి (ఢిల్లీ) కూడా బరిలోకి దిగుతానని ప్రకటించాడు. తాజాగా మరో స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ కూడా జనవరి 30న ప్రారంభమయ్యే మ్యాచ్కు అందుబాటులో ఉంటానని వెల్లడించాడు. రాహుల్ కర్ణాటక తరఫున బరిలోకి దిగుతాడు. కర్ణాటక జట్టుకు మయాంక్ అగర్వాల్ సారథ్యం వహిస్తాడు. ఈనెల 30న ప్రారంభమయ్యే మ్యాచ్లో కర్ణాటక.. హర్యానాను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ కర్ణాటక హోం గ్రౌండ్ అయిన చిన్న స్వామి స్టేడియంలో జరుగుతుంది.కాగా, రాహుల్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడిన తన సహచరులు రోహిత్, యశస్వి, గిల్, పంత్, జడేజాలతో పాటు రంజీ బరిలో దిగాల్సి ఉండింది. అయితే మోచేతి గాయం కారణంగా అతను ఇవాళ (జనవరి 23) ప్రారంభమైన మ్యాచ్కు దూరమయ్యాడు. విరాట్ కోహ్లి సైతం గాయం కారణంగానే ఇవాళ మొదలైన మ్యాచ్కు అందుబాటులో లేడు.ఇదిలా ఉంటే, ఖాళీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లంతా రంజీల్లో తప్పకుండా ఆడాలని బీసీసీఐ కండీషన్ పెట్టిన విషయం తెలిసిందే. రంజీల్లో ఆడటం తప్పనిసరి చేసిన నేపథ్యంలో గత్యంతరం లేక భారత ఆటగాళ్లంతా ఒక్కొక్కరుగా రంజీ బాట పడుతున్నారు. టీమిండియా స్టార్లంతా విఫలం.. ఒక్క జడేజా తప్ప..!రంజీ బరిలోకి దిగిన టీమిండియా స్టార్లంతా దారుణంగా విఫలమయ్యారు. వేర్వేరు జట్లతో జరిగిన మ్యాచ్ల్లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. రంజీ బరిలోకి దిగిన టీమిండియా స్టార్ ఆటగాళ్లలో ఒక్క రవీంద్ర జడేజా మాత్రమే సత్తా చాటాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో జడ్డూ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.రంజీల మాట అటుంచితే, ప్రస్తుతం భారత టీ20 జట్టు ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్లో భాగంగా నిన్న (జనవరి 22) జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి 132 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో కెప్టెన్ జోస్ బట్లర్ (68) ఒక్కడే రాణించాడు. భారత బౌలర్లు వరుణ్ చక్రవర్తి (4-0-23-3), అర్షదీప్ సింగ్ (4-0-17-2), అక్షర్ పటేల్ (4-1-22-2), హార్దిక్ పాండ్యా (4-0-42-2) అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టారు.స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్కు ఓపెనర్లు సంజూ శాంసన్ (26), అభిషేక్ శర్మ (34 బంతుల్లో 79; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించారు. అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగి 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. భారత ఇన్నింగ్స్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (0) నిరాశపరిచినా తిలక్ వర్మ (19), హార్దిక్ పాండ్యా (3) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. కేవలం 12.5 ఓవర్లలోనే (3 వికెట్లు) భారత్ గెలుపు తీరాలు తాకింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2, ఆదిల్ రషీద్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్లో తదుపరి టీ20 జనవరి 25న చెన్నై వేదికగా జరుగనుంది. -
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం
-
కర్ణాటకలో ట్రక్కు బోల్తా. 10 మంది దుర్మరణం
బెంగళూరు, సాక్షి: కర్ణాటక రోడ్డు గంటల వ్యవధిలో మరోసారి నెత్తురోడింది. ఉత్తర కన్నడ(Uttara Kannada) జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కూరగాయలు, పండ్ల లోడుతో వెళ్తున్న ట్రక్కు బోల్తాపడిన ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి.మరణించిన వారంతా కూరగాయల వ్యాపారులుగా తెలుస్తోంది. బుధవారం తెల్లవారుజామున ట్రక్కులో కూరగాయల లోడుతో వ్యాపారులు సావనూర్ నుంచి కుంత మార్కెట్కు వెళ్తున్నారు. గులాపురా గ్రామ సమీపంలోని యాలాపురా హైవే వద్దకు చేరుకోగానే డ్రైవర్ ఓ వాహనానికి దారి ఇచ్చే క్రమంలో అదుపు తప్పడంతో మరో ట్రక్కును ఢీకొట్టింది. దీంతో దాదాపు 50 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. #WATCH | #Karnataka: 10 died and 15 injured after a truck carrying them met with an accident early morning today. All of them were travelling to Kumta market from Savanur to sell vegetables: SP Narayana M, Karwar, Uttara Kannada (Visuals from the spot)ANI pic.twitter.com/9vgO1nOKOu— OTV (@otvnews) January 22, 2025పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 4:00 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 10మంది మృతి చెందగా.. మరో 20 మంది తీవ్ర గాయాలపాలైనట్లు పోలీసులు పేర్కొన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రమాదంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాయచూరు, సింధనూరులో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 14 మంది మృతి చెందారనే వార్త బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి ప్రభుత్వం తగిన పరిహారం అందిస్తుందని హామీ ఇచ్చారు. అంతకు ముందు.. మంగళవారం అర్ధరాత్రి.. కర్ణాటకలోని హంపి(Hampi) క్షేత్రంలో జరిగే నరహరి తీర్ధుల ఆరాధనకు 14 మంది వేద పాఠశాల విద్యార్ధులతో వెళుతున్న వాహనం సింధనూరు సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ శివ, ముగ్గురు విద్యార్ధులు అభిలాష, హైవదన, సుజేంద్ర అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు విద్యార్ధులు గాయపడగా, వారిని సింథనూరు ఆసుపత్రికి తరలించారు. కారు టైర్ ఊడిపడడంతో.. వాహనం బోల్తా ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. -
ఊడిన కారు టైరు.. మంత్రాలయ విద్యార్థుల దుర్మరణం
బెంగళూరు, సాక్షి : కర్ణాటకలో బుధవారం(జనవరి22) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైర్ ఊడిపడడంతో.. వాహనం బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా నలుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ముగ్గురిని కర్నూలు జిల్లా మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠం వేద పాఠశాల విద్యార్థులుగా గుర్తించారు.హంపిలోని శ్రీ నరహరి తీర్థుల బృందావనంలో ఆరాధానోత్సవాల కోసం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. నట్లు, బోల్టులు ఊడిపోవడంతో తుఫాన్ వాహనం బోల్తాపడినట్లు ప్రాథమికంగా తేలింది. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 14 మంది విద్యార్థులున్నారు. పోలీసులు ప్రమాద స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకున్నారు. -
Cyber Scam: రూ. 11 కోట్లు పోగొట్టుకున్న టెకీ..!
బెంగళూరు: ‘ మీరు సైబర్ స్కామ్ నేరగాళ్ల(Cyber Scam) నుంచి జాగ్రత్తగా ఉండండి. తాము ప్రభుత్వ అధికారులమని మీ వివరాలు కావాలంటూ ఫోన్ చేసే వారి పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండండి’ అంటూ మనకు ఫోన్లో కాలర్ టోన్ రూపంలో తరచు వినిపిస్తున్న మాట. అది పాట అయినా మాట అయినా కానీ ఆ కాలర్ ట్యూన్ ఉద్దేశం మాత్రం.. ఫోన్ చేసే ఎవరైనా మీ వ్యక్తిగత డేటా ఏ రూపంలో అడిగినా ఇవ్వొద్దనేది దాని సారాంశం.అయితే బెంగళూరు టెకీ(Bengaluru Techie) మాత్రం,, అచ్చం ఇదే తరహాలో మోసం పోయి రూ. 11 కోట్లు పోగొట్టుకున్నాడు. ఓ సంస్థలో టెకీగా ఉద్యోగం చేస్తూ కొంత నగదును ‘మార్కెట్ ఇన్వెస్ట్మెంట్’లో పెట్టాడు. రూ. 50 లక్షలు పెడితే దాని విలువ రూ. 12 కోట్లకు చేరింది.ఈ విషయాన్ని పసిగట్టిన నిందితుడు.. బాధితుడ్ని అత్యంత చాకచక్యంగా వలలో వేసుకున్నాడు. విజయ్ కుమార్ అనే టెకీ నుంచి భారీ మొత్తంలో దోచుకుపోయాడు. తాము ఈడీ అధికారులమని, ప్రభుత్వ అదికారులమని చెబుతూ విజయ్ కుమార్ భయభ్రాంతలకు గురి చేసిందో ఓ ముఠా. మీరు మనీ లాండరింగ్ కేసులో ఉన్నారని, మిమ్ముల్ని అరెస్ట్ చేస్తామని తరచు బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో భయపడిన విజయ్ కుమార్.. వారు చెప్పినట్లు చేశాడు. వారు అడిగిన ఆధార్, పాన్ కార్డువివరాలతో పాటు తన వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారాన్ని కూడా వారికి అందించాడు.అంతే.. దాంతో సైబర్ నేరగాళ్ల పని ఈజీ అయ్యింది. ఇంకేముంది బాధితుడికి ఉన్న ఏడు బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ. 11 కోట్లను స్వాహా చేశారు. సుమారు ఏడు కోట్ల రూపాయలను ఒకే అకౌంట్ సుంచి దొంగిలించడం గమనార్హం.ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులుతాను నష్టపోయిన తర్వాత అసలు విషయం తెలుసుకున్నబాధితుడు విజయ్ కుమార్ లబోదిబో మన్నాడు. పోలీసుల్ని ఆశ్రయించాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఇదే దుబాయ్ కేంద్రంగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ స్కామ్(Cyber Fraud) కు సంబంధించిన ఘటనలో తరుణ్ నటానీ, కరణ్, దవల్ షాలను అరెస్ట్ చేశారు. షా అనే నిందితుడు దుబాయ్ చెందిన సైబర్ స్కామ్లో ఆరితేరిన ఓ వ్యక్తి సలహాలు ఇచ్చినట్లు సమాచారం. దీనికి గాను కోటిన్నరకు ఒప్పందం చేసుకున్నాడు సదరు దుబాయ్ చెందిన సైబర్ నేరగాడు. -
సిటీలోనే షెల్టర్? బిహార్ నుంచి వచ్చి ఇక్కడే మకాం
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలోని బీదర్తో పాటు మన నగరంలోని అఫ్జల్గంజ్ ప్రాంతంలో తుపాకీతో విరుచుకుపడిన దుండగులు ఇక్కడే షెల్టర్ తీసుకున్నారా? అంటే.. ఔననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. నగరంలో వీరి వ్యవహారశైలి, నేరం జరిగిన తీరు, వినియోగించిన వాహనంతో పాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న దర్యాప్తు అధికారులు ఈ అంచనాకు వచ్చారు. దీంతో దుండగులు బస చేసే అవకాశం ఉన్న ప్రాంతాల కోసం ఆరా తీస్తున్నారు. మరోపక్క దుండగులు గురువారం సాయంత్రం ట్రాలీ బ్యాగ్స్ కంటే ముందే కొత్త బ్యాక్ ప్యాక్ సైతం ఖరీదు చేశారు. రోషన్ ట్రావెల్స్ పక్కన ఉన్న దోశ కింగ్ హోటల్లోనే తమ బ్యాగ్లో నుంచి తుపాకీ తదితరాలను తీసి కొత్త బ్యాక్ ప్యాక్లో పెట్టుకున్నట్లు తేలింది. బిహార్ టు బీదర్ వయా సిటీ.. నేరం జరిగిన తీరు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న దుండగులు హైదరాబాద్ మీదుగానే బీదర్ వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితులు బిహార్కు చెందిన వారుగా ప్రాథమిక ఆధారాలు లభించాయి. బీదర్లోని శివాజీ జంక్షన్ వద్ద ఎస్బీఐ ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపే సీఎంఎస్ ఏజెన్సీ వాహనాన్ని కొల్లగొట్టడానికి దుండగులు బైక్పై వచ్చారు. ఈ వాహనానికి ‘ఏపీ’ రిజి్రస్టేషన్తో కూడిన నంబర్ ప్లేట్ ఉంది. ఇది అసలుదైనా, నకిలీదైనా వాహనం మాత్రం హైదరాబాద్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చోరీ చేసిందని భావిస్తున్నారు. చోరీ చేసిన వాహనంతోనే రెక్కీ? నగరంలోని ఒక లాడ్జిలో రెండు మూడు రోజులు బస చేసిన దుండగులు చోరీ చేసిన వాహనం పైనే బీదర్ వెళ్లి వస్తూ రెక్కీ చేసి ఉంటారని, అందుకే నేరం చేసిన తర్వాత కూడా రాయ్పూర్ వెళ్లడానికి అఫ్జల్గంజ్కు వచ్చి ఉంటారని అంచనా వేస్తున్నారు. శనివారం బీదర్ పోలీసులతో కలిసి చేసిన తనిఖీల నేపథ్యంలో రెండు అనుమానాస్పద వాహనాలను స్వా«దీనం చేసుకున్నారు. వీటిలో దుండగులు వాడింది ఏదనేదానిపై ఆరా తీస్తున్నారు. తిరుమలగిరి నుంచి మళ్లీ వెనక్కి... ఈ నేరగాళ్లకు హైదరాబాద్లోని ప్రాంతాలు, రహదారులకు సంబంధించి పూర్తి అవగాహన ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. గురువారం రాత్రి అఫ్జల్గంజ్లో ఫైరింగ్ తర్వాత అక్కడ నుంచి ఆటోలో ఎస్కేప్ అయ్యారు. సికింద్రాబాద్ అల్ఫా హోటల్ వద్ద ఆటో దిగిన దుండగులు డ్రైవర్కు డబ్బు ఇచ్చి పంపేశారు. ఆపై అక్కడ నుంచి మరో ఆటో మాట్లాడుకుని తిరుమలగిరి చౌరస్తాకు చేరుకున్నారు. ఆ ఆటో కూడా దిగిపోయిన ఇరువురూ రోడ్డు దాటి నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. అక్కడే దుస్తులు మార్చుకున్నారు. పాత బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్తో పాటు వ్రస్తాలను పడేశారు. ఆపై రోడ్డు మీదికి వచ్చి మరో ఆటో ఎక్కారు. ఆ ఆటో తిరిగి సికింద్రాబాద్ వైపే వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. దీంతో ఈ ఆటో ఎటు వెళ్లిందో తెలుసుకోవడంతో పాటు డ్రైవర్ను గుర్తించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ నాలుగు ప్రాంతాల్లో లోతుగా ఆరా... శనివారం ఉదయం నుంచి ఈ నేరానికి ముందు ఏం జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దుండగులు బస చేసి ఉంటారనే అనుమానంతో నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ, అఫ్జల్గంజ్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని లాడ్జిల్లో ఆరా తీస్తున్నారు. దర్యాప్తు అధికారులకు కీలక ఆధారం దొరికినట్లు సమాచారం. మనీష్ గ్యాంగ్ పనేనా? బీదర్తో పాటు నగరంలోని కొన్ని సీసీ కెమెరాల్లో లభించిన దుండగుల ఫొటోలను పోలీసులు దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులకు పంపారు. వీటిలో ఉన్న ఓ దుండగుడు తమ రాష్ట్రానికి చెందిన మోస్ట్ వాంటెడ్ మనీష్ కుషా్వహా అంటూ సమాచారం ఇచ్చారు. అతని కోసం ముమ్మరంగా గాలించడం మొదలెట్టారు. బిహార్ పోలీసులు ఆ ఫొటోలను అక్కడి నిరంజన గ్రామంలో ఉండే మనీష్ తల్లిదండ్రులకు చూపించారు. వాళ్లు అది తమ కుమారుడి ఫొటో కాదని చెప్పడంతో దర్యాప్తు మళ్లీ మొదటికి వచ్చింది. వారిచెప్పింది వాస్తవమా? కాదా? నేరం చేసింది మనీష్ నేతృత్వంలోని గ్యాంగ్ కాదా? అనే కోణాలను పరిశీలిస్తున్నారు. పోలీసుల వద్ద తుపాకీ ఉండాల్సిందే ‘సాక్షి’ కథనానికి స్పందించిన సిటీ సీపీఅఫ్జల్గంజ్ కాల్పుల ఉదంతం నేపథ్యంలో నగర పోలీసు విభాగంలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తూ ‘సరి చేయకుంటే సమస్యలెన్నో!’ శీర్షికన ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనంపై కొత్వాల్ సీవీ ఆనంద్ స్పందించారు. దీనిపై ఆయన శనివారం ఉన్నతాధికారులతో విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి విధుల్లో ఉండే పోలీసులు, టాస్క్ఫోర్స్ వంటి ప్రత్యేక విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది తమ వెంట తుపాకులు ఉంచుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల ప్రాణాలు, ఆస్తులు రక్షించడం కోసం పని చేసే అధికారులు తమ వెంట కచి్చతంగా పోలీసు విభాగం ఇచి్చన తుపాకీ ఉంచుకోవాలని స్పష్టం చేశారు. వీరితో పాటు ప్రత్యేక విభాగాల్లో పని చేస్తున్న వారిలో ఎవరికైనా తుపాకీ జారీ అనివార్యమైతే ఆ కోణంలో తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు తమ వద్ద ఉండే తుపాకులను కేవలం అత్యవసర సందర్భాలు, అవసరమైనప్పుడు మాత్రమే వాడాలని ఆనంద్ స్పష్టం చేశారు. కేవలం తుపాకీ కలిగి ఉండటమే కాదని... క్రమం తప్పకుండా ఫైరింగ్ ప్రాక్టీస్ చేయించాలని కొత్వాల్ నిర్ణయించారు. లా అండ్ ఆర్డర్తో పాటు అన్ని విభాగాల్లో పని చేస్తున్న వారితో దశల వారీగా దీన్ని చేయించాలని స్పష్టం చేశారు. నగరంలో పని చేయని సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించడంతో పాటు కొత్తవాటి ఏర్పాటు, అనుసంధానానికి ప్రాధాన్యం ఇవ్వాలని సీవీ ఆనంద్ నిర్ణయించారు. -
