breaking news
karnataka
-
యువతికి వేధింపులు : హౌసింగ్ సొసైటీపై రూ.62లక్షల దావా, చివరికి
బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల యువతి తనకు జరిగిన అవమానం, వేధింపులపై పోరాడిన తీరు విశేషంగా నిలిచింది. హౌసింగ్ సొసైటీ బోర్డు సభ్యులపై వేధింపులు, అతిక్రమణ , బెదిరింపులను సహిస్తూ మౌనంగా ఉండిపోలేదు ఆమె. వారిపై చట్టపరమైన చర్యలకు దిగి హౌసింగ్ సొసైటీపై రూ.62 లక్షలు దావా వేసింది. సొసైటీలో ఫిర్యాదు చేసి విజయాన్ని సాధించిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలందుకుంది. స్టోరీ ఏంటీ అంటే..బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల యువతి తనకు జరిగిన అవమానం, వేధింపులపై పోరాడిన తీరు విశేషంగా నిలిచింది. హౌసింగ్ సొసైటీ బోర్డు సభ్యులపై వేధింపులు, అతిక్రమణ , బెదిరింపులను సహిస్తూ మౌనంగా ఉండిపోలేదు ఆమె. వారిపై చట్టపరమైన చర్యలకు దిగి హౌసింగ్ సొసైటీపై రూ.62 లక్షలు దావా వేసింది. సొసైటీలో ఫిర్యాదు చేసి విజయాన్ని సాధించిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలందుకుంది. స్టోరీ ఏంటీ అంటే..బాధిత యువతి రెడ్డిట్లో షేర్ చేసిన వివరాల ప్రకారం అపార్ట్మెంట్లో తన స్నేహితులతో ఏర్పాటు చేస్తున్న మీట్ ఘర్షణ దారితీసింది. అది చివరికి రూ.62 లక్షల సివిల్ దావా, నిందితులైన బోర్డు సభ్యులకు 20వేల జరిమానా, తొలగింపుతో ముగిసింది. తన ఐదుగురు స్నేహితులు ఆమె ఇంటికి వచ్చినప్పుడు వివాదం మొదలైంది. వారు తన ఫ్లాట్కి వచ్చినపుడు, ఎలాంటి సంగీత ధ్వనులు లేకుండా, గోల, గందరగోళం లేకుండా, చాలా కామ్గా తమ ఇంట్లో ఆమె వంట చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు, ఇంతలో ఆ అపార్ట్మెంట్ సొసైటీ సభ్యుడు ఆమె ఫ్లాట్కి వచ్చి "బ్యాచిలర్లకు అనుమతి లేదు" అని చెప్పి, ఫ్లాట్ యజమానికి ఫోన్ చేయమని కోరడంతో సమస్య మొదలైంది. తాను తన ఓనర్తో మాట్లాడానని, మీ సమస్య ఏంటి అని ప్రశ్నించింది. ఆ తరువాత కొద్దిసేపటికే, నలుగురైదుగురు పురుషులు ఆమె గదిలోకి బలవంతంగా ఎంట్రీ ఇచ్చారు. మద్యం, గంజాయి తాగుతున్నారని ఆరోపిస్తూ నానా యాగీ చేశారు. అంతటితో ఆగిపోలేదు. మరుసటి రోజు ఆమెను ఫ్లాట్ ఖాళీ చేయాలంటూ మళ్లీ గొడవకు దిగారు. దీంతో ఆమె ఫ్రెండ్స్లోని జెంట్స్ వారిని బైటికి నెట్టారు. రెచ్చిపోతున్న ఒక సభ్యుడిని చెంపదెబ్బ కొట్టాడు. దీంతో సొసైటీ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.పోలీసు అధికారులు వచ్చి ఆమెను యాజమాన్యాన్ని నిరూపించమని అడిగారు. అయితే తాను ఎవరికి ఎలాంటి ఇబ్బందికి కలిగించలేదంటూ అందుకు నిరాకరించింది. అలాగే లివింగ్-రూమ్ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ను చూపించింది.అలాగే ఆమె CCTV ఆధారాలను బిల్డర్చ సొసైటీ ఛైర్మన్కు సమర్పించినప్పుడు, నిందితులైన సభ్యులను వెంటనే తొలగించారు ఒక్కొక్కరికి రూ. 20,000 జరిమానా విధించారని మరో పోస్ట్లో వెల్లడించింది.మరోవైపు వేధింపులు, అతిక్రమణ, దాడి ఆరోపణలతో హౌసింగ్ సొసైటీ, బోర్డు సభ్యులకు నోటీసులు జారీ చేసింది. రూ. 62 లక్షల పరిహారం చెల్లించాలంటే దావా వేసింది. అలాగే పురుషులు మళ్ళీ తన ఫ్లాట్లోకి రాకుండా ఉండేలా శాశ్వత నిషేధాన్ని కూడా ఆమె కోరింది.సోషల్ మీడియా ప్రశంసలుఆమె పోస్ట్లు వైరల్ గామారాయి. ఆమె ధైర్యాన్ని , సంకల్పాన్ని నెటిజన్లు కొనియాడారు. ఆ కేసుతో ముందుకు సాగండి—ఎవరూ ఒకరి ఇంట్లోకి చొరబడలేరు” అని ఒకరు ధైర్యం చెప్పారు. -
రిటైర్మెంట్ ప్రకటించిన ఐపీఎల్ క్రికెటర్
ఐపీఎల్ క్రికెటర్, కర్ణాటక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కృష్ణప్ప గౌతమ్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు ఇవాళ (డిసెంబర్ 22) రిటైర్మెంట్ ప్రకటించాడు. రైట్ హ్యాండ్ ఆఫ్ స్పిన్నర్ కమ్ బ్యాటర్ అయిన 37 ఏళ్ల గౌతమ్ 2021లో టీమిండియా తరఫున ఒకే ఒక వన్డే ఆడాడు. అప్పటి నుంచి మరో అవకాశం రాని గౌతమ్.. దేశవాలీ క్రికెట్కు, ఐపీఎల్కు మాత్రమే పరిమితమయ్యాడు.గౌతమ్కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. కర్ణాటక తరఫున అతను 32 మ్యాచ్లు ఆడి 116 వికెట్లు తీశాడు. అలాగే ఓ సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు కూడా సాధించాడు. లిస్ట్-ఏ క్రికెట్లోనూ గౌతమ్ ఓ మోస్తరు రికార్డు కలిగి ఉన్నాడు. 32 మ్యాచ్ల్లో 51 వికెట్లు తీసి, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 400 పరుగులు చేశాడు. పొట్టి ఫార్మాట్లో 49 మ్యాచ్లు ఆడిన గౌతమ్ 32 వికెట్లు తీయడంతో పాటు 2 హాఫ్ సెంచరీల సాయంతో 454 పరుగులు సాధించాడు.గౌతమ్కు ఐపీఎల్లో అత్యంత ఖరీదైన అవకాశం దక్కింది. 2017లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన గౌతమ్ను 2021 సీజన్లో సీఎస్కే ఏకంగా రూ. 9.25 కోట్ల ధర వెచ్చించి సొంతం చేసుకుంది. అప్పట్లో ఓ అన్ క్యాప్డ్ ప్లేయర్కు దక్కిన అతి భారీ మొత్తం ఇదే. ఐపీఎల్ కెరీర్లో ముంబై ఇండియన్స్, సీఎస్కేతో పాటు రాజస్థాన్ రాయల్స్ (2018), లక్నో సూపర్ జెయింట్స్కు (2022-24) ఆడిన గౌతమ్.. మొత్తంగా 36 మ్యాచ్లు ఆడి 21 వికెట్లు తీశాడు. -
కులాంతర వివాహం : ఆరునెలల గర్భిణీని హత్య చేసిన తండ్రి
కర్ణాటకలోని హుబ్బళ్లిలో దారుణం చోటు చేసుకుంది. వేరేకులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న దురహంకారంతో కన్నకూతుర్ని హతమార్చాడో తండ్రి. ఆరు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా కన్నబిడ్డను అత్యంత పాశవికంగా చేసిన హత్య ఆధునిక సమాజంలో కూడా వేళ్లూనుకొనిపోయిన కుల అహంకారానికి అద్దం పట్టింది.హుబ్బళ్లి గ్రామానికి చెందిన 19 ఏళ్ల మాన్య పాటిల్ కులాంతర వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఈ ఏడాది మేలో ప్రేమికుడిని పెళ్లాడింది. చంపేస్తారేమోననే భయంతో స్వగ్రామానికి దూరంగా 100 కి.మీ దూరంలో ఉన్న హవేరి జిల్లాలో భర్తతోకలిసి నివసిస్తోంది. ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి. ఊర్లో ఉంటున్న అత్తమామల వద్దకు ఆదివారం నాడు వచ్చింది. ఇది పసిగట్టిన ఆ యువతి తండ్రి మరో ముగ్గురితో కలిసి ఆమెపై దాడికి దిగారు. ముందు ఆమె భర్త, మామ వ్యవసాయ పొలంలో ఉన్నప్పుడు వారిపై దాడి చేయడానికి ప్రయత్నించారు. వారు తప్పించుకోవడంతో, సాయంత్రం 6 - 6:30 గంటల మధ్య, ఇనుప పైపులతో సాయుధులైన దుండగులతో కలిసి బాధితురాలి ఇంట్లోకి చొరబడ్డాడు తండ్రి. ఆరు నెలల గర్భవతి మాన్యపై దారుణంగా ఎటాక్ చేశారు. దీంతో ఆమె ప్రాణాలొదిలింది. సంఘటనా స్థలంలోనే ఉన్న అత్తమామలు రేణుకమ్మ, సుభాష్ ఆమెను రక్షించడానికి ప్రయత్నించారు.వారిపై కూడా దారుణంగా దాడి చేశాడు. వారు తీవ్ర గాయాలతో అసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ సంఘటనలో పోలీసులుమాన్య తండ్రి ప్రకాష్ ఫక్కిర్గోడా, మరో ఇద్దరు దగ్గరి బంధువులను అనుమానితులుగా అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. కాగా ఈ వివాదంలోగతంలఘీ రెండు కుటుంబాల మధ్య సయోధ్య కుదర్చడానికి , ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా నివారించడానికి గతంలో ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది. ఇంత జరిగినా చివరికి కన్నబిడ్డనే హతమార్చిన ఘటన తీవ్ర ఆందోళన రేపింది. -
కాంగ్రెస్లో చీలికలేంటి?..
కర్ణాటకలో పవర్ పాలిటిక్స్కు బ్రేక్ఫాస్ట్, లంచ్ భేటీలతో హైకమాండ్ పుల్స్టాప్ పెట్టిందని భావిస్తున్న వేళ.. ఈసారి కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలు తెరపైకి వచ్చాయి. సీఎం సిద్ధరామయ్య సన్నిహితులతో డిప్యూటీ సీఎం శివకుమార్ వరస భేటీలు జరపుతుండడం.. వాటిపై అధిష్టానం సీరియస్గా ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో ఆ ప్రచారంపై డీకే శివకుమార్ ఓపెన్ అయ్యారు. కర్ణాటక కాంగ్రెస్ రాజకీయలపై జరుగుతున్న తాజా ప్రచారాలను సోమవారం మీడియా సాక్షిగా డీకే శివకుమార్ తోసిపుచ్చారు. సిద్ధరామయ్య, తాను అన్నదమ్ముల్లా పని చేస్తుంటే ఇంక కాంగ్రెస్లో చీలిక ఎందుకు ఉంటుందని అన్నారాయన. ‘‘సిద్ధరామయ్యతో నాకు 16 ఏళ్లుగా అనుబంధం ఉంది. ఆ బంధం ఇక మీదట కూడా కొనసాగుతుంది. అన్నదమ్ముల్లా మేం మా పని చేసుకుంటూ పోతున్నాం. అలాంటప్పుడు పార్టీలో అంతర్గత విబేధాలు.. చీలికలు ఎందుకు వస్తాయి?. అధిష్టానం ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేస్తుంది??.. ఇది కేవలం.. మీడియా, బీజేపీ సృష్టిస్తున్న ఊహాగానాలే’’ అని అన్నారాయన. సీఎం సిద్ధరామయ్యకు అత్యంత ఆప్తుడిగా పేరున్న మాజీ మంత్రి కేఎన్ రాజన్నతో ప్రత్యేకంగా భేటీ కావడంపై డీకే శివకుమార్ స్పష్టత ఇచ్చారు. ‘‘ఇందులో రాజకీయ కోణం ఏం లేదు. రాజన్న నాకు కూడా ఆప్తుడే. గతంలో ఎస్ఎం కృష్ణ హయాంలో ఆయనకు ఓ కీలక పదవి ఇప్పించా. నేను ఆయన్ని కలిసింది మర్యాదపూర్వకంగానే‘‘‘ అని అన్నారాయన. అలాగే.. కాంగ్రెస్లో ఏ నేతతోనూ తనకు విబేధాల్లేవని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.పవర్ షేరింగ్.. సీఎం సీటు కోసం ఢిల్లీలో చేసిన ప్రయత్నాలు.. ఈ ప్రయత్నాలపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందన్న కథనాలపైనా డీకే రియాక్ట్ అయ్యారు. ‘‘నా ఢిల్లీ పర్యటనలేవీ రాజకీయ పరమైనవి కావు. ఉన్నత స్థాయి సమావేశాల్లో భాగంగానే జరిగాయి. బెంగళూరు మెట్రో ప్రాజెక్టు నిధుల కోసం, ఇతర అభివృద్ధి కోసమే నేను హస్తినకు వెళ్లా’’ అని అన్నారు. అయితే.. కర్ణాటక అధికార కాంగ్రెస్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించాలని పార్టీ సీనియర్ నేత వీఆర్ సుదర్శన్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఓ లేఖ రాశారు. ఈ విషయాన్నే డీకే వద్ద స్పందించగా.. ఆ లేఖ సారాంశం వేరని.. కాంగ్రెస్లో లుకలుకలు నెలకొన్నాయని బీజేపీ సృష్టించిన ప్రయత్నమే ఆ ప్రచారమని కొట్టిపారేశారాయన. -
స్థానిక గొడవే అది.. హైకమాండ్ సృష్టించలేదు
శివాజీనగర: కర్ణాటకలో సీఎం పదవి వివాదంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆదివారం కల్బుర్గిలో మీడియాతో మాట్లాడుతూ ‘దీనిని హైకమాండ్ సృష్టించలేదు. గందరగోళానికి హైకమాండ్ కారణం కాదు. స్థానిక నాయకులే గొడవ చేసుకున్నారు. వారే దీనిని పరిష్కరించుకోవాలి. అన్నిటికీ హైకమాండ్ను అంటే ఎలా?’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎవరో ఒక నాయకుడి వల్ల బలపడలేదని, తన వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందని, తానే పార్టీ కోసం శ్రమించానని ఎవ్వరూ చెప్పరాదని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ అనేది కార్యకర్తల ద్వారా విస్తరించిన పార్టీ. పార్టీ అన్న తరువాత అందరి పాత్ర ఉంటుంది. ఫలానా వారే పార్టీకి ఆధారం అని కార్యకర్తలు కూడా అనరాదు’ అని సూచించారు. సోదరుల్లాగా పనిచేసుకుంటున్నాం: శివకుమార్ మరోవైపు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆదివారం బెంగళూరులో తన నివాసం వద్ద విలేకరులతో మాట్లాడుతూ తనకు కాంగ్రెస్లో ఏ నాయకుడితో భిన్నాభిప్రాయాలు లేవన్నారు. అవన్నీ మీడియా, ప్రతిపక్షాల సృష్టి అని పేర్కొన్నారు. తాను, సీఎం సిద్ధరామయ్య కలసికట్టుగా సోదరుల్లాగా పని చేయడం లేదా? అని ప్రశి్నంచారు. ‘కొన్ని సందర్భాల్లో రాజకీయంగా వ్యాఖ్యలు చేసి ఉంటారు. ఇందుకు అసంతృప్తికి గురికావాలా?, అన్నదమ్ములే గొడవపడుతుంటారు. ఇక మా గొడవ అనేది ఏ లెక్కకు వస్తుంది?’ అని ప్రశ్నించారు. పార్టీలో గందరగోళ పరిస్థితిని పరిష్కరించాలని మల్లికార్జున ఖర్గేకు కొందరు నాయకులు లేఖ రాయడంపై మాట్లాడుతూ, ‘నా వరకు ఎలాంటి గందరగోళం లేదు. మీడియాకు వార్తలు కావాలి, అందుకోసమే రోజూ గందరగోళం చేయిస్తున్నారు’ అని అన్నారు. సీఎం సన్నిహిత వర్గానికి చెందిన నేత కేఎన్ రాజన్న కలవడంపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ, ‘ఆయనకు సీఎం సన్నిహితుడా?, నాకు కూడా సన్నిహితుడే’ అని చమత్కరించారు. -
‘పంచాయతీ చట్టాలు అన్ని రాష్ట్రాల్లో ఒకే రకంగా ఉండాలి’
అఖిల భారత పంచాయత్ పరిషత్ 18 వ జాతీయ మహాసభల్లో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో గదగ్ మహాత్మా గాంధీ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీ డెవలప్మెంట్ యూనివర్సిటీ లో జరిగిన సభలో అఖిల భారత పంచాయతీ పరిషత్ జనరల్ సెక్రటరీ, ఆంధ్ర ప్రదేశ్ AIPP అధ్యక్షులు M. చిదంబర రెడ్డి ప్రసంగిస్తూ...స్థానిక సంస్థల అవశ్యకతను, సర్పంచుల విధులు, నిధులు, విడుదల పై చర్చించి 2011 సెన్సెస్ ప్రకారం కేంద్ర నిధులు గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తున్నారని, అప్పటి జనాభా అవసరాలకు, ఇప్పుటి 2025. జనాభా అవసరాలకు సరిపడా సదుపాయాలకు 4 రెట్లు పెరిగినది కావున గ్రాంట్ 4 రెట్లు పెంచవలసిన అవసరం ఉందని, ఇండియా 1 అని నాయకులు మాటలు చెప్తున్నారని, దేశం అంతా పంచాయతీ చట్టాలు ఒకే రకంగా ఉండాలని, అయితే ఒకో రాష్ట్రం లో ఒక విధంగా అమలు చేస్తున్నారని, కేరళ రాష్ట్రంలో మాత్రమే సర్పంచుల విధులు చాలా బాగున్నాయని, గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉద్యోగులు, వారి జీతాలు, పని తీరు సర్పంచుల ఆదేశాలు మేరకే జరుగుతాయని.గ్రామాలకు MLA,MP నిధులు వినియోగించాలి అంటే గ్రామ సభ, సర్వ సభ్య సమావేశం లో పంచాయతీ రిజల్యూషన్ ద్వారా అధికారులు నడుచుకుంటారు.స్థానిక సంస్థలలో (సర్పంచి /ఎంపిటిసి/కౌన్సిలర్/జడ్పీటీసీ/కార్పొరేటర్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు కనీస విద్యార్థత ఉండేలా చట్టం తేవాలని, గౌరవ వేతనం దేశం మొత్తం ఒకే విధంగా ఉండాలని,MLA,MP,MLC లకు పింఛను రిటైర్డ్ అయినాక స్థానిక సంస్థల ప్రతినిధులకు ఇచ్చే చట్ట సవరణ చేయాలని , గత ప్రభుత్వం లో మాజీ ముఖ్యమంత్రి గౌ.శ్రీ.YS జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో సచివాలయం, హాస్పిటల్, రైతు భరోసా,గ్రంథాలయం, డైరీ ల సముదాయాలు ఏర్పాటు చేసి దాదాపు ప్రతి గ్రామంలో 11 నుంచి 13 మంది ఉద్యోగులు పని చేసేలా చేశారు. ప్రతి రోజూ ఈ సముదాయాలకు వందల సంఖ్యలో ప్రజలు తమ అవసర నిమిత్తం వందలాదిగా వచ్చేవారు. ప్రభుత్వం మార్పు వల్ల, ఇప్పటి ప్రభుత్వo ఉద్యోగులను కుదించి మరీ అన్యాయంగా ఒకరో, ఇద్దరో వస్తున్నారు. ప్రజలకు చాలా ఇబ్బంది ఉంటుందని, ఉద్యోగులను నియామకం చేయాలని. పై విషయాల పై కమిటీ చర్చించి.. కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రి గారి దృష్టి కి మరియు ప్రధాన మంత్రి గారిని మనం కలవాల్సిన అవసరం ఉందని అఖిల భారత పంచాయత్ పరిషద్ అధ్యక్షులు, మాజీ యూనియన్ మినిస్టర్ శ్రీ సుభోద్ కాంత్ సహాయి గారిని కోరగా.. సభలో అందరూ సహకారం అందిస్తామని చెప్పారు -
వీడో కొత్త రకం సైకో.. పిల్లలు కనిపిస్తే చాలు!
-
70 ఏళ్లొచ్చినా.. రోజూ లైంగిక వేధింపులే
కర్ణాటక: 70 ఏళ్ల వయసు వచ్చింది, రోజూ సతాయిస్తూ నరకం చూపుతున్నాడు అని భర్త మీద 65 ఏళ్ల విశ్రాంత ప్రభుత్వ ప్రిన్సిపాల్ గోవిందరాజనగర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. చెప్పిన మాట వినడం లేదని నేను, నా ఇద్దరు కుమారులు 8 రోజుల్లోగా ఇంటి నుంచి బయటికి వెళ్లాలని భర్త లీగల్ నోటీస్ ఇచ్చాడని తెలిపింది.హత్య బెదిరింపులు..వివరాలు.. బాధితురాలు ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్ పనిచేసి రిటైరయ్యారు. ఆమె మంచి హోదాలో ఉండడం భర్తకు నచ్చేది కాదు. జీతం, గ్రాట్యూటీ, పింఛన్, ఆస్తులను తన పేర మార్చాలని ఒత్తిడి చేసేవాడు. అతడు 1993లో కుద్రేముఖ్లో గనులలో ఉద్యోగం చేస్తూ మానేశాడు. అప్పటి నుంచి భార్యను లైంగిక క్రియ కోసం రోజూ వేధిస్తున్నాడు. అయినా సహిస్తూ వచ్చింది. నవంబరు 22 తేదీన బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు, ప్రతిఘటిస్తే గొంతునులిమి, కొట్టి, దూషించాడు. అంతేగాక తన ఇద్దరు కుమారులను హత్యచేస్తానని బెదిరించాడని మహిళ ఫిర్యాదులో తెలిపింది. ఇంటి సీసీ కెమెరాల్లో దాడి దృశ్యాలు రికార్డయినట్లు తెలిపింది. తనకు గుండెకు బైపాస్ సర్జరీ అయ్యిందని, శ్వాసకోశ జబ్బుతో చికిత్స పొందుతున్నానని, భర్తకు ఏమాత్రం జాలి, దయ లేదని వాపోయింది. పోలీసులు విచారణకు హాజరుకావాలని సదరు శాడిస్టు భర్తకు నోటీస్ జారీచేశారు. -
సీఎం మార్పుపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు
కర్ణాటక రాజకీయాలు కొంతకాలం పాటు దేశవ్యాప్తంగా హాట్ టాఫిక్గా నడిచాయి. ఆ రాష్ట్ర సీఎం మార్పు జరగనుందంటూ ఊహాగానాలు రేగడం దానిని బలపరూస్తూ సీఎం, డిప్యూటీ సీఎంలు పరస్పర వ్యాఖ్యలు చేసుకోవడంతో కొద్దికాలం పాటు నేషనల్ మీడియా అటెన్షన్ అంతా ఆ రాష్ట్రంపైనే ఉంది. అయితే సీఎం మార్పు అంశంలో తాజాగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ రాష్ట్రంలో సీఎం షేరింగ్ ఒప్పందమే జరగలేదన్నారు.కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ మధ్య కొద్దికాలం పొలిటికల్ వార్ జోరుగానే సాగింది. ఐదేళ్లకు నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని సిద్ధరామయ్య అనగా ఇచ్చిన మాట కంటే గొప్పది మరోటి లేదని శివకుమార్ పేర్కొన్నారు. దీంతో ఆ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలో అధిష్ఠానం ఎంట్రీతో ఇద్దరు నేతలు కొంత తగ్గి హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని తెలపడంతో సీఎం కుర్చీ వార్కు కొద్దిగా చల్లబడిందని పొలిటికల్ వర్గాలు భావించాయి.అయితే తాజాగా కర్ణాటక అసెంబ్లీ సమావేశాలలో సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఆర్.అశోకా సీఎం మార్పుపై అసెంబ్లీలో సిద్ధరామయ్యను ప్రశ్నించారు. దానికి ఆయన బదులిస్తూ.. "ప్రజలు మమ్మల్ని దీవించారు. అనంతరం ఎమ్మెల్యేలలంతా నన్ను నాయుకుడిగా ఎన్నుకున్నారు.ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని. హైకమాండ్ నిర్ణయిస్తే తదనంతరం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగుతాను" అని సిద్ధరామయ్య అన్నారు. అసలు తానేప్పుడు రెండున్నర సంవత్సరాల సీఎం ఒప్పందం గురించి చెప్పలేదని అసలు అలాంటి అగ్రిమెంటే జరలేదన్నారు.అయితే ఇటీవల సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ తమ వర్గం నాయకులకు ప్రత్యేక వింధు కార్యక్రమం ఏర్పాటు చేశారు. త్వరలో ఈ ఇద్దరు నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ పార్టీ అగ్ర నాయకత్వంతో భేటీ అనంతరం కర్ణాటక సీఎం మార్పుపై పూర్తి స్థాయి స్పష్టత రానుంది.అయితే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలో సీఎం పదవిపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఒప్పందం జరిగిందని ప్రచారం జరిగింది. గత నెలతో రెండున్నరేళ్ల కాలం ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర సీఎం మారనున్నారని జోరుగా ప్రచారం నడిచింది. -
విద్వేష ప్రసంగ వ్యతిరేక బిల్లు ఆమోదించిన కర్ణాటక అసెంబ్లీ
బెళగావి: దేశంలోనే మొట్టమొదటిసారిగా తీసుకు వచ్చిన విద్వేష ప్రసంగ వ్యతిరేక బిల్లును కర్ణాటక అసెంబ్లీ గురువారం ఆమోదించింది. బీజేపీ సభ్యుల తీవ్ర నిరసనల మధ్య సభ ‘ది హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (ప్రివెన్షన్)బిల్లు’కు ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లులో ప్రతిపాదించిన నిబంధనల ప్రకారం..విద్వేష ప్రసంగాలు, నేరాలకు పాల్పడిన వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధించేందుకు వీలుంటుంది. ఈ నెల 4వ తేదీన కేబినెట్ ఆమోదం తెలపగా, ఈ నెల 10వ తేదీన అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ప్రకారం, బతికున్న/ మరణించిన వ్యక్తి, వ్యక్తుల సమూహం, వర్గం/ సమాజంపై ఏదైనా ప్రతికూల ప్రయోజనాన్ని ఆశించి... హాని, అశాంతి, శత్రుత్వం, ద్వేషం కలిగించాలనే ఉద్దేశంతో, బహిరంగంగా, మాటల ద్వారా రాతపూర్వకంగా, సైగలు దృశ్య రూపాల ద్వారా, ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా లేదా మరే ఇతర మార్గంలోనైనా చేసే ప్రకటనలు లేదా వ్యక్తీకరణలు ద్వేషపూరిత ప్రసంగం కిందకు వస్తాయి. కాగా, ఈ బిల్లును ప్రతిపక్షం, మీడియా లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన బ్రహ్మాస్త్రంగా బీజేపీ అభివర్ణించింది. -
మయాంక్ కెప్టెన్సీలో ఆడనున్న కేఎల్ రాహుల్
విజయ్ హజారే ట్రోఫీ 2025–26 సీజన్ కోసం 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును కర్ణాటక క్రికెట్ అసోసియేషిన్ ప్రకటించింది. ఈ జట్టులో టీమిండియా స్టార్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, ప్రసిద్ద్ కృష్ణలు ఉన్నారు. దీంతో కర్ణాటక జట్టు మరింత పటిష్టంగా మారింది.బీసీసీఐ అదేశాలతో వీరిద్దరూ దేశవాళీ వన్డే టోర్నీ బరిలోకి దిగనున్నారు. ఇక ఈ జట్టు కెప్టెన్గా స్టార్ మయాంక్ అగర్వాల్ ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా కరుణ్ నాయర్ వ్యవహరించనున్నాడు. అదేవిధంగా అండర్-23 టోర్నీలో కర్ణాటక తరపున అదరగొట్టిన హర్షిల్ ధర్మాని, ధ్రువ్ ప్రభాకర్లకు సీనియర్ జట్టులో చోటు లభించింది.ఈ టోర్నీలో ధర్మాని తమిళనాడుపై 142 పరుగులు, ప్రభాకర్ విదర్భపై 126 పరుగులతో రాణించి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా శ్రీష ఆచార్ చోటు దక్కించుకున్నాడు. కర్ణాటక తమ గ్రూప్ దశ మ్యాచ్లన్నీ అహ్మదాబాద్లో ఆడనుంది.ఈ టోర్నీలో కర్ణాటక జట్టు డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది. కర్ణాటక టీమ్ తొలి మ్యాచ్లో డిసెంబర్ 24న జార్ఖండ్తో తలపడనుంది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల సైతం ఈ టోర్నీలో ఆడనున్నారు.విజయ్ హజారే ట్రోఫీ 2025-26 కోసం కర్ణాటక జట్టు: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, కరుణ్ నాయర్ (వైస్ కెప్టెన్), స్మరణ్, శ్రీజిత్, అభినవ్ మనోహర్, శ్రేయాస్ గోపాల్,వ్యాషాక్, మన్వంత్ కుమార్ , శ్రీషా S ఆచార్, అభిలాష్ శెట్టి, శరత్ , హర్షిల్ ధర్మాని, కేఎల్ రాహుల్, ప్రభాకర్ చదవండి: Year-Ender 2025: విరాట్ కోహ్లి నుంచి జాన్ సీనా వరకు.. -
చిలుకను కాపాడబోయి : తనువు చాలించిన వ్యాపారవేత్త
ఇంట్లో పెంపుడు జంతువులుంటే ఆనందం, మానసిక ఉల్లాసం కలుగుతుందని నమ్ముతారు. అందుకే చాలామంది ఏదో ఒక పెట్ను పెంచుకుంటూ ఉంటారు. అల్లారుముద్దుగా చూసుకుంటారు. కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కానీ ఒకోసారి పెంపుడు జంతువులే ప్రాణానికి చేటు తెస్తూ ఉంటాయి. బెంగళూరులో జరిగిన ఒక విషాదం గురించి తెలిస్తే హృదయం ద్రవించకమానదు.బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త అరుణ్ కుమార్ ఎంతోఖరీదైన చిలుకను పెంచు కుంటున్నాడు. మకావ్ రకానికి చెందిన దీని విలువ 2.5 లక్షలరూపాయలు. అది ఉన్నట్టుండి ఇంట్లోంచి ఎగిరిపోయి, సమీపంలోని విద్యుత్ స్తంభంపై వాలింది. దాన్ని పట్టుకుందామని ప్రహరీ గోడపైకి ఎక్కాడు. అలా దాన్ని రక్షించబోయే ప్రయత్నంలో అరుణ్ ప్రమాదవశాత్తు హై-వోల్టేజ్ విద్యుత్ తీగను తాకడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో అతను కుమార్ గోడపై నుండి కిందపడి గాయపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతణ్ణి అసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. బెంగళూరులోని గిరినగర్ ప్రాంతంలో శుక్రవారం ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీసులు అసాధారణ మరణంగా కేసు నమోదు చేశారు. అరుణ్ కుమార్కి వాహనాల నంబర్ ప్లేట్ల తయారీ వ్యాపారం ఉంది. -
సిద్ధ రామయ్యకు షాక్ రాత్రివేళ ఎమ్మెల్యేలకు DK విందు
-
రాజకీయాలు అంటే సినిమా కాదు.. పవన్కు కన్నడ మంత్రి చురకలు
సాక్షి బెంగళూరు : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ తీరుపై పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ధోరణిపై కన్నడ మంత్రి ఒకరు విరుచుకుపడ్డారు. రాజకీయాలంటే సినిమాలు కాదని, తెలుగు సినిమాలో మాత్రమే ఆయన హీరో అని, రాజకీయాల్లో కాదని ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ ఎస్. లాడ్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు పవన్కళ్యాణ్పై చేసిన ట్వీట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ‘ప్రజాసేవ అంటే సినిమా కాదు. జిమ్మిక్కులు, గిమ్మిక్కులు, నటనను ప్రజలు ఎప్పటికీ అభినందించరు.అయినప్పటికీ బలవంతంగా రాజకీయాల్లో కూడా ఆయన నటిస్తున్నారు’.. అంటూ మంత్రి ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బెళగావిలో మంత్రి సంతోష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పవన్కళ్యాణ్కు ఒక మనవి చేస్తున్నా. మీరు రాజకీయాలకు ఇప్పుడిప్పుడే ఎంట్రీ ఇచ్చారు. ఇన్ని రోజులు సినిమాల్లో నటిస్తూ వచ్చారు. సినిమాల్లో మంచి పాత్రలు పోషించారు. అయితే ఇది సినిమా కాదు.సనాతన ధర్మం, హిందూ సంబంధిత విషయాల గురించి మాట్లాడితే ప్రజలకు ఏం ప్రయోజనం? పేదవారికి, శ్రామికుల కోసం, రాష్ట్రాభివృద్ధిపట్ల ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్డీఏ సర్కారులో భాగమైన మీరు విద్యా, ఉద్యోగాల విషయాలపై కేంద్రం వద్ద అధిక కేటాయింపులు సాధించి రాష్ట్రాభివృద్ధికి ప్రయత్నించాలి. సనాతన ధర్మం గురించి ఎలాంటి ప్రసంగాలు ఇవ్వకండి’.. అంటూ ఆయన హితవు పలికారు. ‘ఆంధ్రప్రదేశ్లో కనీస వేతనం ఎంత? ఈ విషయం పవన్కు తెలుసా? ఇప్పుడెందుకు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు? బుద్ధ ధర్మం, ఇస్లాం ధర్మం గురించి ఎందుకు మాట్లాడరు’ అని ప్రశ్నించారు. -
విద్వేష భాషపై పంజా!
