karnataka
-
ఎవండీ.. నీతో సంసారం చేయటం ఇష్టంలేదు..!
బెంగళూరు: ప్రియుడితో దిగిన ఫొటోను భార్య తన భర్తకు పంపడంతో అతను ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరకన్నడ జిల్లా దాండేలి పట్టణంలో జరిగింది. పట్టణానికి చెందిన రాఘవేంద్ర వాడకర్ మలేషియాలో ఉంటన్నాడు. వారం రోజుల క్రితం దాండేలికి వచ్చాడు. ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిన భార్య తాను.. నీతో సంసారం చేయటం ఇష్టంలేదని పేర్కొంది. మరో యువకుడితో ఆమె కలిసి ఉన్న ఫొటోను రాఘవేంద్రకు పంపించి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంది. నీతో కలిసి జీవించడం ఇష్టం లేదని, కావాలంటే చచ్చిపో అంటూ తేల్చి చేప్పింది. దీంతో రాఘవేంద్ర బుద్ధి మాటలు చెప్పాడు. అయినా భార్య పట్టించుకోలేదు. దీంతో చాకుతో కోసుకోని వాట్సాప్లో పొటోలు పంపాడు. నీవు చచ్చినా నాకు ఎలాంటి ఇబ్బందిలేదంటూ భార్య చెప్పడంతో జీవితంపై విరక్తి చెందిన రాఘవేంద్ర ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు తన భార్య తీరు గురించి లేఖ రాశాడు. దాండేలి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
భార్య మరొక పురుషునితో.. తట్టుకోలేక భర్త..!
తుమకూరు(కర్ణాటక): రాష్ట్రంలో కుటుంబాల్లో సామూహిక ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. కోలారు జిల్లాలో ఇద్దరు కూతుళ్లతో తల్లి బావిలోకి దూకి ప్రాణాలు తీసుకున్న ఘటన మరువక ముందే మరో విషాదం వెలుగుచూసింది. భార్య మరొక పురుషునితో పరారు కావడంతో తీవ్ర వ్యథ చెందిన భర్త ఘోర కృత్యానికి ఒడిగట్టాడు. ఇద్దరు కొడుకును గొంతు పిసికి చంపి, ఆపై ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దుర్ఘటన తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకా ఆల్కెరె గ్రామంలో జరిగింది. శివణ్ణ (40), పిల్లలు జీవన్ (11), ప్రాణేష్ (6) మృతులు. ఇంటికి వచ్చినట్టే వచ్చి.. వివరాలు.. శివణ్ణ గ్రామంలో మల్లేశ్వరస్వామి ఆలయంలో పూజారిగా ఉంటూ, ఓప్రైవేట్ కంపెనీలో కూడా పని చేస్తుండేవారు. భార్య కావ్య, ఇద్దరు పిల్లలతో ప్రశాంత జీవితం గడుపుతుండగా, వారం రోజుల కిత్రం కావ్య వేరే వ్యక్తితో కలిసి ఇంటి నుంచి పరారైంది. ఈ పరిణామంతో భర్త తీవ్రంగా ఆవేదన చెందాడు. భార్య మిస్సింగ్పై పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కావ్య మళ్లీ ఇంటికి వచ్చింది. మరుసటి రోజు భర్త పనిమీద వెళ్లగా, కావ్య ఇంటిలోని లక్షలాది రూపాయల విలువ చేసే బంగారు, డబ్బుతో మళ్లీ పరారైంది. దీంతో విరక్తి చెందిన శివణ్ణ శుక్రవారం రాత్రి తన ఇంటిలోనే ఇద్దరు మగ పిల్లలను ఊపిరాడకుండా చేసి చంపి, తర్వాత తానూ ఉరి వేసుకున్నాడు. ఆమె కోసం గాలింపు శనివారం ఉదయం చుట్టుపక్కల వారు గమనించగా ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా పోలీసు అధికారులు, కుణిగల్ పోలీసులు స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను మరణోత్తర పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. కావ్య కోసం గాలింపు చేపట్టారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇందుకు కారణమైన కావ్య, ఆమె ప్రియున్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
‘చైల్డ్ లేబర్.. FIR వేయిస్తా.. వైభవ్ చదువుకోవాలి’
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ గత కొన్నాళ్లుగా అద్భుత ఆట తీరుతో అలరిస్తున్నాడు. భారత్ అండర్-19 జట్టుతో పాటు ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున దుమ్ములేపుతున్నాడు. గతేడాది ఐపీఎల్లో 35 బంతుల్లోనే శతక్కొటిన ఈ బిహారీ పిల్లాడు.. ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడి (14 ఏళ్లు)గా నిలిచాడు.సంచలనాలకు కేంద్రంనిజానికి అంతకంటే ముందే అంటే పన్నెండేళ్లకే రంజీల్లో అరంగేట్రం చేసి వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టుకు ఎంపికై.. ఆసియా రైజింగ్ స్టార్స్తో టోర్నీ పాటు ఇటీవలే వరల్డ్కప్ టోర్నీలోనూ ఆడాడు. ఫైనల్లో ఇంగ్లండ్పై కేవలం 80 బంతుల్లో 175 పరుగులు సాధించి భారత్కు ట్రోఫీ అందించాడు.ఆరెంజ్ క్యాప్ రేసులోఇక ఇటీవలే పదిహేనో వసంతంలోకి అడుగుపెట్టిన వైభవ్.. ఐపీఎల్-2026లో భాగంగా ఈ టోర్నీలో తన రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. సన్రైజర్స్ హైదరాబాద్పై 36 బంతుల్లోనే శతక్కొట్టాడు. మొత్తంగా ఈ సీజన్లో ఇప్పటికి పది మ్యాచ్లలో కలిపి ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 404 పరుగులు పూర్తి చేసుకుని.. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో టాప్-4లో నిలిచాడు.ఈ నేపథ్యంలో అలెన్ బోర్డర్, బ్రియాన్ లారా, సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు సైతం వైభవ్ సూర్యవంశీ ఆటకు ఫిదా అవుతున్నారు. త్వరలోనే అతడిని టీమిండియాకు ఆడించాలని మరికొందరు మాజీ క్రికెటర్లు సైతం సెలక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.యాక్టివిస్ట్ సంచలన వ్యాఖ్యలుఇలాంటి తరుణంలో ఓ వ్యక్తి వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. కన్నడ టీవీ చానెల్లో యాక్టివిస్ట్గా పరిచయమైన ఓ వ్యక్తి.. వైభవ్ను తక్షణమే ఇంటికి పంపాలని రాజస్తాన్ యాజమాన్యానికి సూచించాడు. లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేసి.. FIR వేయిస్తానని హెచ్చరించాడు.చైల్డ్ లేబర్.. చదువుకోనివ్వండిఈ మేరకు.. ‘‘పదిహేనేళ్ల పిల్లాడు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడకూడదు. ఇలా చేయడం చైల్డ్ లేబర్ కిందకు వస్తుంది. ఈ పిల్లాడిని ఐపీఎల్ క్రికెట్ ఆడనివ్వద్దు. క్రికెట్ ఆడే బదులు అతడు చదువుకోవాలి’’ అని సదరు వ్యక్తి పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్కాగా.. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.This activist appeared on a Kannada TV channel and said he plans to file a police case or legal complaint against Rajasthan Royals. He said - Don't let this 15-year-old boy "Vaibhav Suryavanshi " play IPL cricket — it's child labour, he should study! pic.twitter.com/zEwVJQseGR— ExtraOrdinary (@Extreo_) May 2, 2026క్రీడాకారులకు వర్తిస్తుందా?కాగా భారత బాల కార్మిక నిరోధక సవరణ చట్టం 2016 ప్రకారం.. పద్నాలుగేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలతో పని చేయించకూడదు. అయితే, సాధారణంగా బాల క్రీడాకారులను చైల్డ్ లేబర్గా పరిగణించరు. ప్రతిభకు పట్టం కడుతూ వారిని ప్రోత్సహిస్తారు. క్రికెట్ ఒక్కటే కాదు.. చెస్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో చాలా మంది పదేళ్లలోపు వయసులోనే ప్రవేశిస్తారు.ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్నిజానికి వైభవ్ సూర్యవంశీ ప్రతిభకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం.. ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అందించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గతేడాది డిసెంబరులో అతడు ఈ అవార్డు అందుకున్నాడు. అయితే, సదరు యాక్టివిస్టు మాత్రం వైభవ్ను ఐపీఎల్లో ఆడించడం సరికాదని.. ఇది చైల్డ్ లేబర్ కిందకు వస్తుందంటూ కొత్త వాదన తెరమీదకు తెచ్చాడు.ఎన్నో కష్టనష్టాలకు ఓర్చికాగా వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి కుమారుడిని ఈ స్థాయికి తీసుకువచ్చారు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినా కుమారుడు లక్ష్యాన్ని చేరుకునేలా చేశారు. అయితే, చదువులోనూ వైభవ్ ముందే ఉంటాడని ఇటీవలే అతడి స్కూల్ యాజమాన్యం తెలిపింది. కాకపోతే ఈసారి ఐపీఎల్ కారణంగా అతడు సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలకు హాజరుకాలేకపోయాడు. ఇక గతేడాది మెగా వేలంలో 1.10 కోట్లకు వైభవ్ను కొన్న రాజస్తాన్ రాయల్స్.. ఈసారి పూర్తి స్థాయి ఓపెనర్గా బరిలోకి దించింది.చదవండి: Heinrich Klaasen: 'క్షమించండి.. అది సాధ్యం కాదు' -
బెంగళూరులో సెమీకండక్టర్ హబ్ కోసం 140 ఎకరాలు
దేశంలోనే సెమీకండక్టర్ పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్న కర్ణాటక మరో కీలక మైలురాయిని చేరుకుంది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత సెమీకండక్టర్ పరికరాల తయారీ దిగ్గజం ‘అప్లైడ్ మెటీరియల్స్ ఇంక్’ కోసం బెంగళూరులో 140 ఎకరాల భూమిని కేటాయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం అధికారికంగా ఆమోదం తెలిపింది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న ‘బెంగళూరు సిగ్నేచర్ బిజినెస్ పార్క్’ (బీఎస్బీపీ)లో ఈ భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ భూ కేటాయింపు ద్వారా రాష్ట్రంలో సెమీకండక్టర్ రంగం మరింత బలోపేతం కానుంది.కేటాయింపు ముఖ్యాంశాలుప్రాజెక్టు స్థలం: కెంపెగౌడ విమానాశ్రయ సమీపంలోని బెంగళూరు సిగ్నేచర్ బిజినెస్ పార్క్.కేటాయింపు భూమి: 140 ఎకరాలు.నిబంధన: లీజు-కమ్-సేల్ ప్రాతిపదికన కేటాయింపు.ధర: చదరపు అడుగుకు రూ.1,288 చొప్పున, మొత్తం రూ.780 కోట్ల విలువైన భూమిని కంపెనీకి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.వ్యూహాత్మక ప్రాధాన్యతరాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ ఇటీవల ఫ్యూచర్ ఆఫ్ వర్క్ సమ్మిట్లో మాట్లాడుతూ, రాష్ట్రంలో చిప్ తయారీకి సంబంధించిన ఒక భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని పేర్కొన్న తరుణంలో ఈ వార్త వెలువడింది. కర్ణాటక ప్రభుత్వం సెమీకండక్టర్ డిజైన్, పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ), గ్లోబల్ క్యాబిలిటీ సెంటర్లపై (జీసీసీ) ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అప్లైడ్ మెటీరియల్స్ రాకతో ఈ రంగంలో రాష్ట్రం తన పట్టును మరింత పెంచుకోనుందని మంత్రి చెప్పారు.పారదర్శకతకు పెద్దపీటఈ భూ కేటాయింపు చట్టబద్ధమైన అనుమతులు, ధరల నిర్ణయానికి లోబడి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అలాగే, బీఎస్బీపీలో మిగిలి ఉన్న 267 ఎకరాల భూమిని ఏ విధంగా వినియోగించాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పారదర్శకత కోసం పోటీ బిడ్డింగ్, నిపుణుల సలహాల మేరకు తదుపరి విధివిధానాలను రూపొందించనున్నట్లు పరిశ్రమల శాఖ తెలిపింది.ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్! -
బెంగళూరులో ఘోర విషాదం.. స్పాటికి సీఎం సిద్ధరామయ్య
-
వివాహేతర సంబంధం.. పోక్సో కేసుతో చిక్కుల్లో ఆనంద్ నాయుడు
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ నాయకుడు రెచ్చిపోయారు. తన ప్రేయసి.. పిల్లలపై(మైనర్లు) సదరు కాంగ్రెస్ నేత దాడి చేసిన విషయంలో చర్చనీయాంశంగా మారింది. దీంతో, ఆమె భర్త.. ఈ విషయమై పోలీసులను ఆశ్రయించడంతో పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన కలకలం రేపుతోంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు ఉత్తర జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ప్రధాన కార్యదర్శి ఆనంద్ నాయుడు.. గత మూడు, నాలుగు సంవత్సరాలుగా ఒక వివాహితతో సంబంధంలో ఉన్నాడు. వీరిద్దరి సంబంధంపై ఆమె పిల్లలు వారిని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆగ్రహంతో రగిలిపోయిన ఆనంద్.. వారిని చితకబాదాడు. ఇనుప రాడ్తో పిల్లలపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో, వారికి గాయాలయ్యాయి.అనంతరం, ఇంటికి వచ్చిన ఆమె భర్త.. పిల్లల గాయాలు చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. దీంతో, ఆనంద్, తన భార్య మధ్య ఉన్న సంబంధం బహిర్గతమైంది. వెంటనే తేరుకున్న బాధితులు.. స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ఆనంద్ నాయుడు.. తన పిల్లల కాళ్లు, చేతులు, శరీరంలోని ఇతర భాగాలపై రాడ్లతో కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దాడి ఆరోపణలను పిల్లలు కూడా ధృవీకరించినట్లు సమాచారం. అనంతరం, పోలీసులు పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాకుండా తన అనుమతి లేకుండా తన భార్య, నాయుడు ఆస్తిని బదిలీ చేశారని బాధితుడు ఆరోపించారు. దర్యాప్తు అధికారులు కేసులోని అన్ని కోణాలను పరిశీలిస్తున్నారని తెలిపారు.Congress MLA assaults minors with rod for questioning his extra-marital affair in KarnatakaAnand Naidu, the general secretary of Bengaluru North District Congress Committee, has been booked under the POCSO Act for allegedly assaulting two minors with a rod. pic.twitter.com/Bnq6WukHmZ— monkey. D. luffy (@luffy_735) April 29, 2026 -
‘బోష్’ మహిళా ఉద్యోగిని అనుమానాస్పద మరణం
బెంగళూరులోని ఒక అద్దె ఇంట్లో 34 ఏళ్ల మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపింది. రక్తపు మడుగులో ఆమె నగ్న మృతదేహం లభ్యం కావడం మరింత ఆందోళన రేపింది. ఫ్లాట్ నుండి దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగువారు అధికారులకు సమాచారం అందించారు. దీంతో సోమవారం నాడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతురాలిని జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లాకు చెందిన పూజా దత్తాగా గుర్తించారు. ఆమె బెంగళూరులోని 'బాష్' (Bosch) కంపెనీలో పనిచేస్తోంది. గత మూడేళ్లుగా ఆమె బెంగళూరులో ఒంటరిగా నివసిస్తోంది.ఏం జరిగింది?పోలీసుల సమాచారం ప్రకారం సోమవారం నాడు ఆమె నివసిస్తున్న ఫ్లాట్ నుండి తీవ్రమైన దుర్వాసన రావడంతో పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులొచ్చి తలుపులు పగులగొట్టి చూడగా, పూజా దత్తా మృతదేహం నగ్నంగా, రక్తపు మడుగులో పడి ఉంది. మృతదేహం అప్పటికే కుళ్ళిపోయిన స్థితిలో ఉంది. ఫోరెన్సిక్ నిపుణుల అంచనా ప్రకారం, మృతదేహం లభ్యం కావడానికి రెండు లేదా మూడు రోజుల ముందే ఆ మహిళ మృతిచెంది ఉంటుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: బండిపై 6 గురు బుడ్డోళ్లు, పేరెంట్స్ను అరెస్ట్ చేయాలి!గత మూడేళ్లుగా ఆమె తన ఫ్లాట్లో అద్దెకు నివసిస్తోందని, ఏప్రిల్ 23న కిరాణా సామాగ్రి కొనడానికి వెళ్లినప్పుడు ఆమె చివరిసారిగా కనిపించిందని ఇంటి యజమాని తెలిపారు. అయితే, గదిలో చెల్లా చెదురుగా పడి ఉన్న కాగితాలు తప్ప ఘటనా స్థలంలో ఎటువంటి ఆత్మహత్య లేఖ దొరకలేదు. అయితే తలుపు లోపలి నుండి వేసి ఉండటంతో, ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ, పోలీసులు దీనిని "అనుమానాస్పద మృతి"గా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు పోస్టుమార్టం నివేదిక తర్వాత తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: మండే ఎండల్లో ఏసీలు పేలే ప్రమాదం : ఈ జాగ్రత్తలు మస్ట్ -
బండిపై 6 గురు బుడ్డోళ్లు, పేరెంట్స్ను అరెస్ట్ చేయాలి!
సాక్షి, బెంగళూరు: బెంగళూరు నగరంలోని ఒక రద్దీ రోడ్డుపై ఆరుగురు చిన్న పిల్లలు ఒకే స్కూటర్పై ప్రయాణిస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. రోడ్డు భద్రతా నియమాలను దారుణంగా ఉల్లంఘించడమే కాకుండా, మైనర్లు డ్రైవింగ్ చేస్తుండటంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది?శ్రేయాస్ అనే ఎక్స్ యూజర్ ఆఫీసుకి వెళ్తుండగా ఈ దృశ్యాన్ని చూసి, ఫోటోలు తీసి ఎక్స్ వేదికగా పంచుకున్నారు. బెంగళూరు నగర పోలీసులను, బెంగళూరు ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీని ప్రకారం సుమారు 10 నుండి 12 ఏళ్ల లోపు వయసున్న ఆరుగురు మైనర్లు (ఆడ, మగ) పిల్లలు ఒకే స్కూటర్పై కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. రైడర్తో పాటు అందరూ మైనర్లు కావడంతో తీవ్ర ఆందోళన రేపింది. రద్దీగా ఉండే బహిరంగ రహదారిలో ఒక చిన్న బాలుడే స్కూటర్ను నడుపుతున్నాడు. పైగా వీరిలో ఎవరికీ హెల్మెట్లు లేవు. దరిదాపుల్లో పెద్దలెవరూలేరు. ఈ ఘటన ఏప్రిల్ 26 గోరిపాళ్య సమీపంలోని పాదరాయణపుర మెయిన్ రోడ్డుపై జరిగింది. మరోవైపు ఈ ఫిర్యాదుకు స్పందిస్తూ, బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఆ పోస్ట్ను గుర్తించి, తదుపరి చర్యల కోసం మగడి రోడ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అధికారిక ఖాతాను ట్యాగ్ చేశారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించి, వాహన యజమానిపై చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదీ చదవండి: అమెరికా నుంచి వచ్చి ఆరేళ్లు : గార్డ్స్పై కత్తితో దాడి, షాకింగ్ రీజన్?నెటిజన్ల ఆగ్రహంస్కూటర్ రిజిస్ట్రేషన్ నంబర్ (KA05JZ9065) స్పష్టంగా కనిపిస్తుండటంతో, నెటిజన్లు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు వీళ్లకి వాహనం ఇచ్చినందుకు తల్లిదండ్రులను కనీసం వారం రోజుల పాటు జైల్లో పెట్టాలి. వారి నిర్లక్ష్యం పిల్లల ప్రాణాల మీదకు తెస్తోందని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. "వేసవి సెలవుల్లో పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలి. ఇంత నిర్లక్ష్యమా?" పెద్దోళ్ని చూసే పిల్లలు నేర్చుకుంటారు. వీళ్లకి కేవలం జరిమానా వేస్తే సరిపోదని మరి కొందరు వ్యాఖ్యానించారు. నోట్ : మైనర్లు వాహనాలు నడపటం వల్ల ఇప్పటికే అనేక ఘోర ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలపై మరోసారి హెచ్చరిస్తోంది. చట్టప్రకారం, మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితేవాహన యజమాని లేదా తల్లిదండ్రులకు భారీ జరిమానా లేదా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతేకాదు, ఆ వాహనం రిజిస్ట్రేషన్ కూడా రద్దవుతుంది. సదరు మైనర్కు 25 ఏళ్ల వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత ఉండదు.This is haappend on today 26/04/2026 morning 10:45 am those kid's illegally ridding scooter No. ( KA05JZ9065 ) on location ( Padarayanapura main road near gowripalya on opposite of total engineer auto gas ) new Bridge. please take necessary. @BlrCityPolice @blrcitytraffic pic.twitter.com/S4rrOE8vbD— Shreyas Shreyu (@Shreyas35240282) April 26, 2026 -
పోలీసులారా.. ఇదేం పని?
బెంగళూరు: పోలీసులు ఏమైనా చేయగలరు. నిజమైన నేరాలపై విచారణ చేయకుండా ప్రజలను తిప్పించుకుంటారు అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న అసంతృప్తి వ్యక్తంచేశారు. ఓ కేసులో పోలీసుల తీరును తప్పబట్టారు. రామనగర జిల్లా చన్నపట్టణ తాలూకా ఎంకె దొడ్డి పోలీసుస్టేషన్ పరిధిలో 2024లో రెండు పశువులు అదృశ్యమయ్యాయి. రెండేళ్ల తరువాత పశువుల సొంతదారు పక్కింటి వ్యక్తి సహా నలుగురిపై కేసు పెట్టాడు. తమకు సంబంధమే లేదని, ఈ కేసును కొట్టేయాలని మంగళమ్మ అనే నిందితురాలు హైకోర్టులో అర్జీ దాఖలు చేసింది. రెండేళ్ల తరువాత పొరుగింటివారిపై ఎలా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని పోలీసులను జడ్జి ప్రశ్నించారు. కనీస విచారణ జరపలేదని, ఇది చట్ట ఉల్లంఘన అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు పశువులను వెతకటం మానేసి, సమాజంలో జరుగుతున్న తీవ్రమైన, నిజమైన నేరాల వెంటపడాలి. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. ఇలాంటి కేసులు మళ్లీ తమ దృష్టికి వస్తే పోలీసులపై కఠినంగా వ్యవహరిస్తానని తెలిపారు. -
అందుకే కిరణ్కు నిప్పంటించా!
ప్రియుడ్ని ఇంటికి పిలిపించుకుని వెస్ట్రన్ స్టయిల్లో ప్రపోజ్ చేస్తానంటూ కుర్చీకి కట్టేసి మరీ తగలబెట్టి చంపేసింది ఓ ప్రియురాలు. ఈ కేసు దేశవ్యాప్తంగా.. అందునా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారి తీసింది. ఈ కేసులో ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తనతో వివాహానికి కిరణ్ ఒప్పుకున్నాడని నిందితురాలు ప్రేమ అలియాస్ ప్రేరణ చెబుతోంది.బెంగళూరులో ప్రియున్ని తన ఇంట్లో కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన కేసులో నిందితురాలు ప్రేమ అలియాస్ ప్రేరణ నెమ్మదిగా నిజాలు బయటపెడుతోంది. కిరణ్ను తాను చాలా ప్రేమించేదాన్నని, అయితే అతడు మాత్రం శారీరక అవసరాలు తీర్చే వస్తువుగా తనను భావించేవాడని అంటోంది.వారం కిందట(21 ఏప్రిల్) బెంగళూరు శివారులోని బైదరహళ్లి పీఎస్ పరిధిలోని అంజనానగర్లో ఈ దారుణం జరిగింది. తుమకూరుకు చెందిన కిరణ్.. నగరంలోని ఓ మొబైల్ సర్వీస్ సెంటర్లో పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ప్రేమ(ప్రేరణ)తో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిచింది. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత.. కుర్చీలో కూర్చోబెట్టి ఫ్యాంట్, షర్ట్ ఊడదీసి కళ్లకు గంతలు కట్టింది. అనంతరం కాళ్లు, చేతులూ కట్టేసింది.ఆ సమయంలో కిరణ్ కంగారుపడ్డాడు. అయితే.. పాశ్చాత్య దేశాల్లో ఇలాగే చేస్తారని, తానూ అలా వినూత్నంగా ప్రేమను వ్యక్తం చేస్తానని (Love Proposal) నమ్మించింది. ఆ వెంటనే కిరోసిన్ పోసి నిప్పటించి తన మొబైల్లో రికార్డు చేసింది. స్థానికులు వచ్చేలోపే హాహాకారాలు చేస్తూ కుర్చీలోనే కిరణ్ సజీవదహనమయ్యాడు. ఘటన జరిగినప్పుడు తాను బాత్రూమ్లో ఉన్నానని, పొగ రావడంతో గమనించి బయటకు వచ్చేసరికి కిరణ్ కుర్చీలో కాలిపోయి ఉన్నాడని పోలీసులకు చెప్పింది. అయితే, ఆమె తీరుపై అనుమానంతో పోలీసులు గట్టిగా విచారించారు. దీంతో పథకం ప్రకారమే ప్రేమ అతడిని హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.నార్త్వెస్ట్ డీసీపీ డీఎల్ నగేష్ నేతృత్వంలోని టీం నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారించింది. తొలుత దూరం పెడుతున్నాడనే అతన్ని హత్య చేసిందని అంతా భావించారు. అయితే.. ‘‘కిరణ్ను తాను ఎంతో ప్రేమించానని.. కానీ, అతను తనను ఎంతో అవమానించేవాడని ప్రేమ పోలీసుల వద్ద కన్నీళ్లు పెట్టుకుంది. ‘కిరణ్ నన్ను శారీరక అవసరాల కోసం వాడుకుంటున్నాడన్న విషయం నాకు ఆలస్యంగా అర్థమైంది. పెళ్లి చేసుకుందామని అడిగా. ‘నువ్వు కులం తక్కువదానివి.. మా ఇంట్లో ఒప్పుకోరు’ అనేవాడు. ఈ విషయం ప్రేమించినప్పుడు.. కలిసి తిరిగినప్పుడు తెలియదా? అని గట్టిగా నిలదీశా. దీంతో పెద్దల్ని ఒప్పించి ఎలాగోలా వివాహం చేసుకుంటానన్నాడు. అయితే.. పెళ్లి తర్వాత కూడా కేవలం శారీరక అవసరం కోసమే తనతో ఉంటానని చెప్పేవాడు. ఆ మాట నాతోనే కాదు.. అతని స్నేహితుల వద్ద చెబుతూ నన్ను బూతులు తిట్టేవాడు. ఆ విషయం అతని స్నేహితులు రికార్డ్ చేసి పంపారు. నన్ను వాడుకుంటూ నన్నే తిట్టడం, అవమానించడం ఎంతో బాధించింది. భరించలేకపోయా.. అందుకే నిప్పు పెట్టి చంపేశా’’ అని పోలీసుల ముందు ప్రేరణ కన్నీళ్లతో నిజం ఒప్పుకుంది. -
మహిళల్ని ముందు, వెనుక వీడియోలు తీసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తారా?
యశవంతపుర: బెంగళూరులో నమ్మ మెట్రో రైళ్లలో ప్రయాణించే యువతులు, మహిళ ఫోటోలను రహస్యంగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వికృతానందం పొందే నిందితునికి హైకోర్టులో మందలింపు దక్కింది. తనపై పెట్టిన కేసును రద్దు చేయాలని వేసిన ఫిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. నిందితుడు బీకే దిగంత్.. బెంగళూరు మెట్రో చిక్స్ అనే ఇన్స్టా ఖాతాలో ఈ ఫోటోలు, వీడియోలను పోస్టు చేసేవాడు. గత ఏడాది మేలో బనశంకరి పోలీసులు విచారణ జరిపి అతన్ని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తనపై కేసు చెల్లుబాటు కాదని, కొట్టేయాలని నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ అర్జీని విచారించిన న్యాయమూర్తి.. నిందితునిపై భగ్గుమన్నారు. మహిళలను ఎక్కడా సురక్షితంగా ఉండనివ్వరా? అని దిగంత్ను నేరుగా ప్రశ్నించారు. ఇలా చేయడం చూస్తే నీకు మానవత్వం ఉందా? అంటూ అర్జీని కొట్టివేశారు. మహిళలను ముందు, వెనుక నుంచి వీడియో తీసి ఎడిట్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తారా?, మీరు ఎలాంటి మనుషులు అని జడ్జి ఆగ్రహించారు. నిందితుని న్యాయవాది వాదిస్తూ, మహిళలు ఎవరూ ఫిర్యాదు చేయలేదు, పోలీసులు సుమోటో కేసుగా నమోదు చేసుకున్నారు. ఇక్కడ ఎలాంటి నేరానికి పాల్పడలేదని అన్నారు. అయితే సాంకేతిక అంశాలను చూపించి తప్పించుకోలేదని న్యాయమూర్తి చురకలు ముట్టించారు. కొన్ని విషయాలలో నైతికత, భద్రత ముఖ్యమన్నారు. మహిళల అనుమతి లేకుండా అశ్లీలంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడమే పెద్దనేరమని న్యాయమూర్తి పేర్కొన్నారు. -
జస్ట్ ఆటో జర్నీ కాదు.. అంతకుమించి..!
చిన్న ఆటో అయినా..దాన్ని కస్టమర్లకు విభిన్నంగా పరిచయం చేసేలా సెట్ చేసే తీరు ఎవ్వరినైనా..ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇంతకు మునుపు వరకు చల్లదనం కోసం మొక్కలతో, పర్యావరణ అనుకూలంగా మార్చిన అందమైన ఆటోలను చూశాం. కానీ ఈ ఆటో డ్రైవర్ అంతకు మించి అన్నట్లుగా.. ఆటో జర్నీని అందిస్తున్నాడు ప్రయాణికులకు. అందుకోసం ఏం చేస్తున్నాడంటే..అందుకు సంబంధించిన వీడియోని వర్ష అనే యూజర్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంది. ఆ వీడియోలో ఒక సాధారణ ఆటో ప్రయాణంలా కనిపించేదాన్ని చిత్రీకరించినట్లు ఉంటుందే తప్ప, అందులో విభిన్నంగా ఏమీ కనిపించదు. కానీ కెమెరా లోపలికి మారినప్పుడు, మొత్తం ఆటోజర్నీనే మంచి అనుభూతిగా మార్చేస్తోంది. ఆ వీడియోలో సాధారణ ఆటో ప్రయాణంలా మొదట్లో కనిపించినా..ఆ తర్వాత డ్రైవర్ సీటు వెనుక, పుస్తకాలతో నిండిన ఒక చిన్న అర ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దొరికిన ఆ కొద్ది సమయం ఫోన్కి అంకితమవ్వకుండా కాసేపయినా పుస్తకాలు తెరిచేలా చేసే ప్రయత్నం ముచ్చటగొలుపుతుంది. వాటి తోపాటు ఆ ఆటోలో ప్రయాణికుల కోసం ఒక చిన్న క్యాండీల డబ్బా కూడా ఉంది. చిన్నపాటి ఆలోచన అయినా..ప్రయాణికులకు తమ జర్నీ సమయాన్ని విలువైనదిగా మార్చుకునేలా చేస్తోంది. పైగా ఫోన్ని స్క్రోల్ చేసే బదులు కొన్ని నిమిషాల పాటు చదువుకునేలా చేస్తుంది. మాములు ప్రయాణం అనుకున్నాం కానీ ఒక చిన్న లైబ్రరీగా మారింది అంటూ క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ షేర్ చేశారు. నెటిజన్లు సైతం ఈ వీడియోని సైతం “ఈ ఆటో సీఎన్జీతో గానీ, పెట్రోల్తో గానీ నడవడం లేదు, ఇది కేవలం కరుణతో నడుస్తోంది. అతడు అందిస్తున్న ప్రతిదానికి అంతకుమించిన ఆశీస్సులు అందాలి అని దీవిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by _np_ (@by.nanthithaparkavi) (చదవండి: సమానత్వానికి కేరాఫ్గా ఆ వివాహం..!) -
చెక్బౌన్స్ కేసులో బీజేపీ నేత సుమతి అరెస్ట్
సాక్షి, అనంతపురం: చెక్బౌన్స్ కేసులో కర్ణాటక బీజేపీ నేత సురతాని సుమతి అరెస్ట్ అయ్యారు. గురువారం కోర్టులో హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ విధిస్తూ అనంతపురం ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణ ఒక్క రోజులో పూర్తయ్యే అంశం కాకపోవడంతో రిమాండ్ విధించినట్టు కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అనంతపురం టూటౌన్ పోలీస్ స్టేషన్లో మాధవి అనే మహిళ ఫిర్యాదు మేరకు సుమతిపై చెక్ బౌన్స్ కేసు నమోదైంది. గతేడాది సెప్టెంబర్ 12న అనంతపురం ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తాజాగా అరెస్ట్ తర్వాత రిమాండ్కు పంపింది. అయితే.. సుమతిపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లోని పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. విజయవాడ పెనమలూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి ఈ ఏడాది జనవరి 24న అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. ‘వాల్మీకి’ నిధుల గోల్మాల్లో సుమతి పాత్ర!కర్ణాటక వాల్మీకి అభివృద్ధి మండలి నిధుల గోల్మాల్ వ్యవహారం కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ వ్యవహారంలో రూ.80 కోట్లు గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ నిధులను కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు బ్యాంకు ఖాతాలకు మళ్లించినట్టు ఈడీ ఆధారాలను సేకరించింది. దీంతో అప్పటి కర్ణాటక ఎస్టీ సంక్షేమ, క్రీడా శాఖల మంత్రి బి.నాగేంద్ర పదవికి రాజీనామా చేశారు. ఈ నిధుల అక్రమాల్లో అనంతపురం జిల్లాకు చెందిన పలువురి పాత్రపైనా ఈడీ దర్యాప్తు చేసింది. డొల్ల(షెల్) కంపెనీల ఏర్పాటు చేసి బ్యాంకు రుణాలు పొందడం, సబ్సిడీ తీసుకోవడం, చివరకు కంపెనీ నష్టపోయినట్టు లేదా ప్రమాదం జరిగినట్టు చూపించి రుణాలను ఎగవేయడం వంటి అంశాలపై ఈడీ ఆరా తీసింది. కర్ణాటక వాల్మీకి అభివృద్ధి మండలి నిధుల గోల్మాల్ వ్యవహారంలోనూ సుమతి పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి. -
హవ్వ..! మతపైత్యం అదుపులో ఉంచుకోలేరా?
మతాలు, కులాలు మనుషుల మధ్య అడ్డుగోడలుగా నిలవడం ఇవాళ్టి వ్యవహారం కాదు. ఈ గీతలు దాటిన ప్రేమలు ఎన్ని మొగ్గ తొడుగుతున్నప్పటికీ, పెళ్లిళ్లు ఎన్ని జరుగుతున్నప్పటికీ.. భవిష్యత్తులోనైనా ఏదో ఒకనాటికి సమసిపోతాయని అనుకునే వాతావరణం మాత్రం లేదు. ఎందుకంటే.. ఎంతగా ఆధునిక సమాజం ఈ అడ్డుగోడల్ని దాటి వికసిస్తున్నదో.. అంతకంటే ఎక్కువగా మనుషుల్లో కుల జాడ్యం, మతమౌఢ్యం మరింతగా వేళ్లూనుకుంటున్న ఉదాహరణలు మనకు సర్వత్రా కనిపిస్తుంటాయి. సున్నితమైన ఈ అంశాల్లో ఎదుటివారి మనోభావాల్ని గాయపరచడం మాత్రమే కాదు.. దారుణంగా రెచ్చగొట్టే భయావహ వాతావరణానికి గురిచేసే ఘటనలు మనకు నిత్యం అనేకం తారసపడుతుంటాయి. బెంగుళూరు నగరంలో కూడా అలాంటిదే ఒక సంఘటన చోటు చేసుకుంది.అబ్బిగెరె ప్రాంతంలో ఓ దంపతులు.. ఒక ముస్లిం వ్యక్తిని అభ్యంతరకరమైన మాటలతో నిందించారు. ‘నువ్వు ముస్లింవి. నువ్వు పాకిస్తానీవి. నువ్వొక టెర్రరిస్టువి’ అంటూ వారు అతడిని తూలనాడారు. ఇలాంటి మాటలు ఒక సాధారణ ముస్లింను ఎంతగా గాయపరుస్తాయో మనం అర్థం చేసుకోవచ్చు. వీరి నిందల పర్యవసానంగా స్థానికంగా ఒక సంస్థకు చెందిన వారు.. ఆ దంపతులకు సదవగాహన కల్పించి, బుద్ధిమాటలు చెప్పే ప్రయత్నం చేశారు. వారి ఇంటికి వచ్చి.. ఇలా ముస్లిం పేరుతో ఒక మనిషిని కించపరుస్తూ మాట్లాడడం, టెర్రరిస్టుగా అభివర్ణించడం తప్పు అని తెలియజెప్పే ప్రయత్నం చేశారు. నిజానికి ఆ సంస్థ తరఫున వచ్చిన వారిలో కేవలం ముస్లిములే కాదు. అన్ని మతాల వారూ ఉన్నారు. ముస్లిం అయిన ప్రతీ వ్యక్తిని టెర్రరిస్టుగా చిత్రీకరించి.. సభ్యసమాజంలో అశాంతికి, అపోహలకు బీజం వేసే ఇలాంటి బుద్ధులను ఎండగట్టారు. ఆ దంపతులకు వీరు బుద్ధి మాటలు చెబుతున్న వీడియో ఇప్పుడు వైరల్గా మారుతోంది.ప్రత్యేకించి ఈ సంఘటనలో మరో సంగతి చెప్పుకోవాలి. ఈ సందర్భంగా ఆ దంపతుల్లో భర్త తమను గురించి తాము ఘనంగా చెప్పుకుంటూ.. నేను డిఫెన్సులో పనిచేస్తున్న వాడినే అంటూ గంభీరంగా సెలవిచ్చారు. డిఫెన్సులో పనిచేస్తున్న వ్యక్తివే అయితే గనుక.. నీలో మరింతగా దేశభక్తి ఉండాలి. ఈ దేశం అన్ని మతాలు, అన్ని ధర్మాల సమ్మేళనం అనే స్పృహ నీకు ఎక్కువగా ఉండాలి. పరమతసహనం కూడా నీలో ఎక్కువగా ఉండాలి.. కనిపించిన ప్రతి ముస్లింను పాకిస్తానీగా, టెర్రరిస్టుగా చిత్రీకరిస్తూ ఎలా మాట్లాడతావు? అంటూ వాళ్లు నిలదీశారు. చివరికి ఆ దంపతులు క్షమాపణ చెప్పబోయినప్పుడు కూడా.. మీరు క్షమాపణ చెప్పడం కాదు.. మీ ఆలోచన మార్చుకోవాలి.. అంటూ వారు హితవు చెప్పి వెళ్లడం గమనించాల్సిన సంగతి.Abbigere, BengaluruA woman and her husband (a former army officer) have been accused of making derogatory remarks to a Muslim man, saying, "You are Muslim, you are Pakistani, you are a terrorist." Subsequently, members of an organization arrived at the scene, protested. pic.twitter.com/5YwFlPieHg— The Muslim (@TheMuslim786) April 22, 2026మనం చాలా సందర్భాల్లో గమనిస్తుంటాం. ఇళ్లు అద్దెకు తీసుకునేందుకు తిరిగేవారిని మీరు శాకాహారులైతేనే ఇస్తాం’ అని చెప్పే వాళ్లు మనకు పురాతన కాలం నుంచి ఇవాళ్టికీ కనిపిస్తూనే ఉంటారు. ఇలాంటి మనుషుల్ని తప్పుబట్టే వాళ్లూ ఉంటారు. అయితే అలాంటి వారి బాధల్ని కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ.. ముస్లిం అయిన వ్యక్తి కనిపిస్తే చాలు.. ‘మీరంతా పాకిస్తానీలు.. మీరంతా టెర్రరిస్టులు..’ అని నిందించే వారిని ఏమనాలి? పాకిస్తాన్ మీద ఉన్న ద్వేషాన్ని ఒక మతానికి ఆపాదించడమూ, ఆ మతానికి చెందిన అందరి మీదా టెర్రరిజం ముద్ర వేసేయడమూ ఎంత అనైతికం అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో నడుస్తోంది.దుర్మార్గాలు కులాల్ని బట్టి, మతాల్ని బట్టి ఉండవు. కేవలం మనుషుల్లో ఉండే బుద్ధుల్లో మాత్రమే ఉంటాయి. అలాంటి తప్పుడు మనుషులు ఒకే మతంలో లేదా ఒకే కులంలో ఉంటారని అనడం, ఆపాదించడం సుహృద్భావ సమాజ ఆవిష్కరణకు పెనుద్రోహం అవుతుంది. ఆ సత్యం మనలో ప్రతి ఒక్కరూ తెలుసుకోగలిగితే.. ఏ ఇద్దరు మనుషుల మధ్య కూడా ఎలాంటి అపోహలూ ఉండని మంచి రోజులు తప్పకుండా వస్తాయి.-యం.రాజేశ్వరి. -
సర్ ప్రైజ్.. ప్రియుడిని కుర్చీలో కట్టేసి
-
భరణం పేరుతో భర్తపై 'భారం' విడాకుల కేసుల్లో విడ్డూరాలు?
-
సందిట్లో సడేమియా RTC సమ్మెతో.. తెలంగాణలో కర్ణాటక స్పెషల్ బస్సులు
-
డిఫరెంట్ గా ప్రపోజ్ చేస్తానని పిలిచి లవర్ పై పెట్రోల్ పోసి తగలబెట్టిన ప్రేయసి
-
హోం స్టేలో యుఎస్ యువతిపై అత్యాచారం
బెంగళూరు: కర్ణాటకలో దారుణం జరిగింది. హోం స్టేలో నివాసం ముంటున్న ఓ యుఎస్ మహిళ అత్యాచారానికి గురైంది. మూడురోజులుగా తనను లైంగిక వేదింపులకు గురి చేస్తున్నట్లు మహిళ పేర్కొంది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.వివరాల్లోకి వెళితే కొడుగులోని ఓ హోమో స్టేలో ఒక అమెరికన్ మహిళ తాత్కాలిక నివాసం ఉంటుంది. అయితే ఆమెపై గత మూడురోజులు అందులో పనిచేసే వ్యక్తి అత్యాచారం చేసినట్లు యువతి పేర్కొంది. ఆ సమయంలో ఆమె ఎవరిని సంప్రదించకుండా వైపై సేవలు నిలిపివేసినట్లు పేర్కొంది. దీంతో తను మైసూరు వెళుతున్నానని చెప్పి అక్కడి నుండి తప్పించుకున్నానని కంప్లేంట్లో తెలిపింది. అనంతరం అక్కడి నుండి యుఎస్ ఎంబసీని సంప్రదించగా వారు మైసూరు పోలీసులకు వివరాలు తెలియజేశారు.దీంతో వివరాలు తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. హోం స్టే నిర్వాహకుడితో పాటు అందులో పని చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు కొడగు ఎస్పీ తెలిపారు. నిందుతుడు జార్ఖండ్కు చెందిన వృజేశ్ కుమార్గా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ కేసుపై లోతైన విచారణ జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
ప్రేమ.. ఎంత పని చేసింది?
ప్రేమలో అనుమానం ఎంత ఘోర పరిణామానికి దారి తీస్తుందో తెలియజేసే ఘటనే ఇది. ఓ యువతి తన ప్రియుడ్ని ఇంటికి పిలిచి ఘాతుకానికి పాల్పడింది. తనను పట్టించుకోవడం లేదనే అనుమానంతో అతన్ని సజీవదహనం చేసిన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో కలకలం రేపింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కథనం అసలు వివరాల్లోకి వెళ్తే.. ప్రేరణ, కిరణ్ ఇద్దరూ ఓ టెలికాం స్టోర్లో జాబ్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఒకరినొకరు ఇష్టపడ్డారు కూడా. అయితే కొంత కాలంగా అతను ఆమెను దూరం పెడుతూ వస్తున్నాడు. తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని.. మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నాడని ఆమె అనుమానించింది. తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదని భావించింది. మంగళవారం దక్షిణ బెంగళూరులో ఉన్న తన ఇంటికి రావాలంటూ పిలిచింది. వెరైటీ ప్రపోజ్ ప్లాన్ గురించి చెప్పింది. దానికి తొలుత అతను ఒప్పుకోలేదు. అయితే ఫారిన్లో ఇదంతా కామన్ అని బలవంతం చేసేసరికి సరే అన్నాడు. కిరణ్ను ఓ కుర్చీలో కూర్చోబెట్టి కాళ్లు చేతులు కట్టేసింది. కళ్లకు గంతలు కట్టేసింది. అతను నిజంగానే ఆమె ఏదో సర్ప్రైజ్ ఇవ్వబోతోందని ఆశపడ్డాడు. కానీ.. ఇంట్లో అప్పటికే దాచిన కిరోసిన్ను తెచ్చి అతని మీద పోసి నిప్పంటించి దూరం నుంచి ఫోన్లో వీడియో తీయసాగింది. కిరణ్ ఆరుపులు విని స్థానికులు పరుగెత్తుకుంటూ వచ్చి రక్షించే ప్రయత్నం చేసినా, అప్పటికే అతను మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల విచారణలో.. తనను పెళ్లి చేసుకోడనే అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆమె ఒప్పుకుంది. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు.ఈ ఘాతుకానికి సంబంధించిన వీడియోను ఆమె ఫోన్ నుంచి స్వాధీనపర్చుకున్నారు. కిరణ్-ప్రేరణల మధ్య స్నేహం గురించి తమకు తెలుసని.. వాళ్లు ఒప్పుకుంటే వివాహం కూడా జరిపించాలని తాము భావించామని ఇరువైపులా పెద్దలు చెబుతున్నారు. ప్రేమ అనేది నమ్మకం.. కానీ అనుమానం ప్రాణాలు తీసింది అని సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు చేస్తున్నారు. -
బాయ్ఫ్రెండ్ కళ్లకు గంతలు కట్టి.. నిప్పంటించిన అమ్మాయి
బెంగళూరు: టెలికాం స్టోర్లో పని చేసే ఓ యువతి తన ప్రియుడిని ఇంటికి పిలిచి, కొత్త తరహా ప్రపోజల్ అంటూ కళ్లకు గంతలు కట్టింది. ఆ తర్వాత అతడిని కుర్చీకి కట్టేసి, అతడికి నిప్పు అంటించింది. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. తన ప్రియుడు తనను పట్టించుకోలేదని కోపంతో ఆ యువతి ఈ ఘటనకు పాల్పడింది. అతడు కాలిపోతోంటే కెమెరాలో చిత్రీకరించి, అతను చనిపోయే వరకు చూస్తూ ఉండిపోయింది.ఆ అమ్మాయి పేరు ప్రేర్నా(27). కిరణ్ (27)తో అదే టెలికాం స్టోర్లో పనిచేస్తోంది. వారిద్దరు ఏడాది పైగా రిలేషన్షిప్లో ఉన్నారు. ఇటీవలి కాలంలో కిరణ్ తనను పట్టించుకోవడం లేదని, తనను పెళ్లి చేసుకోడని ప్రేర్నాకు అనిపించింది. మంగళవారం ప్రేర్నా తన తల్లి, అన్నతో కలిసి నివసించే దక్షిణ బెంగళూరు అంజనాపుర ప్రాంతంలోని ఇంటికి కిరణ్ను పిలిచింది. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో కిరణ్ ఆమె ఇంటికి వచ్చాడు. కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత ఆ యువతి అతని కళ్లకు గంతలు కట్టి కుర్చీలో కూర్చోబెట్టింది. ఆ యువకుడు అభ్యంతరం చెప్పినప్పుడు.. విదేశాల్లో ప్రాచుర్యం పొందుతున్న విధంగా ప్రపోజ్ చేయాలనుకుంటున్నానని ఆ యువతి చెప్పింది. కిరణ్ ప్రపోజల్ కోసం ఎదురు చూశాడు. అప్పటికే ముందుగా సిద్ధం చేసుకున్న పెట్రోల్ వంటి ద్రావణాన్ని అతడిపై పోసింది ప్రేర్నా. “ప్రేర్నాను అదుపులోకి తీసుకున్నాం. అతనికి ఆమె నిప్పు పెట్టి హత్య చేసినట్టు నిర్ధారణ అయ్యింది. ఇద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారు. అతను తనను పట్టించుకోలేదని ఆమె భావించింది” అని పోలీసులు తెలిపారు. -
కోడలిపై కన్నేసిన మామ.. చివరికి జైలు పాలయ్యాడు!
కర్ణాటక: అక్రమ సంబంధాన్ని కొనసాగించడానికి నిరాకరించిన కోడలిని హత్య చేసిన మామకు మైసూరు ఐదవ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.వివరాలు..దోషి గంటయ్య కుమారుడు చిక్కలూరియాకు కవిత అనే యువతితో వివాహమైంది. ఆమె ఒక ప్రైవేట్ కళాశాలలో స్టోర్ కీపర్గా పనిచేసేది. మామ గంటయ్య ఆమెతో అక్రమ సంబంధం కలిగి ఉంది. ఆ సంబంధం కొనసాగించేందుకు కవిత అంగీకరించలేదు. అయితే కవిత మహేష్ అనే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని గంటయ్య అనుమానించాడు. 2023 జూలై 10న తెల్లవారుజామున కవిత నిద్రలో ఉండగా గంటయ్య సుత్తితో తలపై, నుదుటిపై బాది హత్య చేశాడు. పోలీసులు గంటయ్యపై కేసు నమోదు చేసి, కోర్టుకు ఛార్జిషీట్ సమర్పించారు. నేరం నిరూపణ కావడంతో గంటయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 1.5 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కె. ఎన్.రూపా తీర్పు వెలువరించారు. తప్పుడు సాక్ష్యం ఇచ్చిన ప్రభుత్వ అధికారి మైఖేల్ మాథ్యూపై శాఖాపరమైన విచారణకు న్యాయమూర్తి ఆదేశించారు. ప్రభుత్వం తరఫున న్యాయవాదులు బి. ఇ. యోగేశ్వర్, ఏ.ఎన్. మధు వాదించారు. -
బైక్ ట్యాక్సీలకు భారీ షాక్..?