ఏరో ఇండియా.. మాంసం విక్రయాలపై నిషేధాజ్ఞలు
బెంగళూరు: ఏరో ఇండియా షో 2025 నేపథ్యంలో బెంగళూరు మహానగరపాలక సంస్థ కీలక ఆదేశాలు జారీ చేసింది. నగర శివారులో దాదాపు ఇరవై రోజులపాటు మాంసం విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఫిబ్రవరి 10 నుంచి 14 తేదీల మధ్య బెంగళూరు శివారు యలహంకలో 15వ ఎడిషన్ ఎరో ఇండియా షో జరగనుంది. అయితే.. ఎయిర్షో జరిగే ఈ ప్రాంతం నుంచి 13 కిలోమీటర్ల పరిధిలో మాంసం విక్రయాలపై నిషేధం విధిస్తూ బెంగళూరు పాలక సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 23వ తేదీ నుంచి ఫిబ్రవరి 17వ తేదీదాకా ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొంది.ಬಿಬಿಎಂಪಿ ವಲಯದ ಏರ್ಪೋರ್ಸ್ ಸ್ಟೇಷನ್ ನಿಂದ 13 ಕಿ.ಮೀ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ಬರುವ ಎಲ್ಲಾ ಮಾಂಸ ಮಾರಾಟದ ಉದ್ದಿಮೆಗಳನ್ನು ದಿನಾಂಕ: 10.02.2025 ರಿಂದ 14.02.2025 ರವರೆಗೆ ಏರ್ಶೋ ಪ್ರದರ್ಶನದ ಪ್ರಯುಕ್ತ ಮುಚ್ಚಲು ಸೂಚಿಸಲಾಗಿದೆ.#BBMP #BBMPCares #bbmpchiefcommissioner #Yelahanka #AeroIndia2025 #AeroIndia #airshow… pic.twitter.com/0Xuq3eA8Hd— Bruhat Bengaluru Mahanagara Palike (@BBMPofficial) January 18, 2025కారణం..ఏరో ఇండియా సందర్భంగా గగనతలంలో వైమానిక ప్రదర్శనలు ఉంటాయి. అయితే మాంసాహారం కోసం వచ్చే పక్షులు, మరీ ముఖ్యంగా కైట్స్ లాంటి పక్షుల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది బెంగళూరు మహానగరపాలక సంస్థ. యలహంక ఎయిర్ఫోర్స్ స్టేషన్ పరిధిలో.. కేవలం విక్రయాలు జరిపేవాళ్లకు మాత్రమే కాదు మాంసాహారాన్ని వడ్డించే హోటల్స్, రెస్టారెంట్లకు కూడా ఈ రూల్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. అంతేకాదు.. నగరంలోని చెత్తాచెదారాన్ని యలహంక పరిధిలో డంప్ చేయకూడదని హెచ్చరించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే.. బీబీఎంపీ యాక్ట్ 2020, ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ రూల్స్ 1937 రూల్ 91 ప్రకారం శిక్ష ఉంటుందని తెలిపింది.1994 నుంచి బెంగళూరులో ఏరో ఇండియా షో జరుగుతోంది. వివిధ దేశాలకు చెందిన విమానాలు, యుద్ధ విమానాలు ఇక్కడ ప్రదర్శిస్తారు. అలాగే వైమానిక విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అదే సమయంలో.. రక్షణ శాఖ మంత్రుల సదస్సు జరగనుంది. ఎరోస్పేస్ కంపెనీల నడుమ భారీ ఒప్పందాలకు ఏరో ఇండియా కేంద్రం కానుంది.🚀 The countdown begins!Hon'ble Raksha Mantri Shri #RajnathSingh launched the official #AeroIndia2025 teaser video today at the Ambassadors' Round Table.Mark your calendars for Asia's premier biennial airshow, taking flight in Bengaluru from 10th-14th February 2025!… pic.twitter.com/UCu5iXSsgN— Aero India (@AeroIndiashow) January 10, 2025 -
మంగళూరు బ్యాంకులో దోపిడీ.. ఉద్యోగులను గన్తో బెదిరించి..
మంగళూరు: కర్ణాటక(Karnataka)లో వరుస దోపిడీలు హడలెత్తిస్తున్నాయి. బీదర్ ఘటన మరవకముందే మరో చోరీ జరిగింది. మంగళూరు(Mangalore)లోని ఉల్లాల్ కేసీ రోడ్డులో కో-ఆపరేటివ్ బ్యాంకు(Co-operative Bank)లో ఉద్యోగులను గన్తో బెదిరించి ట్రెజరీలోని నగదు, బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. రూ.15 కోట్ల నగదు, 5 లక్షల విలువైన నగలతో పరారయ్యారు. బ్యాంక్ లంచ్టైంలో దోపిడీ జరిగింది. ఐదుగురు దొంగలు చోరీకి పాల్పడ్డారన్న ఉద్యోగులు.. బీహార్ గ్యాంగ్ పనిగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దుండగులు.. ఫియట్ కార్లో వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.కాగా, నిన్న(గురువారం) బీదర్లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఏటీఎంకు డబ్బులు తరలిస్తున్న వాహనంపై దోపిడీ దొంగలు దాడి చేశారు. బైక్పై వచ్చిన దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృతి చెందారు. దాడి అనంతరం డబ్బు పెట్టెతో దుండగులు అక్కడి నుంచి ఉడాయించారు. అందులో సుమారు రూ.93 లక్షల నగదు ఉన్నట్లు సమాచారం. మరోవైపు దాడి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిని అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.ఇదీ చదవండి: అఫ్జల్గంజ్ టూ ట్యాంక్బండ్ అలర్ట్.. బీదర్ ముఠా ఎక్కడ?ఇక దొంగలు తెలంగాణ వైపు తమ బైక్ను మళ్లించినట్లు బీదర్ పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో పోలీసులు బీదర్ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ క్రమంలో అఫ్జల్గంజ్ వద్ద దొంగలకు బీదర్ పోలీసులు కనిపించారు. దొంగల ముఠా.. తప్పించుకునేందుకు అఫ్జల్గంజ్లో ఉన్న ఓ ట్రావెల్స్ కార్యాలయంలోకి ప్రవేశించారు. పోలీసులపై కాల్పులు జరుపుతుండగా.. అక్కడే ఉన్న ట్రావెల్స్ కార్యాలయం మేనేజర్కు బుల్లెట్లు తగిలాయి. దీంతో అతనికి తీవ్ర రక్తస్రావం జరిగింది. అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు కూడా బీదర్ పోలీసులతో పాటు దొంగల ముఠాను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
డీకే Vs సతీష్.. కన్నడ కాంగ్రెస్లో రసవత్తర రాజకీయం!
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్లో రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్వార్ నడుస్తోంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో మరో మంత్రి మాటల యుద్ధానికి దిగారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ పోస్టుపై ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో, అధికార పార్టీ వ్యవహారంపై ప్రతిపక్ష బీజేపీ సెటైర్లు వేస్తోంది.కన్నడ కాంగ్రెస్లో కలహాలు ఉధృతమయ్యేలా ఉన్నాయి. డిప్యూటీ సీఎంతో మరో మంత్రి మాటల యుద్ధానికి దిగారు. నాయకులు ఇష్టానుసారం మాట్లాడరాదని ఇటీవలే హైకమాండ్ ఆదేశించినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గురువారం విధానసౌధలో విలేకరులతో మాట్లాడుతూ.. కేపీసీసీ అధ్యక్ష పోస్టు అంగడిలో దొరకదు. మీడియా ముందు మాట్లాడితే లభించదు. మనం పార్టీకి చేసిన సేవలు, శ్రమను గుర్తించి సరైన పదవి ఇస్తారని, కొంతమంది మీడియా ముందుకొచ్చి పదవిని కోరుతున్నారని అన్నారు.పార్టీలో అందరూ క్రమశిక్షణ పాటించాలని రాహుల్గాంధీ, సీఎం సిద్దరామయ్య సూచించారన్నారు. కాంగ్రెస్ పార్టీని తానొక్కడే కాదు, కార్యకర్తలు, ప్రజలు కలిసి గెలిపించారన్నారు. జై భీమ్ సమావేశాల నిర్వహణ పరిశీలనకు ఇన్చార్జి సుర్జేవాలా శుక్రవారం బెళగావికి వస్తారని, మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే ఆయనను అడగాలని నేతలకు సూచించారు. మరోవైపు మంత్రి సతీష్ జార్కిహొళికి కేపీసీసీ నుంచి నోటీసులు వెళ్లాయి.రేసులో ఉన్నాననలేదు: సతీశ్కేపీసీసీ నుంచి నోటీసులు ఇచ్చినప్పటికీ ఏమీ కాదు, దీనికి స్పష్టమైన సమాధానం అధ్యక్షుడి ముందు ఇస్తానని మంత్రి సతీష్ జార్కిహొళి చెప్పారు. డీకేపై తరచూ విమర్శలు చేస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నోటీస్ ఇచ్చే అధికారం ఆయనకు ఉందన్నారు. కేపీసీసీ రేసులో ఉన్నానని నేను ఎక్కడా చెప్పలేదన్నారు. తన మాటలతో ఎవరికీ ఇబ్బంది లేదని, నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. మీడియా ఉదయం హీరోను చేసి, సాయంత్రం విలన్ను చేస్తారని, ఇది సబబు కాదని వాపోయారు. మరోవైపు.. కాంగ్రెస్లో ప్రస్తుత పరిణామాలపై ప్రతిపక్ష బీజేపీ నేతలు సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. కాంగ్రెస్లో ఇలాంటివి కొత్తేమీ కాదని కామెంట్స్ చేస్తున్నారు. -
దొంగల ముఠా కాల్పుల కలకలం.. హైదరాబాద్ మొత్తం అలర్ట్
-
కర్ణాటకలో దొంగల బీభత్సం
-
సత్తా చాటిన పడిక్కల్.. ఫైనల్లో కర్ణాటక
విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో కర్ణాటక ఫైనల్కు చేరింది. నిన్న (జనవరి 15) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆ జట్టు హర్యానాపై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్యానా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. హర్యానా ఇన్నింగ్స్లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. కెప్టెన్ అంకిత్ కుమార్ (48) టాప్ స్కోరర్గా నిలువగా.. హిమాన్షు రాణా (44), అనుజ్ థక్రాల్ (23 నాటౌట్), రాహుల్ తెవాటియా (22), సుమిత్ కుమార్ (21), దినేశ్ బనా (20), అమిత్ రాణా (15 నాటౌట్), ఆర్ష్ రంగా (10), నిషాంత్ సంధు (10) రెండంకెల స్కోర్లు చేశారు. కర్ణాటక బౌలర్లలో అభిలాష్ శెట్టి నాలుగు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్ కృష్ణ, శ్రేయస్ గోపాల్ తలో రెండు, హార్దిక్ రాజ్ ఓ వికెట్ దక్కించుకున్నారు. కర్ణాటక ఆటగాడు దేవ్దత్ పడిక్కల్ మూడు క్యాచ్లు పట్టాడు.238 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక.. 47.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫీల్డర్గా రాణించిన దేవ్దత్ పడిక్కల్ బ్యాటింగ్లోనూ సత్తా చాటాడు. పడిక్కల్ 113 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో 86 పరుగులు చేశాడు. పడిక్కల్కు జతగా స్మరణ్ రవిచంద్రన్ కూడా రాణించాడు. స్మరణ్ 94 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 76 పరుగులు చేశాడు. ఈ టోర్నీ ప్రారంభం నుంచి భీకర ఫామ్లో ఉండిన కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఈ మ్యాచ్లో డకౌటయ్యాడు. అనీశ్ 22, కృష్ణణ్ శ్రీజిత్ 3 పరుగులు చేసి ఔట్ కాగా.. శ్రేయస్ గోపాల్ (23 నాటౌట్), అభినవ్ మనోహర్ (2 నాటౌట్) కర్ణాటకను విజయతీరాలకు చేర్చారు. హర్యానా బౌలర్లలో నిషాంత్ సంధు రెండు వికెట్లు పడగొట్టగా.. అన్షుల్ కంబోజ్, అమిత్ రాణా, పార్త్ వట్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. వరుసగా రెండో మ్యాచ్లో సత్తా చాటిన పడిక్కల్కర్ణాటక ఓపెనర్ దేవదత్ పడిక్కల్ వరుసగా రెండో మ్యాచ్లో సత్తా చాటాడు. సెమీస్కు ముందు క్వార్టర్ ఫైనల్లోనూ పడిక్కల్ ఇరగదీశాడు. బరోడాతో జరిగిన మ్యాచ్లో పడిక్కల్ (102) సూపర్ సెంచరీ చేసి తన జట్టును గెలిపించాడు. ఈ ప్రదర్శనకు గానూ పడిక్కల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. హర్యానాతో జరిగిన సెమీస్లోనూ పడిక్కల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.మహారాష్ట్రతో విదర్భ 'ఢీ'ఇవాళ జరుగనున్న రెండో సెమీఫైనల్లో మహారాష్ట్ర, విదర్భ జట్లు ఢీకొంటాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచే జట్టు జనవరి 18న జరిగే ఫైనల్లో కర్ణాటకతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
కర్ణాటక మంత్రి లక్ష్మికి తప్పిన ప్రమాదం
బెంగళూరు: కర్ణాటక మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్ ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు మంగళవారం బెళగావి వద్ద ప్రమాదానికి గురైంది. అయితే అదృష్టంకొద్దీ గాయాలతోనే ఆమె బయటపడ్డారు.మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్(Lakshmi Hebbalkar) ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తూ ఓ చెట్టును ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో మంత్రితో పాటు ఆమె సోదరుడు, ఎమ్మెల్సీ చెన్నరాజ్ హత్తిహోళి కూడా ఉన్నారు. ఈ ప్రమాదం కారణంగా వీరిద్దరికీ స్వల్ప గాయాలవగా.. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఉదయం 5గం. సమయంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఆమె ముఖం, వెన్నెముకకు, ఎమ్మెల్సీ చెన్నరాజ్(Chennaraj) తలకు గాయాలైనట్లు చెప్పారు. ప్రస్తుతం వీరికి చికిత్స అందిస్తున్నారని, ఆరోగ్యం నిలకడగానే ఉందని మృణాల్ వెల్లడించారు. ఓ వీధి శునకాన్ని తప్పించబోతుండగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టినట్లు మంత్రి కుమారుడు మృణాల్ హెబ్బాళ్కర్ చెబుతున్నారు. లక్ష్మి హెబ్బాళ్కర్ 2023, 2018 ఎన్నికల్లో బెళగావి రూరల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. -
ప్రేమజంట ఆత్మహత్య
కృష్ణరాజపురం: బెంగళూరు నగరంలో దారితప్పిన ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. జాన్సన్ అలియాస్ నాగరాజ్ (23), దిల్దాద్ (25) అనే యువతి ప్రేమించుకుంటున్నారు. దిల్దాద్కు ఇప్పటికే పెళ్లి కాగా నాగరాజ్కు ఇంకా పెళ్లి కాలేదు. సోషల్ మీడియా ద్వారా ఇద్దరికీ పరిచయమై ప్రేమగా మారింది. తరచూ షికార్లకు వెళ్తూ ఉండేవారు. తమ ఇద్దరి ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించబోరని విరక్తి చెందిన నాగరాజ్ శుక్రవారం రాచేనహళ్లి వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన దిల్దాద్ మనసులోనే కుమిలిపోయింది. ప్రియుడు లేని లోకం వద్దంటూ శనివారం అమృతహళ్లిలోని తమ ఇంటిలో దిల్దాద్ కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఘటనపై అమృతహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
సెమీస్లో మహారాష్ట్ర, కర్ణాటక