దేశంలోనే తొలిసారి విద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. కోస్తా కర్ణాటకలో మొన్న ఏప్రిల్లో మతపరమైన హత్య చోటు చేసుకున్నాక జరిగిన పరిణామాల పరంపర తర్వాత ఇలాంటి చట్టం తెస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. మన రాజ్యాంగం భావప్రకటనా స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూనే దానికి సహేతుకమైన పరిమితులు విధించింది. సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు, ఇతర రకాల చర్యల్ని అరికట్టడానికి గతంలో ఐపీసీలో, ఇప్పుడు బీఎన్ఎస్లో నిబంధనలున్నాయి. కానీ దురదృష్టమేమంటే అవి అసమ్మతిని అణచడానికి పనికొచ్చినట్టు విద్వేష ప్రసంగాలను అదుపు చేయటానికి తోడ్పడటం లేదు. కనుక ప్రత్యేక చట్టం తీసుకు రావటం హర్షించదగ్గదే. ‘విద్వేషం ప్రతి ఒక్కరినీ ప్రమాదంలోకి నెడుతుంది. అందుకే దానిపై పోరాడటం అందరి బాధ్యతా కావాలి’ అన్నారు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్. నిజానికి విద్వేషపూరిత ప్రసంగాలు మనుషుల ఉసురు తీస్తాయని, మత, కుల ఘర్షణలకు కారణ మవుతాయని పదిపదిహేనేళ్ల క్రితం ఎవరూ ఊహించి ఉండరు. సామాజిక మాధ్యమాల విస్తృతి పెరిగాక ఇలాంటి ప్రసంగాలూ, సందేశాలూ సమాజ మనుగడకు పెను సవాలుగా మారాయి. ఎక్కడో కాదు... కర్ణాటకలోనే విద్వేషపూరిత ప్రసంగాలు, సందే శాల ప్రభావంతో దుండగులు 2015లో ప్రముఖ రచయిత, హేతువాది, కన్నడ యూని వర్సిటీ మాజీ వైస్చాన్సలర్ ఎంఎం కల్బుర్గిని, 2017లో ప్రముఖ సంపాదకురాలు, రచయిత్రి గౌరీ లంకేష్ను పొట్టనబెట్టుకున్నారు. భావప్రకటనాస్వేచ్ఛ ముసుగులో ఇష్టానుసారం మాట్లాడటం, తమకు నచ్చని అభిప్రాయాలున్న వారిపై ఉసిగొల్పేలా ప్రసంగాలు చేయటం ఉన్మాదం. కర్ణాటక విద్వేష ప్రసంగాలూ, విద్వేష నేరాలు (నివారణ, నియంత్రణ) బిల్లు ఈ మాదిరి చర్యల్ని సరిగానే గుర్తించింది. కేవలం ప్రసంగాలే కాదు...సమాజ గమనానికి ముప్పు కలిగించే రాతలు, చిత్రాలు, దృశ్యాలు వగైరాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయటం కూడా ఈ బిల్లు శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తోంది. మతం, కులం, భాష, జెండర్, జాతి, ప్రాంతం, అంగవైకల్యం తదితరాల పేరిట వ్యక్తులపై లేదా బృందాలపై విద్వేషాన్ని ప్రేరేపిస్తే వివిధ రకాల శిక్షలు నిర్దేశించింది. మొదటి నేరానికి ఏడాది నుంచి ఏడేళ్ల వరకూ, అనంతర నేరాలకు రెండునుంచి పదేళ్ల వరకూ శిక్ష, జరిమానా వేయొచ్చు. ఈ నేరాలను శిక్షార్హమైన, బెయిల్కు వీలుకాని నేరాలుగా పరిగణించటం దీని తీవ్రతను తెలియ జేస్తోంది. సంస్థల పేరిట నేరాలకు పాల్పడిన పక్షంలో వాటి నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తారు. ఆన్లైన్లో ప్రచారంలో ఉండే విద్వేషపూరిత అంశాలను తొలగించమని ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అయితే ప్రజా ప్రయోజనార్థం విద్యాసంబంధ, కళాత్మక, సాహిత్య, శాస్త్రీయ దృష్టితో చేసే ప్రసంగా లకూ, ఇతరేతర సందేశాలకూ ఇది మినహాయింపును ఇచ్చింది. బాధితులకు నష్టపరి హారం ఇచ్చేందుకు కూడా ఇందులో ఏర్పాటుంది.అయితే ఇలాంటి బిల్లుల రూపకల్పనలో అస్పష్టతకు తావుండటం వల్ల పోలీసులకు అపరిమిత అధికారాలు దక్కుతాయి. అవి దుర్వినియోగమయ్యే ప్రమాదం కూడా ఎక్కువే. గతంలో టాడా చట్టం, ఇప్పుడు యూఏపీఏ విషయంలో ఈ ఆరోపణ లున్నాయి. హిందూ మతసంస్థల అణచివేతకే ఈ చట్టం తీసుకు రాబోతున్నారని బీజేపీ విమర్శిస్తుండగా, పౌర సమాజ కార్యకర్తలు సైతం బిల్లులోని అంశాల పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా మానసికంగా గాయ పరచటం అనే భావనకు చోటున్నందు వల్ల దుర్వినియోగానికి అవకాశాలెక్కువ. వాస్తవంగా ఫలానా ప్రసంVýæం సమాజంలో ఘర్షణలకు కారణమని ధ్రువపడటం, దాని కారణంగా హత్య జరిగిందని నిర్ధారణ కావటం వంటి సందర్భాల్లో చట్టం తోడ్పడాలి. కానీ విస్తృత భాష్యం చెప్పగలిగే వాటిని చేర్చటంవల్ల చట్టం ఉద్దేశమే దెబ్బతింటుంది. విద్వేషపూరిత ప్రసంగాల విషయంలో ఇప్పటికే సుప్రీం కోర్టు మార్గదర్శకాలున్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్నట్టు కనబడదు. దుర్వినియోగానికి తావు లేని రీతిలో చట్టం ఉన్నప్పుడే నిజమైన నేరగాళ్లకు శిక్షపడుతుంది. ఆ దిశగా ఆలోచించటం అవసరం. -
‘ఇక సీఎం మార్పు క్వశ్చనే లేదు’
బెంగళూరు: గత కొన్ని రోజులుగా కర్ణాటకలో కొనసాగుతున్న సీఎం మార్పు సంక్షోభానికి తెరపడినట్లే కనబడుతోంది. సిద్ధరామయ్యనే మిగతా రెండున్నరేళ్లు కొనసాగాలని హైకమాండ్ చెప్పిందని ఆయన తనయుడు, ఎమ్మెల్సీ యతీంద్ర సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఈరోజు(గురువారం, డిసెంబర్ 11వ తేదీ) యతీంద్ర మాట్లాడుతూ.. ‘ ఇది క్లియర్. మిగతా రెండున్నరేళ్లు మా నాన్నే సీఎంగా కొనసాగుతార. కాంగ్రెస్ అధిష్టానం ఇదే విషయాన్ని చెప్పింది. ఇక నాయకత్వ మార్పు ప్రశ్నే ఉండదు. ఫలితంగా సీఎం మార్పు వివాదానికి తెరపడింది’ అని పేర్కొన్నారు. ఇక గత సోమవారం సీఎం సిద్ధరామయ్య ఇదే అంశంపై మాట్లాడుతూ.. హైకమాండ్ ఎలా చెబితే అలా అని వ్యాఖ్యానించారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. ఇదే విషయంపై తనతో పాటు డీకే శివకుమార్ కూడా అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తారన్నారు. కర్ణాటక సీఎం మార్పు అంశానికి సంబంధించి ట్విస్ట్లు మీద ట్విస్ట్లు చోట చేసుకున్నాయి. సిద్ధరామయ్య-డీకే శివకుమార్ల మధ్య మాటల వివాదం మొదలుకొని రెండు బ్రేక్ ఫాస్ట్ల ఎపిసోడ్ల వరకూ వెళ్లింది. కర్ణాటక సీఎం పదవిని సిద్ధరామయ్య గతంలో చేపట్టే క్రమంలో ఒప్పందం జరిగిన నేపథ్యంలో డీకే శివకుమార్ తనకు సీఎం పదవి ఇవ్వాలని పట్టుబట్టారు., అయితే సిద్ధరామయ్య ఈ రెండున్నరేళ్లు తనకే ఉంచాలని డీకేతో పాటు అధిష్టానాన్ని కూడా కోరారు. ఇలా వారి మధ్య పంచాయతీ నడుస్తూ వచ్చింది. ఆ సమయంలో కూడా ఇరువురి అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు. అయితే యతీంద్ర వ్యాఖ్యలతో ఒక క్లారిటీ వచ్చినట్లుంది కానీ, సిద్ధరామయ్య, డీకేలే దీనిపై సృష్టత ఇస్తే దీనికి తెరపడినట్లు అవుతుంది. -
గుడి నిజమే కానీ.. పెళ్లిళ్లు మాత్రం చేయరు!
ఆలయంలో వివాహం చేసుకుంటుంటారు చాలామంది. అలాగే కొన్ని ఆలయాలు సాముహిక పెళ్లిళ్లను జరిపిస్తుంటాయి కూడా. మరికొందరు మొక్కుల రీత్యా కూడా ఆలయంలో వివాహం చేసుకుంటారు. అలాంటిది వేల ఏళ్ల నాటి పురాతన ఆలయం ఆకస్మికంగా వివాహాలను నిషేధించాలని గట్టి నిర్ణయం తీసుకుంది. అంతేగాదు ఆలయ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్వయంగా అక్కడ ప్రభుత్వానికి తెలియజేసింది కూడా. అందుకు సుప్రీం కోర్టు కూడా సమ్మతించడం విశేషం ఇలా ఎందుకు నిర్ణయం తీసుకున్నారో తెలిస్తే విస్తుపోతారు.బెంగళూరులోని పురాతన ఆలయాలలో ఒకటి, చోళుల కాలం నాటి సోమేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ చాలామంది జంటలు వివాహాలు చేసుకుంటారు. అనాదిగా వస్తున్న ఆచారం కూడా. అలాంటిది గత ఆరు నుంచి ఏడు సంవత్సరాలు వివాహ వేడుకులను నిలిపివేసింది. ఎంతో సుదీర్ఘ చరిత్ర ఉన్న ఆ ఆలయంలో వివాహాలను నిషేధించడం భక్తులలో చర్చనీయాంశంగా మారింది. ఆలయ చరిత్రసోమేశ్వరస్వామి ఆలయం సుమారు 12వ-13వ శతాబ్దాల నాటిదిగా భావిస్తున్నారు. దీని నిర్మాణంలో చోళులు, విజయనగర రాజుల నిర్మాణ శైలి స్పష్టంగా కనిపిస్తుంది. బెంగళూరు వ్యవస్థాపకుడైన కెంపేగౌడ కూడా ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లు లేదా విస్తరించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంలో వేలాది జంటలు పెళ్లితో ఒక్కటయ్యేవి. అయితే ఆ జంటలే మధ్య సయోధ్య కుదరక విడాకులకు దారితీయడంతో.. ఆ ఆలయ పూజారులు కోర్టుల చుట్టూ తిగరాల్సి వచ్చింది. అంతేగాదు ఆలయ ఆగమ పనులకంటే..కోర్టు చుట్టూ తిరగడమే పనైంది పూజారులకు. ఈ న్యాయపరమైన చిక్కులను నివారించేందుకు, అలాగే పూజారులు ఆయల కైంకర్యాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకే ఇలా వివాహాలను నిషేధించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది. హిందూ వివాహాలకు పేరుగాంచిన ఈ ఆలయం ఏటా వందలాది జంటల వివాహాలను ఘనంగా జరిపించేది. ఆలయ గోపురం కింద ఈ వివాహాలు జరిగేవవి. వేద సంప్రదాయాలకు, ఆచారాలకు అనుగుణంగా అవిచ్ఛిన్నంగా జరిగే ఈ వివాహాలు..ఇటీవల విడాకులు కేసులు అంతకంతకు పెరిగి ఆలయ పవిత్రత మంట కలిసిపోయేలా మారింది. దానికి తోడు ఆ పెళ్లిలో సాక్షులుగా ఉన్న పూజారులు కోర్లుమెట్టాక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతరెండేళ్లలోనే ఆలయ అధికారులకు 50కి పైగా విడాకులు ఫిర్యాదుల అందాయట. చాలా వివాహాలు ఇంట్లోని కుటుంబసభ్యులకు చెప్పాపెట్టకుండా చేసుకోవడం, కొందరు నకిలీ డాక్యుమెంట్లతో పెళ్లిళ్లు చేసుకోవడంతో ఈ సమస్యలు తలెత్తుతున్నట్లు అధికారులు వాపోయారు. పూజారుల భక్తి సమయం ఆదా అయ్యేలా, అలాగే ఆలయ పవిత్రతను కాపాడుకునేలా ఇలా వివాహాలను నిషేధించక తప్పలేదని చెబుతున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయవాది అమిష్ అగర్వాల్ మాట్లాడుతూ..ఆలయం ఇతర ఆచారాలు, మతపరమైన వేడుకలను అనుమతిస్తూనే ఉంది. కానీ ప్రస్తుతానికి వివాహాలను అనుమతించబోమని నిర్ణయించింది. ట్రెండ్ను అంచనా వేసి, కమ్యూనిటీ వాటాదారులతో సంప్రదించిన తర్వాత భవిష్యత్తులో ఈ విధానాన్ని సమీక్షించవచ్చని యాజమాన్యం పేర్కొంది." అని చెప్పారు. నిజానికి దక్షిణ భారతదేశంలో దేవాలయాలలో వివాహాలు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. ఆ నేపథ్యంలోనే పురాతన దేవాలయాల్లో వీటిని నిర్వహించేందుకు అధిక ప్రాముఖ్యత ఇస్తారు. కానీ పెరుగుతున్న విడాకుల కేసులు, పూజారులను చట్టపరమైన చిక్కుల్లో పడేశాయి. దీంతో అధికారులు సోమేశ్వర ఆలయం మరిన్ని న్యాయమపరమైన చిక్కులను ఎదుర్కొనకుండా ఉండేలా ఈ వివాహాలకు అడ్డుకట్టవేయాల్సి వచ్చింది.(చదవండి: లెట్స్ సింగ్..ఫుల్ స్వింగ్..!) -
ప్రియుడి మోజులో భర్తను హత్య చేయించిన భార్య
కర్ణాటక: ప్రేమించి పెళ్లి చేసుకొన్న భర్తనే హత్య చేయించిందో భార్య. ఈ కేసులో ఆమెతో పాటు నలుగురిని హోసూరు పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల మేరకు హోసూరు కార్పొరేషన్ పరిధిలోని పార్వతీనగర్కు చెందిన శరవణన్ (25). భార్య ముత్తులక్ష్మి(21). గత నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మరొకరితో ప్రేమాయణం ఇంతలో ముత్తులక్ష్మి అదే ప్రాంతానికి చెందిన సూర్య (23)తో పరిచయం పెరిగి అక్రమ సంబంధం ఏర్పడింది. ఇది తెలిసి శరవణన్ భార్యను నిలదీయడంతో వారి మధ్య తరచూ గొడవలేర్పడుతుండేది. గత కొద్ది రోజుల క్రితం ముత్తులక్ష్మి ఇద్దరు పిల్లలను భర్త ఇంట్లో వదిలి సూర్యతో వెళ్లిపోయింది. బంధువులు ఆమెకు నచ్చజెప్పి భర్త వద్దకు చేర్చారు. కానీ ఇద్దరూ తరచూ గొడవపడేవారు. ఈ సమయంలో ఆమె తన ప్రియునితో కలిసి భర్తను హత్య చేసేందుకు పథకం వేసింది.రెండు రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో సూర్య, మరో ఇద్దరిని తీసుకుని వచ్చాడు. నిద్రిస్తున్న శరవణన్ను ముత్తులక్ష్మి సహకారంతో కత్తులతో పొడిచి హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటనపై శరవణన్ తల్లి మంగమ్మ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు విచారణ చేపట్టారు. భార్య ముత్తులక్ష్మి, ప్రియుడు సూర్య, సంతోష్ శక్తిలను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి తీవ్ర విచారణ జరుపుతున్నారు. -
సిద్దరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు
శివాజీనగర: కర్ణాటక సీఎం సిద్దరామయ్య 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరుణ నియోజకవర్గం నుంచి ఎన్నికవడం చట్ట విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. దీనిపై వివరణ ఇవ్వాలని సిద్ధరామయ్యకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. సిద్దరామయ్య ప్రజాప్రతినిధుల చట్టం–1951ని ఉల్లంఘించి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ శంకర్ అనే వ్యక్తి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కొట్టివేసింది.దీంతో అతను సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారెంటీలను ప్రకటించింది. మహిళలకు ఉచిత బస్సు పథకం రాజ్యాంగ విరుద్ధం. ఇది పురుషుల పట్ల వివక్ష చూపిట్లే. కాబట్టి సిద్దరామయ్య ఎన్నిక చెల్లదు. ఆయనపై అనర్హత వేటు వేసి ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలి’ అని పిటిషన్లో కోరారు. -
కరుణ్ నాయర్కు అక్కడ కూడా చుక్కెదురు
పేలవ ఫామ్ కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన టీమిండియా అవకాశాన్ని చేజార్చుకున్న కరుణ్ నాయర్.. తాజాగా అదే ఫామ్ లేమి కారణంగా దేశవాలీ అవకాశాన్ని కూడా కోల్పోయాడు. ఇటీవలే విదర్భ నుంచి తన సొంత జట్టు కర్ణాటక పంచన చేరిన కరుణ్.. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో దారుణంగా విఫలమై జట్టులో స్థానం కోల్పోయాడు. ఈ టోర్నీలో తొలి 6 మ్యాచ్ల్లో కేవలం 71 పరుగులు మాత్రమే చేసిన కరుణ్.. త్రిపురతో ఇవాళ (డిసెంబర్ 8) జరిగిన మ్యాచ్ నుంచి తప్పించబడ్డాడు.ఫస్ట్ క్లాస్ క్రికెట్ వరకు మంచి ఫామ్లో ఉండిన కరుణ్ పొట్టి ఫార్మాట్కు వచ్చే సరికి చాలా ఇబ్బంది పడ్డాడు. కరుణ్ గత ఎడిషన్ SMAT ఫామ్ ఇందుకు భిన్నంగా ఉండింది. గత ఎడిషన్లో విదర్భకు ఆడిన కరుణ్ 6 ఇన్నింగ్స్ల్లో 177.08 స్ట్రయిక్రేట్తో 42.50 సగటున 255 పరుగులు చేశాడు. కరుణ్ను ఐపీఎల్ 2026 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రీటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇది జరిగి నెల కూడా కాకముందే కరుణ్ ఇంత చెత్త ప్రదర్శనలు చేయడం ఢిల్లీ యాజమాన్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.కరుణ్ గత ఐపీఎల్ సీజన్ మధ్యలో ఢిల్లీ క్యాపిటల్స్లో చేరాడు. తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై అదరగొట్టి (40 బంతుల్లో 89 పరుగులు), ఆతర్వాత ఆ స్థాయి ప్రదర్శన కొనసాగించలేక ఇబ్బంది పడ్డాడు. అయినా కరుణ్పై ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం నమ్మకముంచి రీటైన్ చేసుకోవడం ఆశ్చర్యకరం.ఇదిలా ఉంటే, కరుణ్ లేని మ్యాచ్లో కర్ణాటకపై త్రిపుర సంచలన విజయం సాధించింది. సూపర్ ఓవర్లో ఆ జట్టు కర్ణాటకకు షాకిచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో ఇరు జట్లు తలో 197 పరుగులు చేయగా.. సూపర్ ఓవర్లో త్రిపుర ఊహించని విధంగా వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేయగా.. కర్ణాటక వికెట్ కోల్పోయి 18 పరుగులకే పరిమితమైంది. దీంతో త్రిపుర సంచలన విజయం నమోదు చేసింది. -
కీలక పదవికి ఎంపికైన టీమిండియా మాజీ క్రికెటర్
టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్కు (Venkatesh Prasad) కీలక పదవి దక్కింది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA) ఎన్నికల్లో ఈ మాజీ పేసర్ ఘన విజయం సాధించారు. ఆదివారం (డిసెంబర్ 7) జరిగిన ఎన్నికల్లో ప్రసాద్ నేతృత్వంలోని టీమ్ గేమ్ ఛేంజర్స్ ప్యానెల్ దాదాపు అన్ని పదవులను గెలుచుకుంది. ప్రసాద్ బ్రిజేశ్ పటేల్ మద్దతు పొందిన కేఎన్ శాంత్ కుమార్పై 191 ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్రసాద్కు 749, శాంత్ కుమార్కు 558 ఓట్లు వచ్చాయి. మరో భారత మాజీ క్రికెటర్ సుజిత్ సోమసుందర్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వినోద్ శివప్పపై ఆయన 719-588 ఓట్ల తేడాతో గెలుపొందారు.కార్యదర్శి హోదాను సంతోష్ మీనన్ తిరిగి దక్కించుకున్నాడు. ఈఎస్ జైరామ్పై 675-632 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ట్రెజరర్ పోస్ట్ను బీఎన్ మధుకర్ దక్కించుకున్నాడు. ఎంఎస్ వినయ్పై 736-571 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఇలా దాదాపుగా ప్రతి పదవిని వెంకటేశ్ ప్రసాద్ నేతృత్వంలోని టీమ్ గేమ్ ఛేంజర్స్ ప్యానెలే దక్కించుకుంది.ప్రధాన ఫలితాలు - అధ్యక్షుడు: వెంకటేష్ ప్రసాద్ – 749 ఓట్లు - ఉపాధ్యక్షుడు: సుజిత్ సోమసుందర్ – 719 ఓట్లు - కార్యదర్శి: సంతోష్ మెనన్ – 675 ఓట్లు - జాయింట్ సెక్రటరీ: బీకే రవి – 669 ఓట్లు - ఖజాంచి: బీఎన్ మధుకర్ – 736 ఓట్లు మేనేజింగ్ కమిటీ సభ్యులు - లైఫ్ మెంబర్స్: వీఎం మంజునాథ్, సైలేష్ పోల, అవినాష్ వైద్య - ఇన్స్టిట్యూషన్ మెంబర్స్: కల్పనా వెంకటాచార్, ఆశిష్ అమర్లాల్ జోన్ ప్రతినిధులు - మైసూరు – శ్రీనివాస్ ప్రసాద్ - శివమొగ్గ – డీఎస్ అరుణ్ - తుమకూరు – సీఆర్ హరీష్ - ధార్వాడ – వీరాణ సవిడి - రాయచూర్ – కుశాల్ పటిల్ - మంగళూరు – శేఖర్ శెట్టి ముఖ్యాంశాలు - ప్రసాద్ ప్యానెల్ వారి మేనిఫెస్టోలో చిన్నస్వామి స్టేడియంలో మళ్లీ ప్రధాన క్రికెట్ మ్యాచ్లు జరగాలని స్పష్టంగా పేర్కొంది. - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ వేడుకలో జరిగిన దుర్ఘటన తర్వాత అక్కడ పెద్ద మ్యాచ్లు జరగలేదు. - ఈ ఎన్నికల్లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐపీఎల్ మ్యాచ్లు చిన్నస్వామి స్టేడియం నుంచి తరలిపోవడానికి అనుమతించం. ఇది బెంగళూరు, కర్ణాటక గౌరవానికి సంబంధించిన విషయం. భవిష్యత్తులో కొత్త స్టేడియం కూడా నిర్మిస్తామని అన్నారు. డీకే వెంకటేశ్ ప్రసాద్ ప్యానెల్కు తన సంపూర్ణ మద్దతు తెలిపారు. -
అయ్యో పాపం! పుట్టిన వారానికే అనాథైన శిశువు
శ్రీనివాసపురం: పుట్టిన వారానికే పసిగుడ్డు అనాథ అయిన హృదయవిదారక ఘటన కర్ణాటకలోని కోలారు జిల్లా ఉప్పరపల్లిలో ఆదివారం జరిగింది. అస్సాం నుంచి కూలీ పనుల కోసం వలస వచ్చిన ఫరీజా(22), రెహమాన్(28) స్థానికంగా శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి చెందిన కోళ్ల ఫారంలో 15 రోజుల కిందట చేరారు. వారం క్రితం ఫరీజా ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఆదివారం ఉదయం శిశువు గట్టిగా ఏడుస్తుండడం గమనించిన స్థానికులు వెళ్లి చూడగా.. ఇంట్లో భార్యాభర్తలు శవాలై పడి ఉన్నారు. పక్కనే పురుగుల మందు సీసా ఉండటంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం శ్రీనివాసపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. -
కర్ణాటకంపై వీడని సస్పెన్స్
సాక్షి బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీలో అధికార మార్పిడిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఢిల్లీలో సోనియా గాంధీ నివాసంలో శనివారం రాత్రి అధిష్టానం నేతలు సమావేశమయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో కర్ణాటక అంశాన్ని ప్రత్యేకంగా చర్చించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.అయితే సమావేశంలో ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని, రానున్న రోజుల్లో మరోసారి సమావేశమై చర్చిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అందరూ కలసికట్టుగానే ఉన్నారని కూడా తెలిపారు. ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య రెండు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ల అనంతరం రాష్ట్రంలో సీఎం మార్పు అంశం తాత్కాలికంగా బ్రేకులు పడిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి డీకేకు శుభవార్త! ‘ఐదేళ్లు నేనే సీఎం’ అని చెప్పుకునే స్థాయి నుంచి ‘రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు’ అని చెప్పుకునే స్థాయి వరకూ సిద్ధరామయ్య దిగిరావడాన్ని చూస్తే, డీకే సీఎం అవ్వడం దాదాపు ఖాయం అయినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. సంక్రాంతికి డీకేకు హైకమాండ్ శుభవార్త అందించనున్నట్లు కూడా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డీకేను ముఖ్యమంత్రిని చేస్తే వచ్చే సాధకబాధకాలపై హైకమాండ్ ప్రధానంగా శనివారం చర్చించినట్లు కూడా తెలుస్తోంది. తమ నిర్ణయాన్ని వెల్లడించకముందు మరోసారి ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చాలని హైకమాండ్ భావిస్తోంది. ఇరువురి మధ్యా మరో బ్రేక్ఫాస్ట్ సమావేశం జరిగే అవకాశం ఉందని అంచనా. అనంతరం ఇద్దరిని ఢిల్లీకి పిలిపించి హైకమాండ్ చర్చించనున్నట్లు భావిస్తున్నారు. -
అమ్మ మీ అల్లుడు తేడా.. సంసారానికి పనికి రాడు..!