బెంగళూరు: బైక్ ట్యాక్సీల విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ నిర్ణయించాయి. రాష్ట్రంలో బైక్ ట్యాక్సీల విధానానికి నియమావళి రూపొందించే ఉద్దేశం లేదని చెబుతున్న ప్రభుత్వం, హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేయనుంది. గతేడాది హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం బైక్ ట్యాక్సీలను అనధికారికమని ప్రకటించి నిషేధించింది. అయితే ఈ జనవరి 23న ద్విసభ్య ధర్మాసనం బైక్ ట్యాక్సీలకు అనుమతిస్తూ ఆయా సంస్థలకు లైసెన్సులు ఇవ్వాలని సర్కారును ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం బైక్ ట్యాక్సీలకు అవకాశం లేదని సర్కారు వాదించింది. మూడు నాలుగు రోజుల్లో బైక్ ట్యాక్సీల నిషేధం కోసం సుప్రీంలో పిటిషన్ సమర్పించనుంది. దీంతో వేలాదిమంది రైడర్లు అయోమయంలో పడిపోయారు. -
ఇంట్లో అందమైన భార్య ఉన్నా.. పరస్త్రీ మోజుతో దారుణం
సాక్షి,బళ్లారి: వారిద్దరిరి జంట చూడముచ్చటైనదని పెళ్లి రోజు రెండు కుటుంబాల వారు సంబరపడ్డారు. పెళ్లయి రెండున్నర సంవత్సరాలకే అక్రమ సంబంధం వ్యామోహంలో పడిన భర్త తన భార్యను వేధింపులకు గురి చేయడం ప్రారంభించడంతో పాటు వరకట్న వేధింపులకు గురి చేయడం కూడా మొదలు పెట్టారు. అక్రమ సంబంధం మోజు రోజు రోజుకు పెరిగిపోవడంతో అందమైన భార్యను హతమార్చాలని కుట్ర పన్ని ఆ దిశగా పథకం పన్నారు. భర్త వేధింపులు తదితరాలను భార్య రోజు సెల్ఫోన్లో చిత్రీకరించింది. వివరాల్లోకి వెళితే... దావణగెరె తాలూకా మండలూరు గ్రామానికి చెందిన పేదింటి అందమైన అమ్మాయి కావ్యకు చెన్నగిరి తాలూకా హూదగెరె గ్రామానికి చెందిన మను అనే వ్యక్తితో రెండున్నర సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. మను ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆడబిడ్డ తల్లిదండ్రులు సంబరపడి పెళ్లి చేశారు. పెళ్లిలో అష్టకష్టాలతో రెండున్నర లక్షల నగదు, 70 గ్రాముల బంగారం కూడా ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. భార్యను అంతమొందించాలని వేధింపులు అయితే పెళ్లి అయిన రెండు సంవత్సరాల నుంచి భార్యను విపరీతంగా వేధించడం మొదలుపెట్టిన మను తీరును భార్య గమనించింది. పరస్త్రీ మోజులో పడి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని గమనించి తల్లిదండ్రులకు తెలిపిన తర్వాత పంచాయతీ కూడా చేశారు. దావణగెరె నగరంలో కాపురం ఉంటున్న కావ్య, మను మంత్రాలయానికి వెళ్లాలని ఏర్పాట్లు చేసుకున్నారు. భార్యను హత్య చేయాలని పథకం వేసుకున్న మను ఆ దిశగా ఆమెను హత్య చేసిన తర్వాత అత్తమామలకు ఫోన్ చేసి కావ్య ఫోన్ పని చేయడం లేదని చెప్పారు. తల్లిదండ్రులు దావణగెరెకి వచ్చి పరిశీలించగా, కుమార్తె అచేతనంగా పడి ఉండటం గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే కావ్య మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. కూతురు మృతితో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కుమార్తె సెల్ఫోన్ పరిశీలించగా భర్త గుట్టురట్టు కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య మిస్టరీని సెల్ఫోన్ ద్వారా ఛేదించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
తీర్థయాత్ర విషాదాంతం ఆరుగురు సజీవ దహనం
రాయచూరు రూరల్: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తీర్థయాత్ర విషాదాంతమైంది. ఆరుగురు సజీవదహనమయ్యారు. ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన యాదగిరి జిల్లాలో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. యాదగిరి జిల్లా సురపుర తాలూకాలో జాతీయ రహదారి– 150పై శాంతాపుర వద్ద బెంగళూరు నుంచి కలబుర్గికి వెళుతున్న ప్రైవేట్ బస్సు, కలబుర్గి నుంచి లింగసుగూరు వైపు వస్తున్న కారు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన బస్సులోని ప్రయాణికులందరూ కిందకు దిగారు. ప్రమాద తీవ్రతకు కారు డోర్లు తెరచుకోకపోవడంతో అందులోని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రయాణికులు బయటికి రాలేక సజీవ దహనమయ్యారు. ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా రాయచూరు జిల్లా సిరవారకు చెందిన పంచాయతీ మాజీ సభ్యుడు కృష్ణానాయక్ కుటుంబ సభ్యులు.తిరుగు ప్రయాణంలో దుర్ఘటనఅమావాస్య కావడంతో శుక్రవారం సురపురలోని వేణుగోపాల స్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు ఉదయాన్నే 6.30 గంటలకు రాయచూరు జిల్లా సిరవార నుంచి పట్టణ పంచాయతీ మాజీ సభ్యుడు కృష్ణా నాయక్ కుటుంబం కారులో బయలుదేరింది. స్వామిని దర్శించుకుని 10.45 గంటలకు తిరుగు ప్రయాణమైన కొద్దిసేపటికే ప్రమాదం జరగడంతో కృష్ణా నాయక్(52), ఆయన భార్య అనంతకళ(45), కుటుంబ సభ్యులు శరణప్ప (36), నిసర్గ (30), సిద్ధార్థ(3), శశికళ(30) మరణించారు. కారుడోర్లు తెరుచుకోకపోవడంతో సజీవదహనమయ్యారు. వెనకవైపు కూర్చున్న పిల్లలు అద్విక, శ్రీనిధిని అటుగా వెళ్లేవారు అద్దాలు పగలగొట్టి బయటకు లాగారు. అయినా అప్పటికే పిల్లలిద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం యాదగిరి ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించినట్లు జిల్లా ఎస్పీ పృథ్వీశంకర్ తెలిపారు. బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది సురక్షితంగా బయట పడగా, కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. మంటల్లో కారు, బస్సు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలాన్ని సురపుర ఎమ్మెల్యే వేణుగోపాల నాయక్ పరిశీలించారు. క్షతగాత్రులను పరామర్శించారు. కృష్ణా నాయక్తో పాటు కుటుంబ సభ్యులు దుర్మరణం చెందడంపై రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, ఎమ్మెల్యేలు హంపయ్య నాయక్, బసనగౌడ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్యేకి జీవితఖైదు
బెంగళూరు: కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వినయ్ కులకర్ణికి జీవితఖైదు విధించింది ప్రజాప్రతినిధుల కోర్టు. బీజేపీ నేత యోగేష్గౌడ్ హత్య కేసులో వినయ్ కులకర్ణిని దోషిగా నిర్ధారించిన కోర్టు.. జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. 2016లో యోగేష్ గౌడ్ హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘ విచారణల అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణితో పాటు మరో 16 మందికి ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం యావజ్ఝీవ కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో ఇప్పటికే దోషిగా వినయ్ కులకర్ణిని నిర్ధారించిన కోర్టు.. శిక్షా కాలాన్ని శుక్రవారం ఖరారు చేసింది. ఈ ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ శిక్షా కాలాన్ని ఖరారు చేశారు. ఈ కేసుకు సంబంధించి వినయ్ కులకర్ణి, మరో 16 మందిపై హత్య (సెక్షన్ 302), నేరపూరిత కుట్ర (సెక్షన్ 120బి) నేరాలకు పాల్పడినట్లు న్యాయస్థానం నిర్ధారించింది.ఈ హత్య కేసులో పదవిలో ఉన్న శాసనసభ్యుడి ప్రమేయం ఉన్నందున సమాజానికి గట్టి సందేశం పంపే శిక్ష విధించాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శివానంద పెర్ల , ఎస్. హేమహద్లు వాదించారు. యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని తమ వాదనలు వినిపించారు. అయితే వినయ్ కులకర్ణి న్యాయబృందం మాత్రం ఆయనకున్న కనికరం చూపి శిక్ష తగ్గించాలని అ భ్యర్థించిన ప్పటికీ నేరం యొక్క తీవ్రతను బట్టి యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది కోర్టు.యోగేష్ గౌడ్ హత్య ఇలా..2016, జూన్ 15న బీజేపీ ధార్వాడ్ జిల్లా పంచాయత్ సభ్యుడైన యోగేష్గౌడ గౌడర్ను ధార్వాడ్లోని ఆయన జిమ్లో దారుణంగా నరికి చంపారు. మొదట్లో స్థానిక పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఈ కేసును స్థానిక పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేశారు. అప్పటి జిల్లా ఇన్చార్జ్ మంత్రి కులకర్ణి అప్పటి జిల్లా ఇన్చార్జ్ మంత్రి కులకర్ణి.., ఎదుగుతున్న రాజకీయ ప్రత్యర్థిని అణచివేసేందుకు ఈ హత్యను చేయించారనే ఆరోపణలు వచ్చాయి. అయితే 2016లో హత్య జరిగితే 2019లో ఈ కేసును సీబీఐకి బదిలీ చేశారు. -
కర్ణాటకలో బిగ్ ట్విస్ట్.. సిద్దరామయ్యకు ఎదురుగాలి!
సాక్షి, బెంగళూరు: కొన్ని నెలలుగా కన్నడ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కుర్చీ గురించి రగడ జరుగుతూనే ఉంది.. సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ మధ్య పోరాటంతో ప్రభుత్వంలో, పార్టీలో వర్గాలు ఏర్పడ్డాయి. అంతఃకలహాలు అధికం కావడంతో ఆధిక్యం కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. కొన్నిరోజులుగా సీఎం సిద్ధరామయ్య శిబిరంపై దాడులు జరుగుతున్నాయి. పలువురు సిద్ధరామయ్య సన్నిహితులు పదవులు కోల్పోయేలా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ శిబిరం చేయగలిగింది. వరుస ఎదురుదెబ్బలతో సీఎం సిద్ధరామయ్య డైలామాలో పడిపోయారు. రాజణ్ణ నుంచి షురూ సీఎం ఆప్తుడు మంత్రి కేఎన్ రాజణ్ణ.. రాహుల్ గాంధీ మీద నోరు జారడంతో వెంటనే పదవి నుంచి తొలగించారు. దావణగెరె ఉప ఎన్నికలు వచ్చాక సిద్దరామయ్యకు ఎదురుగాలి అధికమైంది. అక్కడ తిరుగుబాటు అభ్యర్థికి మద్దతిచ్చారని సీఎం రాజకీయ కార్యదర్శి పదవి నుంచి నజీర్ అహ్మద్ సస్పెండ్, మైనారిటీ నేత అబ్దుల్ జబ్బార్ను పదవితో పాటు పార్టీ సభ్యత్వం నుంచి తీసేయడం కలకలానికి కారణమైంది. సిద్ధరామయ్య కూడా సన్నిహితులను కాపాడుకోవడానికి ఎక్కువ పోరాటం చేయడం లేదు. ఈ సమయంలో కేపీసీసీ చీఫ్గా డీకే శివకుమార్ పోరును తీవ్రం చేశారు. భవిష్యత్ కష్టమే.. భవిష్యత్తులో మరింత మంది సిద్ధరామయ్య వర్గీయులకు ఎదురు దెబ్బలు తగిలినా ఆశ్చర్యం లేదని తెలుస్తోంది. నోటీసులు, క్రమశిక్షణ చర్యల హెచ్చరికలు కాకుండా నేరుగా పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు కొనసాగుతాయని తెలుస్తోంది. తాను ముఖ్యమైన పదవిలో ఉండడంతో పాటు పార్టీ పరిమితుల దృష్ట్యా సిద్ధరామయ్య మౌనం వహిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు తన పదవిని కాపాడుకోవడం చాలా ముఖ్యమని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు పలువురు సీనియర్లు పేర్కొన్నారు. త్వరలో బెంగళూరుకు ఓ చెందిన ఓ మంత్రిని కూడా పార్టీ హైకమాండ్ తప్పించవచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. మునుముందు ఏం జరుగుతుందనేది సస్పెన్స్గా ఉంది. బెంగళూరు విమానాశ్రయంతో ప్రధాని మోదీ, సిద్దరామయ్య చెవిలో మంతనాలు జరపడం దేనికి సంకేతమని తీవ్ర చర్చనీయాంశమైంది. -
కర్నూలులో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం
సాక్షి, కర్నూలు: జిల్లాలో గురువారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వాహనం- రెడీమిక్స్ లారీ ఢీ కొట్టి ఎనిమిది మంది మృతి చెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం ధాటికి బొలెరో వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. మరోవైపు లారీ కూడా ఓ పక్కకు ఒరిగి పడిపోయింది. ఘటనాస్థలంలోనే ఐదుగురు మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, మూడేళ్ల చిన్నారి, వాహన డ్రైవర్తో సహా మరో వ్యక్తి. గాయపడినవాళ్లలో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల పేర్లు.. కుమార్ (60), దీపిక వీణ (35), సునీల్ (40), బెల్లి (3), పుట్టమ్మ (60), మీనాక్షి (50), తాయమ్మ (60), లోలాక్షి. కర్ణాటక చిక్మంగళూరు వాసులుగా గుర్తించారు. మంత్రాలయ శ్రీరాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాద సమయంలో బొలెరోలో 16 మంది ఉన్నారు. మృతదేహాలను ఎమ్మిగనూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. -
గ్యాస్ సిలిండర్తో భర్తపై దాడి.. ప్రియుడితో కలిసి కుట్ర
కర్ణాటక: తప్పటడుగులతో భార్యాభర్తల సంబంధాలు అవహేళనకు గురవుతున్నాయి. ఎవరో ఒకరు పరుల వ్యామోహంలో చిక్కుకుని రక్తపాతానికీ వెనుకాడడం లేదు. ఇదే మాదిరిగా తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఆగ్రహించిన భార్య తన ప్రియునితో కలిసి భర్తను హత్య చేయించిన సంఘటన బెళగావి నగరంలో తిళకవాడి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఆయుర్వేద వైద్యుడు అవినాశ్ సుప్పన్న (40) హత్యకు గురైన వ్యక్తి. ఈ కేసులో ఇతని భార్య లక్ష్మి (29), ఆమె ప్రియుడు కైలాస బాలక్రిష్ణ (43) అరెస్టయ్యారు. గ్యాస్ సిలిండర్తో బాది.. వివరాలు.. అవినాశ్ 5న తన ఆయుర్వేదిక్ కేర్ సెంటర్లో తలకు తీవ్ర గాయమై చనిపోయాడు. మృతిపై అనుమానాలున్నాయని అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య మాత్రం అధిక బీపీ వల్ల కిందపడి చనిపోయి ఉంటాడని నమ్మబలికింది. కేసు నమోదు చేసుకున్న తిళకవాడి పోలీసులు సీసీ కెమెరాల చిత్రాలు, ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేసి కనిపెట్టారు. లక్షి్మ, బాలక్రిష్ణ మధ్య అక్రమ సంబంధం ఉండగా, ఇది తెలిసి అవినాశ్ భార్యను మందలించాడు. బాలక్రిష్ణ వీరి ఇంటికి దగ్గరిలోనే ఓ మొబైల్ఫోన్ల షాప్ నడిపేవాడు. తమ సంతోషానికి అడ్డుగా ఉన్న అతన్ని తొలగించుకోవాలని భార్య, ప్రియుడు నిర్ణయించారు. అవినాశ్ తన క్లినిక్లో ఉండగా, పథకం ప్రకారం బాలక్రిష్ణ చొరబడి అక్కడి గ్యాస్ సిలిండర్తో తలపై, గుండెల మీద బలంగా కొట్టి హత్య చేసి వెళ్లిపోయాడని పోలీస్ కమిషనర్ భూషణ్ బోర్సే తెలిపారు. లక్ష్మి తనకు ఏం తెలీదని బుకాయించినా పొంతనలేని సమాధానాలు ఇస్తుండడంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా నిజం బయటకు వచ్చింది. నిందితులను అరెస్టు చేశారు. ఈ సంఘటన బెళగావిలో తీవ్ర సంచలనం కలిగిస్తోంది. -
కొండల్లో కేరళ బాలిక మిస్సింగ్.. నాలుగు రోజుల తర్వాత..
కర్ణాటక కొండల్లో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లి అదృశ్యమైన 14 ఏళ్ల కేరళ బాలిక నాలుగు రోజుల తర్వాత శవమై కనిపించింది. పోలీసులు ముమ్మరంగా గాలించిన తర్వాత ఆమె మృతదేహం లభ్యం కాగా.. తమ బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేరళలోని పాలక్కాడ్కు చెందిన 10వ తరగతి విద్యార్థిని శ్రీనంద తన బంధువులతో సుమారు 40 మందితో కలిసి కర్ణాటక పర్యటనకు వచ్చింది. వీరు మొదట ఉత్తర కర్ణాటకలోని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద హంపిని సందర్శించారు. ఏప్రిల్ 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు చిక్కమగళూరు చేరుకున్నారు. అక్కడ ప్రైవేట్ జీపుల్లో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్లి.. ఆ తర్వాత చంద్రద్రోణ కొండల్లో ట్రెక్కింగ్కు వెళ్లారు.ట్రెక్కింగ్ రోజున ఒక కుటుంబ సభ్యుడితో కలిసి ఉన్న వీడియోలో బాలిక చివరిసారిగా కనిపించింది. అయితే, ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో చీకటి పడుతున్న సమయంలో ఆమె అదృశ్యమైంది. కొండల్లోని మాణిక్యధార ప్రాంతంలో ఆమెను చివరిగా చూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. లోతైన ఘాట్ ప్రదేశాలు, ఎత్తైన కొండ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. లోతైన ప్రాంతాలకు వెళ్లేందుకు తాళ్లను కూడా ఉపయోగించారు. రాత్రి సమయాల్లో డ్రోన్ సర్వైలెన్స్, థర్మల్ కెమెరాలను వినియోగించారు. నాలుగు రోజులు పాటు గాలింపు అనంతరం మాణిక్యధార వ్యూ పాయింట్కు సుమారు 1,500 అడుగుల దిగువన ఉన్న లోయలో శ్రీనంద మృతదేహం లభ్యమైంది.అయితే, బాలిక మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనపై కర్ణాటక హోం మంత్రి స్పందిస్తూ.. బాలిక కిడ్నాప్ అయి ఉండవచ్చని ఒక వాదన ఉందని.. ఎవరితోనైనా వెళ్లి ఉండవచ్చని మరో వాదన వినిపిస్తున్నాయి. అయితే ఆమె ఆచూకీ లభించిన నేపథ్యంలో వాస్తవాలు విచారణలో తేలుతాయని పేర్కొన్నారు. పోలీసులు పలు కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ప్రమాదవశాత్తూ కొండపై నుండి జారిపడిందా? ఇతర కారణాలు ఉన్నాయా అన్నది తేల్చాల్సి ఉంది. దర్యాప్తులో భాగంగా బాలిక తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
కృతికా కేసు: ‘పోలీసులు అడిగితే మనం స్నేహితులమని చెప్పు’
బెంగళూరు: సంచలనం సృష్టించిన బెంగళూరు డాక్టర్ కేసులో ఏడాది తర్వాత.. చాటింగ్ వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. బెంగళూరుకు చెందిన జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్ర రెడ్డి.. కట్టుకున్న భార్యను(చర్మవ్యాధి నిపుణురాలు) కిరాతకంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఆ నేరాన్ని కప్పిపుచ్చడానికి తన ప్రియురాలితో కలిసి పథకం పన్నినట్లు తెలుస్తోంది. తన భార్య కృతికా రెడ్డికి ఇంట్లోనే మోతాదుకు మించి అనస్థీషియా డ్రగ్ ఇచ్చి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహేంద్ర రెడ్డిని.. గతేడాది అక్టోబర్లో పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటన గత ఏడాది ఏప్రిల్ 21న జరిగింది. ఇంట్లో కృతిక అస్వస్థతకు గురైనట్లు నాటకమాడి, మహేంద్ర ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మొదట ఇది సహజ మరణంగా భావించినప్పటికీ తదుపరి విచారణలో పోలీసులకు అనుమానాలు కలిగాయి. ఒక డాక్టరుగా తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ఆ హత్యను సహజ మరణంగా చిత్రీకరించేందుకు మహేంద్ర ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు.దర్యాప్తు సమయంలో నిందితుడు హర్షిత అనే నర్సుతో సంబంధంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలు ఈ కేసులో అత్యంత కీలక ఆధారాలుగా మారాయి. నిఘా సంస్థలకు దొరకకుండా ఉండేందుకు మహేంద్ర వాట్సాప్ వంటి సాధారణ ప్లాట్ఫారమ్లను వాడకుండా, ఫోన్ పే వంటి యూపీఐ పేమెంట్ యాప్ల ద్వారా సందేశాలు పంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) నిందితుడి ఫోన్ నుండి డిజిటల్ ఫైళ్లను రికవరీ చేసింది. ఇందులో డిలీట్ చేసిన డేటా, సన్నిహితంగా ఉన్న ఫోటోలు, ఫోన్ పే చాట్లు ఉన్నాయి. వీటిని పోలీసులు చార్జ్షీట్లో చేర్చారు.నిందితుడు హర్షితకు పంపిన కొన్ని మెసేజ్లు.. అతని నేరం చేయడానికి ముందస్తు ప్లాన్ బయటపడింది. "ఈ మెసేజ్ చూసిన తర్వాత నాకు ఎక్కడా టెక్స్ట్ చేయొద్దు, కాల్ చేయొద్దు. అంతా సర్దుకున్నాక నేనే కాల్ చేస్తాను. ఒకవేళ పోలీసులు నిన్ను పిలిచి మన మధ్య సంబంధం ఏంటని అడిగితే.. మనం కేవలం స్నేహితులమని చెప్పు’’ అంటూ చేసిన చాటింగ్ బయటపడింది. మహేంద్ర, కృతికలకు మే 2024లో వివాహం జరిగింది. వీరిద్దరూ బెంగళూరులోని ఒకే ఆసుపత్రిలో పనిచేసేవారు. సేకరించిన ఆధారాలు బలంగా ఉండటంతో స్థానిక కోర్టు.. మహేంద్ర రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. -
జస్ట్ తాళి కడుతుండగా షాకింగ్ న్యూస్, వరుడు మాత్రం !
కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఒక వివాహ వేడుకలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సరిగ్గా తాళి కట్టే సమయానికి కొన్ని నిమిషాల ముందు, వధువు పల్లవి అకస్మాత్తుగా పెళ్లిని ఆపేసింది. దీంతో పెళ్లి కొడుకుతోపాటు, అందరూ షాకయ్యారు. వధువు ఎందుకలా చేసింది? చివరికి ఏమైంది? ఇలాంటి మీ అనుమానాలకు, సందేహాలకు సమాధానం దొరకాలంటే..ఈ కథనాన్ని చదివేయండి మరి.బంధువుమిత్రులు, బాజా భజంత్రీల మధ్య వరుడు వేణుగోపాల్ తాళి కట్టడానికి రెడీ అయ్యాడు. ఇంతలో సినిమా ఫక్కిలో నాకీ పెళ్లి ఇష్టం లేదంటూ భయపడుతూనే ధైర్యం చేసి మెల్లగా చెప్పింది వధువు పల్లవి. దీంతో అందరూ ఒకింత దిగ్భ్రాంతికి, మరింత గందర గోళానికి గురయ్యారు.అసలు ఏం జరిగింది? అపుడు అసలు విషయం తాపీగా చెప్పింది. తాను వేరొకరిని ప్రేమిస్తున్నానని, అయితే ప్రేమించిన వ్యక్తి వేరే కులానికి చెందినవాడని, అందుకే ఈ విషయాన్ని ముందుగా తన కుటుంబానికి చెప్పలేకపోయానని కళ్ళనీళ్లతో చెప్పింది. ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, వరుడికి, ఆమె తన కుటుంబ సభ్యులకు చెప్పింది. అయినా ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించారు, కానీ ఆమె తన మనసు మార్చుకోలేదు.వరుడు ఏం చేశాడు?అయితే వరుడి స్పందన మరింత విశేషంగా నిలిచింది. వధువు మానసకి పరిస్థితిని అర్థం చేసుకున్న వరుణ వేణుగోపాల్ ఆమె పట్ల సానుకూలంగా స్పందించాడు. తాను ప్రేమించని వారిని పెళ్లి చేసుకోమని ఎవరినీ బలవంతం చేయనని స్పష్టం చేశాడు. ఈ స్టోరీని ఒక ఎక్స్యూజర్ వరుడికి హ్యాట్యాఫ్ అంటూ పోస్ట్ చేశారు. దీంతో నెటిజనులనుంచి కూడా సానుకూల స్పందన లభించింది. In Karnataka's Hassan district, minutes before the wedding started, the bride Pallavi suddenly stopped it.Everyone was shocked and confused. She told her family that she didn't want to marry the groom Venugopala because she loved someone else. She explained that the person she… pic.twitter.com/h3u9kn8ejS— Aparajite (@amshilparaghu) April 2, 2026నెటిజన్లు స్పందనఈ క్రెడిట్కు పల్లవికి కూడా దక్కుతుంది. ఎలాగైతేనేం ధైర్యం చేసి తన ప్రేమకోసం ధైర్యంగా నిలబడింది. అలాగే వరుడు కూడా ఎలాంటి డ్రామా క్రియేట్ చేయకుండా పరిస్థితిని అర్థం చేసుక్నాడని ఒకరు, వావ్, ఇద్దరికీ అభినందనలు! తన ప్రేమ కోసం నిలబడిన పల్లవికి, పరిస్థితిని అర్థం చేసుకున్న వేణుగోపాలకు. ఇదే నిజమైన పరిణితి, గౌరవం అంటూ ఒకరు కమెంట్ చేశారు. అంతేకాదు ఇంతదాగా ఎందుకు లాగాలని కొందరంటే.. ఒకే బెటర్ నెవర్ దేన్ లేట్, అబ్బాయ్ సేఫ్.. బతికిపోయాడు బిడ్డ ఇలాంటి ఫన్నీ కామెంట్లు వెల్లువెత్తడం గమనార్హం. Pelli koduku frds : mavodu safe pic.twitter.com/l9fO731r4R— Charan (@charan14in) April 3, 2026 -
వైద్య విద్యార్థిని లిఖిత ఆత్మహత్య కలకలం
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హోలెల్కెరె పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తనపై జరిగిన పుకార్ల ప్రచారంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ ఆయుర్వేద వైద్య విద్యార్థిని (BAMS) ఆత్మహత్యకు పాల్పడిన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి:23 ఏళ్ల లిఖిత, మల్లాడిహళ్లిలోని రాఘవేంద్ర ఆయుర్వేద కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BAMS) చదువుతోంది. హోలెల్కెరె పట్టణంలోని బసవ లేఅవుట్లో ఉన్న తన ఇంట్లో మంగళవారం ఆమె విగతజీవిగా కనిపించడం విషాదాన్ని నింపింది. లిఖితకు ఆమె కాలేజీలోని ఒక ప్రొఫెసర్తో సంబంధం ఉందంటూ గత కొంతకాలంగా కళాశాలలో దుష్ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్ల వల్ల తన పరువు పోయిందని, సమాజంలో తల ఎత్తుకోలేకపోతున్నానని ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది.సంఘటనా స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్లో స్వాధీనం చేసుకున్నారు. ఈ లేఖలో లిఖిత సంచలన విషయాలు పేర్కొంది.తన మరణానికి ఒక ఫ్యాకల్టీ మెంబర్, అతని భార్య, మరి కొందరు తోటి విద్యార్థినులు కారణమని ఆరోపించింది. వేధించి, తనపై తప్పుడు ప్రచారం చేసి మానసిక క్షోభకు గురిచేశారని లేఖలో వాపోయింది.మరోవైపు స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న లిఖిత తండ్రి ఉమాశంకర్ మరికొన్ని కీలక విషయాలను వెల్లడించారు. కొందరు క్లాస్మేట్స్ తమ కుమార్తెను కావాలనేవేధించారని, లెక్చరర్తో అఫైర్ ఉన్నట్లు పుకార్లు సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ వారిద్దిరీ కేవలం గురువుకు, శిష్యురాలికి మధ్య ఉండే గౌరవ ప్రద సంబంధం మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. నిరంతరం వేధించడం, సూటిపోటి మాటలతో అవమానించడం వల్లే తన కూతురు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులని భావిస్తున్న సహవిద్యార్థులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాని ఆయన డిమాండ్ చేశారు. ఈఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. -
ఐఏఎస్ రోహిణి సింధూరికి బిగ్ షాక్..
శివాజీనగర: కర్ణాటకలో సీనియర్ ఐఏఎస్ రోహిణి సింధూరికి ఊహించని షాక్ తగిలింది. కాటన్ బ్యాగుల కొనుగోలులో నిధుల దుర్వినియోగం జరిగాయనే ఆరోపణలపై సింధూరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.మైసూరుకు చెందిన న్యాయవాది ఎన్.ఆర్.రవిచంద్రేగౌడ సమర్పించిన పిటిషన్ను న్యాయమూర్తి జస్టిస్ ఎన్.నాగప్రసన్న విచారించారు. ఆమె మీద విచారణకు అనుమతి నిరాకరిస్తూ సర్కారు ఇచ్చిన ఆదేశాలను జస్టిస్ రద్దు చేశారు. దర్యాప్తు ద్వారానే వాస్తవాలను బహిరంగపరచాలి, అప్పుడే ప్రజలకు నిజాలేమిటో తెలుస్తాయి అని పలు వ్యాఖ్యలు చేశారు. నాలుగు వారాల్లోగా వాస్తవాలను వెలికి తీసేందుకు విచారణకు ఆదేశించాలని ప్రభుత్వానికి సూచించారు. అవినీతిని నియంత్రించకపోతే అది రాజకీయ రంగాన్ని అస్థిరపరుస్తుందని, ప్రభుత్వ సంస్థలను నాశనం చేస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు.గతంలో రోహిణి సింధూరి మైసూరు కలెక్టర్గా ఉన్న సమయంలో స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా మైసూరులో ప్లాస్టిక్ సంచుల బదులుగా వస్త్రపు సంచులు కొనుగోలు చేసి, వితరణ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇందులో భాగంగా రూ.13 ధర కలిగిన బట్ట సంచులను రూ.52 ధరతో కొనుగోలు చేశారని, దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.7.65 కోట్ల నష్టం జరిగిందని న్యాయవాది పిటిషన్ వేశారు. -
నవ జంట బతుకులో కల్లోలం
దొడ్డబళ్లాపురం: కొత్తగా పెళ్లయిన జంటను కారు ప్రమాదం విచ్ఛిన్నం చేసింది. ఎన్నో కలలతో శ్రీకారం చుట్టిన కొత్త జీవితం మూణ్నాళ్ల ముచ్చటే అయ్యింది. వారు ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొన్న ప్రమాదంలో భార్య, బంధువు దుర్మరణం చెందారు, భర్త తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన చిక్కబళ్లాపురం తాలూకా శెట్టిగెరె వద్ద బెంగళూరు–హైదరాబాద్ హైవేలో జరిగింది. రక్షిత రెడ్డి (23), పవన్రెడ్డి (30) మృతులు కాగా, రక్షితరెడ్డి భర్త రాజశేఖర్ రెడ్డి (28) తీవ్రంగా గాయపడ్డాడు.ఎలా జరిగింది?రక్షిత, రాజశేఖర్ ఇద్దరూ బెంగళూరులో ఐటీ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. వీరికి గత నవంబర్లో వివాహమైంది. ఏపీలోని అనంతపురానికి చెందిన వీరు గురువారం నాడు కారులో బెంగళూరు నుంచి అనంతపురం వెళుతున్నారు. శెట్టిగెరె వద్ద వీరి కారు ముందు వెళ్తున్న కంటైనర్ లారీని వేగంగా ఢీకొంది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, రక్షిత, బంధువు పవన్ తీవ్ర గాయాలతో దుర్మరణం చెందారు. గాయపడిన రాజశేఖర్ని స్థానికులు బెంగళూరుకు తరలించారు. ప్రమాదంతో హైవేపై గంటకు పైగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పేరేసంద్ర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
వంటింట్లో తిష్ట వేసిన 14 అడుగుల కింగ్ కోబ్రా!
కర్ణాటక: రోడ్డు మీద వెళ్తున్న కింగ్ కోబ్రా పాము ఇంట్లోకి దూరింది. జిల్లాలోని కాచిబట్టి గ్రామంలో రోడ్డు దాటుతున్న సుమారు 14 అడుగుల గిరినాగు ఒకటి వాహనం తగలడంతో పక్కనే రాజు నాయక్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడింది. వంటింట్లో తిష్టవేసిన అతిథిని చూసిన కుటుంబ సభ్యులు భయాందోళనకు లోనయ్యారు. అటవీ సిబ్బందికి కాల్ చేయగా, వారు మహేశ్ నాయక్కు చెప్పారు. మహేశ్ నాయక్, ఆయన కుమారుడు గగన్ నాయక్ చాలాసేపు కష్టపడి కింగ్ కోబ్రాను క్షేమంగా పట్టుకున్నారు. దానిని దూరంగా తీసుకెళ్లి వదిలిపెట్టారు. -
టీవీ ఆన్ చేస్తే నాగు గర్జన.. లోపల చూసి షాక్!
కర్ణాటక: సామాన్యంగా టీవీ పాడైపోతే మెకానిక్ దగ్గరికి తీసుకెళతారు. అయితే చామరాజనగర మల్లయ్యనపుర గ్రామంలో దొడ్డమాదప్ప ఇంటిలో జరిగింది వేరే. కొన్ని రోజుల నుంచి ఇంట్లో టీవీ నుంచి విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. రోజురోజుకూ శబ్ధాలు ఎక్కువ కావడంతో టీవీ లోపల చూసి నిశ్చేష్టులయ్యారు. లోపల ఏదో కదులుతూ కనిపించింది. ఆ తర్వాత అది పాము అని తెలిసి వెంటే స్నేక్ చాపు నకు కాల్ చేశారు. స్నేక్ చాపు టీవీని జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లి అందులో మకాం వేసిన 8 అడుగుల విషపూరిత పామును పట్టుకున్నాడు. టీవీ వైర్ల మధ్య చుట్టుకుని ఉందది. ఇంటి చుట్టుపక్కల ఎలుకలు, కప్పలు ఎక్కువగా ఉండడంతో వాటి కోసం వచ్చి టీవీలో చేరినట్లు స్నేక్ చాపు తెలిపాడు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. -
భాష లేని బంధం.. బావురుమన్న వానరం!
దొడ్డబళ్లాపురం: కర్ణాటకలోని చెన్నపట్టణ తాలూకా బీవీహళ్లి నివాసి పార్వతమ్మ చాలా కాలంగా ఓ కోతికి రోజూ అన్నం పెట్టేది. ఆమె మంగళవారం మరణించగా కుటుంబీకులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. పార్వతమ్మపై అవ్యాజ ప్రేమ పెంచుకున్న ఆ వానరం యజమాని మృతదేహాన్ని పట్టుకుని మూగరోదన చేసింది. అందరినీ కదిలించిన ఈ దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.A touching final goodbye in Rayara Doddi, Channapatna near Bengaluru: A monkey hugs the body of an 85-year-old woman who regularly fed them, as if saying farewell. ❤️🥹pic.twitter.com/GN2GOWZsn7— Ghar Ke Kalesh (@gharkekalesh) April 1, 2026 -
సక్సెస్ బాటలో సహజ ఆర్గానిక్స్
దేశంలో సేంద్రియ వ్యవసాయానికి పెరుగుతున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలపై అధ్యయనం చెయ్యటానికి కేంద్ర ప్రభుత్వం డాక్టర్ కున్వర్జి భాయ్ జాధవ్ అధ్యక్షతన తొలి ఆర్గానిక్ ఫార్మింగ్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. దీని నివేదిక ఆధారంగానే ‘నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్’ (ఎన్పీఓపీ) పేరిట తొలి ఆర్గానిక్ సర్టిఫికేషన్ వ్యవస్థ 2000 మార్చిలో అమల్లోకి వచ్చింది. సేంద్రియ వ్యవసాయం, సర్టిఫికేషన్ వ్యవహారాలను సమన్వయపరచడానికి ‘నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ (ఎన్సీఓఎఫ్)’ 2004లో ప్రారంభమైంది. తదనంతరం ఈ సంస్థ పేరులో ‘నేచురల్’ అనే పదాన్ని చేర్చటం ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని కూడా కేంద్ర వ్యవసాయ శాఖ దీని పరిధిలోకి తెచ్చింది. అదే ఏడాది తొలి సేంద్రియ వ్యవసాయ విధానాన్ని 2004 మార్చి 24న అమల్లోకి తెచ్చిన ఘనత కర్ణాటక రాష్ట్రానికి దక్కింది. ఈ నేపథ్యంలో రూపుదిద్దుకున్న బెంగళూరుకు చెందిన సహజ ఆర్గానిక్స్ ఎఫ్పీఓ ప్రజల ఆదరణ పొందుతోంది.130 ఉత్పత్తులు... రూ.28 కోట్ల టర్నోవర్కర్ణాటకలో ఏర్పాటైన తొలి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ‘సహజ సమృద్ధ ఆర్గానిక్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్’. 16 ఏళ్ల క్రితం కంపెనీ చట్టం ప్రకారం బెంగళూరులో రిజిస్టరైన ఈ ఎఫ్పీఓ తన వాటాదారులైన 1,024 మంది సేంద్రియ రైతులకు అధిక నికరాదాయాన్ని అందిస్తోంది. దానితో పాటు, 15 రాష్ట్రాల్లోని సేంద్రియ రిటైల్ విక్రయదారులకు, వినియోగదారులకు నమ్మకమైన రసాయన అవశేషాల్లేని ఆహారోత్పత్తులను ‘సహజ ఆర్గానిక్స్’ బ్రాండ్తో చేరవేస్తోంది. 130 పచారీ సామాన్లతో పాటు వంద రకాలకు పైగా కూరగాయలు, పండ్లను టోకుగా, రిటైల్గా విక్రయిస్తూ గత ఏడాది రూ.28 కోట్ల వార్షిక టర్నోవర్ సాధించింది. ప్రతిష్టాత్మక జైవిక్ ఇండియా ఫస్ట్ ప్రైజ్ సహా అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు గెల్చుకుంది. అన్నిటికీ మించి, 2018 జూన్ 24న ‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు పొందటం విశేషం.రైతుకు 15–20% అదనపు ధరసహజ ఆర్గానిక్స్ తన వాటాదారులైన రైతుల నుంచి, దేశవ్యాప్తంగా 25కు పైగా సేంద్రియ రైతు బృందాల నుంచి∙ఈ ఎఫ్పీఓ దేశీ వరి బియ్యం, పప్పులు, నూనె గింజలు, పండ్లు, బెల్లం, తేనె తదితరాలను సేకరిస్తుంది. బెంగళూరు పరిసరాల్లోని 5 గ్రామాల్లో సేంద్రియ రైతుల నుంచి కూరగాయలు, పండ్లను సేకరిస్తుంది. రైతులకు, ప్రాసెసింగ్ యూనిట్, మిల్లులకు ఎన్పీఓపీ ఆర్గానిక్ సర్టిఫికేషన్తో పాటు ఐఎంఓ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ తప్పనిసరి చేశారు. రైతులకు మార్కెట్ ధరపై 15–20% అదనపు ధర చెల్లిస్తున్నట్లు సహజ ఆర్గానిక్స్ ప్రతినిధి ప్రసాద్ బెంగళూరులోని ప్రాసెసింగ్ యూనిట్ను సందర్శించిన ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. ప్రతి పంటకు బేస్ ధర ఉంటుంది. బహిరంగ మార్కెట్లో అంతకన్నా ధర పతనమైనా ఎఫ్పీఓ ఆ ధర చెల్లిస్తుందన్న మాట. ఉదా.. టొమాటో బేస్ ధర కిలోకు రూ. 10–12. ఎఫ్పీఓ ఖరారు చేసిన ముందస్తు ప్రణాళిక ప్రకారం.. రైతులు మిశ్రమ సేంద్రియ పంటలను నిర్దేశిత విస్తీర్ణంలో సాగు చేస్తారు. అవసరానికి మించి పండితే సాధారణ ధరలకే స్థానిక మార్కెట్లలో విక్రయిస్తారు. రైతులకు వారానికోసారి పైకం చెల్లిస్తున్నారు. ఎఫ్పీఓకి వచ్చిన లాభాల్లో నుంచి ఏడాదికి ఓసారి బోనస్ (విత్హెల్డ్ ప్రైస్) చెల్లిస్తున్నారు.అంతర్జాతీయ ప్రమాణాల వల్లనే ప్రజల ఆదరణఆరోగ్యకరమైన సేంద్రియ ఆహారోత్పత్తి ద్వారా వినియోగదారులకు, రైతులకు, మట్టికి, పర్యావరణానికి మేలు జరుగుతోంది. దీని ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రజలు మున్ముందు ఇంకా ఎక్కువగా గుర్తిస్తారు. బెంగళూరు, చెన్నై, కేరళ తదితర ప్రాంతాల్లో మా ఉత్పత్తులు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. మా వద్ద ఆర్గానిక్ ఉత్పత్తులను టోకుగా కొనుగోలు చేసి, ఎక్కడైనా రిటైల్గా విక్రయించుకునే వారి కోసం వైట్ ప్యాకింగ్తో లేదా వారి బ్రాండ్ కవర్తో ప్యాక్ చేసి ఇస్తున్నాం. నాణ్యత, విశ్వసనీయత, ట్రేసబిలిటీలకు సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నాం. మా సేంద్రియ ఉత్పత్తులకు గత 16 ఏళ్లుగా ప్రజాదరణ పెరుగుతోంది.– బి. సోమేశ్, సీఈవో, ఎండీ, సహజ సమృద్ధ ఆర్గానిక్ ప్రొడ్యూసర్ కంపెనీ, సిద్ధనపాల్య, బెంగళూరు somesh@sahajaorganics.com -
ఆలయంలో ప్రీ-వెడ్డింగ్ షూట్ వివాదం : కెమెరామెన్లపై దాడి
బెంగళూరు: ఇటీవలి కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్లపై ఆసక్తి బాగా పెరిగింది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ వ్యవహారం పరిధులు దాటుతోంది. ఒక్కోసారి ఘర్షణలకు దారి తీస్తోంది. అప్పుడప్పుడూ విషాదంగా కూడా మారిపోతోంది. తాజాగా కర్ణాటకలోని సకలేశపుర తాలూకాలో జరిగిన ఒక దురదృష్టకర సంఘటన గురించి తెలుసుకుంటే ఎవరికైనా ఇలాంటి ఫీలింగే కలుగుతుంది. స్టోరీ ఏంటంటేఅసలేం జరిగింది?కర్ణాటకలోని హసన్ జిల్లా సకలేశపుర తాలూకాలోని ప్రముఖ బెట్టద భైరవేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన గొడవ హింసాత్మకంగా మారింది. పచ్చని ప్రకృతికి నిలయమైన ఈ ప్రాంతం ప్రీ-వెడ్డింగ్ షూట్లకు చాలా ప్రసిద్ధి.ఇక్కడ ఒక జంట తమ ప్రీ-వెడ్డింగ్ షూట్ కోసం ఫోటోగ్రాఫర్లతో కలిసి ఈ ఆలయానికి వచ్చింది. షూటింగ్ సమయంలో ఫోటోగ్రాఫర్లు పాదరక్షలు (షూలు) ధరించి ఆలయ పరిధిలోకి ప్రవేశించారని, అలాగే ఆలయ నిబంధనలకు విరుద్ధంగా ఫోటోగ్రఫీ చేస్తున్నారని కొందరు స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఘర్షణ చెలరేగింది.మాట మాట పెరిగి అది భౌతిక దాడికి దారితీసింది. స్థానికులు ఫోటోగ్రాఫర్లపై దాడి చేయడమే కాకుండా, వారి కెమెరాను కూడా పగులగొట్టారు.ఈ దాడిలో నవీ, నందన్ అనే ఫోటోగ్రాఫర్లు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం సకలేశపుర తాలూకా ఆసుపత్రికి తరలించారు.సమాచారం అందుకున్న సకలేశపుర రూరల్ పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ముదిగెరె తాలూకాకు చెందిన ఏడుగురిని (ఆశి, ప్రశాంత్, రక్షా, అరవింద్, ఉచిత్, ప్రజ్వల్, నిశాంత్) పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: దేశవ్యాప్త లాక్డౌన్ : కేంద్ర మంత్రి ఏమన్నారంటే!నోట్: ఆధ్యాత్మిక, పర్యాకట ప్రదేశాల్లోఇలాంటి షూట్లు చేసేటప్పుడు స్థానిక పద్దతులను నియమాలను పాటించడం అవసరం. స్థానికుల మనోభావాలకు భంగం కలగకుండా సున్నితత్వంతో వ్యవహరించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన గుర్తుచేస్తోంది. (షాకింగ్ వీడియో : బుల్లెట్ బండిని ధ్వంసం చేసిన మహిళ) -
అత్తమామల ఆశలు… ఒక్కరాత్రిలో కూలిపోయాయి!
కర్ణాటక: ఘనంగా బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి జరిగింది. ఇంటిలో అడుగుపెట్టిన కోడలు వంశోద్ధారకున్ని కానుకగా ఇస్తుందని అత్తమామాలు ఆశపడ్డారు. కానీ పెళ్లయిన 2 నెలలకే కోడలు ఇంటి నుంచి పరారు కావడంతో మామ గుండె ఆగిపోయింది. సమాజంలో పెరిగిపోతున్న పెడ ధోరణులకు ఈ విషాద ఘటన అద్దం పడుతోంది. వివరాలు.. కొప్పళలో గౌరిఅంగల నివాసి నాగరాజ్కు, రాయచూరు జిల్లా సింధనూరువాసి సంజనతో ఫిబ్రవరి 8 న కొప్పళలో ఓ కళ్యాణ మండపంలో ఘనంగా పెళ్లి జరిపించారు. కొప్పళలో ఇంటి కింది అంతస్తులో అత్తమామలు, పై అంతస్తులో కొత్త జంట కాపురం ఉంటున్నారు. మార్చి 21న రాత్రి 8 గంటలకు సంజన తనకు సుస్తీగా ఉందని, మెడికల్ షాపుకెళ్లి మాత్రలు తెచ్చివ్వాలని భర్తను కోరింది. సరేనని అతడు వెళ్లి మాత్రలు తీసుకువచ్చాడు, కానీ భార్య కనిపించలేదు. అప్పటి నుంచి పలుచోట్ల గాలించినా జాడ లేదు. ఆరోజు నుంచి కొత్త కోడలు ఇంటి పరువు తీసిందని, కొడుకు జీవితం బజారుపాలైందని తీవ్రంగా బాధపడుతున్న మామ ఖండప్ప గురువారం గుండెపోటుతో కన్నుమూశాడు. -
సాధికారత @ బీబీజాన్!