వడోదర: దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర, కర్ణాటక జట్లు సెమీ ఫైనల్కు దూసుకెళ్లాయి. శనివారం జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో పంజాబ్పై మహారాష్ట్ర 70 పరుగుల తేడాతో విజయం సాధించగా... బరోడాపై కర్ణాటక 5 పరుగుల తేడాతో గెలుపొందింది. పంజాబ్తో మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. యువ ఓపెనర్ అర్షిన్ కులకర్ణి (137 బంతుల్లో 107; 14 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కగా... అంకిత్ బావ్నె (85 బంతుల్లో 60; 7 ఫోర్లు) హాఫ్సెంచరీ చేశాడు. ఆఖర్లో వికెట్ కీపర్ నిఖిల్ (29 బంతుల్లో 52 నాటౌట్, 3 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు అర్ధశతకం సాధించడంతో మహారాష్ట్ర మంచి స్కోరు చేయగలిగింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (5), సిద్ధేశ్ వీర్ (0), రాహుల్ త్రిపాఠి (15) విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో టీమిండియా పేసర్ అర్‡్షదీప్ సింగ్ 3, నమన్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్ జట్టు 44.4 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. తాజా సీజన్లో రికార్డు స్కోర్లు తిరగరాసిన పంజాబ్ ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్ (14), అభిõÙక్ శర్మ (19) ఎక్కువసేపు నిలవకపోవడంతో పంజాబ్కు మెరుగైన ఆరంభం లభించలేదు. అన్మోల్ప్రీత్ సింగ్ (77 బంతుల్లో 48; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా ఫలితం లేకపోయింది. రమణ్దీప్ సింగ్ (2), నేహల్ వధేర (6), విఫలమయ్యారు. చివర్లో అర్‡్షదీప్ సింగ్ (39 బంతుల్లో 49; 3 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమైంది. మహారాష్ట్ర బౌలర్లలో ముఖేశ్ చౌధరీ 3 వికెట్లు, ప్రదీప్ రెండు వికెట్లు పడగొట్టారు. సెంచరీతో పాటు ఒక వికెట్ తీసిన అర్షిన్ కులకరి్ణకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. కర్ణాటకను గెలిపించిన పడిక్కల్ విజయ్ హజారే టోర్నీలో నాలుగుసార్లు టైటిల్ గెలిచిన కర్ణాటక జట్టు... హోరాహోరీగా సాగిన నాలుగో క్వార్టర్ ఫైనల్లో బరోడాను మట్టికరిపించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన కర్ణాటక 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. కెప్టన్ మయాంక్ అగర్వాల్ (6) విఫలం కాగా... దేవదత్ పడిక్కల్ (99 బంతుల్లో 102; 15 ఫోర్లు, 2 సిక్స్లు) ‘శత’క్కొట్టాడు. అనీశ్ (64 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్సెంచరీతో మెరిశాడు. బరోడా బౌలర్లలో రాజ్ లింబానీ, అతిత్ సేత్ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో తుదికంటా పోరాడిన బరోడా... చివరకు 49.5 ఓవర్లలో 276 పరుగులు చేసింది. ఓపెనర్ శాశ్వత్ రావత్ (126 బంతుల్లో 104; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేయగా... అతిత్ సేత్ (56; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకం సాధించాడు. కెప్టెన్ కృనాల్ పాండ్యా (30) ఫర్వాలేదనిపించాడు. బరోడా విజయానికి చివరి 5 ఓవర్లలో 44 పరుగులు అవసరం కాగా... ప్రధాన ఆటగాళ్లు క్రీజులో ఉండటంతో విజయం ఖాయమనిపించింది. అయితే టీమిండియా పేసర్ ప్రసిధ్ కృష్ణ కట్టుదిట్టమైన బంతులతో బరోడా బ్యాటర్లను కట్టడి చేశాడు. 47వ ఓవర్లో సెంచరీ హీరో శాశ్వత్ రావత్తో పాటు మహేశ్ పిటియా (1)ను ఔట్ చేశాడు. ఇక ఆఖరి ఓవర్లో విజయానికి 12 పరుగులు అవసరం కాగా... బరోడా 7 పరుగులు మాత్రమే చేయగలిగింది. కర్ణాటక బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, వాసుకి కౌషిక్, అభిలాశ్, శ్రేయస్ గోపాల్ తలా 2 వికెట్లు పడగొట్టారు. పడిక్కల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఆదివారం జరగనున్న క్వార్టర్ ఫైనల్స్లో గుజరాత్తో హర్యానా, విదర్భతో రాజస్థాన్ తలపడతాయి. -
మహిళలకు ఫ్రీ బస్సా? ఇదెక్కడి న్యాయం అంటూ ట్వీట్ : ఇచ్చిపడేసిన నెటిజనులు
అటు కర్ణాటక, ఇటు తెలంగాణాలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు పథకం మహిళలను బాగా ప్రయోజనకరంగా మారింది. మరోవైపు ఉచిత ప్రయాణంపై అనేక సందర్భాల్లో తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చర్చకు దారి తీసింది. ప్రస్తుతం దీనిపై తెగ చర్చ నడుస్తోంది.బెంగళూరుకు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తన అభిప్రాయాన్ని ట్విటర్లో పంచుకున్నాడు. అసలు కేవలం ఆధార్ చూపించిబస్సులో ప్రయాణించడం ఎంతవరకు న్యాయం అంటూ తన అక్కసంతా వెళ్లగక్కాడు. కుమార్ పోస్ట్లో అందించిన వివరాల ప్రకారం బెంగళూరు నుండి మైసూరుకు KSRTC బస్సులో ప్రయాణ ఛార్జీ రూ.210. ఈ బస్సులో 50 మంది ప్రయాణికులలో దాదాపు 30 మంది మహిళలు. 20 మంది పురుషులు డబ్బులుచెల్లించి టికెట్ తీసుకుంటే, ఆధార్ చూపించి 30మంది ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఇది న్యాయమా? సమానత్వం అంటే ఇదేనా?. ఒక వృద్ధుడు చెల్లించడానికి నోట్లు దొరక్క ఇబ్బంది పడుతోంటే, మరో పక్క వీడియో కాల్లో ఒక ధనిక యువతి దర్జాగా ఫ్రీగా వెళుతోంది అంటూ చెప్పుకొచ్చాడు.ప్రభుత్వం అంత మిగులు ఆదాయాన్ని ఆర్జిస్తుంటే, విమానాశ్రయ షటిల్ సర్వీస్ తరహాలో సార్వత్రిక ఉచిత బస్సు సేవను ప్రకటించవచ్చు కదా అని ప్రశ్నించాడు. ప్రపంచవ్యాప్తంగా, సబ్సిడీలు, సంక్షేమం భరించలేని వారికి కదా ఇచ్చేది, కానీ బెంగళూరు , మైసూరు వంటి నగరాల్లో ధనవంతులైన మహిళలకు ఉచిత పథకమా అంటూ ఆక్రోశమంతా వెళ్లగక్కాడు. ఓట్ల కోసం ఉచితాలనే దుర్మార్గపు చక్రంలోకి ప్రవేశించాం, సమీప భవిష్యత్తులోదీన్నుంచి బయటపడటం కష్టం అంటూ వాపోయాడు.దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. చాలామంది ఈ పథకాన్ని సమర్థించారు. సాధారణంగా ఉచితాలను ఆమోదించను కానీ రెండుమూడు సార్లు BMTCలో ప్రయాణించా. బస్సులో ప్రయాణించే చాలా మంది మహిళలు రోజువారీ వేతన కార్మికులు లేదా సాధారణ ఉద్యోగులే కనుక..అది చూసి మంచిగా అనిపించింది ఒక యూజర్ వ్యాఖ్యానించారు. "ఇది ఉచితాలు కాదు. ప్రజలు ఇచ్చే పన్నులకు బదులుగా ప్రభుత్వం సమాజానికి తిరిగి చెల్లిస్తోంది. ఇది అర్థం చేసుకోకపోతే, ప్రజాస్వామ్య ప్రభుత్వం ,పాలనా సూత్రాలు అర్థం కావు అంటూ మరో వినియోగడదారుడు చురకలేశాడు.మరి కొంతమంది ఆయన వాదను సమర్ధించారు. తాము చెల్లించే ఇలా పోతున్నాయి.. ఇది తనకు నచ్చలేదు అంటూ మహిళల ఫ్రీ బస్సు పథకంపై ప్రతికూలంగా స్పందించారు. నెగెటివ్ కామెంట్స్‘‘మీ వాదన సరైనదే. ఉచితం కాదు.. 50శాతం చేయండి. మహిళలకు ఈ ఉచిత ప్రయాణం పాఠశాల, కళాశాల ,పనికి వెళ్లే సాధారణ ప్రయాణికులకు కష్టంగా మారింది.’’ "నా ఆదాయపు పన్నును రోడ్లు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగించాలి... అర్హత లేని వారికి ఉచితాలను పంపిణీ చేయడానికి కాదు" I took an early morning bus to Mysuru, from Bengaluru. ₹210 fare. Comfortable KSRTC bus and a world class highway for fast travel.But I got a few thoughts. 1) Nearly 30 of the 50 passengers were women. Just show Aadhar and travel free. Is this fair? Is it equality? 2) 20… pic.twitter.com/2TfkzF88IA— Kiran Kumar S (@KiranKS) January 8, 2025 "ఇతరులు చెల్లించడానికి ఇబ్బంది పడుతుండగా, సంపన్న మహిళలకు ఉచితాలను అందజేయడం. ఓటు బ్యాంకు రాజకీయం తప్ప మరొకటి కాదు. సబ్సిడీలను మౌలిక సదుపాయాలు లేదా నిజంగా అవసరమైన వారికి సహాయం చేయడం వంటి నిజమైన సమస్యలకు ఉపయోగించాలి. ఇలా కొంతమందిపై అదనపు భారం ఎందుకుమోపాలి? ఇది స్పష్టమైన అసమానత, పురోగతి కాదు" -
లోకేశ్కు షాక్ ఇచ్చిన లోకాయుక్త
బనశంకరి: ప్రభుత్వ ఉద్యోగం మాటున అవినీతి రుచిమరిగిన అధికారులకు లోకాయుక్త షాక్ ఇచ్చింది. రవాణాశాఖ జాయింట్ డైరెక్టర్తో పాటు 8 మంది అధికారుల ఇళ్లు, ఆఫీసులు, వారి బంధుమిత్రుల ఇళ్లలో ముమ్మర సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో భారీగా అక్రమ సంపాదన బయటపడింది. బెంగళూరు, చిక్కమగళూరు, బీదర్, బెళగావి, తుమకూరు, గదగ్, బళ్లారి, రాయచూరు జిల్లాల్లో బుధవారం ఉదయం నుంచి ఒకేసారి దాడులు మొదలయ్యాయి. పెద్దసంఖ్యలో లోకాయుక్త పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. వార్డెన్ లోకేశ్ లీలలు బళ్లారి తాలూకా వెనుకబడిన వర్గాల శాఖ తాలూకా అధికారి ఆర్హెచ్ లోకేశ్ ఇంట్లో సోదాలు జరిగాయి. రూ.2 కోట్లకు పైగా విలువ చేసే రెండు ఇళ్లను గుర్తించారు. కుడితిని గ్రామానికి చెందినవారు. బీసీఎం హాస్టల్లో చదువుకుని వార్డెన్గా ఉద్యోగం సంపాదించారు. ఉద్యోగానికి, సంపాదించిన ఆస్తులకు పొంతన లేదు. కురుగోడు వద్ద 4 ఎకరాల తోట ఉంది. ఇతడి పుట్టినరోజుకు బీసీఎం హాస్టల్ విద్యార్థులు భారీ పూలమాల వేసి సంబరాలు చేశారు. అలా చేయకపోతే వేధింపులకు పాల్పడేవాడని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలోనూ చురుగ్గా ఉన్నాడు. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండా విదేశీ పర్యటన చేశారు. లోకాయుక్త దాడి గురించి ముందే తెలిసిందే ఏమోగానీ అజ్ఞాతంలోకి జారుకున్నాడు. గదగ్, బెళగావిలో.. గదగ్–బేటగేరి నగరసభ కార్యనిర్వాహక ఇంజనీర్ హుచ్చేశ్బండి వడ్డర్ నివాసం, కార్యాలయం, ఫాం హౌస్పై అధికారులు దాడిచేశారు. గదగ, గజేంద్రగడ, బాగల్కోటే తో పాటు ఐదుచోట్ల సోదాలు సాగాయి. ఆస్తిపాస్తుల పత్రాలు, ఫైళ్లను పరిశీలన చేపట్టారు. బెళగావి జిల్లా ఖానాపుర తహశీల్దార్ ప్రకాశ్ గైక్వాడ్ ఆఫీసు, బెళగావి నగర లక్ష్మీటెక్లోని ఇల్లు, నిప్పాణి నివాసం తో పాటు 6 చోట్ల దాడిచేశారు. పెద్దమొత్తంలో ఆస్తుల పత్రాలు లభించాయి. రిటైర్డు అధికారికి షాక్ లంచాలతో అక్రమాస్తులు సంపాదించుకుని రిటైరయ్యాను అని ధీమాగా ఉన్న తుమకూరు రిటైర్డు ఆర్టీఓ ఎస్.రాజు ఇంట్లో గాలింపు జరిపారు. ఎస్పీ హనుమంతరాయప్ప ఆధ్వర్యంలో సోదాలు జరిపి పెద్దమొత్తంలో ఆస్తుల వివరాలను సేకరించారు. వస్తు సామగ్రి లెక్కింపుమొత్తం దాడుల్లో అధికారుల నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, బంగారు–వెండి ఆభరణాలు, విలాసవంతమైన వస్తువులు, ఆస్తిపాస్తుల పత్రాలు, ఫైళ్లు, బ్యాంకు పాస్బుక్కులు, లాకర్ల సమాచారాన్ని పరిశీలన చేపట్టారు. కాగా, లోకాయుక్త గత మూడు నెలల నుంచి తరచుగా దాడులు చేస్తుండడంతో లంచగొండి ఉద్యోగుల్లో భయం ఆవహించింది.దాడులు ఎవరిపై.. ఎక్కడెక్కడ.. ⇒ శోభా – జాయింట్ కమిషనర్ రవాణాశాఖ, బెంగళూరు ⇒ డాక్టర్ ఎస్ఎన్.ఉమేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అధికారి, కడూరు, చిక్కమగళూరు జిల్లా ⇒ రవీంద్ర, ఇన్స్పెక్టర్ చిన్ననీటి పారుదల శాఖ అంతర్జల అభివృద్ధి ఉప విభాగం, బసవ కళ్యాణ, బీదర్ జిల్లా ⇒ ప్రకాశ్ శ్రీధర్ గైక్వాడ్, తహశీల్దార్, ఖానాపుర– బెళగావి జిల్లా ⇒ హుచ్చేశ్, అసిస్టెంట్ కార్యనిర్వాహక ఇంజనీర్ (ఇన్చార్జ్) బేటగేరి పురసభ, గదగ్ ⇒ ఆర్హెచ్ లోకేశ్, వెనుకబడిన వర్గా శాఖ సంక్షేమ అధికారి, బళ్లారి ⇒ హులి రాజ, గిల్లేసుగూరు కేంద్రం జూనియర్ ఇంజనీర్, రాయచూరు ⇒ ఎస్.రాజు, రిటైర్డు ఆర్టీఓ, రవాణాశాఖ తుమకూరు -
‘హెచ్ఎంపీవీ’పై కర్ణాటక బీజేపీ హెచ్చరిక
బెంగళూరు:దేశంలో అక్కడక్కడా హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదవుతున్నాయి.కర్ణాటకలో సోమవారం(జనవరి6) ఒక్కరోజే రెండు కేసులు నమోదవడంతో అక్కడ ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ స్పందించింది.హెచ్ఎంపీవీ వైరస్ను అంత తేలిగ్గా తీసుకోవద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరింది.కొత్త వైరస్ పట్ల ప్రజలు భయాందోళనకు గురి కావద్దని ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ చెప్పారని,కానీ, వైరస్ ప్రభావం గురించి ఏం తెలియనప్పుడు దానిని తేలికగా తీసుకోవద్దన్నారు.ఈ వైరస్ ఛైనాలో బీభత్సం సృష్టిస్తోందని,అక్కడి చిన్నారులు ఆస్పత్రుల పాలయ్యారన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వాలను అప్రమత్తం చేసిందని ప్రతిపక్షనేత అశోక గుర్తుచేశారు. హెచ్ఎంపీవీ వచ్చిన తర్వాత కాకుండా రాకముందే జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. ఈ వైరస్ ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతున్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు.హెచ్ఎంపీవీ ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించాలన్నారు.ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల లభ్యత,ఐసీయూ బెడ్ల వంటి సదుపాయాలపై దృష్టి సారించాలన్నారు. భయపడాల్సిన పనిలేదన్న జేపీ నడ్డా.. కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడుల్లో వైరస్ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ వైరస్ కొత్తదేమీ కాదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొనడం గమనార్హం.ఈ వైరస్ను 2001లోనే గుర్తించారని చాలా ఏళ్లుగా ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉందని నడ్డా తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో పాటు ఐసీఎంఆర్, ఎన్సీడీసీ నిశితంగా గమనిస్తున్నాయని చెప్పారు. ఇదీ చదవండి: భారత్లో పెరుగుతున్న హెచ్ఎంపీవీ కేసులు -
హలో.. హెచ్ఎంపీవీ వైరస్తో జాగ్రత్త
బెంగళూరు: : భారత్లో హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (HMPV) ఆందోళన సృష్టిస్తోంది. సోమవారం ఒక్కరోజే నాలుగు కేసులు వెలుగు చూడటం జనాల్లో అలజడి మొదలైంది. కర్ణాటకలో ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కర్ణాటక(Karnataka) ప్రభుత్వం ముందు జాగ్రత్తగా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అవి కరోనా రూల్స్ మాదిరిగానే ఉన్నాయి. నిబంధనలు ఇలా జనసందడి ప్రదేశాల్లో అనవసరంగా తిరగరాదని, అప్పుడప్పుడు చేతులను సబ్బు, శానిటైజర్తో కడుక్కోవాలని, జ్వరం, దగ్గు, జలుబు ఉన్నవారు బయట తిరగకుండా ఇంట్లోనే ఉండి, చికిత్స పొందాలని అందులో తెలిపారు. వారు టవల్, దుస్తులను వేరుగా ఉంచుకోవాలి.బహిరంగ స్థలాల్లో తిరిగేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని కీలక సూచన చేసింది.ఉమ్మివేరాదు. జలుబు, దగ్గు ఉంటే సొంత వైద్యం మానుకుని వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి. ఇల్లు, చుట్టు ప్రక్కల ప్రదేశాల్లో కార్యాయాల్లో శుభ్రతను కాపాడుకోవాలి.పోషకాహారాన్ని సేవించాలి, పిల్లలు, వయో వృద్ధుల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. రాష్ట్రంలో గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి డిసెంబర్లో సాధారణ జలుబు, దగ్గు సులుపెరగలేదన్నారు.మెల్లగా విస్తరిస్తున్న హెచ్ఎమ్పీవీదేశంలో హెచ్ఎమ్పీవీ మెల్లగా విస్తరిస్తోంది. భారత్లో ఒక్కరోజే హెచ్ఎమ్పీవీ కేసులు సంఖ్య నాలుగుకి చేరడంతో కలవరం మొదలైంది. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ వైరస్ కేసు ఒకటి వెలుగు చూసింది. కోల్కతాలో ఐదు నెలల శిశువుకు హెచ్ఎమ్పీవీ పాజిటివ్ వచ్చింది.ఇప్పటికే బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హెచ్ఎమ్పీవీ పాజిటివ్ రాగా, అహ్మదాబాద్లో ఓ చిన్నారికి ఈ వైరస్ సోకింది. దాంతో దేశంలోని రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి.భయం వద్దు.. జాగ్రత్తగా ఉండండిచిన్నారుల్లో వైరస్ వ్యాప్తికి హెచ్ఎంపీవీ కొత్త వేరియంట్ ఉండవచ్చునని సూచిస్తున్నప్పటికీ, తమ వద్ద ఇంకా పూర్తి వివరాలు లేవన్నారు కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి దినేష్ గుండూరావుఇదే అంశంపై కేంద్రం మరిన్ని వివరాలు సేకరిస్తోంది. ఈ సందర్భంగా హెచ్ఎంపీవీ వైరస్ కొత్తది కాదని గుర్తించాలి. భయపడొద్దు. ఇది సాధారణంగా దగ్గు, జ్వరం వంటి సాధారణ లక్షణాలను కలిగి ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ దానంతట అదే తగ్గుముఖం పడుతుంది’ అని అన్నారు.చైనాలో అధికం..ఇప్పటికే దీని ప్రభావం చైనా(China)లో అధికంగా ఉంది. అక్కడ వేలాది మంది జలుబు దగ్గ జ్వరం తదితర లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇది మరో కోవిడ్ విపత్తు అవుతుందా అన్న భయం నెలకొంది. గతంలో కోవిడ్ సృష్టించిన ప్రళయం అంతా ఇంతా కాదు. దాన్ని ప్రజలు ఇంకా మరిచిపోకముందే హెచ్ఎమ్పీవీ విస్తరించడంతో ఒకింత ఆందోళన ఎక్కువైంది. ముందస్తు జాగ్రత్తలపై పలు దేశాలు ఇప్పటికే కీలక సూచనలు చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే దీని ప్రభావంపై ఒక అంచనాకు రాలేకపోతున్నా, జా గ్ర త్తలు అవసరమనే విషయం అర్థమవుతోంది. కోవిడ్ సమయంలో ఏవైతే జాగ్ర త్లలు పాటించారో వాటిని తూచా తప్పకుండా పాటిస్తే వైరస్ బారి నుంచి గట్టెక్కే పరిస్థితులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. -
కర్ణాటకకు డ్రాగన్?