బెంగళూరు: సంసారం చేయడం లేదు, అలాగే పురుషత్వ పరీక్షకు ఒప్పుకోకుండా పరారైన భర్త ఉదంతం నెలమంగలలో జరిగింది. బెంగళూరు హెసరఘట్ట నివాసి అయిన యువతి (26)కి, నెలమంగలకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ అయిన వరునితో (30) గత జూన్ 9న వివాహం జరిగింది. మొటి రాత్రే భర్త అంటీముట్టనట్టుగా ప్రవర్తించినా, గొడవ కాకూడదని ఆమె అలాగే సంసారం నెట్టుకొస్తోంది. ఆరు నెలలు గడిచినా నెల తప్పలేదని అత్తమామలు ఆమెను వేధించడంతో ఆమె వైద్య పరీక్షలు చేయించుకుంది. అన్ని రిపోర్టులు మామూలుగా వచ్చాయి, అయితే భర్త మాత్రం పురుషత్వ పరీక్ష అనగానే ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. భర్త చేత పురుషత్వ పరీక్ష చేయించాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంసారం చేయడం లేదని అడిగినందుకు అదనపు కట్నం పేరుతో భర్త, అత్తమామలు వేధిస్తున్నారని కూడా ఫిర్యాదులో తెలిపింది. -
సంక్రాంతికి డీకేకు శుభవార్త!
సాక్షి, బెంగళూరు: వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి నాటికి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు శుభవార్త అందనున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో ఇంకా ఆయా నేతలతో వరుస సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. గురువారం రాత్రి మంత్రి సతీశ్ జార్కిహోళితో డీకే శివకుమార్ ప్రత్యేకంగా చర్చించారు. సిద్ధరామయ్య వర్గంలో ప్రధాన నాయకుడిగా గుర్తింపు పొందిన సతీశ్ జార్కిహోళి ఒక ప్రైవేటు కార్యక్రమంలో డీకే శివకుమార్తో ప్రత్యేకంగా చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే కూడా డీకే ఇంటికి వెళ్లి మాట్లాడారు. తద్వారా సిద్ధరామయ్య వర్గాన్ని తన వైపునకు తిప్పుకునే ప్రయత్నాలను డీకే వేగవంతం చేశారని తెలుస్తోంది. ఈ పరిణామాలు త్వరలో డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి దాదాపు ఖాయమని చెబుతున్నాయి. ప్రస్తుతం లోక్సభ సమావేశాలు, వచ్చే వారం అసెంబ్లీ సమావేశాలు, ఇంకా అనేక అంశాల వల్ల ముఖ్యమంత్రి మార్పు వాయిదా పడిందని, జనవరిలో అన్నింటికీ శుభం కార్డు పడనుందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. కాగా సీఎం, డీసీఎం రెండు బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ల ద్వారా ఇరు వర్గాలకు చెందిన నేతల బహిరంగ వ్యాఖ్యలు దాదాపు తగ్గిపోయాయి. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండడంతో అందరూ కలసికట్టుగా సాగాలని హైకమాండ్ స్పష్టమైన సందేశం ఇచ్చింది. కేపీసీపీ అధ్యక్ష పదవి కోసమా? కర్ణాటక కాంగ్రెస్ పార్టీ రాజకీయ వైకుంఠపాళిలో మరో పెద్ద టర్నింగ్ పాయింట్ చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి మార్పు తప్పనిసరి అయితే కేపీసీసీ అధ్యక్షుడిని కూడా మారుస్తారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేపీసీసీ సారథి రేసులో ఉన్న మంత్రి సతీశ్ జార్కిహోళి డీకేతో చర్చిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. -
గవర్నర్ మనవడిపై హత్యాయత్నం కేసు
భోపాల్: కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ కుటుంబం వరకట్న వేధింపుల ఆరోపణల్లో చిక్కుకుంది. గవర్నర్ మనవడు దేవేంద్ర గెహ్లాట్ భార్య దివ్య గెహ్లాట్, తన భర్తతో పాటు మామ, అతని కుటుంబంపై వరకట్న వేధింపులు, హత్యాయత్నం, గృహ హింస, తన మైనర్ కుమార్తె అపహరణ తదితర ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్లోని రత్లాం పోలీసు సూపరింటెండెంట్ అమిత్ కుమార్కు దివ్య లిఖితపూర్వకంగా ఈ మేరకు ఫిర్యాదు చేశారు. రూ. 50 లక్షల కట్నం డిమాండ్ చేస్తూ, తన అత్తమామలు కొన్నేళ్లుగా తనను వేధిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.దివ్య ఆరోపణల ప్రకారం.. 2018, ఏప్రిల్ 29న వారి వివాహం జరిగింది. అయితే అంతకు ముందు తన భర్త దేవేంద్ర గెహ్లాట్ మద్యపానం, మాదకద్రవ్య వ్యసనంలో మునిగితేలేవాడని, ఇతర మహిళలతో సంబంధాలున్నాయని, అయితే అవి తనకు తెలియకుండా దాచిపెట్టాడని దివ్య ఆరోపించారు. తమ వివాహం ముఖ్యమంత్రి కన్యాదాన యోజన కింద సీనియర్ నేతలు మాజీ లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, థావర్చంద్ గెహ్లాట్ తదితర ప్రముఖుల సమక్షంలో జరిగిందన్నారు. పెళ్లి తర్వాత కూడా దేవేంద్ర తన వ్యసనాలను మానుకోలేదని, ఇతర మహిళలతో సంబంధాలు కొనసాగించాడని దివ్య ఆరోపించారు.2021లో తాను గర్భవతిగా ఉన్నప్పుడు వేధింపులు మరింత తీవ్రమయ్యాయని, తనకు ఆహారం ఇచ్చేవారు కాదని, తీవ్రంగా కొట్లేవారని, మానసికంగా హింసించారని దివ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జనవరి 26న తన భర్త తాగి వచ్చి, తనను దారుణంగా కొట్టి ‘ఈ రోజు డబ్బు తీసుకురాకపోతే చంపేస్తాను’ అని బెదిరించాడని, తరువాత పైనుంచి తోసేశాడని, దీంతో తన వెన్నెముక, భుజం, నడుముకు తీవ్ర గాయాలయ్యాయని ఆరోపించారు. పైగా ఆరోజు రాత్రంతా తనకు వైద్య సహాయం అందించలేదని ఆమె ఆరోపించారు.గాయాలతో బాధపడుతున్న తనను మరుసటి రోజు ఉదయం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ తన పరిస్థితిని గుర్తించి, ఇండోర్లోని బాంబే ఆసుపత్రికి తరలించారని దివ్య తెలిపారు. అయితే ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పలేదని, పైగా తన వైద్య ఖర్చులు భరించాలని తన తండ్రిపై ఒత్తిడి తెచ్చారని దివ్య ఆరోపించారు. తన నాలుగేళ్ల కుమార్తెను తన అత్తమామలు వారితోనే ఉంచుకున్నారని, తాను తన కుమార్తెను కలుసుకునేందుకు పాఠశాలకు వెళ్ళినప్పుడు, తన భర్త అడ్డుకొని, తన తల్లిదండ్రుల నుండి డబ్బు తీసుకువచ్చాకనే, కూతురిని చూడాలని హెచ్చరించాడని దివ్య ఆరోపించారు.దివ్య ప్రస్తుతం రత్లంలో తన తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. ఈ ఉదంతంలోని పలు సంఘటనలు ఉజ్జయిని జిల్లాలోని నాగ్డాలో జరగడంతో, రత్లాం పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించి, తదుపరి చర్యల కోసం ఉజ్జయిని అధికారులకు పంపారు. ఈ ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గెహ్లాట్ (దివ్య మామ) స్పందించారు. ఆరోపణలు ఎవరైనా చేయవచ్చని, తను అన్ని వాస్తవాలను మీడియా ముందు ఉంచుతానని అన్నారు.ఇది కూడా చదవండి: పుతిన్ సెక్యూరిటీ: ల్యాబ్, టాయిలెట్.. అంతా రహస్యమే! -
ఆహ్వానం లేకుండా ఢిల్లీకి వెళ్లను
మంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పు పై ఊహాగానాలు కొనసాగుతుండగా.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశమైంది. ఓ పెళ్లికి హాజరుకావ డంతోపాటు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని వార్తలొచ్చాయి. బుధవా రం ఉప ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళూరు వచ్చిన సిద్ధరామయ్యతో.. డీకే పర్యటన గురించి మీడియా ప్రశ్నించగా.. అధికారికం ఆహ్వానం లేకుండా ఢిల్లీకి వెళ్లబోనని స్పష్టం చేశారు. ‘ఆయనను వెళ్లనివ్వండి. ఎవరైనా ఆయనకు నో చెప్పారా? నేను ఆహ్వానించినప్పుడే వెళ్తాను. నన్ను ఆహ్వానించలేదు, కాబట్టి నేను వెళ్లడం లేదు.’అని స్పష్టం చేశారు. మంగళూరు విమానాశ్రయంలో డీకే డీకే అంటూ మద్దతుదారులు నినాదాలు చేయడంపై ఆయన..‘ఇందులో తప్పేముంది? గత పదేళ్లుగా ప్రజలు ‘డీకే డీకే’అని నినాదాలు చేస్తున్నారు. కొంతమంది ‘మోదీ మోదీ’అని అరుస్తారు. మరికొందరు ‘రాహు ల్ రాహుల్’, ఇంకొందరు ’సిద్దూ సిద్ధూ’అని జపిస్తారు. అందులో తప్పేమీ లేదు. వారు ప్రేమతో నినాదాలు చేస్తారు. దానిని మనం క్రీడాస్ఫూర్తితో తీసుకోవాలి’అని అన్నారు. -
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు
-
హరిత ట్రావెల్స్ బస్సు కర్ణాటకలో బోల్తా
-
పడిక్కల్ విధ్వంసకర శతకం
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కర్ణాటక స్టార్ ఆటగాడు దేవదత్ పడిక్కల్ చెలరేగిపోయాడు. తమిళనాడుతో ఇవాళ (డిసెంబర్ 2) జరుగుతున్న మ్యాచ్లో కేవలం 46 బంతుల్లోనే అజేయమైన శతకం (102) బాదాడు. ఇందులో 10 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి.పడిక్కల్తో పాటు శరత్ (23 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), స్మరణ్ రవిచంద్రన్ (29 బంతుల్లో 46 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 3 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోర్ చేసింది.మిగతా ఆటగాళ్లలో మయాంక్ అగర్వాల్ 24, కరుణ్ నాయర్ 4 పరుగులు చేశారు. తమిళనాడు బౌలర్లలో సోనూ యాదవ్ 2, టి నటరాజన్ ఓ వికెట్ తీశారు.కాగా, ప్రస్తుత SMAT సీజన్లో ఇప్పటికే ఏడు సెంచరీలు (పడిక్కల్ది కాకుండా) నమోదయ్యాయి. ముంబై ఆటగాడు ఆయుశ్ మాత్రే 2, అభిమన్యు ఈశ్వరన్, రోహన్ కున్నుమ్మల్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ఉర్విల్ పటేల్ తలో సెంచరీ చేశారు. -
డీకే సీఎం అయ్యేది అప్పుడే: సిద్దరామయ్య
బెంగళూరు: కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. కర్ణాటక కాంగ్రెస్లో అధికార పంపిణీపై ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ ఇంటికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బ్రేక్ ఫాస్ట్ మీటింగ్కు వెళ్లారు. ఈ సందర్బంగా సీఎంకు డీకే, ఆయన సోదరుడు డీకే సురేష్ స్వాగతం పలికారు. అనంతరం, ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. అల్పాహారంలో నాటుకోడి చికెన్, ఇడ్లీ, ఉప్మా, దోశ, కాఫీ ఆస్వాదిస్తూ ప్రస్తుత పరిణామాలపై చర్చించుకున్నారు.బ్రేక్ ఫాస్ట్ అనంతరం సీఎం సిద్దరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం మార్పుపై అధిష్టానానిదే తుది నిర్ణయం. హైకమాండ్ ఎప్పుడు ఆదేశిస్తే శివకుమార్ అప్పుడు ముఖ్యమంత్రి అవుతారు. హైకమాండ్, రాహుల్ గాంధీ ఆదేశాలను మేము పాటిస్తాం. రేపు డీకే, నేను కేసీ వేణుగోపాల్ను కలుస్తాం. మేము కలిసే ఉన్నాం. మా మధ్య విభేదాలేమీ లేవు. మేమంతా కలిసే ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. భవిష్యత్లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అని చెప్పుకొచ్చారు. #WATCH | Bengaluru | Karnataka CM Siddaramaiah says, "There are no differences. DK Shivakumar and I are united. We are running the government. In the future also, we will run the government unitedly..." pic.twitter.com/uM4cjTNDL7— ANI (@ANI) December 2, 2025ఇక, అంతకుముందు.. సీఎం సిద్దరామయ్యను మంగళవారం బ్రేక్ ఫాస్టుకు ఆహ్వానించినట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) ట్విట్టర్లో వెల్లడించారు. ఈ సందర్బంగా డీకే శివకుమార్..‘కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కోసం, మరింత సమన్వయంతో కలిసి పనిచేయడం గురించి మాట్లాడటానికి, ముఖ్యమంత్రిని రేపు బ్రేక్ఫాస్ట్కి ఆహ్వానించాను’ అని రాసుకొచ్చారు. డిప్యూటీ సీఎం ఆహ్వానం మేరకు ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి సిద్దరామయ్య సదాశివనగర్లోని నివాసానికి రాగా.. బెంగళూరు రూరల్ ఎంపీ డీకే సురేశ్ ఆయన్ను సాదరంగా స్వాగతించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి మార్పు గురించి ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. రెండున్నరేళ్ల తర్వాత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు సీఎం బాధ్యతలు అప్పగించేలా అప్పట్లో ఓ ఒప్పందం కుదిరిందని ప్రచారం జరుగుతోంది. పార్టీ దీనిని పదేపదే ఖండిస్తున్నా.. ఈ అంశం రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది.అయితే, గత శనివారమే వీరిద్దరూ సిద్ధరామయ్య ఇంట్లో సమావేశం అయిన విషయం తెలిసిందే. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని ప్రకటించారు. అధిష్ఠానం ఏం చెబితే తామిద్దరం అదే పాటిస్తామని తెలిపారు. #WATCH | Bengaluru, Karnataka | Dy CM DK Shivakumar and his brother DK Suresh welcome CM Siddaramaiah at their residence. pic.twitter.com/g5f1dWMzvo— ANI (@ANI) December 2, 2025 #WATCH | Bengaluru | Karnataka CM Siddaramaiah reaches Dy CM DK Shivakumar's residence, at his invitation for a breakfast meeting (Visuals from outside Dy CM DK Shivakumar's residence) pic.twitter.com/OmWK5dpwmT— ANI (@ANI) December 2, 2025 -
ఐక్యతారాగంలో మరో విందు
సాక్షి, బెంగళూరు: అధికార మార్పిడి వివాదానికి అల్పాహార భేటీ ద్వారా విరామం ప్రకటించి ఐక్యతారాగం పాడిన సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మరోసారి తమ ఐక్యతను చాటిచెప్పేందుకు సిద్ధమయ్యారు. మూడు రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు సీఎం సిద్ధరామయ్య తన నివాసంలో అల్పాహార విందు ఇచ్చారు. ఇప్పుడు డీకే వంతు వచ్చింది. సోమవారం విధానసౌధలో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ‘తన నివాసంలో భోజన విందుకు’ రావాల్సిందిగా సీఎంను డీకే ఆహ్వానించారు.అయితే బ్రేక్ఫాస్ట్కు వస్తానని సీఎం తెలిపారు. దీంతో సీఎం సిద్ధరామయ్యకు ఇష్టమైన నాటుకోడి పులుసుతో పాటు ఇతరత్రా వంటకాలను ప్రత్యేకంగా డీకే సిద్ధం చేయిస్తున్నారు. కలిసి కూర్చుని మాట్లాడుకోవాలంటూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచనల మేరకు ఈ నెల 29న ముఖ్యమంత్రి నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు తామిద్దరం కలసికట్టుగా సాగుతున్నట్లు మీడియాకు వివరించారు. తద్వారా సీఎం మార్పిడి వివాదానికి తాత్కాలికంగా విరామం ప్రకటించారు. జనవరి మొదటి వారానికి వాయిదా! కాగా, సీఎం మార్పుపై కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎటూ తేల్చకుండా నాన్చుతోంది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ నాయకులు బిజీగా ఉండడంతో కర్ణాటక అధికార మార్పిడిపై చర్చించేందుకు అధిష్టానం నాయకులు అందుబాటులో లేరని తెలుస్తోంది. ఢిల్లీలో ఆదివారం సోనియాగాంధీ నేతృత్వంలో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో కర్ణాటక రాజకీయ పరిస్థితి చర్చకువచ్చింది. సిద్ధరామయ్య, డీకేల కార్యాచరణపై వివరాలను అడిగి తెలుసుకున్న సోనియా జనవరి మొదటి వారంలో పరిశీలిస్తామని ఖర్గేకు తెలిపినట్లు సమాచారం. మేం సోదర సమానులం: డీకే ముఖ్యమంత్రి, తాను సోదర సమానులమని, కలసికట్టుగా పనిచేసుకుంటూ ముందుకు సాగుతామని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మాజీ సీఎం దివంగత కెంగల్ హనుమంతయ్య వర్ధంతి సందర్భంగా విధానసౌధలోని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన శివకుమార్ అనంతరం మీడియాతో మాట్లాడారు. తమలో గ్రూపులు మీడియా సృష్టి అన్నారు. రాజకీయ ద్వేషంతోనే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని నేషనల్ హెరాల్డ్ కేసును ఉదహరిస్తూ ఆయన పేర్కొన్నారు. డీకే ఇస్తున్న విందుకు వెళుతున్నట్లు ఇదే కార్యక్రమం సందర్భంగా సీఎం తెలిపారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు ప్రస్తావిస్తూ సోనియా, రాహుల్ గాందీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సరికాదన్నారు. -
ఈసారి డీకే నివాసంలో.. సీఎం కుర్చీ ఫైట్కు ఫుల్స్టాప్ పెడతారా?
న్యూఢిల్లీ: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ల ‘సీఎం’ పంచాయతీ బ్రేక్ఫాస్ట్లపై నడుస్తుంది. అధిష్టానం ఆదేశాలనుకుణంగా మొన్న ఇద్దరు నేతలు కలిసి బ్రేక్ఫాస్ట్లో పాల్గొన్నారు. సీఎం సిద్ధరామయ్య ఇంటికి హాజరైన డీకే.. బ్రేక్ఫాస్ట్లో పాల్గొన్నారు. అయితే ఆ తర్వాత ఇద్దరు ఢిల్లీ వెళ్లి హైకమాండ్ను కలిశారు. వారిద్దరూ బ్రేక్ఫాస్ట్ కలిసి చేసినా ఏమీ స్పష్టత లేకపోవడంతో మళ్లీ బ్రేక్ఫాస్ట్ చేయాలని హైకమాండ్ ఆదేశించింది. ఈసారి ఆ బ్రేక్ఫాస్ట్ను డీకే నివాసంలో ఏర్పాటు చేశారు. డిసెంబర్ రెండో తేదీన అంటే రేపు(మంగళవారం) వారిద్దరు మరోసారి బ్రేక్ఫాస్ట్ విందులో పాల్గొననున్నారు. ఢిల్లీకి వెళ్లిని వీరిద్దరి హైకమాండ్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాత్రం.. వీరిద్దరి ఎపిసోడ్పై సీరియస్గా ఉన్నారు. ఐదేళ్ల సీఎం పదవిలో బాగంగా మార్పు అంశానికి ముగింపు పెట్టాలని వారిని హెచ్చరించారనే వార్తలు వచ్చాయి. దానిలో భాగంగానే సిద్ధరామయ్య, డీకేలు మరోసారి భేటీ కావండం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసారైనా సీఎం మార్పు అంశానికి వీరిద్దరూ ముగింపు పెడతారా లేదా అనే దానిని హైకమాండ్ నిశితంగా గమనిస్తోంది. కాగా నవంబర్ 20న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడవడంతో సీఎం మార్పు జరగనుందని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అధికారంలోకి వచ్చినప్పుడే సీఎం మార్పు జరిగేలా అగ్రిమెంట్ జరిగిందని దానికనుంగానే నిర్ణయం తీసుకోనున్నారని ఊహాగానాలు చెలరేగాయి. దానికి ఆజ్యం పోస్తూన్నట్లుగానే ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్లు చేయడం కూడా ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. వాట్ నెక్ట్స్ అనేది రేపటికి ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సీఎం పదవి తనకు కావాలని డీకే పట్టుబడతారా.. లేక సిద్ధరామయ్యకు పూర్తిగా ఐదేళ్లు వదిలేస్తారా? అనేది చూడాలి. -
నరకం చూశా.. సిద్దరామయ్య గారు క్షమించండి: ఎంపీ ఆవేదన
బెంగళూరు: ఇటీవలి కాలంలో బెంగళూరు ట్రాఫిక్పై పలువురు ప్రముఖులు తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా సమాజ్వాదీ పార్టీ ఎంపీ సైతం బెంగళూరులో ట్రాఫిక్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రద్దీ నియంత్రణ కోసం పోలీసులకు తాను ఫోన్ చేసినా స్పందించలేదని మండిపడ్డారు.ఉత్తరప్రదేశ్కు చెందిన ఎస్పీ ఎంపీ రాజీవ్ రాయ్ బెంగళూరుకు వెళ్లారు. అనంతరం, పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాల్సి ఉండగా ఆయన ఎయిర్పోర్టుకు బయలుదేరారు. ఇంతలో బెంగళూరు రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది. దీంతో, తాను వెళ్లాల్సిన విమానం మిస్ అవుతుందనే కారణంగా స్థానిక పోలీసులకు సంప్రదించేందుకు ప్రయత్నించారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. అయితే, తన కాల్ను పోలీసులు లిఫ్ట్ చేయకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా సోషల్ మీడియా వేదికగా రాజీవ్ రాయ్ స్పందిస్తూ.. బెంగళూరులో ట్రాఫిక్ కారణంగా రోడ్లపై నరకం చూడాల్సి వచ్చింది. గౌరవనీయులైన కర్ణాటక ముఖ్యమంత్రి, నన్ను క్షమించండి. బెంగళూరులో ట్రాఫిక్ నిర్వహణ దారుణంగా ఉంది. అత్యంత బాధ్యతారహితమైన, పనికిరాని ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. వారు ఫోన్ కాల్స్ కూడా తీసుకోరు. వారితో మాట్లాడటానికి ఎంత ప్రయత్నించినా సఫలం కాలేదు. ఎవరూ నా కాల్ను తీసుకోలేదు. రాజ్కుమార్ ఘాట్ రోడ్డులో ఒక గంట పాటు ఒకే చోట ట్రాఫిక్లో ఉండిపోయాను. ఒకానొక సమయంలో నేను ఢిల్లీ వెళ్లాల్సిన విమానం మిస్ అవుతుందో అని టెన్షన్ పడ్డాను. రోడ్లపై ఒక్క పోలీసు కూడా కనిపించలేదు. ఈ అసమర్థ అధికారులే బెంగళూరు నగరం పేరును చెడగొడుతున్నారు. ఇప్పుడు బెంగళూరు ట్రాఫిక్ అత్యంత అపఖ్యాతిని పొందింది అనడంలో సందేహం లేదు’ అని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.Hon’ble @CMofKarnataka I m sorry but you have the worst traffic management, and most irresponsible, useless traffic police. They don’t even pick up phone calls, here is the SS of my attempt to speak to them , none of them picked up my call. Last one hour we are stuck at same… pic.twitter.com/GlWjJ4RgKH— Rajeev Rai (@RajeevRai) November 30, 2025 -
బ్రేక్ఫాస్ట్తో కుర్చీ పోరుకు బ్రేక్!