బీబీజాన్ హలేమణి (40).. విశేష కృషితో లోకాన్ని తన వైపు తిప్పుకున్న ఓ సాధారణ మహిళా రైతు, స్వయం సహాయక సంఘం సారథి. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లా కుందగొడ తాలూకాలో హుబ్లి నుంచి దాదాపు 30 కి.మీ. దూరంలో ఉన్న ఒక గ్రామం ‘తీర్థ’ ఆమె స్వస్థలం. అంతా వర్షాధార వ్యవసాయమే. ఆమె కుటుంబం 3 ఎకరాల సొంత భూమి 7 ఎకరాలను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తోంది. రాజనీతి శాస్త్రంలో బీఏ చదివిన బీబీజాన్ భర్త మౌల వ్యాపారి. ఇద్దరు పిల్లలు. కొడుకు బీఎల్, కూతురు బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నారు. చదువు, సామాజిక దృష్టి కలిగినప్పటికీ.. ఇంటి పనులతో పాటు కుటుంబ వ్యవసాయ పనులు చేస్తూ ఒకానొక కుగ్రామంలో కాలం వెళ్లదీస్తున్న ఆమె జీవితం ఏడేళ్ల క్రితం గొప్ప మలుపు తీసుకుంది. యూఎన్డీపీ ఈక్వేటర్ అవార్డు2019లో 15 మంది మహిళల భాగస్వామ్యంతో బీబీజాన్ సార«థ్యంలో ఏర్పాటైన ‘బీబీ ఫాతిమా స్వయం సహాయక సంఘ’మే అందుకు కారణం. ఆరేడేళ్లు గడిచే సరికి వారంతా సాధికారతను సాధించుకున్నారు. తమ ఊరితో పాటు 30 ఊళ్లలో వ్యవసాయాన్ని నిలబెట్టే దిశగా మరల్చేందుకు ఈ సంఘమే దోహదపడింది. అందుకే గత ఏడాది ప్రసిద్ధ ‘యూఎన్డీపీ ఈక్వేటర్ ఇనీషియేటివ్ అవార్డు’ను ఈ సంఘం గెల్చుకుంది. పంటల జీవవైవిధ్యానికి, సుస్థిర వ్యవసాయ పద్ధతులను వ్యాప్తిలోకి తెచ్చే పది సంస్థలకు ఏటాఈ పురస్కారం ఇస్తుంటారు. దీనితో పాటు రూ.9 లక్షల నగదు బహుమతిని ప్రదానం చేస్తారు. అంతరించిపోతున్న చిరుధాన్యాలతో కూడిన మిశ్రమ సాగు పద్ధతిని ఈ సంఘం వ్యాప్తిలోకి తేవటానికి కీలక సాధనంగా ఉపయోగపడింది. చిరుధాన్యాలతో పాటు పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలను మిశ్రమ సాగు ద్వారానే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ రైతులు నిలదొక్కుకోగలరని తెలియజెప్పి, రైతులు సుమారు 2 వేల హెక్టార్లలో అనుసరించేలా చెయ్యటంలో బీబీజాన్ నేతృత్వంలోని మహిళా సంఘం అపూర్వ విజయం సాధించింది. ఇందులో 25% రైతులు ప్రకృతి, సేంద్రియ పద్ధతుల్లోకి మారారని చెబుతూ.. రైతులతో సాగు పద్ధతిని మార్పించటం అంత సులభం కాదని బీబీజాన్ ‘సాక్షి సాగుబడి’తో అన్నారు. సహజ సమృద్ధ స్వచ్చంద సంస్థ మార్గదర్శనంలో భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్) తదితర సంస్థల తోడ్పాటు తీసుకుంది. మిల్లెట్ ప్రాసెసింగ్ యంత్రం, సౌర విద్యుత్తు సదుపాయం వంటి మౌలిక సదుపాయాలు కల్పించుకుంటూ ఈ సంఘం ఆదర్శవంతంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తోంది. బీబీ ఫాతిమా ఎస్హెచ్జి ఇతర సంఘాలతో కలసి ఏర్పాటు చేసుకున్న దేవధాన్య ఎఫ్పీసీ ఈ సంవత్సరం రూ. 1.5 కోట్ల వ్యాపారం చేసింది. 350 రకాలతో దేశీ విత్తన నిధి సొంత, దేశీ విత్తనాలు కాపాడుకోవటానికి ఈ సంఘం విత్తన నిధిని ఏర్పాటు చేసింది. విత్తనం రైతులు కొనే పనిలేదు. పది కిలోల విత్తనాలు తీసుకుంటే పంట పండించి 20 కిలోలు తిరిగి ఇవ్వాలి. అంతే. ఈ సామాజిక విత్తన బ్యాంకులో ఇప్పుడు 350 దేశీ రకాల విత్తనాలున్నాయి. 74 రకాల రాగులు, 10 రకాల కొర్రలు, 25 రకాల సామలు, 25 రకాల పప్పుధాన్యాలు, 80 కూరగాయల విత్తనాలు ఈ విత్తన బ్యాంకులో రైతులు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన 30 మంది రైతులతో దేశీ విత్తన ఉత్పత్తి చేయిస్తున్నారు. పంట దిగుబడులను దేవధాన్య ఎఫ్పీవో, సహజ ఆర్గానిక్స్ ఎఫ్పీవోల ద్వారా విక్రయిస్తున్నారు. సీడ్, మిల్లెట్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ రైతులే నేరుగా వినియోగదారులకు సేంద్రియ ఆహారాన్ని అమ్మే వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుండటం విశేషం.25% మంది చిరుధాన్యాలు తింటున్నారుమా ప్రాంతంలో రైతులు 2 వేల హెక్టార్లలో చిరుధాన్యాల మిశ్రమ సాగు చేస్తున్నారు. సుమారు 15 గ్రామాల రైతులు తమ ధాన్యాలను మా ప్రాసెసింగ్ యూనిట్లో ప్రాసెసింగ్ చేయించుకుంటున్నారు. మా యంత్రంలో 10 కిలోల చిరుధాన్యాలను కూడా మరపట్టించి బియ్యం తయారు చేసుకోవచ్చు. 2024లో దాదాపు 50 మెట్రిక్ టన్నుల మిల్లెట్లు ప్రాసెస్ చేశాం. మా సంఘం ఏర్పాటైనప్పుడు మా గ్రామంలో ఎవరూ చిరుధాన్యాలు తినేవారు కాదు. కానీ ఇప్పుడు కనీసం 25% మంది ప్రతిరోజూ చిరుధాన్యాల బియ్యంతో వండిన అన్నం తింటున్నారు. యూఎన్డీపీ ఈక్వేటర్ ఇనీషియేటివ్ అవార్డు మా బాధ్యతను మరింత పెంచింది. ఈ పురస్కారం మాకు మాత్రమే చెందినది కాదు. దేశంలో మహిళా రైతులందరికీ దీన్ని అంకితం చేస్తున్నాం. – బీబీజాన్, బీబీ ఫాతిమా స్వయం సహాయక సంఘం, కర్ణాటక, యూఎన్డీపీ ఈక్వేటర్ ఇనీషియేటివ్ అవార్డు గ్రహీత. -
ఏపీ డ్రైవర్ను చితకబాది, బస్సులో తీసుకెళ్లిన కర్ణాటక సిబ్బంది
మార్కాపురం జిల్లా: ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్పై కర్ణాటక డిపోకు చెందిన సిబ్బంది, ప్రయాణికులు దాడి చేశారు. అనంతరం ఏపీ డ్రైవర్ను తీవ్రంగా కొట్టి, తమ బస్సులోకి నెట్టి..45 కిలోమీటర్ల పాటు తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించి మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల ఎస్ఐ వెంకట రమణయ్య తెలిపిన వివరాలు..రాత్రి వేళల్లో శ్రీశైలం ఘాట్రోడ్లో ప్రయాణానికి అనుమతులు లేకపోవడంతో ఆదివారం ఉదయం 6 గంటలకు వాహనాలన్నీ నంద్యాల జిల్లా శిఖరేశ్వరం చెక్పోస్టు గేట్ వద్ద ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకకు చెందిన విజయపురి ఆర్టీసీ బస్సు వరుసగా లైనులో ఉన్న బస్సులను వేగంగా దాటి చెక్పోస్టు గేటు వద్దకు వచ్చేసింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న పీలేరు డిపో డ్రైవర్ చాంద్బాషాకు, కర్ణాటక బస్సు సిబ్బంది మధ్య మాటామాటా పెరిగింది. దీంతో చాంద్బాషాపై కర్ణాటక ఆర్టీసీ సిబ్బంది దాడి చేసి అతడిని తమ బస్సులో వేసుకుని తీసుకెళ్లిపోయారు. ఇది చూసిన మరో డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు పెద్దదోర్నాలలోని గణపతి చెక్పోస్టు వద్ద కర్ణాటక బస్సును నిలిపేశారు. బస్సులో బందీగా ఉన్న చాంద్బాషాను విడిపించారు. కర్ణాటక ఆర్టీసీ సిబ్బంది, ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని వారిని శ్రీశైలం పోలీసులకు అప్పగించారు. -
శ్రీశైలంలో ఉగాది జాతర..నల్లమలలో పాదయాత్రగా వెళ్తున్న కర్ణాటక భక్తులు (ఫోటోలు)
-
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు ఎస్సైలు దుర్మరణం
-
కర్ణాటకలో కుర్చీ కుమ్ములాట
-
బెంగళూరులో సిలిండర్ దొంగతనం.. CCTV విజువల్స్ వైరల్
-
దొరికినవి.. దేవతల నగలు
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ఈ ఏడాది జనవరి 10వ తేదీన కర్ణాటకలోని గదగ్ జిల్లా లక్కుండిలో లభించిన నిధి గురించి కొత్త విషయాలు వెలుగుచూశాయి. ఆ చారిత్రక గ్రామంలో ఓ మహిళ ఇంటి పునాది తవ్వతుండగా పురాతనమైన రాగి చెంబు, అందులో అపురూపమైన బంగారు నగలు లభించడం తెలిసిందే. వాటిని ప్రభుత్వానికి అప్పగించారు. పురావస్తుశాఖ అధికారులు ఆ బంగారు ఆభరణాలు సుమారు 600 సంవత్సరాల క్రితం నాటివని, కళ్యాణ చాళుక్య రాజులు, విజయనగర అరస రాజుల కాలం నాటివని నిర్ధారించారు. ఇవి మనుషులు ధరించేవి కావని, ఆలయాలలో దేవతలకు లేదా ఉత్సవ మూర్తులకు అలంకరించే ఆభరణాలని తెలిపారు. వీటి విలువ రూ.8 కోట్లని ప్రకటించారు. చదవండి: అరుదైన ఈ రైల్వేస్టేషన్ గురించి తెలుసా? -
యువ జంట ఆత్మహత్య
కర్ణాటక: కలిసి ఏడడుగులు వేశారు, ఎంత కష్టం వచ్చిందో గానీ కలిసే తనువు చాలించారు. జిల్లాలోని కెఆర్ పేట పట్టణంలోని జయనగర బ్లాక్లో యువ దంపతులు ఒకే తాడుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. హోస్కోటే గ్రామానికి చెందిన దర్శన్ (29), నతనహళ్లికి చెందిన భార్య ఎన్.ఎల్. దివ్య (25) మృతులు. వీరికి 3 ఏళ్ల కిందట పెళ్లయింది, ఏడాదిగా ఇక్కడ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. దర్శన్ క్యాబ్ డ్రైవర్ కాగా, దివ్య ఓ నర్సింగ్ హోంలో పనిచేస్తున్నారు. వీరికి రక్ష అనే రెండేళ్ల కుమార్తె ఉంది. ఏం సమస్యలు వచ్చాయోగానీ.. ఆదివారం రాత్రి వారితో పాటు పాపకు ఉరి బిగించి ప్రాణాలు తీసుకున్నారు. అయితే ఉరి జారిపోవడంతో పాప క్షేమంగా తప్పించుకుంది. చిన్నారి ఏడుస్తూ ఉండడంతో ఇరుగు పొరుగు వచ్చి చూడగా దంపతులు ఉరికి వేలాడుతూ కనిపించారు. దర్శన్ తండ్రి గణేష్ గౌడ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు కుటుంబాలవారు చేరుకుని మీరంటే మీరు కారణమని ఆరోపణలు చేసుకున్నారు. తల్లిదండ్రులు కానరాని లోకాలకు చేరడంతో కూతురు అనాథగా మారింది. -
9 మంది విద్యార్థులపై ఇనుపరాడ్డుతో దాడి.. ఒకరు మృతి..
-
ఇనుప రాడ్డుతో సహచర విద్యార్థి దాడి.. ఏపీ విద్యార్థి మృతి
సాక్షి,బెంగళూరు: సాక్షి,బెంగళూరు: తొమ్మిదో తరగతి విద్యార్థి విచక్షణ కోల్పోయాడు. హాస్టల్ గదిలో గాఢ నిద్రలో ఉన్న సహచర విద్యార్థులు, హాస్టల్ వార్డెన్ని సైతం ఇనుప రాడ్డుతో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో ఎనిమిది మంది విద్యార్థులు తీవ్ర గాయాలపాలైంది. ఓ విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన విద్యార్థి తండ్రి.. దాడికి పాల్పడ్డ విద్యార్థి మతి స్థిమితం కోల్పోవడం, లేదంటే డ్రగ్స్ మత్తులో దాడి చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా ‘గురుకులం’హాస్టల్లో చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి బళ్లారి ‘గురుకులం’ ఓ విద్యార్థి కలకలం సృష్టించాడు. తోటి విద్యార్థులపై ఇనుప రాడ్డుతో దాడికి తెగబడ్డాడు. విద్యార్థుల పక్కనే నిద్రిస్తున్న హాస్టల్ వార్డెన్పై దాడికి దిగడం ఆయన తీవ్రంగా గాయాపడ్డారు. ఘటనపై అప్రమత్తమైన స్థానికులు, ఇతర హాస్టల్ సిబ్బంది బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం బళ్లారి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(బీఎంఐఎస్)తరలించారు. ప్రస్తుతం గాయపడ్డ విద్యార్థులకు చికిత్స కొనసాగుతోంది.వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.సమాచారం అందుకున్న బ్రూస్పేట పోలీసులు ఘటన జరిగిన హాస్టల్తో పాటు విద్యార్థులు చికిత్స పొందుతన్న బీఎంఐఎస్ ఆస్పత్రికి చేరుకున్నారు. తోటి విద్యార్థులపై ఇనుప రాడ్డుతో ఎందుకు దాడి చేశాడు? దాడికి ముందు ఏం జరిగిందనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గురుకులంలో విద్యార్థులపై దాడి ఘటనతో తల్లిదండ్రులు హుటాహుటీన ఆస్పత్రికి తరలివచ్చారు. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి తల్లిదండ్రుల రోదనలు స్థానికుల్ని కంటితడి పెట్టిస్తున్నాయి.ఈ సందర్భంగా విద్యార్థి దాడిలో మృతి చెందిన ఏపీ విద్యార్థి హేమంత్ తండ్రి లక్ష్మీకాంత్ అనుమానం వ్యక్తం చేశాడు. శనివారం రాత్రి 11గంటల సమయంలో హాస్టల్ ఘటనపై సమాచారం అందింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లగా తన కొడుకు హత్యకు గురైనట్లు తెలిసింది.విద్యార్థుల్ని రక్షించడంలో, పర్య వేక్షించడంలో యాజమాన్యం విఫలమైంది. విద్యార్థి.. తోటి విద్యార్థులపై జరిపిన దాడి తీరును చూస్తుంటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడికి పాల్పడ్డ మానసిక సమస్యతో బాధపడటం లేదంటే డ్రగ్స్ మత్తులో ఘోరానికి పాల్పడ్డాడేమోనన్న అనుమానం ఉందని చెప్పారు. -
అంత్యక్రియలకు తీసుకెళుతుండగా అద్భుతం..!
సాక్షి,బళ్లారి: మరణించాడని భావించిన ఓ వృద్ధుడిని అంత్యక్రియలకు తీసుకెళుతుండగా మార్గమధ్యంలో శ్వాస ఆడటంతో అందరూ ఆశ్చర్యానికి గురై తిరిగి ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాగల్కోట జిల్లాలోని జమఖండి పట్టణంలోని ముబారక్ అవతి(65) అనే వృద్ధుడు గత కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు బెళగావి ఆస్పత్రిలో చేరి్పంచారు. అక్కడ ఆయన్ను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాణాపాయం ఉందని కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో వెంటిలేటర్పై నుంచి తొలగించిన తరుణంలో శ్వాస ఆగిపోయిందని వైద్యులు కూడా సూచించారు. ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఇక చనిపోయాడని భావించి వాహనంలో మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళుతుండగా, మార్గమధ్యంలోని లోకాపుర వద్ద శ్వాస కదలికలు వచ్చాయి. ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన కుటుంబ సభ్యులు వెంటనే మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో కొన్నిసార్లు శ్వాస అలా మందగించి కనిపించకపోవచ్చని, అలాంటి సందర్భాల్లో వ్యక్తి మరణించినట్లు భావించే అవకాశం ఉంటుందని తెలిపారు. సరైన వైద్య పరీక్షలు లేకుండా మరణించాడని కూడా నిర్ధారించడం సరికాదని కూడా వారు సూచించారు. ఈ ఘటన బాగల్కోట జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. -
మద్యం ధరలపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం
బెంగళూరు: మద్యం ధరలపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మద్యం పాలసీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఇక నుంచి మద్యం ధరలపై ప్రభుత్వ నియంత్రణను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. మద్యం ధరల నిర్ణయాన్ని లిక్కర్ కంపెనీలే నిర్ణయించేలా అవకాశం కల్పించింది. ఈ మేరకు 2026-27 బడ్జెట్లో మద్యం పాలసీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది సిద్ధరామయ్య సర్కారు. ఏప్రిల్1 వ తేదీ నుండి మద్యం ధరలపై ప్రభుత్వ నియంత్రణను తొలగించి, లిక్కర్ కంపెనీలే ధరలను నిర్ణయించుకునే అవకాశం కల్పించింది. ఆరు దశాబ్దాల నుంచి ఉన్న మద్యం ధరల నియంత్రణను ప్రభుత్వం తొలగించింది. దీంతో డిస్టిలరీలు మరియు బ్రూవరీస్ తమ ఉత్పత్తుల ధరలను నిర్ణయించుకోవచ్చు. ఇది వచ్చే నెల నుంచి అమల్లోకి రానుంది. మరొకవైపు ఆల్కహాల్ శాతం ఆధారంగా ఎక్సైజ్ సుంకం ఉండనుంది. ఈ మార్పుల వల్ల ప్రభుత్వానికి ఎక్సైజ్ ఆదాయం పెరగడమే కాకుండా, పరిశ్రమలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. -
పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ సీఎం సిద్ధరామయ్య ఆంక్షలు
-
హిమ శిఖరాన
ఒకవైపు ఆహ్లాదాన్ని పంచే మంచు కొండలు... మరోవైపు కవ్వించే శత్రు మూకలు! పర్యాటకులకు భూతల స్వర్గం... స్థానికులకు నిత్య నరకం! ఇదీ ఒకప్పుడు జమ్మూకశ్మీర్ పరిస్థితి. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితులు మారాయి. అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న అక్కడి యువత... ఇప్పుడు దేశవాళీ క్రికెట్లో సంచలనం నమోదు చేసింది. మహామహా జట్లను మట్టికరిపిస్తూ... రంజీ ట్రోఫీలో చాంపియన్గా నిలిచింది. 67 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో తొలిసారి కప్పును కైవసం చేసుకుంది. అయితే అదేదో సోమవారం ప్రారంభమై... శనివారం ముగిసిన ప్రక్రియ మాత్రం కాదు. దాని వెనకున్న కృషిని ఓ సారి పరిశీలిస్తే...లీగ్ దశలో జమ్మూకశ్మీర్ జట్టు ఆడిన ఏడు మ్యాచ్ల్లో రాజస్తాన్, ఢిల్లీ, హైదరాబాద్పై విజయాలతో గ్రూప్ ‘డి’లో రెండో స్థానంతో నాకౌట్కు చేరింది. మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో కేవలం ముంబై చేతిలో మాత్రమే ఓడి మూడు మ్యాచ్లను ‘డ్రా’చేసుకోవడం ద్వారానే ‘ఈసారి వదిలి పెట్టేదే లేదు’అనే సంకేతాలు పంపింది. ఇప్పటి వరకు క్వార్టర్ ఫైనల్ దశ దాటిన అనుభవం లేని జమ్మూకశ్మీర్ జట్టు... ఈ సారి పక్కా ప్రణాళికతో ముందడుగు వేసింది. ఒక్కో ప్రత్యర్థి కోసం ఒక్కో వ్యూహాన్ని రచించడమే కాకుండా... దాన్ని మైదానంలో పకడ్బందీగా అమలు చేసి ఫలితం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్ను మట్టికరిపించిన జమ్మూ... సెమీస్లో బెంగాల్ను బెంబేలెత్తించింది. ఈ రెండు జట్లలో స్టార్ ఆటగాళ్లు ఉన్నా... జమ్మూ సమష్టి ప్రదర్శన ముందు నిలవలేకపోయాయి. ఫైనల్లో అయితే సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, దేవదత్ పడిక్కల్, మయాంక్ అగర్వాల్, ప్రసిధ్ కృష్ణ వంటి టీమిండియా ప్లేయర్లు ఉన్న కర్ణాటకపై ఐదు రోజుల పాటు ఏ దశలోనూ వెనక్కి తగ్గని జమ్మూ... నిజమైన చాంపియన్గా నిలిచింది. విజయాల వెనక ఆ ముగ్గురు దేశవాళీ ట్రోఫీలో దిగ్గజ జట్లను దాటుకుంటూ... జమ్మూకశ్మీర్ విజేతగా నిలవడం ఒక్కరోజులో సాధ్యమైందేమీ కాదు. క్రమశిక్షణ, కఠోర దీక్ష, సరైన ప్రణాళికతో సుదీర్ఘ కాలం పాటు చేసిన కృషికి దక్కిన ఫలితం. ఆ జట్టు ఈ స్థాయికి చేరడం వెనక ప్రధానంగా ముగ్గురి కృషి ఉంది. 2011లో జమ్మూ జట్టుకు కోచ్గా వ్యవహరించిన బిషన్ సింగ్ బేడీ... జట్టు దృక్పథాన్ని మార్చాడు. ఆయన శిక్షణలో రాటుదేలిన జమ్మూకశ్మీర్ జట్టు... 2013–14 సీజన్లో క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించింది. అప్పటి నుంచి అడపాదడపా విజయాలు సాధించడం పరిపాటిగా మార్చుకుంది... ఆ తర్వాత ఇర్ఫాన్ పఠాన్ మెంటార్గా ఉన్న సమయంలోనూ ఆ జట్టు క్వార్టర్స్కు చేరింది. అయితే మెరుగైన ఫలితాలు కావాలంటే మౌలిక వసతులు క ల్పించాలని సంక ల్పించింది మాత్రం ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్. 2021లో బీసీసీఐ నియమించిన సబ్ కమిటీలో సభ్యుడైన మిథున్... ఆ దిశగా అడుగులు వేశారు. ఆటగాళ్ల కోసం జిమ్, స్విమ్మింగ్పూల్ వంటి సౌకర్యాల మొదలు... అజయ్ శర్మ వంటి మేటి కోచ్ను నియమించాడు. దీంతో జమ్మూ కశ్మీర్ ఆటతీరు పూర్తిగా మారిపోయింది. అడపా దడపా విజయాలు సాధించే దశ నుంచి నిలకడైన ఆటతీరుతో ప్రత్యర్థులను భయపెట్టే స్థాయికి చేరుకుంది. సమష్టి కృషితో నాలుగు పదుల వయసు దాటిన కెపె్టన్ పారస్ డోగ్రా సారథ్య చతురత... జమ్మూకశ్మీర్ చాంపియన్గా నిలవడంలో కీలకపాత్ర పోషించింది. దేశవాళీల్లో పదివేలకు పైగా పరుగులు సాధించిన అనుభవం ఉన్న పారస్ జట్టును ముందుండి నడిపించడంలో సఫలీకృతమయ్యాడు. 17 ఏళ్ల పాటు హిమాచల్ ప్రదేశ్, పాండిచ్చేరి జట్లకు ప్రాతినిధ్యం వహించి గతేడాదే జమ్మూ పగ్గాలు అందుకున్న డోగ్రా... ఆ జట్టు చిరకాల స్వప్నాన్ని సాకారం చేశాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు కవ్విస్తున్నా సంయమనంతో ముందుకు సాగడమే కాకుండా... అవసరమైనప్పుడు దూకుడుతో ఆకట్టుకున్నాడు. అతడికి శుభమ్ పుండిర్, కమ్రాన్ ఇక్బాల్, సాహిల్ లోత్రా, కన్హయ్య వాధ్వాన్, అబ్దుల్ సమద్, శుభమ్ ఖజురియా చక్కటి సహకారం అందించారు. బౌలింగ్లో నజీర్, ఆబిద్ ముస్తాక్, సునీల్ కుమార్ సహకారంతో అఖీబ్ నబీ ఒక్కడే జట్టును లాక్కొచ్చాడు. అతనొక్కడే! జమ్మూకశ్మీర్ జట్టు నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆటగాళ్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పర్వేజ్ రసూల్ గురించే. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన అతడు... జట్టు బలోపేతానికి విశేష కృషి చేశాడు. ఆ తర్వాత అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్ వంటి వాళ్లు వేర్వేరు వేదికలపై మెరుగైన ప్రదర్శన చేసినా... దేశవాళీల్లో నిలకడ కనబరుస్తున్న ఘనత మాత్రం కుడిచేతివాటం పేసర్ అఖీబ్ నబీదే. గత రంజీ సీజన్లో 44 వికెట్లు పడగొట్టి... అందరి దృష్టి ఆకర్షించిన నబీ... ఈ సీజన్లో విశ్వరూపం కనబర్చాడు. 10 మ్యాచ్ల్లో 60 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థుల వెన్ను విరిచాడు. ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అతడే. అందులో ఏడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన కనబర్చాడు. జమ్మూ జట్టు నిలకడైన విజయాలు సాధించడం వెనక అతడి కృషి ఎంతో ఉంది. పేస్కు కచ్చితత్వాన్ని జోడిస్తూ... అతడు సంధిస్తున్న బంతులకు ప్రత్యర్థుల దగ్గర సమాధానాలే కరువయ్యాయి. హైదరాబాదీ సిరాజ్ మాదిరిగా వరుసగా పది ఓవర్ల పాటు అలుపెరగకుండా ఒకే తీవ్రతతో బౌలింగ్ చేయగల సత్తా... ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేయగల వైవిధ్యభరిత అ్రస్తాలు అతడి సొంతం. టీమిండియా తరఫున టెస్టు మ్యాచ్లు ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అఖీబ్ గత రెండు సీజన్లలో 104 వికెట్లు పడగొట్టి... సెలెక్టర్లకు తనని ఎంపిక చేయక తప్పని పరిస్థితి నెలకొల్పాడు. ఇప్పటికే మాజీలు చేబుతున్నట్లు... టీమిండియా తదుపరి ఆడబోయే తొలి టెస్టు మ్యాచ్ తుది జట్టులో అఖీబ్కు చోటు దక్కకపోతే ఆశ్చర్యమే! -
10th పేపర్ లీక్.. 80 గ్రాముల బంగారం టోకరా
బెంగళూరు: కర్ణాటకలో ఓ టీచర్ పరీక్ష పేపర్ లీక్ చేస్తానని విద్యార్థికి ఆశ చూపి 80 గ్రాముల బంగారం కాజేసింది. ఈ వివరాలు సదరు విద్యార్థి తల్లిదండ్రులకు తెలియడంతో ఆ స్టూడెంట్ భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ధార్వాడ్లోని విద్యారణ్య పాఠశాలలో SSLV ( 10 వతరగతి) పరీక్ష పత్రాన్ని లీక్ చేస్తానని ఆ విద్యార్థికి, టీచర్ ఆశచూపింది. దీనికి గాను మెుదటగా డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే విద్యార్థి దగ్గర డబ్బు లేవని చెప్పడంతో ఇంట్లో ఉన్న బంగారం తేవాలని చెప్పింది. దానికి విద్యార్థి తొలుత భయపడ్డాడు. అయితే తను ఆ నగలు తిరిగి ఇచ్చేస్తానని భయపడాల్సిన అవసరం ఏమి లేదని విద్యార్థికి నచ్చజెప్పింది.దీంతో ఆ విద్యార్థి పరీక్షల్లో ఉత్తీర్ణున్ని అయితాననే ఆశతో ఇంట్లో ఉన్న 80 గ్రాముల బంగారం దాదాపు రూ. 12 లక్షలు విలువ తీసుకొచ్చి ఆ టీచర్కు ఇచ్చాడు. కొద్దిరోజులకు తిరిగి ఇవ్వాలని కోరడంతో ఆ టీచర్ అతనిని తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించింది. అయితే ఇంతలోనే బంగారం పోయిన సంగతి ఆ ఇంట్లో వారు గమనించారు. దీంతో ఆ పిల్లాడిని నిలదీయగా అతన అసలు విషయం చెప్పాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే ఈ ఘటన వివరాలు పోలీసులకు తెలియడంతో ఆ విద్యార్థి భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఎటువంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. అయితే విషయం తెలుసుకున్నపోలీసులు ఆ టీచర్పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇలా మరేవరైనా విద్యార్థుల వద్ద నగదు కాజేసిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
ఇక లాంఛనమే!
హుబ్లీ: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ విజేత తేలే సమయం ఆసన్నమైంది. సీజన్ ఆసాంతం నిలకడైన ఆటతీరుతో ప్రధాన జట్లను ఓడిస్తూ ఫైనల్ చేరిన జమ్మూకశ్మీర్ జట్టు... తొలి రంజీ టైటిల్ అందుకోవడం ఇక లాంఛనమే! బ్యాటర్ల సమష్టి ప్రదర్శనకు... బౌలర్ల సంపూర్ణ సహకారం తోడవడంతో... కర్ణాటకతో జరుగుతున్న రంజీ ఫైనల్లో జమ్మూకశ్మీర్ జట్టు భారీ ఆధిక్యం సాధించింది. శుక్రవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి జమ్మూకశ్మీర్ రెండో ఇన్నింగ్స్లో 57 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ (160 బంతుల్లో 94 బ్యాటింగ్; 11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీకి చేరువకాగా... అబ్దుల్ సమద్ (70 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. 291 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఓవరాల్గా జమ్మూకశ్మీర్ జట్టు ప్రస్తుతం 477 పరుగుల ముందంజలో ఉంది. నేడు ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 6 వికెట్లు ఉన్న జమ్మూకశ్మీర్ జట్టు మరెన్ని పరుగులు జోడిస్తుందో చూడాలి. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతోనే టైటిల్ను ఖరారు చేసుకోవాలని భావిస్తున్నట్లు జమ్మూకశ్మీర్ కెప్టెన్ పారస్ డోగ్రా ఇప్పటికే వెల్లడించిన నేపథ్యంలో... ఆ జట్టు వీలైనంత ఎక్కువసేపు బ్యాటింగ్ చేయడం ఖాయం. అదే జరిగితే... కర్ణాటక ముందు భారీ లక్ష్యం నిలవడంతో పాటు తగినంత సమయం ఉండదు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ప్రకారం జమ్మూకశ్మీర్ జట్టుకు టైటిల్ దక్కుతుంది. మయాంక్ ఒంటరి పోరాటం.. ఓవర్నైట్ స్కోరు 220/5తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కర్ణాటక... చివరకు 93.3 ఓవర్లలో 293 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (266 బంతుల్లో 160; 21 ఫోర్లు) ఒంటరి పోరాటం చేయగా... అతడికి సహచరుల నుంచి సరైన సహకారం లభించలేదు. కృతిక్ కృష్ణ (101 బంతుల్లో 36; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. జమ్మూకశ్మీర్ బౌలర్లలో ఆఖిబ్ నబీ 5 వికెట్లతో సత్తాచాటగా... సునీల్ కుమార్, యుధ్వీర్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. దీంతో జమ్మూకశ్మీర్ జట్టుకు 291 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఖతర్నాక్ కమ్రాన్... తొలి ఇన్నింగ్స్లో తోటివాళ్లంతా చక్కటి ఆటతీరు కనబరిస్తే... ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ మాత్రం సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. అయితే రెండో ఇన్నింగ్స్లో సహచరులు ఆకట్టుకోలేకపోయినా... ఈసారి బాధ్యత తన భుజాలపై వేసుకొని ఇన్నింగ్స్ను నడిపించాడు. యావర్ హసన్ (1), శుభమ్ పుండిర్ (4), కెప్టెన్ పారస్ డోగ్రా (16) ఇలా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్కు వరుస కడుతున్నా... ఏమాత్రం తడబడకుండా చక్కటి షాట్లతో స్కోరు పెంచాడు. 89 బంతుల్లో హాఫ్సెంచరీ పూర్తి చేసుకున్న ఇక్బాల్... శతకానికి ఆరు పరుగుల దూరంలో నిలిచాడు. అతడితో పాటు సాహిల్ (16 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులోఉన్నాడు. కర్ణాటక బౌలర్లలో ప్రసిధ్ 2 వికెట్లు తీశాడు. హుబ్లీలో జమ్మూకశ్మీర్ సీఎం దేశవాళీల్లో ఇప్పటి వరకు ఒక్క పెద్ద టైటిల్ కూడా గెలవని జమ్మూకశ్మీర్ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ అందుకునేందుకు సిద్ధమైంది. ఈ మధుర క్షణాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా హుబ్లీ చేరుకున్నారు. గతంలో జమ్మూకశ్మీర్ క్రికెట్ జట్టుకు ఆడ్మినిస్ట్రేటర్గా పనిచేసిన ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ సహా... పలువురు ప్రముఖులు సైతం జమ్మూకశ్మీర్ జట్టును అభినందించేందుకు ఫైనల్కు విచ్చేయనున్నారు. స్కోరు వివరాలు జమ్మూకశ్మీర్ తొలి ఇన్నింగ్స్: 584; కర్ణాటక తొలి ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (సి) కన్హయ్య (బి) ఆఖిబ్ నబీ 13; మయాంక్ (ఎల్బీ) (బి) ఆఖిబ్ నబీ 160; పడిక్కల్ (సి) సమద్ (బి) సునీల్ 11; కరుణ్ నాయర్ (బి) ఆఖిబ్ నబీ 0; స్మరణ్ (సి) కన్హయ్య (బి) ఆఖిబ్ 0; శ్రేయస్ గోపాల్ (ఎల్బీ) (బి) యుద్వీర్ 27; కృతిక్ (ఎల్బీ) (బి) సాహిల్ 36; విద్యాధర్ (సి) (సబ్) కుండల్ (బి) సునీల్ 11; విజయ్ కుమార్ వైశాఖ్ (నాటౌట్) 17; శిఖర్ శెట్టి (ఎల్బీ) (బి) ఆఖిబ్ నబీ 0; ప్రసిధ్ (సి)సునీల్ (బి) యుధ్వీర్ 4; ఎక్స్ట్రాలు 14; మొత్తం (93.3 ఓవర్లలో ఆలౌట్) 293. వికెట్ల పతనం: 1–27, 2–56, 3–57, 4–57, 5–162, 6–241, 7–256, 8–278, 9–288, 10–293. బౌలింగ్: ఆఖిబ్ నబీ 23–7–54–5; సునీల్ కుమార్ 19–6–51–2; యుద్వీర్ సింగ్ 14.3–3–55–2; ఆబిద్ ముస్తాఖ్ 23–2–75–0; సాహిల్ లోత్రా 12–1–50–1; అబ్దుల్ సమద్ 2–0–5–0. జమ్మూకశ్మీర్ రెండో ఇన్నింగ్స్: కమ్రాన్ ఇక్బాల్ (బ్యాటింగ్) 94; యావర్ (బి) ప్రసిధ్ 1; శుభమ్ (సి) (సబ్) శ్రీజిత్ (బి) విజయ్కుమార్ 4; పారస్ (బి) ప్రసిధ్ 16; సమద్ (సి) విజయ్కుమార్ (బి) శ్రేయస్ గోపాల్ 32; సాహిల్ (బ్యాటింగ్) 16; ఎక్స్ట్రాలు 23; మొత్తం (57 ఓవర్లలో 4 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–6, 2–11, 3–72, 4–145. బౌలింగ్: విజయ్కుమార్ 10–1–30–1; ప్రసిధ్కృష్ణ 12–0–42–2; విద్యాధర్ పాటిల్ 9–0–39–0; శిఖర్ శెట్టి 10–3–27–0; శ్రేయస్ గోపాల్ 16–6–27–1. -
కర్ణాటకలో కొత్త ట్విస్ట్.. సిద్దరామయ్య, డీకేకు టెన్షన్!
బెంగళూరు: కర్ణాటకలో మరోసారి పొలిటికల్ ట్విస్ట్ చోటుచేసుకుంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గానికి చెందిన ఇద్దరు మంత్రులు సహా దాదాపు 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూరులోని ఒక ప్రైవేట్ హోటల్లో సమావేశమయ్యారు. ఇది అధికార పార్టీలో కొత్త రాజకీయ ఊహాగానాలకు దారితీసింది. దీంతో, మరోసారి సీఎం కుర్చీ మార్పు వ్యవహారం తెరపైకి వచ్చింది.వివరాల మేరకు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల నెపంతో డీకే శివ కుమార్కు వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. అయితే, ఇది పుట్టినరోజు వేడుక అని బయటకు చెబుతున్నప్పటికీ రాజకీయ చర్చలు జరిగినట్టు పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో డి. సుధాకర్, మాగడి బాలకృష్ణ, సిపి యోగేశ్వర్, కడలూరు ఉదయ్, రవి గనిగ, బసవరాజ్ శివగంగ, నయామ మొట్టమ్మ, శరత్ బచేగౌడ, కునిగల్ రంగనాథ్, ప్రకాష్ కొలివాడ, అనేకల్ శివన్న మరియు వెంకటేష్ పావగడ ఉన్నారు. మరోవైపు.. ఇటీవల 20 మందికి పైగా ఎమ్మెల్యేలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లారు. ఇది వ్యవసాయ అధ్యయన యాత్రగా చెప్పబడినప్పటికీ రాజకీయ ఊహాగానాలు రేకెత్తించింది.ఇదిలా ఉండగా.. కర్ణాటక సీఎం కుర్చీ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానానికి కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. తాజాగా కొత్తగా శాసనసభలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేల బృందం పదునైన లేఖలు సంధించటంతో అధిష్ఠానానికి అసలైన సవాలు ఎదురైంది. ఈ లేఖలో వారంతా తమ ఆవేదనను చెప్పుకొచ్చారు. అలాగే, తమ ఎన్నికపై కీలక వ్యాఖ్యలు చేశారు.మాకు ఎవరైనా ఓకే.. కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ సభ్యులు 135 మంది. వీరిలో 38 మంది తొలిసారి ఎన్నికైనవారు. వీరంతా ఎప్పటిలాగే సాధారణ పరిస్థితులుంటే నోరు మెదిపేవారు కాదేమో? ఆరేడు నెలలుగా పార్టీలో నెలకొన్న సందిగ్ధతపై తీవ్రంగా మనోవేదనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ అగ్రనేతలు సీఎం పీఠంపైనే దృష్టి సారించటం, మిగిలిన మంత్రులు ఎమ్మెల్యేలకు అందుబాటులో లేకపోవటంతో కొత్తవారి పరిస్థితి డోలాయమానంలో పడింది. అది ఎంతలా అంటే.. తమ జిల్లాలకు చెందిన మంత్రులు కూడా ఫోన్లకు అందుబాటులో లేకపోవటం, గ్యారంటీల కారణంగా నియోజకవర్గ పనులు మూలన పడటంతో వీరంతా ఏకంగా అధిష్ఠానానికి మొరపెట్టుకోక తప్పింది కాదు. సోమవారం దాదాపు 31 మంది ఎమ్మెల్యేలు లోక్సభ విపక్ష నేత రాహుల్గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణ్దీప్ సింగ్ సుర్జేవాలా, రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్లకు ఏకకాలంలో లేఖాస్త్రాన్ని సంధించారు.మమ్మల్నిగుర్తించండి.. ‘పార్టీ 135 స్థానాలతో ఘన విజయం సాధించటంలో మా పాత్ర కూడా ఉంది. మేము నియోజకవర్గానికి ఏదో చేస్తామని ఓటర్లు విశ్వాసాన్ని ఉంచారు. ఏడాదిన్నరగా అగ్రనేతలు, మంత్రులెవరూ మా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. ఇన్ఛార్జ్ మంత్రులు ఏడాది కాలంగా మా నియోజకవర్గానికి రాలేదు. చివరకు ఫోను చేసినా స్పందించటం లేదు. కనీసం మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళన చేస్తే మా పరిస్థితి మెరుగుపడుతుంది. దేశంలో చాలా రాష్ట్రాల్లో తొలిసారి ఎమ్మెల్యేలు మంత్రులయ్యారు. కొన్ని చోట్ల ఏకంగా ముఖ్యమంత్రులే అయ్యారు. మాకు ఎవరి నాయకత్వం ఉన్నా ఒకటే. కొత్త మంత్రివర్గంలో చోటు కల్పిస్తే మా ఎన్నికకు ఓ అర్థం చెప్పినట్లు అవుతుంది’ అంటూ ఎమ్మెల్యేల బృందం ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ 31 మందిలో 18 మంది డీకే మద్దతుదారులు కావటంతో ఈ లేఖ రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. -
శాసించేస్థితిలో జమ్మూకశ్మీర్
హుబ్లీ: దేశవాళీ రంజీ టోర్నీలో కర్ణాటకది ఘనమైన చరిత్ర. ఏకంగా 8 టైటిల్స్, 6 సార్లు రన్నరప్తో సత్తా చాటుకుంది. ఇలా 14 ఫైనల్స్ ఆడిన మేటి దేశవాళీ జట్టుపై తొలిసారి ఫైనల్కు వచ్చిన జమ్మూకశ్మీర్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తొలి రెండు రోజులు బ్యాటింగ్తో, మూడో రోజు బౌలింగ్తో, ఇలా ఈ మూడు రోజులు జమ్మూ కశ్మీర్ ఆల్రౌండ్ షోనే! ముఖ్యంగా మూడో రోజైతే ఆఖిబ్ నబీ (14–3–32–3) ఎంతో అనుభవమున్న కర్ణాటక బ్యాటర్లను హడలెత్తించాడు. నిప్పులు చెరిగే బౌలింగ్తో టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ (13)ను ఆరంభంలోనే అవుట్ చేశాడు. ఆ తర్వాత కరుణ్ నాయర్ (0), రవిచంద్రన్స్మరణ్ (0)లను ఖాతానే తెరువనీయలేదు. ఇలా తన పేస్ ప్రతాపంతో జమ్మూకశ్మీర్ను శాసించే స్థితిలో నిలిపాడు. ప్రత్యర్థి కర్ణాటకకు ఫాలోఆన్ ముప్పు తెచ్చిపెట్టాడు. మూడో రోజు ఆట ముగిసేసరికి కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 69 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (207 బంతుల్లో 130 బ్యాటింగ్; 17 ఫోర్లు) అజేయ శతకం సాధించాడు. ఇంకా రెండు రోజుల ఆట మిగిలుండగా కర్ణాటక 364 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 527/6తో తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన జమ్మూకశ్మీర్ 173.1 ఓవర్లలో 584 పరుగుల వద్ద ఆలౌటైంది. క్రితంరోజు అర్ధసెంచరీ సాధించిన సాహిల్ లోత్రా (72; 8 ఫోర్లు) అందుబాటులో ఉన్న ఆఖరి వరుస బ్యాటర్లతో కలిసి జట్టు స్కోరు పెంచాడు. అబిద్ ముస్తాక్ (28; 3 ఫోర్లు), యుద్వీర్ సింగ్ (30; 3 ఫోర్లు, 2 సిక్స్లు)లు కాసేపు పోరాడటంతో జమ్మూకశ్మీర్ మరో 57 పరుగులు చేయగలిగింది. ప్రసిధ్ కృష్ణకు 5 వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కర్ణాటకను నబీ వణికించాడు. కేఎల్ రాహుల్ను అవుట్ చేసి మయాంక్తో ఓపెనింగ్ జోడీని విడగొట్టాడు. జట్టు స్కోరు 50 పరుగులు దాటగానే కెప్టెన్ దేవ్దత్ పడిక్కల్ (11)ను సునీల్ కుమార్ పెవిలియన్ చేర్చాడు. 56/2 స్కోరుతో ఉన్న కర్ణాటకను నబీ తర్వాతి ఓవర్ కష్టాల్లోకి నెట్టేసింది. 18వ ఓవర్ వేసిన నబీ వరుస బంతుల్లో కరుణ్, స్మరణ్లను డకౌట్ చేశాడు. పరుగు తేడాతో ఒక్కసారిగా 57/4 స్కోరు వద్ద కర్ణాటక కుదేలైంది. ఈ దశలో మయాంక్... శ్రేయస్ గోపాల్ (27; 1 ఫోర్) అండతో ఐదో వికెట్కు 105 పరుగులు జోడించి కర్ణాటకను ఆదుకున్నాడు. యు«ద్వీర్ బౌలింగ్లో శ్రేయస్ అవుటయ్యాడు. ఆ తర్వాత కృతిక్ కృష్ణ (27 బ్యాటింగ్; 2 ఫోర్లు)తో కలిసి మయాంక్ జట్టు స్కోరును 200 పైచిలుకు చేర్చాడు. ఈ క్రమంలో శతకాన్ని పూర్తి చేసుకొని అజేయంగా నిలిచాడు. -
కర్ణాటకకు చుక్కలు చూపిస్తున్న జమ్మూ అండ్ కాశ్మీర్
హుబ్లీ వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్లో కర్ణాటకపై జమ్మూ అండ్ కాశ్మీర్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి కర్ణాటక తమ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.మయాంక్ అగర్వాల్(130 బ్యాటింగ్) సెంచరీతో కదం తొక్కగా.. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కెప్టెన్ దేవ్దత్త్ పడిక్కల్ 11 పరుగులు చేయగా.. సీనియర్ బ్యాటర్లు స్మరన్ రవిచంద్రన్, కరుణ్ నాయర్ ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరారు. జమ్మూ కాశ్మీర్ బౌలర్లలో అకిబ్ నబీ మూడు వికెట్లు పడగొట్టగా.. యుద్ద్వీర్ సింగ్, సునీల్ కుమార్ తలా వికెట్ సాధించారు. ప్రస్తుతం క్రీజులో అగర్వాల్తో పాటు కృతిక్ కృష్ణ(27) ఉన్నారు. కర్ణాటక ఇంకా తొలి ఇన్నింగ్స్లో జమ్మూ కంటే 364 పరుగుల వెనకంజలో ఉంది.అంతకుముందు బ్యాటింగ్ చేసిన జమ్మూ అండ్ కాశ్మీర్ 584 పరుగుల భారీ స్కోర్ సాధించింది. జమ్మూ బ్యాటర్లలో దాదాపు ఆరుగురు బ్యాటర్లు 50కి పైగా పరుగులు చేయడం విశేషం. శుభమ్ పుందిర్ 121 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. యావర్ హసన్(88), పారస్ డోగ్రా(70), కన్హయ్య వధావన్( 70 పరుగులు) రాణించారు. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా అయితే మొదటి ఇన్నింగ్స్లో ఏ జట్టు అయితే ఎక్కువ పరుగులు సాధిస్తుందో వారికే టైటిల్ దక్కుతుంది. -
కెప్టెన్గా సూపర్ హిట్!.. భారీ షాకిచ్చిన బీసీసీఐ!
రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్లో జమ్మూ కశ్మీర్ జట్టు అదరగొట్టింది. కర్ణాటక బౌలింగ్ను చితక్కొడుతూ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు సాధించింది. హుబ్లీ వేదికగా గురువారం నాటి మూడో రోజు ఆటను ఓవర్నైట్ స్కోరు 527/6తో మొదలు పెట్టిన కశ్మీర్.. మరో 57 పరుగులు జతచేసి ఆలౌట్ అయింది.కెప్టెన్గా సూపర్ హిట్!ఓపెనర్ యావర్ హసన్ (88), కెప్టెన్ పారస్ డోగ్రా (70), అబ్దుల్ సమద్ (61), వికెట్ కీపర్ బ్యాటర్ కన్హయ్య వాధవాన్ (70), సాహిల్ లోత్రా (72) అర్ధ శతకాలతో అదరగొట్టగా.. వన్డౌన్ బ్యాటర్ శుభం పండిర్ (121) శతకంతో దుమ్ములేపాడు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో 584 పరుగులు చేసి జమ్మూ కశ్మీర్ పటిష్ట స్థితిలో నిలిచింది.ఇదిలా ఉంటే.. ఆట పరంగా అటు బ్యాటర్గా.. ఇటు కెప్టెన్గా మంచి ప్రదర్శన కనబరిచిర పారస్ డోగ్రా.. వ్యక్తిగతంగా మాత్రం విమర్శలు మూటగట్టుకున్నాడు. రెండో రోజు ఆటలో భాగంగా బుధవారం కర్ణాటక ఫీల్డర్ను హెల్మెట్తో ఢీకొట్టాడు. రంజీ ట్రోఫీలో సీనియర్ ఆటగాడిగా అపార అనుభవం ఉన్న పారస్ డోగ్రా... కర్ణాటక ప్లేయర్తో వాగ్వాదానికి దిగి వార్తల్లోకి ఎక్కాడు.పదే పదే కామెంట్దేశవాళీల్లో 21వ సీజన్ ఆడుతున్న జమ్ముకశ్మీర్ సారథి... బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సబ్స్టిట్యూట్ ఫీల్డర్ అనీశ్తో గొడవకు దిగాడు. పారస్ సంయమనంతో షాట్లు ఆడుతుండగా... కర్ణాటక ప్లేయర్లు అతడి ఏకాగ్రత దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. సిల్లీ పాయింట్లో సబ్స్టిట్యూట్గా ఫీల్డింగ్ చేస్తున్న అనీశ్... పారస్ను పదే పదే కామెంట్ చేశాడు. దీంతో ప్రసిధ్ బౌలింగ్లో బౌండరీ కొట్టిన అనంతరం పారస్... అతడి వైపు దూసుకెళ్లి వాగ్వాదానికి దిగాడు.హెల్మెట్తో ఢీకొట్టిఈ క్రమంలో అనీశ్ను పారస్ హెల్మెట్తో ఢీకొట్టినట్లు వీడియోల్లో కనిపించింది. అనీశ్ కూడా హెల్మెట్ పెట్టుకొని ఉండగా... ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఇది గమనించిన కర్ణాటక సీనియర్ ప్లేయర్ మయాంక్ అగర్వాల్ వారిద్దరినీ వేరు చేశాడు. ఫీల్డ్ అంపైర్లు రోహాన్ పండిట్, ఉల్హాస్ గంధె కలుగచేసుకొని ఇద్దరికీ సర్దిచెప్పారు. భారీ షాకిచ్చిన బీసీసీఐ!అయితే, ఈ వివాదం కారణంగా పారస్ డోగ్రాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారతక్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అతడికి భారీ జరిమానా విధించింది. ఈ విషయం గురించి.. మ్యాచ్ రిఫరీ నారాయణ్ కుట్టీ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. జమ్మూకశ్మీర్ సారథి పారస్ డోగ్రా మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించినట్లు తెలిపాడు. కాగా రంజీ చరిత్రలో తొలిసారి జమ్మూ కశ్మీర్ను ఫైనల్ చేర్చిన కెప్టెన్గా పారస్ డోగ్రా చరిత్రకెక్కాడు.చదవండి: T20 WC 2026: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ ఆటగాళ్లు -
చెలరేగిన ప్రసిద్ద్ కృష్ణ
జమ్మూ అండ్ కశ్మీర్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్లో కర్ణాటక పేసర్ ప్రసిద్ద్ కృష్ణ చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటాడు. అయితే కర్ణాటక జట్టుకు అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జమ్యూ టీమ్ భారీ స్కోర్ చేసేసింది. షుభమ్ పుండిర్ (121) సెంచరీతో.. యావర్ హస్సన్ (88), కెప్టెన్ పరాస్ డోగ్రా (70), అబ్దుల్ సమద్ (61), కన్హయ్య వధవన్ (70), సాహిల్ లోత్రా (72) అర్ద సెంచరీలతో రాణించారు. చివరి వరుస ఆటగాళ్లు అబిద్ ముస్తాక్ (28), యుద్వీర్ సింగ్ (30) కూడా ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మూడో రోజు తొలి సెషన్లోనే జమ్మూ ఇన్నింగ్స్ ముగిసింది. ప్రసిద్ద్ కాకుండా కర్ణాటక బౌలర్లలో విద్యాదర్ పాటిల్, విజయ్ కుమార్ వైశాక్, శ్రేయస్ గోపాల్, శిఖర్ షెట్టి తలో వికెట్ తీశారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటకకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్, ఇన్ ఫామ్ ప్లేయర్ కేఎల్ రాహుల్ 13 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. రాహుల్ త్వరగా ఔట్ కావడం ఈ మ్యాచ్లో కర్ణాటక గెలుపోటములను తప్పక ప్రభావితం చేస్తుంది. మూడో రోజు లంచ్ విరామం సమయానికి కర్ణాటక స్కోర్ 35-1గా ఉంది. మయాంక్ అగర్వాల్ (16), కెప్టెన్ దేవ్దత్ పడిక్కల్ (4) క్రీజ్లో ఉన్నారు. జమ్మూ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు కర్ణాటక ఇంకా 549 పరుగులు వెనుకపడి ఉంది. -
తగ్గేదేలే!