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటించనున్నారని తెలిసింది. కాగా ఈ సినిమా చిత్రీకరణను ఈ నెల మూడో వారంలో ప్రారంభించనున్నారని ఫిల్మ్నగర్ సమాచారం.కర్ణాటక లొకేషన్స్లో తొలి షెడ్యూల్ను ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారని టాక్. ఇక విదేశాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ను పూర్తి చేసుకుని, ఆల్రెడీ హైదరాబాద్ చేరుకున్నారు ఎన్టీఆర్. సో... ఈ నెలాఖర్లో ‘డ్రాగన్’ మూవీ కోసం ఎన్టీఆర్ కర్ణాటకకు వెళ్తారని ఊహించవచ్చు. మరోవైపు ఎన్టీఆర్ హిందీలో ‘వార్ 2’ అనే మూవీ చేస్తున్నారు. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్న ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. స్పై యాక్షన్ డ్రామా ‘వార్ 2’ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. -
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. రిలీజ్కు ముందే షాక్!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్- రామ్ చరణ్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. గురువారం టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. రిలీజైన గేమ్ ఛేంజర్ ట్రైలర్కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. గేమ్ ఛేంజర్లో రామ్ చరణ్ డైలాగ్స్ ఫ్యాన్స్కైతే గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా ఈ మూవీ సినీ ప్రియులను అలరించనుంది.రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి నాలుగు పాటలు, టీజర్, ట్రైలర్ను విడుదల చేశారు. రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా ప్రమోషన్స్ చేయనున్నారు. ఏపీలోని రాజమండ్రిలో జనవరి 4న భారీస్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. నిర్మాత దిల్ రాజు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.అయితే గేమ్ ఛేంజర్ టీమ్ ప్రమోషన్స్తో బిజీగా ఉండగా.. అక్కడ మాత్రం ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. కర్ణాటకలో సినిమాకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. దీంతో అక్కడి ఫ్యాన్స్ కొందరు సినిమా పోస్టర్లపై స్ప్రే కొడుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.కాగా.. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో ఎస్జే సూర్య, సముద్రఖని, శ్రీకాంత్, జయరాం కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాపై మొదటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. View this post on Instagram A post shared by Great India (@greatindiatelugu) -
కీచక భర్త హత్య .. ఆపై ముక్కలు
దొడ్డబళ్లాపురం: భార్యను పరుల పడకలోకి వెళ్లాలని వేధించడమే కాక.. కన్న కుమార్తెపై అత్యాచారయత్నం చేసిన ఓ కీచక భర్తను భార్యే హత్యచేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి మాయం చేసిన ఘటన కర్ణాటకలో తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా ఉమరాణి గ్రామ నివాసి శ్రీమంత ఇట్నాళ (35), భార్య సావిత్రి కూలి పనులు చేస్తూ జీవిస్తుంటారు. వారికి ఇద్దరు కుమార్తెలు. డబ్బుల కోసం సావిత్రిని పరాయి పురుషులతో పడుకోవాలని శ్రీమంత బలవంతం చేసేవాడు. దీంతో ఆమె భర్త దూరం పెట్టసాగింది.తనను నిత్యం అదే తరహాలో వేధించడమే కాకుండా.. ఇటీవల కన్న కూతురిపైనే శ్రీమంత అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సావిత్రి బండరాయితో బాది భర్తను హత్య చేసింది. తరువాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి చిన్న డ్రమ్ములో వేసి ఊరి బయటకు తీసుకెళ్లి విసిరేసింది. ఇంట్లో రక్తపు మరకలను శుభ్రం చేసింది. భర్త దుస్తులను కాల్చివేసింది. హత్యకు ఉపయోగించిన బండరాయిని కడిగి షెడ్లో దాచిపెట్టింది. కాగా గురువారం శ్రీమంత మృతదేహం ముక్కలు లభించడంతో పోలీసులు దర్యాప్తు చేయగా విషయం బయటపడింది. తానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సావిత్రి ఒప్పుకుంది. -
ప్రముఖ సింగర్తో బీజేపీ ఎంపీ వెడ్డింగ్ బెల్స్ (ఫోటోలు)
-
విద్యార్థినితో లెక్చరర్ ప్రేమపెళ్లి
మైసూరు: పాఠాలు నేర్పించిన గురువు ఓ విద్యార్థినితో పరారై పెళ్లి చేసుకున్న ఘటన జిల్లాలోని హుణసూరులో జరిగింది. తనకంటే వయస్సులో 15 ఏళ్లు పెద్దవాడైన అధ్యాపకుడిని పెళ్లి చేసుకోవడమే గాకుండా భద్రత కోరుతూ ఆమె ఠాణాలో ఫిర్యాదు చేసింది. వివరాలు.. హుణసూరు నివాసి పూర్ణిమ (24) ఎంఏ పూర్తి చేసి బీఈడీ చదివేందుకు హుణసూరులోని మహావీర్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్లో చేరింది. అధ్యాపకుడు యశోదకుమార్ (39)ను ఆమెకు ప్రేమ పాఠాలు బోధించాడు. విషయం పెళ్లి వరకూ వచ్చింది. పూరి్ణమ ఇంటిలో ఇందుకు అభ్యంతరం చెప్పి ఆమెను కాలేజీకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. కానీ మొబైల్లోనే వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది. సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని నమ్మించి ఇంటి నుంచి బయటకు వచ్చిన పూరి్ణమ తిరిగి రాలేదు. అనంతరం మొబైల్లో తాను ప్రేమించిన యశోదకుమార్ను పెళ్లి చేసుకున్నట్లు మెసేజ్ పెట్టింది. వీధుల్లో ఆకు కూరలు అమ్మి రూ.2 లక్షలు అప్పు చేసి మరీ కూతురిని కాలేజీలో చేరి్పస్తే, అధ్యాపకుడు లోబర్చుకున్నాడని తల్లిదండ్రులు చింతాక్రాంతులయ్యారు. -
హ్యాట్రిక్ సెంచరీల వీరుడికి షాక్.. వరుణ్ వీరోచిత శతకంతో..
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ క్రికెట్ జట్టు అనూహ్య విజయం సాధించింది. భారీ లక్ష్యం ముందున్నా... ఆందోళన చెందకుండా సంయమనంతో ఆడిన గెలుపును సొంతం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా మంగళవారం కర్ణాటక జట్టుపై మూడు వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకుంది.చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో హైదరాబాద్ రెండు బంతులు మిగిలి ఉండగా లక్ష్యాన్ని ఛేదించడం విశేషం. వరుణ్ గౌడ్ (82 బంతుల్లో 109 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్లు) అజేయ శతకంతో హైదరాబాద్ జట్టును గెలిపించాడు.మయాంక్ అగర్వాల్ హ్యాట్రిక్ సెంచరీటాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కర్ణాటక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (112 బంతుల్లో 124; 15 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీతో చెలరేగాడు. ఈ సీజన్లో అతడికి వరుసగా ఇది మూడో శతకం. మరోవైపు.. స్మరణ్ (75 బంతుల్లో 83; 3 ఫోర్లు, 5 సిక్స్లు) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.తిలక్ వర్మ @99ఇక హైదరాబాద్ బౌలర్లలో చామా మిలింద్ 3 వికెట్లు పడగొట్టగా... అనికేత్ రెడ్డి 2 వికెట్లు తీశాడు. ముదస్సిర్, రోహిత్ రాయుడులకు ఒక్కో వికెట్ లభించింది. కాగా లక్ష్యఛేదనలో హైదరాబాద్ 49.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ తిలక్ వర్మ (106 బంతుల్లో 99; 7 ఫోర్లు, 1 సిక్స్) పరుగు తేడాతో శతకం చేజార్చుకోగా... వరుణ్ గౌడ్ వీరవిహారం చేశాడు.వరుణ్ వీరోచిత శతకంతిలక్, వరుణ్ ఐదో వికెట్కు 112 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను చక్కబెట్టారు. కీలక సమయంలో తిలక్ వెనుదిరిగినా... చివరి వరకు క్రీజులో నిలిచిన వరుణ్ గౌడ్ భారీ షాట్లతో విరుచుకుపడి జట్టును గెలిపించాడు. తనయ్ త్యాగరాజన్ (17 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్), వరుణ్ ఏడో వికెట్కు 71 పరుగులు జోడించారు.చివరి ఓవర్ తొలి బంతికి తనయ్ అవుటైనా... చామా మిలింద్ (4 నాటౌట్)తో కలిసి వరుణ్ హైదరాబాద్ను విజయతీరాలకు చేర్చాడు. కర్ణాటక బౌలర్లలో ప్రవీణ్ దూబే, నికిన్ జోస్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇక ఈ మ్యాచ్లో 82 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లతో 109 నాటౌట్గా నిలిచి హైదరాబాద్ను గెలిపించిన వరుణ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. తమ తదుపరి మ్యాచ్లో శుక్రవారం పంజాబ్తో హైదరాబాద్ ఆడుతుంది. చదవండి: సిగ్గుపడాలి!.. టీమిండియాకు ఇలాంటి ఆటగాడు అవసరమా?: ఇర్ఫాన్ పఠాన్ -
99 పరుగుల వద్ద ఔటైన తిలక్ వర్మ
విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో హైదరాబాద్ ఆటగాడు, టీమిండియా ప్లేయర్ తిలక్ వర్మ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. కర్ణాటకతో ఇవాళ (డిసెంబర్ 31) జరిగిన మ్యాచ్లో తిలక్ 99 పరుగుల (106 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్) వద్ద ఔటయ్యాడు. కర్ణాటక నిర్దేశించిన 321 పరుగుల భారీ లక్ష్యఛేదనలో తిలక్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ ఔటైనా వరుణ్ గౌడ్ సూపర్ సెంచరీతో (109 నాటౌట్) హైదరాబాద్ను విజయతీరాలకు చేర్చాడు. తిలక్ ఔటయ్యాక హైదరాబాద్ గెలుపుపై ఆశలు వదులుకుంది. ఈ దశలో వరుణ్ గౌడ్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. వరుణ్ 82 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. వరుణ్ చెలరేగడంతో హైదరాబాద్ మరో రెండు బంతులు మిగిలుండగానే గెలుపు తీరాలకు చేరింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక.. మయాంక్ అగర్వాల్ (112 బంతుల్లో 124; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. కర్ణాటక ఇన్నింగ్స్లో నికిన్ జోస్ 37, కేవీ అనీశ్ 11, స్మరణ్ రవిచంద్రన్ 83, అభినవ్ మనోహర్ 1, కృష్ణణ్ శ్రీజిత్ 5, ప్రవీణ్ దూబే 24, విద్యాధర్ పాటిల్ 1, శ్రేయస్ గోపాల్ 19 (నాటౌట్), అభిలాశ్ షెట్టి 4 (నాటౌట్) పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో చామ మిలింద్ 3 వికెట్లు పడగొట్టగా.. అనికేత్ రెడ్డి 2, ముదస్సిర్, రోహిత్ రాయుడు తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్ 49.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కెప్టెన్ తిలక్ వర్మ పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. వరుణ్ గౌడ్ అద్భుతమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. హైదరాబాద్ ఇన్నింగ్స్లో తన్మయ్ అగర్వాల్ 35, రోహిత్ రాయుడు 0, హిమతేజ 15, నితేశ్ రెడ్డి 0, అరవెల్లి అవనీశ్ 17, తనయ్ త్యాగరాజన్ 25, చామ మిలింద్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. కర్ణాటక బౌలర్లలో ప్రవీణ్ దూబే, నికిన్ జోస్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. అభిలాశ్ శెట్టి, విద్యాధర్ పాటిల్, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ దక్కించుకున్నారు.మయాంక్ హ్యాట్రిక్ సెంచరీస్ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ హ్యాట్రిక్ సెంచరీలు సాధించాడు. డిసెంబర్ 26న పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 127 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 139 పరుగులు చేసిన మయాంక్.. డిసెంబర్ 28న అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో 45 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 100 పరుగులు చేశాడు. ఇవాళ (డిసెంబర్ 31) హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో మయాంక్ మరో సెంచరీ చేసి హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేశాడు. -
వరుసగా మూడో సెంచరీ చేసిన మయాంక్ అగర్వాల్
విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) 2024-25లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఈ టోర్నీలో మయాంక్ హ్యాట్రిక్ సెంచరీలు సాధించాడు. డిసెంబర్ 26న పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 127 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 139 పరుగులు చేసిన మయాంక్.. డిసెంబర్ 28న అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో 45 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 100 పరుగులు చేశాడు. ఇవాళ (డిసెంబర్ 31) హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో మయాంక్ 112 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 124 పరుగులు చేసి హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేశాడు. హైదరాబాద్తో మ్యాచ్లో మయాంక్ సూపర్ సెంచరీతో విరుచుకుపడటంతో కర్ణాటక భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది.ఓపెనర్గా వచ్చిన మయాంక్ అగర్వాల్ సూపర్ సెంచరీ చేయగా.. మరో ఓపెనర్ నికిన్ జోస్ 37, వన్డౌన్లో వచ్చిన కేవీ అనీశ్ 11, ఆతర్వాత వచ్చి న స్మరణ్ రవిచంద్రన్ 83, అభినవ్ మనోహర్ 1, కృష్ణణ్ శ్రీజిత్ 5, ప్రవీణ్ దూబే 24, విద్యాధర్ పాటిల్ 1, శ్రేయస్ గోపాల్ 19 (నాటౌట్), అభిలాశ్ షెట్టి 4 (నాటౌట్) పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో చామ మిలింద్ 3 వికెట్లు పడగొట్టగా.. అనికేత్ రెడ్డి 2, ముదస్సిర్, రోహిత్ రాయుడు తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 321 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్ 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ తొలి బంతికే రోహిత్ రాయుడు డకౌటయ్యాడు. అభిలాశ్ షెట్టి రోహిత్ రాయుడును క్లీన్ బౌల్డ్ చేశాడు. తన్మయ్ అగర్వాల్ (30), కెప్టెన్ తిలక్ వర్మ (25) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో హైదరాబాద్ గెలవాలంటే 37 ఓవర్లలో మరో 263 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి.గ్రూప్ టాపర్గా కర్ణాటకవిజయ్ హజారే ట్రోఫీ పాయింట్ల పట్టికలో కర్ణాటక గ్రూప్ టాపర్గా నిలిచింది. గ్రూప్-సిలో కర్ణాటక ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో నాలుగు విజయాలు సాధించింది. గ్రూప్-సిలో పంజాబ్, సౌరాష్ట్ర, ముంబై వరుసగా రెండు నుంచి నాలుగు స్థానాల్లో ఉండగా.. హైదరాబాద్ ఐదో స్థానంలో నిలిచింది. గ్రూప్-ఏలో గుజరాత్.. గ్రూప్-బి నుంచి మహారాష్ట్ర, గ్రూప్-డి నుంచి విదర్భ, గ్రూప్-ఈ నుంచి మధ్యప్రదేశ్ టాపర్లుగా ఉన్నాయి. -
ఎమ్మెల్యే అని కూడా చూడకుండా గుడ్డు పగలగొట్టారు బ్రో..