సాక్షి బెంగళూరు/బెంగళూరు (శివాజీనగర): కర్ణాటకలో సీఎం కుర్చీ మార్పుపై కొద్ది రోజులుగా సాగుతున్న పోరుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లు ఢిల్లీకి వెళ్లకుండానే.. ఢిల్లీలో సోనియా గాంధీ నాయకత్వంలో ఏఐసీసీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే వారిద్దరూ ఐక్యతారాగం ఆలí³ంచారు. శుక్రవారం దాకా ఎత్తుకు పై ఎత్తు వేస్తూ.. పరోక్షంగా బల ప్రదర్శన చేస్తూ.. మరోవైపు హై కమాండ్ నిర్ణయమే శిరోధార్యమని చెబుతూ వచ్చిన వారు.. శనివారం అల్పాహార విందులో సుదీర్ఘంగా చర్చించుకున్నారు. అధిష్టానం నుంచి అందిన ఆదేశాలో.. లేక ఇద్దరి మధ్య కుదిరిన సయోధ్యో.. మొత్తానికి తమ లక్ష్యం 2028 ఎన్నికల్లో గెలవడమేనని స్పష్టం చేశారు.కర్ణాటక సమస్యను పరిష్కరించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలాలు పలుమార్లు చర్చించి చివరికి నిర్ణయాన్ని ఆ పార్టీ అధినేత్రి సోనియాకి వదిలేశారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఢిల్లీలో సోనియా నివాసంలో కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశం జరిగింది. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న తరుణంలో అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలిసింది.ఇదే సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. శనివారం సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ద్వారా ప్రస్తుతానికి పరిస్థితిని శాంతింపజేసినట్లు నేతలు సోనియా దృష్టికి తీసుకొచ్చారు. కర్ణాటక రాజకీయ పరిణామాలపై మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీకి ప్రత్యేకంగా నివేదించారు. ఓ వైపు పార్లమెంట్ సమావేశాలు, మరోవైపు కర్ణాటకలోని బెళగావిలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలోసీఎం, డీసీఎంలు చర్చించుకుని, కుర్చీ పోరుకు తాత్కాలికంగా స్వస్తి చెప్పేలా అధిష్టానం చక్రం తిప్పడంలో విజయం సాధించింది. కలిసికట్టుగా పని చేస్తాంతనకు సీఎం సిద్ధరామయ్యతో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. బెంగళూరులోని తన నివాసంలో ఆదివారం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు తమపై ఆశలు పెట్టుకున్నందున, తామంతా కలసికట్టుగా పని చేయాల్సి ఉందన్నారు. 2028 ఎన్నికలే తమ లక్ష్యం అని చెప్పారు. ‘నేను ఏనాడూ గ్రూపు రాజకీయం చేయను. ఎప్పుడూ ఢిల్లీకి ఒక్కడినే వెళతాను. 140 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నాయకులే. ఎవరినీ చిన్నచూపు చూడను. గతంలో కుమారస్వామి ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఆఖరిరోజు వరకు ఎంతో ప్రయత్నం చేశాననేది ఆయన తండ్రికి తెలుసు. ఇప్పుడు విమర్శలు చేస్తుంటే చేసుకోనీ. నేను కోపగించుకోను. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో చర్చించిన విషయాలు బయటకు చెప్పలేను’ అని తెలిపారు. -
నా లిమిట్స్ నాకు తెలుసు: డీకే శివకుమార్
సాక్షి బెంగుళూరు:గత కొంతకాలంగా జాతీయ రాజకీయాలని వేడెక్కించిన కర్ణాటక పాలిటిక్స్ ఇప్పుడు కాస్త చల్లబడ్డట్లు కనిపిస్తున్నాయి. సీఎం సిద్ధరామయ్యతో తనకు విభేదాలు ఏమి లేవని డిప్యూటీ సీఎం డీ.కే శివకుమార్ ప్రకటించారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా తన లిమిట్స్ ఏంటో తనకు తెలుసన్నారు. తమ పార్టీ నేతల దృష్టంతా 2028లో పార్టీని అధికారంలోకి తేవడం పైనే ఉందన్నారు.కర్ణాటక కాంగ్రెస్లో పుట్టిన అంతర్గత ముసలం గత కొద్దిరోజులుగా దేశ రాజకీయాల్లో హాట్టాఫిక్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర సీఎం సిద్ధ రామయ్య, డిప్యూటీ సీఎం డీ.కే శివకూమార్ మధ్య ట్వీట్ల యుద్ధం తీవ్రంగానే నడిచింది. తనను ఐదు సంవత్సరాల కొరకు ప్రజలు ఎన్నుకున్నారని సిద్ధ రామయ్య, మాట నిలబెట్టుకోవడం కంటే గొప్పది మరోటి ఉండదని శివకుమార్ కామెంట్స్ చేశారు. కాగా ప్రస్తుతం శివకుమార్ మాట్లాడే తీరు చూస్తుంటే ఈ విషయంలో ఆయన కొంచెం మెత్తబడ్డట్లే కనిపిస్తుంది.డీ.కే శివకుమార్ మాట్లాడుతూ "ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. పార్టీ అధ్యక్షుడిగా నా పరిధులేంటో నాకు తెలుసు. ఇప్పటి వరకూ తామేప్పుడు భేదాభిప్రాయాలు వ్యక్తం చేయలేదు. మేమిద్దరం కలిసే పని చేస్తున్నాం. కర్ణాటక ప్రజలకు వారి భవిష్యత్తు మీద ఎన్నో ఆశలున్నాయి. వాటిని నెరవేర్చడం కోసం మేమంతా కలిసి పనిచేయాలనుకుంటున్నాం. 2028, 2029లో అధికారం సాధించడమే మా ముందున్న గమ్యం. దానికోసం మేం పనిచేస్తున్నాం. వివిధ సమస్యలపై అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం". అని శివకుమార్ అన్నారు.కాగా నవంబర్ 20న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడవడంతో సీఎం మార్పు జరగనుందని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అధికారంలోకి వచ్చినప్పుడే సీఎం మార్పు జరిగేలా అగ్రిమెంట్ జరిగిందని దానికనుంగానే నిర్ణయం తీసుకోనున్నారని ఊహాగానాలు చెలరేగాయి. కాగా ప్రస్తుతం సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకూమర్ ఇద్దరూ నేతలు సైతం అధిష్ఠానందే ఫైనల్ డెసిషన్ అనడంతో కాంగ్రెస్ హైకమాండ్ ఊపిరి తీసుకున్నట్లు కనిపిస్తుంది.ఈ వివాదం పై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే త్వరలోనే పార్టీ హైకమాండ్తో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. -
డి.కె. శివకుమార్ (కర్ణాటక డిప్యూటీ సీఎం) రాయని డైరీ
అప్పు తీసుకునేటప్పుడు బాగానే ఉంటారు. తిరిగి ఇచ్చేయవలసి వచ్చినప్పుడే బాధపడి పోతుంటారు!సిద్ధరామయ్య నాకు సీఎం సీటు బాకీ. ‘‘ఫస్ట్ హాఫ్లో నేను సీఎంగా ఉంటాను. సెకండ్ హాఫ్లో మీరు సీఎంగా ఉండండి’’ అని నన్ను నమ్మించి సీఎం అయ్యారు సిద్ధరామయ్య. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. నవంబర్ 20న ఆయన నా బాకీ తీర్చేయాలి. తీర్చలేదు! మాట మీద నిలబడని మనుషుల వల్లే రాజకీయాల్లో ఈ లంచ్ మీట్లు, సర్దుబాటు బ్రేక్ఫాస్ట్లు!‘‘సిద్ధరామయ్య గారూ... మాట తప్పటం మన కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే లేదు’’ అన్నాను, అలాగైనా హై కమాండ్ గుర్తొచ్చి, ఆ భయంతో నైనా నా అప్పు తీర్చేస్తారని!‘‘నేను మీకు ఏ మాటా ఇవ్వలేదు శివకుమార్. ఇచ్చానని మీరనుకుంటే సరిపోదు. పత్రం ఏది? సాక్షులు ఏరి? ఉంటే చూపించండి’’ అన్నారు! అప్పును ఎగ్గొట్టే ఉద్దేశం ఉన్న వారి జార్గాన్ ఎలా ఉంటుందో సరిగ్గా అలానే మాట్లాడుతున్నారు సిద్ధరామయ్య! ‘‘దిక్కున్న చోట చెప్పుకో...’’ అనే మాటొక్కటే అనటం లేదు. ఇద్దరి దిక్కూ హై కమాండే కాబట్టి.నవంబర్ 20 దాటి పది రోజులైంది! సిద్ధరామయ్య సీఎం సీట్లోంచి లేవటం లేదు. ‘‘ఒకరు చెబితే లేవను. హై కమాండ్ మాటే నాకు ఫైనల్’’ అంటున్నారు.‘‘అవును. హై కమాండ్ మాటే మా నాయకుడికి ఫైనల్’’ అని పరమేశ్వర, సతీశ్ జార్కిహోలీ, మహదేవప్ప, వెంకటేశ్, కె.ఎ¯Œ . రాజన్న అంటున్నారు.సిద్ధరామయ్యకే కాదు, నాకూ హైకమాండ్ మాటే ఫైనల్. కానీ హై కమాండేఏ మాటా ఫైనల్ చేసి చెప్పటం లేదు. శుక్రవారం హఠాత్తుగా ఢిల్లీ నుండి ఖర్గే ఫోన్! ‘‘శనివారం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఒకటి పెట్టుకుని వాళ్లలో వాళ్లనే తేల్చుకోమనండి’’ అని సోనియాజీ అంటున్నారని!నచ్చని మనుషులతో కలిసి, నవ్వుతూ బ్రేక్ఫాస్ట్ చెయ్యడం రాజకీయాల్లో మాత్రమే ఉంటుందేమో! అనిష్టంగానే శనివారం ఉదయం సిద్ధరామయ్య ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వెళ్లాను. టేబుల్కి ఒక ఒంపులో ఇద్దరం పక్క పక్కన కూర్చొనేలా ముందే ఏర్పాట్లు చేయించి నట్లున్నారు ఆయన!‘‘తినండి శివకుమార్! మీకు ఇష్టమని ఇడ్లీ తెప్పించాను’’ అన్నారు, నవ్వుతూ. ‘‘ఇడ్లీ మాత్రమే కాదు సిద్ధరామయ్య గారూ... నాకు మసాలా దోసె, ఉప్మా, కేసరి బాత్ కూడా ఇష్టమే’’ అన్నాను.‘‘వాటికి టైమ్ పడుతుందని ఇడ్లీ తెప్పించాను శివకుమార్. టైమ్ పట్టేవాటి కోసం వెయిట్ చేయాల్సిందే కదా’’ అన్నారు నవ్వుతూ! హై కమాండ్ నుంచి హామీ లభించిన అల్లరితనమేదో ఆయన నవ్వులో కనిపిస్తోంది. ఇడ్లీ తిని బయటికి వచ్చేశాను.అరగంట పైగా మాట్లాడుకున్నాం. సీటు కావాలని నేను అడగలేదు. సీటు ఇస్తానని ఆయనా అనలేదు. ‘‘నాకూ పనుంది’’ అని ఆయనా లేచారు. బ్రేక్ఫాస్ట్ అయ్యాక నేరుగా వెళ్లి శ్రీ నిర్మలానందనాథ స్వామీజీని కలిశాను.‘‘డిసెంబర్ 8 నుండి శాసన సభ సమావేశాలు స్వామీజీ. ఉప ముఖ్యమంత్రిగా ఆ సమావేశా లకు హాజరవటం నాకు ఇష్టం లేదు. ఏం చేయ మంటారు?’’ అని అడిగాను. స్వామీజీ చిద్విలాసంగా చూశారు.‘‘నీ అభీష్టం ఒక విధంగా నెరవేరకుంటే, ఇంకో విధంగా నెరవేర్చుకో నాయనా’’ అన్నారు. సమావేశాలు ప్రారంభం అయ్యేలోపు నువ్వు ముఖ్యమంత్రివి కాలేకపోతే, ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉండొద్దు అనిప్రబోధించారు! తిరుగులేని బాణం.స్వామీజీ దగ్గర సెలవు తీసుకుని,నాగమంగళలోని ఆదిచుంచనగరిమహాసంస్థాన మఠం నుంచి తిరిగివస్తుంటే, దారిలో... బైడ్గిలోని కగినెలేకనకగిరి పీఠంలో శ్రీ నిరంజనానందపురి స్వామీజీని దర్శించుకుని వస్తూ సిద్ధరామయ్య కనిపించారు! -మాధవ్ శింగరాజు -
హైకమాండ్ నిర్ణయమే.. మా నిర్ణయం
కర్ణాటక అధికార పార్టీలో నెలకొన్న కాంగ్రెస్ సంక్షోభం దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ ఉదయం స్పెషల్ బ్రేక్ఫాస్ట్తో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ భేటీ కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. అనంతరం ఇద్దరూ ప్రెస్మీట్ నిర్వహించి.. నాయకత్వ విషయంలో హైకమాండ్ నిర్ణయమే మా నిర్ణయం అంటూ ప్రకటించారు. కర్ణాటక ప్రజల మద్దతుతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. వారికిచ్చిన వాగ్దానం ప్రకారం తాను సిద్ధరామయ్యతో కలిసి పని చేస్తానని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) పేర్కొన్నారు. అయితే బ్రేక్ఫాస్ట్ భేటీలో ఏం చర్చించారనే అంశంపై మాత్రం ఇద్దరూ ఐక్య ప్రకటన చేయకపోవడం గమనార్హం.ఎలాంటి గందరగోళం లేదు. మా ఇద్దరి మధ్యా ఎలాంటి విభేదాలు లేవు. ఇక ముందు కూడా ఉండబోవు. ఏఐసీసీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచనల మేరకు తాము బ్రేక్ఫాస్ట్ భేటీలో పాల్గొన్నాం. నెల రోజుల ముందు నుంచి అందరిలో ఉన్న గందరగోళానికి తెరదించేందుకే ఈ భేటీ. బీజేపీ జేడీఎస్లు అసత్య ప్రచారానికి దిగుతున్నాయి. వాటిని మేం ఉమ్మడిగా ఎదుర్కొంటాం. 2028లో కాంగ్రెస్ గెలవడమే మా లక్ష్యం. అందుకోసం హైకమాండ్ ఏం చెప్పినా వింటాం.. అని సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) అన్నారు. ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ @DKShivakumar ಅವರ ಜೊತೆಗಿನ ಉಪಹಾರ ಹಾಗೂ ಚರ್ಚೆಯ ಬಳಿಕ ಮಾಧ್ಯಮಗೋಷ್ಠಿಯಲ್ಲಿ ನನ್ನ ಮಾತುಗಳು;ಪಕ್ಷದ ವರಿಷ್ಠರ ತೀರ್ಮಾನ, ಸೂಚನೆಯಂತೆ ನಾನು ಹಾಗೂ ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಡಿ.ಕೆ.ಶಿವಕುಮಾರ್ ನಡೆದುಕೊಳ್ಳುತ್ತೇವೆ ಎಂದು ನಾವಿಬ್ಬರೂ ತೀರ್ಮಾನಿಸಿದ್ದೇವೆ. ಸಚಿವರಾಗಲಿ, ಶಾಸಕರಾಗಲೀ ಯಾರೂ ನಮ್ಮ ಸರ್ಕಾರದ ವಿರುದ್ಧವಿಲ್ಲ.… pic.twitter.com/Uwghr50TJT— Siddaramaiah (@siddaramaiah) November 29, 2025 పార్టీకి విశ్వాసపాత్రులైన సైనికుల్లా పని చేస్తున్నాం. నాయకత్వం విషయంలోనూ హైకమాండ్ నిర్ణయమే ఫైనల్. ఇంతకాలం పార్టీ పెద్దలు తనను వేచి ఉండాలని సూచించారు. ఇంకొంతకాలం కూడా వేచి ఉండడానికి సిద్ధం. హైకమాండ్ ఏం చెప్పినా.. దానిని అందరం అనుసరిస్తాం. ప్రస్తుతం పార్టీ పలు సమస్యలు ఎదుర్కొంటోంది. అసెంబ్లీలో సమావేశాల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై చర్చించాం. 2028లో రానున్న కర్ణాటక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం అని డిప్యూటీ సీఎం శివకుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు గురించి గత పది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల టైంలో(2023).. రెండున్నరేళ్ల తర్వాత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు సీఎం బాధ్యతలు అప్పగించేలా పవర్ షేరింగ్ ఒప్పందం కుదిరిందని ప్రచారం జరిగింది. అయితే మధ్యలో ఇద్దరూ దానిని ఖండిస్తూ వచ్చారు. తాజాగా ఈ గడువు రావడం.. డీకే వర్గం అధిష్టానంపై ఒత్తిడికి ప్రయత్నించడం.. ఇటు సిద్ధూ వర్గం కూడా కౌంటర్ క్యాంపెయిన్ నడపడం, అటుపై ఇద్దరి మద్య ఎక్స్ వేదికగా వార్ వర్డ్తో కర్ణాటక రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ తరుణంలో రంగంలోకి దిగిన కాంగ్రెస్ పెద్దలు చర్చలు జరిపి పరిస్థితిని ఓ కొలిక్కి తెచ్చినట్లు స్పష్టమవుతోంది. -
Karnataka: ముగిసిన సిద్ధరామయ్య-శివకుమార్ భేటీ.. రాజీ ఫార్ములా?
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అధికార మార్పిడికి సంబంధించిన చర్చలు ముమ్మరమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ శనివారం ఉదయం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో అల్పాహారం విందు చేశారు. 2026, మార్చి, ఏప్రిల్ నాటికి సిద్ధరామయ్య నుండి శివకుమార్కు ముఖ్యమంత్రి పీఠం బదిలీ అయ్యేలా ఫార్ములా రూపొందించినట్లు సమాచారం. త్వరలో ఈ వివరాలను ఇద్దరు నేతలు వెలువరించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతవరకు శివకుమార్ డిప్యూటీగా కొనసాగనున్నారు. కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం కర్ణాటకలో బహిరంగ విభేదాలను కోరుకోవడం లేదు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లాంటి సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిని హఠాత్తుగా తొలగించడం పార్టీకి నష్టం కలిగిస్తుందనే ఉద్దేశంతో సమాలోచనలు జరుపుతోంది.ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಡಿ.ಕೆ.ಶಿವಕುಮಾರ್ ಅವರ ಜೊತೆ ಬೆಳಗ್ಗಿನ ಉಪಹಾರ ಸೇವಿಸುತ್ತಾ, ಕೆಲಹೊತ್ತು ಮಾತುಕತೆ ನಡೆಸಿದೆ. @DKShivakumar pic.twitter.com/7ak3xFjatL— Siddaramaiah (@siddaramaiah) November 29, 2025సమావేశం తర్వాత ఇద్దరు నేతలు సోషల్ మీడియాలో చేసిన పోస్టులు అంతా సవ్యంగానే ఉందనే సందేశాన్ని పంపాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ‘ఎక్స్’లో, "నేను డి.కె. శివకుమార్తో అల్పాహారం తీసుకున్నాను" అని పోస్ట్ చేయగా, శివకుమార్ మరింత లోతైన అర్థాన్నిచ్చేలా, ‘ఈ ఉదయం కావేరి నివాసంలో అల్పాహార సమావేశం కోసం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిశాను. కర్ణాటక ప్రాధాన్యతలు, ముందుకు సాగే మార్గంపై చర్చ జరిగింది’ అని రాశారు. ఈ అల్పాహార సమావేశంలో ఉప్మా, ఇడ్లీ, కేసరి బాత్ స్వీకరిస్తున్న ఇద్దరు నేతల ఫోటో.. వారి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని సూచిస్తోంది. ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಶ್ರೀ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರನ್ನು ಇಂದು ಅವರ ಕಾವೇರಿ ನಿವಾಸದಲ್ಲಿ ಭೇಟಿಯಾಗಿ ಉಪಾಹಾರ ಸಭೆ ನಡೆಸಲಾಯಿತು.Met Hon’ble CM Shri @siddaramaiah avaru at Cauvery Residence this morning for a breakfast meeting. A productive discussion on Karnataka’s priorities and the road ahead. pic.twitter.com/qhe7q5RNvi— DK Shivakumar (@DKShivakumar) November 29, 2025ఈ రాజీ ఫార్ములాకు శివకుమార్ అంగీకరించేందుకు అనేక బలమైన కారణాలు ఉన్నాయని వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా పునర్వ్యవస్థీకరణలో ఆయన విధేయులకు మరిన్ని క్యాబినెట్ పదవులు లభించనున్నాయి. ఆయన రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్గా కొనసాగుతారు. ముఖ్యమంత్రిపై చర్య తీసుకునేందుకు ఆయనకు తగినంత సంఖ్యాబలం లేదు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో శివకుమార్ పొందగలిగే ఉత్తమ ఒప్పందం ఇదేనని భావన ఉంది. కులం లెక్కల దృష్ట్యా, పార్టీ దృక్కోణం నుండి సిద్ధరామయ్యను తప్పించడం అంత సులభం కాదనే మాట వినిపిస్తోంది. ఆయన 'అహింద' (మైనారిటీలు, వెనుకబడిన తరగతులు,దళితులు) రాజకీయ కూటమికి అత్యంత శక్తివంతమైన నేతగా పేరొందారు. శివకుమార్ ఓబీసీ వొక్కలిగ సమాజానికి ప్రతినిధిగా ఉన్నారు. కాంగ్రెస్ ఈ నేతను కూడా దూరం చేసుకోలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ కేంద్ర నాయకులను కలవడానికి శివకుమార్ శనివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. -
సీఎం సిద్దరామయ్య ఇంటికి డీకే శివకుమార్
-
కర్ణాటక ఆర్టీసీ బస్సు బోల్తా..