హుబ్లీ: తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్ ఆడుతున్న జమ్మూకశ్మీర్ జట్టు అద్వితీయ ఆటతీరు కనబరుస్తోంది. దేశవాళీల్లో అపార అనుభవం ఉన్న కర్ణాటకతో తుదిపోరులో జమ్మూ ప్లేయర్లు జోరు కొనసాగిస్తున్నారు. ఓవర్నైట్ స్కోరు 284/2తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన జమ్మూకశ్మీర్ జట్టు బుధవారం ఆట ముగిసే సమయానికి 156 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 527 పరుగులు చేసింది. కెప్టెన్ పారస్ డోగ్రా (166 బంతుల్లో 70; 8 ఫోర్లు), కన్హయ్య వాధ్వాన్ (109 బంతుల్లో 70; 9 ఫోర్లు), సాహిల్ లోత్రా (93 బంతుల్లో 57 బ్యాటింగ్; 7 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. ప్లేయర్లంతా బాధ్యతాయుతంగా ఆడటంతో జమ్మూ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. ఓవర్నైట్ బ్యాటర్లు శుభమ్ పుండిర్ (247 బంతుల్లో 121; 12 ఫోర్లు, 2 సిక్స్లు), అబ్దుల్ సమద్ (104 బంతుల్లో 61; 6 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు నిలవలేకపోయారు. బుధవారం ఆట ప్రారంభమైన కాసేపటికే శుభమ్ అవుట్ కాగా... తదుపరి ఓవర్లో అబ్దుల్ సమద్ సైతం పెవిలియన్ చేరాడు. ఈ దశలో తొలి రోజు రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగిన కెప్టెన్ పారస్ డోగ్రా క్రీజులోకి వచ్చాడు. సుదీర్ఘ అనుభవమున్న ఈ 41 ఏళ్ల బ్యాటర్... ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్రీజులో పాతుకుపోయాడు. మరోవైపు నుంచి కన్హయ్య అతడికి చక్కటి సహకారం అందించాడు. ఈ జంట చాపకింద నీరులా పరుగులు రాబడుతుండటంతో... కర్ణాటక ప్లేయర్లలో అసహనం పెరిగిపోయింది. ఇది మైదానంలో స్పష్టంగా కనిపించింది. పలుమార్లు ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదాలు సైతం జరిగాయి. ఈ క్రమంలో కన్హయ్య 84 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... పారస్ డోగ్రా 140 బంతుల్లో హాఫ్సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఐదో వికెట్కు 192 బంతుల్లో 110 పరుగులు జోడించిన అనంతరం కన్హయ్య వెనుదిరిగాడు. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించిన జమ్మూకశ్మీర్... కర్ణాటక బౌలర్లను మరింత అసహనానికి గురిచేసింది. ఆరో వికెట్కు పారస్, సాహిల్ కలిసి 75 బంతుల్లో 54 పరుగులు జోడించగా... అబేధ్యమైన ఏడో వికెట్కు అబిద్ ముస్తాక్ (20 బ్యాటింగ్; 2 ఫోర్లు)తో కలిసి సాహిల్ 56 పరుగులు జత చేశాడు. కర్ణాటక బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 3 వికెట్లు పడగొట్టగా... విద్యాధర్ పాటిల్, శ్రేయస్ గోపాల్, శిఖర్ షెట్టి తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇప్పటికే మంచి స్కోరు సాధించిన జమ్మూకశ్మీర్ జట్టు... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతోనే పైచేయి సాధించాలనే ఉద్దేశంతో సాగుతోంది. చేతిలో నాలుగు వికెట్లు ఉన్న ఆ జట్టు మూడో రోజు మరెన్ని పరుగులు జోడిస్తుందో చూడాలి. స్కోరు వివరాలు జమ్మూకశ్మీర్ తొలి ఇన్నింగ్స్: కమ్రాన్ ఇక్బాల్ (సి) కేఎల్ రాహుల్ (బి) ప్రసిధ్ 6; యావర్ హసన్ (సి) కేఎల్ రాహుల్ (బి) ప్రసిధ్ 88; శుభమ్ (సి) (సబ్) అనీశ్ (బి) విద్యాధర్ 121; పారస్ డోగ్రా (బి) శ్రేయస్ 70; అబ్దుల్ సమద్ (సి) కృతిక్ (బి) ప్రసిధ్ 61; కన్హయ్య (సి) రాహుల్ (బి) శిఖర్ 70; సాహిల్ (బ్యాటింగ్) 57; ఆబిద్ ముస్తాక్ (బ్యాటింగ్) 20; ఎక్స్ట్రాలు 34; మొత్తం (156 ఓవర్లలో 6 వికెట్లకు) 527. వికెట్ల పతనం: 1–18, 2–157, 3–303, 4–307, 5–417, 6–471. బౌలింగ్: విద్యాధర్ పాటిల్ 29–2–104–1; విజయ్ కుమార్ వైశాఖ్ 31–10–60–0; ప్రసిధ్ కృష్ణ 29–7–90–3; శ్రేయస్ గోపాల్ 33–2–130–1; శిఖర్ షెట్టి32–1–112–1; కరుణ్ నాయర్ 2–1–1–0.అదేం పెద్ద విషయం కాదు ఫైనల్లో మా ప్లేయర్లు చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నారు. జట్టు సమష్టిగా సత్తా చాటుతోంది. ప్రస్తుతానికి మా జట్టు మంచి స్థితిలో ఉంది. ఇలాంటి పెద్ద మ్యాచ్ల్లో ఆమాత్రం కోపోద్రేకాలు సహజం. అనీశ్తో వాగ్వాదం అప్పటివరకు మాత్రమే. ఆ తర్వాత అంతా సాధారణమే. మేం తర్వాత మాట్లాడుకున్నాం కూడా. కర్ణాటక జట్టులో నాణ్యమైన ప్లేయర్లు ఉన్నారు. వారి ముందు లక్ష్యాన్ని నిర్దేశించాలనే ఉద్దేశం లేదు. తొలి ఇన్నింగ్స్ను వీలైనంత వరకు కొనసాగించే ప్రయత్నం చేస్తాం. ఇప్పటి వరకు మా ప్లేయుర్లు చక్కటి ఆటతీరు కనబర్చారు. ఇక ముందు కూడా అదే స్ఫూర్తితో సాగుతాం. –పారస్ డోగ్రా, జమ్మూకశ్మీర్ కెప్టెన్ -
రంజీ ట్రోఫీ ఫైనల్లో ఉద్రిక్తత.. కర్ణాటక ఆటగాడిపై జమ్మూ కెప్టెన్ దాడి
కర్ణాటక-జమ్మూ అండ్ కశ్మీర్ మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్లో హైటెన్షన్ చోటు చేసుకుంది. మ్యాచ్ రెండో రోజు ఫీల్డింగ్ చేస్తున్న కర్ణాటక ఆటగాడు కేవీ అనీష్పై జమ్మూ కెప్టెన్ పరాస్ డోగ్రా దాడికి దిగాడు. ఈ హఠాత్పరిణామంతో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.పూర్తి వివరాల్లోకి వెళితే.. తొలిసారి రంజీ ఫైనల్కు చేరిన జమ్మూ అండ్ కశ్మీర్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ ఎడిషన్ ఆధ్యాంతం రాణించినట్లుగానే ఈ మ్యాచ్లోనూ ఆ జట్టు బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. pic.twitter.com/pddcZJCrgs— crictalk (@crictalk7) February 25, 2026షుభమ్ పుండిర్ (121) అద్భుత శతకంతో, అరంగేట్రం ఓపెనర్ యావెర్ హస్సన్ (88), అబ్దుల్ సమద్ (61) అర్ద శతకాలతో సత్తా చాటారు. ఫలితంగా జమ్మూ జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. రెండో రోజు తొలి సెషన్ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 380 పరుగులు చేసింది. కెప్టెన్ పరాస్ డోగ్రా (36), కన్హయ్య వధావన్ (45) క్రీజ్లో ఉన్నారు.కాగా, రెండో రోజు ఆట ప్రారంభంలో కర్ణాటక బౌలర్లు ప్రసిద్ధ్ కృష్ణ, వైశాక్ విజయ్కుమార్, విద్యాధర్ పాటిల్ బౌన్సర్లతో డోగ్రాను ఇబ్బంది పెట్టారు. ఫీల్డర్లు నిరంతరం స్లెడ్జింగ్ చేస్తూ డోగ్రాను రెచ్చగొట్టారు. 101వ ఓవర్లో డోగ్రా ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో బౌండరీ కొట్టిన తర్వాత, షార్ట్ ఫైన్ లెగ్లో నిలిచిన సబ్స్టిట్యూట్ ఫీల్డర్ కేవీ అనీష్ వైపు దూసుకెళ్లి, తన హెల్మెట్తో అతని తలపై కొట్టాడు. ఊహించని ఈ ఘటనతో మ్యాచ్ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.కర్ణాటక సీనియర్ ఆటగాడు, టీమిండియా ప్లేయర్ మయాంక్ అగర్వాల్ వెంటనే జోక్యం చేసుకొని డోగ్రాపై సీరియస్ అయ్యాడు. అంపైర్లు ఉల్హాస్ గాంధే, రోహన్ పండిట్ గొడవను మరింత పెద్దది కాకుండా ఆటగాళ్లను వేరు చేశారు. కర్ణాటక కెప్టెన్ దేవదత్ పడిక్కల్ ఈ ఘటనను మ్యాచ్ రిఫరికి నివేదించాడు. ఈ ఘటనకు ముందు కూడా జమ్మూ ఆటగాళ్లు డోగ్రా, కన్హయ్య కర్ణాటక ఆటగాళ్లతో చాలాసార్లు వాగ్వాదానికి దిగారు. ఇది చివరికి ఘర్షణకు దారి తీసింది. -
ఆంటీ ఫోన్ నంబర్ ఇవ్వకపోతే అంకుల్ని..!
మైసూరు(కర్ణాటక): ఫోన్ నంబర్ ఇవ్వకపోతే చంపేస్తాను అని గృహిణిని వేధించిన రోమియోపై విజయ నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాలు.. విజయ నగర్లోని యోగ నరసింహ ఆలయం సమీపంలో ఓ గృహిణి నివసిస్తోంది. ఆమె ఇంటి పక్కలో నివసిస్తున్న హింకల్ నివాసి దేవరాజు.. తరచుగా గృహిణితో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఇటీవల రోడ్డుపై వెళ్తున్న గృహిణిని అడ్డగించిన దేవరాజు.. మొబైల్ ఇవ్వాలని బెదిరించాడు. నంబర్ ఇవ్వకపోతే నీ భర్తను చంపేస్తాను అని వేధించాడు. దీంతో విసిగిపోయిన ఆమె విజయ నగర పోలీస్ స్టేషన్లో దేవరాజుపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: నవ దంపతులకు అవమానం.. వీడియో వైరల్ -
‘శుభమ్’ ఆరంభం
హుబ్లీ: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటి ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో తొలిసారి ఫైనల్కు చేరుకున్న జమ్మూకశ్మీర్ జట్టు... తుదిపోరులోనూ అదే జోరు కనబరుస్తోంది. ఎనిమిది సార్లు రంజీ ట్రోఫీ టైటిల్ గెలిచిన కర్ణాటకపై ఏమాత్రం అదురు బెదురు లేకుండా సాధికారికంగా ఆడుతోంది. మంగళవారం ప్రారంభమైన రంజీ ఫైనల్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న జమ్మూకశ్మీర్ జట్టు... తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 87 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. శుభమ్ పుండిర్ (221 బంతుల్లో 117 బ్యాటింగ్; 12 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ సెంచరీతో విజృంభించగా... యావర్ హసన్ (150 బంతుల్లో 88; 13 ఫోర్లు), అబ్దుల్ సమద్ (67 బంతుల్లో 52 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో మెరిశారు. కర్ణాటక బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్ ఆరంభం నుంచి చక్కటి ఆటతీరు కనబరుస్తున్న జమ్మూకశ్మీర్ జట్టు... స్టార్లతో నిండి ఉన్న కర్ణాటకపై అదే దూకుడు కనబర్చింది. ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ (6) విఫలం కాగా... మరో ఓపెనర్ యావర్ హసన్తో కలిసి శుభమ్ రెండో వికెట్కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు. ఈ క్రమంలో యావర్ 77 బంతుల్లో శుభమ్ 100 బంతుల్లో హాఫ్సెంచరీలు పూర్తి చేసుకున్నారు. శుభమ్ ఆరంభం నుంచి ఆచితూచి ఆడితే... యావర్ మాత్రం ఎడాపెడా బౌండరీలు బాదాడు. కర్ణాటక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ ద్వయం 244 బంతుల్లో 139 పరుగులు జోడించింది. ప్రసిధ్ బౌన్సర్కు గాయపడిన కెపె్టన్ పారస్ డోగ్రా (9) రిటైర్డ్ హర్ట్గా వెనుదిరగ్గా... ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అబ్దుల్ సమద్... శుభమ్కు చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ అబేధ్యమైన మూడో వికెట్కు 144 బంతుల్లో 105 పరుగులు జోడించారు. ఈ క్రమంలో శుభమ్ భారీ సిక్స్ సాయంతో 186 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్, సెమీఫైనల్లో బెంగాల్పై విజయాలు సాధించిన జమ్మూకశీ్మర్ జట్టు... కర్ణాటకపై సైతం చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చింది. కర్ణాటక జట్టు తరఫున ఈ సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన లెగ్ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్ బౌలింగ్లో జమ్మూకశ్మీర్ ప్లేయర్లు పరుగుల వరద పారించడం విశేషం. చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్న జమ్మూకశీ్మర్ జట్టు రెండో రోజు మరెన్ని పరుగులు జోడిస్తుందనేది కీలకం. స్కోరు వివరాలు జమ్మూకశ్మీర్ తొలి ఇన్నింగ్స్: కమ్రాన్ ఇక్బాల్ (సి) కేఎల్ రాహుల్ (బి) ప్రసిధ్ 6; యావర్ హసన్ (సి) కేఎల్ రాహుల్ (బి) ప్రసిధ్ 88; శుభమ్ (బ్యాటింగ్) 117; పారస్ డోగ్రా (రిటైర్డ్ హర్ట్) 9; అబ్దుల్ సమద్ (బ్యాటింగ్) 52; ఎక్స్ట్రాలు 12; మొత్తం (87 ఓవర్లలో 2 వికెట్లకు) 284. వికెట్ల పతనం: 1–18, 2–157, 2–179. బౌలింగ్: విద్యాధర్ పాటిల్ 16–0–66–0; విజయ్ కుమార్ వైశాఖ్ 18–6–25–0; ప్రసిధ్ కృష్ణ 16–5–36–2; శ్రేయస్ గోపాల్ 17–1–79–0; శిఖర్ షెట్టి 20–0–68–0. -
ఆలయంలో దళిత నవదంపతులకు అవమానం : వీడియో వైరల్
తెలంగాణాలోని నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామంలోమల్లన్న జాతరలో మూడు నెలల పసిపాప ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర ప్రకంపనలు రేపింది. మరోవైపు కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో కుల వివక్షకు సంబంధించిన మరో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక దళిత కుటుంబాన్ని అవమానించి, ఆలయం నుండి బహిష్కరించిన ఘటన ఘర్షణకు దారి తీసింది. ఈఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఇదీ చదవండి: గర్ల్ ఫ్రెండ్ ద్వారానే ఎల్ మెంచో కథ ఖతంప్రత్యక్ష సాక్షుల ప్రకారం గోని గ్రామంలోని అరసమ్మ ఆలయంలో ఈ సంఘటన జరిగింది. కొత్తగా పెళ్లైన దళిత జంట ప్రార్థనలు చేయడానికి ఆలయానికి వచ్చినప్పుడు నారాయణప్ప అనే వ్యక్తి అడ్డుకున్నాడు. ఆధిపత్య కులానికి చెందిన నారాయణప్ప, ఎలాగైనా వారిని ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు నానాయాగీ చేశాడు. తనకు దేవత సోకిందంటూ నాటకం ఆడాడు. మెకాళ్లపై అమ్మవారికి అడ్డంగా కూర్చొని, వారిని దర్శనం చేసుకోనీయకుండా అడ్డుపడటం ఫుటేజ్లో ఉంది. ఆ తర్వాత అతను లేచి నిలబడి వెంటనే వెళ్లి పోవాలంటూ గట్టిగా అరుస్తూ ఊగిపోయాడు."Dalits can't enter Hindu temple." 🚨A newly married Dalit couple was humiliated and forced out of temple in Karnataka.Where are those "South Indians" who mock "North" over such acts? Speak up, saar..😭Be it North or South, when it comes to caste, entire nation is doomed.… pic.twitter.com/RtJ2ol9Zub— Suraj Kumar Bauddh (@SurajKrBauddh) February 24, 2026 దీంతో ఆవేదనకు గురైన వరుడు జగదీష్ న్యాయం కోసం అధికారులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు ఆధారంగా, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నివారణ) చట్టం కింద తురువేకెరె పోలీస్ స్టేషన్లో FIR నమోదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఎస్పీ కేవీ అశోక్ తురువేకెరె పోలీస్ స్టేషన్లో తమకు అందిన ఫిర్యాదు మేరకు ఒకర్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇదీ చదవండి: అతని కోసం రూ.8 లక్షలు అప్పు: అంతా క్షణాల్లో మాయం! -
కన్న కొడుకులా ఆదరిస్తే ఆస్తికోసం పెద్దమ్మనే కడతేర్చాడు, చివరికి
తోడబుట్టిన చెల్లెలే కదా అని ఆదరించింది. ఆమె కొడుకును కన్నకొడుకు కంటే మిన్నగా చూసుకుంది. కట్ చేస్తే ఇద్దరూ కలిసి ఆమె ప్రాణమే తీసేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఫిబ్రవరి 19న స్థానిక బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీస్లో ఫస్ట్ డివిజన్ అసిస్టెంట్గా పనిచేస్తున్న జయలక్ష్మి (58) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తొలుత అందరూ ఆమెది సహజ మరణమే అనుకున్నారు. కానీ జయలక్ష్మి లివ్-ఇన్ భాగస్వామి శ్రీనివాస్ అనుమానాలు వ్యక్తం చేస్తూ చిక్కనాయకనహళ్లి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అసలు విషయం తెలిసింది. జయలక్ష్మి సోదరి, ఆమె కొడుకే హత్య చేశారని చిక్కనాయకనహళ్లి పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఊపిరి ఆడకుండా చేయడం వల్లే ఆమె చనిపోయిందని పోస్ట్ మార్టం నివేదిక కూడా స్పష్టం చేసింది. ఈ కేసులో సోదరి అనసూయ, ఆమె కుమారుడు చంద్రశేఖర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 19న జయలక్ష్మి మృతి చెందగా, ఒక రోజు తర్వాత ఆమె అంత్యక్రియలకు సన్నాహాలు చేస్తుండగాఅసలు విషయం తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఇదీ చదవండి: అతని కోసం రూ.8 లక్షలు అప్పు: అంతా క్షణాల్లో మాయం!పోలీసులు సమాచారం ప్రకారం జయలక్ష్మి భర్త, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, 19 సంవత్సరాల క్రితం మరణించాడు. భర్త చనిపోయాక ఆమె శ్రీనివాస్ అనే వ్యక్తితో లివ్-ఇన్ రిలేషన్షిప్లోకి ప్రవేశించింది. అటు జయలక్ష్మి సోదరి అనసూయ తన భర్తతో విభేదాలతో విడిగా ఉంటోంది. దీంతో జాలి తలచి అధికారికంగా చంద్రశేఖర్ను దత్తత తీసుకున్నట్టు రికార్డులు లేనప్పటికీ సొంత కొడుకు కంటే మిన్నగా ఆదరించింది. చదువుకు అన్ని విధాలా సాయపడింది. అయితే ఇటీవల అనసూయ, కొడుకు జయలక్ష్మి, శ్రీనివాస్ ఉంటున్న ఇంటికి మకాం మార్చారు. దీంతో గొడవలు మొదలయ్యాయి. చివరికి జయలక్ష్మ , శ్రీనివాస్ కొత్త లీజుకు తీసుకున్న నివాసానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో జయలక్ష్మి నుంచి రావాల్సిన సాయం అందదని, ఆమె ఆస్తులన్నింటినీ తన భాగస్వామికి బదిలీ చేస్తుందని భయపడి, తల్లీకొడుకు హత్యకు కుట్ర పన్నారు. ఆమె మరణం తర్వాత వారు కారుణ్య ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించాలని కూడా ప్లాన్ చేశారట. -
కర్ణాటక: అల్లుని ఇంటిపై...
మండ్య( కర్ణాటక): యువతి ప్రేమించి పెళ్లి చేసుకోగా ఆమె తండ్రి రౌద్రరూప దాల్చాడు, అల్లుని ఇంటికి నిప్పంటించిన సంఘటన మండ్య తాలూకాలోని చుంచగహళ్లి గ్రామంలో శనివారం జరిగింది. వివరాలు.. అదే గ్రామంలో ఒకే వీధిలో నివసించే చెందిన వినోద్, కావ్య ప్రేమించుకున్నారు. ఇద్దరిదీ ఒకే కులం. కానీ యువతి తండ్రి చన్నేగౌడకు ఈ పెళ్లి ఎంతమాత్రం ఇష్టం లేదు. నవంబర్ 19న ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుని దగ్గర్లోనే ఓ చోట కాపురం పెట్టారు. డబ్బు, బంగారం బూడిద.. కుమార్తె, అల్లుడు ఏ ఇంటిలో ఉన్నారో తెలుసుకున్న మామ చన్నేగౌడ శనివారం ఉదయం వెళ్లి ఇంటిలోకి పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఆ సమయంలో దంపతులు లేరు. మంటలు వ్యాపించి, ఇంట్లో ఉన్న వస్తువులు, ఫరి్నచర్, టీవీ తదితరాలు కాలిపోయాయి. ఇల్లు పూర్తిగా దెబ్బతినింది. ఇంట్లోని రూ.10 లక్షల నగదు, 250 గ్రాముల బంగారం కూడా కాలిపోయినట్లు వినోద్ కుటుంబీకులు విలపించారు. ఈ సమయంలో చన్నేగౌడ కూడా గాయపడ్డాడు, అతనిని చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు, క్లూస్ టీం చేరుకుని ఆధారాలను సేకరించారు. డీఎస్పీ యశ్వంత్ కుమార్, సీఐ నవీన్ కేసు నమోదు చేశారు. భార్యాభర్తలను మద్దూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన తర్వాత యువతి కుటుంబం గ్రామం వదిలి వెళ్లిపోయింది. -
కర్ణాటక సీఎం సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు
-
ఐదు లక్షల లంచం.. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్
హుబ్లీ: కర్ణాటకలో సంచలన ఘటన చోటుచేసుకుంది. అవినీతి, లంచం కేసుల్లో దాడులు నిర్వహించే లోకాయుక్తకు ప్రతిపక్ష బీజేపీ శాసనసభ్యుడు చిక్కారు. లంచం తీసుకుంటూ గదగ్ జిల్లా సిరహట్టి బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రు లామాణి పట్టుబడ్డారు. శనివారం మధ్యాహ్నం గదగ్ జిల్లా లక్ష్మేశ్వర పట్టణంలోని ఎమ్మెల్యేకు చెందిన బాలాజీ ఆస్పత్రిపై లోకయుక్త అధికారులు దాడి చేశారు.ఈ సందర్భంగా కాంట్రాక్టర్ నుంచి రూ.5 లక్షలు డబ్బులు తీసుకుంటున్న ఎమ్మెల్యే చంద్రుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన ఇద్దరు పీఏలు మంజునాథ వాల్మీకి, గురు నాయక్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. చిన్ననీటి పారుదల పనులకు సంబంధించి కాంట్రాక్టర్ విజయ్ పూజార్ని ఎమ్మెల్యే రూ.11 లక్షలు డిమాండ్ చేశారని, అందులో రూ.5 లక్షలు తీసుకుంటుండగా దాడి చేసినట్లు లోకాయుక్త అధికారులు తెలిపారు. ఈ సమయంలో ఓ పీఏ రూ.50 వేల నగదున్న కవరును బయటకు విసిరేయగా దానిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కాగా, ధార్వాడ లోకాయుక్త ఎస్పీ సిద్ధలింగప్ప నేతృత్వంలో అధికారులు, సిబ్బంది, దాడిలో పాల్గొన్నారు. నగదు డిమాండ్ చేస్తూ విజయ్కు చేసిన ఫోన్ కాల్ ఆడియో ఆధారంగా ఎమ్మెల్యేపై నిఘా ఉంచినట్లు సమాచారం. అరెస్టు గురించి విధానసభ స్పీకర్ యూటీ ఖాదర్కు సమాచారం అందించారు. ఈ విషయంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కాగా, 2023లో కూడా మరో బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు రూ. 40 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన విషయం తెలిసిందే. -
నాపై కుట్రకు ప్లాన్.. సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు
బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సిద్దరామయ్య సోషల్ మీడియా వేదికగా తన కులం, సామాజిక నేపథ్యం కారణంగా కొందరు టార్గెట్ చేసి తనను దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దీంతో, కన్నడ రాజకీయంలో మరో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు సైతం సిద్దరామయ్యను ప్రశ్నిస్తున్నారు.ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోషల్ మీడియా వేదికగా..‘నాలుగు దశాబ్దాలుగా నేడు రాజకీయాల్లో ఉన్నాను. నా రాజకీయ జీవితం ఏనాడూ పూల పాన్పు కాదు. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. చాలా మంది పెద్ద నాయకులు నన్ను రాజకీయంగా అంతం చేయడానికి అనేక మోసపూరిత కుట్రలు చేశారు. ప్రజల ఆశీర్వాదంతో నేను వాటన్నిటినీ అధిగమించాను. కానీ, కొందరు వ్యక్తులు ఇప్పుడు నాపై కులం, సామాజిక నేపథ్యం కారణంగా కుట్రలు చేస్తున్నారు. నా కులం కారణంగా నేను టార్గెట్ అవుతున్నాను.గొర్రెల కాపరి (కురుబ సామాజిక వర్గం) ముఖ్యమంత్రి అయ్యాడు. ఆర్థిక నిపుణులతో కలిసి బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడని కొన్ని వర్గాలు నాపై కక్ష కట్టాయి. వారు నన్ను అంతం చేస్తే వారి మార్గం సజావుగా మారుతుందని ప్లాన్ చేస్తున్నారు. నన్ను మాత్రమే కాకుండా, నాకు మద్దతు ఇచ్చే వ్యక్తులను కూడా అణగదొక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను అన్నీ గమనిస్తున్నాను.ఇది నా ఒక్కడిపై జరిగిన కుట్ర కాదని నాకు బాగా తెలుసు. ఇది నన్ను నమ్మిన మీపై జరిగిన కుట్ర. అందుకే, నేను ఊపిరి ఉన్నంత వరకు, ఈ రాజకీయ కుట్రకు, అసూయ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతాను. ఇది నిజం. న్యాయం, ధర్మం కోసం పోరాటం చేస్తాను. మీ మద్దతుతో, నేను ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాను. నేను యుద్ధభూమి నుండి పారిపోయే పిరికివాడిని ఎప్పటికీ కాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు.దీంతో, సిద్దరామయ్య పోస్టుపై రాజకీయంగా చర్చ మొదలైంది. కర్ణాటక సీఎం కుర్చీ కోసం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇలా వ్యాఖ్యలు చేయడం కన్నడ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరోవైపు.. సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారని ప్రతిపక్ష నేతలు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో కులం కార్డులో సిద్దరామయ్య కొత్త రాజకీయాలకు తెరలేపారని వ్యాఖ్యలు చేస్తున్నారు. "ಸಾಮಾಜಿಕ ನ್ಯಾಯಕ್ಕಾಗಿ ನನ್ನ ಉಸಿರಿರುವ ವರೆಗೆ ಹೋರಾಡುತ್ತೇನೆ"ನನ್ನ ನಾಲ್ಕು ದಶಕಗಳ ರಾಜಕೀಯ ಜೀವನ ಎಂದಿಗೂ ಹೂವಿನ ಹಾಸಿಗೆ ಆಗಿರಲಿಲ್ಲ, ಅದು ಕಲ್ಲು - ಮುಳ್ಳುಗಳ ಹಾದಿಯಾಗಿತ್ತು. ನನ್ನನ್ನು ರಾಜಕೀಯವಾಗಿ ಮುಗಿಸಲು ಹಲವಾರು ದೊಡ್ಡ ದೊಡ್ಡ ನಾಯಕರು ಹಲವಾರು ಬಗೆಯ ಕುಟಿಲ ಕಾರಸ್ತಾನಗಳನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ಅವುಗಳನ್ನೆಲ್ಲವನ್ನೂ ಜನತೆಯ… pic.twitter.com/rA8XGFuuZL— Siddaramaiah (@siddaramaiah) February 20, 2026 -
11 ఏళ్ల తర్వాత...
లక్నో: పరుగుల వరద పారిన రంజీ ట్రోఫీ రెండో సెమీఫైనల్ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఉత్తరాఖండ్ జట్టుపై 503 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన కారణంగా కర్ణాటక జట్టుకు ఫైనల్ బెర్త్ ఖరారైంది. 11 ఏళ్ల తర్వాత కర్ణాటక జట్టు ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఫైనల్ చేరడం విశేషం. ఈనెల 24 నుంచి హుబ్లీలో జరిగే ఫైనల్లో జమ్మూకశ్మీర్ జట్టుతో కర్ణాటక తలపడుతుంది. జమ్మూకశ్మీర్ జట్టు తొలిసారి ఫైనల్ ఆడనుండగా... కర్ణాటక జట్టు ఎనిమిదిసార్లు టైటిల్ సాధించి, నాలుగుసార్లు రన్నరప్గా నిలిచింది. ఉత్తరాఖండ్తో చివరి రోజు ఓవర్నైట్ స్కోరు 299/6తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కర్ణాటక జట్టు 74.3 ఓవర్లలో 323 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (123 బంతుల్లో 86 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్లు) అజేయంగా నిలిచాడు. అనంతరం 827 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఉత్తరాఖండ్ జట్టు 62 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 260 పరుగులు సాధించింది. ఫలితం తేలకపోవడంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన కర్ణాటక జట్టు ఫైనల్కు అర్హత సాధించింది. తొలి ఇన్నింగ్స్లో కర్ణాటక 736 పరుగులు చేయగా... ఉత్తరాఖండ్ 233 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ చేసిన కర్ణాటక కెప్టెన్ దేవ్దత్ పడిక్కల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. -
టీమిండియావైపు దూసుకొస్తున్న కర్ణాటక యువ సంచలనం
భారత దేశవాలీ క్రికెట్లో ప్రస్తుతం స్మరణ్ రవిచంద్రన్ అనే పేరు మార్మోగిపోతుంది. 22 ఏళ్ల ఈ కర్ణాటక యువ బ్యాటర్ ఫార్మాట్లకతీతంగా వరుస సెంచరీలు, డబుల్ సెంచరీలతో చెలరేగిపోతూ భారత క్రికెట్లో పెను సంచలనంగా మారాడు. ఎడమ చేతి వాటం అటాకింగ్ మిడిల్డార్ బ్యాటర్ అయిన స్మరణ్.. ప్రస్తుత రంజీ సీజన్లో ఆకాశమే హద్దుగా విజృంభిస్తున్నాడు.13 ఇన్నింగ్స్ల్లో 2 డబుల్ సెంచరీలు, 2 సెంచరీలు, 3 అర్ద సెంచరీల సాయంతో 950 పరుగులు (95 సగటున) చేసిన స్మరణ్.. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా అవతరించాడు. ఈ క్రమంలో ఢిల్లీ బ్యాటర్ ఆయుశ్ దొసేజాను (949 పరుగులు) అధిగమించాడు. స్మరణ్ భీకర ఫామ్ చూసి సహచర క్రికెటర్లు అవాక్కవుతున్నారు. విశ్లేషకులు సైతం అబ్బురపడుతున్నారు.ట్విన్ సెంచరీస్ప్రస్తుతం ఉత్తరాండ్తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో స్మరణ్ ఉగ్రరూపం దాల్చాడు. రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు (135, 127) చేసి భీకర ఫామ్ను కొనసాగించాడు. స్మరణ్ సహా దేవదత్ పడిక్కల్ (232), కేఎల్ రాహుల్ (141, 70 నాటౌట్) శివాలెత్తడంతో ఈ మ్యాచ్లో కర్ణాటక బంపర్ విక్టరీ దిశగా సాగుతోంది. మొత్తం 3 డబుల్ సెంచరీలు, 3 సెంచరీలుతాజా ప్రదర్శనతో స్మరణ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 1500 పరుగుల మైలురాయిని దాటాడు. 25 ఇన్నింగ్స్ల స్వల్ప కెరీర్లో 3 డబుల్ సెంచరీలు, 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీల సాయంతో 1500 పరుగుల మార్కును క్రాస్ చేశాడు. అతని కెరీర్ సగటు 72కు పైగా ఉండటం విశేషం.లిస్ట్-ఏ క్రికెట్లోనూ తిరుగలేని మొనగాడే..!స్మరణ్ సెంచరీల మోత, పరుగుల ప్రవాహం ఫస్ట్ క్లాస్ క్రికెట్కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ మైసూరు కుర్రాడు లిస్ట్-ఏ క్రికెట్లోనూ అదరగొడుతున్నాడు. ఇటీవల (2024-25) కర్ణాటక విజయ్ హజారే వన్డే ట్రోఫీ సాధించడంలో స్మరణ్ అత్యంత కీలకపాత్ర పోషించాడు. సెమీఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీతో (76) పాటు, ఫైనల్లో మెరుపు సెంచరీ (101) చేసి తన జట్టును ఛాంపియన్గా నిలిపాడు. లిస్ట్-ఏ ఫార్మాట్లో మొత్తం 14 ఇన్నింగ్స్లు ఆడిన స్మరణ్ 96.48 స్ట్రయిక్రేట్తో 50కి పైగా సగటున 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీల సాయంతో 604 పరుగులు చేశాడు.పొట్టి ఫార్మాట్లోనూ పర్వాలేదుఫస్ట్క్లాస్, లిస్ట్-ఏ ఫార్మాట్లతో పోలిస్తే స్మరణ్ టీ20 ఫార్మాట్ రికార్డు ఓ మోస్తరుగా ఉంది. పొట్టి ఫార్మాట్లో స్మరణ్ 13 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేసి 162.45 స్ట్రయిక్రేట్తో 3 అర్ద సెంచరీల సాయంతో 489 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.బౌలింగ్లోనూ మెరిపిస్తాడుస్మరణ్ విధ్వంసకర బ్యాటింగ్తో మాత్రమే కాకుండా బౌలింగ్లోనూ మెరిపించగల సమర్దుడు. కుడి చేతి ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసే స్మరణ్ కీలక సమయాల్లో బంతితోనూ మ్యాజిక్ చేయగలడు. లోకల్ క్రికెట్లో అతను బౌలింగ్లోనూ ప్రూవ్ చేసుకున్నాడు.అనుకోకుండా వచ్చిన ఐపీఎల్ అవకాశంస్మరణ్కు ఐపీఎల్ 2025లో ఊహించని విధంగా అవకాశం వచ్చింది. ఆసీస్ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా గాయపడంతో సన్రైజర్స్ హైదరాబాద్ స్మరణ్కు అక్కున చేర్చుకుంది (30 లక్షలు). అయితే స్మరణ్కు ఆ సీజన్లో అవకాశాలు దక్కలేదు. స్మరణ్పై భారీ అంచనాలు ఉన్న ఎస్ఆర్హెచ్ అతన్ని 2026 సీజన్కు కూడా రీటైన్ చేసుకుంది. ఈ ఐపీఎల్ సీజన్లో స్మరణ్కు అవకాశం దొరికి ఇదే తరహాలో చెలరేగితే, త్వరలోనే టీమిండియా తలుపులు తట్టడం ఖాయమని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు. -
కెప్టెన్ నిర్ణయం... జట్టు పాలిట శాపం!
కెప్టెన్ తీసుకున్న నిర్ణయం ఉత్తరాఖండ్ పాలిట శాపంగా మారింది. ప్రత్యర్థి జట్టులో మేటి బ్యాటర్లు ఉన్న సంగతి విస్మరించి... తొలుత బౌలింగ్ ఎంచుకున్నందుకు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తోంది. రంజీ ఫైనల్ 2025-26 ఫైనల్ చేరే అవకాశం దాదాపుగా ఉత్తరాఖండ్ చేజారినట్లే!లక్నో వేదికగా రంజీ తొలి సెమీస్ మ్యాచ్లో కర్ణాటక- ఉత్తరాఖండ్ మధ్య ఆదివారం మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన ఉత్తరాఖండ్ కెప్టెన్ కునాల్ చండేలా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన కర్ణాటక అదరగొట్టింది.కర్ణాటక బ్యాటర్ల అద్భుత ప్రదర్శనకర్ణాటక బ్యాటర్లలో కెప్టెన్ దేవ్దత్ పడిక్కల్ (232) డబుల్ సెంచరీ... కేఎల్ రాహుల్ (141) సెంచరీ... రవిచంద్రన్ స్మరణ్ (135) సెంచరీ... కరుణ్ నాయర్ (60), కృతిక్ కృష్ణ (60), విద్యాధర్ పాటిల్ అర్ధ సెంచరీలు సాధించారు. ఫలితంగా కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 736 పరుగులు సాధించి ఆలౌటైంది.ఓవర్నైట్ స్కోరు 689/6తో మంగళవారం నాటి మూడో రోజు ఆట కొనసాగించిన కర్ణాటక మరో 47 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓవర్నైట్ సెంచరీ హీరో స్మరణ్ తన వ్యక్తిగత స్కోరుకు మరో 14 పరుగులు జోడించి 135 పరుగులకు అవుటయ్యాడు. విద్యాధర్ (54) అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఉత్తరాఖండ్ బౌలర్లలో ఆదిత్య రావత్ 154 పరుగులిచ్చి 4 వికెట్లు, మయాంక్ మిశ్రా 173 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టారు. అభయ్ నేగి, అవనీశ్, లక్ష్యలకు ఒక్కో వికెట్ దక్కింది. 588 పరుగులుఇక కర్ణాటక నమోదు చేసిన భారీ స్కోరుకు జవాబుగా... మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఉత్తరాఖండ్ ఆట ముగిసే సమయానికి 69 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్ను ‘డ్రా’గా ముగించి, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదిస్తేనే ఉత్తరాఖండ్ జట్టుకు ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సగం వికెట్లు కోల్పోయిన ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందాలంటే మరో 588 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్లో మాజీ చాంపియన్ కర్ణాటక గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.చదవండి: T20 WC 2026: నేపాల్ సంచలన విజయం -
పడిక్కల్ డబుల్ సెంచరీ.. కర్ణాటక అతి భారీ స్కోరు
రంజీ ట్రోఫీ 2025-26 తొలి సెమీ ఫైనల్లో కర్ణాటక అతి భారీ స్కోరు సాధించింది. ఉత్తరాఖండ్ బౌలింగ్ను చితక్కొట్టి తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 736 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (141), స్మరణ్ రవిచంద్రన్ (135) భారీ శతకాలతో మెరవగా.. కెప్టెన్ దేవదత్ పడిక్కల్ డబుల్ సెంచరీ (232)తో కదం తొక్కాడు.736 పరుగులుమిగిలిన వారిలో కరుణ్ నాయర్ (60), వికెట్ కీపర్ బ్యాటర్ కృతిక్ కృష్ణ (60), విద్యాధర్ పాటిల్ (54) అర్ధ శతకాలతో రాణించారు. ఫలితంగా కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 194.4 ఓవర్లలో 736 పరుగులు చేసి ఆలౌట్ అయింది.అయితే, ఈ మ్యాచ్లో స్టార్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (5) విఫలం కాగా.. శ్రేయస్ గోపాల్ (0), విజయ్కుమార్ వైశాఖ్ (0) డకౌట్ అయ్యారు. శిఖర్ శెట్టి 12 పరుగులు చేయగా.. ప్రసిద్ కృష్ణ ఒక పరుగుతో అజేయంగా నిలిచాడు.ఇక ఉత్తరాఖండ్ బౌలర్లలో ఆదిత్య రావత్ నాలుగు వికెట్లు తీయగా.. మయాంక్ మిశ్రా మూడు వికెట్లు దక్కించుకున్నాడు. మిగతా వారిలో అభయ్ నేగి, అన్వీశ్ సుధా, లక్ష్య రాజేశ్ రాయ్చందాని తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.రెండో రోజు ఆట సాగిందిలా..కెప్టెన్ దేవ్దత్ పడిక్కల్ (232; 29 ఫోర్లు, 3 సిక్స్లు) డబుల్ సెంచరీ... స్మరణ్ (121 బ్యాటింగ్; 11 ఫోర్లు) అజేయ శతకం... వెరసి ఉత్తరాఖండ్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో కర్ణాటక భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్నైట్ స్కోరు 355/2తో సోమవారం నాటి రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కర్ణాటక... ఆట ముగిసే సమయానికి 180 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 689 పరుగులు సాధించింది.కరుణ్ నాయర్ (60; 8 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి పడిక్కల్ మూడో వికెట్కు 129 పరుగులు ... స్మరణ్తో కలిసి నాలుగో వికెట్కు 59 పరుగులు జత చేశాడు. శ్రేయస్ గోపాల్ (0) డకౌట్కాగా ... కృతిక్ కృష్ణ ( 60; 6 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి స్మరణ్ ఆరో వికెట్కు 123 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో స్మరణ్ కెరీర్లో ఐదో ఫస్ట్క్లాస్ సెంచరీ సాధించాడు. కృతిక్ వెనుదిరిగాక ... విద్యాధర్ పాటిల్ (35 బ్యాటింగ్; 1 ఫోర్, 1 సిక్స్), స్మరణ్ మరో వికెట్ పడకుండా రెండో రోజు ఆటను ముగించారు. చదవండి: T20 WC 2026: ఆస్ట్రేలియాకు భారీ షాకిచ్చిన శ్రీలంక.. ఇక లగేజి సర్దుకోవడమే! -
రూ.400 కోట్ల దారి దోపిడీ కేసు.. చివరికి ట్విస్ట్ ఏంటంటే?
బెళగావి: సుమారు ఐదు నెలల నుంచి సినిమాను మించి ట్విస్ట్లతో సాగిన రూ. 400 కోట్ల నగదు దోపిడీ కథ.. చివరికి ఫేక్ అని తేలింది. ట్రక్ కంటైనర్లలో గోవా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న సుమారు రూ.400 కోట్ల నగదు.. దోపిడీ జరిగిందంటూ ట్రక్ డ్రైవర్ చేసిన ఫిర్యాదు.. కట్టుకథగా నాసిక్ పోలీసులు తేల్చిపారేశారు. డ్రైవర్ చెప్పింది నిజం కాదని.. దారి దోపిడీ జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు.నగదు తరలిస్తున్న ట్రక్కును అడ్డగించి దోపిడీ చేశారంటూ డ్రైవర్ సందీప్ గత ఏడాది డిసెంబరు 17న మహారాష్ట్రలోని నాసిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత ఏడాది అక్టోబరు 22న బెళగావి జిల్లాలోని చోర్లా ఘాట్ ప్రాంతంలో ఈ చోరీ జరిగిందంటూ నమ్మబలికాడు. కొందరు వ్యక్తులు తనను అడ్డగించి.. దాడి చేశారని.. రూ.400 కోట్ల విలువైన రూ.2000 నోట్లతో (రద్దయిన నోట్లు) పరార్ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. సందీప్.. తనపై దాడి జరిగినట్లు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలను కూడా షేర్ చేశాడు.ఈ కేసును ఛేదించడానికి మహారాష్ట్ర పోలీసులు.. కర్ణాటక, గోవా పోలీసుల సాయంతో విచారణ చేపట్టారు. అంత భారీ నగదును తీసుకెళ్లే ట్రక్కులకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. సందీప్ ఫిర్యాదు మేరకు ఏడుగురు అనుమానితులను అరెస్టు చేసి విచారించామని.. అతని ఆరోపణలు కట్టు కథలేనని పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ సందీప్ పాటిల్ చెప్పిన వివరాల్లో అనేక పొంతన లేని విషయాలను సిట్ గుర్తించింది. ఈ కేసులో అరెస్టయిన ఏడుగురినీ న్యాయస్థానం ఇప్పటికే విడుదల చేసింది. తప్పుడు ఫిర్యాదు చేసిన డ్రైవర్ సందీప్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే యెచనలో పోలీసులు ఉన్నారు. -
ఇజ్రాయెల్ మహిళపై అత్యాచారం.. కోర్టు సంచలన తీర్పు
కర్ణాటకాలో గతేడాది ఇజ్రాయెల్ మహిళతో పాటు మరోకరిపై అత్యాచారం జరిగిన ఘటనలో గంగావతి జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ ఘటనలో అరెస్టైన ముగ్గురిని నిందితులుగా గుర్తిస్తూ వారికి మరణశిక్ష విధించింది. 2025 మార్చి 6న ఒక మహిళా ఇజ్రెయెల్ పర్యాటకురాలు, ఆమె సహాయకురాలితో పాటు భారత్కు చెందిన ముగ్గురు ఇతర పర్యాటకులు తుంగభద్రా నది ఎడమకాలువ పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో మల్లేశ్, సాయి, శరణప్ప అనే ముగ్గురు వారి వద్ద కొచ్చి డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. వారు నిరాకరించడంతో వారిపై దాడి చేసి ముగ్గురు మగవారిని అక్కడి తుంగభద్రా లోయలో తోసివేశారు. మిగతా ఇద్దరు మహిళలపై అత్యాచారం చేశారు.అయితే ఆ నదిలో పడ్డ ముగ్గురిలో ఇద్దరు ఈత రావడంతో బ్రతికారు. ఒడిశాకు చెందిన మరో పర్యాటకుడు దురదృష్టవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నిందితులను కఠనంగా శిక్షించాలని నిరసనలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ కేసును విచారించిన గంగావతి జిల్లా కోర్టు నిందితులకు మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసు అత్యంత అరుదైనదని దీనికి ఖచ్చితంగా కఠిన శిక్ష విధించాలని న్యాయమూర్తి తెలిపారు. -
భీకర ఫామ్.. ఈసారి డబుల్ సెంచరీ
రంజీ ట్రోఫీ ఎలైట్ 2025-26 సెమీ ఫైనల్లో కర్ణాటక కెప్టెన్ దేవ్దత్ పడిక్కల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. వన్డౌన్లో వచ్చిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ డబుల్ సెంచరీతో మెరిశాడు. రంజీ ట్రోఫీ తాజా సీజన్లో తొలి సెమీస్ మ్యాచ్లో కర్ణాటక- ఉత్తరాఖండ్ (karnataka vs uttarakhand) తలపడుతున్నాయి. లక్నో వేదికగా ఇరుజట్ల మధ్య ఆదివారం మ్యాచ్ మొదలుకాగా.. మాజీ చాంపియన్ కర్ణాటక కర్ణాటక భారీ స్కోరు దిశగా సాగుతోంది.తొలిరోజే ఆధిపత్యంఇక ఈ దేశీ ఫస్ట్క్లాస్ టోర్నీ తొలిసారి సెమీఫైనల్ చేరిన ఉత్తరాఖండ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్కు దిగిన కర్ణాటక మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 355 పరుగులు సాధించింది. టీమిండియా స్టార్లు కేఎల్ రాహుల్ (KL Rahul- 141; 11 ఫోర్లు, 5 సిక్స్లు), కెప్టెన్ దేవ్దత్ పడిక్కల్ (148 బ్యాటింగ్; 16 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీలతో అదరగొట్టారు.ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal- 5) తక్కువ స్కోరుకే వెనుదిరగ్గా... రాహుల్, పడిక్కల్ రెండో వికెట్కు 278 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు. రాహుల్ అవుటయ్యాక వచ్చిన కరుణ్ నాయర్ (37 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా నిలకడ కనబరిచాడు.రెండో రోజు కెప్టెన్ డబుల్ సెంచరీ పూర్తిఈ నేపథ్యంలో 355/2 ఓవర్నైట్ స్కోరుతో సోమవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన కర్ణాటక.. 125 ఓవర్లు పూర్తయ్యేసరికి ఐదు వికెట్ల నష్టానికి 512 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ పడిక్కల్ 330 బంతుల్లో 29 ఫోర్లు, మూడు సిక్స్లు బాది 232 పరుగులు చేశాడు.పడిక్కల్ ఫస్ట్క్లాస్ కెరీర్లో డబుల్ సెంచరీ సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక కరుణ్ నాయర్ అర్ధ శతకం (105 బంతుల్లో 60) బాదగా.. శ్రేయస్ గోపాల్ డకౌట్ (0) అయ్యాడు. మిగిలిన వారిలో స్మరణ్ రవిచంద్రన్ 33, వికెట్ కీపర్ బ్యాటర్ కృతిక్ క్రిష్ణ 15 పరుగులతో క్రీజులో నిలిచారు. ఉత్తరాఖండ్ బౌలర్లలో ఆదిత్యా రావత్ మూడు వికెట్లు తీయగా.. అభయ్ నేగి, లక్ష్య రాజేశ్ రాయ్చందాని తలా ఒక వికెట్ పడగొట్టారు.సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న పడిక్కల్టీమిండియాకు దూరమైన పడిక్కల్ దేశీ క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు. లిస్ట్-ఎ క్రికెట్లో పుదుచ్చేరి, త్రిపుర జట్లపై వరుస శతకాలు బాదిన ఈ కర్ణాటక స్టార్.. అనంతరం రాజస్తాన్ (91), ముంబై (81 నాటౌట్) జట్లపై కూడా రాణించాడు. ఇక రంజీ ఎడిషన్లో చివరగా పంజాబ్తో మ్యాచ్లో సెంచరీ చేసిన పడిక్కల్.. తాజాగా సెమీ ఫైనల్లో ఉత్తరాఖండ్పై ‘ద్వి’శతక్కొట్టం విశేషం.చదవండి: IND vs PAK: అందుకే ఓడిపోయాం.. ప్రధాన కారణం వాళ్లే: పాక్ కెప్టెన్A captain’s masterpiece! 🎨Watch the moment Devdutt Padikkal brings up his maiden First-Class double ton 💯💯He soaks in the applause as the dressing room rises to acknowledge a special knock 👏Updates ▶️ https://t.co/SztwjvwUiI#RanjiTrophy @IDFCFIRSTBank @devdpd07 pic.twitter.com/0Qaa5DNU9z— BCCI Domestic (@BCCIdomestic) February 16, 2026 -
అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి మృతి
న్యూయార్క్: అమెరికాలో అదృశ్యమైన కర్నాటకకు చెందిన విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య మృతి చెందారు. 22 ఏళ్ల సాకేత్ మృతదేహం శనివారం పోలీసులకు లభించినట్లు శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ధ్రువీకరించింది. మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్కు తరలించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని, కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. సాకేత్ బర్కిలీ యూనివర్సిటీలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ చదువుతున్నారు. ఆయన ఫిబ్రవరి 9 నుంచి కనిపించకుండా పోయారు. మంగళవారం టిల్టెన్ రీజనల్ పార్క్లోని లేక్ అంజా దగ్గర కనిపించినట్టు పోలీసులు తెలిపారు. పార్క్ హిల్స్ పరిసరాల్లోని ఒక ఇంటి సమీపంలో ఆయన పాస్పోర్ట్, ల్యాప్టాప్తో కూడిన బ్యాక్పాక్ పోలీసులకు లభించింది. -
రాహుల్, పడిక్కల్ అద్భుత శతకాలు
ఉత్తరాఖండ్తో ఇవాళ (ఫిబ్రవరి 15) మొదలైన రంజీ ట్రోఫీ 2025-26 తొలి సెమీఫైనల్లో కర్ణాటక జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (125 నాటౌట్), కెప్టెన్ దేవదత్ పడిక్కల్ (111 నాటౌట్) అద్భుత సెంచరీలతో చెలరేగిపోయారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేస్తున్న కర్ఱాటక టీ విరామం సమయానికి వికెట్ నష్టానికి 263 పరుగులు చేసింది. రాహుల్, పడిక్కల్ సెంచరీల తర్వాత కూడా నిలకడగా ఆడుతూ డబుల్ సెంచరీల దిశగా సాగుతున్నారు.టాస్ ఓడి ఉత్తరాఖండ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన కర్ణాటక 18 పరుగుల వద్దనే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (5) వికెట్ కోల్పోయింది. అయితే రాహుల్, పడిక్కల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ను నిర్మించారు. వీరిద్దరు రెండో వికెట్కు అజేయమైన 245 పరుగులు జోడించారు. మయాంక్ అగర్వాల్ వికెట్ ఆదిత్య రావత్కు దక్కింది.భీకర ఫామ్లో రాహుల్, పడిక్కల్కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్ భీకర ఫామ్ను కొనసాగిస్తున్నారు. టీమిండియా షెడ్యూల్ లేకపోవడంతో రంజీ బాట పట్టిన రాహుల్ ముంబైతో జరిగిన క్వార్టర్ ఫైనల్లోనూ (130) అద్భుత శతకంతో మెరిశాడు. రాహుల్ అద్భుత శతకం కారణంగానే కర్ణాటక ముంబైపై గెలిచి సెమీస్కు చేరింది. అంతకుముందు పంజాబ్తో జరిగిన లీగ్ మ్యాచ్లోనూ రాహుల్ అర్ద సెంచరీతో రాణించాడు. దీనికి ముందు న్యూజిలాండ్తో జరిగిన రాజ్కోట్ వన్డేలోనూ (112) రాహుల్ అజేయ శతకంతో సత్తా చాటాడు. అంతకుముందు సౌతాఫ్రికాపై వరుసగా రెండు వన్డేల్లో అర్ద సెంచరీలతో రాణించాడు.పడిక్కల్ విషయానికొస్తే.. ఇతను కూడా ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోతున్నాడు. ఈ సెంచరీకి ముందు పంజాబ్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో సెంచరీతో మెరిసిన పడిక్కల్.. దానికి ముందు లిస్ట్-ఏ ఫార్మాట్లో పరుగుల వరద పారించాడు. పుదుచ్చేరి, త్రిపురపై వరుస శతకాలు, ఆతర్వాత రాజస్థాన్పై 91, ముంబైపై 81 (నాటౌట్) పరుగులు చేశాడు. రాహుల్, పడిక్కల్ ఇదే భీకర ఫామ్ను కొనసాగిస్తే.. కర్ణాటక మరోసారి రంజీ టైటిల్ గెలవడం ఖాయం. -
అమెరికాలో అదృశ్యమైన శ్రీనివాసయ్య మృత దేహం లభ్యం
అమెరికాలోని కాలిఫోర్నియాలో కనిపించకుండా పోయిన 22 ఏళ్ల భారతీయ విద్యార్థి ఉదంతం విషాదాంతమైంది. తప్పిపోయిన ఆరు రోజుల తర్వాత కర్నాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య(22) మృతదేహం లభ్యమైంది. పోలీసులు అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ధృవీకరించింది. దీంతో అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.అతని మృతదేహాన్నివీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన అన్ని సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. అత్యంత క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి, ప్రియమైనవారికి తమ హృదయపూర్వక సానుభూతిని తెలియ జేస్తున్నామని ప్రకటనలో పేర్కొంది.Consulate General of India in San Francisco is deeply concerned about the disappearance of Saketh Sreenivasaiah, an Indian post-graduate student of UC Berkeley, hailing from the State of Karnataka. The Consulate is in touch with the family and also is in contact with the…— India in San Francisco (@CGISFO) February 14, 2026 కాలిఫోర్నియా బర్కిలీ విశ్వవిద్యాలయంలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య ఫిబ్రవరి 9న అదృశ్యమయ్యాడు.మద్రాస్ ఐఐటీ నుంచి ఇతడు 2025లో కెమికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాడు. సాకేత్ మంగళవారం చివరిసారిగా డ్వైట్ వేలోని 1700 బ్లాక్ వద్ద కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ల్యాప్టాప్, పాస్పోర్టు తదితరాలున్న సాకేత్ బ్యాగు లేక్ ఆంజా ప్రాంతంలోని పార్క్హిల్స్లో ఓ ఇంటి ఆవరణలో పడి ఉండగా గుర్తించారు. తమ కొడుకు ఎలాగైనా క్షేమంగా తిరిగి వస్తాడని ఎదురు చూసిన కుటుంబీకుల్లో శ్రీనివాసయ్య మరణవార్త తీరని విషాదాన్ని మిగిల్చింది. -
అమెరికాలో కర్నాటక విద్యార్థి అదృశ్యం
న్యూయార్క్/బెంగళూరు: అమెరికాలోని కాలిఫోరి్నయాలో పీజీ చదువుకునే భారతీయ విద్యార్థి ఒకరు కనిపించకుండా పోయారు. కర్నాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య(22) అమెరికాలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ బర్కిలీలో కెమికల్, బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ పీజీ చేస్తున్నాడు. మద్రాస్ ఐఐటీ నుంచి ఇతడు 2025లో కెమికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాడు. సాకేత్ మంగళవారం చివరిసారిగా డ్వైట్ వేలోని 1700 బ్లాక్ వద్ద కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ల్యాప్టాప్, పాస్పోర్టు తదితరాలున్న సాకేత్ బ్యాగు లేక్ ఆంజా ప్రాంతంలోని పార్క్హిల్స్లో ఓ ఇంటి ఆవరణలో పడి ఉండగా గుర్తించారు. ఈ విషయాన్ని శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ధ్రువీకరించింది. సాకేత్ అదృశ్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. అతడి ఆచూకీ కనుగొనే విషయమై స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, కర్నాటకలోని కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నామని శనివారం వెల్లడించింది. ఈ నెల 9వ తేదీ నుంచి సాకేత్ కనిపించకుండాపోయాడంటూ అతడి రూమ్మేట్ బనీత్ సింగ్ ఈ నెల 13వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్ని చోట్లా వాకబు చేసిన తను ఎటువంటి ఫలితం కనిపించకపోవడంతో పోలీసులకు తెలిపినట్లు బనీత్ తెలిపాడు. ప్రభుత్వానికి సాకేత్ తండ్రి వినతి అమెరికాలో గల్లంతైన తమ కుమారుడిని కనుగొనేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన అందజేసినట్లు తండ్రి శ్రీనివాసయ్య తెలిపారు. చివరిసారిగా తమ కుమారుడితో ఈ నెల 9వ తేదీన ఫోన్లో మాట్లాడామన్నారు. 12వ తేదీ నుంచి కనిపించడం లేదంటూ అతడి రూమ్మేట్ తమకు తెలిపాడన్నారు. కుమారుడి కోసం అమెరికా వెళ్లే విషయమై తాము ఆలోచిస్తున్నామన్నారు. సాకేత్ విషయంలో కాలిఫోర్నియాలోని భారత కాన్సులేట్ అధికారులు అక్కడి పోలీసులతో మాట్లాడాలని, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కర్నాటక ప్రభుత్వం శనివారం కేంద్ర విదేశాంగ శాఖను కోరింది. -
ఇక ‘అక్కా కేఫ్’లు.. ఎక్కడంటే..