-
తీవ్ర ప్రమాదంలో రాజ్యాంగం
బెళగావి: మన రాజ్యాంగం మునుపెన్నడూ ఎదుర్కోనంతటి తీవ్ర ముప్పును ఎదుర్కొంటోందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. పార్లమెంట్లో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ను అవమానించడం హోం మంత్రి అమి త్ షా రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దేశ ప్రజలకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ వర్కింగ్ కమి టీ(సీడబ్ల్యూసీ) సమావేశం డిమాండ్ చేసింది. అమిత్ షా చర్య రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ఆర్ఎస్ఎస్–బీజేపీలు దశాబ్దాలుగా సాగిస్తున్న కుట్రలో భాగమేనని మండిపడింది. సీడబ్ల్యూసీ సమావేశం గురువారం కర్ణాటకలోని బెళగావిలో జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మాట్లాడారు. పెరుగుతున్న ధరలు, అవినీతి, రాజ్యాంగంపై దాడి వంటి వాటిపై పాదయాత్రలు వంటి రాజకీయ ప్రచార కార్యక్రమాలను 13 నెలలపాటు చేపడతామన్నారు. జవాబుదారీతనం, సమర్థత ప్రాతిపదికగా పారీ్టలో భారీగా సంస్థాగత ప్రక్షాళన చేపడతామని చెప్పారు. అసత్యాలను వ్యాప్తి చేసే వారిపై పోరాటానికి పారీ్టకి 2025 సంస్థాగత సాధికారిత వత్సరంగా ఉంటుందని ఖర్గే తెలిపారు. ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేందుకు ప్రాంతీయ, నూతన నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఉదయ్పూర్ డిక్లరేషన్ను అమలు చేసి ఏఐసీసీ నుంచి బూత్ స్థాయి వరకు ఎన్నికలు జరుపుతామన్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్కు గౌరవం కల్పించేందుకు పార్టీ పోరాడుతుందన్నారు. ఖర్గేతోపాటు పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శులు జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్న ‘నవ సత్యాగ్రహ బైఠక్’ఈ మేరకు రెండు రాజకీయ తీర్మానాలను చేసింది. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’వంటి విధానాలను తీసుకురావడం ద్వారా సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రభుత్వం ప్రయతి్నస్తోంది. న్యాయవ్యవస్థ, ఎన్నిక కమిషన్, మీడియాలను తీవ్ర ఒత్తిడులకు గురిచేసి అనుకూలంగా మార్చుకుంటోంది. ఇటీవలి పార్లమెంట్ సమావేశాలకు పాలకపక్షం తీవ్ర అవరోధాలు కలిగించింది. పోలింగ్ పత్రాలను ప్రజలకు అందుబాటులో లేకుండా చేసేలా ఎన్నికల నిబంధనావళిని మార్చుకుంటోంది’అంటూ సీడబ్ల్యూసీ మండిపడింది. హరియాణా, మహారాష్ట్రలలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సమగ్రత దెబ్బతిందని ఆరోపించింది. మైనారిటీ వర్గం లక్ష్యంగా విద్వేషం, హింసను ప్రభుత్వమే ప్రేరేపించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. కుల గణనను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని కేంద్రాన్ని కోరింది. ఆర్థిక పురోగతి మందగించిందని, అత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని తెలిపింది. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలి్పంచాలని, ఉపాధి హామీ పథకానికి అవసరమైన నిధులివ్వాలని కోరింది. మహాత్ముని ఆశయాలకు భంగం: సోనియా గాంధీ మహాత్మా గాం«దీయే స్ఫూర్తిగా తమ పార్టీ ఇకపైనా కొనసాగుతుందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ స్పష్టం చేశారు. మహాత్ముని ఆశయాలు, సిద్ధాంతాలు, సంస్థలకు కేంద్రంలో అధికారంలో ఉన్న వారి నుంచి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీజీ హత్యకు దారి తీసిన విషపూరిత వాతావరణాన్ని సృష్టించిన శక్తులైన మోదీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్లతో పోరాడాలంటూ ఆమె కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం సోనియా ఈ మేరకు సీడబ్ల్యూసీకి పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. -
కోడిగుడ్లతో బీజేపీ సీనియర్ ఎమ్మెలేపై దాడి
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, ఆర్ ఆర్ నగర్ ఎమ్మెల్యే మునిరత్న నాయుడి(Muniratna Naidu)పై కొందరు ఆగంతకులు కోడిగుడ్డు విసిరారు. అత్యాచారం కేసులో జైలుకు వెళ్లి మునిరత్న బెయిల్ మీద బయటకు వచ్చి రెండు నెలలు అయ్యింది. అయితే అప్పటి నుంచి ఆయనకు ప్రజల్లోకి వచ్చింది ఇదే తొలిసారికాగా.. ఆ టైంలోనే దాడి జరగడం గమనార్హం.బుధవారం లక్ష్మీ నగర్లో నిర్వహించిన వాజ్పేయి(Vajpayee) శతజయంతి ఉత్సవాల్లో మునిరత్న పాల్గొన్నారు. తిరిగి తన అనుచరులతో వెళ్తున్న సమయంలో కొందరు వ్యక్తులు ఆయనపైకి గుడ్డు విసిరారు. ఆపై మంటతో కాసేపు ఆయన విలవిలలాడిపోయారు. దీంతో పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ఆయనకు రకరకాల వైద్య పరీక్షలు జరిపారు. చివరకు ఆయన బాగానే ఉన్నారని ప్రకటించి అర్ధరాత్రి పూట వైద్యులు డిశ్చార్జి చేశారు.ఇదిలా ఉంటే.. మునిరత్న నాయుడు రాజకీయాలతోనే కాదు.. సినిమాలతోనూ పేరు సంపాదించుకున్నారు. ఉపేంద్ర, దర్శన్ లాంటి అగ్ర తారాలతో ఆయన చిత్రాలను నిర్మించారు. 2013, 2018, 2020, 2024 ఎన్నికల్లో రాజరాజేశ్వరి నగర్(RR Nagar) నుంచి ఆయన ఎమ్మెల్యేగా నెగ్గారు. గతంలో కర్ణాటక కేబినెట్ మినిస్టర్గానూ పని చేశారు. అయితే.. In a dramatic incident on Wednesday, #BJP MLA #Munirathna was targeted with an egg during an event marking the birth anniversary of former Prime Minister #AtalBihariVajpayee in #Bengaluru's #NandiniLayout.Police have arrested three individuals in connection with the attack and… pic.twitter.com/TWavEBJADq— Hate Detector 🔍 (@HateDetectors) December 25, 2024ఈ ఏడాది సెప్టెంబర్లో ఆయనపై అనూహ్యమైన ఆరోపణలు వచ్చాయి. సోషల్ వర్కర్గా పని చేసే ఓ మహిళ(40) ఫిర్యాదుతో ఈ బీజేపీ ఎమ్మెల్యేపై పలు నేరాల కింద కేసు నమోదయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద మూడు రోజులుల్లో ఉండి బయటకు వచ్చారాయన. అయితే బయటకు వచ్చి కొన్నినిమిషాలకే.. అత్యాచారం కేసు(Rape Case)లో ఆయన్ని మరోసారి అరెస్ట్ చేశారు.వాపై నెలరోజులపాటు సెంట్రల్ జైల్లో గడిపిన ఆయనకు.. అక్టోబర్ మూడో వారంలో ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఊరట ఇస్తూ బెయిల్ మంజూరు చేసింది. గుడ్డు దాడిపై రాజకీయం తమ పార్టీ సీనియర్ నేత మునిరత్నపై కోడిగుడ్డు దాడి కాంగ్రెస్ కార్యకర్తల పనేనని బీజేపీ(BJP) ఆరోపిస్తోంది. మునిరత్న మరో అడుగు ముందుకు వేసి.. ఇది తనను చంపేందుకు జరిగిన కుట్ర అని ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మరికొందరు కాంగ్రెస్ నేతలు ఈ కుట్రలో భాగమయ్యారని అన్నారాయన. అయితే ఘటనపై నందిని లేఅవుట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల వివరాలను వెల్లడించాల్సి ఉంది. -
అంతిమసంస్కారాలైన 25 ఏళ్లకు ఆమె తిరిగొస్తే..
ఆమె తన ఆచూకీని కోల్పోయి 25 ఏళ్లుగా ఆశ్రమంలో కాలం గడుపుతోంది. మరోవైపు ఆమె ఎక్కడి నుంచి ఈ ఆశ్రమానికి వచ్చిందన్న సంగతి ఆ ఆశ్రమ నిర్వాహకులకూ తెలియదు. ఇది హిమాచల్ ప్రదేశ్లోని మండి నగరానికి చెందిన కథనంఏళ్ల తరబడి ఆశ్రమంలో..పాతికేళ్ల తర్వాత అనూహ్య పరిస్థితుల్లో ఆమె తన కుటుంబాన్ని కలుసుకోగలుగుతోంది. మండి పరిపాలన అధికారుల చొరవతో ఇది సాధ్యమయ్యింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు 25 ఏళ్ల క్రితమే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. కర్ణాటక వాసి సాకమ్మ కథ ఇది. పాతికేళ్ల క్రితం ఆమె కర్ణాటక(Karnataka) నుండి ఉత్తర భారతదేశయాత్రలకు వెళ్లి, అక్కడ తప్పిపోయింది. అప్పటి నుంచి ఆమె మండి జిల్లా సుందర్నగర్లోని భంగ్రోటు వృద్ధాశ్రమంలో ఉంటోంది.కన్నడలో మాట్లాడటంతో..మండి అడ్మినిస్ట్రేటివ్ అధికారులు ఎప్పటికప్పుడు ఇలాంటి ఆశ్రమాలను సందర్శించి, అక్కడ సౌకర్యాలను పరిశీలిస్తుంటారు. దీనిలో భాగంగా అధికారి రోహిత్ రాథోడ్ ఇటీవల ఈ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. అక్కడ సాకమ్మను చూసి, ఆమెతో మాట్లాడారు. ఈ సమయంలో ఆమెకు హిందీ రాదని, కన్నడ భాష వచ్చని గుర్తించారు. దీంతో ఆమె కర్నాటకు చెందినదై ఉంటుందని భావించారు. వెంటనే ఆయన కన్నడ తెలిసిన ఒక అధికారిని పిలిపించి, ఆమెతో మాట్లాడించి పలు వివరాలు సేకరించారు.ఉత్తరభారతదేశ యాత్రలకు వెళ్లి..తరువాత ఆ మహిళ చెబుతున్న వివరాలతో కూడిన ఒక వీడియో(Video)ను రూపొందించి కర్ణాటక ప్రభుత్వానికి పంపించారు. ఆ దరిమిలా ఆమె కుటుంబ సభ్యులను మండీ అధికారులు గుర్తించారు. కాగా 25 ఏళ్ల క్రితం ఉత్తరభారతదేశ యాత్రలకు వెళ్లిన సాకమ్మ ఎంతకాలానికీ తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ దరిమిలా పోలీసులు అందించిన సమాచారం మేరకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఒక మహిళను సాకమ్మగా భావించి, ఆమె కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించి, క్రమంగా ఆమెను మరచిపోయారు.చనిపోయిందనుకున్న తల్లి వస్తుండటంతో..అయితే ఇప్పుడు సాకమ్మ బతికే ఉందని తెలియడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా మండీ అధికారులతో మాట్లాడిన సాకమ్మ తనకు 25 ఏళ్ల క్రితం నాటి విషయాలు మాత్రమే గుర్తున్నాయని, తనకు చిన్న పిల్లలు ఉన్నారని తెలిపింది. ప్రస్తుతం సాకమ్మ మతిస్థిమితం లేని స్థితిలో ఉంది. కాగా సాకమ్మకు నలుగురు పిల్లలు. వారిలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె బతికే ఉన్నారు. వారిందరికీ వివాహాలు కూడా అయిపోయాయి. సాకమ్మను తీసుకురావడానికి కర్ణాటక ప్రభుత్వం(Government of Karnataka) ముగ్గురు అధికారులను హిమాచల్ప్రదేశ్లోని మండీకి పంపింది. వారు సాకమ్మకు తీసుకుని కర్నాటకకు వచ్చి ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇది కూడా చదవండి: ఆవి క్రిస్మస్ పక్షులు.. వాటి కువకువలు సుమధుర సరాగాలు -
వెంకన్నకు కూడా దయ లేదాయె!