కర్నూలు: కర్ణాటక బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కర్నూల్ జిల్లాలోని తుగ్గలి సమీపంలో కర్ణాటక ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. బస్సు వేగం సమానంగా ఉండటంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో 26 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. ఈ రోజు(శనివారం, ,నవంబర్ 29) ఉదయం బస్సు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. స్టీరింగ్ రాడ్ విరిగిపోయి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడిండి బస్సు. మంత్రాలయం నుండి బెంగళూరుకు వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.అంతకుముందు కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం కోటేకల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం -
కర్ణాటక సీఎం చేంజ్? రేపు ఢిల్లీకి డీకే, సిద్ధరామయ్య
-
సుదర్శన చక్రతో శత్రు నాశనం
ఉడుపి/యశవంతపుర: దేశ రక్షణ పట్ల ప్రభుత్వ సంకల్పాన్ని ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రజలంతా ప్రత్యక్షంగా చూశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఎర్రకోట నుంచి శ్రీకృష్ణుడి సందేశాన్ని వినిపించామని తెలిపారు. శత్రువులను నాశనం చేయడానికి ‘మిషన్ సుదర్శన చక్ర’ను ప్రకటించామని గుర్తుచేశారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా కీలకమైన ప్రాంతాలు, పారిశ్రామికవాడలకు బలమైన రక్షణ కవచం ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు.ప్రధాని మోదీ శుక్రవారం కర్ణాటకలోని ఉడుపి పట్టణంలో పర్యటించారు. ఉడుపి శ్రీకృష్ణ మఠం ఆధ్వర్యంలో ‘లక్ష కంఠ గీతా పారాయణం’లో పాల్గొన్నారు. లక్ష మందికిపైగా భక్తులతో కలిసి భగవద్గీత పారాయణం చేశారు. 18 శ్లోకాలను పఠించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మన దేశంలో గతంలో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వాలు నిశ్శబ్దంగా ఉండిపోయాయని, ప్రతిదాడులు చేయడానికి సంకోచించాయని ఆక్షేపించారు. కానీ, ఇప్పటి నవ భారతదేశం ఒత్తిళ్లు, బెదిరింపులు, దాడులకు ఎంతమాత్రం లొంగబోదని తేల్చిచెప్పారు. ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం ఎంతదూరమైనా వెళ్తుందని ఉద్ఘాటించారు. దేశ భద్రతే తమకు ముఖ్యమని పేర్కొన్నారు. ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు వ్యాఖ్యానించారు. పథకాలకు భగవద్గీత బోధనలే పునాది ‘‘శాంతి, సత్యం కోసం ఎల్లప్పుడూ కృషి చేయాలని భగవద్గీత బోధిస్తోంది. అదేసమయంలో దుషు్టలు, దుర్మార్గులను అంతం చేయాలని చెబుతోంది. వసుధైక కుటుంబం అనే సూత్రాన్ని విశ్వసిస్తున్నాం. ధర్మో రక్షిత రక్షితః అని పఠిస్తున్నాం. పహల్గాంలో మన పర్యాటకులను పొట్టనపెట్టుకున్న ముష్కరులపై యుద్ధం చేశాం. వారికి తగిన గుణపాఠం నేర్పించాం. మన నిత్య జీవితంలో భగవద్గీత పాత్ర ఎంతో ఉంది. గీత బోధనలు ప్రతి తరానికీ వర్తిస్తాయి. దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం జాతీయ విధానాల రూపకల్పనలో భగవద్గీత దిశానిర్దేశం చేస్తూనే ఉంది. జనం బాగు కోసం పనిచేయాలని గీతలో శ్రీకృష్ణుడు పిలుపునిచ్చాడు. సబ్కా సాత్, సబ్కా వికాస్.. సర్వజన హితాయ నినాదాలకు భగవద్గీత శ్లోకాలే స్ఫూర్తి. ఆయుష్మాన్ భారత్, పీఎం ఆవాస్ యోజన వంటి ప్రజా సంక్షేమ పథకాలకు పునాది భగవద్గీత బోధనలే. భగవద్గీత చూపిన మార్గంలో నడుస్తూ మహిళల భద్రత, సాధికారత కోసం నారీశక్తి వందన్ అధినియం తీసుకొచ్చాం’’ అని ప్రధాని మోదీ వివరించారు. శ్రీకృష్ణుడి ఆలయంలో ప్రత్యేక పూజలు ఉడుపి పట్టణంలో ప్రధాని మోదీ తొలుత రోడ్డుషోలో పాల్గొన్నారు. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలకు అభివాదం చేశారు. తనపై చల్లిన పూలను తిరిగి జనంపై చల్లారు. అనంతరం శ్రీకృష్ణుడి ఆలయానికి చేరుకున్నారు. పర్యాయ పుత్తిగె మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ ఆధ్వర్యంలో మోదీకి అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. తర్వాత ఆలయ ఆచారం ప్రకారం కిటికీ(కనకన కిండీ) నుంచి శ్రీకృష్ణుడి మూలమూర్తిని ప్రధానమంత్రి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మోదీకి వెండి దారంతో కూడిన తులసి జపమాల, శంకు, చక్ర, గద, పద్మం ముద్రలను బహూకరించారు. మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామి ప్రధాని మోదీకి ‘భారత భాగ్య విధాత’ బిరుదునిచ్చి సన్మానించారు. కాశీ కారిడార్ తరహాలో ఉడుపి కారిడార్ను అభివృద్ధి చేయాలని మోదీని కోరారు. కనకదాసకు నివాళులు ఉడుపిలోని చరిత్రాత్మక కనక మండపాన్ని మోదీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా 14వ శతాబ్దానికి చెందిన తత్వవేత్త, కీర్తనకారుడు కనకదాసకు ఘనంగా నివాళులరి్పంచారు. ఉడుపిలో శ్రీకృష్ణుడు పశి్చమ ముఖంగా కొలువుదీరడం వెనుక కనకదాస పాత్ర ఉందని భక్తులు విశ్వసిస్తారు. మోదీ ఉడుపి ఆలయాన్ని సందర్శించడం ఇది రెండోసారి. 2008 ఏడాదిలో గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో ఈ ఆలయానికి వచ్చారు. తొమ్మిది ప్రతిజ్ఞలు వికసిత్ భారత్, నవ్య భారత్ కోసం తొమ్మిది ప్రతిజ్ఞలు చేయాలని ప్రధాని మోదీ ఉడుపి శ్రీకృష్ణుడి ఆలయం నుంచి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అవి ఏమిటంటే.. → మాతృమూర్తి పేరిట ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలి. → నదులు, చెరువులు, ఇతర జల వనరులను కాపాడుకోవాలి. జల సంరక్షణే మన ధ్యేయం కావాలి. → కనీసం ఒక నిరుపేద జీవితాన్ని మెరుగుపర్చడానికి కృషి చేయాలి. → బాధ్యత కలిగిన దేశ పౌరులుగా స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేసి, ఉపయోగించుకోవాలి. ‘వోకల్ ఫర్ లోకల్’ అనేది మన నినాదం కావాలి. ‘ఆత్మనిర్భర్ భారత్’ సాధనకు తోడ్పాటునందించాలి. -
కర్ణాటకం.. ఓవర్ టు ఢిల్లీ
సాక్షి, బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పారీ్టలో నెలకొన్న అధికార పంచాయితీ ఢిల్లీకి చేరింది. ముఖ్యమంత్రి మార్పుపై జరుగుతున్న రగడకు తెరదించేందుకు అధిష్ఠానం సిద్ధమైంది. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో శనివారం సాయంత్రం 5 గంటలకు అగ్ర నేత సోనియాగాంధీ నేతృత్వంలో హైక మాండ్ భేటీ కానుంది. ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోకసభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాం«దీ, పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక వ్యవహారాల ఇంచార్జి రణదీప్సింగ్ సుర్జేవాలా పాల్గొననున్నారు. సీఎం పదవి నుంచి సిద్ధరామయ్యను తప్పించడం వల్ల జరిగే పరిణామాలు, తలెత్తే ఇబ్బందులు ఎలా ఉంటాయి? ఆయ నను కొనసాగిస్తే గనుక ఎదురయ్యే సమస్యలు ఏమిటనేది హైకమాండ్ చర్చించనుంది. ఈ నేపథ్యంలోనే సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లను ఆదివారం ఢిల్లీ రావాలని అధిష్ఠానం కోరింది. దీంతో కర్ణాటకలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడే సూచనలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అధిష్ఠానం తీసుకునే నిర్ణయం మేరకు, సిద్ధరామయ్య, శివకుమార్లతో మాట్లాడి, ఇద్దరినీ ఒప్పించే ప్రయత్నం చేయనున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. విదేశాల నుంచి సోనియా రాకతో... కర్ణాకటలో ఓవైపు సిద్ధు, డీకే వర్గాలు ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తుండగా... కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికే ఓసారి (గురువారం) సమావేశమై రాష్ట్ర నాయకత్వ మార్పుపై సుదీర్ఘంగా చర్చించింది. అయితే, విదేశాల్లో ఉన్న సోనియా అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయించింది. కేవలం నాయకుల సలహాలు తీసుకుని భేటీని ముగించారు. ఇక విదేశాల నుంచి తిరిగి వచి్చన సోనియా శనివారం అందుబాటులో ఉండనున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ సమావేశం కూడా జరగనుంది. ఇందులో సోనియాతో పాటు అధిష్ఠానం పెద్దలు కర్ణాటకపై చర్చించి తుది నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. అందుకే సిద్ధు, డీకేలను ఢిల్లీ రమ్మని కోరినట్లు సమాచారం. వారితో సమాలోచనలు చేసి ఆదివారం సాయంత్రంలోగా సమస్యకు పరిష్కారం చూపాలని భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు. తమ నిర్ణయాన్ని వెల్లడించి... ఇద్దరినీ సముదాయించి పారీ్టకి నష్టం కలగకుండా చూసే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. నేడు డీకే–సిద్ధు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ హైకమాండ్ పిలిస్తే తప్పకుండా ఢిల్లీకి వెళతానని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. వారు ఏమి తీర్మానిస్తే దాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తానన్నారు. అధిష్ఠానం సూచనలతో డీకేను శనివారం తన నివాసం కావేరికి బ్రేక్ఫాస్ట్కు ఆహా్వనించానన్నారు. ఇద్దరం మాట్లాడుకుని ఢిల్లీకి వెళతామని తెలిపారు. కాగా, నాయకత్వ మార్పుపై సిద్ధు, డీకే కూర్చుని మాట్లాడుకుని ఒక నిర్ధారణకు వచ్చాకనే ఢిల్లీకి రావాలని అధిష్ఠానం పెద్దలు సూచించినట్లు సమాచారం. ఈ మేరకే సిద్ధు బ్రేక్ఫాస్ట్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. జోరందుకున్న విందు రాజకీయాలు అధికార మారి్పడిపై సీఎం, డిప్యూటీ సీఎం వర్గాలు ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఎప్పటికప్పుడు నేతలతో రహస్య చర్చలు, సమావేశాలు నిర్వహిస్తూ తమ వర్గాన్ని బలపరుచుకునే ప్రయత్నాలు సాగిస్తున్నాయి. దీంతో బ్రేక్ఫాస్ట్, డిన్నర్ పాలిటిక్స్ జోరందుకున్నాయి. శుక్రవారం మంత్రి కేహెచ్ మునియప్ప నివాసంలో అహింద నాయకుల సమావేశం జరిగింది. ఇందులో ఏఐసీసీ కార్యదర్శి మోహన్ కూడా పాల్గొన్నారు. ఈ అల్పాహార విందులో హైకమాండ్ వద్ద పరపతి ఉన్న ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ కూడా పాల్గొనడం విశేషం. వీరితోపాటు మాజీ మంత్రి ఆంజనేయ, మాజీ ఎంపీ చంద్రప్ప, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణయ్య తదితరులు గంటకుపైగా సమావేశమై ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించుకున్నారు. ఏ ఒక్కరి వల్లనో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని, అనేక సామాజికవర్గాలు, సంఘాలు, కాంగ్రేసేతర సంస్థలు శ్రమించాయని బీకే హరిప్రసాద్ స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలను అధిష్ఠానం చాలా సీరియస్గా తీసుకుందని, ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఒక మంచి నిర్ణయాన్ని వెల్లడిస్తుందన్నారు. మునియప్ప మాట్లాడుతూ అధికార మార్పిడి వివాదాన్ని హైకమాండ్ వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. అవసరమైతే తాను కూడా వెళ్లి హైకమాండ్తో మాట్లాడుతానని వెల్లడించారు. డీకేకు మద్దతుగా ఒక్కలిగలు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను పట్టనాయకనహళ్లికి చెందిన నంజావధూత స్వామిజీ సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార మారి్పడిపై మాట తప్పితే పరమాత్మ అభినందించడని నంజావధూత పదేపదే మాట్లాడుతూ డీకేకు మద్దతుగా నిలుస్తుండడం గమనార్హం. కాగా, డీకే శివకుమార్ సోదరుడు, మాజీ ఎంపీ డీకే సురేశ్ ఢిల్లీ చేరుకుని అధిష్ఠానం పెద్దలతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి డీకేను సీఎం చేయాలనే తమ డిమాండ్ వినిపించారు. సీఎంకు మద్దతుగా కురబలు డీకే వర్గం ప్రయత్నాలకు ప్రతిగా సిద్ధు వర్గం మంత్రులు, ఎమ్మెల్యేలు గళం వినిపిస్తున్నారు. ఐదేళ్లు సిద్ధునే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రులు సంతోష్ లాడ్, జమీర్ అహ్మద్ఖాన్, హెచ్సీ మహదేవప్ప, రామలింగారెడ్డి తదితరులు, పలువురు ఎమ్మెల్యేలు వీరిలో ఉన్నారు. సిద్ధు సొంత సామాజిక వర్గం కురుబ వర్గానికి చెందిన స్వామిజీలు, నేతలు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. బలప్రదర్శనకు కూడా కురుబలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒకే వేదికపై సీఎం, డిప్యూటీ సీఎం.. కానీ, మాటల్లేవ్ ఓవైపు కుర్చీలాట కొనసాగుతున్నా.. సిద్ధు, డీకే శుక్రవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ బెంగళూరు ప్యాలెస్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒకే వేదికను పంచుకున్నారు. పక్కపక్కనే కూర్చొన్నప్పటికీ ఎవరికి వారు యమునా తీరు చందంగా మాట్లాడుకోలేదు. ఇద్దరు నేతలు చూసీ చూడనట్లుగా ప్రవర్తించడం గమనార్హం. డీకే కుర్చీలో కూర్చొనే సమయంలో సిద్ధు వైపు చూసేందుకు ప్రయత్నించలేదు. ఇదంతా గమనించిన సిద్ధు ఆహ్వాన పత్రం చదువుకుంటూ ఉండిపోయారు. నమ్మకాన్ని మించిన గుణం లేదు అన్ని వర్గాలు నాకు మద్దతు ఇస్తున్నాయి నా కులం కాంగ్రెస్ పార్టీ..: డీకే ‘ఇచ్చిన మాట’విషయమై గురువారం సిద్ధు, డీకే మధ్య ట్వీట్ల వార్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక శుక్రవారం ఓ బహిరంగ సమావేశంలో డీకే చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయంగా మారాయి. ‘‘నిమ్మ కంటే పులుపైన వస్తువు ఇంకోటి లేదు. శంభు అంటే పరమేశ్వరుడు. ఆయన కంటే దేవుడు లేడు. నమ్మకం కంటే ఇంకో గుణం లేదు’’అంటూ సర్వజ్ఞ వచనాలను ఉటంకిస్తూ హైకమాండ్పై తన నమ్మకాన్ని, విశ్వాసం గురించి పరోక్షంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ముందు మీడియాతో ఆయన మాట్లాడుతూ ‘‘ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నాకు దేవాలయం. ఢిల్లీలో మాకు ఎన్నో ముఖ్యమైన పనులుంటాయి. అందుకే అక్కడికి వెళ్తుంటాం. నాకు ఎలాంటి సామాజికవర్గాల వ్యాఖ్యానాలు, మద్దతు అవసరం లేదు. నా కులం కాంగ్రెస్ పార్టీ. అన్ని వర్గాలు నాకు మద్దతుగా ఉన్నాయి. ఏ ఒక్క వర్గానికో నేను పరిమితం కాదు’’అని పేర్కొన్నారు. 28బీఎన్జీ70: బెంగళూరు ప్యాలెస్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ -
మెత్తబడ్డ డీకే శివకుమార్!.. కీలక వ్యాఖ్యలు
కర్ణాటక పవర్ పాలిటిక్స్లో పూటకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. ఐదేళ్లు తానే సీఎంనంటూ సిద్ధరామయ్య.. అధిష్టానం తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటూ ఇటు డీకే శివకుమార్లు పోటాపోటీగా ప్రచారాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఈ పంచాయితీ ఢిల్లీకి రేపోమాపో షిఫ్ట్ అవుతుందనే ప్రచారం ఇవాళ జోరుకుంది. అయితే ఈలోపే..కర్ణాటక రాజకీయం మరో మలుపు తిరిగింది. పదవీ త్యాగం నేపథ్యంతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 2004లో అధికారాన్ని త్యాగం చేశారు. తనకు బదులుగా మన్మోహన్ సింగ్ను ప్రధానిని చేశారు’’ అని అన్నారాయన.కర్ణాటకలో అధికార పంపిణీపై ఊహాగానాల వేళ ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ వ్యాఖ్యల ఆంతర్యం ఏంటనే విశ్లేషణ అక్కడ నడుస్తోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ రంగంలోకి దిగి కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభం మరింత ముదరకుండా మంతనాలు జరుపుతున్నారు. సీఎం మార్పు నిర్ణయాన్ని ఇక సోనియా గాంధీకే వదిలేసినట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంతో అధిష్టానంతో చర్చించేందుకు రెండ్రోజుల్లో ఢిల్లీకి సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు వెళ్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈలోపు రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ కర్ణాటక పరిణామాలపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘హైకమాండ్ పిలిస్తే కచ్చితంగా ఢిల్లీ వెళ్తా. అధిష్టాన నిర్ణయమే నాకు ఫైనల్. ఏ విషయంలోనూ నాకు తొందరలేదు’’ అని అన్నారు. మరోవైపు.. డీకే శివకుమార్తో ఉన్న ఫొటోను సిద్ధరామయ్య షేర్ చేయడంతో ఈ కథ సుఖాంతం అయ్యిందా? అనే చర్చ జోరందుకుంది.ಶಕ್ತಿ ಮತ್ತು ಗೃಹಲಕ್ಷ್ಮಿ ಯೋಜನೆ ಜಾರಿಯಾದ ಮೇಲೆ ತಲಾ ಆದಾಯದಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ದೇಶದಲ್ಲಿಯೇ ಮೊದಲ ಸ್ಥಾನದಲ್ಲಿದೆ. ಐಸಿಡಿಎಸ್ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಪರಿಣಾಮಕಾರಿಯಾಗಿ ಜಾರಿ ಮಾಡಿರುವ ರಾಜ್ಯಗಳಲ್ಲಿ ದೇಶದಲ್ಲಿಯೇ ಕರ್ನಾಟಕ ಮೊದಲನೇ ಸ್ಥಾನದಲ್ಲಿದೆ. ಶಕ್ತಿ ಯೋಜನೆ ಜಾರಿಯಾದ ಮೇಲೆ ಉದ್ಯೋಗಕ್ಕೆ ಹೋಗುವ ಮಹಿಳೆಯರ ಪಾಲು ಶೇ 23% ಇದ್ದರೆ, ಗ್ರಾಮೀಣ… pic.twitter.com/Hq9iz8BvvG— Siddaramaiah (@siddaramaiah) November 28, 2025 -
సీఎం చేంజ్! ఢిల్లీలో అధిష్ఠానం పెద్దల కీలక సమావేశం
-
ముఖ్యమంత్రి పీఠంపై డీకే. శివకుమార్ కీలక వ్యాఖ్యలు
-
లక్ష గళ గీతా పారాయణం : ప్రధానికి ఘన స్వాగతం
ఉడుపి, సాక్షి, : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం కర్ణాటకలోని ఉడిపిలో లక్ష కంఠ గీత పారాయణ కార్యక్రమానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉడుపిలోని శ్రీ కృష్ణ మఠాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.అంతకుముందు ప్రధాని మోదీ రోడ్షో నిర్వహించారు.కృష్ణుడి గర్భగుడి ముందు ఉన్న సువర్ణ తీర్థ మంటపాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా పవిత్ర కనక కవచం (బంగారు కవచం )ను అందించారు. ఇది పవిత్ర కనకదాసు శ్రీ కృష్ణుడి దర్శనం పొందిన పవిత్ర ప్రదేశంగా భావిస్తారు. ఉడిపిలోని శ్రీకృష్ణ మఠంలో, విద్యార్థులు, సన్యాసులు, పండితులు, వివిధ రంగాలకు చెందిన పౌరులు సహా దాదాపు 1,00,000 మంది పాల్గొనే ఈ పవిత్ర భగవద్గీత లక్ష కంఠ పారాయణ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.ఉడుపిలోని శ్రీ కృష్ణ మఠాన్ని 800 సంవత్సరాల క్రితం ద్వైత వేదాంత తత్వశాస్త్ర స్థాపకుడు శ్రీ మధ్వాచార్యులు స్థాపించారు. త్రివర్ణ పతాకాలతో ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరైనారు.ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ గోవాకు వెళతారు. అక్కడ శ్రీ సంస్థాన్ గోకర్ణ్ పార్తగలి జీవోత్తం మఠం 550వ వార్షికోత్సవాల్లో పాల్గొంటారు. ఈ మధ్యాహ్నం దక్షిణ గోవాలోని పత్రాగౌలిలో 77 అడుగుల రాముడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రామాయణ థీమ్ పార్క్ను కూడా ఆయన ప్రారంభిస్తారు. అలాగే స్మారక పోస్టల్ స్టాంపు , నాణెంను విడుదల చేయనున్నారు. #WATCH | Udupi, Karnataka | Prime Minister Narendra Modi visits Sri Krishna Matha in Udupi and participates in the Laksha Kantha Gita Parayana programme. The Prime Minister also inaugurated the Suvarna Teertha Mantapa, located in front of the Krishna sanctum, and dedicated the… pic.twitter.com/vEzbeasjUS— ANI (@ANI) November 28, 2025 -
క్లైమాక్స్ కు కుర్చీ వార్!
-
క్లైమాక్స్కు చేరిన కర్ణాటకం!
సాక్షి, బెంగళూరు/శివాజీనగర: కర్ణాటక రాజకీయం క్లైమాక్స్కు చేరింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ అనుకూల వర్గాల వరుస భేటీలు, రహస్య మంతనాలు, మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల నేపథ్యంలో అధిష్టానం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. రాహుల్ గాంధీ జోక్యంతో కర్ణాటక రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తిరుగుబాటు ధోరణిపై రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు పార్టీలోని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.ఆయా అంశాలు ముఖ్యమంత్రి పీఠంపై కొనసాగడానికి సంబంధించి సిద్ధరామయ్యకు ఇబ్బందికరంగా పరిణమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వెరసి ఈ పరిణామాలు ముఖ్యమంత్రి రేసులో డీకే శివకుమార్కు అనుకూలంగా మారుతున్నట్లు కూడా పరిశీలకులు భావిస్తున్నారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం సిద్ధరామయ్యపై రాహుల్ అసహనానికి కారణాలను విశ్లేషిస్తే... అధిష్టానం ఎవరనే చర్చకు తావిచ్చిన సీఎం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమై మీ సమస్యలు, విజ్ఞప్తులు ఏమైనా ఉంటే ఆయనకు తెలియజేయాలని సిద్ధరామయ్యకు రాహుల్ గాంధీ గడచిన వారాంతంలో సూచించారు. అయితే ఖర్గేను సిద్ధరామయ్య కలుసుకున్నప్పటికీ.. తాను రాహుల్తో మాత్రమే చర్చిస్తానని, నేరుగా అధిష్టానంతో తేల్చుకుంటానని చెప్పినట్లు సమాచారం. బహుషా ఈ కారణంతోనే మీడియాతో ఖర్గే మాట్లాడుతూ అధికార మారి్పడి విషయం పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని వ్యాఖ్యలు చేసి ఉంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. స్వయంగా ఏఐసీసీ అధ్యక్షుడే ‘పార్టీ హైకమాండ్’ ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరనే ప్రశ్న ఉత్పన్నం అయ్యింది. ఖర్గే ఈ ‘అసహాయ వ్యాఖ్యలు’ చర్చనీయాంశమయ్యాయి. దీనంతటికీ సిద్ధరామయ్య తిరుగుబాటు ధోరణే కారణమని రాహుల్ భావిస్తున్నారు. ఇక ప్రభుత్వ వ్యవహారాల్లో సీఎం కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య జోక్యం చేసుకుంటున్నట్లు నివేదికల అందడం రాహుల్ అసహనానికి మరొక కారణం. దేవరాజు అరస్ రికార్డును అధిగమించిన తర్వాత రాజీనామా? మరోవైపు ముఖ్యమంత్రి స్థానం వదులుకునేందుకు సిద్ధరామయ్య కూడా మానసికంగా సిద్ధంగా ఉన్నారని ఆయన వర్గానికి చెందిన కొందరు మంత్రులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఒత్తిడి ఎక్కువయితే ఫిబ్రవరి, మార్చి మొదటి వారంలో వచ్చే బడ్జెట్ను ప్రవేశపెట్టి తప్పుకునే అవకాశం ఉందని మాట్లాడుకుంటున్నారు. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన దేవరాజు అరస్ రికార్డును సిద్ధరామయ్య డిసెంబర్లో అధిగమిస్తారు. దీంతో అప్పటివరకు ముఖ్యమంత్రిగా పని చేసి అనంతరం తన పదవికి రాజీనామా చేసే అవకాశం కూడా ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హైకమాండ్ అంటే అదొక బృందం: ఖర్గే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితోపాటు మరో ముగ్గురు నలుగురు కీలక నాయకులను ఢిల్లీకి పిలిపించుకుని చర్చించి అన్నింటికి పరిష్కారం చూపుతామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం బెంగళూరులో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అంటే ఒకే ఒక్కరు కాదని, అదొక బృందమని, పార్టీ పెద్దలంతా కలసికట్టుగా కూర్చొని మాట్లాడుకుని రాష్ట్ర సమస్యకు పరిష్కారాన్ని తీసుకొస్తామన్నారు. సోనియాగాంధీ శుక్రవారం విదేశాల నుంచి వచ్చాక ఈ సమస్య పరిష్కారం ఒక కొలిక్కి వచ్చే వీలుంది.సీఎం, డిప్యూటీ సీఎం ‘ట్వీట్ల’ యుద్ధం!కర్ణాటక పరిణామాలు తాజాగా ‘ట్వీట్ల’ రాజకీయానికి దారితీశాయి. డిప్యూటీ సీఎం చేసినట్లు చెబుతున్న ఒక ట్వీట్కు కౌంటర్గా అన్నట్లు సీఎం మరో ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే ప్రపంచంలో పెద్ద శక్తి’ (వర్డ్ పవర్ ఈజ్ వరల్డ్ పవర్) అని డీకే శివకుమార్ ‘ట్వీట్’ చేశారు. రెండున్నరేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన మాటను డీకే ‘ఈ ట్వీట్ ద్వారా’ గుర్తు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఆ ట్వీట్ తాను చేయలేదని, అదొక నకిలీ పోస్టు అని డీకే శివకుమార్ కొట్టిపారేశారు. కాగా ‘ప్రజల కోసం మంచి ప్రపంచం నిరి్మంచలేనప్పుడు ఆ మాటకు శక్తి లేనట్లే’ అని అర్థం వచ్చేలా సీఎం ట్వీట్ చేశారు. కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పు ఐదేళ్ల పరిపూర్ణ బాధ్యత అని పేర్కొంటూ ప్రభుత్వ చేపట్టిన పలు పథకాలను వివరించారు. కర్ణాటక అనేది ఒక నినాదం కాదని, అది మాకు ఒక ప్రపంచమని ట్వీట్ చేశారు. -
డీకే శివకుమార్కు సిద్ధరామయ్య డైరెక్ట్ కౌంటర్
కర్ణాటకలో నాయకత్వ మార్పు ఎపిసోడ్ రసవత్తరంగా తయారైంది. డీకే, సిద్ధరామయ్య మధ్య నేరుగా ‘మాట’ల యుద్ధం మొదలైంది. డీకే శివకుమార్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేలా సీఎం సిద్దరామయ్య చేసిన ట్వీట్ పరిస్థితి తీవ్రతను అద్దం పడుతోంది. సీఎం మార్పు ఊహాగానాల వేళ అగ్రనేతల పోరు తారస్థాయికి చేరింది. ఇంతకాలం గప్చుప్గా ఉంటూ తమ వర్గీయులను ముందుంచిన సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లు నేరుగా రంగంలోకి దిగారు. ఒకవైపు మీడియా మైకుల ముందు మాటలు.. ఇంకోవైపు సోషల్ మీడియా పోస్ట్లతో కర్ణాటక పాలిటిక్స్ను హీటెక్కిస్తున్నారు. ‘‘కన్నడ ప్రజలు మాకిచ్చిన తీర్పు కేవలం ఒక క్షణం కోసం కాదు.. అది ఐదేళ్ల పూర్తి బాధ్యత. నాతో సహా కాంగ్రెస్ పార్టీ మా ప్రజలకు ఇచ్చిన మాటలను చేతల్లో చేసి చూపిస్తున్నాం. కన్నడ ప్రజలకు మేం ఇచ్చిన ‘మాట’ కేవలం ఒక నినాదం కాదు.. అదే మాకు ‘ప్రపంచం’ అంటూ.. సీఎం సిద్ధరామయ్య ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. A Word is not power unless it betters the World for the people.Proud to declare that the Shakti scheme has delivered over 600 crore free trips to the women of our state. From the very first month of forming the government, we transformed our guarantees into action; not in… pic.twitter.com/lke1J7MnbD— Siddaramaiah (@siddaramaiah) November 27, 2025మాట (Word) నిలబెట్టుకోవడం కంటే గొప్ప విషయం ప్రపంచంలో మరోకటి లేదు అనే అర్థం వచ్చేలా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గురువారం ఉదయం ఎక్స్లో ఓ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. సిద్ధరామయ్య ట్వీట్ డీకే శివకుమార్కు కౌంటర్లా ఉండడం గమనార్హం. ಕೊಟ್ಟ ಮಾತು ಉಳಿಸಿಕೊಳ್ಳುವುದೇ ವಿಶ್ವದಲ್ಲಿರುವ ದೊಡ್ಡ ಶಕ್ತಿ! pic.twitter.com/klregNRUtv— DK Shivakumar (@DKShivakumar) November 27, 2025కర్ణాటకలో నవంబర్ 20వ తేదీతో కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల అధికారం పూర్తి చేసుకుంది. అయితే, అధికారం చేపట్టే సమయంలో రెండున్నరేళ్ల తర్వాత సీఎం మార్పునకు సిద్ధరామయ్య, డీకే మధ్య ఒప్పందం కుదిరిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మధ్యలో ఈ ప్రచారం తెరపైకి వచ్చినా.. అలాంటిదేం లేదంటూ ఇద్దరూ ఖండించారు కూడా. తీరా టైం రావడంతో ఇప్పుడు సీటును నిలబెట్టుకునేందుకు సిద్ధరామయ్య, తాను సీఎం పీఠం మీద కూర్చునేందుకు డీకే శివకుమార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ పరిణామం ప్రభుత్వం కుప్పకూల్చే అవకాశం ఉండడంతో హైకమాండ్ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. -
సిద్ధూ, డీకేలతో మాట్లాడతాం: ఖర్గే
సాక్షి బెంగళూరు: కర్ణాటక సీఎం వివాదంపై ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్ఠానం స్పందించింది. త్వరలోనే ఈ ప్రతిష్ఠంభనకు ముగింపు పలకబోతున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. త్వరలోనే పార్టీ అగ్రనేతలతో కలిసి సమావేశం నిర్వహిస్తామని ఆ మీటింగ్లో ఈ వివాదానికి ముగింపు పలుకుతామని ఖర్గే పేర్కొన్నారు.కర్ణాటకలో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యమంత్రి పదవి కాపాడడం కోసం సిద్దరామయ్య, ఎలాగైనా సీఎం పదవి చేపట్టాలని డీకే శివకూమార్ ఇద్దరు నేతలు భీష్మించుకు కూర్చొన్నారు. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ ఇటీవల వ్యాఖ్యానించడంతో కేంద్రం ఆయనను సీఎం చేస్తానని హామి ఇచ్చిందని దానికోసమే అలా మాట్లాడారని అంతా అనుకున్నారు. ఈ వరుస ఘటనలతో ఆ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. అయితే తాజాగా ఆ రాష్ట్ర వ్యవహారంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. ఆయన మాట్లాడుతూ "త్వరలోనే కర్ణాటకలో జరుగుతున్న వివాదానికి ముగింపు పలుకుతాం. ఈ విషయమై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇతర నాయకులతో కలిసి సమావేశం నిర్వహిస్తాం. ఆ మీటింగ్ కు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీ.కే శివకుమార్ను కూడా పిలిచి వారితో చర్చిస్తాం" అని ఖర్గే తెలిపారు.ఇటీవల ఒక కార్యక్రమంలో శివకుమార్ మాట్లాడుతూ మాటకున్న శక్తి ప్రపంచంలోనే అత్యంత గొప్పదని, వాగ్దానం నిలబెట్టుకోవడం అనేది అతిపెద్ద చర్య అని అన్నారు. దీంతో సీఎం పదవినుద్దేశించే తాను మాట్లాడారని చర్చ జరిగింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ‘అంతిమంగా నిర్ణయం తీసుకునేది హైకమాండ్ఈ గందరగోళానికి పూర్తి ముగింపు పలకడానికి, హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి అని అన్నారుపవర్ షేరింగ్ ఏంటంటే..2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీ.కే శివకుమార్ చెరో రెండున్నరేళ్లు సీఎంగా ఉండనున్నట్లు అధిష్ఠానం నిర్ణయించిందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 20 తారీఖుతో రెండున్నరేళ్ల కాలం ముగిసింది. దీంతో సీఎం మార్పు వ్యవహారం మళ్లీ తెరమీదకొచ్చింది. -
డీకేకి చాన్స్ ఇస్తే.. సిద్ధరామయ్య ప్లాన్ ఏంటి?