కర్ణాటక రాష్ట్రంలో ఇక మరిన్ని ‘అక్కా కేఫ్’లు ప్రారంభం కానున్నాయి. 2025లో ప్రారంభించి స్వయం సహాయక బృందాల (SHGs) మహిళల ద్వారా నిర్వహిస్తున్న కాఫీ వ్యవస్థాపకత కార్యక్రమం ‘అక్కా కేఫ్’ చొరవను విస్తరించేందుకు కర్ణాటక ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. 16వ రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ప్రాజెక్టును ప్రకటించారు.బెంగళూరులో తాజాగా జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ కాఫీ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ ఈ విషయాన్ని వెల్లడించారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, రాష్ట్ర కాఫీ వ్యాల్యూ చెయిన్నుబలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.ఏమిటీ ‘అక్కా కేఫ్’?‘అక్కా కేఫ్’ ప్రోగ్రామ్ అనేది జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (NRLM) కింద రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో అమలవుతున్న జీవనోపాధి, వ్యవస్థాపకత పథకం. ఇది నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత, జీవనోపాధి విభాగం ద్వారా అమలవుతోంది.ఈ చొరవ ద్వారా కర్ణాటక అంతటా మహిళలు నడిపే కాఫీ కియోస్కులు, కేఫ్ల నెట్వర్క్ను ఏర్పాటుచేయడం లక్ష్యం. స్వయం సహాయక సంఘాల మహిళలు మైక్రోఫైనాన్స్ కార్యకలాపాలకు మాత్రమే పరిమితం కాకుండా సూక్ష్మ పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఇది తోడ్పడుతుంది.కర్ణాటక ప్రభుత్వ తాజాగా ప్రకటించిన రూ.25 కోట్ల కేటాయింపుతో కియోస్క్ మౌలిక సదుపాయాలు, శిక్షణ కార్యక్రమాలు, ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్కు సహకారం అందించనున్నారు. ప్రభుత్వం ఈ పథకం కింద 2,500 ‘అక్కా కేఫ్’ కాఫీ కియోస్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కియోస్క్ల రూపకల్పన, సరఫరా, నిర్మాణం, ప్రారంభానికి టెండర్లు ఇప్పటికే పిలిచినట్లు సమాచారం.దశలవారీ అమలుప్రాజెక్టును దశలవారీగా అమలు చేస్తారు. మొదటి దశలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 50 ఆధునిక కేఫ్లు ఏర్పాటు చేస్తారు. అర్హులైన మహిళలకు మౌలిక సదుపాయాలు, సెటప్ కోసం రూ.15 లక్షల వరకు గ్రాంట్లు అందించనున్నారు.ఎక్కడెక్కడ?ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని ‘అక్కా కేఫ్’లు పనిచేస్తున్నాయి. వీటిలో బెంగళూరులో రెండు, బీదర్లో రెండు, కార్వార్లో ఒకటి ఉన్నాయి. త్వరలో మైసూరులో మరో రెండు కేఫ్లు ప్రారంభం కానున్నాయి. బెంగళూరులోని గాంధీనగర్, దేవనహళ్లి ప్రాంతాలలో అక్కా కేఫ్లను పైలట్ ప్రాతిపదికన ప్రారంభించారు.మెనూలో ఏమేముంటాయంటే..‘అక్కా కేఫ్’ల్లో ప్రధానంగా కాఫీ లభిస్తుంది. అదనంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేకమైన వంటకాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ మెనూలో సాధారణంగా కాఫీతోపాటు ఇడ్లీ, వడ, ఉప్మా, పులావ్, టీ ఉంటాయి. చౌకైన ధరల్లో అల్పాహారం, తేలికపాటి భోజనం కూడా లభిస్తాయి.లక్ష మంది మహిళలకు శిక్షణకాఫీ బోర్డు ఆఫ్ ఇండియా, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ సహకారంతో లక్ష మంది స్వయం సహాయక బృందాల మహిళలకు శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణలో ప్రధానంగా ప్రామాణిక ఫిల్టర్ కాఫీ తయారీ, కేఫ్, కియోస్క్ నిర్వహణ, వ్యవస్థాపకత, సూక్ష్మ ఎంటర్ప్రైజ్ అభివృద్ధి వంటి అంశాలు ఉంటాయి.తొలుత సుమారు 400 మంది మహిళలకు బెంగళూరులోని కాఫీ బోర్డు ప్రధాన కార్యాలయంలో మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ ఇస్తారు. ఈ శిక్షకులు తాలూకా, గ్రామ స్థాయిలలో మిగిలిన మహిళలకు శిక్షణ అందిస్తారు. శిక్షణ , అమలుకు కాఫీ బోర్డు అటల్ ఇంక్యుబేషన్ & ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సెంటర్ సహకారం అందిస్తుంది. -
7 ప్రాణాలు తీసిన అతివేగం..
-
అరేబియా సముద్ర తీరాన ఉన్న ఈ శివుడు ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)
-
దురంధర్ పాటకు గన్ డ్యాన్స్.. చిక్కుల్లో కాంగ్రెస్ నేత
కర్ణాటకకు చెందిన ఓ కాంగ్రెస్ నేత చిక్కుల్లో పడ్డారు. ఓ ప్రైవేట్ పార్టీకి వెళుతున్న సందర్భంలో చేతిలో పిస్తోలు పట్టుకొని ఇటీవల సూపర్ హిట్టైన దురంధర్ చిత్రంలోని ఓ పాటకు డాన్స్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పోలీసులు అతనిపై విచారణ చేపట్టారు.మథీన్ పటేల్ అనే కాంగ్రెస్ నేత అక్కడి కల్బుర్గి నియోజకవర్గ ఎమ్మెల్యేలకు అత్యంత సన్నిహితుడు. అయితే ఆయన ఇటీవల ఓ ప్రైవేట్ పార్టీకి హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన ఫంక్షన్లోకి వస్తుండగా ఆయన అనుచరులు నానా హంగామా చేశారు. గన్స్తో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం మథీన్ పటేల్ సైతం చేతిలో రివాల్వార్తో ఫోజులిచ్చారు.ఇటీవల విడుదలై సూపర్ హిట్టైన దురందర్ చిత్రంలోనే ఓ ఫేమస్ పాటకు డ్యాన్స్ చేశారు. అయితే ఇది సామాజిక మాధ్యమాల్లో వైరలై పోలీసుల దాకా చేరడంతో ఆయనపై విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో కల్బుర్గి పోలీస్ కమిషనర్ శరణప్పా ఈ అంశంపై స్పందించారు.మథీన్ పటేల్ పట్టుకున్న ఆయుధాలు నకిలీవా లేదా లైసెన్స్డ్కు చెందినవా అనే విషయాలు పరిశీలిస్తున్నాం. అదేవిధంగా ఆ ఫంక్షన్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారా అనే అంశాన్ని తెలుసుకుంటున్నాం. ఒకవేళ ఆ గన్స్ లైసన్స్ లేనివైతే ఆయనపై చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ తెలిపారు.ఆ వీడియోలో, మథీన్ పటేల్ బ్లాక్ కలర్ SUVలో ఎంట్రీ ఇస్తారు. ఆయన అనుచరులు గన్స్తో స్వాగతం పలుకుతారు. అనంతరం వారితో కలిసి గన్స్తో డాన్స్ చేస్తాడు. ఈ సన్నివేశం ఇటీవల రిలీజైన దురంధర్ చిత్రంలోని రెహమాన్ డకైట్ (అక్షయ్ ఖన్నే) ఎంట్రీ లాగానే ప్లాన్ చేశారు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది.A display of “gun culture” by a #Congress leader in #Kalaburagi district has now become a major topic of debate.A Congress leader named Mateen Patel, said to be a close associate of #Afzalpur Assembly constituency MLA #MYPatil, is at the center of the controversy after videos… pic.twitter.com/hFASTKkwuH— Hate Detector 🔍 (@HateDetectors) February 10, 2026 -
ముస్లిం దంపతుల ఔదార్యం
రాయచూరు(కర్ణాటక): ముస్లిం తల్లిదండ్రులు, తమ హిందూ దత్తపుత్రుని పెళ్లిని హిందూ సంప్రదాయ రీతిలో ఘనంగా జరిపించి ఆదర్శంగా నిలిచారు. ఈ అపురూపమైన సంఘటన బెళగావి జిల్లా హుక్కేరి తాలూకా బస్తవాడిలో జరిగింది. వివరాలు.. మెహబూబ్ హసన్ నాయికోడి, నూర్జహాన్ దంపతులు ఈ ఔదార్యాన్ని చాటుకున్నారు. లింగాయత్ వర్గానికి చెందిన శివానంద కాడయ్య దంపతులు అర్ధాంతరంగా చనిపోయారు. వారి కుమారులు సోమశేఖర్ (4), వసంత్ (2)లను మెహబూబ్ దంపతులు చిన్నప్పుడే దత్తత తీసుకుని పోషిస్తున్నారు. మెహబూబ్ ఆర్టీసీ డ్రైవర్గా పనిచేసి రిటైరయ్యారు. అప్పటికే వారికి ఇద్దరు చొప్పున మగపిల్లలు, ఆడపిల్లలు ఉన్నా భారంగా భావించకుండా చదువులు చెప్పించి ప్రయోజకుల్ని చేశారు. సోమశేఖర్ డిగ్రీ పూర్తి చేసి ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తు పూనం అనే యువతిని ప్రేమించాడు. దీంతో కాడ సిద్ధేశ్వర మండపంలో ముస్లిం తల్లిదండ్రులు హిందూ సంప్రదాయ రీతిలో దత్త కుమారుని పెళ్లి వేడుకలను జరిపించారు. మత సమైక్యతకు ఈ సన్నివేశం అద్దం పట్టగా, మెహబూబ్, నూర్జహాన్లను గ్రామస్తులు అభినందించారు. -
10 ఏళ్లుగా అన్నం ముట్టుకోని ‘టార్జాన్’ యువకుడు!
దొడ్డబళ్లాపురం( కర్ణాటక): మనిషి జీవించాలంటే ఆహారం తినాలి. ఇది అందరికీ తెలిసిందే. కానీ కర్ణాటకలోని బెళగావికి చెందిన బుడన్ఖాన్ అలియాస్ బుడన్ మాలిక్ హొసమణి (25) ఆకులు, చిన్న చిన్న మొక్కలు తింటూ బతుకుతున్నాడు. సవదత్తి తాలూకా ఉగరగోళ గ్రామానికి చెందిన ఇతడు 10 ఏళ్లుగా అన్నం ముట్టుకోలేదని స్థానికులు చెబుతున్నారు. అలాగే గ్రామ శివారులోని హెగ్గొళ్ల గుట్ట మీద ఉంటున్నాడు. ఆకలైతే చుట్టుపక్కల చెట్ల ఆకులు, మొక్కలు తింటాడు. దాహం వేస్తే కుంటల్లో నీటిని తాగుతాడు. తరచూ ధ్యానం చేస్తాడు. మనుషులు తినే ఎటువంటి ఆహార పదార్థాలనూ ఇతడు తినడు. కోతులు ఆకులు, కాయలు తిని బతకడం చూసి తానూ నేర్చుకున్నానని, ఇప్పటి వరకూ ఎటువంటి రోగాలు రాలేదని చెబుతున్నాడు. ఇతడి ఆహార పద్ధతి వైద్యులకు సవాలుగా మారింది. ఖాన్ను అందరూ టార్జాన్ అని ముద్దుగా పిలుస్తున్నారు. -
కెనడాలో కర్నాటక వాసి కాల్చివేత
ఒట్టావా/బెంగళూరు: కెనడాలోని టొరంటో నగరంలో ఉన్న షాపింగ్ సెంటర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో కర్నాటక వాసి (37) ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుడిని బ్రాంప్టన్లో ఉండే చందన్ కుమార్ రాజా నందకుమార్గా కెనడా పోలీసులు గుర్తించారు. వుడ్బైన్ షాపింగ్ సెంటర్ వాహన పార్కింగ్ ప్రాంతంలో శనివారం సాయంత్రం 3.30 గంటల సమయంలో ఘటన చోటుచేసుకుంది. కాల్పుల గురించి సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నామని పోలీసులు తెలిపారు. బుల్లెట్ గాయాలతో పడి ఉన్న వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించామని, చికిత్స పొందుతూ అతడు చనిపోయాడన్నారు. చందన్కుమార్ వాహనం కిటికీల అద్దాలకు బుల్లెట్ రంధ్రాలు పడగా, డ్రైవర్ వైపు ఉన్న కిటికీ అద్దం పూర్తిగా ధ్వంసమైంది. కాగా, కాల్పులకు పాల్పడిన వ్యక్తుల వివరాలు తెలియనప్పటికీ, దీనిని లక్షిత ఘటనగా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇంటికి రావాలని చెబుతున్నా...వినలేదు:తల్లిదండ్రులు చందన్ మరణవార్త విని కర్నాటక రాజధాని బెంగళూరులో శివారు నెలమంగళలో ఉంటున్న అతడి తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. ఇలాంటిది జరుగుతుందని తాము కలలో సైతం ఊహించలేదన్నారు. దాదాపు ఏడేళ్ల నుంచి కెనడాలో ఉంటున్న చందన్ను ఇంటికి రావాలని ఎప్పటి నుంచో కోరుతున్నామని, కానీ వినిపించుకోలేదని తండ్రి నందన్ కుమార్ వాపోయారు. అంతిమ సంస్కారం జరిపేందుకు మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సాయం చేయాలని భారత ప్రభుత్వాన్ని ఆయన కోరారు. చందన్ టొరంటోలో ఇటీవలే కన్నడ అసోసియేషన్ను స్థాపించారని, బహుశా ఇదే కక్షతో అతడిని బలి తీసుకుని ఉంటారని తల్లి అనుమానం వ్యక్తం చేశారు. -
కేఎల్ రాహుల్ అద్భుత శతకం
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తానెంత విలువైన ఆటగాడో మరోసారి నిరూపించుకున్నాడు. ముంబైతో జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో అద్భుతమైన శతకం సాధించి, తన జట్టుకు (కర్ణాటక) అపురూప విజయాన్ని అందించాడు. ఈ శతకం ఛేదనల్లో అత్యుత్తమమైన ఇన్నింగ్స్లలో ఒకటిగా మిగిలిపోనుంది. 325 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాహుల్ అద్వితీయమైన సమయస్పూర్తి ప్రదర్శించి చారిత్రక శతకం బాదాడు. ఈ ఇన్నింగ్స్లో అతను ఏ మాత్రం సహనం కోల్పోకుండా బ్యాటింగ్ చేసి విజయం ఖరారయ్యే వరకు క్రీజ్లో ఉన్నాడు. 182 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 130 పరుగులు చేసి ఔటయ్యాడు. స్మరణ్ రవిచంద్రన్తో పాటు రాహుల్ నెలకొల్పిన 147 పరుగుల భారీ భాగస్వామ్యం మ్యాచ్ను కర్ణాటకవైపు మళ్లించింది.స్మరణ్ అజేయమైన అర్ద శతకం (83) సాధించి, కర్ణాటకను విజయతీరాలకు చేర్చాడు. విద్యాధర్ పాటిల్ (31 నాటౌట్) స్మరణ్కు అండగా నిలిచాడు. 325 పరుగుల భారీ లక్ష్యాన్ని కర్ణాటక 73.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. ఫిబ్రవరి 15 నుంచి మొదలయ్యే తొలి సెమీఫైనల్లో కర్ణాటక ఉత్తరాఖండ్తో తలపడుతుంది.కర్ణాటకతో మ్యాచ్లో ముంబై తొలుత బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్లో 120 పరుగులకే చాపచుట్టేసింది. కావేరప్ప, ప్రసిద్ద్ కృష్ణ, శ్రేయస్ గోపాల్ తలో 3 వికెట్లు తీసి ముంబైని దెబ్బేశారు. ముంబై ఇన్నింగ్స్లో అఖిల్ హెర్వాద్కర్ (60) ఒక్కడే రాణించాడు.అనంతరం కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 173 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు తరఫున మయాంక్ అగర్వాల్ (92) ఒక్కడే రాణించాడు. మోహిత్ అవస్తి, తుషార్ దేశ్పాండే తలో 4 వికెట్లు తీశారు.ముంబై రెండో ఇన్నింగ్స్లో 377 పరుగులకు ఆలౌటైంది. ఆకాశ్ ఆనంద్ (70) అర్ద సెంచరీతో రాణించగా.. తనుశ్ కోటియన్ (48 నాటౌట్), తుషార్ దేశ్పాండే (47), ముషీర్ ఖాన్ (49), యశస్వి జైస్వాల్ (36), అఖిల్ హెర్వాద్కర్ (33), సిద్దేశ్ లాడ్ (25), సూర్యాంశ్ షేడ్గే (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కర్ణాటక బౌలర్లలో విద్యాదర్ పాటిల్, కావేరప్ప తలో 2, శిఖర్ షెట్టి 3, ప్రసిద్ద్ కృష్ణ, శ్రేయస్ గోపాల్ చెరో వికెట్ తీశారు. -
బెంగళూరులో నాటకీయ పరిణామం.. తేజస్వీ సూర్య అరెస్ట్!
బెంగళూరు: కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కర్ణాటకలో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటకలో మెట్రో చార్జీల పెంపు వ్యవహారంపై బీజేపీ నేతలు నిరసనలకు దిగారు. ఈ క్రమంలో నిరసనల్లో పాల్గొన్న బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపటి తర్వాత తేజస్వీని వదలిలేశారు. దీంతో, కాంగ్రెస్ సర్కార్ తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.బీజేపీ మెట్రో చార్జీల పెంపుపై ప్రతిపక్ష బీజేపీ నేతలు నిరసనలకు దిగారు. ఆర్వీ రోడ్ మెట్రో స్టేషన్లో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య, బీజేపీ నేతలు నిరసనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తేజస్వీ సూర్య ఖాళీ ట్రంక్ పెట్టెలు పట్టుకుని నిరసనలకు దిగారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. తేజస్వీ సూర్యను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, తేజస్వీ సూర్యను వదిలిపెట్టారు. ఈ క్రమంలో తేజస్వీ మాట్లాడుతూ.. అరెస్ట్ చేయడం వల్ల నా నోరు మూయించలేరు. కర్ణాటక ఆర్థిక పరిస్థితి ఏంటో ప్రజలకు తెలియాలి. బడ్జెట్ సమావేశంలో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం ఒత్తిడి వల్లే రెండోసారి మెట్రో చార్జీల పెంపు ఆగిపోయింది అని చెప్పుకొచ్చారు. అయితే, నిరసనల్లో పాల్గొనవద్దని ప్రభుత్వం తేజస్వీ సూర్యకు నిన్ననే నోటీసులు ఇచ్చింది. అయినప్పటికీ నిరసనల్లో పాల్గొనడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. VIDEO | BJYM president Tejasvi Surya (@Tejasvi_Surya), amid protests against the Bengaluru Metro fare hike says, "Metro fare hike has been put on hold for the second time due pressure from Union government. The state government should release a white paper on the economic… pic.twitter.com/WNn1yIrVdq— Press Trust of India (@PTI_News) February 9, 2026అంతకుముందు, సిద్దరామయ్య ప్రభుత్వం బెంగళూరులో నమ్మ మెట్రో రైలు ప్రయాణ ఛార్జీలు ఐదు శాతం పెంచేందుకు పచ్చజెండా ఊపింది. బీఎంఆర్సీఎల్ చేసిన ఈ ప్రతిపాదనను అంగీకరించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. కొత్త ఛార్జీలు నేటి నుంచి(ఫిబ్రవరి 9) అమలు చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం కనీస ఛార్జీ రూ.10, గరిష్ఠ ఛార్జీ రూ.90 అమలులో ఉన్న విషయం తెలిసిందే. పెంచిన ఛార్జీల ప్రకారం కనీస ఛార్జీ రూపాయి నుంచి రూ.5 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ నిరసనలకు దిగింది. అనంతరం, కేంద్రమంత్రి మనోహర్లాల్ ఖట్టర్కు స్థానిక బీజేపీ నేతలు లేఖలు రాశారు. దీంతో, చార్జీల పెంపు తాత్కాలికంగా నిలిపివేయాలని బీఎంఆర్సీఎల్ను ఆదేశించారని తెలిపారు. దీంతో, చార్జీల పెంపు ప్రక్రియ ఆగిపోయింది. అయితే, ఇప్పుడు చార్జీలను పెంచకపోయినా, మార్చిలో గాని ఏప్రిల్లో మాత్రం బాదుడు తప్పదని అధికారులు చెబుతున్నట్టు తెలుస్తోంది. ఆ పెంపు 100 శాతం ఉన్నా ఆశ్చర్యం వద్దని మెట్రో వర్గాలు చెప్పడం విశేషం.#WATCH | Karnataka: BJP MP Tejasvi Surya was detained (now released) by the police today near Jayanagar Metro station in Bengaluru when he again tried to stage a protest in front of the metro station. He was served a notice yesterday for staging a protest at the Metro station… pic.twitter.com/LYtAjDKpPH— ANI (@ANI) February 9, 2026 -
కర్ణాటకలో ఏపీ కూలీల మృతి.. జగన్ దిగ్భ్రాంతి
-
కర్ణాటకలో కూలిన విమానం
సాక్షి, బళ్లారి/బనశంకరి: కర్ణాటకలో చిన్నపాటి విమానం కూలిపోయింది. విజయపుర (బిజాపుర) జిల్లా బబళేశ్వర తాలూకా మంగళూరు వద్ద పొలాల్లో రెండు సీట్లు ఉన్న ఈ శిక్షణ విమానం కూలింది. ఇది రెడ్బర్డ్ పైలట్ ట్రైనింగ్ ఏవియేషన్కు చెందినదని తెలిసింది. ఈ సంస్థ విమాన పైలట్లకు శిక్షణ ఇస్తుంది. ఆదివారం శిక్షణలో భాగంగా ఓ పైలట్, ట్రైనీతో కలిసి కలబుర్గి నుంచి బెళగావికి బయలుదేరింది. అయితే మార్గంమధ్యలో విమానంలో యాంత్రిక లోపం తలెత్తడంతో పైలట్ అత్యవసరంగా దించేందుకు యతి్నంచాడు.పంట కోసిన ఓ మొక్కజొన్న పొలంలో విమానం దిగుతూ పల్టీ కొట్టి పడిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ కెప్టెన్ కునాల్ మల్హోత్రా, ట్రైనీ పీఆర్ గౌతం శంకర్కి గాయాలయ్యాయి. కొంతసేపటికి స్థానికులు, పోలీసులు చేరుకుని వారిని విజయపురలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. విమానం ఆకాశం నుంచి గిరగిరా తిరుగుతూ పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ ధాటికి విమానం మూడు ముక్కలుగా దెబ్బతింది. గాయపడిన వారు నడుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
కర్ణాటక రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: కర్ణాటకలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన నలుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని శ్రీనివాసపురం వద్ద ఈ ప్రమాదం జరగ్గా.. ఏపీకి చెందిన నలుగురు కూలీలు మరణించడం విషాదకరమని వైయస్ జగన్ అన్నారు. మృతులంతా అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందినవారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు కూడా. మృతుల కుటుంబాలకు జగన్.. ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. -
రాణించిన కేఎల్ రాహుల్
ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో కర్ణాటక జట్టు గెలుపు దిశగా పయనిస్తుంది. మరో 212 పరుగులు చేస్తే ఆ జట్టు విజయం సాధిస్తుంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. మరో రోజు ఆట మిగిలి ఉంది. కేఎల్ రాహుల్ (60) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ సాధించి క్రీజ్లో ఉన్నాడు. అతనికి జతగా కరుణ్ నాయర్ (9) ఉన్నాడు. వీరిద్దరూ క్రీజ్లో కుదురుకుంటే కర్ణాటక గెలుపు నల్లేరుమీద నడకే. మూడో రోజు ఆట ముగిసే సమయానికి కర్ణాటక రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (3), ఇన్ ఫామ్ బ్యాటర్, కెప్టెన్ దేవదత్ పడిక్కల్ (39) వికెట్లు కోల్పోయింది. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, తనుశ్ కోటియన్ తలో వికెట్ తీశారు.అంతకుముందు ముంబై రెండో ఇన్నింగ్స్లో 377 పరుగులకు ఆలౌటైంది. ఆకాశ్ ఆనంద్ (70) అర్ద సెంచరీతో రాణించగా.. తనుశ్ కోటియన్ (48 నాటౌట్), తుషార్ దేశ్పాండే (47), ముషీర్ ఖాన్ (49), యశస్వి జైస్వాల్ (36), అఖిల్ హెర్వాద్కర్ (33), సిద్దేశ్ లాడ్ (25), సూర్యాంశ్ షేడ్గే (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కర్ణాటక బౌలర్లలో విద్యాదర్ పాటిల్, కావేరప్ప తలో 2, శిఖర్ షెట్టి 3, ప్రసిద్ద్ కృష్ణ, శ్రేయస్ గోపాల్ చెరో వికెట్ తీశారు.కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 173 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు తరఫున మయాంక్ అగర్వాల్ (92) ఒక్కడే రాణించాడు. మోహిత్ అవస్తి, తుషార్ దేశ్పాండే తలో 4 వికెట్లు తీశారు. దీనికి ముందు ముంబై తొలి ఇన్నింగ్స్లో 120 పరుగులకే చాపచుట్టేసింది.కావేరప్ప, ప్రసిద్ద్ కృష్ణ, శ్రేయస్ గోపాల్ తలో 3 వికెట్లు తీసి ముంబైని దెబ్బేశారు. ముంబై ఇన్నింగ్స్లో అఖిల్ హెర్వాద్కర్ (60) ఒక్కడే రాణించాడు. -
అమెరికా ప్రయాణంలో కర్ణాటక మహిళకు షాక్.. భారీ దొంగతనం
అబుదాబి: విమాన ప్రయాణంలో అమెరికాకు చెందిన ఓ వృద్ధురాలికి షాకింగ్ ఘటన ఎదురైంది. విమాన ప్రయాణం సందర్బంగా తన లాగేజీలోని బంగారం, వజ్రాలు మాయం కావడంతో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బెంగళూరు పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..కర్ణాటకలోని ధార్వాడ్కు చెందిన శాంత రమేష్ కాశింకుంటి (62) కుటుంబ సభ్యులు.. నవంబర్ 15, 2025న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి అమెరికాకు ప్రయాణించారు. బెంగళూరు నుండి ఆకాష్ ఎయిర్లైన్స్లో అబుదాబి చేరుకున్నారు. అయితే, బెంగళూరు విమానాశ్రయంలోని చెక్-ఇన్ కౌంటర్లో అన్ని పత్రాలను ధృవీకరించిన తర్వాత వారు తమ లగేజీని అప్పగించారు. అయితే, వారు అబుదాబి విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత తమ బ్యాగ్లోని విలువైన వస్తువులు పోయినట్టు వారు గుర్తించారు.కాగా, తమ సూట్కేస్కు డ్యామేజీ లేకుండా, ఓపెన్ చేయకుండానే తమ వస్తువులు మాయం కావడంపై ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇక, వారి లగేజీలో 790 గ్రాముల బంగారం, రూ.8 లక్షల విలువైన వజ్రాభరణాలు, అమెరికన్ డాలర్లు ఉన్నట్టు బాధితులు చెప్పుకొచ్చారు. వెంటనే ఈ విషయాన్ని అబుదాబి అధికారులకు, ఆకాష్ ఎయిర్లైన్స్కు సమాచారం ఇచ్చామని, కానీ సరైన స్పందన రాలేదని వారు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత జనవరి 7, 2026న భారత్కు తిరిగి వచ్చిన అనంతరం బాధితులు కర్ణాటక పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో బెంగళూరు విమానాశ్రయ పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినప్పటికీ ఎటువంటి ఆధారాలు లభించలేదు. భద్రతా సిబ్బందిని ప్రశ్నించడంలో ఎటువంటి పురోగతి లేకపోవడంతో పోలీసులు జనవరి 31న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
గడ్డంలో ‘ఏడు’ గింజల రహస్యం.. ఇది చిన్నకథ కాదు..
పొద్దున్నే లేవగానే.. ఓ కప్పు కాఫీ తాగడం దాదాపుగా అందరి దినచర్యలో భాగమే..! భారత్లో కాఫీ బిజినెస్ టర్నోవర్ 5 బిలియన్ అమెరికా డాలర్ల వరకు ఉంటుందని అంచనా..! అయితే.. ఆ కాఫీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రశ్నకు ఎవరైనా తమిళనాడులోని నీలగిరి తోటలు లేదా కేరళలోని కాఫీ ఎస్టేట్లు లేదా కర్ణాటకలోని చిక్కమగళూరు తోటల పేరు చెప్పేస్తారు..! ఇప్పటికి అది నిజమే అయినా.. నిజానికి కాఫీ పుట్టింది భారత్లో కాదు. డచ్, బ్రిటిష్ కాలంలో కాఫీ తోటలు బాగా అభివృద్ధి చెందినప్పటికీ.. అసలు భారత్కు కాఫీ గింజలను తెచ్చిన ఓ సూఫీ సాధువు. ఆయన కూడా భారత్లో కాఫీ పరిశ్రమ బిలియన్ల డార్లకు చేరుతుందని అప్పట్లో ఊహించి ఉండరు. ఆ కథేంటో తెలుసుకోవాలని ఉందా?? అయితే.. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి..! భారత్లో కాఫీ కథ సూఫీ సాధువు అయిన బాబా బుడాన్తో మొదలవుతుంది. 1600లలో ఆయన హజ్ యాత్రకు వెళ్లారు. మక్కా నుంచి తిరిగి వస్తున్న సమయంలో యెమెన్లోని అల్-మక్కా నౌకాశ్రయంలో కాఫీ రుచి చూశారు. అంతే.. ఏడు కాఫీ గింజలను తన గడ్డంలో దాచి, తీసుకువచ్చారు. కర్ణాటకలోని చిక్కమగళూరు ప్రాంతంలో నిత్యం చలి, తేమతో ఉండే చంద్రగిరి కొండల్లో వాటిని నాటారు. అంతే.. ఆ ఏడు బీజాలే ‘ఇంతింతై.. వటుడింతై..’ అన్నట్లుగా భారతదేశమంతటా విస్తరించాయి. అప్పటి నుంచి చంద్రగిరి కొండల్లోని బాబా బుడాన్ కాఫీ మొక్కలు నాటిన కొండకు ఆయన పేరే పెట్టారు. ఆ కొండను బాబా బుడాన్ గిరి అని పిలుస్తారు. దత్తాత్రేయ పీఠానికి సమీపంలో ఈ కొండ ఉంది. ఆనవాయితీ ప్రకారం ఇప్పటికీ ఇక్కడి కాఫీ రైతులు కొత్త పంట రాగానే.. బాబా బుడాన్ దర్గా వద్ద కాఫీ గింజలను సమర్పిస్తారు. అలా.. భారత్లో కాఫీకి జన్మస్థలంగా చిక్కమగళూరును పిలుస్తారు. సక్కరపట్నం రాజు రుక్మంగడ తన చిన్నకుమార్తెకు ఈ గిరులను బహుమతిగా ఇచ్చారు. చిన్న కూతురు అంటే.. కన్నడంలో చిక్క మగళు అని అర్థం. అందుకే.. ఈ ప్రాంతానికి చిక్కమగళూరు అని పేరు వచ్చింది. ‘కర్ణాటక కాఫీ ల్యాండ్కు స్వాగతం’ అనే స్వాగత తోరణం ఈ జిల్లా ప్రవేశానికి ముందు కనిపిస్తుంది.చిక్కమగళూరు పశ్చిమ కనుమల్లో ఉంటుంది. ఇక్కడి ముల్లయనగిరి అత్యంత ఎత్తులో ఉంటుంది. రోడ్ల వెంబడి సిల్వర్ ఓక్, రోజ్వుడ్, ప్లమ్, అత్తిచెట్లు కనిపిస్తాయి. ఈ ప్రాంతాల్లోని కాఫీ తోటల్లో అరేబికా, రోబస్టా వంటి రకాలను పండిస్తారు. ఫిల్టర్ కాఫీకి అరేబికా, ఇన్స్టంట్ కాఫీకి రోబస్టాను వాడుతారు. అరేబికా కంటే రోబస్టా కొంత చవక. రోబస్టాను లోయల్లోని లోతట్టు ప్రాంతాల్లో కూడా సాగు చేయవచ్చు. అరేబికా అలా కాదు.. ఏటవాలు ప్రాంతాల్లోనే సవ్యంగా పండుతుంది. వీటితోపాటు.. ఇండోనేషియా, ఫిలిప్పైన్స్లో కనిపించే లిబ్రికా, ఆగ్నేయాసియాలోని ఎక్సెల్సా వేరియంట్లు కూడా ఇక్కడ సాగవుతాయి. అసలు ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టగానే వచ్చే కాఫీ పరిమళంతో.. ఓ స్ట్రాంగ్ కాఫీ తాగాలని ఎవరికైనా జిహ్వచాపల్యం కలగకమానదనడంలో అతిశయోక్తిలేదు. ఘాట్ రోడ్లలో.. ఇరువైపులా కాఫీ షాపులుంటాయి. అలా చిక్కమగళూరులో 1600లలో ప్రవేశించిన కాఫీ.. క్రమంగా కర్ణాటకలోని ఇతర ప్రాంతాలు, తమిళనాడులోని నీలగిరి, కేరళలోని వయనాడ్కు వ్యాప్తి చెందాయి. దక్షిణ కర్ణాటకలోని కొడుగులో 1856లో ప్రవేశించిన కాఫీ.. ఇప్పుడు 11,331 హెక్టార్లలో సాగవుతోంది. బ్రిటిషర్ల కాలంలో మొత్తం 200 కాఫీతోటలు ఉండేవి. 1825లో కేరళలోని వయనాడ్లో కాఫీ పంటలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ముర్డోక్ బ్రౌన్ పండించిన కాఫీ రకాన్ని ‘అంజరకాండి బ్రౌన్’ అని పిలిచేవారు. 1843లో కాక్బర్న్ షెవ్రోలెట్ ఓ కాఫీ తోటను ప్రారంభించారు. 1860లలో ఆర్నాల్డ్ నెల్లియంపతిలో పర్డేహ్యారీ ఎస్టేట్ మొదలైంది. 1860 నాటికి దక్షిణ భారతదేశంలో కాఫీ సాగు గరిష్ఠ స్థాయికి చేరుకుంది. 1860లలో అరేబికా ప్రధాన సాగుగా ఉండేది. 1900 సంవత్సరం నుంచి ఆఫ్రికా నుంచి వచ్చిన రోబస్టా ఊపు ప్రారంభమైంది. ఆ తర్వాతి కాలంలో ఆంధ్రప్రదేశ్కు కూడా కాఫీతోటలు విస్తరించాయి. నిజానికి అరేబికా పంటకు కాండంతొలిచే పురుగు బెడద ఉండడంతో.. రైతులు అప్పట్లో రోబస్టా వైపు మొగ్గుచూపారు. అప్పట్లో బ్రిటిషనర్లు ఇక్కడ పండే కాఫీ గింజలను ఐరోపా దేశాలకు ఎగుమతి చేసేవారు. ఇప్పటికీ దేశీయ అవసరాలను తీర్చడంతోపాటు.. కాఫీ గింజల ఎగుమతులు కొనసాగుతున్నాయి. భారతీయ కాఫీలో 70శాతం కర్ణాటకలోని కొడుగు, చిక్కమగళూరు, హసన్లలో ఉత్పత్తి అవుతుంది. ఏటా 2 లక్షల మెట్రిక్ టన్నుల కాఫీ ఉత్పత్తి అవుతుండగా.. అందులో సింహభాగం.. అంటే.. లక్షా ముప్ఫై వేల టన్నులు విదేశాలకు ఎగుమతి అవుతుంది. అలా మన దేశంలో కాఫీ బిజనెస్ 5 బిలియన్ డాలర్ల దాకా చేరుకుంది. కాఫీడే, స్టార్ బక్స్, మోచా, బారిస్టా, కోస్టా, థర్డ్ వేవ్ కాఫీ వంటి డిజైనర్ కాఫీ స్టూడియోలు సైతం లాభాలను గడించాయి. ఈ కథనం మీకు నచ్చినట్లైతే.. ఈ వీడియోను లైక్ చేయండి.. షేర్ చేయండి.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. -
తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పడిక్కల్ విధ్వంసకర శతకం
కర్ణాటక బ్యాటర్ దేవదత్ పడిక్కల్ దేశవాలీ క్రికెట్లో అరివీర భయంకర ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఇటీవల విజయ్ హజారే వన్డే టోర్నీలో 9 ఇన్నింగ్స్ల్లో 90కి పైగా సగటుతో 4 సెంచరీల సాయంతో 725 పరుగులు చేసిన అతను.. తాజాగా రంజీ ట్రోఫీలో పంజాబ్పై విధ్వంసకర శతకంతో చెలరేగాడు. క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో పడిక్కల్ ఉగ్రరూపం దాల్చాడు. 40 ఓవర్లలో 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 85 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 120 పరుగులు చేసి, తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్లో పడిక్కల్ కర్ణాటక కెప్టెన్గానూ వ్యవహరించాడు. కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే సెంచరీ సహా మ్యాచ్ను గెలిపించి చిరస్మరణీయం చేసుకున్నాడు. ఛేదనలో పడిక్కల్కు మయాంక్ అగర్వాల్ (53), శ్రేయస్ గోపాల్ (33) సహకరించారు. ఈ ఇన్నింగ్స్లో టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ 13 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. పడిక్కల్ విధ్వంసకర శతకంతో కదంతొక్కడంతో కర్ణాటక 27.5 ఓవర్లలోనే (5 వికెట్లు కోల్పోయి) లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ బౌలర్లలో అన్మోల్జీత్ సింగ్ 3 వికెట్లు తీయగా.. సుఖ్దీప్, ఎమన్జోత్ చహల్ తలో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు పంజాబ్ తొలి ఇన్నింగ్స్లో 256 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఉదమ్ సహారన్ 93 పరుగులతో రాణించాడు. పంజాబ్ ఇన్నింగ్స్లో సహారన్ మినహా ఎవ్వరూ రాణించలేదు. అన్మోల్ప్రీత్ (44), అభిజీత్ (33), హర్ప్రీత్ బ్రార్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కర్ణాటక బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, శ్రేయస్ గోపాల్ తలో 3 వికెట్లు తీయగా.. శిఖర్ షెట్టి 2, విధ్యాదర్ పాటిల్, మొహిసిన్ ఖాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.దీనికి ముందు కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 316 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ గోపాల్ (77), కేఎల్ రాహుల్ (59) అర్ద సెంచరీలతో రాణించారు. మయాంక్ అగర్వాల్ (32), విధ్యాదర్ పాటిల్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ 4, సుఖ్దీప్ 3, అన్మోల్ 2, చహల్ ఓ వికెట్ తీశారు. అంతకుముందు పంజాబ్ తొలి ఇన్నింగ్స్లో 309 పరుగులకు ఆలౌటైంది. అభిజీత్ (81), చహల్ (83) అర్ద సెంచరీలతో రాణించగా.. సహారన్ (44) ఓ మోస్తరు స్కోర్తో పర్వాలేదనిపించాడు. విధ్యాదర్ పాటిల్ 4, శ్రేయస్ గోపాల్ 3, మొహిసిన్ ఖాన్ 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు. -
బెంగళూరు విషాదం: రియల్ ఎస్టేట్ టైకూన్ సీజర్ రాయ్ ఆత్మహత్య
బెంగళూరు: ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ టైకూన్, కాన్ఫిడెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు సీజర్ రాయ్(డాక్టర్ చిరియాంకందత్ జోసెఫ్ రాయ్) ఆత్మహత్య చేసుకున్నారు. బెంగళూరులోని రిచ్మండ్ టౌన్లోని తన నివాసంలో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించిన సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వ్యాపార పరిశ్రమ వర్గాలను ఈ సంఘటన తీవ్రంగా కలచివేసింది.సీజర్ రాయ్) బెంగళూరులోని ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త. 2005లో ఆయన కాన్ఫిడెంట్ గ్రూప్ను స్థాపించారు. ఈ సంస్థ రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటాలిటీ, ఎడ్యుకేషన్ రంగాల్లో విస్తరించింది.అప్పులు లేకుండా వ్యాపారం నడిపిన మోడల్తో ప్రసిద్ధి గాంచారు సీజర్ రాయ్. : రియల్ ఎస్టేట్ రంగంలో విశ్వసనీయత, విస్తృత నెట్వర్క్ తో వ్యాపార వర్గాల్లో గుర్తింపు పొందారు. ఈరోజు ఐటీ శాఖ ఆయన నివాసంలో దాడులు చేస్తున్న సమయంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన లైసెన్స్డ్ రివాల్వర్తో కాల్చుకున్నారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన్ను నారాయణ మల్టిస్పెషాలిటీ హాస్పిటల్లో చేర్పించగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. -
సత్తా చాటిన కేఎల్ రాహుల్
టీమిండియా మోస్ట్ ప్రామిసింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దేశవాలీ క్రికెట్లోనూ సత్తా చాటుతున్నాడు. జాతీయ విధులకు దూరంగా ఉండటంతో రంజీ బాట బట్టిన ఈ కర్ణాటక వికెట్కీపర్ బ్యాటర్.. పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో (87 బంతుల్లో 59; 9 ఫోర్లు) మెరిశాడు. క్వార్టర్ ఫైనల్కు చేరాలంటే కర్ణాటక ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాలి.Highlights of KL Rahul’s 59 (87) in the Ranji Trophy. pic.twitter.com/AeV5DXI2aQ— Mufaddal Vohra (@mufaddal_vohra) January 30, 2026కీలకమైన ఈ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన రాహుల్.. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్తో కలిసి తొలి వికెట్కు 102 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. రాహుల్, మయాంక్ రాణించినా, ఈ మ్యాచ్లో కర్ణాటక ఎదురీదుతోంది. రెండో రోజు టీ విరామం సమయానికి సగం వికెట్ల నష్టానికి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు చేరుకోవాలంటే ఇంకా 110 పరుగులు చేయాల్సి ఉంది.శ్రేయస్ గోపాల్ (17), కృతిక్ కృష్ణ (20) కర్ణాటకను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ ఔటయ్యాక కర్ణాటక స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్తో కెప్టెన్గా అరంగేట్రం చేసిన దేవదత్ పడిక్కల్, స్మరణ్ రవిచంద్రన్ తలో 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. వన్డౌన్లో వచ్చిన కేవీ అనీశ్ (32) క్రీజ్లో కుదురుకున్న సమయంలో ఔటయ్యాడు. హర్ప్రీత్ బ్రార్ 4 వికెట్లు తీసి కర్ణాటకను దారుణంగా దెబ్బకొట్టాడు. ఎమన్జోత్ సింగ్ చహల్ కీలకమైన మయాంక్ అగర్వాల్ వికెట్ తీశాడు.అంతకుముందు పంజాబ్ తొలి ఇన్నింగ్స్లో 309 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అభిజీత్ గార్గ్ (81), ఎమన్జోత్ సింగ్ చహల్ (83) అర్ద సెంచరీలతో రాణించారు. కెప్టెన్ ఉదయ్ సహారన్ (44) ఓ మోస్తరుగా రాణించగా.. అన్మోల్ మల్హోత్రా (25), ఆయుశ్ గోయల్ (23), సుఖ్దీప్ బజ్వా (20) రెండంకెల స్కోర్లు చేశారు. కర్ణాటక బౌలర్లలో విద్యాదర్ పాటిల్ 4, శ్రేయస్ గోపాల్ 3, మొహిసిన్ ఖాన్ 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు. -
ప్రియుడితో నవ వధువు జంప్.. భర్త, మేనమామ ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం (కర్ణాటక): సమాజంలో కట్టుబాట్లకు ఏమాత్రమూ విలువ లేకుండా పోతోంది. అనైతిక మార్గాలలో ప్రయాణిస్తూ కాపురాలను నాశనం చేసుకోవడం అధికమైంది. ఈ తరహాలో దావణగెరె జిల్లా గుమ్మనూరులో వివాహం జరిగిన రెండు నెలలకే నవ వధువు ప్రియునితో వెళ్లిపోవడంతో అవమానం భరించలేని భర్త సూసైడ్ నోట్ రాసి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో పోలీసులు నిందితురాలు సరస్వతిని తాజాగా అరెస్టు చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రెండు నెలల క్రితమే హరీష్కు సరస్వతిని ఇచ్చి కుటుంబ సభ్యులు ఘనంగా పెళ్లి చేశారు. యువతి మేనమామ రుద్రేశ్ (36) ఈ సంబంధాన్ని ఖాయం చేసి దగ్గరుండి వివాహం చేయించారు. అయితే, ఇటీవల ఆమె గుడికి వెళ్లి వస్తానని భర్తకు చెప్పి ప్రియుడు శివకుమార్తో పారిపోయింది. అంతకుముందే ఆమె భర్త, అత్తమామలు తనను వేధిస్తున్నారని స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది.వరుసగా మరొకరు..ఇది తట్టుకోలేని హరీష్ గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని తనువు చాలించారు. భార్య, ఆమె ప్రియుడు, ఆమె బంధువులు గణేశ్, అంజినమ్మ తనను బెదిరించి వేధించారని, తన ఆత్మహత్యకు వారే కారణమని హరీష్ సూసైడ్ నోట్లో రాశాడు. ఈ ఘోరాలను చూసిన రుద్రేశ్ ఆవేదన చెంది పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వార్త రాష్ట్రంలో సంచలనం కలిగించింది. ఇద్దరి ఆత్మహత్యలకు కారణమైన హంతకులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సరస్వతిని దావణగెరెలోని ఎలెబేతూరులో బంధువుల ఇంట్లో ఉండగా అరెస్టు చేశారు. ప్రియుడు పరారీలో ఉన్నాడు. సరస్వతి చేసిన చిన్న తప్పిదం కారణంగా మూడు కుటుంబాల్లో విషాదం మిగిలింది. -
బర్త్డే, మ్యారేజ్డే నాడు పోలీసులకు ప్రత్యేక సెలవు
పోలీసు సిబ్బందికి విధులు నిరంతరాయంగా ఉండేవే. వాళ్లకు సెలవులు, విశ్రాంతి, వీకాఫ్లు అనే వాటిపై చర్చ కూడా నిరంతరం జరిగేదే. ప్రభుత్వాలు ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన దాఖలాలు అరుదనే చెప్పాలి. అయితే.. ఇక్కడ ఓ రాష్ట్రంలో పోలీసులకు ఇక నుంచి ప్రత్యేక సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. పోలీసులకు వాళ్ల, వాళ్ల కుటుంబ సభ్యుల పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం తదితర రోజుల్లో సెలవు తీసుకోవచ్చని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. నిరంతరం విధుల్లో ఉంటూ కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నారని ఈ వెసులుబాటు ఇచ్చింది. దీనివల్ల వారిపై పనిభారం, మానసిక ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమాల కోసం పోలీసు సిబ్బంది సెలవు కోరితే తప్పకుండా మంజూరు చేయాలని డీజీపీ డాక్టర్ సలీం గురువారం ఉత్తర్వులు ఇచ్చారు.ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ప్రత్యేక లీవ్ పాలసీ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించబడిన ఉదాహరణలు లేవు. కాబట్టి.. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాల రోజున పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా సెలవు ఇవ్వడం(కాజ్యువల్ లీవ్) అనే విధానం కర్ణాటకలోనే మొదటిసారి అమలులోకి వచ్చింది.పోలీస్ సేవ చాలా కఠినమైనది, కుటుంబానికి సమయం కేటాయించడం కష్టమవుతోంది. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు వంటి వ్యక్తిగత సందర్భాల్లో సెలవు ఇవ్వడం ద్వారా సిబ్బంది భావోద్వేగపరంగా రీఛార్జ్ అవ్వగలరు. కుటుంబంతో కొంత సమయం గడపగలరు. ఇది మానసిక ఒత్తిడి తగ్గించడంలో, ఉత్సాహాన్ని పెంచడంలో, ఉద్యోగ సంతృప్తి, ఉత్పాదకతను మెరుగుపరచడంలో సహాయపడుతుందని ఆ సర్క్యులర్లో పేర్కొన్నారు.రాష్ట్రంలోని అన్ని యూనిట్ హెడ్లు ఈ ఆదేశాన్ని అమలు చేసి, సిబ్బంది కోరినప్పుడు సెలవు ఇవ్వాలని కర్ణాటక డీజీపీ ఆదేశించారు. ఈ చర్యను మానవీయమైన నిర్ణయంగా వర్ణిస్తూ.. పోలీస్ సిబ్బంది చేసిన త్యాగాలను గుర్తించడం, విశ్వాసాన్ని పెంపొందించడం, శాఖ పట్ల నిబద్ధతను బలపరచడం లక్ష్యంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
కాలి బూడిదైన బస్సు.. స్పాట్ లో 40 మంది
-
మంటల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
బెంగళూరు: రాష్ట్రంలో ప్రైవేటు బస్సులు ఏ క్షణంలో ప్రమాదానికి గురవుతాయోనని జనం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది. తాజాగా కర్ణాటక శివమొగ్గ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు అగ్నికి ఆహుతి అయ్యింది. హోసనగర నుంచి బెంగళూరుకు వెళుతున్న ప్రైవేటు బస్సు అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన హోసనగర తాలూకా రిప్పన్పేట పోలీసు స్టేషన్ పరిధిలో అరసాళు–సూడురు గ్రామాల మధ్య జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. పది మందికి గాయాలు కావడంతో శివమొగ్గ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పొగ.. మంటలు అన్నపూర్ణేశ్వరి ప్రైవేటు స్లీపర్ బస్సు హోసనగర నుంచి బెంగళూరుకు బయలుదేరింది. ఈ క్రమంలో బస్సులో హఠాత్తుగా పొగలు వచ్చి మంటలు రేగాయి. దీంతో ఆందోళన చెందిన ప్రయాణికులు హాహాకారాలు చేశారు. బస్సు డ్రైవర్ రోడ్డు పక్కన చెట్టును ఢీ కొట్టించి బస్సును నిలిపాడు. బస్సు అత్యవసర తలుపు, కిటికీల ద్వారా ప్రయాణికులు బయటకు దూకారు. క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించాయి. ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. బస్సులోని ఇద్దరు డ్రైవర్లకు కూడా స్వల్ప గాయాలు తగిలాయి, పోలీసులు వారిని ఘటనపై విచారిస్తున్నారు. రవాణా, ఫైర్ అధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు. -
బెంగళూరులో భారీ చోరీ.. కిలేడీ జంట ఎక్కడ?