వెంకన్న దర్శనం చేసుకుని తిరిగివస్తున్న వారిని మృత్యువు కాటేసింది. రెప్పపాటులో నలుగురిని బలితీసుకుంది. మరో 11 మందికి చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. మరో 45 నిమిషాల్లో ఇళ్లు చేరతారనుకున్న వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో బాధిత కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన ఉండటంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.మడకశిర రూరల్: శ్రీసత్యసాయి జిల్లా మడకశిర రూరల్ పరిధిలోని బుళ్లసముద్రం గ్రామ సమీపంలో 544ఈ– జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆగి ఉన్న లారీని టెంపోట్రావెలర్ వెనుక నుంచి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తిరుమల వెళ్లి తిరిగి వస్తుండగా... గుడిబండ మండలం కేఎన్ పల్లి గ్రామానికి చెందిన శివరాజు, ప్రేమకుమారి(30) దంపతులకు అథర్వ (2) సంతానం. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న శివరాజు కుమారుడి పుట్టువెంట్రుకలు తీయించేందుకు కుటుంబీకులు, బంధువులతో కలిసి గురువారం సాయంత్రం ఓ టెంపోట్రావెలర్లో తిరుమల వెళ్లారు. శుక్రవారం తిరుమలలో అథర్వ నామకరణం, తలానీలాల కార్యక్రమం ముగించుకుని స్వామి దర్శనం చేసుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో స్వగ్రామం కేఎన్ పల్లికి తిరుగు పయనమయ్యారు. వీరి వాహనం శనివారం తెల్లవారుజామున మడకశిర మండలం బుళ్లసముద్రం గ్రామ సమీపంలోకి రాగానే 544ఈ– జాతీయ రహదారిపై ముందు నిలిచి ఉన్న లారీని వేగంగా ఢీ కొంది. ఈ ఘటనలో ప్రేమకుమారి, అథర్వతో పాటు అమరాపురానికి చెందిన శివరాజు పెద్దమ్మ రత్నమ్మ(65)తో పాటు పావగడ తాలుకా కొండపురం గ్రామానికి చెందిన డ్రైవర్ మనోజ్(32) మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. స్పందించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంతో పాటు మడకశిర ఫోర్ వీలర్ అసోసియేషన్ వాహనాల్లో మడకశిర ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు. ఈ ఘనటపై మడకశిర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నామకరణమే చివరి సంబరం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా... అందులో శివరాజు భార్య ప్రేమకుమారి(30), కుమారుడు అథర్వ (2)తో పాటు శివరాజు పెద్దమ్మ రత్నమ్మ (65) ఉండటంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమారుడు అథర్వకు నామకరణం చేసి గంటలు గడవక ముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో శివరాజు దుఃఖసారగంలో మునిగిపోయారు. భార్యను, బిడ్డను కోల్పోయి అతను రోదించిన తీరు స్థానికులనూ కంటతడిపెట్టించింది. మడకశిర ప్రభుత్వ ఆస్పత్రి వద్ద చిన్నారి అథర్వ మృతదేహం చూసిన వారంతా ‘అయ్యే ఎంత పని చేశావ్... దేవుడా అంటూ’ కన్నీరుమున్నీరయ్యారు. ఆస్పత్రి వద్ద మిన్నంటిన రోదనలు.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన అమరాపురం మండలం శివరం గ్రామానికి చెందిన నాగమణి, గుడిబండ మండలం కేఎన్పల్లి గ్రామానికి చెందిన గీతమ్మ, శ్రీదేవి, టీచర్ సుజాతమ్మ, కమలమ్మ, గంగమ్మ, కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా హరిబ్బి గ్రామానికి చెందిన శ్వేత, పావగడ తాలుకాలోని హర్తికేరే గ్రామానికి చెందిన గిరిజమ్మ, ఉమే‹Ù, అమ్మాజామ్మ, చిత్రదుర్గ జిల్లాకు చెందిన రవీంద్రలను మడకశిర ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా, కుటుంబీకులు, బంధువులు, గ్రామప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో ఆర్తనాదాలు చేస్తున్న తమవారిని చూసి తల్లిడిల్లిపోయారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం 10 మంది మెరుగైన వైద్య చికిత్సల కోసం తుమకూరు ఆస్పత్రికి తరలించారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ రత్న.. రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకున్న ఎస్పీ రత్న, డీఎస్పీ వెంకటేశ్వర్లు వెంటనే మడకశిరకు వచ్చారు. నేరుగా ఘటన స్థలానికి వెళ్లి వివరాలు ఆరా తీశారు. అనంతరం మడకశిర ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రుల పరామర్శించారు. నిద్రమత్తే కొంపముంచిందా?.. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న శివరాజు శనివారం బెంగళూరుకు వెళ్లాలని భావించారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి వెంకన్న దర్శనం కాగానే కుటుంబంతో కలిసి స్వగ్రామం బయలుదేరారు. తెల్లవారుజాము కంతా ఇంటికి చేరాలన్న ఆలోచనలో ఎక్కడా వాహనం నిలపలేదు. రాత్రంతా వాహనం నడిపి అలిసిపోయిన డ్రైవర్ మనోజ్(32)కు నిద్రమత్తు వచ్చింది. దీంతో ఆతను గోరంట్లలో వాహనం నిలిపి టీ కూడా తాగాడు. ఓ గంటలో వాహనంలోని వారిని స్వగ్రామం చేరిస్తే తన పని అయిపోయిందని భావించి వెంటనే బయలు దేరాడు. ఇదే క్రమంలో బుళ్లసముద్రం వద్ద రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీ కొన్నాడు. నేనేట్లా బతికేది దేవుడా... రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ మనోజ్ ఆరేళ్ల క్రితం డ్రైవర్గా బెంగళూరులో పనిచేసే వాడు. అక్కడే తమిళనాడు రాష్ట్రానికి చెందిన వినుతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మూడేళ్ల క్రితం స్వగ్రామం పావగడ తాలుకా కొండాపురం వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని మృతదేహాన్ని మడకశిర ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా, విగతజీవిగా చూసి భార్య వినుత బిగ్గరగా రోదించారు. ‘‘నాకు దిక్కెవరు దేవుడా...నేనెట్టా బతికేది’’ అంటూ ఆమె చేసిన రోదించిన తీరు అందరినీ శోకసంద్రంలోకి నెట్టింది. -
సంజూ శాంసన్కు షాక్
టీమిండియా డాషింగ్ బ్యాటర్ సంజూ శాంసన్కు షాక్ తగిలింది. విజయ్ హజారే వన్డే ట్రోఫీ కోసం ఎంపిక చేసిన కేరళ జట్టులో శాంసన్ చోటు కోల్పోయాడు. ఈ నెల ప్రారంభంలో నిర్వహించిన శిక్షణా శిబిరానికి గైర్హాజరైనందును సంజూని జట్టు నుంచి తప్పించినట్లు తెలుస్తుంది. సంజూ గైర్హాజరీలో సల్మాన్ నిజర్ కేరళ జట్టును ముందుండి నడిపించనున్నాడు. మొహమ్మద్ అజారుద్దీన్, ఎం అజ్నస్ కేరళకు వికెట్కీపింగ్ ఆప్షన్స్గా ఉన్నారు. కాగా, ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో సంజూ శాంసన్ కేరళకు కెప్టెన్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో కేరళ తృటిలో నాకౌట్స్కు క్వాలిఫై అయ్యే అవకాశాన్ని కోల్పోయింది. ఈ టోర్నీలో సంజూ ఆరు మ్యాచ్లు ఆడి హాఫ్ సెంచరీ సాయంతో 135 పరుగులు మాత్రమే చేశాడు. సంజూ ఇటీవలే దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా తరఫున రెండు సెంచరీలు సాధించాడు.విజయ్ హజారే ట్రోఫీ కోసం కేరళ జట్టు: సల్మాన్ నిజర్ (కెప్టెన్), రోహన్ కున్నుమ్మల్, షోన్ రోజర్, మొహమ్మద్ అజారుద్దీన్ (వికెట్కీపర్), ఆనంద్ కృష్ణన్, కృష్ణ ప్రసాద్, జలజ్ సక్సేనా, ఆదిత్య సర్వతే, సిజోమన్ జోసెఫ్, బాసిల్ థంపి, బాసిల్ NP, నిధీష్ MD, ఈడెన్ యాపిల్ టామ్, షరాఫుద్దీన్ , అఖిల్ స్కారియా, విశ్వేశ్వర్ సురేష్, వైశాక్ చంద్రన్, అజ్నాస్ M (వికెట్కీపర్)మనీశ్ పాండే ఔట్విజయ్ హజారే వన్డే ట్రోఫీ కోసం కర్ణాటక జట్టును కూడా నిన్ననే ప్రకటించారు. ఫామ్ల లేమి కారణంగా స్టార్ ఆటగాడు మనీశ్ పాండే జట్టులో చోటు కోల్పోయాడు. ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో మనీశ్ పేలవ ప్రదర్శన చేశాడు. ఆ టోర్నీలో మనీశ్ ఐదు ఇన్నింగ్స్ల్లో కేవలం 117 పరుగులు మాత్రమే చేశాడు. SMAT-2024లో కర్ణాటక నాకౌట్స్కు క్వాలిఫై కావడంలో విఫలమైంది. మనీశ్ గైర్హాజరీలో కర్ణాటక వైస్ కెప్టెన్గా శ్రేయస్ గోపాల్ వ్యవహరిస్తాడు. కెప్టెన్గా మయాంక్ అగర్వాల్ కొనసాగనున్నాడు.విజయ్ హజారే ట్రోఫీ కోసం కర్ణాటక జట్టు: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శ్రేయస్ గోపాల్ (వైస్ కెప్టెన్), ఎస్ నికిన్ జోస్, కెవి అనీష్, ఆర్ స్మరణ్, కేఎల్ శ్రీజిత్, అభినవ్ మనోహర్, హార్దిక్ రాజ్, వైషాక్ విజయ్కుమార్, వాసుకి కౌశిక్, విద్యాధర్ పాటిల్, కిషన్ బెదరే, అభిలాష్ శెట్టి, మనోజ్ భండాగే , ప్రవీణ్ దూబే, లువ్నిత్ సిసోడియా -
మార్చిలోగా వొడాఫోన్ ఐడియా 5జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా దేశవ్యాప్తంగా 2025 మార్చిలోగా వాణిజ్యపరంగా 5జీ సేవలను ప్రారంభించనుంది. ప్రస్తుతం కొన్ని నగరాల్లో పైలట్ ప్రాజెక్టు నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక క్లస్టర్ బిజినెస్ హెడ్ ఆనంద్ దానీ బుధవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. ‘తెలుగు రాష్ట్రాల్లో 11,500లకుపైగా 4జీ టవర్స్ ఉన్నాయి. దశలవారీగా వీటిని 5జీకి అప్గ్రేడ్ చేస్తాం. స్పామ్ సందేశాలను అడ్డుకునే సాంకేతికతను పరిచయం చేశాం. ఈ సేవలను కాల్స్కు కూడా త్వరలో విస్తరిస్తాం. ప్రస్తుతం స్పామ్ కాల్స్ కట్టడికి సంబంధించి టెక్నాలజీని పైలట్ ప్రాజెక్టుగా వినియోగిస్తున్నాం’ అని తెలిపారు. సంస్థకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఒక కోటికి పైగా చందాదార్లు ఉన్నారు. ఒక్కో వినియోగదారు నుంచి కంపెనీకి వస్తున్న సగటు ఆదాయం నెలకు రూ. 200 ఉంది. సగటున ఒక్కో కస్టమర్ డేటా వినియోగం ప్రస్తుతం నెలకు 18–20 జీబీ ఉందని ఆనంద్ చెప్పారు. దేశవ్యాప్తంగా కంపెనీ రూ.18,000 కోట్ల తాజా పెట్టుబడులు చేస్తోందని తెలిపారు. -
వృక్ష ప్రేమి తులసిగౌడ కన్నుమూత
యశవంతపుర: కర్ణాటకలో తన జీవితాన్ని మొక్కలు, చెట్ల పోషణకు అంకితం చేసిన తులసిగౌడ (90) కన్నుమూశారు. ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా హొన్నళ్లికి చెందిన తుళసిగౌడ మంగళవారం వృద్ధాప్య సమస్యలతో మృతి చెందారు. మొక్కలు నాటితే చాలదు, వాటిని అలాగే సంరక్షించాలని సూచించేవారు. 17 ఏళ్ల పాటు ఆమె అటవీశాఖలో దినసరి కూలీగా పని చేశారు. ఆమె సేవలను గుర్తించిన అప్పటి అటవీశాఖ అధికారి యల్లప్పరెడ్డి ఆమెను పర్మినెంట్ ఉద్యోగిని చేశారు. ఆమె ఉద్యోగంలో ఉన్నా, రిటైరైనా మొక్కలపైనే మనసంతా ఉండేది. అనేక గ్రామాలలో రోడ్డు పక్కన వేలాదిగా మొక్కలు నాటి సంరక్షించారు. ఫలితంగా పచ్చదనం పెంపొందించారు. సుమారు 30 వేల మొక్కలను నాటి ఉంటారని ఒక అంచనా. ఎంత ఎదిగినా అత్యంత నిరాడంబరంగా ఉండడం ఆమెకే చెల్లింది. తులసిగౌడ సేవలకు గుర్తుగా 2020 జూలైలో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఇటీవల ఆమె సొంతూరిలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఆనకట్ట కట్టాలని అధికారులు సర్వే చేశారు. ఇందుకోసం అటవీ ప్రాంతంలో చెట్లను నరకటంతో ఆమె ఆగ్రహించి ఆనకట్ట వద్దంటూ సర్వే అధికారులను వెనక్కి పంపారు. ప్రధాని మోదీ సంతాపం పర్యావరణవాది, పద్మశ్రీ తులసిగౌడ మరణం తీవ్ర విషాదకరమని ప్రధాని మోదీ ఎక్స్లో సంతాపం తెలిపారు. మొక్కల సంరక్షణకే తులసిగౌడ జీవితాన్ని ధారపోశారని, భూమిని రక్షించడానికి యువతకు స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. -
524 మీటర్లకు ఆల్మట్టి డ్యామ్
రాయచూరు రూరల్: కర్ణాటకలోని విజయపుర (బీజాపుర) జిల్లాలో కృష్ణా నదిపై ఉన్న భారీ జలాశయం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్వయంగా ప్రకటించారు. ఆల్మట్టి డ్యామ్ ప్రస్తుత ఎత్తు 519 మీటర్లు కాగా, దానిని 524.256 మీటర్ల ఎత్తుకు పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇందుకోసం రూ.లక్ష కోట్లతో భారీ విస్తరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఈ విషయమై సోమవారం బెళగావిలో రైతు సంఘాల నాయకులు, ఉత్తర కర్ణాటక ప్రజాప్రతినిధులతో సీఎం సిద్దరామయ్య సమావేశమై ప్రత్యేకంగా చర్చించారు. కాగా, అప్పర్ కృష్ణా మూడో దశ పథకం కింద, బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు లోబడి ఆల్మట్టి ఎత్తు పెంపు ఉంటుందని అధికారులు చెప్పడం గమనార్హం. డ్యామ్ ఎత్తు పెంపు వల్ల తమకు దక్కే 173 టీఎంసీల కృష్ణా జలాల్లో 130 టీఎంసీల వాడకానికి వెసులుబాటు లభిస్తుందని తెలిపారు. 13.10లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం వల్ల లభించే ఆ నీటిలో కలబుర్గి, రాయచూరు, కొప్పళ్, విజయపుర, యాదగిరి, బాగల్కోట, గదగ్ జిల్లాల్లోని 13.10 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. అలాగే డ్యామ్ ఎత్తు పెంపు వల్ల నీటి మట్టం పెరిగి పెద్ద సంఖ్యలో గ్రామాలు నీట మునుగుతాయి. నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ కింద పరిహారానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
దండుపాళ్యం ముఠా తరహాలోనే..