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అటు సీఎం సిద్ధరామయ్య, ఇటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టడంతో కర్ణాటక రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఒక వేళ కాంగ్రెస్ అధిష్టానం డీకేను ప్రమోట్ చేయాలనుకుంటే సిద్ధరామయ్య ‘ ప్లాన్’ ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది.సిద్ధరామయ్యే పూర్తికాలం సీఎంగా ఉంటారని డీకే శివకుమార్,ఐదేళ్లు తానే సీఎంనని సిద్ధరామయ్య ప్రకటించినప్పటికీ ఇది అంత తేలిగ్గా పరిష్కారమవుతుందా అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జోక్యం తరువాత అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను, సిద్ధరామయ్య కట్టుబడి ఉండాలని ప్రకటించి నప్పటికీ ఈ పొలిటికల్ డ్రామాకు ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు.ఒక వేళ ఉప ముఖ్యమంత్రి డీకేను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే, సిద్ధరామయ్య శిబిరం ఆయన్ను పదవిలో కొనసాగించాలని ఒత్తిడి తీసుకురావడానికి సకల అస్త్రాలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బహిరంగంగా డీకే వైపే మొగ్గుచూపుతున్నారని సిద్ధరామయ్య మద్దతుదారులు భావిస్తున్నారు. ఇదే జరిగితే నిరసనకు సిద్ధంగా ఉన్నారు.పార్టీ ఇంకా కొత్త ముఖ్యమంత్రి కోసం పట్టుబడుతుంటే, వారికి ప్రత్యామ్నాయ జాబితాను అందజేయ నున్నారట. అందులో ఒకటి సిద్ధరామయ్య మద్దతుదారుడు, దళిత నాయకుడు హోంమంత్రి జి. పరమేశ్వర కావచ్చని అంచనా. ఈ సందర్భంగా తానెప్పుడూ ముఖ్యమంత్రి రేసులో ఉన్నానన్న వ్యాఖ్యలు గమనించ దగ్గవి. దీనిపై సిద్ధరామయ్య విధేయుడు, పిడబ్ల్యుడి మంత్రి సతీష్ జార్కిహోలి నేతృత్వంలో బుధవారం జరిగిన సమావేశంలో చర్చకు వచ్చినట్టు సమాచారం. మరోవైపు ఖర్గే, గాంధీలో డిసెంబరు 1 నాటికి దీనిపై ఒక నిర్ణయం ప్రకటించవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.ఎవరి పంతం నెగ్గుతుంది?మరోవైపు సిద్ధరామయ్య తన అధికారాన్ని మరింత బలపర్చుకునేందుంకు తన మంత్రివ ర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని కూడా యోచిస్తున్నారట. ఆయన ఎమ్మెల్యేల మద్దతు ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉంది. ఈ నేపథ్యంలోసిద్ధరామయ్య గెలుస్తారా లేదా డికె శివకుమార్ తను కోరుకున్నది సాధిస్తారా? 2028లో తదుపరి ఎన్నికల వరకూ దీన్ని సర్దు బాటు చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.కాగా 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించినప్పటి నుండి అత్యున్నత పదవి కోసం సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత చెరో రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాలని అప్పట్లో కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పందం చేసింది. ప్రస్తుతం, ఈ సమయం అయిపోవడంతో డీకే వర్గం నాయకత్వ మార్పు గురించి కాంగ్రెస్ అధిష్టానంపై పట్టు పెంచుతోంది. ఈ నేపథ్యంలో అధిష్టానం ఈ ఉత్కంఠకు ఎలా తెరదించుతుందో వేచి చూడాలి. -
కర్ణాటక: డిసెంబర్ ఒకటి లోగా కొత్త సీఎం?
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవి కోసం అటు సిద్ధరామయ్య, ఇటు డీకే శివకుమార్ మధ్య నెలకొన్న వివాదం కీలక దశకు చేరింది. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ హైకమాండ్కు పరోక్ష హెచ్చరికలా మారాయి. ఒక కార్యక్రమంలో శివకుమార్ మాట్లాడుతూ మాటకున్న శక్తి ప్రపంచంలోనే అత్యంత గొప్పదని, వాగ్దానం నిలబెట్టుకోవడం అనేది అతిపెద్ద చర్య అని అన్నారు.ఈ వ్యాఖ్యలపై శివకుమార్ వర్గం తన అభిప్రాయం వెల్లడించింది. సీఎం పదవిని మార్చేందుకు గతంలో హైకమాండ్ ఇచ్చిన హామీని ఆయన గుర్తు చేశారని శివకుమార్ వర్గం చెబుతోంది. ఈ పరిణామాలు కర్ణాటక రాజకీయాల్లో అధికార మార్పు జరగనుందనే ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. శివకుమార్ శిబిరం నాయకత్వ మార్పు కోసం గట్టిగా పట్టుబడుతోంది. 2023 ఎన్నికల విజయం తరువాత సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే నాడు హైకమాండ్ రొటేషన్ సీఎం పోస్టుకు అంగీకరించిందని శివకుమార్ మద్దతుదారులు చెబుతున్నారు.అయితే సిద్ధరామయ్య బృందం ఈ వాదనను తోసిపుచ్చింది. మరోవైపు గత రెండు వారాలుగా శివకుమార్ మద్దతుదారులోని పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీ పర్యటనలు చేయడం ఈ అధికార మార్పు చర్చలను మరింత పెంచింది. ఈ వివాదంపై వస్తున్న నివేదికల ప్రకారం కాంగ్రెస్ హైకమాండ్ త్వరలోనే ఈ ప్రతిష్టంభనకు ముగింపు పలకాలని యోచిస్తోంది. డిసెంబర్ ఒకటి లోపు కర్ణాటకలో నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ అంశంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ తాను, రాహుల్, సోనియా కలిసి ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఈ సమస్యపై తుది నిర్ణయం హైకమాండ్దేనని అంగీకరించారు. ‘అంతిమంగా నిర్ణయం తీసుకునేది హైకమాండ్... ఈ గందరగోళానికి పూర్తి ముగింపు పలకడానికి, హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి’ అని ఆయన అన్నారు. మరోవైపు డీకే శివకుమార్.. ‘పార్టీకి ఇబ్బంది కలిగించడం లేదా బలహీనపరచడం తనకు ఇష్టం లేదని అన్నారు. అయితే డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యల దరిమిలా డిసెంబర్ ఒకటి గడువులోగా అధికార మార్పు జరగవచ్చనే ఊహాగానాలు కర్ణాటక రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: అమెరికా: వీడని తుపాకీ హింస.. -
DK.. నేను ఫోన్ చేస్తా.. రాహుల్ మెసేజ్
-
కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభం.. రంగంలోకి రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై గత ఐదురోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. డీకే శివకుమార్ పట్టువీడకపోవడంతో వ్యవహారం మరింత జఠిలంగా మారుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభంపై రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. నిన్నంతా కాంగ్రెస్ హైకమాండ్ కర్ణాటక రాజకీయంపైనే వరుస భేటీలు నిర్వహించిందని జాతీయ మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి. అందునా.. కర్ణాటకకు చెందిన పలువురు మంత్రులు, సీనియర్ నేతలతో రాహుల్ స్వయంగా చర్చలు జరిపినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే ఆయన నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడింది అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.మరోవైపు ఢిల్లీకి చేరుకున్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే.. కర్ణాటక కాంగ్రెస్లోని ఇరు వర్గాల వాదనలను, క్షేత్రస్థాయిలో పరిస్థితులను రాహుల్కు వివరించారు. దీంతో.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ను ఢిల్లీకి పిలిచే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో ఈ పంచాయితీకి తెర పడే అవకాశం కనిపిస్తోంది. -
‘మీ ఇల్లు బంగారం గాను..’
గజ దొంగ సినిమాలో గోల్డ్ మ్యాన్ను ఉద్దేశించి ‘మీ ఇల్లు బంగారం గాను..’ అంటూ ఐటెం గర్ల్ ఆడిపాడుతుంది. పైన ఫొటో చూసి అదేదో నగల షాపు దుకాణమో లేదంటే నగల ఎగ్జిబిషన్ అనుకుంటే పొరపడినట్లే..!ఈ కనిపించేది ఓ ప్రభుత్వ అధికారి బంగ్లా. ఇలాంటి బంగ్లాలు ఇలాంటివి ఆయనకు నాలుగైదు ఉన్నాయట. అలాంటి పది మంది అధికారుల ఇళ్లలో తనిఖీలు జరిపితే.. భారీ ఎత్తున బంగారు ఆభరణాలు, డబ్బు బయటపడ్డాయి..మంగళవారం కర్ణాటక యాంటీ కరప్షన్ ఏజెన్సీ లోకాయుక్త జరిపిన తనిఖీల్లో విస్తుపోయే ఈ దృశ్యాలు కనిపించాయి. లోకాయుక్త అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే అనుమానంతో రంగంలోకి దిగారు.బెంగళూరు, మైసూరు, మాండ్య, బీదర్, ధారవాడ, హవేరి, శివమొగ్గ, దావణగెరెలో ఈ తనిఖీలు జరిగాయి. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (PWD) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ D.M. గిరీష్, మాండ్య టౌన్ ప్లానింగ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ C. పుట్టస్వామి, బీదర్ అప్పర్ కృష్ణ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ ప్రేమ్ సింగ్, మైసూరు హూటగల్లి మునిసిపాలిటీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ C. రామస్వామి, ధారవాడ కర్ణాటక యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సుభాష్ చంద్ర, హవేరి జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేకప్ప, బెంగళూరు ఎలక్ట్రానిక్స్ సిటీ RTO ఆఫీస్ సూపరింటెండెంట్ P. కుమారస్వామి, శివమొగ్గ SIMS మెడికల్ కాలేజ్ FDA నివాసాలు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు జరిగాయి. కోట్ల విలువైన ఆస్తి పత్రాలు.. పెద్ద మొత్తంలో నగదు.. బంగారు ఆభరణాలు.. విలాసవంతమైన బంగ్లాలు ఉన్నట్లు తేలింది. అయితే తనిఖీలు పూర్తయ్యాకే పూర్తి వివరాలు తెలియజేస్తామని అధికారులు ప్రకటించారు. -
సిద్ధరామయ్యను తప్పించాల్సి వస్తే..
పవర్ షేరింగ్ ఫార్ములాపై రకరకాల ఊహాగానాలు.. రోజుకో కొత్త ప్రచారం నడుమ కర్ణాటక రాజకీయం వేడెక్కుతోంది. అయితే.. గ్రూప్ పాలిటిక్స్ తారాస్థాయికి చేరుకుంటున్న వేళ కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది. నాయకత్వ మార్పు జరిగితే పార్టీకి నష్టమా? లాభమా? అని తీవ్రంగానే పరిశీలిస్తున్నట్లు తాజా సమాచారం. ఈ క్రమంలో మూడో అభ్యర్థి అంశంపైనా ఓ స్పష్టత వచ్చింది.కర్ణాటక సీఎంను ఎట్టి పరిస్థితుల్లో మార్చే ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్టానం లేదు. అయితే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఒత్తిడి మేరకు లాభనష్టాలను బేరీజు వేసుకుంటోంది. అంతిమ నిర్ణయం అగ్రనేతల చేతుల్లోనే ఉండడంతో అది అంత ఈజీ కాదని ఇప్పటికే ఏఐసీసీ వర్గాలు ఓ స్పష్టత వచ్చేశాయి. అయితే ఒకవేళ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను గనుక తప్పిస్తే ఆ అవకాశం డీకే శివకుమార్నే వరించనుందట!. ఈ పంచాయితీలోకి మరో సామాజిక వర్గం, మూడో అభ్యర్థికి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండబోదని పార్టీ వర్గాల లీకులతో ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది.మూడో అభ్యర్థి అవకాశాలు ఇప్పటికిప్పుడు అస్సలు కనిపించడం లేదని.. ప్రస్తుతానికైతే ఈ ఇద్దరు నేతల మధ్యే పోటీ నెలకొందని కర్ణాటక కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సిద్ధరామయ్యకు మాస్ లీడర్గా అన్ని వర్గాల నుంచి ఆదరణ ఉందని ఆయన వర్గీయులు వాదిస్తున్నాయి. అదే సమయంలో.. డీకే శివకుమార్ బలాలను కూడా ఆయన మద్ధతుదారులు ఢిల్లీ పెద్దలకు నివేదించారు. ఎలక్షన్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న డీకేశి నేతృత్వంలో వచ్చే ఎన్నికలకు వెళ్లడం పార్టీకి కలిసొస్తుందని వాళ్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇద్దరి సామర్థ్యాలను అధిష్టానం సీరియస్గానే పరిశీలించాలనే భావిస్తోంది. తాజాగా శివకుమార్ వర్గంలో ఎమ్మెల్యేల సంఖ్య కాస్త పెరిగింది. వాళ్లలో కొందరు ఇవాళ ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి తమ డిమాండ్ వినిపించారు. ఈ పరిణామంతో సిద్ధూ వర్గం అప్రమత్తమైంది. అయితే.. ఇది ఇక్కడ(కర్ణాటక) చర్చించే విషయం కాదని.. దానికంటూ ఓ సమయం, సందర్భం ఉంటుందని.. పబ్లిక్గా ఈ అంశం గురించి మాట్లాడొద్దని ఇప్పటికే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కేడర్కు స్పష్టం చేశారు. అయినా కూడా పలువురు నేతలు మైక్ ముందుకు వచ్చి నాయకత్వ మార్పుపై తమ అభిప్రాయాలు చెబుతున్నారు. దీంతో సీఎం చైర్ హైడ్రామా ఇంకొన్నాళ్లు కొనసాగే అవకాశం ఉంది. -
నగరాలకు ‘కే100’ పాఠం!
సాక్షి బెంగళూరు: హైదరాబాద్, ముంబై, చైన్నై, కోల్కతా...దేశంలోని ఈ మెట్రోపాలిటన్ నగరాలన్నింటిలో ఉన్న సాధారణ అంశం ఏమిటి? మురికి కూపాలుగా మారిన నాలలు!. కర్ణాటక రాజధాని బెంగళూరు కూడా దీనికి మినహాయింపేమీ కాదు కానీ.. అక్కడో అద్భుతం జరిగింది. మురికి నాలా కాస్తా సుందర ఉద్యావనంగా మారింది. మురికి కంపు, చెత్తా చెదారాల స్థానంలో పచ్చటి గడ్డి.. పూల మొక్కలు.. దర్శనమిస్తున్నాయి. పక్షుల కిలకిల రవాలు వినిపిస్తున్నాయి. ఈ కే100 కథా కమామీషేమిటో తెలుసా?Photo Credits: Mod Foundationసిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, పబ్ కేపిటల్ ఆఫ్ ఇండియా, గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా.. బెంగళూరుకు ఉన్న అనేకానేక నామాల్లో ఇవి కొన్ని. ఎప్పుడు 1537లో కెంపేగౌడ అనే విజయనగర సామ్రాజ్యపు పాలెగాడు ఇక్కడ మట్టి కోట కట్టడంతో బెంగళూరు మహా నగర నిర్మాణం మొదలైందని అంచనా. ఆ తరువాతి కాలంలో టిప్పూ సుల్తాన్, మైసూరు మహారాజుల ఏలుబడిలో ఈ నగరం మరింత సుందరంగా తయారైంది. అయితే.. ప్రపంచంలోని అన్ని నగరాల మాదిరిగానే ఆధునిక కాలం వచ్చే సమయానికి బెంగళూరునూ అన్ని రకాల సమస్యలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలోనే కెంపేగౌడ అప్పుడెప్పుడో తాగునీటి కోసం ఏర్పాటు చేసిన గొలుసుకట్టు చెరువులు, అన్నింటినీ అసుంధానించే కాల్వలూ కబ్జాలకు గురయ్యాయి. లేదంటే మురికి కాలువలుగా మారాయి. నగరంలోని కోరమంగల లోయ ప్రాంతంలో ఉండే ఇలాంటి ఒకానొక కాలువే.. ఈ ‘‘కే100’. నగరంలోని ప్రధాన బస్టాండ్ ఒకప్పటి ధర్మాంబుధి చెరవును, కోరమంగలలోని బెళందూరు చెరువును కలుపుతూ ప్రవహించే కే100 వరద కాలువ (కన్నడలో రాజకాలువె అని పిలుస్తారు) నిన్నమొన్నటివరకూ చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు, మలమూత్రాలతో నిండిపోయి ఉండేది. జనాలు అటువైపు వెళ్లాలంటేనే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. కానీ.. బెంగళూరు నగర కార్పొరేషన్, మోడ్ అనే డిజైన సంస్థ నరేశ్ నరసింహన్ అనే నిపుణుడి పుణ్యమా అని ఇప్పుడు దాని రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. సుమారు రూ.180 కోట్ల వ్యయంతో మొత్తం పన్నెండు కిలోమీటర్ల పొడవైన కాలువ సుందరీకరణ పనులు చేపట్టి పూర్తి చేశారు.Photo Credits: Mod Foundationకాలువ వెంబడే వాక్వే...కే100 ప్రక్షాళనతో మొదలైన సుందరీకరణ పనులు మొదలయ్యాయి. వ్యర్థాలనన్నింటినీ తొలగించడమే కాకుండా.. దీంట్లోకి మురికి నీరు రాకుండా కూడా చర్యలు తీసుకున్నారు. ఒకప్పుడు ఈ కాలువ గుండా రోజూ పదమూడు కోట్ల లీటర్ల మురికినీరు ప్రవహించేది. ఇప్పుడు ఈ మోతాదును కేవలం 50 లక్షల లీటర్లకు తగ్గించారు. మురికినీటిని శుద్ధి చేసి వదులుతున్నారు. నీటి వెంబడే పచ్చదనం కోసం రకరకాల మొక్కలు, గడ్డి పొదలు ఏర్పాటు చేశారు. ప్రజలు కాసేపు హాయిగా గడిపేందుకు అక్కడక్కడ సీట్లు ఏర్పాటు చేశారు. చిన్న చిన్న వినోద కార్యక్రమాల కోసం కూడా ఏర్పాట్లు జరిగాయి. నాలాకు రెండువైపులా నివసిస్తున్న వారి భాగస్వామ్యం కూడా ఉండటంతో కే100 ఇప్పుడు స్వచ్ఛమైన నదిలా గలగలా పారుతోంది. ఇప్పుడు ఏమిటి?కే100 ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో బెంగళూరు మహానగర పాలికె (కార్పొరేషన్) ఈ మోడల్ను నగరవ్యాప్తం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. నగరంలోని మొత్తం 450 కిలోమీటర్ల పొడవైన రాజకాలువెలను కే100 తరహాలు సుందరంగా తీర్చిదిద్దే ఏర్పాట్లు చేస్తోంది. తద్వారా చిన్నపాటి వర్షానికే నగరాలు మునిగిపోకుండా కాపాడవచ్చునని అంచనా. మురికి, చెత్తా చెదారం తొలగిపోవడంతో వరద నీరు సాఫీగా ప్రయాణిస్తుంది కాబట్టి వరద ముప్పు ఉండదన్నమాట. కాలుష్యం, దోమలబెడద కూడా తగ్గుతుంది. ప్రజల ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రభుత్వ చిత్తశుద్ధి, పౌర సంఘాల చేయూతలతో ఇలాంటి అద్భుతాలు ప్రతి మహానగరంలోనూ జరిగితే ఎంత బాగుంటుందో!!! -
కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం పోరు
కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం పోరు.. అధిష్టానమే పరిష్కరిస్తుందన్న కాంగ్రెస్ అధ్యక్షుడు -
Karnataka: ముఖ్యమంత్రి మార్పు వార్తలపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య
-
సీఎం సీటు నుంచి దిగేందుకు సిద్ధం?!
నాయకత్వ మార్పుపై ఊహాగానాలు నడుస్తున్న వేళ.. కర్ణాటక రాజకీయంలో బడా ట్విస్ట్ చోటు చేసుకుంది. సీఎం మార్పు ఉండొచ్చనే సంకేతాలను బలపరిచేలా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లు తానే సీఎంగా కొనసాగుతానంటూ ఇంతకాలం పదేపదే చెబుతూ వచ్చిన ఆయన.. ఇవాళ సరికొత్తగా మాట్లాడడం కన్నడనాట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోమవారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయిస్తే.. ఐదేళ్లు సీఎంగా కొనసాగుతాను. ఒకవేళ సీఎంను మార్చి తీరాలని అధిష్టానం భావిస్తే అందుకు కట్టుబడి ఉంటాను. నేను మాత్రమే కాదు.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా దీనిని అంగీకరించాల్సి ఉంటుంది’’ అని అన్నారాయన. నవంబర్ 20వ తేదీన నుంచి కర్ణాటక రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్.. పవర్ షేరింగ్ ఫార్ములా ద్వారా సీఎం రేసులో ఉన్న సిద్దూ, డీకేశిలను చల్లార్చిందనే ప్రచారం ఒకటి ఉంది. రెండున్నరేళ్లు పూర్తి కావడంతో డీకే మద్దతుదారులు ఆయనకు సీఎంపగ్గాలు అప్పగించాలని గళం వినిపిస్తుండగా.. అనుభవాన్ని,సామాజిక వర్గాల సమీకరణలను పరిగణనలోకి తీసుకుని కొనసాగించాలంటూ సిద్ధరామయ్య మద్దతుదారులు ఢిల్లీ పెద్దల వద్దకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో.. డీకే శివకుమార్కు శిబిర ఎమ్మెల్యేల సంఖ్య పరిమితంగా ఉండడంతో ఈ మార్పునకు అధిష్టానం సుముఖంగా లేదని నిన్నటిదాకా ప్రచారం వినిపించింది. అయితే.. అనూహ్యంగా ఆయనకు మద్దతుదారుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. వాళ్లంతా మరోసారి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్ను కలవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో.. ఇటు సిద్ధరామయ్య కూడా సీఎం సీటు నుంచి దిగేందుకు సిద్ధమంటూ తాజాగా ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతా వాళ్ల చేతుల్లోనే..కర్ణాటకలో కేబినెట్ పునర్వవ్యస్థీకరణ(పీసీసీ చీఫ్ మార్పు సహా) చేపట్టాలని సిద్ధరామయ్య తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే సీఎం సీటు పంచాయితీ తేల్చిన తర్వాతే ఆ పని చేయాలంటూ డీకే శివకుమార్ పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో.. ‘‘నాలుగైదు నెలల కిందటే హైకమాండ్ నుంచి కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు తనకు గ్రీన్సిగ్నల్ లభించిందని.. అయితే రెండున్నరేళ్ల పాలన పూర్తి అయ్యేదాకా ఆగాలని భావించానని’’ సిద్ధరామయ్య ఇవాళ మీడియాకు తెలిపారు. అయితే.. పవర్ షేరింగ్ ఫార్ములా(రెండున్నరేళ్ల తర్వాత సీఎం సీటు వదులకునేందుకు సిద్ధపడ్డారా?) అనేది ఒకటి ఉందా?.. అందుకు మీరు అంగీకరించారా? అని రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు.. అంతా హైకమాండ్ చేతుల్లోనే ఉంటుంది అంటూ దాటవేత ధోరణి ప్రదర్శించారాయన. ఆయన వస్తేనే..కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను డీకే శివకుమార్తో రీప్లేస్ చేయాలంటూ కొంత కాలంగా నడుస్తున్న రాజకీయాలతో ఢిల్లీ వేడెక్కుతోంది. ఇప్పటికే డీకే శివకుమార్ వర్గీయులు హైకమాండ్తో సంప్రదింపులు జరిపారు. మరోవైపు.. శనివారం సిద్ధూ వర్గం ఎడతెరిపి లేకుండా బెంగళూరు పర్యటనకు వచ్చిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంతనాలు జరిపింది. అయితే.. అంతిమ నిర్ణయం అగ్రనేత రాహుల్ గాంధీ చేతుల్లోనే ఉందంటూ ఖర్గే వాళ్లతో తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరు పర్యటనలో ఉన్న ఖర్గే ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటన ముగించుకుని భారత్కు తిరిగి రానున్నారు. ఆయన వచ్చాకే కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభం ఓ కొలిక్కి రావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. -
కర్నాటక టూర్..పర్యాటక దివ్యధామం..!