బెంగళూరు: కర్ణాటకలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ప్రముఖ బిల్డర్ ఇంట్లో పని మనుషులుగా చేరిన నేపాలీ జంట.. ఆ ఇంటికే కన్నం పెట్టారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. సుమారు రూ. 18 కోట్ల విలువైన ఆభరణాలు, నగదుతో ఉడాయించారు. నిందితులు నేపాల్ సరిహద్దు దాటి వెళ్లే అవకాశం ఉండటంతో బెంగళూరు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. దీంతో, ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరులోని మారతహళ్లి పరిధిలో యెమలూరు కెంపాపుర నివాసి, బిల్డర్ షిమంత్ అర్జున్ ఇంట్లో ఆదివారం దొంగతనం జరిగింది. దాదాపు రూ.18 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు, వెండి నగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఇంటి యజమాని షిమంత్ తన భార్య పిల్లలతో ఓ భూమి పూజ కార్యక్రామానికి వెళ్లగా అదే అదనుగా ఇంట్లో పనిమనుషులుగా ఉన్న నేపాలి జంట దినేష్, కమలా మరో నేపాలితో కలిసి చోరీకి పాల్పడ్డారు. షిమంత్ కుటుంబం బయటికి వెళ్లినప్పుడు మొదటి అంతస్తులోని బెడ్ రూంలో చొరబడి లాకర్ పగలగొట్టి 1.5 కిలోల బంగారం, దాదాపు 5 కిలోల వెండి ఆభరణాలు, రూ.11.5 లక్షల నగదును ఎత్తుకెళ్లారని పోలీసులు గుర్తించారు.యజమానులు తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్లై ఉండటం చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఈ భారీ దోపిడీ వెలుగులోకి వచ్చింది. అయితే, వీరు గత కొంతకాలంగా సదరు బిల్డర్ ఇంట్లో పని మనుషులుగా ఉంటూ యజమానికి నమ్మకంగా ఉంటున్నారు. ఇంటి గురించి పూర్తి అవగాహన ఉండటంతో, వీరు అతి సులువుగా లాకర్లను గుర్తించి చోరీకి పాల్పడ్డారు. నేరం చేసిన వెంటనే వారు సాక్ష్యాలు దొరక్కుండా జాగ్రత్తపడి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ టీవీ కెమెరాల పరిశీలించి నిందితులకోసం గాలిస్తున్నారు. యజమానుల ఇంట్లో పనిమనుషులు చేసిన అతిపెద్ద దొంగతనాల్లో ఇదే పెద్దదని పోలీసులు అంటున్నారు.కాగా, నిందితులు నేపాల్ సరిహద్దు దాటి వెళ్లే అవకాశం ఉండటంతో, బెంగళూరు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచారు. పని మనుషులను పెట్టుకునే ముందు వారి నేపథ్యాన్ని తనిఖీ చేయాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. -
కర్ణాటకలో బిగ్ ట్విస్ట్.. సిద్దరామయ్య సర్కార్కు ఝలక్?
బెంగళూరు: కర్ణాటకలో సీఎం కుర్చీ మార్పుపై రాజకీయం నడుస్తున్న వేళ సిద్దరామయ్యపై సర్కార్కు మరో ఝలక్ తగిలింది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు సంబంధించి దాదాపు 6000 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని కర్ణాటక వైన్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపణలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. దీంతో, మద్యం కుంభకోణం విషయం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఖర్గే, రాహుల్కు లేఖ రాయనున్నట్టు అసోసియేషన్ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. వివరాల మేరకు.. కర్ణాటకలో మద్యం అమ్మకాలకు సంబంధించిన సీఎల్-7 లైసెన్సుల జారీకి పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నారని కర్ణాటక వైన్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపించారు. ఒక్కో లైసెన్స్ జారీకి రూ. 30 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకూ వసూలు చేశారని, అలా మొత్తంగా దాదాపు 6000 కోట్లు తిన్నారని మండిపడ్డారు. ఈ కుంభకోణంలో ఎక్సైజ్ మంత్రి ఆర్బీ తిమ్మాపూర్తో పాటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు చెందిన ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు, తొమ్మిది మంది సూపరింటెండెంట్లు, 13 మంది డిప్యూటీ సూపరింటెండెంట్లు, 20 మంది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు భాగమైనట్టు వారు చెప్పుకొచ్చారు. కాగా, మద్యం అమ్మకాల్లో అవినీతినిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీకి లేఖ రాయనున్నట్టు అసోసియేషన్ తెలిపింది. మరోవైపు.. కర్ణాటకలోని సిద్దరామయ్య సర్కార్పై కర్ణాటక వైన్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు తీవ్ర విమర్శలు గుప్పించారు. రెండేళ్ల సిద్ధరామయ్య పాలన అవినీతికి కేరాఫ్గా మారిందన్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో రూ. 700 కోట్ల స్కాం జరుగుతోందని 2024లోనే సీఎం సిద్ధరామయ్యకు, గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్కు, లోకాయుక్తాకు ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. అయితే, మంత్రిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధూ సర్కారు ముందుకు రాలేదని.. దీంతో స్కాం తీవ్రత పెరిగిపోయిందని వాపోయారు. దీంతో, మద్యం వ్యవహారం కర్ణాటకలో కొత్త చర్చకు దారి తీసింది.ఇదిలాఉండగా తమ కస్టమర్లకు మద్యాన్ని ఇవ్వడానికి బెంగళూరులోని ఖరీదైన ప్రాంతాల్లోని హోటల్స్, బోర్డింగ్ హౌజ్ల యజమానులు సీఎల్-7 పేరిట ప్రత్యేక లైసెన్సులను తీసుకొంటారు. ప్రాంతాన్ని బట్టి ఈ లైసెన్స్ రూ. కోటి నుంచి 2 కోట్ల వరకూ ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అయితే, ఎక్సైజ్ శాఖ స్కాం వార్తలను మంత్రి తిమ్మాపూర్ కొట్టివేశారు. ఈ ఆరోపణల్లో నిజం లేదన్న ఆయన.. దీనిపై అసెంబ్లీలోనే మాట్లాడుతానన్నారు. ఈ స్కామ్పై ప్రతిపక్ష పార్టీ నేతలు మండిపడ్డారు. పాలనను పక్కనబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కుంభకోణాల్లో మునిగిపోయిందని ధ్వజమెత్తారు. -
Karnataka: డీకే డీకే అంటూ అరిచేది ఎవరు?
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్లో సీఎం మార్పు అంశానికి దాదాపు తెరపడినట్లే కనిపించినా, అక్కడక్కడ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను అభిమానించే గణం మాత్రం తమ వాయిస్ వినిపిస్తూనే ఉంది. తాజాగా ‘డీకే.. డీకే’ అంటూ పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద పెద్దగా అరుపులు అరవడం కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు విపరీతమైన కోపం తెప్పించింది. అది కూడా తాను పాల్గొన్న ర్యాలీలో ఇలా అరవడం ఏంటనే చిరాకు సిద్ధరామయ్యలో కనిపించింది. ‘ఎవరు డీకే.. డీకే అరుస్తుంది.. నెమ్మదిగా ఉండలేరా.. కామ్గా ఉండండి’ అంటూ కార్యకర్తలపై అసహనం వ్యక్తం చేశారు సిద్ధరామయ్యా.వివరాల్లోకి వెళితే.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కొత్త గ్రామీణ ఉపాధి పథకం "వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ కర్ణాటక కాంగ్రెస్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దీనిలో భాగంగా కర్ణాటక కాంగ్రెస్ పెద్దలు ఓ ర్యాలీ ద్వారా తమ నిరసన వ్యక్తం చేశారు. ఇందులో సిద్ధరామయ్యతో పాటు శివకుమార్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జేవాలా, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.అయితే దీనిలో భాగంగా వేదిక వద్దకు సిద్ధరామయ్య నడుచుకుంటూ వెళుతున్న సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు డీకే.. డీకే అంటూ పెద్ద పెద్దగా అరవడం ప్రారంభించారు. దీన్ని సీరియస్గా తీసుకున్న సిద్ధరామయ్య.. ఎవరు.. డీకే డీకే అంటూ అరిచేది.. అరవ కుండా ఉండలేరా. అంతా సైలెంట్గా ఉండండి’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సిద్ధరామయ్య ప్రసంగించే సమయంలో కూడా డీకే నాదమే వినిపించడంతో సిద్ధరామయ్యకు మరింత కోపం తెప్పించింది. కాకపోతే చేసేది లేక అలాగే ప్రసంగించారు సిద్ధరామయ్య. -
యాక్సిడెంట్ కాదు.. డాష్బోర్డ్ కెమెరా షాకింగ్ విజువల్స్
కర్ణాటకలోని బెంగళూరులోని హెబ్బగోడి ఠాణా పరిధిలో ఆదివారం సాయంత్రం ఎలక్ట్రానిక్స్ సిటీలోని అనంతనగర్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. హెబ్బగోడి నివాసి ప్రశాంత్ (28), రోషన్ హెగ్డే (27) ఆదివారం క్రికెట్ మ్యాచ్ ముగించుకుని సాయంత్రం మద్యం తాగారు. మద్యం మత్తులో కారును అడ్డదిడ్డంగా నడపడంతో కారు చెట్టుకు ఢీకొంది. దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇదీ తొలుత అందరూ అనుకున్న స్టోరీ. కానీ ఈ ఘటనకు సంబంధించి మరో ట్విస్ట్ వెలుగులో వచ్చింది. ప్రమాదంగా భావించిన ఈ ఘటన చివరికి ఒళ్లు గగుర్పొడిచే హత్యగా తేలింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ప్రశాంత్, రోషన్ ఇద్దరు స్నేహితులు. ప్రశాంత్ బాడీబిల్డర్గా పనిచేస్తుండగా, రోషన్ డొమ్లూరులోని ఒక సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. కారులోని డాష్క్యామ్ను డీసీపీ (ఎలక్ట్రానిక్స్ సిటీ) ఎం నారాయణ గమనించి, ఆ ఫుటేజీని పరిశీలించమని ఆదేశించడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది.ఆదివారం సాయంత్రం కమ్మసంద్రలో కొంతమందితో కలిసి క్రికెట్ ఆడిన వీరు తరువాత మద్యం సేవించారు. మద్యం మత్తులో ప్రశాంత్ లైటర్ కోసం రోషన్ వద్దకు వచ్చి అతనిని దుర్భాషలాడాడని, దీనితో వాగ్వాదం చెలరేగింది. ఇద్దరూ బీర్ బాటిళ్లతో ఒకరినొకరు దాడి చేసుకున్నాడు. పరిస్థితి దిగజారడంతో, రోషన్ తన టాటా సఫారీలోకి ఎక్కి అక్కడి నుండి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే, ప్రశాంత్ కారును వెంబడించి, కదులుతున్న వాహనం ఎడమవైపు ఫుట్బోర్డ్పైకి ఎక్కి డోర్ను పట్టుకుని వేలాడాడు. కారు ఆపమని ప్రశాంత్ వేడుకుంటున్నా రోషన్ పట్టించుకోలేదు. సుమారు 600 మీటర్ల దూరం వరకు కారును వేగంగా, ప్రమాదకరంగా నడిపాడు. ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగానే మొదట ఓ కాంపౌండ్ గోడను, ఆ వెంటనే వెనక్కి తిప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో ప్రశాంత్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విజువల్స్ డాష్క్యామ్లో రికార్డయ్యాయని పోలీసు అధికారి తెలిపారు.ఇది ఉద్దేశపూర్వకమైన హత్య అని తేలడంతో, తీవ్ర గాయాలతో రోషన్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి విచారణకోసం అదుపులోకితీసుకున్నామని అధికారి నారాయణ తెలిపారు. రోషన్కు నాలుక దాదాపు తెగిపోయిందని, చిన్న శస్త్రచికిత్స జరిగిందని వైద్యులు మాకు తెలిపారు. సోమవారం అతన్ని డిశ్చార్జ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.Drunk Driving Nightmare: Bengaluru Roads Claim Another Life in Shocking Car-Ramming IncidentShocking incident from Bengaluru.A drunken brawl turned deadly when Prashanth M (33), a bodybuilder, was killed after Roshan Hegde (37), a software engineer from Mangaluru, allegedly… pic.twitter.com/sJ2c3zldMM— Karnataka Portfolio (@karnatakaportf) January 26, 2026 -
దేవదత్ పడిక్కల్కు ప్రమోషన్
కర్ణాటక ఆటగాడు దేవదత్ పడిక్కల్కు ప్రమోషన్ లభించింది. ఇటీవల ముగిసిన విజయ్ హజారే వన్డే టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగిన అతన్ని (725 పరుగులు 90.62 సగటుతో) కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తమ రంజీ కెప్టెన్గా నియమించింది. ఈనెల 29 నుంచి పంజాబ్తో జరుగబోయే మ్యాచ్లో పడిక్కల్ కర్ణాటక కెప్టెన్గా వ్యవహరిస్తాడు. గ్రూప్ దశలో కర్ణాటకకు ఇదే చివరి మ్యాచ్. కీలకమైన ఈ మ్యాచ్కు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కేవలం రెండు మ్యాచ్ల అనుభవమున్న పడిక్కల్కు కెప్టెన్గా అవకాశమిచ్చి సాహసోపేత నిర్ణయం తీసుకుంది. రెడ్ బాల్ ఫార్మాట్లో పడిక్కల్ కెప్టెన్సీ చేపట్టడం ఇదే తొలిసారి. 2023లో అతను సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఓ మ్యాచ్కు కెప్టెన్గా వ్యవహరించాడు. పెద్దగా ఫామ్లో లేని మయాంక్ అగర్వాల్ను తప్పించి పడిక్కల్కు రంజీ కెప్టెన్గా అవకాశం ఇచ్చారు.పంజాబ్తో మ్యాచ్కు ప్రకటించిన జట్టులో మరిన్ని ఆసక్తికర మార్పులు చోటు చేసుకున్నాయి. టీమిండియా ప్లేయర్లు కేఎల్ రాహుల్, ప్రసిద్ద్ కృష్ణ జట్టులోకి వచ్చారు. ప్రస్తుతం టీమిండియా విధులు లేకపోవడంతో వీరిద్దరూ రంజీ బాట పట్టారు.మరో స్టార్ బ్యాటర్ కరుణ్ నాయర్ గాయం కారణంగా ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. మధ్యప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో గాయపడ్డ కరుణ్ స్థానాన్ని నికిన్ జోస్ భర్తీ చేశాడు. మరో స్టార్ ఆటగాడు అభినవ్ మనోహర్పై వేటు పడింది. మనోహర్ గత కొంతకాలంగా ఫామ్లో లేడు. మయాంక్ అగర్వాల్ను కెప్టెన్సీ నుంచి తప్పించినా సాధారణ ఆటగాడిగా జట్టులో కొనసాగనున్నాడు.కీలక పోరాటం గ్రూప్ బి పాయింట్ల పట్టికలో కర్ణాటక మూడో స్థానంలో ఉంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ముందంజలో ఉండగా, సౌరాష్ట్ర వెనుక నుంచి (నాలుగో స్థానం) ఒత్తిడి పెంచుతోంది. క్వార్టర్ ఫైనల్ నేపథ్యంలో పంజాబ్తో మ్యాచ్ కర్ణాటకకు అత్యంత కీలకంగా మారింది. కర్ణాటక జట్టు (పంజాబ్ మ్యాచ్ కోసం) - మయాంక్ అగర్వాల్ - కేఎల్ రాహుల్ - అనీష్ KV - దేవదత్ పడిక్కల్ (కెప్టెన్) - స్మరణ్ R - శ్రేయస్ గోపాల్ - కృతిక్ కృష్ణ (wk) - వెంకటేష్ M - విద్యాధర్ పటిల్ - విద్యవత్ కావేరప్ప - ప్రసిద్ధ్ కృష్ణ - మొహ్సిన్ ఖాన్ - శిఖర్ శెట్టి - శ్రీజిత్ (wk) - ధ్రువ్ ప్రభాకర్ -
ఇండియా అబ్బాయి.. చైనా అమ్మాయి
బెంగళూరు: ప్రేమకు దేశం, భాష అనే హద్దులు లేవు. కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన యువకుడు, చైనాకు చెందిన యువతి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. చిక్కమాగళూరు హౌసింగ్ బోర్డుకు చెందిన రూపక్.. చైనాకు చెందిన జేడ్కు ఆ్రస్టేలియాలో చదువుతున్న సమయంలో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని పెద్దలకు తెలిపారు. రెండు కుటుంబాలు అంగీకరించడంతో చిక్కమగళూరులోని ఒక్కలిగర కల్యాణ మండపంలో గురువారం ఘనంగా వివాహం జరిగింది. భారత్–చైనా సంప్రదాయాలు దాదాపు ఒకే మాదిరిగా ఉన్నాయని నవ వధువు సంతోషం వ్యక్తం చేసింది. -
గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు
-
కర్ణాటకలో కలకలం.. గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి నిప్పు..
బెంగళూరు: కర్ణాటకలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి గుర్తు తెలియని దుండగులు నిప్పు అంటించారు. బళ్లారిలోని కంటోన్మెంట్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. అయితే, ఈ ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బళ్లారిలోని బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి మోడల్ హౌస్కు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. బళ్లారి శివార్లలో రూ.3 కోట్ల విలువైన గాలి జనార్దన్ రెడ్డి మోడల్ హౌస్కు నిప్పుపెట్టడం తీవ్ర చర్చకు దారి తీసింది. దుండగులు ఇంటి.. కిటికీలు, తలుపులు పగులగొట్టి పెట్రోల్ పోసి దహనం చేయడంతో ఫర్నిచర్ కాలిపోయింది. అయితే, ఈ ఘటన వెనుక బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఉన్నారని గాలి జనార్ధన్ రెడ్డి సోదరుడు సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు. కాగా, ఇంటి నిప్పు పెట్టిన సమయంలో జనార్థన్ రెడ్డి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కర్ణాటక అసెంబ్లీ సమావేశాల నేపధ్యంలో గాలి జనార్థన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, జనవరి ఒకటో తేదీన గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయులు కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై విచారణ జరుగుతుండగానే బళ్లారిలోని గాలి జనార్ధన్ రెడ్డి మోడల్ హౌస్కు నిప్పు పెట్టడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై స్థానిక బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బ్యాన్ ఎత్తివేత.. ర్యాపిడో, ఉబెర్, ఓలాకు భారీ ఊరట
ర్యాపిడో, ఓలా, ఉబెర్ అగ్రిగేటర్లకు భారీ ఊరట లభించింది. కర్ణాటకలో కొనసాగుతున్న బైక్ ట్యాక్సీలపై నిషేధాన్ని బుధవారం హైకోర్టు ఎత్తేసింది. ఈ క్రమంలో గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూ.. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. దీంతో ఆరు నెలలుగా కొనసాగుతున్న బ్యాన్కు తెరపడినట్లయ్యింది. మోటార్ వెహికల్ చట్టంలో బైక్ ట్యాక్సీల ప్రస్తావన లేకపోవడంతో ఈ సేవలను నిలిపివేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. కిందటి ఏడాది ఈ అంశంపై అగ్రిగేటర్లు(ఓలా, ర్యాపిడో, ఉబెర్) ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ వాటికి చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలనుసారం కాంగ్రెస్ ప్రభుత్వం జూన్ నుంచి బైక్ ట్యాక్సీలపై నిషేధం అమల్లోకి తెచ్చింది. అయితే సింగిల్ జడ్జి బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ కంపెనీలు డివిజన్ బెంచ్ను ఆశ్రయించాయి. దీంతో.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విభు బఖ్రు, జస్టిస్ సీఎం జోషి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారణ జరిపింది.విచారణ సమయంలోనూ.. రాష్ట్ర ప్రభుత్వం బైక్ ట్యాక్సీ (Bike taxi)లపై నిషేధం విధించడాన్ని చీఫ్ జస్టిస్ బెంచ్ తప్పుబట్టింది. బైక్ ట్యాక్సీ లగ్జరీ కాదని.. నగర ప్రజలకు అది అవసరమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విభు బఖ్రు అభిప్రాయపడ్డారు. మధ్యతరగతి ప్రజలకు బైక్ట్యాక్సీలు ఎంతో ఉపయోగకరమైనవని.. దేశంలోని దాదాపు 13 రాష్ట్రాల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉందని వ్యాఖ్యానించారాయన. ఈ క్రమంలో.. మోటారు వాహనాల చట్టం బైక్ ట్యాక్సీలను నిషేధిస్తుందనే రాష్ట్ర ప్రభుత్వ వాదనను తోసిపుచ్చారు కూడా. బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించడం వల్ల వాటిపైనే ఆధారపడిన ఎన్నో కుటుంబాలు రోడ్డునపడతాయని.. ప్రజల జీవనోపాధి హక్కును పూర్తిగా హరించే అధికారం ఎవరికీ ఉండదని ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం.ఆ సమయంలో.. కోర్టు వ్యాఖ్యలను బైక్స్ ట్యాక్సీ వెల్ఫేర్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. చట్టబద్ధమైన, సురక్షిత కార్యకలాపాలను కొనసాగించడానికి తాము ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల వాదనలను ద్విసభ్య ధర్మాసనం పూర్తిగా వింది. ఇవాళ్టి తీర్పులో.. కర్ణాటక హైకోర్టు ఇవాళ బైక్ ట్యాక్సీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తేసింది. మోటార్సైకిళ్లను ట్రాన్స్పోర్ట్ వాహనాలుగా ఉపయోగించవచ్చని.. కానీ యజమానులు, అగ్రిగేటర్లు తప్పనిసరిగా లైసెన్స్లు తీసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే.. ప్రభుత్వం కూడా చట్టం ప్రకారం అనుమతులు ఇవ్వాలి.. మోటార్సైకిళ్లు సాధారణంగా ట్రాన్స్పోర్ట్ వాహనాలు కావు అనే కారణం చూపిస్తూ తిరస్కరిస్తే ఊరుకునేది లేదు అని స్పష్టం చేసింది. -
బెంగళూరులో దారుణం.. కొరియన్ యువతికి చేదు అనుభవం
బెంగళూరు: భారత్ అనగానే ప్రపంచ దేశాలకు గుర్తుకు వచ్చే విషయం సంస్కృతి, భారతీయులు ఇచ్చే మర్యాద. అలాగే, భారత్ వచ్చే టూరిస్టులను కొందరు అతిథిలా గౌరవిస్తూ వారి మన్ననలు సైతం పొందారు. కానీ, కొందరు మాత్రం అతిథులుగా వస్తున్న ఎందరో యువతులను వేధిస్తున్నారు. దీంతో, వారి చేసే తప్పులకు భారత్ పరువు పోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి కర్ణాటకలో వెలుగు చూసింది. ఓ కొరియన్ యువతికి బెంగళూరు ఎయిర్పోర్టులో ఎదురైన చేదు అనుభవాన్ని ఆవేదనతో చెప్పుకొచ్చారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొరియన్ యువతి కిమ్ సుంగ్ ఇటీవల బెంగళూరులోని తన స్నేహితురాలి వద్దకు వచ్చారు. అనంతరం, ఈనెల 19వ తేదీన ఆమె.. కొరియాకు వెళ్లేందుకు బెంగళూరు ఎయిర్పోర్టుకు వచ్చారు. అనంతరం, ఆమె కొరియన్ ఇమిగ్రేషన్ కూడా పూర్తి చేసుకుంది. అప్పుడే ఎయిర్పోర్టుకు చెందిన స్టాఫ్ అఫాన్ అహ్మద్ అనే వ్యక్తి వచ్చి ఆమె బ్యాగ్ చెక్ చేయాలని ఆర్డర్ వేశాడు. అయితే, కౌంటర్ చెక్ చేయడం వల్ల ఎక్కువ సమయం పడుతుందని.. ఈ కారణంగా ఆమె వెళ్లాల్సిన విమానం కూడా మిస్ అయ్యే అవకాశం అవుతుందని, పర్సనల్ చెక్ చేస్తానని ఆమెని నమ్మించాడు.#IndiaTodayExclusive | A Korean tourist has accused a staff member at Bengaluru’s Kempegowda International Airport of sexually molesting her under the pretext of checking her ticket and baggage.The woman, Kim Sung Kyung, consented to reveal her identity while speaking to India… pic.twitter.com/amDFYDeDKY— IndiaToday (@IndiaToday) January 22, 2026అనంతరం, ఆమెను వాష్ రూమ్ వైపుగా తీసుకెళ్లాడు. ఇంతలో కిమ్పై అహ్మద్ చేయి వేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. చెకింగ్ పేరిట.. ఆమె చెస్ట్, ప్రైవేట్ పార్టులను పదేపదే తాకుతూ లైంగికంగా వేధించాడు. పలుమార్లు అలా చెకింగ్ చేస్తూ రాక్షాసానందం పొందాడు. చివరగా ఆమెను వెనుక వైపుగా తిరగమని చెప్పి బలవంతంగా గట్టిగా హగ్ చేసుకున్నాడు. దీంతో సదరు మహిళ అతడిని తోసేసే ప్రయత్నించగా ఓకే.. థాంక్యూ అంటూ గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ ఘటన నుంచి వెంటనే తేరుకున్న కిమ్.. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీకి ఫిర్యాదు చేసింది. ఆమెకు జరిగిన షాకింగ్ ఘటనను అధికారులకు తెలిపింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. సీసీటీవీ ఫుటేజీని చెక్ చేశారు. అహ్మద్పై సెక్షన్ 75 BNS కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే, సాధారణంగా ప్రయాణికులును ఎవరినైనా.. ఫిజికల్గా చెక్ చేసే అధికారం ఏ ఎయిర్పోర్ట్ స్టాఫ్కు ఉండదు. -
karnataka: అసెంబ్లీలో హైడ్రామా.. మధ్యలోనే వెళ్లిపోయిన గవర్నర్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలోనే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నేడు (గురువారం) ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిన గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్.. ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని పూర్తిగా చదవకుండానే నిష్క్రమించారు. కేవలం రెండు లైన్లు మాత్రమే చదివి, తన ప్రసంగాన్ని ముగించడం సభలో తీవ్ర కలకలం రేపింది.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA)నకు సంబంధించిన వివాదాస్పద చట్టంపై ప్రభుత్వం ప్రస్తావించిన కొన్ని పేరాలపై గవర్నర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు ప్రభుత్వ ప్రచారంలో భాగంగా ఉన్నాయంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటన బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్లకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య పెరుగుతున్న అగాధానికి అద్దం పడుతోంది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ నుండి వాకౌట్ చేసిన మరుసటి రోజే కర్ణాటకలో ఈ తరహా ఘటన జరగడం గమనార్హం. అంతకుముందు కేరళ గవర్నర్ కూడా తన ప్రసంగంలోని కొన్ని భాగాలను చదవకుండా వదిలేశారు. #WATCH | Bengaluru | Karnataka Governor Thawarchand Gehlot walks out of the Karnataka Legislative Assembly; Congress leader BK Hariprasad seen trying to stop the Governor pic.twitter.com/QZjWSlZJgx— ANI (@ANI) January 22, 2026కర్ణాటక ప్రభుత్వం రూపొందించిన ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వ విధానాలలోని దాదాపు 11 పేరాలను తొలగించాలని గవర్నర్ గెహ్లాట్ ముందే సూచించారు. అయితే, ప్రభుత్వం వాటిని మార్చకపోవడంతో ఈ ప్రతిష్టంభన నెలకొంది. కాగా గవర్నర్ తీరుపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగాన్ని చదవకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 మరియు 163 ఉల్లంఘన అని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా నిర్వర్తించాల్సిన బాధ్యతను గవర్నర్ విస్మరించారని, దీనిపై నిరసన తెలపడంతో పాటు సుప్రీం కోర్టును ఆశ్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని సీఎం తెలిపారు. -
కర్ణాటక గవర్నర్ పంతం.. ‘సుప్రీం’కు సిద్ధరామయ్య సర్కార్!
కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. గురువారం నుంచి ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తాను ప్రసంగించకూడదని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం తనకు సమర్పించిన గవర్నర్ ప్రసంగం కాపీలో అభ్యంతరాల నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. రాజ్యాంగ సంక్షోభం తలెత్తే పరిస్థితి ఏర్పడింది.గవర్నర్ ప్రసంగం అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ప్రాధాన్యతలు.. గత ఏడాది పని తీరును ప్రతిబింబించే అధికారిక ప్రకటన. ఏ రాష్ట్రంలోనైనా సరే శాసనసభ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతోనే ప్రారంభం కావాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 ఈ విషయాన్నే స్పష్టంగా చెబుతోంది. ఒకవేళ.. గవర్నర్ ప్రారంభోపన్యాసం ఇవ్వకపోతే శాసనసభ ప్రారంభం జరగదు!. ఇది రాజ్యాంగపరమైన ప్రక్రియలో అంతరాయం కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మార్గం ఉంది.గవర్నర్ గనుక ప్రసంగం ఇవ్వనని చెబితే.. ఆ ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్ను ఆశ్రయించవచ్చు. ఇవాళ జరగబోయే ఉమ్మడి శాసనసభ సమావేశంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్(Thawar Chand Gehlot) ప్రసంగం ఇవ్వకపోతే.. సిద్ధరామయ్య ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్ను ఆశ్రయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.గవర్నర్ అభ్యంతరాలివే.. ఈ వివాదానికి మూలం గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం చేర్చిన కొన్ని పేరాలు. ముఖ్యంగా ఎంజీఎన్ఆర్ఈజీఏ (MGNREGA) రద్దు అంశాన్ని ప్రస్తావిస్తూ కేంద్రాన్ని విమర్శించడం, కర్ణాటకకు నిధుల పంపిణీ విషయంలో అన్యాయం జరిగిందని వ్యాఖ్యలు ఉండడం. థావర్ చంద్ గెహ్లాట్ వీటిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. తొలగించాలని కోరారు. తొలగించకపోతే ప్రసంగం ఇవ్వబోనని లోక్భవన్ వర్గాల ద్వారా ప్రభుత్వానికి కబురు పంపారు.గవర్నర్ ప్రసంగం అనేది ప్రభుత్వ విధానాల ప్రతిబింబం మాత్రమే. గవర్నర్ వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పే వేదిక కాదు. ప్రసంగం ఇవ్వకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. ఈ అంశం మీదే సుప్రీం కోర్టులో వాదనలు జరిగే చాన్స్ ఉంది.కోర్టు ఏం చెప్పిందంటే..గతంలో గవర్నర్లు ప్రసంగాలు చదవకపోవడం.. మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడం లాంటి ఘటనలు జరిగాయి. ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. 2023లో అప్పటి కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ప్రసంగం మొత్తం చదవకుండా మధ్యలో వెళ్లిపోయారు. ఆ సమయంలో పినరయి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే.. ప్రసంగం మొత్తం చదవడం గవర్నర్కున్న రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని ఆ టైంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2024-2025 మధ్యకాలంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి కూడా ఇలా మూడుసార్లు చేశారు. ఆ సమయంలోనూ తమిళనాడు ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. గవర్నర్ ప్రసంగం తప్పనిసరి.. అది ప్రభుత్వ విధానాల ప్రతిబింబం మాత్రమేనని స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో గవర్నర్–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రచ్చ నడుస్తోంది. మొన్న తమిళనాడు, నిన్న కేరళలో కూడా ఇటీవలి కాలంలో ఇలాంటి వివాదాలు చోటు చేసుకున్నాయి.సభ ఆగిపోతుందా?.. రకరకాల కారణాలతో.. అసెంబ్లీ సమావేశాల ప్రారంభోపన్యాసానికి దూరం కావడం, లేదంటే మధ్యలో వెళ్లిపోవడం లాంటి పనులు గవర్నర్లు చేసిన సందర్భాలు భారత దేశ చరిత్రలోనే అనేకం ఉన్నాయి. అయితే.. గవర్నర్ ప్రసంగం ఇవ్వకపోయినా సరే ప్రభుత్వం తాను సిద్ధం చేసిన ప్రసంగాన్ని అధికారికంగా రికార్డులోకి తీసుకుని సమావేశాలను నిర్వహించుకోవచ్చు. తద్వారా రాజ్యాంగ ప్రక్రియ కొనసాగుతుంది. గవర్నర్ ప్రసంగం అనేది కేవలం రాజ్యాంగపరమైన బాధ్యతేకాని సభ ఆగిపోయేంత కారణం కాదన్నమాట. -
తెల్లవారుజాము నుంచే క్యూ కట్టాల్సిందే!
కొత్త ఐఫోన్ మార్కెట్లోకి వచ్చినప్పుల్లా యూపిల్ స్టోర్ల ముందు కొనుగోలుదారులు బారులు తీరుతుండడం ఇటీవల కాలంలో చూస్తున్నాం. ఐఫోన్ను ముందుగా దక్కించుకోవడానికి దుకాణాల ముందు యాపిల్ అభిమానులు గంటల తరబడి వేచివుంటారు. ఇంకా కొంతమంది అయితే ఏకంగా తెల్లవారుజాము నుంచే స్టోర్ల ముందు పడిగాపులు కాస్తుంటారు. తాజాగా ఇలాంటి దృశ్యాలు ఇండియన్ సిలికాన్వ్యాలీలో దర్శనమిచ్చాయి. అదేంటి.. కొత్త ఐఫోన్ ఏదీ మార్కెట్లోకి రాలేదు కదా అని ఆశ్చర్యపోతున్నారా?. ఈ క్యూ ఐఫోన్ల కోసం కాదు.. మరి దేనికోసం?బెంగళూరులోని ఓ దుకాణం ముందు మహిళలు పెద్ద ఎత్తున క్యూ కట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వారంతా తెల్లవారుజామున 4 గంటల నుంచే షాపు ముందు వేచివున్నట్టు తెలుస్తోంది. చీరల కోసం వీరు ఇలా లైన్లో నిలబడ్డారని తెలిసి జనం ఆశ్చర్యపోతున్నారు. అయితే అవేమి ఉచితంగా ఇచ్చేవో, సగం ధరకు అమ్మేవో కాదు.. చాలా ఖరీదైన పట్టు చీరలు. ఏంటీ.. అంతేసి డబ్బులు పెట్టి కొనే కాస్ట్లీ సారీలను దక్కించుకునేందుకు ఇంత కష్టపడాలా అని జనం నోరెళ్లబెడుతున్నారు. విషయం పూర్తిగా తెలిస్తే మీరు కూడా క్యూ కడతారు!మైసూరు పట్టు చీరలను దక్కించుకునేందుకు మహిళలంతా కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (కేఎస్ఐసీ) షోరూం ముందు మంగళవారం ఇలా క్యూ కట్టారు. లైన్లో వేచివున్న మహిళల కోసం ప్రత్యేకంగా స్టూల్స్ కూడా వేశారు. ఒక్క చీరనైనా దక్కించుకోవాలన్నట్టుగా మహిళలు ఎదురుచూస్తున్నారు. ఈ దృశ్యాలున్న వీడియోను రాకేశ్ కృష్ణన్ సింహ అనే వ్యక్తి 'ఎక్స్'లో షేర్ చేశారు. రూ.23 వేల నుంచి రెండున్నర లక్షల రూపాయల వరకు ఖరీదు చేసే మైసూరు పట్టుచీరల కోసం మహిళలు తెల్లవారుజాము నుంచే కేఎస్ఐసీ షోరూం ముందు వేచివున్నారని తెలిపారు. క్యూలో ఉన్నవారికి టోకెన్లు కూడా ఇస్తున్నారని, టోకెన్ ఉన్నవారిని మాత్రమే దుకాణం లోపలికి అనుమతిస్తారని 'కన్నడప్రభ' తెలిపింది. అందరికీ చీరలు దక్కాలన్న ఉద్దేశంలో ఒక్కొక్కరికి ఒకటి మాత్రమే విక్రయిస్తారని వెల్లడించింది.కేఎస్ఐసీ (KSIC) మాత్రమే అసలు సిసలైన మైసూరు సిల్క్ సారీలను తయారు చేస్తోంది. దీనికి సంబంధించిన ఆధీకృత తయారీ హక్కులు, జీఐ ట్యాగ్ రైట్స్.. ఇది కలిగివుంది. దీంతో కేఎస్ఐసీ శిక్షణ ఇచ్చిన వారు మాత్రమే మైసూరు పట్టు చీరలను నేస్తుండడంతో డిమాండ్కు తగినట్టుగా సరఫరా చేయలేకపోతోంది. అందుకే తమ దుకాణానికి వచ్చిన వారికి ఒక్కొక్కరికి ఒక చీర మాత్రమే విక్రయిస్తోంది. నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా ఒరిజినల్ పట్టుచీరలను తయారు చేస్తోంది కాబట్టే మహిళలు కేఎస్ఐసీ దుకాణం ముందు బారులు తీరుతున్నారు. ఒరిజినల్ బ్రాండ్ వ్యాల్యూకు ఉండే క్రేజ్ అలాంటిది మరి!Women queue up from 4.00 AM outside a Karnataka Soviet (sorry Silk) Industries Corporation showroom to buy silk sarees starting from ₹23,000 and going up to ₹250,000. Only 1 saree per customer and you need a token to be in the queue.There is an ongoing shortage (or more… pic.twitter.com/d100w3hql0— Rakesh Krishnan Simha (@ByRakeshSimha) January 20, 2026నెటిజన్ల స్పందన..''కొత్త ఐఫోన్ల కోసం ఆపిల్ స్టోర్ల ముందు మగాళ్లు 12 గంటలు ముందుగానే క్యూ కట్టడం మామూలు విషయం. కానీ చీరల కోసం మహిళలు క్యూలో వేచివుండడం ఆసక్తికరం.''''కొత్త ఐఫోన్ లాంచ్ అయినప్పుడు ఆపిల్ షోరూమ్ల వెలుపల కూడా ఇలాంటి దృశ్యాలే కన్పిస్తుంటాయి. అంటే ఆ ఫోన్ల కొరత ఉందని కాదు. ఐఫోన్ కోరుకునే ప్రతి ఒక్కరూ చివరకు దాన్ని దక్కించుకుంటారు. చీర కోసం 23 వేల రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధపడుతున్నారంటే.. వారంతా బాగా డబ్బున్న ఉన్నవారే అయుంటారు.''''ప్రైవేటు దుకాణాల కంటే కేఎస్ఐసీ నాణ్యతపై నమ్మకంతోనే మహిళలు ఇక్కడ పట్టు చీరలు కొనేందుకు వస్తున్నారు.''చదవండి: కారును లాగే కొండ.. ఎక్కడుందో తెలుసా? -
Karnataka : ఆఫీస్ లోనే ముద్దులు, కౌగిలింతలు అడ్డంగా దొరికిన DGP..
-
భద్ర కాలువలో నలుగురు గల్లంతు
శివమొగ్గ: కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకాలోని హోలెహోన్నూరు వద్ద ఘోర విషాదం జరిగింది. ఆదివారం సాయంత్రం భద్ర ఎడమ గట్టు కాలువలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతయ్యారు.అరెబిలాచికి చెందిన నీలాబాయి(50), ఆమె కుమారుడు రవికుమార్(32), కుమార్తె శ్వేత(35), అల్లుడు పరశురాం(40) కాలువలో బట్టలు ఉతకడానికి వచ్చి, కొట్టుకుపోయారు. ఈ సమయంలో ఒకరిని రక్షించే ప్రయత్నంలో మిగిలిన వాళ్లు మునిగిపోయారని చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది కాలువలో గాలింపు చేపట్టారు. ఇటీవల భద్ర డ్యాం నుంచి నీటి విడుదలను పెంచడంతో కాలువల్లో ప్రవాహం ఎక్కువగా ఉంది. -
సీఎం మార్పునకు హైకమాండ్ బ్రేకులు!?
సాక్షి బెంగళూరు/శివాజీనగర: త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఎలాంటి మార్పులు వద్దని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు కూడా సూచనప్రాయంగా తెలియజేసినట్లు సమాచారం. అస్సోం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్ఛేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మరో నాలుగైదు నెలల్లో పూర్తికానుంది. అప్పటివరకు కర్ణాటకతో పాటు ఏ ఇతర రాష్ట్రాల రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చెయ్యొద్దని.. యథాతథ స్థితినే కొనసాగించాలని అధిష్టానం తేల్చిచెప్పినట్లు తెలిసింది. అలాగే, ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసే వరకు నాయకత్వ మార్పు విషయంలోగానీ ఇతర ఏ అంశాల్లో కూడా చర్చ అవసరంలేదని.. కర్ణాటకలో రాజకీయాల్లో నెలకొన్న గందరగోళానికి తెరదించాలని డీకే శివకుమార్కు అధిష్టానం స్పష్టంచేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ ఎన్నికలపై ప్రభావం పడకూడదనే..నిజానికి.. కర్ణాటకలో బడ్జెట్కు ముందే తనకు సీఎం స్థానం కట్టబెట్టాలని డీకే శివకుమార్ పట్టుబట్టారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో నాయకత్వ మార్పుచేస్తే ఆ ప్రభావం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పడుతుందని అధిష్టానం భావిస్తోంది. ఈ ఎన్నికలను హైకమాండ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున కర్ణాటక రాజకీయాలపై కాకుండా అస్సోంలో గెలుపుపై దృష్టిసారించాలని డీకేకు అధిష్టానం సూచించినట్లు తెలిసింది. అయితే, ఈ ఎన్నికల తర్వాతైనా ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తారా అని హైకమాండ్ను డీకే ప్రశ్నించగా.. ‘మీ కృషికి, క్రమశిక్షణకు, నిబద్ధతకు ప్రతిఫలం తప్పక దక్కుతుంద’ని హైకమాండ్ బదులిచ్చినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.జాతీయ రాజకీయాల్లోకి రండి..మరోవైపు.. అస్సోం శాసనసభ ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అస్సోం రాష్ట్ర నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హైకమాండ్ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జి డీకే శివకుమార్తోనూ చర్చించినట్లు తెలిసింది. అక్కడి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికపై డీకే శివకుమార్కు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు సమాచారం. ఇదే సమయంలో జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందిగా డీకే శివకుమార్ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. రానున్న లోక్సభ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసే దిశగా డీకే సేవలను పార్టీకి ఉపయోగించుకోవాలని అధిష్టానం భావిస్తోంది. 2029 లోక్సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే డీకే శివకుమార్కు మెరుగైన అవకాశాలు ఉంటాయని.. ఈ క్రమంలో జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందిగా హైకమాండ్ కోరినట్లు చర్చ జరుగుతోంది. -
కారు ధర రూ.70వేలు.. జరిమానా తెలిస్తే షాక్..!