ఖమ్మంక్రైం: కర్ణాటకలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా తీసిన దండుపాళ్యం సినిమాలో మహిళలు, పురుషులు ఎనిమిది మంది ముఠాగా ఏర్పడతారు. బాగా డబ్బు ఉన్న ఒంటరి వృద్ధులు, మహిళలను ఎంచుకుని వారిని మహిళలు మాటల్లో పెడుతుండగా పురుషులు లోపలికి దూసుకొచ్చి ఇంట్లో ఉన్న వారిని హతమార్చి బంగారం, డబ్బు దోచుకెళ్తుంటారు. ఈ సినిమాను చూసి స్ఫూర్తి పొందారో ఏమో కానీ నేలకొండపల్లిలో గతనెల 26వ తేదీన వృద్ధ దంపతులు ఎర్ర వెంకటరమణ, కృష్ణకుమారిని ఇదే తరహాలో ఓ ముఠా హతమార్చింది. వీరెవరికీ పరిచయం లేకపోగా ఒకరి నుంచి ఒకరు కలుస్తూ ముఠాగా ఏర్పడి దోపిడీకి పథకం పన్నారు. కానీ దంపతులు ముందు జాగ్రత్తగా ఇంట్లో పెద్దగా నగదు, ఆభరణాలు ఉంచకపోవడంతో ముఠాకు నిరాశ ఎదురైనా ఇద్దరిని హతమార్చగా... బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఫోన్ కాల్డేటా ఆధారంగా అరెస్ట్ చేశారు. ఈమేరకు నిందితుల వివరాలను పోలీసు కమిషనర్ సునీల్దత్ శుక్రవారం వెల్లడించారు. జీవిత ఖైదు.. పెరోల్పై బయటకుఏపీలోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం ముగూలూరుకు చెందిన షేక్ ఆబిద్ అలియాస్ అబియాద్ అలీ 2011 ఏడాదిలో ఒకరిని హత్య చేసి బంగారం, డబ్బు ఎత్తుకెళ్లాడు. ఈకేసులో జీవిత ఖైదు శిక్ష పడింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తూ పెరోల్పై బయటకు వచ్చిన ఆబిద్ మళ్లీ జైలుకు వెళ్లకుండా తిరుగుతున్నాడు. అనంతరం కోదాడలో గది అద్దెకు తీసుకుని సోహైల్గా పేరు మార్చుకుని అప్పుడప్పుడు కూలీకి వెళ్తుండేవాడు. ఆయన ఇంటి ఎదురుగా ఉన్న భర్త లేని షేక్ హుస్సేన్బీతో పరిచయం పెంచుకోగా అది వివాహేతర సంబంధానికి దారి తీసింది.ఆపై చిలుకూరు మండలం నారాయణపురానికి చెందిన చిట్టిప్రోలు సురేష్(గే)తో మరోపేరుతో పరిచయం చేసుకుని ఆయనతోనూ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అనంతరం హైదరాబాద్లో ట్యాక్సీ నడిపే జగ్గయ్యపేటకు చెందిన స్నేహితుడు ఫరీద్ అహ్మద్ ద్వారా ఖమ్మంలో అబిద్ గది అద్దెకు తీసుకున్నాడు. కాగా, ఆబిద్తో వివాహేతర సంబంధం సాగిస్తున్న హుస్సేన్బీ ద్వారా నేలకొండపల్లి మండలం బుద్దారానికి చెందిన జమాల్బీ, ఆమెతో పైనంపల్లికి చెందిన షేక్ షబానా పరిచయమైంది. కాగా, షబానా ప్రస్తుతం అనంతగిరి మండలం తమ్మరబండపాలెంలో ఉంటోంది. ఆమెతో కూడా ఆబిద్ వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్నాడు.హత్యకు పథకం సిద్ధమైంది ఇలా...ఒకేసారి రూ.లక్షలు సంపాదిస్తే విలాసవంతంగా జీవనం గడపొచ్చని, అందుకు దోపిడీ సరైన మార్గమని షబానాకు ఆబిద్ చెప్పగా ఆమె తన మేనత్త జమాల్బీకి చెబితే ఆమె సైతం అంగీకరించింది. అయితే, ధనవంతులై ఒంటరిగా ఉండే వారి వివరాలు చెప్పాలని కోరగా ఆమె ఆరు నెలల క్రితం నేలకొండపల్లిలోని కొత్తకొత్తూరుకు చెందిన రేషన్ బియ్యం వ్యాపారం చేసే వెంకటరమణ పేరు సూచించింది. వృద్ధుడైన ఆయన భార్యతో ఉంటాడని, దోపిడీ చేయడం సులువని చెప్పింది. అనంతరం కోదాడలో ఉన్న హుస్సేన్బీ, గే అయిన సురేష్ను పిలిపించి వారినీ ఒప్పించాడు. ఆపై ఖమ్మంలో సెల్ఫోన్ సిమ్లు విక్రయించే మణికంఠతో పరిచయం పెంచుకుని డబ్బు ఆశ చూపి ఎలాంటి ఆధారాలు లేకుండా 10 సిమ్ కార్డులు, ఇంకో చోట ద్విచక్రవాహనం కొనుగోలు చేశాడు. అయితే, ఇంకో వాహనం నంబర్ ప్లేట్ చోరీ చేసి తాను కొన్న వాహనానికి అమర్చాడు. ఇంతలోనే నేలకొండపల్లి లోని వెంకటరమణ ఇంట్లో ఓ పోర్షన్ ఖాళీగా ఉండగా సురేష్ను పంపించగా ఆయన తన కుటుంబం మూడు నెలల తర్వాత వస్తుందని చెప్పినా వెంకటరమణ అద్దెకు ఇవ్వలేదు. ఆతర్వాత హుస్సేనీబీ, షబానాను పంపగా వారికి ఇల్లు అద్దెకు ఇచ్చాడు. ఆతర్వాత మణికంఠ వద్ద మరో ఐదు సిమ్లను తీసుకోగా.. హుస్సేన్బీ, షబానాలు వెంకటరమణ, కృష్ణ కుమారితో పరిచయం పెంచుకుని తరచూ వారి ఇంట్లో టీవీ చూస్తూ భోజనం చేసేవారు. వృద్ధ దంపతుల వద్ద భారీగా బంగారం, డబ్బు ఉందనే భావనతో నవంబర్ 25వ తేదీన రాత్రి అబిద్, సురేష్లు షబానా, హుస్సేన్బీ ఉంటున్న పోర్షన్లోకి ప్రవేశించారు. కానీ ఆరోజు హత్య చేయడం కుదరలేదు. మరుసటి రోజు 26వ తేదీన రాత్రి వెంకటరమణ ఇంట్లోకి వెళ్లిన షబానా, హుస్సేన్బీ టీవీ చూస్తూ కృష్ణకుమారితో మాటలు కలిపారు. ఆపై అబీద్, సురేష్ ఇంట్లోకి జొరబడి షబానా, హుస్సేన్బీ సహకారంతో కృష్ణకుమారి గొంతు పిసికి హత్య చేశారు. ఆతర్వాత ఆమె ఒంటిపై ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. అనంతరం ఇంట్లో బంగారు, డబ్బుకోసం వెతుకుతుండగా శబ్దానికి నిద్ర లేచిన వెంకటరమణ పక్క గది నుంచి రావడంతో ఆయననూ హత్య చేశారు. ఇలా చిక్కారు...దంపతుల హత్య కేసును ఛేదించేందుకు పోలీసు కమిషనర్ సునీల్దత్ ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి ఆధ్వర్యాన 45 మంది సిబ్బందితో ఐదు బృందాలను నియమించారు. దీంతో వారు అన్ని కోణాల్లో పరిశీలిస్తూ అనుమానం ఉన్న ప్రతీ ఒక్కరిని విచారించారు. మృతుడు వెంకటరమణకు ఫోన్ చేసిన వారి నంబర్ల ఆధారంగా 15 సిమ్ల కాల్డేటా వెలికితీశారు. దీంతో ఆబిద్ను అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది. ఈమేరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేసి ఎనిమిది తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగులను సీపీ అభినందించి రివార్డులు ప్రకటించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ ఇంటి అద్దె కోసం వచ్చే వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని, అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కాగా, ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోందని తెలి పారు. ఈసమావేశంలో ఏసీపీ తిరుపతిరెడ్డి, కూసుమంచి సీఐ సంజీవ్, ఎస్ఐలు జగదీష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.రాత్రంతా అక్కడే..దంపతులను హత్య చేశాక బయటకు వెళ్తే పోలీసులకు పట్టుబడతామని భావించి నిందితులంతా ఇంట్లోనే గడిపారు. డాగ్ స్క్వాడ్కు వాసన పసిగట్టకుండా ఇంటి చుట్టూ, మృతదేహాల వద్ద కారం పొడి చల్లాడు. ఇక 27న తెల్లవారుజామున అబీద్ బైక్పై హుస్సేన్బీ, షబానాను తీసుకెళ్లి ఆటోలో ఖమ్మం పంపించాడు. అనంతరం సురేష్కు బంగారంలో కొంత, నగదు కొంత ఇచ్చి కోదాడకు పంపాడు. ఆతర్వాత ఖమ్మం వెళ్లిన అబీద్ పాత బస్టాండ్ వద్ద హుస్సేన్బీ, షబానాతొ ఖమ్మంలో తాను ఉండే గదికి వెళ్లాడు. రెండు రోజుల పాటు కూడా వారు నేలకొండపల్లి కి వచ్చివెళ్తూ ఏం జరుగుతుందో తెలుసుకున్నాడు. ఆపై ఉన్న బంగారాన్ని అమ్మితే వాటా ఇస్తానని హైదరాబాద్లో ఉన్న స్నేహితుడైన ఫరీద్కు చెప్పాడు. దీంతో ఆయన ఖమ్మంలోని స్టోన్క్రషర్లో పనిచేసే విజయ్నగర్కాలనీకి చెందిన అనుమోల అనిల్కుమార్ని పరిచయం చేయడంతో ఆయనకు వాటా ఇస్తామని నమ్మబలికి బంగారం అమ్మాలని అప్పగించారు. -
ఆమె... ఒక హి‘స్టోరీ’ : ఎవరీ గోపీ సిద్ధి
ఆ అవ్వని చూస్తే కర్ణాటక వాసి అని ఎవరూ అనుకోరు. ‘ఆఫ్రికన్’ అనే అనుకుంటారు. గోపీ సిద్దీ పూర్వీకులు వందల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి ఇండియాకు తీసుకురాబడ్డారు. ఇక్కడికి వచ్చిన తరువాత స్థానిక సంస్కృతులతో కలిసిపోయినప్పటికీ, తమ మూల సంస్కృతిని కాపాడుకుంటున్నారు. సిద్దీస్ జాతి ప్రజలు రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలతో పాటు తమ సంస్కృతిని తన కథల ద్వారా లోకానికి చాటుతోంది గోపి సిద్దీ.తులసికొండ (కర్నాటక) ప్రాంతానికి చెందిన కుంటగని గ్రామానికి చెందిన గోపి సన్నా సిద్దీ జనాలకు ఒక వింత. ఒక పురాగాథ. విలువైన కథల చెట్టు. గోపి సిద్దీస్ అనేది ఆఫ్రికన్ సంతతికి చెందిన ఒక ప్రత్యేక జాతి. బానిసలు, కిరాయి సైనికులుగా, నావికులుగా వీరిని భారతదేశానికి తీసుకువచ్చారు. కాలక్రమంలో వీరు స్థానిక భాషలు నేర్చుకున్నారు. ఇక్కడి సంస్కృతిలో భాగం అయ్యారు. అదే సమయంలో తమ ఆఫ్రికన్ వారసత్వ మూలాలను కాపాడుకున్నారు. సంగీతం నుంచి నృత్యరూపాల వరకు అందులో ఎన్నో ఉన్నాయి.ఈ సిద్దీలు కర్నాటక, మహారాష్ట్రలలో ఎక్కువగా కనిపిస్తారు. గోపి సిద్దీ బాల్యంలో కొత్త ప్రాంతానికి వెళితే... ‘ఆఫ్రికన్’ ‘నీగ్రో’ అని పిలిచేవారు. ‘అలా ఎందుకు పిలుస్తున్నారు?’ అని అడిగితే తమ పూర్వీకులు ఆఫ్రికా నుంచి ఇక్కడికి వచ్చారు అని తల్లి చెబుతుండేది. ఎప్పుడూ ఏవో కథలు వినిపించే గోపి సిద్దీకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. భర్త ఆమెను వదిలేసి మూడు దశాబ్దాలు దాటింది. ఆక్రమణదారుల చెర నుంచి తన వ్యవసాయ భూమిని తిరిగి పొందాలి... ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ తన కథల పుస్తకాలను ప్రచురించాలనే ఉత్సాహం, ఉక్కు సంకల్పంలో మాత్రం మార్పు లేదు. తన పుస్తక ప్రచురణ కోసం నగలు కూడా తాకట్టు పెట్టింది.తమ జాతి ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు తనలో నుంచి రచయిత్రి బయటికి రావడానికి కారణం అయ్యాయి. ‘స్వేచ్ఛ గురించి తపించే దృఢమైన వ్యక్తిత్వం గోపి సిద్దీ సొంతం. జీవితంలో ఆమె ఎన్నో పోరాటాలు చేసింది. గోపి సిద్దీ కథల్లో బాధ మాత్రమే కాదు జ్ఞానం కూడా ఉంటుంది. పర్యావరణ స్పృహ ఉంటుంది. తన తాతల కాలం నుంచి వింటూ పెరిగిన కథలు అవి. తనకు పరిచయం అయిన వారికల్లా ఆ కథలను చెబుతుంది. ఆమె శక్తిమంతమైన రచయిత్రి’ అంటుంది ‘బుడా ఫోక్లోర్’ అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకు రాలైన సవితా ఉదయ్.పది సంవత్సరాల క్రితం తన ఇంట్లో పని చేయడానికి ఒక పనిమనిషిని వెదుకుతున్న సమయంలో ఉదయ్కు గోపీతో పరిచయం ఏర్పడింది. మారుమూల గ్రామానికి పరిమితమైన గోపి సిద్దీ జీవిత కథను తన డాక్యుమెంటరీ ద్వారా అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాడు బెంగళూరుకు చెందిన నిశాంత్ గురుమూర్తి. తన స్వచ్ఛంద సంస్థ ‘బుడా ఫోక్లోర్’ ద్వారా జానపదల కథానిలయమైన గోపి సిద్దీతో కర్ణాటక అంతటా పాఠశాల విద్యార్థులతో కథా సెషన్లు నిర్వహిస్తోంది సవితా ఉదయ్. కొంకణీ, కన్నడ భాషలలో ఆమె చెప్పే కథలకు పిల్లలు ఫిదా అవుతుంటారు.ఆ బాధ భరించలేనంత!భాషపరమైన అడ్డంకులు ఉన్నప్పటికి పట్నం పిల్లలు నా కథలను ఇష్టపడుతుంటారు. వారి అభిమానం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. కథలు చెప్పడం పూర్తయిన తరువాత నన్ను ఆ΄్యాయంగా కౌగిలించుకొని వీడ్కోలు చెబుతారు. బరువెక్కిన హృదయంతో ఇంటికి వస్తాను. వారిని విడిచి ఇంటికి వస్తుంటే... ఒక్కోసారి ఆ బాధ భరించలేనంతగా ఉంటుంది. – గోపి సిద్దీ -
శతక్కొట్టిన ద్రవిడ్ చిన్న కుమారుడు.. బౌండరీల వర్షం
మూలపాడు (ఆంధ్రప్రదేశ్): భారత బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ (153 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ శతకంతో మెరిశాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్తో జరిగిన ఈ మ్యాచ్లో ఈ కర్ణాటక బ్యాటర్ ఆకట్టుకున్నాడు.మూడు రోజుల మ్యాచ్లో ఆఖరి రోజు కర్ణాటక తొలిఇన్నింగ్స్లో 123.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 441 పరుగుల భారీస్కోరు చేయగా, మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. జట్టు తరఫున నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన అన్వయ్ మొదట శమంతక్ అనిరుధ్ (76)తో కలిసి మూడో వికెట్కు 167 పరుగులు జతచేశాడు.387 పరుగులకు ఆలౌట్అనిరుధ్ అవుటయ్యాక వచ్చిన సుకుర్థ్ (33)తో నాలుగో వికెట్కు 43 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్లో 128.4 ఓవర్లలో 387 పరుగులు చేసి ఆలౌటైంది. 54 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన కర్ణాటకకు 3 పాయింట్లు లభించగా, జార్ఖండ్ ఒక్క పాయింట్తో సరిపెట్టుకుంది.జోనల్ టోర్నమెంట్లో డబుల్ సెంచరీఅన్వయ్ ద్రవిడ్ గతేడాది కర్ణాటక అండర్–14 జట్టుకు సారథ్యం వహించాడు. విజయ్ మర్చంట్ టోర్నీకి ముందు జరిగిన కేఎస్సీఏ (కర్ణాటక క్రికెట్ సంఘం) అండర్–16 ఇంటర్ జోనల్ టోర్నమెంట్లో బెంగళూరు జోన్కు ప్రాతినిధ్యం వహించిన అన్వయ్... తుంకూర్ జోన్పై చెలరేగి ఆడాడు. డబుల్ సెంచరీ (200 నాటౌట్)తో అజేయంగా నిలిచాడు.ఇక అన్వయ్ అన్నయ్య 19 ఏళ్ల సమిత్ కూడా ఇదివరకే జూనియర్ క్రికెట్లో ఆల్రౌండర్గా నిరూపించుకున్నాడు. సొంతగడ్డపై ఆ్రస్టేలియా అండర్–19 జట్టుతో జరిగిన పరిమిత ఓవర్ల, ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో సమిత్ ద్రవిడ్ రాణించాడు. చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత
-
హలేబీడు ఉలి చెక్కిన గ్రంథం, ఆసక్తికర విషయాలు
హలేబీడు ఈ ప్రదేశాన్ని ఒకటిగా పలకడం పర్యాటకరంగానికి అలవాటు ఉండదు. బేలూరు– హలేబీడు అని పలుకుతారు. ఈ రెండు ప్రదేశాల మధ్య దూరం 17కిలోమీటర్లు. ఈ రెండు ప్రదేశాల్లోని నిర్మాణాలు ఒకేరీతిలో ఉంటాయి. ఒకే రాజవంశానికి చెందిన కట్టడాలు. హొయసల రాజవంశం దక్షిణభారతదేశాన్ని దాదాపు 200 ఏళ్లు పాలించింది. యుద్ధాలు లేని ప్రశాంత సమయంలో ఈ నిర్మాణాలన్నీ జరిగాయి. హొయసలుల ఆలయాలన్నీ మహాభారతం, రామాయణం, భాగవత గ్రంథాలకు శిల్పరూపాలు. వేదవ్యాసుడు, వాల్మీకి రాసిన గ్రంథాలను శిలల్లో ఆకర్షణీయంగా చెక్కిన శిల్పులు కూడా అంతటి మహోన్నతులే అని చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. పదకొండవ శతాబ్దంలో ఈ స్థాయిలో విరాజిల్లిన ప్రదేశం ఆ తర్వాత రాజకీయ సంక్లిష్టతల దుష్ప్రభావాన్ని ఎదుర్కొన్నది. ఇప్పుడు కనిపిస్తున్నది 14 శతాబ్దంలో అల్లాఉద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ తుగ్లక్ల దాడిలో విధ్వంసం అయిన తర్వాత మిగిలిన రూపాలే. ఆ విగ్రహాలకు పూర్వవైభవం తీసుకురావడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మెరుగులు దిద్దుతోంది.కళకు శిలాసాక్ష్యాలుహొయసల రాజవంశం కళాభిరుచికి ప్రతీకలు ఆలయాలు. వీటిని హొయసల టెంపుల్స్గా వ్యవహరిస్తారు. హలేబీడులో హొయసలేశ్వర ఆలయంతోపాటు కేదారేశ్వరాలయం, జైన్ ఆలయాలు ప్రసిద్ధం. హొయసలుల ఆలయ నిర్మాణం ప్రత్యేకంగా ఉంటుంది. వేస్మెంట్ నక్షత్రం ఆకారంలో ఉంటుంది. హొయసలేశ్వర ఆలయం ట్విన్ టెంపుల్. శైవంతోపాటు వైష్ణం, శాక్తేయంతోపాటు వేదాలన్నింటికీ ప్రతిరూపం. దేవతల విగ్రహాలు, మునుల విగ్రహాలతోపాటు ఏనుగులు, సింహాలు, గుర్రాలు, పూలతీగలు అడవిలో చెట్టును అల్లుకున్నట్లు రాతిలో సజీవరూపంలో ఉంటాయి. ఈ నిర్మాణాల్లో రాణి కేతలాదేవి చొరవ ప్రశంసనీయం. ఇక జైన ఆలయాల్లో పార్శ్వనాథుడు, శాంతినాథ, ఆదినాథ ఆలయాలున్నాయి. హొయసలేశ్వర ఆలయం ఆవరణలో బాహుబలి ప్రతిరూపాన్ని కూడా చూడవచ్చు. అసలు బాహుబలి (గోమఠేశ్వరుడు) విగ్రహం శ్రావణబెళగొళ లోని వింధ్యగిరి కొండల్లో ఉంది.మెట్లబావి కూడా ఉందిబెంగళూరు నుంచి 200 కిమీల దూరంలో ఉంది హలేబీడు. ఈ టూర్లో బేలూరులోని చెన్నకేశవాలయాన్ని కూడా కవర్ చేయవచ్చు. హలేబీడుకు కిలోమీటరు దూరంలో హులికెరె అనే గ్రామంలో స్టెప్వెల్ ఉంది. రాణీకీవావ్, అదాలజ్ వావ్ వంటి గొప్ప స్టెప్వెల్స్కి గుజరాత్ ప్రసిద్ధి. ఢిల్లీలో కూడా అగ్రసేన్ కీ బావోలీ ఉంది. ఐదేళ్ల కిందట తెలంగాణ జిల్లాల్లో కూడా స్టెప్వెల్లు బయటపడ్డాయి. కర్నాటకలో మెట్లబావుల సంస్కృతి తక్కువే. కానీ చూడాల్సిన ప్రదేశం. నిర్మాణ శైలిలో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికీ ఉన్న తేడాలను అర్థం చేసుకోవాలంటే చూసి తీరాలి. టూర్ ఆపరేటర్లను ముందుగా అడిగి ఇవన్నీ కవర్ చేసేలా మాట్లాడుకోవాలి. ఆభరణాల నందిటెంపుల్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన మ్యూజియంలో 15 వందలకు పైగా శిల్పాలు, ఇతర కళా రూపాలున్నాయి. నంది విగ్రహం ధరించిన ఆభరణాలను నిశితంగా పరిశీలించడానికి కనీసం పది నిమిషాల సమయం పడుతుంది. సాధారణంగా శివాలయాల్లో శిల్ప సౌందర్యానికి అద్దం పట్టేది నంది విగ్రహమే. ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి, తెలంగాణలోని రామప్ప ఆలయాల్లో కూడా నంది విగ్రహాలు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినంత గొప్పగా ఉంటాయి. శిల్పులు తమ నైపుణ్యాన్ని శివలింగాన్ని చెక్కడంలో వ్యక్తం చేయడానికి ఏమీ ఉండదు. అందుకే నంది విగ్రహం, ఆ విగ్రహానికి ఆభరణాల కోసం ఉలికి పని చెప్తారు. దాంతో ఆ శిల్పి చాతుర్యం అంతా నందిలో కనిపిస్తుంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కర్ణాటకలో మళ్లీ తెరపైకి అధికార మార్పిడి అంశం
-
నా చివరి శ్వాస వరకు సిద్ధరామయ్య కోసం నిలబడతా: డీకే శివకుమార్
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. తాను చనిపోయే వరకు సిద్ధరామయ్య కోసం ఒక రాయిలా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘సిద్ధరామయ్యకు నా చివరి శ్వాస వరకూ రాయిలా అండగా ఉంటాను. నేను ఎక్కడ ఉన్నా నిబద్ధతతో పనిచేస్తాను. కాంగ్రెస్ శక్తి అంటే దేశ శక్తి. దేశ చరిత్రలో కాంగ్రెస్ త్యాగలే ఎక్కువ. ఈ పార్టీ అధికారంలో ఉందంటే అన్ని వర్గాలకూ అధికారం దక్కినట్లే. కాంగ్రెస్ అధికారంలో ఉంటే సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ప్రజల కష్టాలకు స్పందిస్తుంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో ప్రతిపక్షాలను ఉద్దేశించి కౌంటరిచ్చారు. ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ..‘25 ఏళ్ల తర్వాత హాసన లోక్సభ నియోజకవర్గాన్ని గెలచుకున్న కాంగ్రెస్ 2028లోనూ ఇక్కడి అన్ని స్థానాలను గెలుచుకుంటుంది. ఈ జిల్లాలో మహిళలకు జరిగిన అన్యాయాన్ని చూసి బాధపడని దేవేగౌడ.. తన మనవడి కోసం చెన్నపట్టణకు వచ్చి కన్నీరు పెట్టారు. నందిని పాలను అమూల్ బ్రాండ్లో విలీనం చేయాలని ఎన్డీఏ ప్రయత్నించిందని ఆరోపించారు. రాష్ట్ర బ్రాండ్ను మేము ఢిల్లీలో ఆవిష్కరించామని గుర్తుచేశారు. కర్ణాటక ప్రజలు కాంగగ్రెస్ వైపు నిలబడ్డారు. 2028 ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం పునరావృతం అవుతుందని కామెంట్స్ చేశారు. -
మహిమాన్వితమైన సూగూరేశ్వర ఆలయం!..ఎక్కడ లేని విధంగా రథోత్సవం..
కర్ణాటక రాష్ట్రం శైవాలయాలకు, శివభక్తులకు పుట్టినిల్లు. ఏ మారుమూల గ్రామాలకెళ్లిన శివాలయాలు దర్శనమిస్తాయి. రాయచూరు నుంచి 20 కి.మీ దూరంలో సూగూరేశ్వర దేవాలయం ప్రసిద్ధి చెందింది. కృష్ణా నది పక్కనే 11వ శతాబ్దంలో వెలిశాయని శిలా శాసనాలు చెబుతున్నాయి. శివుని కొడుకుగా పిలువబడే వీరభద్రేశ్వరుడు వెలిశాడు. విజయనగర సామ్రాజ్యాధిపతులైన ప్రౌఢ దేవరాయలు గుడి నిర్మాణం చేపట్టారు. ప్రభువు అసర వీర ప్రతాప దేవరాయలు పూర్తి చేశారు. కొల్హాపుర దేవస్థాన రాజవంశస్థుడైన బసవంతు ప్రభు కుష్టు రోగంతో బాధపడుతుండగా సూగూరేశ్వరుడు ప్రభు కలలో కనిపించి తనను దర్శించుకుంటే వ్యాధి నయం అవుతుందని ఆజ్ఞాపించారు. రోగం నయం కావడంతో ప్రభు గర్భగుడిని నిర్మించారు. పిల్లలు పుట్టని దంపతులు దర్శించుకుంటే సంతానం కలుగుతుందని నమ్మకం గట్టిగా నెలకొంది. దేవాలయం ప్రవేశ ద్వారంలో దక్షిణామూర్తిగా వెలసిన శాంత మూర్తిగా దర్శనమివ్వడం భక్తులను ఆకట్టుకుంది. ధ్యాన మండపంలో విజ్ఞాలు కలగకుండా విఘ్నేశ్వరాలయం ఉంది. ప్రతి నిత్యం త్రికాల పూజలు స్వామి జాతర, రథోత్సవాలు రెండున్నాయి. దక్షిణ, తూర్పు, పడమరల్లో వెలసిన గోపురాల్లో దేవుళ్లను ఏర్పాటు చేయడం ఆకర్షణగా ఉంది. పడమరలో గోపురం వెలిస్తే దేవాలయం అభివృద్ధి చెందుతుందనే విశ్వాసం ఉంది. ఉదయం 5, మధ్యాహ్నం 11, రాత్రి 8 గంటలకు ప్రత్యేక త్రికాల పూజలు చేస్తారు. ప్రతి సోమ, గురువారం బెల్లం తేరులో ఊరేగింపు, పల్లకీ సేవలు నిర్వహిస్తారు.అభిషేకంతో పాటు మహా, కాశీ, నంద, ఆకుల, పువ్వుల, అక్షర, పల్లకీ, ఊయల పూజలు చేస్తారు. ప్రతి నిత్యం రెండు వందల మందికి ఉచిత ప్రసాదం, సోమ, గురువారం అమావాస్య రోజున 1000 మందికి భోజనం ఏర్పాటు దేవాలయం కమిటీ నిర్దారించారు. పెళ్లి చేసుకోవడానికి దాస సాహిత్య మండపం ఉంది. పేదలకు ఎలాంటి డబ్బులు లేకుండా ఉచితంగా కేటాయిస్తామని అధికారి సురేష్ వర్మ తెలిపారు.7న జోడు రథోత్సవాలు: శనివారం దేవసూగూరు సూగురేశ్వరుడి జోడు రథోత్సవాలు జరుగుతాయని దేవాలయ కమిటీ అధికారి అసిస్టెంట్ కమిషనర్ గజానన తెలిపారు. జోడు రథోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ముంబై, తమిళనాడుల నుంచి అధిక సంఖ్యలో పాల్గొంటారు. రథోత్సవానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారి చంద్రశేఖర్ వివరించారు.(చదవండి: మార్గశిర శుద్ధ షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠి అని ఎందుకు పిలుస్తారు..? ఈ పండుగ విశిష్టత) -
భక్తుల కొంగు బంగారం.. సుందరమైన సూగూరేశ్వర ఆలయం (ఫొటోలు)
-
వయసు 18.. వృత్తి పైలట్
కర్ణాటకకు చెందిన సమైరా హల్లూర్ 18 ఏళ్లకే కమర్షియల్ పైలట్ అయ్యింది.ఆరు రాతపరీక్షలు 200 గంటల ఫ్లయింగ్ అవర్స్ ఆమెకు ఈ అర్హతను సంపాదించి పెట్టాయి. కొత్త ఎత్తులకు ఎగరాలనుకునే ఈ తరానికి ప్రతినిధి సమైరా.కొన్నేళ్ల క్రితం బీజాపూర్ ఉత్సవాలు జరుగుతున్నాయి. అవి భారీగా జరిగే ఉత్సవాలు. ఆ సందర్భంగా ప్రభుత్వం హెలికాప్టర్ రైడ్ ఏర్పాటు చేసింది. టికెట్ కొనుక్కుంటే అలా ఊరి మీద ఒక రౌండ్ వేయొచ్చు. హైస్కూల్ చదువుతున్న సమైరాను సంతోపెట్టడానికి తండ్రి అమిన్ హల్లూర్ భార్యతో కలిసి హెలికాప్టర్ రైడ్కు వెళ్లారు. సమైరాకు పైలట్ పక్కన సీటు దొరికింది. హెలికాప్టర్ పైకి ఎగురుతుండగానే ఆ అనుభూతికి థ్రిల్ అయిపోయింది సమైరా. పైలట్ డ్రస్, ఆ దర్పం, హెలికాప్టర్ను ఎగరేస్తున్న ఆ నైపుణ్యం... అందరూ పైలట్ను చూస్తున్న అబ్బురమైన చూపు అన్నీ సమైరాను ఆకర్షించాయి. ఆ అమ్మాయి హెలికాప్టర్ గాలిలో చక్కర్లు కొడుతున్నంతసేపు కింద చూడకుండా పైలట్ను ప్రశ్నలు అడుగుతూనే ఉంది. ఆ పైలట్ సహనశీలి. సమైరా అడుగుతున్న ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చాడు.‘కిందకు దిగాక మాతో సమైరా ఒకటే అంది. నాన్నా... నేను కూడా పైలట్ను అవుతాను అని. నేను ఒక మధ్య తరగతి ఇంటీరియర్ డిజైనర్ని. నా భార్య టీచర్. మా అమ్మాయి అలాంటి కోరిక కోరడం మాకు ఆశ్చర్యం కలిగించింది. అలాంటి కోరిక కోరే అమ్మాయి ఉండాలి కదా అసలు. అందుకే మేము ఏమైనా సరే అమ్మాయిని పైలట్ చేయాలనుకున్నాం. మాకున్న కొద్దిపాటి ఆదాయాన్ని పొదుపు చేసి ఆమెకోసం ఖర్చు పెట్టాం‘ అంటాడు సమైరా తండ్రి అమిన్ హల్లూర్.సమైరా ముందు నుంచి కూడా బ్రైట్ స్టూడెంట్. బీజాపూర్లోని సైనిక్ స్కూల్స్లో చదువుకుంది. 17 ఏళ్లకు ఎంపీసీలో ఇంటర్ పూర్తి చేసింది. ‘కమర్షియల్ పైలట్ కావాలంటే సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ పెట్టే పరీక్షలు పాసవ్వాలి. ఆ తర్వాత ఫ్లయింగ్ అవర్స్లో అనుభవం ఉండాలి’ అంది సమైరా.ఇంటర్ అయిన వెంటనే సమైరా న్యూఢిల్లీలోని‘వినోద్ యాదవ్ ఏవియేషన్ అకాడెమీ’లో థియరీకి సంబంధించిన అవసరమైన కోర్సును పూర్తిచేసింది. ‘నా 18వ ఏట పూర్తయ్యే సమయానికి అవసరమైన 6 పరీక్షలను రాసి పాస్ అయ్యాను. అయితే రేడియో ట్రాన్స్మిషన్ టెక్నాలజీ పేపర్ రాయాలంటే 18 ఏళ్లు నిండాలని నియమం. అందుకని పద్దెనిమిది నిండాక ఆ పేపర్ రాసి పాసయ్యాను’ అని తెలిపింది సమైరా.బారామతిలో రెక్కలుథియరీ ఢిల్లీలో పూర్తి చేశాక విమానం నడిపే అనుభవం కోసం సమైరా మహారాష్ట్రలోని ‘కార్వార్ ఏవియేషన్ అకాడెమీ’లో చేరింది. ఆరునెలల్లో అక్కడ 200 గంటలపాటు విమానం ఎగరేసే అనుభవాన్ని సాధించింది. ‘నేను రాత్రిపూట విమానం నడపడంలోనూ మల్టీ ఇంజిన్ విమానాలు నడపడంలోనూ అనుభవం సాధించాను’ అని తెలిపింది సమైరా. ‘పైలట్లు నాకు ఎంతో సహకరించారు. వారి స్ఫూర్తితోనే 19వ ఏటలోకి అడుగు పెట్టకముందే కమర్షియల్ పైలట్గా అర్హత సాధించాను. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది’ అంది సమైరా.ఉత్తర కర్ణాటకకు స్ఫూర్తి‘ఉత్తర కర్ణాటకలో అమ్మాయిలు చదువులో వెనుకబడి ఉన్నారు. బీజాపూర్ నుంచి సమైరా అందరూ చదివి చదువు లాంటిది కాకుండా పైలట్ చదువు చదవాలనుకోవడం అతి తక్కువ వయసులో ఆ ఘనత సాధించడంతో మేమందరం చాలా సంతోషిస్తున్నాం. ఉత్తర కర్ణాటకలోని అమ్మాయిలను ఈ విషయం ఎంత ఉత్సాహపరుస్తుందో మీరు ఊహించలేరు. అమ్మాయిలు చదవాలనుకుంటే, తల్లిదండ్రులు వారినిప్రాంపోత్సహిస్తే ఫలితాలు ఇంత గొప్పగా ఉంటాయి’ అని ఆప్రాంపాంతానికి చెందిన అక్క మహాదేవి విశ్వవిద్యాలయం జర్నలిజం ఫ్రొఫెసర్ కార్కరే అన్నారు.సమైరా భుజాన రెక్కలతో రివ్వున దూసుకుపోతుంది. ఆ తార ఎందరికో ఇకపై దారి చూపనుంది. గెలుపు గాథలకు ఏ మూల ఏ ఇంట్లో మొదటి అడుగు పడుతుందో కదా.