కర్ణాటక టూర్ కన్నడ దేశంలో ఏమేమి ఉన్నాయి?విస్తారమైన అరేబియా సముద్ర తీరం ఉంది.నిశ్శబ్దంగా ధ్వనించే మెత్తటి అలలున్నాయి.సముద్రతీరాన శివుడి సిగ్నేచర్ స్టాచ్యూ ఉంది.సముద్రంలో తేలిన సెయింట్ మేరీ దీవులున్నాయి.ఉడుపి శ్రీకృష్ణుడున్నాడు... గోకర్ణ ఈశ్వరుడున్నాడు. వ్యాసుడు ప్రతిష్ఠించిన అన్నపూర్ణేశ్వరి ఉంది. ఆది శంకరుడు స్థాపించిన శారదపీఠం ఉంది. పక్షిధామం పిలికుల బయలాజికల్ పార్క్ ఉంది. ఐఆర్సీటీసీ ఒకే టూర్లో వీటన్నింటినీ చూపిస్తోంది.1వ రోజు..హైదరాబాద్ నుంచి బయలుదేరి మంగళూరులో దిగిన తర్వాత ఎయిర్΄ోర్ట్లో టూర్ నిర్వహకులు రిసీవ్ చేసుకుంటారు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ప్రయాణం ఉడుపికి సాగుతుంది. ఉడుపిలో హోటల్ గదిలో చెక్ ఇన్ అయిన తర్వాత సెయింట్ మేరీస్ ఐలాండ్స్ విహారం. సాయంత్రం శ్రీకృష్ణ ఆలయ దర్శనం తర్వాత రాత్రి భోజనం బస ఉడుపిలో.ఇది జియో టూర్ఎకో టూర్, స్పిరుచువల్ టూర్లు మనకు పరిచయమే. ఇది జియో టూర్. ప్రకృతి సహజమైన అద్భుతాలను చూశాం, చారిత్రక అద్భుతాలను చూస్తుంటాం. ఇది భౌగోళిక అద్భుతం. పర్వతం పేలిన తరవాత పెల్లుబికిన లావా సముద్రం పైకి తేలి బలపాలను వరుసగా పేర్చినట్లు అచ్చులు అచ్చులుగా ఘనీభవించడంతో ఏర్పడిన దీవులివి. వీటికి సెయింట్ మేరీస్ ఐలాండ్స్ అనే పేరు పెట్టింది వాస్కోడి గామా. మనదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన ΄ోర్చుగీసు నావికుడు. కేరళలో క΄్పాడ్ బీచ్ దగ్గర మనదేశంలో నేల మీద అడుగు పెట్టాడు. అంతకు ముందు ఈ దీవుల మీద సేదదీరాడు. అరేబియా సముంద్రలో ఉడిపి దగ్గర ఉన్న నాలుగు దీవుల సమూహం. మేరీ మాత గౌరవార్థం ఈ దీవులకు సెయింట్ మేరీస్ ఐలాండ్స్గా నామకరణం చేశాడు. స్థానికులు థోన్సేపార్ అని పిలుస్తారు.అరేబియా తీరాన ఓ సాయంత్రంఉడుపిలో శ్రీకృష్ణుడి దర్శనం ప్రధాన ఆకర్షణ. శ్రీకృష్ణుని దర్శనం తర్వాత కృష్ణుని బంగారు రథాన్ని చూడడం మర్చి΄ోవద్దు. ఉడుపి కృష్ణుని ఆలయ నిర్మాణం దానికదే ప్రత్యేకం. ఇలాంటి ఆలయం దేశంలో మరొకటి లేదు. కృష్ణుడిని దర్శించుకున్న తరువాత సాయంత్రాన్ని మాల్పే బీచ్లో ఆహ్లాదంగా గడపవచ్చు. సూర్యోదయానికి బంగాళాఖాతం, సూర్యాస్తమయానికి అరేబియా సముద్రాలు ప్రకృతి మనదేశానికి ఇచ్చిన వరాలు. ఉడుపి, మాల్పే బీచ్లోని అడ్వెంచర్ పార్క్లో ఆటలు పిల్లలకు మధురానుభూతి. భోజన ప్రియులకు ఉడుపి అనగానే రుచికరమైన ఉపాహారాలు గుర్తుకు వచ్చి నోరూరిస్తాయి. కన్నడిగుల చేతి రుచిని బీచ్లో ఉన్న స్టాల్స్లో టేస్ట్ చేయవచ్చు. 2వరోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత హోరనాడుకు ప్రయాణం. అన్నపూర్ణేశ్వరి ఆలయ దర్శనం తర్వాత శృంగేరికి ప్రయాణం. శృంగేరి ఆలయ దర్శనం తర్వాత సాయంత్రం తిరిగి ఉడుపికి ప్రయాణం. ఈ రాత్రి బస కూడా ఉడుపిలోనే.అన్నం పెట్టే తల్లిహోరనాడు అన్నపూర్ణేశ్వరి ఆలయం భద్ర నది తీరాన ఉంది. మనం తుంగ– భద్ర నదిగా పిలిచే రెండు నదుల్లో భద్ర నది అన్నమాట. హోరనాడు ప్రదేశం స్వచ్ఛంగా అచ్చమైన ప్రకృతి ఒడి. పచ్చటి పంటచేలు, మంద్రంగా ప్రవహించే భద్ర నది, ధీరగంభీరగా ఆకాశాన్ని తాకడానికే ఎదిగినట్లున్న పశ్చిమ కనుమల సౌందర్యం... వీటన్నింటినీ ఆస్వాదిస్తూ ఆధ్యాత్మికతను మది నిండా నింపుకోగలిగిన ప్రదేశం ఇది. ఆదిశక్త్యాత్మక శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆలయాన్ని అగస్త్య మహాముని ప్రతిష్ఠించాడని చెబుతారు. ఇక్కడి సస్యశ్యామలమైన పొలాలను చూసిన వ్యాసుడు సమృద్ధిగా ఆహారాన్ని అందిస్తున్న పంటలకు ప్రతీకగా అన్నపూర్ణేశ్వరిని ప్రతిష్ఠించాడేమో అనిపిస్తుంది.అక్షరమిచ్చే బంగారు తల్లిశృంగగిరి మఠాన్ని ఆది శంకరాచార్యులు సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం స్థాపించాడు. వ్యవహారంలో అది శృంగేరిగా మారిపోయింది. శృంగేరి శారదాపీఠం అనుబంధ మఠాలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఆ గురు పరంపరలో తెలుగు వ్యక్తి విధుశేఖర భారతి ఉన్నారు. ఇక్కడ చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశం చదువుల తల్లి సరస్వతీ మాత కొలువై ఉన్న శ్రీశారదాంబ ఆలయం. ఆలయ శిల్పసౌందర్య వీక్షణం, సరస్వతీదేవి దర్శనం జీవితకాలం గుర్తుండే మధురానుభూతి. ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించిన సరస్వతీ మాత విగ్రహం చందన శిల్పం. ఆ తర్వాత విజయనగర రాజులు బంగారు విగ్రహం చేయించారు.3వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత గోకర్ణకు ప్రయాణం. గోకర్ణం బీచ్, మురుదేశ్వర్ ఆలయ దర్శనం తర్వాత కొల్లూరుకు ప్రయాణం. అక్కడ ఆలయ దర్శనం తర్వాత తిరిగి ఉడుపికి ప్రయాణం. మూడవ రోజు రాత్రి బస కూడా ఉడుపిలోనే.అరేబియా తీరాన మహేశ్వరులుశివుడు... మురుదేశ్వరుడి పేరుతో పూజలందుకుంటున్న ప్రదేశం పేరే మురుదేశ్వర్. అరేబియా తీరాన ధ్యానముద్రలో శివుడి విగ్రహం మురుదేశ్వర్కి సిగ్నేచర్ పిక్చర్. ప్రపంచంలో ఉన్న అత్యంత పెద్ద శివుడి విగ్రహాలలో మురుదేశ్వర్ విగ్రహానిది మూడవ స్థానం. ఈ ఆలయంలో 20 అంతస్థుల రాజగోపురం స్పెషల్ అట్రాక్షన్. బంగారు గోపురం సంధ్యా కిరణాలకు మిరుమిట్లు గొలుపుతూ ఉంటుంది. కైలాసనాథ మహాదేవుడి ప్రతిరూపంగా కొలుస్తారు. ఇక్కడి శివలింగం భూమి మీద ప్రతిష్ఠించింది కాదనీ, భూగర్భం నుంచి ఉద్భవించినదని, కైలాసం నుంచి రావణాసురుడు తెచ్చిన ఆత్మలింగం అని చెబుతారు. ఇక్కడికి సుమారు 80 కిలోమీటర్ల దూరన గోకర్ణ తీర్థం ఉంది. అందులోని శివుడు మహాబలేశ్వరుడు. ఇక్కడి లింగాన్ని కూడా ఆత్మలింగం అనే చెబుతారు. ఈ ఆలయాలకు వెళ్లేటప్పుడు డ్రెస్కోడ్ తప్పనిసరి. హిందూ సంప్రదాయ దుస్తులనే ధరించాలి. భుజాలు, మోకాళ్లను కవర్ చేస్తున్న దుస్తులతోనే అనుమతిస్తారు. జీన్స్, స్లీవ్లెస్, షార్ట్స్ వంటి వస్త్రధారణ నిషిద్ధం. కాబట్టి జర్నీ ప్లానింగ్లో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. చందమామ కథల నేలకన్నడిగులకు కొల్లూరుతో గొప్ప అనుబంధం ఉంది. మనం చందమామ కథల్లో చదివిన మూకాంబిక అమ్మవారు కొలువై ఉన్న ప్రదేశం కొల్లూరు. మహాశక్తివంతమైన దేవతగా విశ్వసిస్తారు. స్థానిక కథనాల ప్రకారం ఆదిశంకరాచార్యులు కేరళలోని కుదజాద్రి కొండల్లో ధ్యానం చేసుకుంటున్న సమయంలో మూకాంబిక దేవి ప్రత్యక్షమైంది. ఆది శంకరుని కోరిక మేరకు ఆమె అతడిని అనుసరిస్తూ వెనుకే నడిచింది. ఆది శంకరుడు వెనక్కి చూసిన క్షణంలో అక్కడే ఆగి΄ోతానని షరతు కూడా పెట్టింది. అలా చేర రాజ్యం నుంచి వారి ప్రయాణం మొదలైంది. కొల్లూరు పరిసరాలకు వచ్చేటప్పటికి ఆది శంకరాచార్యునికి ఆమె పాదమంజీరాల సవ్వడి వినిపించలేదు. అప్పుడతడు వెనక్కి చూశాడని, మూకాంబిక తన షరతు ప్రకారం అక్కడే ఆగిపోయిందని, అక్కడే గుడి కట్టి పూజిస్తున్నారని చెబుతారు. చేర రాజ్యం నుంచి వచ్చిన దేవత కాబట్టి ఉత్తర కేరళ వాళ్లు తమ ఇంటి ఆడపడుచుగా భావించి మూకాంబిక దర్శనానికి వస్తారు. అందుకే ఇక్కడ కన్నడ వాళ్లతోపాటు మలయాళీలు కూడా పెద్ద సంఖ్యలో కనిపిస్తారు.4వ రోజు..బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్, ధర్మస్థలకు ప్రయాణం. మంజునాథ ఆలయ దర్శనం తర్వాత కుక్కెకి ప్రయాణం. రాత్రి భోజనం చేసిన తర్వాత కుక్కెలో బస.శివుడు– గోమఠేశ్వరుడుధర్మస్థల ఇటీవల వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. వివాదాలను పక్కన పెడితే కన్నడ సంస్కృతి– జైన సంప్రదాయాల మేళవింపుకు ప్రతీక అయిన ఈ ఆలయం చూడాల్సిన ప్రదేశమే. ఎనిమిది వందల ఏళ్ల నాటి నిర్మాణం. శివుడు ఇక్కడ మంజునాథుడిగా పూజలందుకుంటున్నాడు. మహాశివరాత్రికి శివుడికి ఉత్సవాలు, జైన సంప్రదాయంలో భాగంగా ఇక్కడ కొలువై ఉన్న గోమఠేశ్వరుడికి మహామస్తకాభిషేకం వైభవంగా జరుగుతాయి. 5వరోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత కుక్కె సుబ్రహ్మణ్యం దర్శనం చేసుకుని తిరిగి హోటల్కు వచ్చి హోటల్ గది చెక్ అవుట్ చేయాలి. ప్రయాణం మంగళూరుకు సాగుతుంది. మంగళూరులో హోటల్ గదిలో చెక్ ఇన్ అయిన తర్వాత సాయంత్రం తన్నేరు బావి బీచ్ విహారం. కద్రోలి గోకర్ణనాథ ఆలయ దర్శనం. రాత్రి బస మంగళూరులో.ఊరిపేరే దేవుడి పేరుమనదేశంలో శైవం, వైష్ణవం పోటాపోటీగా విస్తరిస్తున్న రోజుల్లో రూపుదిద్దుకున్న ఆలయాలకు లెక్కేలేదు. కర్నాటకలో వీరశైవం ప్రభావంతో శివుడు, శివుడి కుటుంబ సభ్యుల ఆలయాలు ఎక్కువ కనిపిస్తాయి. శివపార్వతుల కుమారులిద్దరూ గణేశుడు, కార్తికేయుడిగా పూజలందుకుంటుంటారు. కార్తికేయుడిని సుబ్రహ్మణ్యంగా కొలుస్తారిక్కడ. స్థలపురాణం కూడా శైవం– వైష్ణవాల ఆధారంగానే ఉంటుంది. విష్ణుమూర్తి వాహనమైన గరుట్మంతుడి బారి నుంచి తనను తాను రక్షించుకోవడానికి వాసుకి ఇక్కడ ఆశ్రయం పొందినట్లు చెబుతారు. ఈ గ్రామం పేరు సుబ్రహ్మణ్య. అందుకే ఇక్కడి దేవుడు సుబ్రహ్మణ్యస్వామిగా వ్యవహారంలోకి వచ్చాడు.బంగారు తీరం తన్నేరు బావి అరేబియా తీరంలో అలలు మంద్రంగా చిరుసవ్వడితో ఆలరిస్తుంటాయి. తన్నేరు బావి దగ్గర అరేబియా సముద్రజలంలో కలుషితాలు లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది. ఇక్కడి బీచ్లో ఇసుక పసుపురంగులో బంగారం రాశి΄ోసినట్లుంటుంది. సూర్యాస్తమయాన్ని వీక్షించడానికి ఇది మంచి ప్రదేశం. పర్యాటక రంగం ఏర్పాటు చేసిన సౌకర్యాలతో ఈ బీచ్లో టూరిస్ట్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. గుర్రం మీద విహరించనూవచ్చు. 6వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేయాలి. మంగళాదేవి ఆలయం, మంజునాథ ఆలయ దర్శనం తర్వాత పిలికుల బయోలాజికల్ పార్క్ వీక్షణం. టూర్ నిర్వహకులు పర్యాటకులను సాయత్రం మంగళూరు ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వీడ్కోలు చెబుతారు. విమానం ఎక్కి హైదరాబాద్ చేరడంతో టూర్ పూర్తవుతుంది.మంగళాదేవి ఊరుమంగళాదేవి ఆలయం ఉండడంతోనే ఆ ఊరికి మంగళూరుకు అనే పేరు వచ్చింది. మంగళాదేవి ఆలయం ఏటవాలు ఎర్ర పై కప్పుతో కేరళ వాస్తుశైలిలో ఉంటుంది. ఇందుకు కారణం దీనిని కట్టిన రాజు పేరు కుందవర్మన్. తుళునాడు, మలనాడు ్ర΄ాంతాల ΄ాలకుడు. ఈ సమ్మిళిత శైలి ఈ ఆలయం నిర్మాణంలో కనిపిస్తుంది. అందమైన పక్షిధామంపిలికుల బయలాజికల్ పార్క్ మల్టీ డైమన్షన్లు కలిగిన టూరిస్ట్ ప్లేస్. ఎకో టూరిజమ్, ఎడ్యుకేషనల్ టూరిజమ్, ఆహ్లాదకరమైన విహార ప్రదేశం కూడా. కన్నడంలో దీని పేరు పిలికుల నిసర్గ ధామ. నాలుగు వందల ఎకరాల పార్కులో కోర్ ఏరియా 150 ఎకరాలుంటుంది. ఇక్కడి పక్షులు మాత్రం రెక్కల్లోని వైవిధ్యత అంతా ఒక చోటకు చేర్చి ప్రదర్శనకు పెట్టినట్లు కనువిందు చేస్తాయి. ఆస్ట్రిచ్, ఈము కోళ్లు, రియా కొంగలు, చిలుకలు, బ్లాక్ స్వాన్, పెలికాన్, గినియా ఫౌల్ (గిన్ని కోళ్లు), నైట్ హోరన్, గుడ్లగూబలు, లవ్ బర్డ్స్... ఇలా రకరకాల పక్షులను చూడవచ్చు. రకరకాల జాతుల కొంగలు సున్నితంగా అడుగులు వేస్తూ ఆహ్లాదపరుస్తాయి. భూమ్మీద ఉన్న పక్షి జాతులన్నీ ఇక్కడ ఉన్నాయా అనిపిస్తుంది. టీనేజ్ పిల్లలకు ఈ పార్క్ ఒక ఎడ్యుకేషన్ అనే చెప్పాలి. ఇక్కడ నిబంధనలు కఠినంగా ఉంటాయి, వాటిని కచ్చితంగా అమలు పరుస్తారు కూడా. కాబట్టి పర్యాటకులు విధిగా పాటించి తీరాలి. జంతువులకు చిరాకు కలిగించే పనులు చేయరాదు. వాటికి తినుబండారాలు పెట్టకూడదు. అడవుల్లో పర్యటించేటప్పుడు జంతువులను ఏదో చూశామంటే చూసేశాం అన్నట్లు చూడకూడదు. ప్రతి జంతువునీ దానికంటూ ఉండే ప్రత్యేకత కదలికలను గమనించాలి. కొన్నింటికి తోక ఊపడంలో వైవిధ్యత, కొన్నింటికి కొమ్ములను విదిలించడం, కొన్ని అడుగులు వేసేటప్పుడు మట్టిలో పాదముద్రలు పడనంత సున్నితంగా నడుస్తుంటాయి. ఈ టూర్లో ఎంట్రీ టికెట్తో పాటు కెమెరా టికెట్ కూడా తీసుకుంటే కొమ్మల మీద కూర్చుని కువకువలాలడే పక్షలను, గురుపుర నదిలో నీరు తాగుతున్న జింకలను, నేల మీద జరజరపాకే సరీసృపాలను రికార్డ్ చేసుకోవచ్చు.ప్యాకేజ్ పేరు..డివైన్ కర్ణాటక, ప్యాకేజ్ కోడ్: ఎస్హెచ్ఏ 08. ఈ ఆరు రోజుల టూర్ హైదరాబాద్ ఎయిర్΄ోర్ట్ నుంచి బయలుదేరి హైదరాబాద్కే చేరడంతో పూర్తవుతుంది. ఈ టూర్లో హోరనాడు అన్నపూర్ణేశ్వరి, శృంగేరి, గోకర్ణ, మురుదేశ్వర్, కొల్లూరు, ధర్మస్థల, మంజునాథ్ ఆలయం, తన్నేరు బావి బీచ్, కుద్రోలి గోకర్ణాథ టెంపుల్, మంగళాదేవి, కద్రి మంజునాథ, పిలికుల బయోలాజికల్ ΄ార్క్ కవర్ అవుతాయి.టారిఫ్ ఇలా..సింగిల్ ఆక్యుపెన్సీ 45,950 రూపాయలు, డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 36,100, ట్రిపుల్ ఆక్యుపెన్సీలో 34,850 రూపాయలు. ప్రయాణం ఎప్పుడు? 21.01.2026, ఉదయం 05.50 గంటలకు 6ఈ 7549 నంబరు విమానం హైదరాబాద్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్΄ోర్టు నుంచి బయలుదేరి ఉదయం 07.35 గంటలకు మంగళూరుకు చేరుతుంది. తిరుగు ప్రయాణం 26.01.2026. రాత్రి 21.55 గంటలకు 6ఈ 7241 విమానం మంగళూరు నుంచి బయలుదేరి 23.50 గంటలకు హైదరాబాద్కు చేరుతుంది.ప్యాకేజ్లో...విమానం టికెట్లు, హోటల్ బస, ఆరు బ్రేక్ఫాస్ట్లు, నాలుగు డిన్నర్లు, ఐటెనరీలో సూచించిన ప్రదేశాలకు ప్రయాణానికి ఏసీ వాహనం, ట్రావెల్ ఇన్సూరెన్స్, టూర్ ఎస్కార్ట్ సౌకర్యాలుంటాయి.లంచ్, ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి– ఎయిర్΄ోర్ట్ నుంచి ఇంటికి రవాణా, పర్యాటక ప్రదేశాల్లో దర్శనాల టికెట్లు, డ్రైవర్లకిచ్చే టిప్పులు, ఇతర పానీయాలు, లాండ్రీ, మెనూలో లేన పదార్థాలను ఆర్డర్ చేసుకుంటే ఆ బిల్లులు, పర్యాటక ప్రదేశాల్లో గైడ్ సర్వీస్లు ప్యాకేజ్లో వర్తించవు.బుకింగ్ కోసం..జోనల్ ఆఫీస్,ఐఆర్సీటీసీ, సౌత్ సెంట్రల్ జోన్9–1–129/1/302, థర్డ్ ఫ్లోర్, ఆక్స్ఫోర్డ్ ΄్లాజా,ఎస్డీ రోడ్, సికింద్రాబాద్, తెలంగాణ.ఫోన్ నంబరు: 040–27702407, 82879 32229ఐఆర్సీటీసీ – టూరిజమ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫెసిలిటేషన్ సెంటర్,విజయవాడ రైల్వే స్టేషన్ఫోన్ నంబరు: 92810 30714, 82879 32312– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: ఆ ఇద్దరు అప్పుడు క్లాస్మేట్స్..ఇవాళ శబరిమలలో..!) -
డీకే శివకుమార్కు చెంబు, సీఎం సిద్దరామయ్య.. పువ్వు
కర్ణాటక: డీసీఎం డీకే శివకుమార్ సీఎం అవుతారా?, సీఎం సిద్దరామయ్య పదవిని కాపాడుకుంటారా అనేదానిపై మండ్య నగర బీజేపీ నాయకులు ఆదివారం చిలుక జోస్యం చెప్పించారు. అలా కాంగ్రెస్ సర్కారు పరిణామాలను ఎద్దేవా చేశారు. డీకే శివకుమార్ పేరు చెప్పినప్పుడు చిలుక తీసిన చీటీలో చెంబు బొమ్మ వచ్చింది. సిద్దరామయ్య పేరు చెప్పినప్పుడు తీసిన చీటీలో బంతిపూవు వచ్చింది, ఇవి చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దీని అర్థం ఏమిటా అని తలోరకంగా మాట్లాడుకున్నారు. శివకుమార్ సీఎం అయితే రాష్ట్ర ప్రజలకు చెంబు గతి పడుతుందని, సిద్దరామయ్య ప్రజల చెవిలో పువ్వులు పెట్టడం తప్ప చేసింది ఏమీ లేదని బీజేపీ నేతలు పేర్కొన్నారు. కూర్చుని కాపాడుకోడానికి ఒకరు, దానిని లాక్కోవడానికి మరొకరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవలి కాలంలో 2,400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ప్రభుత్వానికి ఇవేమీ పట్టడం లేదని అన్నారు. -
హైకమాండ్ చూసుకుంటుంది..!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ సంక్షోభంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మౌనం వీడారు. అక్కడి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం సిద్ధరామయ్య– డిప్యూటీ డీకే శివకుమార్ మధ్య జరుగుతున్న కుర్చీలాట సమస్యను పరిష్కరించడం తనవల్ల సాధ్యపడదని పరోక్షంగా విచారం వ్యక్తంచేశారు. ‘మీరు (మీడియా) మూడ్రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తోంది. ఎందుకంటే ఏ విషయం లేకుండా నేను చెప్పడం మంచిది కాదు. నా దగ్గర చెప్పేందుకు ఏమీలేదు’ అని అన్నారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పిడి జరిగే పక్షంలో సీఎం రేసులో తాను కూడా ఉంటానని సీనియర్ మంత్రి జి. పరమేశ్వర్ ఆదివారం పేర్కొన్నారు. -
సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య
బెంగళూరు: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సుపారీ కిల్లర్స్కి డబ్బులు ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య ఉదంతం 7 ఏళ్లకు గుట్టురట్టయింది. ఈ సంఘటన కలబుర్గిలో చోటుచేసుకుంది. వివరాలు... కలబుర్గి తాలూకా కణ్ణి గ్రామం నివాసి భీరప్ప 7 ఏళ్ల క్రితం చనిపోయాడు. సహజ మరణంగా భావించి అంత్యక్రియలు జరిపించారు. అయితే ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి ఇప్పుడు వెలుగు చూడడంతో హత్యగా తేలింది. భీరప్ప భార్య శాంతాబాయి, మహేశ్, సురేశ్, సిద్ధు, శంకర్ అనే వ్యక్తులకు సుపారి ఇచ్చి భర్తను హత్య చేయించింది. ప్రధాన నిందితుడు మహేశ్కు శాంతాబాయితో అక్రమ సంబంధం ఉంది. తమకు భర్త అడ్డుగా ఉన్నాడని భార్య, ఆమె ప్రియుడు భావించారు. అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించారు. శాంతాబాయి తన భర్తను హత్య చేయాలని మాట్లాడిన దృశ్యాలను ప్రియుడు మహేశ్ తన మొబైల్లో వీడియో తీసి పెట్టుకున్నాడు. ఇటీవల సదరు వీడియో లీక్ కావడంతో వైరల్గా మారింది. దీంతో భీరప్ప తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఐదుమంది నిందితులను అరెస్టు చేశారు. -
సీఎం పదవి ఇవ్వకపోతే.. DK వార్నింగ్
-
సిద్దు, డీకే ఎఫెక్ట్.. తెరపైకి ‘ఉత్తర కర్ణాటక’ వివాదం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో సీఎం సీటుపై కర్ణాటక రాజకీయాల్లో చర్చ జోరందుకోగా.. తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలనే నినాదంపై మరోమారు దుమారం రేగింది. బెళగావిలో జరిగే శాసనసభా సమావేశాల్లో ఎమ్మెల్యే రాజుకాగెతో పాటు, ఉత్తర కర్ణాటకకు చెందిన 26 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేక రాష్ట్రం కోసం నినదించాలని నిర్ణయించినట్లు ఉత్తర కర్ణాటక పోరాట సమితి ప్రధాన కార్యదర్శి నాగేశ్ గోలశెట్టి చెప్పడంతో మళ్లీ చర్చ మొదలైంది.బెళగావిలో నాగేశ్ గోలశెట్టి విలేకరులతో మాట్లాడుతూ దీర్ఘకాలంగా ఉత్తర కర్ణాటకకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కాగె లేఖ రాసినట్టు చెప్పారు. ఇప్పటికే ఉత్తర కర్ణాటకకు చెందిన 1,48,91,346 మంది ప్రత్యేక రాష్ట్రం కోసం మద్దతు ఇచ్చినట్లు వెల్లడించారు. డిసెంబర్ 8న బెళగావిలో 26 మంది ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి డిసెంబర్ 11 నుంచి జరిగే శీతాకాల శాసనసభా సమావేశాల్లో ప్రత్యేక రాష్ట్రంపై గొంతు వినిపిస్తామని చెప్పారు. రాజుకాగె పోరాటానికి బెళగావి, విజయపుర, బాగలకోట, ధారవాడ, గదగ, ఉత్తర కన్నడలోని 15 జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు సిద్దు సవది, విజయానంద కాశప్పనవర, బసనగౌడ పాటిల్యత్నాల్, శరణు సలగర, శరణ ప్రకాశ పాటిల్, వినయ కులకర్ణి, అరవింద బెల్లద, జనార్దన్రెడ్డి, నారా భరత్రెడ్డి, నిఖిల్కత్తి మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఉత్తర కర్ణాటక ప్రజలు తమ డిమాండ్లు సాధించుకోవాలంటే తెలంగాణ తరహా పోరాటం చేసేందుకు సిద్ధమవ్వాలని నాగేశ్ గోలశెట్టి తెలిపారు.డీకే వర్గం కొత్త డిమాండ్.. మరోవైపు.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు సీఎం పదవి ఇవ్వాలని ఆయన వర్గం ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఎమ్మెల్యేల అభిప్రాయం సేకరించాలని, రహస్య ఓటింగ్ కూడా నిర్వహించాలని కూడా కోరుతున్నారు. ఈ మేరకు వారంతా ఢిల్లీ యాత్ర చేపట్టారు. అధిష్టానం పెద్దల వద్దకు వెళ్లి ఈ మేరకు తమ డిమాండ్ను వినిపిస్తున్నారు. బెంగళూరులోని కొందరు ఎమ్మెల్యేలు డీకే శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇళ్లకు క్యూలు కడుతున్నారు. ఇద్దరితో మాట్లాడి రాజీ కుదిర్చే ప్రయత్నాలు సాగిస్తున్నారు. డీకే శివకుమార్ మాత్రం ఎవరి మాట వినేందుకు సిద్ధంగా లేన్నట్లు సమాచారం.2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొందరు నేతల ద్వారా డీకే శివకుమార్ను బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అయితే అందుకు కూడా ఆయన అంగీకరించలేదని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసంటూ ప్రశ్నించినట్లు సమాచారం. గతంలో హైకమాండ్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని డీకే శివకుమార్ తేల్చిచెప్పారని తెలుస్తోంది. రెండున్నరేళ్ల వరకు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, తాను ఉప ముఖ్యమంత్రిగా.. లోక్సభ ఎన్నికల వరకు కేపీసీపీ అధ్యక్షుడిగా కొనసాగాలని హైకమాండ్ నిర్దేశించిందని డీకే శివకుమార్ గుర్తు చేసినట్టు సమాచారం. ఇచ్చిన మాట ప్రకారం నడుచుకోవాలని, తనను ముఖ్యమంత్రి చేయాలని డీకే కోరుతున్నట్టు తెలుస్తోంది. -
కర్ణాటకలో ట్విస్ట్.. ఖర్గేతో భేటీలో ఏం జరిగింది?