సాక్షి బెంగళూరు: కర్ణాటకలో కారుతో బీభత్సం సృష్టించిన ఒక ఆకతాయికి పోలీసులు తగిన శిక్ష వేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నడిరోడ్డుపై మాడిఫై చేసిన కారుతో సినిమా స్టంట్లు చేస్తూ ఓ ఇంజినీరింగ్ విద్యార్థి బీభత్సం సృష్టించాడు. అనంతరం దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది వైరల్గా మారి పోలీసుల వరకూ చేరడంతో రూ. లక్షకు పైగా జరిమానా విధించారు.ఇటీవలే న్యూఇయర్ వేడుకలు జరుపకోవడానికి కేరళ కన్నూరుకు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి బెంగళూరుకు వచ్చారు. అయితే అతను 2002కు చెందిన హోండా సిటీ కారును రూ. 70 వేలకు కొనుగోలు చేశాడు. అనంతరం దానిని రూ. లక్ష ఖర్చు చేసి ఆధునాతనంగా మాఢిపై చేయించాడు. ఈ కారుతో బెంగళూరు రోడ్లపై ప్రమాద కరంగా విన్యాసాలు చేశాడు. మంటలు విదజిమ్ముతూ కారును నడిపాడు. అనంతరం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో వీటిని చూసి భయాందోళనలకు గురైన ప్రజలు వాటి వివరాలను పోలీసులకు తెలియజేశారు. దీంతో వారు ఆ కారును స్వాధీన పరుచుకొని అనంతరం దానిపై రూ. 1,11,500 భారీ జరిమానా విధించారు. ఆ యువకుడు ఆ మెుత్తాన్ని చెల్లించడంతో కారును అతనికి అప్పజెప్పినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే ఈ విధంగానే జరిమానా విధిస్తామని పోలీసులు పేర్కొన్నారు. -
స్టార్లతో నిండిన కర్ణాటకకు షాక్.. విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో విదర్భ
నిన్న (జనవరి 15) జరిగిన విజయ్ హజారే ట్రోఫీ 2025-26 తొలి సెమీ ఫైనల్లో స్టార్లతో నిండిన కర్ణాటకకు విదర్భ జట్టు ఊహించని షాక్ ఇచ్చింది. అమన్ మోఖడే (138) అద్భుతమైన సెంచరీతో ఆ జట్టును గెలిపించాడు. తద్వారా గత ఎడిషన్ ఫైనల్లో కర్ణాటక చేతిలో ఎదురైన పరాభవానికి విదర్భ ప్రతీకారం తీర్చుకుంది. ఇవాళ (జనవరి 16) జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో విదర్భ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది.పడిక్కల్ విఫలం.. రాణించిన కరుణ్ నాయర్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక.. విదర్భ పేసర్ దర్శన్ నల్కండే (10-0-48-5) దెబ్బకు 49.4 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. కరుణ్ నాయర్ (76), కృషణ్ శ్రీజిత్ (54) అర్ద సెంచరీలతో రాణించడంతో కర్ణాటక ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఈ ఎడిషన్లో దేవదత్ పడిక్కల్ (4) తొలిసారి విఫలమయ్యాడు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (9) కూడా డు ఆర్ డై మ్యాచ్లో హ్యాండిచ్చాడు. ధృవ్ ప్రభాకర్ (28), శ్రేయస్ గోపాల్ (36), అభినవ్ మనోహర్ (26), విజయ్ కుమార్ వైశాక్ (17) రెండంకెల స్కోర్లు చేశారు. విదర్భ బౌలర్లలో నల్కండే 5, యశ్ ఠాకూర్ 2, నచికేత్, యశ్ కదమ్ తలో వికెట్ తీశారు.అమన్ అద్భుత శతకం281 పరుగుల ఛేదనలో విదర్భ ఆదిలోనే అథర్వ తైడే (6) వికెట్ కోల్పోయినప్పటికీ.. మరో ఓపెనర్ అమన్ మోఖడే (138) అద్బుత శతకంతో కదం తొక్కడంతో 46.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అమన్కు జతగా రవికుమార్ సమర్థ్ (76 నాటౌట్) రాణించాడు. ధృవ్ షోరే (47) పర్వాలేదనిపించాడు. కర్ణాటక బౌలర్లలో అభిలాశ్ షెట్టి (10-0-48-3) కాస్త ప్రభావం చూపినప్పటికీ, మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. -
"చైనా మాంజాకు మరో ప్రాణం బలి"
చైనా మంజా వాడకంపై ప్రజలకు ఎంత అవగాహన కల్పించిన తీరు మార్చుకోవడం లేదు. పండగ వేళ సరదాగా ఎగరవేసే పతంగులు కొంతమంది పాలిట మృత్యపాశాల్లా మారుతున్నాయి. తాజాగా కర్ణాటకాలో చైనా మాంజాతో తీవ్రగాయాలై ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో పండగ వేళ ఆకుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.సంక్రాంతి పండుగకు గాలిపటాలు ఎగురవేయడం హిందూ సంప్రదాయంలో భాగం. అందుకే దేశవ్యాప్తంగా పెద్ద, చిన్నా తేడా లేకుండా పతంగులు ఎగురవేసి తమ సంతోషాన్ని చాటుకుంటారు. పతంగులు ఎగురవేయడం కోసం వాడే చైనా మాంజా వల్ల ఎంతోమంది ప్రమాదాలకు గురవడంతో పాటు కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. పక్షులసైతం పెద్దఎత్తున మాంజా దారం తగిలి మరణిస్తున్నాయి. దీనిపై ప్రజల్లో ఎంత అవగాహన కల్పించినా తీరుమారడం లేదు.కర్ణాటక బీదర్ జిల్లా తలమడిగి బ్రిడ్జి వద్ద సంజూ కుమార్ అనే ఓవ్యక్తి బైక్ నడుపుతూ వస్తుండంగా రోడ్డుపై ఉన్న చైనా మంజా అతని ముఖానికి తగిలింది. దీంతో తలకు తీవ్రగాయాలైన సంజూ కుమార్ అక్కడికక్కడే కుప్పకూలారు. అతికష్టంమీద వారి కుమార్తెకు ఫోన్ చేసి జరిగింది చెప్పారు. అంతలోనే అక్కడే ఉన్న స్థానికులు రక్తం ఎక్కువగా పోకుండా కాటన్ గుడ్డ కట్టి అంబులెన్స్కు సమాచారం అందించారు. అయితే అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన సంజూకుమార్ అంబులెన్స్ వచ్చే సరికే ప్రాణాలు వదిలారు.అయితే అంబులెన్స్ సమయానికి చేరుకుంటే ఆయన ప్రాణాలు దక్కేవని సంజూ కుమార్ తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా పతంగిలు లేపడానికి చైనా మాంజా వాడకుండా నిషేదం విధించాలని అక్కడే ధర్నా చేపట్టారు. ఇటీవల చైనా మాంజాతో ప్రమాదానికి గురైన ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. -
రాహుల్ వద్దకు కర్ణాటక పంచాయితీ.. సిద్దరామయ్య ప్లాన్ అదేనా?
బెంగళూరు: కర్ణాటకలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. కర్ణాటకలో సీఎం మార్పు లేదంటూ వార్తలు బయటకు వచ్చిన వేళ.. మరోసారి రాజకీయం వేడెక్కింది. రాహుల్తో సీఎం సిద్దరామయ్య సమావేశం కావాలనుకోవడం చర్చకు దారి తీసింది. ఈ మేరకు ఇండియా టుడే ఓ కథనంలో పేర్కొంది.వివరాల మేరకు.. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంటూ నెలకొన్న నిరంతర గందరగోళం గురించి బయట పడేందుకు సీఎం సిద్ధరామయ్య ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నుండి స్పష్టత కోరుతూ సిద్ధరామయ్య ఆయనతో సమావేశం కావాలని అభ్యర్థించారు. అంతేకాకుండా సిద్ధరామయ్య తన మంత్రివర్గాన్ని విస్తరించడానికి ఆసక్తిగా ఉన్నానని చెప్పారని ఇందులో భాగంగానే రాహుల్ గాంధీ సమావేశం కోసం చూస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఒకవేళ కేబినెట్ విస్తరణ జరిగితే.. డీకే శివకుమార్ సహా ఆయన మద్దతుదారులకు అవకాశం ఉంటుందా? అనే చర్చ కూడా మొదలైంది.ఇదిలా ఉండగా.. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పుపై పార్టీ కేంద్ర నాయకత్వం మాత్రం ఎలాంటి అంతర్గత సంక్షోభం లేదని పదేపదే ఖండిస్తోంది. అంతర్గత సమస్యలను రాష్ట్ర నాయకత్వమే పరిష్కరించుకోవాలని ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం స్పష్టం చేశారు. ఇక, అంతకుముందు కూడా సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ సీఎం మార్పు విషయంలో స్పందించారు. ఇద్దరూ విభేదాల నివేదికలను నిరంతరం ఖండిస్తున్నారు. తాను పార్టీ నాయకత్వంపై విశ్వాసం కలిగి ఉన్నానని, తన పదవీకాలాన్ని పూర్తి చేస్తానని సిద్ధరామయ్య పేర్కొన్నారు, రొటేషనల్ ముఖ్యమంత్రి ఏర్పాటుకు సంబంధించిన వాదనలను తోసిపుచ్చారు.రాష్ట్రంలో సీఎం కుర్చీ కోసం ఎలాంటి గొడవ లేదని, ఇదంతా కేవలం మీడియా సృష్టి మాత్రమేనన్నారు. అనవసరమైన ప్రశ్నలతో గందరగోళం సృష్టించకండి అంటూ మీడియాపై సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సంక్రాంతి తర్వాత కాంగ్రెస్లో అసలు సిసలైన కుర్చీ పోరు మొదలవుతుందని బీజేపీ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. తన ప్రభుత్వానికి, పదవికి ఎలాంటి ఢోకా లేదని, ఐదేళ్లు తామే సుస్థిర పాలన అందిస్తామని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు.అసలు గొడవ ఎందుకు వచ్చింది?కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా రెండున్నరేళ్లు పూర్తైన క్రమంలో సీఎం మార్పు ఉంటుందన్న ప్రచారం జోరందుకుంది. గత నవంబర్ 20తో ప్రభుత్వం ఐదేళ్ల కాలపరిమితిలో రెండున్నరేళ్లు దాటింది. 2023లో ప్రభుత్వ ఏర్పాటు సమయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య అధికార పంపిణీ ఒప్పందం జరిగిందన్న ఊహాగానాలు ఉన్నాయి. దీని ప్రకారం, సగం కాలం సిద్ధూ, మిగతా సగం డీకే సీఎంగా ఉంటారని టాక్. ఇప్పుడు ఆ సమయం దాటడంతో బీజేపీ దీనిని రాజకీయ అస్త్రంగా వాడుకుంటోంది. "సంక్రాంతి తర్వాత చూడండి, కాంగ్రెస్ కుర్చీలాట మొదలవుతుంది" అని బీజేపీ నేతలు, సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నాయి. దీనిపైనే సిద్ధరామయ్య సీరియస్గా స్పందించారు. "అసలు గొడవ ఎక్కడుంది? మీరే (మీడియా) సృష్టిస్తున్నారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రమాదమే కాపాడింది.. అసలేం జరిగిందంటే..
ధార్వాడ్: కర్ణాటకలోని ధార్వాడ్లో ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్ కలకలం రేపింది. బైక్ ప్రమాదానికి గురవ్వడంతో నిందితుడు పట్టుబడగా.. చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు. ధార్వాడ్లోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మూడో తరగతి చదువుతున్న తన్వీర్ దొడ్మని, లక్ష్మి కరియప్పనవర్ అనే ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు.విరామం తర్వాత పిల్లలు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. వారు కిడ్నాప్కు గురయ్యారని అనుమానించారు. దీంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. ఓ వ్యక్తి ఆ పిల్లలిద్దరినీ బైక్పై తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. నిందితుడిని కరీం మేస్త్రీగా గుర్తించారు.పిల్లలను తీసుకుని వెళ్తున్న క్రమంలో నిందితుడు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాద సమాచారం అందుకున్న దండేలి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ గాయపడిన వ్యక్తితో పాటు ఇద్దరు పిల్లలు ఉండటాన్ని గమనించారు. పోలీసుల విచారణలో ఆ వ్యక్తి.. తాను పిల్లలను "ఉలవి చెన్నబసవేశ్వర జాతరకు తీసుకువెళ్తున్నట్లు పోలీసులకు చెప్పాడు. అయితే కిడ్నాప్ ఉద్దేశంతోనే వారిని తీసుకువెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారులను సురక్షితంగా వారి తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. ప్రమాదంలో గాయపడిన నిందితుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పలు కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
రింకూ విఫలం.. సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్న జట్లు ఇవే
దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో సౌరాష్ట్ర సెమీ ఫైనల్కు దూసుకువెళ్లింది. ఉత్తరప్రదేశ్ జట్టుతో జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్లో వీజేడీ పద్ధతిలో 17 పరుగుల తేడాతో గెలిచి సెమీస్ ఖరారు చేసుకుంది. రింకూ విఫలంబెంగళూరు వేదికగా ముందుగా ఉత్తరప్రదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 310 పరుగులు చేసింది. అభిషేక్ గోస్వామి (82 బంతుల్లో 88; 12 ఫోర్లు), సమీర్ రిజ్వీ (77 బంతుల్లో 88 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించారు. కెప్టెన్ రింకూ సింగ్ (20 బంతుల్లో 13)మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు.హార్విక్ దేశాయ్ సెంచరీతోసౌరాష్ట్ర బౌలర్లలో చేతన్ సకారియా 3 వికెట్లు... అంకుర్ పన్వర్, ప్రేరక్ మన్కడ్ 2 వికెట్లు తీశారు. 311 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర 40.1 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగులు సాధించింది. ఓపెనర్ హార్విక్ దేశాయ్ (116 బంతుల్లో 100 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ సెంచరీ చేశాడు.ప్రేరక్ మన్కడ్ (66 బంతుల్లో 67; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించాడు. చిరాగ్ జానీ (31 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడాడు. సౌరాష్ట్ర స్కోరు 238/3 వద్ద భారీ వర్షం రావడం, ఆ తర్వాత తగ్గకపోవడంతో వీజేడీ పద్ధతిని అనుసరించి విజేతను నిర్ణయించారు. ఆట నిలిచిపోయే సమయానికి సౌరాష్ట్ర విజయసమీకరణం కంటే 17 పరుగులు ముందంజలో ఉండటంతో ఆ జట్టుకు విజయం దక్కింది.పడిక్కల్ జోరు.. కర్ణాటక నాలుగోసారిడిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక జట్టు వరుసగా నాలుగోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బెంగళూరులో ముంబై జట్టుతో సోమవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో కర్ణాటక జట్టు వీజేడీ పద్ధతిలో 54 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 254 పరుగులు సాధించింది. షమ్స్ ములానీ (91 బంతుల్లో 86; 8 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు.కెప్టెన్ సిద్దేశ్ లాడ్ (58 బంతుల్లో 38; 4 ఫోర్లు), సాయిరాజ్ పాటిల్ (25 బంతుల్లో 33 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ గాయం కారణంగా ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. కర్ణాటక బౌలర్లలో విద్యాధర్ పాటిల్ (3/42), అభిలాశ్ శెట్టి (2/59), విద్వత్ కావేరప్ప (2/43) రాణించారు. అనంతరం 255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక 33 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 187 పరుగులు చేసింది.కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (12) తక్కువ స్కోరుకే అవుటవ్వగా... దేవ్దత్ పడిక్కల్ (95 బంతుల్లో 81 నాటౌట్; 11 ఫోర్లు), కరుణ్ నాయర్ (80 బంతుల్లో 74 నాటౌట్; 11 ఫోర్లు) రెండో వికెట్కు 143 పరుగులు జోడించారు. కర్ణాటక విజయం దిశగా సాగుతున్న దశలో భారీ వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. వర్షం తగ్గకపోవడంతో వీజేడీ పద్ధతిని అనుసరించి విజేతను నిర్ణయించారు. వీజేడీ పద్ధతి ప్రకారం 33 ఓవర్లకు కర్ణాటక విజయసమీకరణం 132 పరుగులు. కర్ణాటక 55 పరుగులు ముందుండటంతో ఆ జట్టును గెలుపు వరించింది.చదవండి: భారత్పై నిందలు!.. బంగ్లాదేశ్కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ! -
చరిత్ర సృష్టించిన పడిక్కల్.. తొలి ప్లేయర్గా..
దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో కర్ణాటక బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్ అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ముంబైతో క్వార్టర్ ఫైనల్లోనూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ దుమ్ములేపాడు. సెంచరీ మిస్ చేసుకున్నా సూపర్ ఇన్నింగ్స్తో జట్టుకు విజయం అందించాడు.బెంగళూరు వేదికగా తొలి క్వార్టర్ ఫైనల్లో కర్ణాటక- ముంబై (Karnataka vs Mumbai) జట్లు సోమవారం తలపడ్డాయి. టాస్ గెలిచిన కర్ణాటక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది.షామ్స్ ములాని అర్ధ శతకంఓపెనర్లు అంగ్క్రిష్ రఘువన్షి (27), ఇషాన్ ముల్చందాని (20) ఓ మోస్తరుగా ఆడగా.. వన్డౌన్లో వచ్చిన ముషీర్ ఖాన్ (9) ఈసారి విఫలమయ్యాడు. కెప్టెన్ సిద్దేశ్ లాడ్ 38 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ హార్దిక్ తామోర్ (1) నిరాశపరిచాడు.ఇలాంటి దశలో ఆల్రౌండర్ షామ్స్ ములాని అద్భుత అర్ధ శతకం (86)తో జట్టును ఆదుకున్నాడు. మిగిలిన వారిలో సాయిరాజ్ పాటిల్ (25 బంతుల్లో 33 నాటౌట్) రాణించడంతో ముంబై చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. కర్ణాటక బౌలర్లలో విద్యాధర్ పాటిల్ మూడు వికెట్లు తీయగా.. విధ్వత్ కావేరప్ప, అభిలాష్ శెట్టి చెరో రెండు.. విజయ్కుమార్ వైశాఖ్ ఒక వికెట్ పడగొట్టారు.రాణించిన పడిక్కల్.. కరుణ్ నాయర్ఇక లక్ష్య ఛేదనలో కర్ణాటకకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (12)ను మోహిత్ అవస్థి పెవిలియన్కు పంపాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ 81 పరుగులతో రాణించగా.. కరుణ్ నాయర్ 74 పరుగులతో అతడితో కలిసి అజేయంగా నిలిచాడు.అయితే, ఈ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించిన కారణంగా VJD (వి.జయదేవన్) మెథడ్లో.. 33 ఓవర్లలో వికెట్ నష్టానికి 187 పరుగులు చేసిన కర్ణాటక.. 55 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో సెమీస్కు దూసుకువెళ్లింది.చరిత్ర సృష్టించిన పడిక్కల్ఈ సీజన్లో పడిక్కల్ ఇప్పటికే 721 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ దేశీ వన్డే టోర్నీలో అత్యధికసార్లు 700 పరుగుల మార్కు దాటిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2021-22 సీజన్లో దేవదత్ పడిక్కల్ ఏడు ఇన్నింగ్స్ ఆడి 737 పరుగులు సాధించాడు.ఇక ఈ టోర్నీలో ఓవరాల్గా ఒక సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా నారాయణ్ జగదీశన్ (2022-23లో 8 ఇన్నింగ్స్లో 830 పరుగులు) కొనసాగుతున్నాడు. ముంబై తరఫున 2021-22 సీజన్లో పృథ్వీ షా 827 పరుగులు చేసి రెండో స్థానాన్ని ఆక్రమించాడు. చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్.. జట్టులోకి ఊహించని ఆటగాడు -
షాకింగ్ ట్విస్ట్: కోరిక తీర్చలేదన్న కోపంతోనే..
ఇంటర్నెట్లో బూతు సినిమాలు, సోషల్ మీడియా ప్రభావంతో ఓ టీనేజర్ ఘాతుకానికి పాల్పడ్డాడు. చాలారోజులుగా ఆమెపై ఓ కన్నేసి ఉంచిన ఆ కామాంధుడు.. అదను చూసి ఆమెపై విరుచుకుపడ్డాడు. ప్రతిఘటించడంతో ఆ కోపంలో ఆమెను అత్యంత కిరాతకంగా చంపాడు. వారం కిందట ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయిందని భావిస్తున్న టెక్కీ షర్మిల(36) కేసులో ఈ షాకింగ్ ట్విస్ట్ బయటపడింది.రామమూర్తి నగర్లోని సుబ్రమణి లే అవుట్లోని ఓ అపార్ట్మెంట్ ప్లాట్లో జనవరి 3న అగ్నిప్రమాదం జరిగింది. ఆ ఘటనలో షర్మిల(36) అనే యువతి చనిపోయింది. షార్ట్ సర్క్యూట్తో ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చని.. మంటలు చెలరేగడంతో ఊపిరాడకే ఆమె మరణించినట్లు తొలుత అంతా భావించారు. అయితే.. పోలీసులకు మాత్రం అనుమానం వచ్చింది. అందుకే బీఎన్ఎస్ (BNSS) సెక్షన్ 194(3)(iv) కింద అసహజ మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే..ఆ ఎవిడెన్స్తో..దర్యాప్తులో భాగంగా సైంటిఫిక్ మెథడ్స్, టెక్నాలజీని ఉపయోగించి కీలక ఆధారాలు సేకరించారు. ఎలాంటి షార్ట్ సర్క్యూట్ జరిగిన ఆనవాళ్లు లేవని.. ఆమె ఊపిరి ఆడకే చనిపోయిందని.. అయితే అది హత్యే అని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో ఆమె పక్కింట్లోనే ఉండే కర్నాల్ కురై(18) కదలికలపై నిఘా వేశారు. చివరకు.. అతనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు.ఆరోజు ఏం జరిగిందంటే.. కొడగు జిల్లా విరాజ్పేట్కు చెందిన కర్నాల్ తన తల్లితో కలిసి సుబ్రమణి లే అవుట్లోని సంకల్ప నిలయలో అద్దెకు ఉంటున్నాడు. ఇంటర్ చదివే ఈ కుర్రాడు.. నీలి చిత్రాలకు, సోషల్ మీడియాకు బానిస అయ్యాడు. ఈ క్రమంలో పక్క ఇంట్లోనే ఉంటున్న షర్మిల, ఆమె రూమ్మేట్లపై కన్నేశాడు. తన తల్లి ద్వారా వాళ్లతో పరిచయం చేసుకునే ప్రయత్నాలు చేశాడు. దక్షిణ కన్నడకు చెందిన షర్మిలకు ఇంకా పెళ్లి కాలేదు. ఓ ప్రముఖ కంపెనీలో జాబ్ చేస్తూ కొలీగ్తో ఉంటోంది. ఆమె రూమ్మేట్ రెండు నెలల కిందట స్వస్థలం అసోంకి వెళ్లింది. దీంతో షర్మిల ఒక్కతే ఉంటుందని గుర్తించాడు.ఘటన జరిగిన రోజు రాత్రి.. స్లైడింగ్ కిటికీ(పక్కకు జరిగే కిటికీ) గుండా లోపలికి చొరబడ్డాడు కర్నాల్. తన కోరిక తీర్చాలని బతిమిలాడాడు. ఆమె తిరస్కరించడంతో బలాత్కారం చేయబోయాడు. అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. అరుస్తుందేమోనన్న భయంతో.. నోరు, ముక్కు మూసి స్పృహ కోల్పోయేలా చేశాడు. ఆ పెనుగులాటలో ఆమెకు గాయాలై.. తీవ్ర రక్తస్రావం అయ్యింది కూడా. ఆపై భయంతో పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ షాక్ నుంచి తేరుకుని ఆమె బట్టలు, నేరానికి కారణమైన వస్తువులను బెడ్పై ఉంచి వాటికి నిప్పంటించి, ఆమె మొబైల్ ను తీసుకుని పారిపోయాడు. చేసిన నేరాన్ని కర్నాల్ ఒప్పుకోవడంతో అతనిపై బీఎన్ఎస్ 103(1), 64 (2), 66, 238 కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. -
డాక్టర్ కృతికారెడ్డి హత్య కేసులో బిగ్ ట్విస్ట్!
బెంగళూరు: గతేడాది సంచలనం రేపిన మహిళా వైద్యురాలు డాక్టర్ కృతికా రెడ్డి (28) హత్యకేసులో ఊహించని మలుపు తిరిగింది. ప్రియురాలి కోసం భార్య కృతికాను హత్య చేసిన మహేంద్రరెడ్డికి, అదే ప్రియురాలు పోలీసుల ముందు వ్యతిరేకంగా మాట్లాడింది. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. కృతికారెడ్డి గతేడాది ఏప్రిల్ నెల 23న అనుమానాస్పదంగా మరణించారు. విచారణ చేపట్టిన పోలీసులు 2,322 పేజీల ఛార్జ్ షీట్ను నమోదు చేసి కోర్టుకు అందించారు. మారతహళ్లి పోలీసులు తీగలాగితే డొంకంత కదిలింది అన్న చందంగా కృతికారెడ్డి మరణించక ముందు ఏం జరిగిందో చెప్పాలంటూ డాక్టర్ మహేందర్రెడ్డి నుంచి వాగ్మూలం తీసుకున్నారు.ఆ వాంగ్మూలంలో ‘ఏప్రిల్ 23వ తేదీ రాత్రి నేను నా భార్యకు క్యాన్యులా (ఇంట్రావీనస్ పైపు) ద్వారా మందు ఇచ్చాను. మేము అర్ధరాత్రి నిద్రపోయాము. తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో నేను నిద్రలేచి క్యాన్యులాను తీసేశాను’అని డాక్టర్ మహేంద్ర రెడ్డి పేర్కొన్నారు. అంతే ఈ ఒక్క వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు విచారణ చేపట్టారు. దర్యాప్తులో భర్తే హంతకుడు అని నిర్ధారించేందుకు మొత్తం ఐదు రకాల ఆధారాలు, కారణాల్ని గుర్తించారు.ఇందుకోసం 23 డాక్టర్లతో పాటు బాధితురాలి కుటుంబ సభ్యులు,స్నేహితులు,సాక్షులు ఇలా 77 మంది నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. వాటి ఆధారంగా 2,322 పేజీల ఛార్జ్ షీట్ను కోర్టుకు అందించారు. విచారణ చేపట్టిన కోర్టు ఛార్జ్ షీట్లో 77మంది స్టేట్మెంట్, సేకరించిన ఆధారాలు,కారణాలు ఆధారంగా భర్తే హంతకుడని న్యాయస్థానం తేల్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తరుఫు న్యాయవాది ప్రసన్న కుమార్ కోర్టులో తన వాదనల్ని వినిపించారు.వైద్యురాలు హత్యకేసులో భర్తే ప్రధాన నిందితుడు. అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసును విచారించాం. విచారణలో భర్తే హంతకుడని తేలింది. అందుకు ఊతం ఇచ్చేలా ఐదు రకాల ఆధారాల్ని సైతం సేకరించాం. వాటిల్లో నిందితుడు పోలీసులకు ఇచ్చిన ‘ఏప్రిల్ 23వ తేదీ రాత్రి నేను నా భార్యకు క్యాన్యులా (ఇంట్రావీనస్ పైపు) ద్వారా మందు ఇచ్చాను. మేము అర్ధరాత్రి నిద్రపోయాము. తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో నేను నిద్రలేచి క్యాన్యులాను తీసేశాను’ స్టేట్మెంట్ కీలకంగా వ్యవహరించినట్లు చెప్పారు. నిందితుడు కృతికాతో ఆమె మరణానికి ముందు కొన్ని గంటలపాటు ఆమెతో ఉన్నాడని సాక్ష్యాలు నిర్ధారిస్తున్నాయి. వైద్య ఆధారాల ప్రకారం, కృతికా శరీరంలో ప్రొపోఫోల్ అనే శక్తివంతమైన అనస్థీషియా మందు ఆనవాళ్లు బయటపడ్డాయి. ముఖ్యంగా ఆమె కాళ్లలో కూడా ఈ ఆనవాళ్లు కనిపించడం, మందు బయట నుంచి ఇంజెక్షన్ ద్వారా ఇచ్చినట్లు స్పష్టంగా చూపుతోంది. కృతికా మరణం తర్వాత నిందితుడు పోస్ట్మార్టం జరగకుండా తీవ్రంగా వ్యతిరేకించాడు. తన మామగారు, కుటుంబ సభ్యులను ఒత్తిడి చేసి అడ్డుకోవాలని ప్రయత్నించాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఒక వైద్యుడిగా ఆయనకు పోస్ట్మార్టం ద్వారా నిజమైన మరణ కారణం బయటపడుతుందని తెలుసు’అదనంగా, నిందితుడు స్వయంగా ప్రొపోఫోల్ మందును ఒక ఫార్మసిస్ట్ వద్ద కొనుగోలు చేసినట్లు ఎలక్ట్రానిక్ ఆధారాలు చూపుతున్నాయి. “తన మొబైల్ ఫోన్ ద్వారా, తన బ్యాంక్ ఖాతా ద్వారా ఆన్లైన్ చెల్లింపు చేశాడు. కృతికా మరణం అనంతరం, నిందితుడు ఒక మహిళా స్నేహితురాలికి పేమెంట్ యాప్ ద్వారా సందేశాలు పంపినట్లు కూడా ఆధారాలు చూపుతున్నాయి.‘ప్రియురాలి కోసమే తన భార్యను హత్య చేసినట్లు చెప్పుకొచ్చాడు. కానీ సదరు ప్రియురాలు మాత్రం ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని కొట్టి పారేసింది. దీంతో ‘నేను ఎప్పటికీ హంతకుడిగానే ఉంటాను, నువ్వు సంతోషంగా జీవించు’ అని ప్రతిస్పందించాడు” అని ప్రాసిక్యూటర్ వెల్లడించారు. ఈ సందేశాలు నిందితుడి ఉద్దేశాన్ని, ప్రేరణను స్పష్టంగా చూపడమే కాకుండా, అతని నేరాన్ని ఒప్పుకున్నట్లుగా ఉన్నాయని ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించారు. జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్రరెడ్డి (32), డాక్టర్ కృతికారెడ్డి (28) 2024 మే 26న పెద్దలు వైభవంగా పెళ్లి చేశారు. ఇద్దరూ మారతహళ్లిలో నివాసం ఉన్నారు. డాక్టర్ కృతికారెడ్డి బెంగళూరు ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రిలో చర్మ రోగ నిపుణురాలుగా పనిచేసే వారు. అదే ఆసుపత్రిలో భర్త జనరల్ సర్జన్. కాగా, తన వివాహేతర సంబంధానికి డాక్టర్ కృతికారెడ్డి అడ్డుగా ఉందనే ఆమె భర్త డాక్టర్ మహేంద్రరెడ్డి దారుణానికి ఒడిగట్టాడు. ప్రియురాలితో సాన్నిహిత్యం కోసమే భార్యను హత్య చేశాడు. ఆ సమయంలో కృతిక సోదరి డాక్టర్ నిఖిత మీడియాతో మాట్లాడుతూ.. తన సోదరితో వివాహం కాక మునుపు నుంచే మరో వైద్యురాలితో మహేంద్రరెడ్డికి సంబంధం ఉందని ఆరోపించారు. వివామైన అనంతరమూ ఆ సంబంధాన్ని కొనసాగించాడని తప్పుబట్టారు. వివాహమైన రెండు నెలల నుంచే సొంతంగా ఆసుపత్రి పెట్టుకునేందుకు నగదు కావాలని ఒత్తిడి చేయడం, ఆ తర్వాత చికిత్స పేరిట ఎక్కువ మోతాదులో అనస్తీషియా డోసు ఇచ్చాడని ఆక్రోశించారు. ఆపై నేరం భయటపడుతుందనే ఉద్దేశ్యం తన అక్క భౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహించకుండా అడ్డుకునే ప్రయత్నించినట్లు మండిపడింది. -
రెండో పెళ్లి.. రూ.36 లక్షలతో భర్త జంప్
కర్ణాటక: విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడి, కూతురు పుట్టిన తరువాత రూ.36 లక్షల డబ్బుతో ఉడాయించిన ఘరానా భర్త ఉదంతమిది. బెంగళూరులో బనశంకరిపోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. ఓ యువతి భర్తకు అనారోగ్యం కారణంగా 2021లో విడాకులు తీసుకుని విడిగా ఉంటోంది. తరువాత మోసగాడు మోహన్రాజ్ పరిచయమై ప్రేమించింది, 2022లో వివాహం చేసుకున్నారు. తరువాతి ఏడాది వారికి కూతురు పుట్టింది. మోహన్రాజ్ను నమ్మిన ఆమె అడిగినంత డబ్బు ఇచ్చింది. కొత్తగా ఇల్లు కట్టిస్తానని చెప్పడంతో బంగారం కుదువ పెట్టి డబ్బులు ఇచ్చింది, ఇలా రూ.36 లక్షల వరకూ జేబులో వేసుకున్నాడు. గతేడాది ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటినుంచి జాడ లేదు. దీంతో కంగుతిన్న బాధితురాలు మోసపోయినట్లు గుర్తించింది. తనకు న్యాయం చేయాలని బనశంకరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
జస్ట్ మిస్ భయ్యా.. అదృష్టం అంటే వీరిదే..
బెంగళూరు: కొన్ని సందర్భాల్లో నువ్వు లక్కీ ఫెలో రా.. అని అంటుంటాం కదా.. సరిగ్గా అలాగే ఓ బ్యాచ్కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఎందుకు అనుకుంటున్నారా?.. అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను దాటుకుని వెళ్లి వారి వైపు దూసుకొచ్చింది. సెకన్ల వ్యవధిలో వారు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలో వైరల్ అవుతోంది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది.ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరులోని ఇందిరానగర్లో డెరిక్ టోనీ(42) ఫుల్లుగా మద్యం సేవించి తన స్కోడా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. 18వ మెయిన్ రోడ్డు నుండి 100 అడుగుల రోడ్డు వైపు వెళ్తున్నాడు. ఇంతలో మద్యం మత్తులో కారుపై నియంత్రణ కోల్పోయి.. రోడ్డు వద్ద ఎడమ వైపునకు తిరగాల్సి ఉండగా నేరుగా డ్రైవ్ చేశాడు. దీంతో, అతి వేగంలో ఉన్న కారు ఒక్కసారిగా డివైడర్పై నుంచి సినిమా రేంజ్లో జంప్ చేసి అవతలి వైపునకు దూసుకెళ్లింది.ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, చివరకు అక్కడే ఉన్న ‘బార్బెక్యూ నేషన్’ రెస్టారెంట్ గోడను బలంగా ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో రెస్టారెంట్ గోడ పూర్తిగా దెబ్బతినింది. ప్రమాదం శుక్రవారం రాత్రి 11:35 గంటల సమయంలో కొందరు వ్యక్తులు రెస్టారెంట్లో డిన్నర్ ముగించుకుని బయట నిలబడి ఉన్నారు. వారిపై కారు దూసుకెళ్లినప్పటికీ సెకన్ల వ్యవధిలో అప్రమత్తమైన బ్యాచ్.. ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అదృష్టవశాత్తూ ఈ భారీ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.ఇక, ఈ ఘటనలో కారు ఢీకొట్టిన బైక్ను నడుపుతున్న జాబిర్ అహ్మద్ అనే వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అతడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జీవన్ భీమా నగర్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం సేవించి కారు నడిపిన డెరిక్ టోనీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
498 ఏ, పొరుగింటి మహిళకు షాక్ : ఇలా కూడా కేసు పెట్టొచ్చా?
గృహహింస, వరకట్న వేధింపులకు గురవుతున్న మహిళలకు చట్టం కల్పించిన రక్షణ సెక్షన్ 498A. వివాహిత స్త్రీ పట్ల భర్త లేదా అతని బంధువుల హింస, వేధింపులను ఈ చట్టం ద్వారా ఎదుర్కోవచ్చు. వివాహంబంధంలో అత్తింటి వారినుంచి తనకెదురైన ఇబ్బందులు, బాధలనుంచి విముక్తి పొందేందుకు చట్టాన్ని ఆశ్రయించవచ్చు. అయితే ఈ కేసులో పొరుగింటివారి మీద కూడా కేసు నమోదు చేయవచ్చా? వారిని కూడా నిందితులుగా పేర్కొనవచ్చా? చట్టం ఏ చెబుతోంది? దీనిపై కర్ణాటక హైకోర్టు ఏం చెప్పింది?సెక్షన్ భారత శిక్షాస్మృతి (IPC) లోని సెక్షన్ 498A ప్రత్యేకంగా భర్త లేదా అతని బంధువులపై కేసు నమోదు చేయవచ్చు. ఎవరైనా, ఒక స్త్రీ భర్త లేదా భర్త బంధువు అయి ఉండి, ఆ వివాహితను క్రూరంగా హించినట్టు రుజువైతే వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానాకు కూడా విధించే అవకాశం ఉంది.అయితే ఒక కేసులో తన పొరిగింటి మహిళను విచారించాలని ఒక ఫిర్యాదు దారు కోరింది. ఈ కేసులో ఫిర్యాదు దారైన మహిళకు 2006లో జరిగిన వివాహం అయింది. వైవాహిక కలహాలు తలెత్తడంతో భర్తపై కేసు నమోదు చేసింది. హింసకు పాల్పడుతున్నాడంటూ భర్తపై ఫిర్యాదు చేసిన బాధితురాలు, పొరుగింటి మహళ తన భర్తను రెచ్చగొట్టిందని ఆరోపించింది. దీంతో పోలీసులు భర్తపైనే కాకుండా, పొరుగువారిపై కూడా ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించిన చార్జ్షీట్లో ఐపీసీలోని సెక్షన్లు 498A, 504, 506 మరియు 323 కింద కేసులు నమోదు చేయడంతో, ఆమె హైకోర్టును ఆశ్రయించింది. పిటిషనర్ తరపున హాజరైన న్యాయవాది చందన్ కె వాదిస్తూ, ఆమెకు ఇతర నిందితుల కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని, అనవసరంగా ఈ వివాదంలోకి లాగారన్నారు. భర్తను రెచ్చగొట్టిందనేది మాత్రమే ఆమెపై మోపిన ఏకైక ఆరోపణ అని, వ్యక్తిగత కక్షతో, ఆమెను నిందితురాలిగా చేర్చారని, ఈ కేసునుంచి ఆమెను తొలగించాలని వాదించారు.ప్రాసిక్యూషన్ ఈ పిటిషన్ను వ్యతిరేకించింది. న్యాయవాది కె నాగేశ్వరప్ప వాదిస్తూ, పొరుగున ఉన్న మహిళ భర్త ప్రవర్తనను ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషించిందని , "భర్త అన్ని ప్రవర్తనలకు ఆమెనే కారణం" అని పేర్కొన్నారు. కాబట్టి ఆమె విచారణను ఎదుర్కొని, చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని ఆయన వాదించారు.ఇదీ చదవండి: వీధి కుక్కల బెడద: నటి షర్మిలకు సుప్రీం స్ట్రాంగ్ కౌంటర్అయితే రికార్డులో ఉన్న సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత, సెక్షన్ 498A కింద ఆమెను నిందితురాలిగా చేర్చడానికి తగిన కారణాలేవీ లేవని కోర్టు గుర్తించింది. దీనిపై జస్టిస్ నాగప్రసన్న తీర్పునిస్తూ పిటిషనర్ పేరు కేవలం ప్రేరేపణ ఆరోపణల సందర్భంలో మాత్రమే వెలుగులోకి వచ్చిందని, కానీ ఆమె చట్టంలోని నిబంధన ప్రకారం కుటుంబం అనే నిర్వచనంలోకి రారని పేర్కొన్నారు. ఈ కేవలం ఆరోపణ తప్ప, చట్టం ప్రకారం క్రూరత్వానికి పాల్పడిన చర్యలలో ఆమె ప్రమేయం రాదని చెప్పారు. భర్త ,భార్య లేదా కుటుంబ సభ్యుల మధ్య ఐపిసి సెక్షన్ 498A కింద నేరాలకు సంబంధించిన విచారణలో ఒక అపరిచితురాలిని చేర్చలేరని ఆ ఉత్తర్వు నొక్కి చెప్పింది. అంతేకాదు ఈ కేసులో పొరుగింటి మహిళపై కేసును అనుమతించడం, న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని కోర్టు తీర్పు ఇచ్చింది. భర్త కుటుంబంలో భాగం కాని వ్యక్తి ఈ నిబంధన పరిధిలోకి రాదని, అందువల్ల, ఆమె విచారణను ఎదుర్కోవలసిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.ఇదీ దచవండి: అమ్మానాన్నల్ని ఫస్ట్ ఫ్లైట్ ఎక్కిస్తే.. ఆ కిక్కే వేరప్పా!అలాగే రమేష్ కన్నోజియా మరియు మరొకరు వర్సెస్ ఉత్తరాఖండ్ రాష్ట్రం ,మరొకరి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఈ సందర్భంగా హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది.ఇదీ చదవండి: టీనేజ్ లవర్స్ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి -
ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారా?
తెల్లవారు జామున లేవగానే.. రోడ్డుపై అడుగుపెట్టే వాహనదారులు.. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడెక్కడ ఉన్నారా? ఫోటోలు తీస్తున్నారా? చలానాలు వస్తాయెమోనన్న భయంతో బిక్కు బిక్కు మంటూ వెళ్లడం సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం. ఇక ముందు ట్రాఫిక్ పోలీసులున్నా.. లేకపోయినా... మనం మాత్రం ట్రాఫిక్ పోలీసుల కనుసైగల్లోనే ఉంటాం. నిబంధనలు ఉల్లంఘించగానే ఆ సమాచారం నేరుగా ట్రాఫిక్ కంట్రల్ రూం చేరి.. తద్వారా వాహనదారులకు జరిమానా చేరుతుంది. ఇదేం కొత్త టెక్నాలజీ అని ఆశ్చర్యపోతున్నారా.... అయితే జాగ్రత్తగా ఈ వీడియోను చూడండి..బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. నగరంలోని ట్రాఫిక్ సమస్యలను గమనించాడు. నిబంధనలు పాటించని వాహనదారుల కారణంగానే సమస్యలు పెరుగుతున్నాయని గుర్తించాడు. ట్రాఫిక్ పోలీసులున్నా.. వారిని గుర్తించి పట్టుకోలేరనే ధీమాతో వాహనదారులు ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేస్తున్నారని గుర్తించి అలాంటి వాహనదారులను చెక్ పెడితే.. ట్రాఫిక్ సమస్యలను కొంత వరకు నివారించవచ్చని ఊహించాడు. సాధారణంగా వాహనదారులు తమకు కేటాయించిన దార్లలో కాకుండా.. రాంగ్సైడ్ వెళ్లడం.. అతివేగంగా వెళ్లడంతోనే ప్రమాదాలు జరగడం.. ఫలితంగా ట్రాఫిక్ అంతరాయాలు ఉంటాయని.. ఆ సమస్య నివారణ కోసం ఫోకస్ చేశాడు.రోడ్డుపై పోలీసులు ఉన్నా లేకున్నా.. వాహనదారుడు మాత్రం క్రమశిక్షణ పాటించాల్సిందేనని.. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిని గుర్తించడానికి ఓ హెల్మెట్ను సృష్టించాడు. ఏఐ టెక్నాలజీతో కెమెరాతో అనుసంధానించిన ఆ హెల్మెట్ పెట్టుకుని వాహనదారుడు వెళ్తున్న సమయంలో రోడ్డుపై ఉన్న ఇతర వాహనాలపై ఆ హెల్మెట్ దృష్టి సారిస్తుంది. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాన్ని గుర్తించి వాటి ఫోటోలు తీసి ఏకంగా ట్రాఫిక్ అధికారులకు పంపించేలా ఏర్పాట్లు చేశాడు. ఆధారాలతో పోలీసులు తదుపరి చర్యలు చేపడతారు. కొత్త సాంకేతికతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేలా కృషి చేసిన బెంగళూరు నగర యువకుడు పంకజ్ తన్వర్ను బెంగళూరు పోలీసు కమిషనర్ అభినందించారు.i was tired of stupid people on road so i hacked my helmet into a traffic police device 🚨while i ride, ai agent runs in near real time, flags violations, and proof with location & no plate goes straight to police. blr people - so now ride safe… or regret it. pic.twitter.com/lWaRO01Jaq— Pankaj (@the2ndfloorguy) January 3, 2026ఈ హెల్మెట్ ఎలా పనిచేస్తుందంటే.. హెల్మెట్లో ఉన్న కెమెరాలో చిప్తో పాటు సిమ్ అమర్చి ఉంటుంది. తీసిన ఫోటోలు ఆటోమెటిక్గా పోలీసులకు అందుతాయి. అందులోని సాఫ్ట్వేర్ ఆధారంగా పోలీస్ కంట్రోల్ రూంకు మెయిల్ ద్వారా పంపించే ఏర్పాట్లు ఉన్నాయి. లభించిన ఆధారాలతో పోలీసులు వాహనదారుల్ని గుర్తించి చలానాలు విధించడం లేదా కోర్టులో హాజరు పరుస్తారు. ఇలాంటి కఠినచర్యలు తీసుకోవడంతో పాటు కనిపించని కెమెరాతో ఫోటోలు వస్తాయని వాహనదారులకు తెలిస్తే రోడ్డు నిబంధనలు పాటించే అవకాశముంది. -
మగవాళ్ల మూడ్.. నటి వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం
వీధికుక్కల కేసు విచారణలో.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తున్నది తెలిసిందే. అయితే కోర్టు వ్యాఖ్యల ఆధారంగా ప్రముఖ నటి, మాజీ ఎంపీ రమ్య(దివ్య స్పందన) చేసిన ఓ పోస్ట్పై నెటిజన్స్ భగ్గుమంటున్నారు. కుక్కలను.. మగవాళ్లకు ముడిపెట్టి ఆ పోస్ట్ ఉండడమే అందుకు కారణం. వీధి కుక్కల అంశంపై మరోసారి విచారణ జరుపుతున్న సర్వోన్నత న్యాయస్థానం.. వీధి కుక్కలను(Dogs) వాటి ప్రవర్తన ఆధారంగా వర్గీకరించడం సాధ్యం కాదంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే ‘‘ఫలానా కుక్క కాటేస్తుంది.. ఫలానాది కాటేయదు అని వీధుల్లో తిరిగే కుక్కలను చూసి ముందుగా తెలుసుకోవడం సాధ్యం కాదు. వీధి కుక్కల మూడ్ ను ఎవరు అర్థం చేసుకోలేరు’’ అంటూ బుధవారం విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై రమ్య తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ చేశారు. ‘మరి మగవాళ్ల మైండ్ను కూడా చదవలేం. వాళ్ళు ఎప్పుడు లైంగికదాడి చేస్తారో.. ఎప్పుడు హత్య చేస్తారో తెలియదు. కాబట్టి వాళ్లందరినీ జైలులో పెట్టాలా?’ అని ఇన్స్టాలో ఓ పోస్టు చేశారు. దీంతో కుక్కలతో పోలుస్తావా? అంటూ కొందరు పురుషులు నటి రమ్యపై భగ్గుమంటున్నారు. ఆమె క్షమాపణలు చెప్పేదాకా ఊరుకునేది లేదని.. అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. కన్నడ నటి రమ్య అలియాస్ దివ్య స్పందనకు శాండల్వుడ్ క్వీన్గా పేరుంది. ఆమె తెలుగు, తమిళ్ భాషల్లోనూ నటించారు. ఆ తర్వాత రాజకీయాల్లో చేరారు. కాంగ్రెస్ తరఫున 2013 మాండ్య లోక్సభ ఉప ఎన్నికల్లో నెగ్గి ఎంపీ అయ్యారు. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. యువతలో ఆమెకు ఉన్న క్రేజ్ గుర్తించి.. రాహుల్ గాంధీ ఆమెకు సోషల్ మీడియా వింగ్ను అప్పగించారు. ఈ క్రమంలోనే తరచూ పలు అంశాలపై స్పందిస్తూ వస్తున్నారు. కన్నడనాట సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో స్టార్ నటుడు దర్శన్ నిందితుడిగా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కన్నడ సినీ పరిశ్రమ మౌనంగా ఉండిపోయింది. అయితే.. ఎంతటి వారైనా చేసినదానికి ఫలితం అనుభవించాల్సిందే అంటూ రమ్య స్పందించడంతో దర్శన్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఆమెను రేప్ చేస్తామని, చంపుతామంటూ సోషల్ మీడియాలో బెదిరింపులకు దిగారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. -
యువతి తల్లికి ప్రేమోన్మాది నిప్పు..
కర్ణాటక: ఓ మహిళ ఆమె కూతురితో పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమోన్మాది పెట్రోలు చల్లి నిప్పంటించడంతో మహిళ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరికి కన్నుమూసింది. బాధితురాలు గీత (42) విక్టోరియా ఆసుపత్రిలో గత 20 రోజులుగా చావుబతుకుల మధ్య పోరాడుతూ మంగళవారం రాత్రి చనిపోయింది. వివరాలు.. గీతా బసవేశ్వరనగర బోవికాలనీలో కిరాణా షాపును నడుపుతోంది. అక్కడే ప్రేమోన్మాది ముత్తు టీస్టాల్ పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంతో గీత కుమార్తె (19)ను ముత్తు ప్రేమించాడు. ఆమెతో తనకు వివాహం చేయాలని గీతను కోరేవాడు, ఇందుకు ఆమె నిరాకరించేది. కోపోద్రిక్తుడైన అతడు.. గీత ఇంట్లో ఉండగా పెట్రోలు చల్లి నిప్పు అంటించి ఉడాయించాడు. తీవ్రంగా గాయపడిన గీత ఆస్పత్రిలో మరణించింది. స్థానిక పోలీసులు దుండగున్ని అరెస్ట్ చేశారు. -
క్వార్టర్స్లో కర్ణాటక, ముంబై
అహ్మదాబాద్: ప్రతిష్ఠాత్మక దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక, ఢిల్లీ, యూపీ, ముంబై, పంజాబ్ జట్లు క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాయి. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్లో కర్ణాటక 150 పరుగుల తేడాతో రాజస్తాన్పై గెలుపొందింది. లీగ్ దశలో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లాడిన కర్ణాటక అన్నింట్లోనూ గెలిచి 24 పాయింట్లతో క్వార్టర్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది.కెప్టెన్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మయాంక్ అగర్వాల్ (107 బంతుల్లో 100; 9 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీతో ఆకట్టుకోగా... దేవదత్ పడిక్కల్ (82 బంతుల్లో 91; 12 ఫోర్లు, 2 సిక్స్లు) త్రుటిలో ఆ అవకాశం కోల్పోయాడు. అనంతరం లక్ష్యఛేదనలో రాజస్తాన్ 38 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌటైంది. కరణ్ లాంబా (55)టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ మానవ్ సుతార్ (4), దీపక్ హూడా (29) సహా తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. కర్ణాటక బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 5 వికెట్లు పడగొట్టాడు. ఇదే గ్రూప్లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్ల్లో తమిళనాడు 54 పరుగుల తేడాతో త్రిపురపై... జార్ఖండ్ 2 వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్పై... కేరళ 8 వికెట్ల తేడాతో పాండిచ్చేరిపై విజయాలు సాధించాయి. యూపీ ‘సిక్సర్’ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న ఉత్తరప్రదేశ్ (యూపీ) జట్టు విజయ్ హజారే వన్డే టోర్నమెంట్లో వరుసగా ఆరో విజయం నమోదు చేసుకుంది. మంగళవారం రాజ్కోట్ వేదికగా జరిగిన పోరులో ఉత్తరప్రదేశ్ 54 పరుగుల తేడాతో విదర్భపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఉత్తర ప్రదేశ్ నిరీ్ణత 50 ఓవర్లలో 5 వికెట్లకు 339 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిషేక్ గోస్వామి (109 బంతుల్లో 103; 10 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీతో చెలరేగగా... కెపె్టన్ రింకూ సింగ్ (30 బంతుల్లో 57; 4 ఫోర్లు, 2 సిక్స్లు), ధ్రువ్ జురేల్ (56; 5 ఫోర్లు, 1 సిక్స్), ప్రియమ్ గార్గ్ (67; 6 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. అనంతరం ఛేదనలో విదర్భ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 285 పరుగులకు పరిమితమైంది.అమన్ మోఖడే (117 బంతుల్లో 147; 17 ఫోర్లు, 2 సిక్స్లు) ‘శత’క్కొట్టగా... అక్షయ్ వాడ్కర్ (51 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్సెంచరీ సాధించాడు. యూపీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా... కార్తిక్ త్యాగీ, విప్రాజ్ నిగమ్ చెరో రెండు వికెట్లు తీశారు. గ్రూప్ దశలో ఆడిన 6 మ్యాచ్ల్లోనూ గెలిచిన యూపీ జట్టు 24 పాయింట్లతో ‘టాప్’లో నిలిచి క్వార్టర్స్కు చేరింది. ఇదే గ్రూప్లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్ల్లో బరోడా 76 పరుగుల తేడాతో జమ్ముకశ్మీర్పై... హైదరాబాద్ 107 పరుగుల తేడాతో జమ్మూకశ్మీర్పై... చండీగఢ్ 7 వికెట్ల తేడాతో అస్సాంపై గెలుపొందాయి. గెలిపించిన శ్రేయస్, ముషీర్ యువ ఆటగాడు ముషీర్ ఖాన్ (51 బంతుల్లో 73; 8 ఫోర్లు, 3 సిక్స్లు; 1/47) ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చడంతో ముంబై జట్టు ఐదో విజయం ఖాతాలో వేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా... మంగళవారం జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై 7 పరుగుల తేడాతో హిమాచల్ ప్రదేశ్పై గెలుపొందింది. ఈ మ్యాచ్ను 33 ఓవర్లకు కుదించగా... మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 9 ఓవర్లలో 299 పరుగులు చేసింది. కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ (53 బంతుల్లో 82; 10 ఫోర్లు, 3 సిక్స్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ముషీర్ ఖాన్ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. టీమిండియా ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ (15), సర్ఫరాజ్ ఖాన్ (21), సూర్యకుమార్ యాదవ్ (24), శివమ్ దూబే (20) భారీ ఇన్నింగ్స్లు ఆడలేకపోయారు. గాయం నుంచి కొలుకున్న అనంతరం ఆడిన తొలి మ్యాచ్లో శ్రేయస్ చక్కటి స్ట్రోక్ ప్లేతో అదరగొట్టాడు.హిమాచల్ ప్రదేశ్ బౌలర్లలో వైభవ్ అరోరా, అభిషేక్ కుమార్, కుషాల్ పాల్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో హిమాచల్ ప్రదేశ్ 32.4 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. పుఖ్రాజ్ మన్ (64; 7 ఫోర్లు, 3 సిక్స్లు), అంకుష్ బెయిన్స్ (53; 4 ఫోర్లు, 3 సిక్స్లు), మయాంక్ డాగర్ (64; 11 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో పోరాడారు. ముంబై బౌలర్లలో శివమ్ దూబే 4 వికెట్లు పడగొట్టాడు. గ్రూప్ ‘సి’లో పంజాబ్, ముంబై చెరో 5 విజయాలతో 20 పాయింట్లు సాధించి పట్టిక తొలి రెండు స్థానాల్లో నిలిచి రెండు జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరాయి.. ఇదే గ్రూప్లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్ల్లో ఉత్తరాఖండ్ 6 వికెట్ల తేడాతో సిక్కీంపై... పంజాబ్ 6 వికెట్ల తేడాతో గోవాపై... ఛత్తీస్గఢ్ 6 పరుగుల తేడాతో మహారాష్ట్రపై గెలిచాయి. ప్రియాన్‡్ష ఆర్య మెరుపులు వికెట్ కీపర్ రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు విజయ్ హజారే టోర్నీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం ఆలూరు వేదికగా జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో రైల్వేస్పై గెలుపొందింది. మొదట రైల్వేస్ 40.4 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. కుష్ మరాథె (51; 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ సాధించగా... మిగిలిన వాళ్లంతా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ఆయుశ్ బదోనీ, నవ్దీప్ సైనీ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 21.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రియాన్‡్ష ఆర్య (41 బంతుల్లో 80; 12 ఫోర్లు, 3 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... సార్థక్ రంజన్ (33; 5 ఫోర్లు), నితీశ్ రాణా (38 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు), రిషబ్ పంత్ (24; 1 ఫోర్, 3 సిక్స్లు) తలో చేయి వేశారు.గ్రూప్ దశలో ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఐదింట గెలిచిన ఢిల్లీ 20 పాయింట్లతో పట్టికలో ‘టాప్’లో నిలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. ఢిల్లీ జట్టు ఈ టోరీ్నలో నాకౌట్ దశకు చేరడం గత ఐదేళ్లలో ఇదే తొలిసారి. ఇదే గ్రూప్లో జరిగిన ఇతర మ్యాచ్ల్లో సౌరాష్ట్ర 111 పరుగుల తేడాతో సర్వీసెస్పై... గుజరాత్ 233 పరుగుల తేడాతో ఒడిశాపై విజయాలు సాధించగా... హరియాణా, ఆంధ్ర జట్ల మధ్య మ్యాచ్ ‘టై’గా ముగిసింది. మరోవైపు ప్లేట్ గ్రూప్ ఫైనల్లో బిహార్ 6 వికెట్ల తేడాతో మణిపూర్పై విజయం సాధించింది. -
పెద్ద కళ్ల తోటి.. ఎక్కడ చూసినా ఆమే.. ఎవరీమె?
సోషల్ మీడియా రోజుకో వింత వైరల్గా మారుతుంది. తాజాగా మరోసారి వైరల్ వింత మిస్టరీగా మార్చింది. ఎక్కడ చూసినా ఆమె ఫోటోనే. ఇంతింత కళ్లతో ఉన్న ఒక మహిళ ఫోటోను దిష్టి బొమ్మలా కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాలలో తెగ వాడేస్తున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ దీనిపై ఎక్స్లో ఒక పోస్ట్ పంచుకోవడంతో చర్చ జోరందుకుంది. బెంగళూరు వెలుపల ఉన్న ఒక నిర్మాణ స్థలంలో ఈ ఫోటో చూశాననీ, Google Lens, ఆన్లైన్ శోధనలను ప్రయత్నించానని, కానీ స్పష్టమైన సమాధానాలు దొరకలేదని చెప్పుకొచ్చింది. ఇంతకీ "ఆమె ఎవరు?" కోరింది. దీంతో ఆన్లైన్లో హాస్యాస్పదమైన ఊహాగానాలతోపాటు, రకరకాల సమాధానాలు వచ్చాయి.I see this woman everywhere in Karnataka outside bangalore where there’s a construction happening. I tried google lens to check for discussions but can’t find any details. Who is she? pic.twitter.com/RAgMDXXJMt— unc unitechy (@unitechy) January 5, 2026కర్ణాటకలో నిర్మాణ ప్రదేశాలు, దుకాణాలు, పొలాలలో కూడా పదే పదే కనిపించే ఒక మహిళ ఫోటోపై దృష్టి సారించింది. సగం నిర్మించిన ఇళ్ల నుండి వ్యవసాయ భూమి వరకు ఈ మహిళ ఫోటోను ఎందుకు పెట్టారనే చర్చ ఇంటర్నెట్ వినియోగదారులను ఆశ్చర్యపర్చింది. ఆఖరికి AI చాట్బాట్లను కూడా ఈ పిక్ గురించి అడిగేశారు. ఈ ఫోటోను'దిష్టి పరిహారం'గా వాడుతున్నారని కొందరంటే, చిక్కబల్లాపుర సమీపంలోని ఒక పొలంలో దిష్టిబొమ్మలా ఇదే ఫోటోలను చూశానని మరొకరు కమెంట్ చేశారు.ఇదీ చదవండి: గ్వాలియర్లో దారుణం మహిళల బొమ్మల్ని కూడా .. వీడియో వైరల్This lady is Niharika Rao, a You Tuber. Hundreds of people in Karnataka are putting up her photo in front of their shops, houses, farms to ward off negativity (drishti)This, is the true power of feminism pic.twitter.com/xsPRbFX7OD— 𝕲𝖆𝖓𝖊𝖘𝖍 * (@ggganeshh) May 16, 2024ఇంతకీ ఆమె ఎవరంటేగణేష్ అనే వినియోగదారు వివరణాత్మక వివరణ ఇవ్వడంతో దీనిపై ష్టత వచ్చింది. అతని ప్రకారం, ఫోటోలో ఉన్న మహిళ పేరు నిహారిక రావు. ఒక యూట్యూబర్. స్థానికులు ఆమె ఫోటోను ఇళ్ళు, దుకాణాలు, పొలాలు, నిర్మాణ ప్రదేశాల వెలుపల ఉంచిన తరువాత నెగిటివిటీ పోయిందట, మంచి జరిగిందట. ఇది ఆ నోటా ఈ నోటా పాకి దీన్ని దిష్టిబొమ్మగా వాడేస్తున్నారన్నమాట. ఇదీ చదవండి: సీనియర్ వేధింపులకు బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు వైద్యురాలి బలి -
మరో సెంచరీ తృటిలో మిస్.. అయినా, చరిత్ర సృష్టించిన పడిక్కల్
లిస్ట్-ఏ క్రికెట్లో కర్ణాటక ఆటగాడు, టీమిండియా తాజా సంచలనం దేవ్దత్ పడిక్కల్ తన డ్రీమ్ రన్ను కొనసాగిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఇప్పటికే 5 మ్యాచ్ల్లో 4 సెంచరీలు చేసిన పడిక్కల్.. తాజాగా మరో సెంచరీని తృటిలో మిస్ అయ్యాడు. రాజస్థాన్తో ఇవాళ (జనవరి 6) జరుగుతున్న మ్యాచ్లో 82 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 91 పరుగులు చేసి 9 పరుగుల స్వల్ప తేడాతో సెంచరీని కోల్పోయాడు.తాజా ప్రదర్శనతో పడిక్కల్ మరోసారి భారత సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. ఇప్పటికే ఏం చేయాలో తెలియక జట్టు పీక్కుంటున్న సెలెక్టర్లను పడిక్కల్ మరింత ఇరకాటంలో పడేశాడు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు భారత జట్టును ఇదివరకే ప్రకటించడంతో పడిక్కల్ టీమిండియా తలుపులు తట్టేందుకు ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే. 38 ఇన్నింగ్స్ల స్వల్ప లిస్ట్-ఏ కెరీర్లో పడిక్కల్ 13 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు చేసి తిరుగులేని రికార్డు కలిగి ఉన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. పడిక్కల్ సెంచరీ మిస్ అయినా మరో ఓపెనర్ కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (100) సెంచరీతో మెరిశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక భారీ స్కోర్ (324/7) చేసింది. ఈ మ్యాచ్లో టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కర్ణాటక తరఫున బరిలోకి దిగాడు. 28 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో స్టార్ బ్యాటర్ కరుణ్ నాయర్ 14 పరుగులకే ఔటై నిరాశ పరిచాడు. రాజస్థాన్ బౌలర్లలో కుక్కా అజయ్ సింగ్, మానవ్ సుతార్ చెరో 2, ఖలీల్ అహ్మద్, అమన్ సింగ్, అశోక్ శర్మ తలో వికెట్ తీశారు.చరిత్ర సృష్టించిన పడిక్కల్తాజా ఇన్నింగ్స్తో ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ ఎడిషన్లో పడిక్కల్ పరుగుల సంఖ్య 600 మార్కును దాటింది. పడిక్కల్ గతంలోనూ రెండు ఎడిషన్లలో 600 పరుగుల మార్కును క్రాస్ చేశాడు. తద్వారా విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో మూడు వేర్వేరు ఎడిషన్లలో 600 పరుగులు సాధించిన తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు.పడిక్కల్ తొలిసారి 2019-2020 ఎడిషన్లో 600 పరుగుల మార్కును (11 ఇన్నింగ్స్ల్లో 609 పరుగులు) తాకాడు. ఆతర్వాతి ఎడిషన్లో (2020-21) మరోసారి 600 మార్కును దాటాడు. ఈసారి 8 ఇన్నింగ్స్ల్లో ఏకంగా 737 పరుగులు సాధించాడు. ఆ ఎడిషన్లో అతను వరుసగా నాలుగు సెంచరీలు చేసి పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ప్రస్తుత ఎడిషన్లో (2025-26) పడిక్కల్ మూడోసారి 600 పరుగుల మార్కును దాటాడు. ఈ ఎడిషన్లో ఇప్పటివరకు 6 ఇన్నింగ్స్లు ఆడిన అతను.. నాలుగు సెంచరీలు, ఓ భారీ హాఫ్ సెంచరీ సాయంతో 605 పరుగులు చేశాడు. -
చరిత్ర సృష్టించనున్న సిద్ధరామయ్య..!
సాక్షి బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. జనవరి ఆరు రేపటితో అత్యధిక కాలం ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రికార్డును ఆయన సమం చేయనున్నారు. ఆ తరువాత రోజుతో అధిక కాలం పనిచేసిన వ్యక్తిగా కొత్త రికార్డు సృష్టించనున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ముఖ్యమంత్రి అనుచరులు, శ్రేయోభిలాషులు సంబురాలు చేసుకుంటున్నారు.కొద్ది రోజుల క్రితం కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠం కోసం జరిగిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇద్దరూ సీఎం కుర్చీ కోసం పోటీపడ్డారు. ఈ నేపథ్యంలో హైకమాండ్ ఎంట్రీతో ప్రస్తుతానికి ఆ విషయం సద్దుమణిగింది. అయితే ఇదిలా ఉండగా ప్రస్తుతం సిద్ధరామయ్య సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. రేపటితో అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన కాలాన్ని సమం చేసిన ఆయన... ఎల్లుండితో ఆ రికార్డు బద్దలు కొట్టనున్నారు.ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డి. దేవరాజ్ ఉర్స్ ఇంతకాలం వరకూ అక్కడ అధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఉన్నారు. ఆయన 1972-77, 1978-80 కాలంలో సీఎంగా కర్ణాటకకు సేవలంధించారు. మెుత్తంగా ఆయన 7సంవత్సరాల 239రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే రేపటితో సిద్ధరామయ్య ఆరికార్డును సమం చేస్తారు. 2013-18తో పాటు 2023నుంచి ఆయన సీఎంగా కొనసాగుతున్నారు. దీంతో జనవరి ఏడుతో అత్యధిక కాలం కర్ణాటకకు సీఎంగా పనిచేసిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించనున్నారు.అయితే ఈ రికార్డుపై సిద్ధరామయ్య స్పందించారు... "ప్రజల ప్రేమ ఆశీర్వాదం వల్లే ఇంతకాలం పాటు ముఖ్యమంత్రిగా సేవలంధించా, రాజకీయాల్లోకి ప్రవేశించేటప్పుడు మంత్రి, ముఖ్యమంత్రిగా సేవలంధిస్తానని నేను అనుకోలేదు. కేవలం ఎమ్మెల్యేగా గెలవాలనుకున్నాను". అని సిద్ధరామయ్య అన్నారు. ఇప్పటివరకూ తాను మెుత్తం 13 ఎన్నికల్లో పోటీచేస్తే ఎనిమిది ఎన్నికల్లో గెలిచానని తెలిపారు.తొలిసారి తాను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రజలే తనకు నిధులు సమకూర్చి గెలిపించారన్నారు. సచిన్ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలుగొట్టినట్లుగా తాను వాటిని అధిగమించానని సిద్ధరామయ్య సరదాగా అన్నారు. -
బంగారం పేపర్లతో భగవద్గీత!
యశవంతపుర: కర్ణాటకలోని ప్రఖ్యాత ఉడుపి శ్రీకృష్ణ ఆలయానికి ఢిల్లీకి చెందిన ఓ భక్తుడు రూ.2 కోట్ల విలువగల బంగారం పేపర్లతో రూపొందించిన భగవద్గీత గ్రంథాన్ని కానుకగా ఇవ్వనున్నారు. 18 అధ్యాయాల్లో 700 స్లోకాలను పొందుపరిచిన స్వర్ణ భగవద్గీతను (Golden Bhagavad Gita) విశ్వగీతా పర్యాయ ముగింపు రోజున మఠాధిపతి విద్యాధీశతీర్థ స్వామికి అందజేయనున్నారు. శ్రీకృష్ణ మఠం చరిత్రలో ఇది అపరూపమైన కానుకగా చెప్పుకోవచ్చు. ఈ నెల 8న బంగారు రథంలో ఊరేగింపుగా తీసుకొచ్చి మఠానికి బహూకరిస్తారు.వైభవంగా అధ్యయనోత్సవాలుయాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఆదివారం వైభవంగా ముగిశాయి. పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలో శ్రీస్వామిని ఆరవ రోజు శ్రీలక్ష్మీనరసింహ స్వామిగా అలంకరించి తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ‘ఇరామానుజ నుత్తందాది ఉపదేశ రత్తినమాలై’అనుసంధానం చేసి, అధ్యయనోత్సవాలకు పరిసమాప్తి పలికారు. కాగా.. ఆరు రోజుల పాటు రద్దు చేసిన నిత్య, శాశ్వత కల్యాణాలు, బ్రహ్మోత్సవం, శ్రీసుదర్శన నారసింహ హోమం పూజలు సోమవారం పునః ప్రారంభం అయ్యాయి.– యాదగిరిగుట్ట ధర్మ దర్శనానికి 3 గంటలుయాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు శ్రీస్వామిని దర్శించుకునేందుకు అధికంగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, మాడవీధులు వంటి ప్రాంతాల్లో భక్తులు అధికంగా కనిపించారు.శ్రీస్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ధర్మ దర్శనానికి 3 గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. శ్రీస్వామిని 35 వేల మందికిపైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో శ్రీవారికి నిత్యాదాయం రూ.40,81,041 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. చదవండి: ఆథ్యాత్మిక కథ.. తిరగలి చూడాలి! -
పెళ్లికి నిరాకరించిందని వివాహితను హత్య చేసి.. ఆ తర్వాత
యల్లాపుర: కర్ణాటకలో విషాద ఘటన చోటుచేసుకుంది ఓ వివాహిత.. తన బాల్య స్నేహితుడి చేతిలో హత్యకు గురైంది. హత్య అనంతరం ఆ యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. యల్లాపుర పట్టణంలో ఈ ఘటన జరిగింది. తాను వివాహానికి అంగీకరించకపోవడంతో ఆమె స్నేహితుడే కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. స్నేహితురాలిని హత్య చేసిన నిందితుడు రఫిక్ ఇమామ్సాబ్ సమీపంలోని అడవిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు.బాధితురాలు రంజిత బనసోడే, నిందితుడు రఫిక్ ఇద్దరూ పాఠశాల రోజుల నుంచే స్నేహితులు. రంజిత సుమారు 12 ఏళ్ల క్రితం మహారాష్ట్రకు చెందిన సచిన్ కటేరాను వివాహం చేసుకుంది. వీరికి 10 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఆమె భర్తతో వేరుగా ఉంటూ.. యల్లాపురలో తన కుటుంబంతో నివసిస్తోంది. రంజిత ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన సహాయకురాలిగా పనిచేస్తోంది. రఫిక్ తరచుగా రంజిత ఇంటికి భోజనానికి వచ్చేవాడు.అతను పెళ్లి చేసుకోమని రంజితను ఒత్తిడికి గురిచేసేవాడు. పెళ్లికి రంజితతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన రఫిక్.. రంజిత పనివేళ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో పదునైన కత్తితో దాడి చేశాడు. రంజితను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. కొన్ని గంటల తర్వాత రఫిక్ సమీప అడవిలో ఉరేసుకుని మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. అతని వద్ద తాడు, మద్యం సీసా కూడా లభించాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఉత్తర కన్నడ జిల్లా ఎస్పీ దీపన్ ఎం.ఎన్. తెలిపారు. -
బళ్లారి గన్ ఫైట్ ఎపిసోడ్లో ట్విస్టులు.. ఎస్పీపై వేటు
సాక్షి, బళ్లారి: ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడంలో తలెత్తిన వివాదం కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో రణరంగానికి దారితీసింది. గంగావతి ఎమ్మెల్యే.. మాజీమంత్రి గాలి జనార్దన్రెడ్డి, బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి వర్గీయుల మధ్య ఈ వివాదం చెలరేగింది. ఇది చినికి చినికి గాలివానగా మారి చివరకు కాల్పులకు దారితీసింది. కాల్పుల్లో ఒకరు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో 144 సెక్షన్ విధించగా.. ఇవాళ జరగాల్సిన వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమం వాయిదా వేశారు. అయితే.. ఈ ఘటనకు బాధ్యుడ్ని చేస్తూ బళ్లారి ఎస్పీ పవన్ నిజ్జూర్ సస్పెన్షన్ వేటు వేసింది కర్ణాటక ప్రభుత్వం. కాల్పుల్లో ఒకరు మరణించడం.. మరొకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండడం.. వెరసి సకాలంలో కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ప్రభుత్వం ఆయనపై ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అయితే గురువారమే ఆయన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించగా.. ఛార్జ్ తీసుకున్న కొన్ని గంటల్లోనే సస్పెండ్ కావడంపై పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు.. గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి వద్ద జరిగిన పరిణామాలపై ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డిపైనా కేసు నమోదు అయ్యింది. భరత్తో పాటు 40 మంది కాంగ్రెస్ కార్యకర్తలపైనా కేసు నమోదు అయినట్లు సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంలో గాలి జనార్దన్తో పాటు 11 మంది బీజేపీ నేతలపైనా కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఇక కాల్పుల ఘటనను తీవ్రంగా పరిగణించిన సీఎం సిద్ధరామయ్య.. సమగ్ర విచారణ జరిపి తనకు నివేదిక ఇవ్వాలని పోలీస్ శాఖను ఆదేశించారు. వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం.. నారా భరత్రెడ్డి పేరుతో సిటీలో ఫ్లెక్సీలో వేశారు. గురువారం రాత్రి గాలి జనార్దన్రెడ్డి ఇంటి ముందు కూడా బ్యానర్ కట్టాలని భరత్రెడ్డి అనుచరుడు, కాంట్రాక్టరు సతీశ్రెడ్డి మరికొందరు వెళ్లారు. అయితే గాలి అనుచరులు వాళ్లను అడ్డుకున్నారు. ఇదే విషయాన్ని జనార్ధన్రెడ్డి కూడా వారికి చెప్పి గంగావతికి వెళ్లిపోయారు. కానీ, సతీష్రెడ్డి అక్కడే ఉండి బ్యానర్ కట్టాలని తన అనుచరులను ఆదేశించాడు. ఇది తెలిసి మాజీమంత్రి శ్రీరాములు అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. పెద్దఎత్తున జనం చేరడంతో గాలి జనార్దన్రెడ్డి రాత్రికి మళ్లీ బళ్లారికి తిరిగి వచ్చారు. బీజేపీ–కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరడంతో పరిస్థితి వేడెక్కింది. అంతలోనే ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. సతీష్రెడ్డి తన ప్రైవేటు గన్మెన్ వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో జనం చెల్లాచెదురు కావడంతో ఘర్షణ పరిస్థితి తలెత్తింది. ఇరు వర్గాలను అదుపుచేసేందుకు పోలీసులు ఎనిమిది రౌండ్ల కాల్పులు జరిపారు. అయితే కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతి చెందగా.. సతీష్రెడ్డికి బుల్లెట్ గాయంతో ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై గాలి జనార్దన్రెడ్డి, నారా భరత్రెడ్డి పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నారు.పోలీసులు గాలి జనార్దన్రెడ్డి, శ్రీరాములు, గాలి సోమశేఖరరెడ్డికి ఉన్న మొత్తం ఏడుగురు గన్మెన్లను పిలిపించి విచారణ జరిపారు. ఈ కాల్పులు జరిపింది ప్రభుత్వం నియమించిన గన్మెన్లు కాదని తేల్చారు. అక్కడ ప్రైవేటు వ్యక్తి జరిపిన కాల్పులవల్లే రాజశేఖర్రెడ్డి మృతిచెందినట్లు ఇన్చార్జి ఎస్పీ రంజిత్ బండారి వెల్లడించారు. -
ఆ సర్వేతో మా ప్రభుత్వానికి సంబంధమే లేదు
మెజారిటీ ప్రజలు ఈవీఎంలకు వ్యతిరేకంగా లేరని.. పక్కాగా పని చేస్తాయని నమ్ముతున్నారని కర్ణాటక నుంచి ఒక సర్వే విడుదలైంది. అయితే.. ఈ ఫలితం ఆధారంగానే కాంగ్రెస్ పార్టీపై బీజేపీ విరుచుకుపడుతోంది. ఇంతకాలం కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదనే విషయం ప్రజాభిప్రాయంతోనే బయటపడిందని ఎద్దేవా చేస్తోంది. ఈ తరుణంలో ఆ సర్వేకు తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కర్ణాటక కాంగ్రెస్ ట్విస్ట్ ఇచ్చింది.2024 లోక్సభ ఎన్నికలపై నిర్వహించిన ఈ సర్వేలో.. 83.61 శాతం మంది ఈవీఎంలు విశ్వసించదగినవేనని వెల్లడించారు. కచ్చితమైన ఫలితాలను ఇస్తాయని 69.39 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్ణాటక మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ అథారిటీ దీనిని నిర్వహించింది. అయితే.. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ అనుమతితో తాము సర్వే నిర్వహించినట్లు సదరు సంస్థ ప్రకటించుకుంది. అయితే..ఈ సర్వేతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని ఐటీ మంత్రి ప్రిియాంక్ ఖర్గే తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించలేదని, నిర్వహించాలని ఆదేశించమూ లేదని పేర్కొన్నారు. పైగా సర్వేపై ఆయన అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ‘‘మొదటగా చెప్పేది ఏంటంటే.. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది కాదు. రెండోది.. ఈ సర్వేను కేంద్ర ఎన్నికల సంఘం విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ఎన్జీవో సమన్వయంతో నిర్వహించింది. అయితే..ఆ ఎన్జీవోను నడిపే వ్యక్తి.. ప్రధాని కార్యాలయానికి దగ్గరగా పనిచేసే వ్యక్తి. ప్రధాని కోసం అతగాడు ఓ పుస్తకం కూడా రాశాడు. వీటికి తోడు.. సుమారు 110కి పైగా నియోజకవర్గాల్లో కేవలం 5,000 మందిని మాత్రమే సర్వే చేసినట్లు చెబుతున్నారు. అలాంటప్పుడు ఈ డేటాను ఎంత నమ్మొచ్చు?.. ఇంతకు మించి ఏం ఆశించొచ్చు’’ అని ప్రశ్నించారాయన. ఈ సర్వేను విశ్వసనీయంగా భావించడం లేదని.. దీని వెనుక రాజకీయ ఉద్దేశ్యం ఉందని అన్నారాయన.ఈ ఫలితం ఆధారంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్న బీజేపీ.. కలబుర్గి, అలంద్ ప్రాంతాల్లో జరిగిన ఓటు చోరీపై మాత్రం ఇప్పటిదాకా సమాధానం ఇవ్వలేదని ప్రియాంక్ ఖర్గే మండిపడ్డారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్సభ ఎన్నికల ముందు ఈసీ, బీజేపీలు కలిసి కలిసి పెద్ద ఎత్తున ఓటర్ల తొలగింపులు చేశారని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్న అంశాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఓట్చోరీ రాజకీయం ప్రదానంగా కర్ణాటక నుంచే నడుస్తోంది. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు బీజేపీ ఎన్నికల సంఘంతో కలిసిపోయి ఎన్నికల్లో ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకుంటోందని విమర్శిస్తున్నాయి. అలాగే ఎన్నికల ముందు నిర్వహిస్తున్న సర్వేపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈసీ పారదర్శకతను శంకించాల్సిన పని లేదని బీజేపీ.. కాంగ్రెస్ చేస్తున్నవి ఉత్త ఆరోపణలేనని ఈసీ ఎప్పటికప్పుడు ప్రకటనలు ఇస్తూ వస్తున్నాయి.ఒక్క ఓటు తొలగిస్తే రూ.80!కర్ణాటకలో ఓటర్ల తొలగింపుపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలపై అక్కడి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో.. ఓ డేటా ఎంట్రీ టీమ్కు లక్షల్లో రూపాయలు చెల్లించి ఓటర్లను తొలగించే పని అప్పగించారని అనుమానాలు నెలకొన్నాయి. ఆరుగురు వ్యక్తుల ముఠా ఈ స్కామ్ నడిపించిందని.. ఒక్క ఓటర్ను తొలగించడానికి రూ.80 ఛార్జ్ చేశారని.. అలా 2023 రాష్ట్ర ఎన్నికల ముందు సుమారు 7,000 ఓటర్లను తొలగించమని అభ్యర్థనలు వచ్చాయని అక్టోబర్ నాటి దర్యాప్తులోనే వెల్లడైంది.తాజా ‘సర్వే లొల్లి’ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. మేము ఎప్పటినుంచో చెబుతున్నదే నిజమని తేలింది. 2023 ఎన్నికల ముందు అలంద్ నియోజకవర్గంలో 6,000కి పైగా నిజమైన ఓటర్లను డబ్బు చెల్లించి తొలగించారు అంటూ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. -
బళ్లారిలో హైటెన్షన్.. గాలి జనార్ధన్ రెడ్డిపై కాల్పులు
-
గాలి జనార్దన్ రెడ్డి పై హత్యాయత్నం..!
-
బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తత.. గాలి జనార్దన్పై కేసు నమోదు
బెంగళూరు: రాజకీయ ఘర్షణలు.. ఇరు వర్గాల గన్ ఫైట్తో కర్ణాటక బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి అనుచరులు, గంగావతి బీజేపీ ఎమ్మెల్యే.. మాజీమంత్రి గాలి జనార్దన్రెడ్డి వర్గీయుల మధ్య ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో వివాదం చెలరేగింది. అది చినికి చినికి గాలివానగా మారి.. కాంగ్రెస్-గాలి వర్గీయులు పరస్పరం దాడులకు దిగారు. ఇది కాల్పులకు దారి తీయడంతో ఒకరు మృతి చెందారు. బళ్లారిలోని గాలి జనార్దన్రెడ్డి నివాసం వద్ద గురువారం రాత్రి కాంగ్రెస్-బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. అనంతరం జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇది తనపై జరిగిన హత్యాయత్నమేనని, తాను తృటిలో తప్పించుకున్నానని గాలి జనార్దన్ అంటున్నారు. అయితే ఆ అవసరం తనకు లేదని.. గాలి జనార్దన్ జరిపిన కాల్పుల వల్లే కాంగ్రెస్ కార్యకర్త మృతి చెందాడని భరత్రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతంగా మారడంతో బళ్లారి సిటీలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. గాలి జనార్దన్పై కేసుగొడవ జరిగినపుడు ఎమ్మెల్యే భరత్రెడ్డి ఊళ్లో లేరు. గొడవ గురించి తెలిశాకే బళ్లారి వచ్చారు. అనుచరులతో ఎస్పీ సర్కిల్కు చేరుకుని ఘటన గురించి ఆరా తీశారు. ఇరువర్గాలు మొత్తం 8 రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. మృతి చెందిన వ్యక్తిని కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్గా గుర్తించాారు. ఈ కాల్పుల్లో సతీష్రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో బళ్లారిలో ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు 144 సెక్షన్ విధించి.. అదనపు బలగాలు మోహరించారు. కాల్పుల ఘటనపై బ్రూస్పేట పీఎస్లో కేసు నమోదు అయ్యింది. జనార్ధన్రెడ్డి, శ్రీరాములు, సోమశేఖర్ రెడ్డి సహా 11మంది పేర్లను నిందితులుగా చేర్చారు.నారా వర్సెస్ గాలిగన్ఫైట్.. బళ్లారిలో హైటెన్షన్ వేళ నారా భరత్రెడ్డి, గాలి జనార్దన్రెడ్డి పరస్పరం మాటల తుటాలు పేల్చారు. ‘‘గురువారం ఉదయం ఇంటి ఆవరణలో బ్యానర్లు కట్టారని తమ సెక్యూరిటీ గార్డ్ మా దృష్టికి తీసుకొచ్చాడు. అనంతరం బ్యానర్ పడిపోయింది. దీనిపై క్షమాపణ చెప్పి బ్యానర్ కడుతామని చెప్పాం. అయినా వినకుండా నా ఇంటి ముందు రహదారిపై ఎమ్మెల్యే ఆప్తుడు సతీష్రెడ్డి, చానాళ్ శేఖర్ కుర్చీ వేసుకుని కూర్చున్నారు. వారితో పాటు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఘర్షణలో ఇంటిపై రాళ్లు విసిరారు. సరిగ్గా నేను గంగావతి నుంచి వచ్చే సమయంలో సతీష్రెడ్డి భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. బీజేపీ ప్రభుత్వంలోనే రూ.8 కోట్లతో వాల్మీకి భవనం నిర్మించాం. ఇప్పటికే వాల్మీకి విగ్రహం ప్రతిష్ఠించినా మళ్లీ ఎందుకని ప్రశ్నించారు. రాజకీయ భవిష్యత్తు లేదని, అభివృద్ధి చేయలేక ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నార’’ని గాలి ఆరోపించారు. అయితే.. బళ్లారి నగరంలో వాల్మీకి విగ్రహం ప్రతిష్ఠను శాంతియుతంగా నిర్వహించాలని చూస్తుంటే.. ఈ కార్యక్రమం జరగకుండా చూడాలని ఘర్షణకు పాల్పడుతున్నారని నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి ఆరోపించారు. ‘‘బ్యానర్ విషయంలో అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాల్మీకి అజ్జ వారి పాపాలను చూసుకుంటారని తెలిపారు. నాకు 35 ఏళ్లు.. వాళ్లది నా కంటే డబుల్ వయసు. యువకులే శాంతియుతంగా ముందుకు వెళ్తుంటే వయస్సు మీదపడినా వారే రెచ్చగొట్ట్టేలా చేయడం సరికాదు’’ అని ఆయన అన్నారు. ఈఘటనపై చట్టపరంగా ముందుకు వెళ్తామని భరత్ స్పష్టం చేశారు. ఫ్లెక్సీ వద్దని.. బళ్లారి సిటీ సెంటర్లో ఈ నెల 3న మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. ఈ సందర్భంగా ఊరంతా కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్రెడ్డి అనుచరులు ఫ్లెక్సీలు కడుతున్నారు. అయితే హవ్వబావిలో గాలి జనార్దన్ ఇంటి గోడకు ఫ్లెక్సీ కట్టబోతుండగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే భరత్కి సన్నిహితుడైన సతీష్రెడ్డి అక్కడికి చేరుకుని వీరంగం సృష్టించారు. జనార్దన్ ఇంటి ముందు కుర్చీ వేసుకుని మరీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయించే ప్రయత్నం చేయబోయారు. విషయం తెలుసుకుని గాలి అనుచరులు, బీజేపీ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకుని ఆ ప్రయత్నాన్ని అడ్డుకోబోయారు. సరిగ్గా.. అదే సమయంలో గాలి జనార్దన్ అక్కడికి రావడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఇరువర్గాల మధ్య తీవ్రవాగ్వాదం చోటు చేసుకోవడంతో.. తోపులాట జరిగింది. అయితే గుంపును చెదరగొట్టేందుకు గాలి జనార్దన్ గన్మెన్, అటు సతీష్రెడ్డి గన్మెన్లు గాల్లోకి కాల్పలు జరిపారు. కోపంతో సతీష్రెడ్డి తన గన్మెన్ తుపాకీ లాక్కుని గాలి జనార్దన్రెడ్డి వైపు కాల్పులు జరిపాడు. ప్రతిగా.. గాలి కూడా కాల్పులు జరపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల గురించి తెలుసుకున్న గాలి సన్నిహితుడు.. మాజీ మంత్రి శ్రీరాములు, కంప్లి ఎమ్మెల్యే సురేశ్బాబు, గాలి సోమశేఖర్రెడ్డి అక్కడకు చేరుకున్నారు. అయితే లాఠీఛార్జి చేసి ఇరు వర్గాలనూ పోలీసులు చెదరగొట్టారు. నా మర్డర్కు స్కెచ్..ఘటన తర్వాత తనకు తప్పిన ప్రాణాయం గురించి బుల్లెట్ను చూపిస్తూ గాలి జనార్దన్ మీడియాతో మాట్లాడారు. తనను చంపేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్రెడ్డి స్కెచ్ వేశారని ఆరోపించారు. అయితే గాలి జనార్దన్ను చంపాల్సిన అవసరం తనకు లేదని భరత్ అంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్త మృతికి, సతీష్రెడ్డి మీద హత్యాయత్నానికిగానూ గాలి జనార్దన్ మీద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. -
మొదటి అడుగు మార్పుకే
బాలికలు, మహిళల కోసం ‘స్టాండ్ఫర్షీ’ సంస్థను చిన్న వయసులోనే స్థాపించిన అర్చన కర్నాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి బాలికల మరుగుదొడ్లు, మంచినీటి కోసం 100 కోట్లు విడుదల చేయించింది. 2025లో గిరిజనుల విద్య, సంస్కృతి కోసం విశేషంగా పని చేసింది. ‘మార్పు రావాలి. మార్పు మొదలవ్వాలి’ అనే అర్చన... దారి చూపాలే గానీ యువత, స్త్రీలు మార్పు కోసం గొప్ప ఉద్యమాలు నిర్మించగలరని అంటోంది.‘ప్రభుత్వాలు సర్కారు బడులలో పారిశుద్ధ్యానికి నిధులు విడుదల చేస్తాయి. అవి ఎలా ఖర్చవుతున్నాయో ఎవరు చెక్ చేస్తారు? ప్రజలో, తల్లిదండ్రులో పూనుకుని చెక్ చేస్తే ఒక భయం ఉంటుంది. లేకుంటే ప్రభుత్వ బడులలో టాయిలెట్ల పరిస్థితి ఎప్పటికీ మారదు’ అంటుంది అర్చన కెఆర్.2020 నుంచి కర్నాటక ప్రభుత్వ బడుల్లో ఆడపిల్లల కోసం రావలసిన మార్పుకై పోరాడుతున్న అర్చన చాలా సాధించిందిగానీ బదులుగా సవాళ్లు ఎదుర్కొంది. ‘నేను ఎంతసేపటికీ టాయిలెట్ల కోసం పని చేస్తున్నానని పెళ్లి సంబంధాలు వెనకడుగు వేశాయి’ అంటుందీ 35 ఏళ్ల సామాజిక కార్యకర్త. అయినా ఆమె పోరాటం ఏమీ ఆపలేదు. అసలు పోరాటం చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయని ఆమె మాటల వల్ల తెలుస్తూనే ఉంటుంది. ‘పిల్లలంటే ఎందుకు మనందరికీ చిన్నచూపు. ప్రభుత్వ బడులలో, హాస్టళ్లలో వాళ్లు కనీస సౌకర్యాలు లేకుండా ఉంటే మనకు ఎలా మనసొప్పుతుంది’ అడుగుతోంది అర్చన. నిజమే. ఎంతో సంపద ఉన్న రాష్ట్రాలలో కూడా చలికాలం చన్నీటి స్నానాలు చేసే పిల్లలు ఎందరో ఉన్నారు ప్రభుత్వ హాస్టళ్లలో. ‘వెచ్చని దుప్పటి... వేడినీళ్లు ఈ పిల్లల హక్కు’ అని నినదించే వారు అర్చనలా ఎంతమంది. ‘జీవితంలో ఆ బాధ అనుభవిస్తేనే తెలుస్తుంది’ అంటుంది అర్చన.→ చెట్టే చాటుగా...అర్చనది కర్నాటక హసన్ జిల్లాలోని సకలేష్పూర్. ఈ ప్రాంతం పశ్చిమ కనుమల్లోకి వస్తుంది. ఇక్కడంతా గిరిజన జీవితం. మరుగుదొడ్లు అనేవే వారికి తెలియవు. తెలియనివ్వలేదు. ‘మరుగుదొడ్డి ఎలా ఉంటుందో నేను నా పద్నాలుగో ఏట చూశాను. మా నాన్న సకలేష్పూర్ వెటర్నరీ ఆస్పత్రిలో అసిస్టెంట్గా చేసేవాడు. ఆయనతోపాటు వెళ్లినప్పుడు అక్కడ టాయిలెట్ మొదటిసారి చూశాను’ అంటుంది అర్చన. చెప్పుల్లేని నడక, కొబ్బరి చిప్పలో టీ పోసి ఇస్తే తాగక తప్పని వివక్ష... ఇవన్నీ చూసిన అర్చన సోషల్వర్క్లో పోస్ట్గ్రాడ్యుయేషన్ చేయాలని నిశ్చయించుకుంది. బెంగళూరులో ఆ చదువు ముగించాక ఒక ఎన్జీఓ స్టడీ కోసం ప్రభుత్వ బడులను చూస్తున్నప్పుడు అక్కడి అమ్మాయిలు ఒక్క టాయిలెట్ కూడా లేకుండా అవస్థలు పడటం ఆమెకు తెలిసి వచ్చింది. ‘వారిలో నన్ను నేను చూసుకున్నాను. వారంతా నీళ్లు తాగడమే మానేశారు’ అని చెప్పిందామె. కొంతకాలం ఈ స్టడీ చేసి ఇక యాక్టివిస్ట్గా మారక తప్పదని రంగంలోకి దిగింది అర్చన.→ స్టాండ్ ఫర్ షీఅర్చన స్టాండ్ఫర్షీ అనే ఎన్జీఓను స్థాపించి 2000 సంవత్సరం నుంచి హసన్ జిల్లాలో ప్రభుత్వ బడులలో టాయిలెట్లు ఎలా ఉన్నాయో ప్రచారంలో పెట్టింది. ఒక్కో టాయిలెట్ పరిస్థితి సోషల్ మీడియాలో చూసి జనం కూడా ఆశ్చర్య పోవడం మొదలుపెట్టారు. ప్రభుత్వం బెంబేలెత్తింది. చివరకు 2021లో అర్చన ఒత్తిడి వల్ల ఏకంగా 100 కోట్లు కేవలం టాయిలెట్ల పునరుద్ధరణకు ప్రభుత్వం విడుదల చేసింది. ఇది అర్చన విజయం.→ శానిటరీ వేస్ట్గ్రామీణ, గిరిజన బాలికలకు శానిటరీ నాప్కిన్స్ ఎలా వాడాలి, వాడవలసిన అవసరం ఏమిటి, వాడాక వాటిని ఎలా డిస్పోజ్ చేయాలి... ఇవన్నీ ఏమీ తెలియక పోవడం వల్ల స్వీయ శుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత ఉండటం లేదు. ‘దీని గురించి ప్రచారం చేయడానికి శానిటరీ స్క్వాడ్స్ను తయారు చేశాము. వీళ్లు బడులకు తిరిగి బాలికలకు అవగాహన కలిగిస్తారు’ అని చెప్పింది అర్చన. 2025లో వేల మంది బాలికలకు తగిన చైతన్యం అర్చన స్క్వాడ్స్ వల్ల దొరికింది.→ ఉద్యమిస్తేనే మార్పు‘మన దేశంలో స్త్రీలు, యువత గొప్ప ప్రతిఘటన శక్తి కలిగినవారు. వారిని సరిగ్గా ఆర్గనైజ్ చేస్తే ప్రజా సమస్యల మీద గొప్ప ఉద్యమాలు లేవనెత్తగలరు. కోర్టుల్లో పిటిషన్ వేసినా గొప్ప మార్పు రాగలదని చాలామందికి తెలియదు. పదిమంది సంతకాలకు కూడా విలువ ఉంటుంది. సామాజిక కార్యకర్తలుగా ప్రజలకు మనం దిశను ఇవ్వాలి. ప్రజల కోసం పని చేయాలి. మనలో మార్పు వస్తేనే వారిలో మార్పు తేగలం’ అంటుంది అర్చన. ఏ సమస్య మీదైతే పోరాడాలో ముందు దాని డేటాను తెలుసుకుని, దాని ఆధారంగా పరిశోధన జరిపి, సమస్యను ప్రజలకు వివరిస్తే ఉద్యమం అదే మొదలవుతుందని అంటుందామె. -
రూ. 5 లక్షలు ఖర్చుపెట్టి.. విద్యార్థులను ఫ్లైట్ ఎక్కించిన హెడ్మాస్టర్
బెంగళూరు: బాల్యంలో ప్రతీ ఒక్కరి జీవితాల్లో ఉపాధ్యాయుల ప్రేరణ చాలా ఉంటుంది. తల్లి దండ్రుల తరువాత పిల్లలపై తమ ప్రేమ అప్యాయతలను కురిపించేది టీచర్లు మాత్రమే. అందుకే గొప్ప గొప్ప నాయకులు, సెలబ్రిటీల జీవితాలపై టీచర్ల ప్రభావం ఉంటుంది. తాజాగా కర్ణాటకలోని కొప్పల్ జిల్లా బహద్దూరిబండి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యుడి చేసిన పని నెట్టింట పలువురిని ఆకట్టుకుంటోంది.విమానం ఎక్కాలనే విద్యార్థులకలను సాకారం చేసేందుకు కర్ణాటకకు చెందిన ప్రధాన ఉపాధ్యాయుడు దాతృత్వాన్ని చాటుకున్న వైనం విశేషంగా నిలిచింది. బహద్దూరిబండి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బీరప్ప అందగి 24 మంది విద్యార్థులను తొలి సారి విమానం ఎక్కించారు. తన సొంత ఖర్చులతో రూ. 5 లక్షలు వెచ్చించి మరీ తన విద్యార్థులను లైఫ్లో మర్చిపోలేని అనుభూతిని మిగిల్చారు. 5-8 తరగతుల విద్యార్థులతోపాటు, ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన సిబ్బంది, పాఠశాల అభివృద్ధి పర్యవేక్షణ కమిటీ సభ్యులు మొత్తం 40 మంది విమానంలో ప్రయాణించారు. వీరి కోసం తోరణగల్లులోని జిందాల్ విమానాశ్రయం నుండి బెంగళూరుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు.ప్రతీ క్లాస్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన తొలి ఆరుగుర్ని ఈ జర్నీకి ఎంపిక చేశారు.A truly heartwarming gesture 🙏✈️Twenty-four government school students from a village in Koppal experienced their first-ever flight, made possible by the selfless generosity of their headmaster, who personally funded the journey. Two enriching days in Bengaluru, learning,… pic.twitter.com/6E28SKHQVv— Ravi Boseraju (@raviboseraju) December 31, 2025 కొప్పల్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన ఇరవై నాలుగు మంది విద్యార్థులు తమ తొలివిమాన ప్రయాణాన్ని అనుభవించారు, వారి ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూసి సంతోషం పడే వారు తొలిసారి విమానం ఎక్కి తెగ సంతోష పడిపోయారు. బెంగళూరులో రెండు రోజులు ఉండి అనేక పర్యాటక ప్రదేశాలను, పాఠశాలలను సందర్శించి తమ అభిమాన హెడ్మాస్టర్కి శతకోటి అభివందనాలు కొప్పల్కు తిరిగొచ్చారు. ఎన్నో మధురమైన,సంతోషకరమైన క్షణాలను, అనుభవాలను మూటగట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడిగామారింది. ఆయనపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి.ఇదీ చదవండి: నాకు వేరే దారి లేదు! మమ్మా యూ ఆర్ ద బెస్ట్.. సారీ! -
అతిపెద్ద ఓపెన్-ఎయిర్ ఆర్ట్ ఫెస్టివల్ చిత్ర సంతే 2026
భారతదేశంలోనే అతిపెద్ద ఓపెన్-ఎయిర్ ఆర్ట్ ఫెస్టివల్ చిత్ర సంతే. ఈ ఫెస్టివల్ ఈ న్య ఇయర్లో జనవరి 4, 2026న ఆదివారం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ ఫెస్టివల్లో సుమారు 22 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మందికి పైగా కళాకారులు పాల్గొంటారు. అంతేగాదు ఏడు లక్షలకు పైగా సందర్శకులు ఆకర్షిస్తారనేది అంచనా. ఈ ఏడాది ఈ ఫెస్టివల్ థీమ్ పర్యావరణంపై దృష్టి సారించడం. ఇంతకీ ఏంటి చిత్ర సంతే అంటే..చిత్ర సంతే అంటే చిత్ర అంటే కన్నడలో పెయింటింగ్/డ్రాయింగ్, సంతే అంటే గ్రామ మార్కెట్. ప్రొఫెసనల్ కళాకారులు, విద్యార్థులు, అభిరుచి గలవారు తమ రచనలను ప్రదర్శించి, విక్రయించే వీధి కళా ఉత్సవం. ఈ రోజున బెంగళూరు వీధులు భారీ ఓపెన్ ఎయిర్ ఆర్ట్ గ్యాలరీగా మారిపోతుంది. దీన్ని బెంగళూరులోని ఒక ప్రముఖ కళా సంస్థ కర్ణాటక చిత్రకళా పరిషత్ (CKP) దీన్ని నిర్వహిస్తోంది. (చదవండి: గాంధీ కుటుంబం మెచ్చే రణతంబోర్ నేషనల్ పార్క్..! అక్కడ న్యూ ఇయర్కి..)