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో అధికార, నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయమే అంతిమమని సీఎం సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. శనివారం రాత్రి ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సుమారు గంటకు పైగా సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాజకీయం ఆసక్తికరంగా మారింది.ఖర్గేతో భేటీ అనంతరం సిద్దరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత మల్లికార్జున ఖర్గే బెంగళూరుకు రావడంతో కలిశానన్నారు. ఇదొక మర్యాద పూర్వక భేటీ మాత్రమేనని, ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని చెప్పుకొచ్చారు. పార్టీ బలోపేతంపై, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్లు తెలిపారు. నాయకత్వ మార్పు అంశంపై చర్చించలేదన్నారు. డీకే వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో చర్చలు జరపడంపై స్పందిస్తూ ఎవరైనా ఢిల్లీకి వెళ్లి హైకమాండ్తో మాట్లాడొచ్చని, అందులో ప్రత్యేకత ఏముందని ప్రశ్నించారు. సీఎం మార్పు అంశంలో ఏమి జరిగినా తాను బాధపడనని, అలాగే సంతోషపడనని కూడా చెప్పారు. ఏ విషయమైనా పార్టీ అధిష్టానం నిర్ణయమే అంతిమమని, అది తానైనా, డీకే శివకుమార్ అయినా, పార్టీ నేతలెవరైనా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చ! ఖర్గేతో భేటీలో సిద్ధరామయ్య తననే సీఎంగా కొనసాగించాలని కోరినట్లు తెలిసింది. శనివారం బెంగళూరు నగరంలోని సదాశివనగరలో ఉన్న ఖర్గే నివాసానికి తన వర్గం, నేతలు లేకుండా సీఎం సిద్ధరామయ్య ఒక్కరే వెళ్లడం గమనార్హం. ఇద్దరు నేతలు కలిసి సుదీర్ఘంగా పలు తాజా రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చ జరిగిందని సమాచారం. అంతకు ముందు సీఎం తన అనుచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర మంత్రులతో సమావేశమై చర్చించారు. సీఎం నివాసం కావేరికి మంత్రులు జమీర్ అహ్మద్ఖాన్, ఈశ్వర్ ఖండ్రే, కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్లారు.ప్రస్తుత రాజకీయ సంక్షోభ సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎంతో వారు చర్చించినట్లు సమాచారం. భేటీ అనంతరం బెంగళూరు ప్యాలెస్ మైదానంలో మంత్రి డి.సుధాకర్ కుమారుడి పెళ్లికి సీఎం హాజరై అక్కడి నుంచి నేరుగా ఖర్గే నివాసానికి చేరుకున్నారు. తనకు ఎమ్మెల్యేల పూర్తి మద్దతు ఉందని ఖర్గే చెప్పినట్లు సమాచారం. అలాగే ప్రభుత్వ పాలనకు ఎలాంటి ఆటంకం లేకుండా, సుపరిపాలన కొనసాగాలంటే తానే సీఎంగా కొనసాగాల్సిన ఆవశ్యకతను వివరించినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలంటే కూడా తానే సీఎంగా కొనసాగాలని చెప్పినట్లు సమాచారం. కాగా, సీఎం సిద్ధరామయ్య, ఖర్గే భేటీపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ.. వారి భేటీకి ప్రత్యేకత ఏమీ లేదన్నారు. తాను ఉంటున్న ఇంటి నుంచి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఖర్గే నివాసం ఉందని తెలిపారు. -
త్యాగాలకు కూడా ఓ హద్దు ఉంటుంది!
ఆయన పార్టీ కోసం ఎంతో చేశారు. అలాంటి వ్యక్తిని మోసం చేయడం వెన్నుపోటు కిందే లెక్క. త్యాగాలకు కూడా ఓ హద్దు ఉంటుంది. అది దాటితే పరిస్థితులు మరోలా మారతాయ్.. డీకే శివకుమార్ వర్గీయులు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల సారాంశం ఇది. శనివారం కర్ణాటక పవర్ పాలిటిక్స్ ఎపిసోడ్కు పుల్స్టాప్ పడుతుందనే ప్రచారం వేళ.. ఈ తరహా పోస్టులు కుప్పలుగా కనిపిస్తున్నాయక్కడి గ్రూపుల్లో!.. కర్ణాటకలో నాయకత్వం మార్పు కోరుతూ అధికార పార్టీ రాజకీయం కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను సీఎం చేయాలంటూ ఆయన వర్గీయులు పట్టుబడుతున్నారు. ఇప్పటికే డజను మంది ఎమెల్యేలు ఢిల్లీ వెళ్లి అధిష్టానాన్ని కలిసి తమ గళం వినిపించారు. ఇవాళ బెంగళూరు పర్యటనలో ఉన్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను మరోసారి కలవాలనుకుంటున్నారు. మరోవైపు.. ఈ వ్యవహారంపై బహిరంగంగా ఎలాంటి కామెంట్లు చేయని డీకే శివకుమార్ మాత్రం గప్చుప్గా జైల్లో ఉన్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ములాఖత్కావడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఆయన త్యాగాలకు అంతే లేదా?.. బిహార్ ఎన్నికల ఫలితంతో తీవ్ర నిరాశలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. కర్ణాటకలో రాజకీయ సంక్షోభాన్ని కోరుకోవడం లేదు. అందుకే నాయకత్వ మార్పు ఉండదనే సంకేతాలను కాంగ్రెస్ వర్గాలకు పంపిస్తోంది. ఇది సిద్ధరామయ్య వర్గీయులకు ఊరట ఇచ్చే విషయమే. అదే సమయంలో డీకే శివకుమార్ వర్గం మాత్రం అధిష్టానంపై ఒత్తిడి పెంచాలనే చూస్తోంది. సోషల్ మీడియాలో వినూత్న ప్రచారానికి దిగింది. ఆయనపై సింపథీ పెంచేందుకు గత త్యాగాలను గుర్తు చేస్తోంది. డీకే త్యాగాల ట్రాక్ రికార్డుడీకే శివకుమార్.. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్త. గాంధీ కుటుంబానికి వీరవిధేయుడు. విద్యార్థి నాయకుడిగా రాజకీయాలోకి అడుగుపెట్టి 1989లో తొలిసారి సతనుర నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా నెగ్గారు. యువ నాయకుడిగా పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. రెండో దఫా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఎస్ఎం కృష్ణ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. ఆనాటి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూనే ఉన్నారాయన. 2004–2013 మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాలో ఉంది. ఆ సమయంలో పార్టీని నిలబెట్టడానికి డీకే శివకుమార్ విశేషంగా కృషి చేశారు. ఆ సమయంలోనే సీఎం కుర్చీ కోసం ప్రయత్నాలు చేయాలంటూ అనుచరులు ఒత్తిడి చేసినా పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ వాళ్లకు సర్దిచెప్పారు. ఈలోపు 2014–2019 మధ్య కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ సమయంలో సిద్దూ సర్కార్లో మంత్రిగా పని చేశారు సిద్ధరామయ్య. అయితే.. 2019లో ED (Enforcement Directorate) దర్యాప్తు కారణంగా మంత్రిత్వ పదవి కోల్పోయారు. ఆ సమయంలో తన వ్యక్తిగత భవిష్యత్తును పక్కన పెట్టి, పార్టీ కోసం త్యాగం చేశారు.అలా ట్రబుల్ షూటర్గా దేశవ్యాప్తంగా..2019లో.. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కూలకుండా.. ఎమ్మెల్యేలు చేజారకుండా చూసుకున్నారు డీకే శివకుమార్. అలా “ట్రబుల్ షూటర్”గా ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఆపై 2020లో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(KPCC) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. పార్టీని బలోపేతం చేసేందుకు అన్నివిధాల కృషి చేశారు. అక్కడి నుంచి 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో ఆయన పేరు దేశం మొత్తం వినిపించింది. అయితే తన అనుచరులు ఆయనను ముఖ్యమంత్రి కావాలని కోరినా.. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించారు.కష్టపడి.. త్యాగాలు చేసినవాళలకు ఆశలు ఉండడం సహజమేనని.. అయినా తనకు పార్టీ నిర్ణయమే తుదిదని చెబుతూ వస్తున్న డీకేకు ఇప్పుడు మద్దతు పెరుగుతోంది. తొలి నుంచి చేస్తున్న త్యాగాలు.. పార్టీ బలోపేతం కోసం చేసిన ప్రయత్నాలు.. ప్రభుత్వం కుప్పకూలకుండా చూసిన వైనం.. పార్టీ గెలుపు కోసం చేసిన కృషి, చివరకు ప్రత్యర్థులు ఎంత ఆశ చూపినా.. అధికారం కంటే పార్టీనే ముఖ్యమనుకుంటున్న ఆయన నిజాయితీతో కూడిన రాజకీయానికి పార్టీ తగిన న్యాయం చేయాలని మద్దతుదారులు పోస్టులు పెడుతున్నారు. -
Traffic Challans: సగం చలానా చెల్లిస్తే చాలు
కర్ణాటక: రోడ్లపై తిరుగుతున్న అనేక వాహనాలపై చలానాలు ఉంటాయి. తనిఖీలలో పట్టుబడితే చలానా కట్టేవరకూ వాహనం సీజ్ చేస్తామని హెచ్చరిస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాహనదారులకు పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ ఉల్లంఘన జరిమానాలపై 50 శాతం రాయితీ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శి గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ సదుపాయం శుక్రవారం నుంచి డిసెంబర్ 12 వరకు అమల్లో ఉంటుంది. ఈ కాలావధిలో అన్ని రకాల వాహనదారులు తమ పెండింగ్ జరిమానాలను సగం మొత్తం చెల్లించి పరిష్కరించుకోవచ్చు. ఇటీవల కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినప్పుడు వేలాది మంది ట్రాఫిక్ పోలీసు స్టేషన్లలో క్యూ కట్టి చెల్లించారు. దీంతో సర్కారుకు కోట్లాది రూపాయల ఆదాయం ఖజానాకు చేరింది. ఈ నేపథ్యంలో మరోసారి ఆఫర్ను ప్రకటించింది. ఈసారి కూడా పెద్దమొత్తంలో రాబడి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.ఎక్కడ చెల్లించాలి?జరిమానా చెల్లింపులు బెంగళూరులోలో అయితే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, ట్రాఫిక్ నిర్వహణ కేంద్రం, కర్ణాటక వన్, బెంగళూరు వన్ వెబ్సైట్లలో వివరాలు పొంది చెల్లించవచ్చు. జిల్లాల్లో అయితే సమీప పోలీస్ స్టేషన్లకు వెళ్లి చెల్లించవచ్చని చెప్పారు. కర్ణాటక స్టేట్ పోలీస్ (కేఎస్పీ) యాప్లోనూ చెల్లించే వసతి ఉందని అధికారులు తెలిపారు.రూ.వందల కోట్ల పెండింగ్ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనల కేసుల్లో వందలాది కోట్ల రూపాయల జరిమానాలు పెండింగ్లో ఉన్నాయి. బెంగళూరులో కొందరు ద్విచక్ర వాహనదారులపై 40, 50 కి పైగా చలానాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది, అలాంటివారు కనీసం రూ.30, 40 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో సగం చెల్లిస్తే చలానాలన్నీ మాఫీ అవుతాయి. ప్రభుత్వం 2023లో తొలిసారిగా 50 శాతం రాయితీ పథకాన్ని తీసుకొచ్చింది. ఆ స్కీం ద్వారా రూ.120 కోట్ల రూపాయలకు పైగా వసూలయ్యాయి. -
తారస్థాయికి కాంగ్రెస్ వర్గపోరు
సాక్షి, బెంగళూరు : ట్రబుల్ షూటర్గా పేరొందిన కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాజకీయ చదరంగంలో వేగం పెంచారు. 2023 ఎన్నికల సమయంలో కేపీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటన చేసి, పార్టీని ఏకతాటిపైకి తెచ్చి అఖండ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఆయన తన కృషికి ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని ఆశపడ్డారు. అయితే డీకే శివకుమార్ ఆశలకు సీనియర్ నేత సిద్ధరామయ్య బ్రేకులు వేశారు. ముఖ్యమంత్రి పదవికి డీకే శివకుమార్తో పోటీ పడ్డారు. బలమైన ఎమ్మెల్యేల మద్దతుతో సిద్ధరామయ్య ఢిల్లీలో చక్రం తిప్పడంతో హైకమాండ్ సిద్ధరామయ్య వైపు మొగ్గింది. దీంతో డీకే కినుక వహించడంతో రొటేషన్ పద్ధతితో చెరో రెండున్నరేళ్లు పవర్ షేరింగ్కు ఇద్దరు నేతలను ఒప్పించి.. డీకేను ఉప మఖ్యమంత్రి చేసిందని రాజకీయ వర్గాల్లో చర్చలు సాగాయి. ఈ క్రమంలో ఈ ఏడాది నవంబర్ 20తో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. అనధికార రహస్య ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రి పదవిని డీకే శివకుమార్కు సిద్ధరామయ్య అప్పగించాలి. అయితే సిద్ధరామయ్య అడ్డం తిరిగి సీఎం పదవి నుంచి దిగిపోయేందుకు ససేమిరా అనేశారు. దీంతో డీకే శివకుమార్ ఖంగు తిన్నారు. హైకమాండ్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో తన మద్దతుదారులను ఢిల్లీ పంపి అధిష్టానంపై వారి ద్వారా ఒత్తిడి తెచ్చేందుకు యతి్నస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గురువారం వారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి అధికార మారి్పడి ఒప్పందానికి కట్టుబడి ఉండాలని విన్నవించారు. డీకే శిబిరంలో మంత్రులు చెలువరాయస్వామి, కుణిగల్ ఎమ్మెల్యే హెచ్డీ రంగనాథ్, హొసకోటె ఎమ్మెల్యే శరత్ బచ్చేగౌడ, ఆనేకల్ ఎమ్మెల్యే శివణ్ణ, శృంగేరి ఎమ్మెల్యే రాజేగౌడ, నెలమంగల ఎమ్మెల్యే శ్రీనివాస్, గుబ్బి ఎమ్మెల్యే ఎస్ఆర్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ దినేశ్ గూళిగౌడ తదితరులు ఢిల్లీలో హైకమాండ్తో చర్చలు జరుపుతున్నారు. సీఎం కుర్చీని నేనొదలను..‘సీఎం కుర్చీని నేను వదలనుగాక వదలను’అన్నట్లుంది ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీరు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గానికి చెందిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీకి వెళ్లి అధికార మారి్పడి ఒప్పందాన్ని అమలు చేయాలని హైకమాండ్పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకున్న సిద్ధరామయ్య వర్గం వెంటనే అలర్ట్ అయ్యింది. మంత్రులు డాక్టర్ జి.పరమేశ్వర్, డాక్టర్ హెచ్సీ మహదేవప్ప, సతీశ్ జార్కిహోళి, దినేశ్ గుండూరావు, వెంకటేశ్, మాజీ మంత్రి కేఎన్ రాజణ్ణ తదితరులు బెంగళూరులో సతీశ్ జార్కిహోళి ఇంటిలో డిన్నర్ మీటింగ్లో కలుసుకుని, ఐదేళ్ల పూర్తి కాలం ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యనే కొనసాగేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించుకున్నారు. డీకే వర్గం తరహాలో తాము కూడా ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలకు సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని మనవి చేయాలని తీర్మానించారు. మల్లికార్జున ఖర్గే చేతుల్లో నిర్ణయం?రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఎత్తుకు పైఎత్తులు, వర్గ పోరు అధికమవ్వడంతో మల్లికార్జున ఖర్గే శనివారం బెంగళూరుకు రానున్నట్లు తెలిసింది. ఇరు వర్గాల నేతలతో వేర్వేరుగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకుంటారని సమాచారం. గురువారం చామరాజనగరలో సిద్ధరామయ్య మాట్లాడుతూ ఐదేళ్లూ తానే సీఎం అని, వచ్చే బడ్జెట్ను కూడా తానే ప్రవేశపెడతానని చెప్పుకు రావడం చూస్తుంటే అధిష్టానం మద్దతు సిద్ధరామయ్యకేనని తెలుస్తోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల సిద్ధరామయ్య.. రాహుల్ గాందీ, మల్లికార్జున ఖర్గేలతో సమావేశం అవ్వడాన్ని ఉదహరిస్తున్నారు. ఇటీవల బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమితో అధిష్టానం పూర్తిగా డీలా పడిన నేపథ్యంలో కర్ణాటక విషయంలో కోరి కొరివితో తల గోక్కోవడం ఎందుకనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. -
డీకే శివకుమార్కు ఏమైంది?
డీకే శివకుమార్.. కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం మిగతా రెండున్నరేళ్లు డీకే శివకుమార్ సీఎం పదవి చేపట్టాలి. అయితే ఇప్పుడు డీకే స్వరం మారింది. మొత్తం ఐదేళ్లు సిద్ధరామయ్యనే సీఎంగా ఉంటారని అన్నారు. తనకు 140 ఎమ్మెల్యేల మద్దతు ఉందని అంటూనే సిద్ధరామయ్యనే మిగతా కాలం కూడా సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేశారు. తామంతా సిద్ధరామయ్యకు సహకరిస్తామని తెలిపారు డీకే. మిగతా కాలం కూడా తాను సీఎంగా ఉంటానని సిద్ధరామయ్య అడిగారని, అందుకు తాను కూడా సానుకూలంగానే ఉన్నట్లు తెలిపారు. ఇక క్యాబినెట్ను కూడా సిద్ధరామయ్యే విస్తరించే అవకాశం ఉందన్నారు. చాలామందికి మంత్రులుగా చేయడానికి మొగ్గుచూపుతున్నారని, ఆ క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ అనేది ఆయనే చూసుకుంటారన్నారు. క్యాబినెట్ను మొత్తం మార్చాలని హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే అదే జరుగుతుందన్నారు. ఇక్కడ హైకమాండ్ ఆదేశాల ప్రకారమే ఉంటుంది. హైకమాండ్ ఫైనల్గా ఏం ఖరారు చేస్తుందో అదే జరుగుతుంది. గ్రూప్లు కట్టడం నా రక్తంలో లేదు‘నాకు మొత్తం 140 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కానీ నాకు గ్రూప్లు కట్టడం చేతకాదు. అది నా రక్తంలోనే లేదు’ అని అన్నారు. ఇక ఖర్గేను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ఎమ్మెల్యేలు కలవడంపై కూడా డీకే స్పందించారు. ‘ ఖర్గే సాబ్ను కలవడం అనేది ప్రతీ ఎమ్మెల్యేకు ఉన్న హక్కే. సీఎంను ఎలా కలుస్తామో.. ఖర్గే జీని కూడా అలాగే కలుస్తాం. ఢిల్లీకి వెళుతూ ఉంటాం. కలుస్తూ ఉంటాం. అది వారి హక్కు. నేనేమీ ఎవర్నీ తీసుకెళ్లి కలవను. కొంతమంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి ఖర్గేను కలిశారు. అది వారి హక్కు. ఇందులో నేను చెప్పేదేముంది’ అని మీడియాను ఎదురు ప్రశ్నించారు. డీకేకు ఏమైంది?గత కొంతకాలంగా కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర నడుస్తున్న చర్చ. కర్ణాటక తదుపరి సీఎం ఎవరు అనేది. ముందస్తు ఒప్పందం ప్రకారం.. సిద్ధరామయ్య రెండన్నరేళ్లు పూర్తి చేసుకున్నారు. అయితే తదుపరి సీఎంగా డీకే శివకుమార్కు ఇవ్వాలి. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది,. మిగతా రెండున్నరేళ్లు సిద్ధరామయ్యే సీఎంగా ఉంటారని, తాము అంతా కలిసి ఆయనకు సహకారం అందిస్తామని డీకేనే చెప్పారు. అంటే ఇది హైకమాండ్ చెప్పిందా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తింది. ఇటీవల తదుపరి కర్ణాటక సీఎంగా రాష్ట్ర ప్రజా పనుల వ్యవహారాల శాఖ మంత్రి (పీడబ్ల్యూడీ) సతీష్ జార్కిహోళికే ఉన్నాయని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కుమారుడు ఎమ్మెల్సీ యతీంద్ర సిద్ధరామయ్య ఓ బాంబు పేల్చారు. దాంతో కర్ణాటక కాంగ్రెస్లో గ్రూప్లు ఉన్న సంగతి బయటపడింది. దీన్ని పసిగట్టిన హైకమాండ్.. సీఎంను మార్చకపోవడమనే ఉత్తమం అని భావించి ఉండాలి. డీకే వ్యాఖ్యలు కూడా అలానే ఉన్నాయి. తనకు ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ, గ్రూప్లు కట్టడం తన రక్తంలో లేదంటూ స్సష్టం చేశారు. అదే సమయంలో సిద్ధరామయ్యే సీఎంగా ఐదేళ్లు కొనసాగుతారన్నారు. దాంతో కర్ణాటక సీఎం మార్పు ప్రచారానికి తెర పడింది. హైకమాండ్ బుజ్జగించడంతోనే డీకే శివకుమార్ వెనక్కు తగ్గారనే ప్రచారం మొదలైంది.#WATCH | Bengaluru: On speculations around the CM post in the state, Karnataka Deputy CM DK Shivakumar says, "...Making a group is not in my blood. All 140 MLAs are my MLAs. CM decided that he will reshuffle the Govt, the cabinet. So, all of them are interested in becoming… pic.twitter.com/bsSKhdhVXI— ANI (@ANI) November 21, 2025 సీఎంగా నేనే ఉంటా: సిద్ధరామయ్యఇక కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సైతం సీఎం మార్పు అంశంపై స్పందించారు. సీఎం మా ర్పు అనేది ఉండదని, మిగతా ఐదేళ్లు తానే సీఎంగా ఉంటానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఫలితంగా సతీష్ జార్కిహోళి కథ పక్కకు వెళ్లిపోయింది. తన వర్గంలోని సతీష్ జార్కిహోళికి సీఎం పదవిని మిగతా కాలం అప్పచెబితే బాగుంటుందని సిద్ధరామయ్య వర్గం భావించినా అది కర్ణాటక కాంగ్రెస్లో మరింత కాక పుట్టించే అవకాశం ఉండటంతో సిద్ధరామయ్యనే సీఎంగా కొనసాగిస్తే బాగుంటుందనే కచ్చితమైన అభిప్రాయానికి వచ్చిన తర్వాతే హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
నిర్వాహకులకు షాక్.. బిగ్బాస్ రియాలిటీ షోపై ఫిర్యాదు!
బుల్లితెర ప్రియులను అలరిస్తోన్న ఏకైక రియాలిటీ షో బిగ్బాస్. ఈ షో ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ, తమిళంలోనూ రన్ అవుతోంది. కన్నడలో ఈ ఏడాది కూడా హీరో కిచ్చా సుదీప్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటోంది. మొదట రెండు రోజుల పాటు ఈ షో మూసివేశారు. బిగ్బాస్ హౌస్ నుంచి వ్యర్థాలు ఎక్కువగా వస్తున్నాయని కొందరు ఫిర్యాదు చేయడంతో తాత్కాలికంగా ఆపేసి.. మళ్లీ రెండు రోజుల తర్వాత షో ప్రారంభించారు.తాజాగా కన్నడ బిగ్బాస్ సీజన్-12పై మరో వివాదం మొదలైంది. బిగ్బాస్ హౌస్ కుల వివక్ష, మహిళలను అవమానించేలా ఉందంటూ ప్రముఖ సామాజిక కార్యకర్త సంధ్య పవిత్ర కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఈ షో హోస్ట్గా వ్యవహరిస్తోన్న కిచ్చా సుదీప్తో పాటు కంటెస్టెంట్స్ అశ్విని గౌడ, రషిక పేర్లను ఫిర్యాదులో చేర్చింది.కంటెస్టెంట్ రక్షితను అవమానించేలా హోస్ట్ సుదీప్ వ్యాఖ్యలు చేశారని సంధ్య పేర్కొంది. ఇది మహిళలను కించపరిచేలా ఉందని ఫిర్యాదులో ప్రస్తావించింది. ఓ ఎపిసోడ్లో రషికపై మరో కంటెస్టెంట్ మాలవల్లి నటరాజ్ (గిల్లి) శారీరకంగా దాడి చేశాడని వెల్లడించింది. అంతేకాకుండా కర్ణాటక రక్షణ వేదికతో సంబంధం ఉన్న పోటీదారు అశ్విని గౌడను ఉద్దేశించి కుల వివక్ష వ్యాఖ్యలు చేయడం, రక్షిత నేపథ్యాన్ని అపహాస్యం చేశారంటూ ఫిర్యాదులో వివరించింది. అయితే ఈ వివాదంపై కిచ్చా సుదీప్ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం ఆయన 'మార్క్' షూటింగ్ను పూర్తి చేశారు. ఈ చిత్రం డిసెంబర్ 25న పండుగ విడుదల కానుంది. -
శబరిమల యాత్రికుల భద్రతపై..కేరళ ప్రధాన కార్యదర్శికి లేఖ..
శబరిమలలో భక్తుల భద్రతను నిర్థారించాలని కోరుతూ కేరళ ప్రధాన కార్యదర్శికి కర్ణాటక ప్రభుత్వం లేఖ పంపింది. శబరిమల వచ్చే భక్తులకు తగిన భద్రత,రవాణా సౌకర్యాలు కల్పించాలని లేఖలో పేర్కొంది. లక్షలాదిమంది అయ్యప్ప భక్తులు కర్ణాటకకు వస్తున్నారని, అందువల్ల వారి భద్రత కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని కర్ణాట ప్రభుత్వం లేఖలో కోరింది. ఈ లేఖను కర్ణాటక కార్యదర్శి కేరళ ప్రధాన కార్యదర్శికి పంపారు. ఇదిలా ఉండగా, శబరిమల యాత్ర నిమిత్తమై దేవస్వం బోర్డుభక్తులకు ఎలాంటి ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించ లేదంటూ అఖిల భారతీయ అయ్యప్ప సేవా సంఘం విమర్శలు ఎక్కుపెట్టింది. అంతేగాదు భక్తుల భద్రతా విషయమై ముందస్తుగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేపోయిందని దేవస్వం బోర్డుపై ధ్వజమెత్తింది. గతంలో అఖిల కేరళ అయ్యప్ప సేవా సంఘం దాదాపు 4 వేల మంది వాలంటీర్లతో శబరిమలలో తాగునీరు, ఉచిత ఆహారం ఇతర సేవలను అందించింది. అయితే, దేవస్వం బోర్డు కోర్టును ఆశ్రయించిన తర్వాత రెండేళ్లుగా ఇది నిలిపేశారు. అవినీతికి మార్గం సుగమం చేయడానికి అయ్యప్ప సేవా సంఘాన్ని అక్కడి నుంచి బహిష్కరించాలని కొంతమంది దేవస్వం బోర్డు అధికారులు కోర్టును ఆశ్రయించారని వాదనలు కూడా వినిపించాయి. అయితే అఖిల భారతీయ అయ్యప్ప సేవా సంఘం మాత్రం అవకాశం ఇస్తే..ఇప్పుడైనా అన్ని సేవలను ఉచితంగా అందిస్తామని పేర్కొనడం గమనార్హం.(చదవండి: శబరిమలలో భక్తుల రద్దీ దృష్ట్యా..రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందం..) -
కర్ణాటక సీఎం పీఠం కోసం కాంగ్రెస్ కొట్లాట
-
బెంగళూరు రోడ్లపై శుభాన్షు శుక్లా సెటైర్లు
బెంగళూరు: ఇటీవలి కాలంలో బెంగళూరులో పరిస్థితులపై పలువురు ప్రముఖులు కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. తాజాగా బెంగళూరు రోడ్ల పరిస్థితిపై వ్యోమగామి శుభాన్షు శుక్లా సైతం సెటైరికల్ కామెంట్స్ చేశారు. సిటీలో ప్రయాణం చేయాడం నరకమే అనే విధంగా పరోక్షంగా వ్యాఖ్యానించారు.వ్యోమగామి శుభాన్షు శుక్లా గురువారం బెంగళూరు టెక్నాలజీ సమ్మిట్ (బీటీఎస్)లో ‘ఫ్యూచర్ మేకర్స్ కాంక్లేవ్’కు హాజరయ్యారు. ఈ సందర్బంగా శుక్లా మాట్లాడారు. అంతరిక్షంలో అడుగుపెట్టాక మన గుండెపై మోటారు వాహనం ప్రయాణించినట్లు ఉంటుంది. అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు కనీసం వారం రోజులు పడుతుంది. భూమికి వచ్చాక రెండు వారాలపాటు మన శరీరం అదుపు తప్పే ఉంటుందని తన అనుభవాన్ని వివరించారు. ఈ ప్రయాణం భారతీయ అంతరిక్ష విజయానికి ప్రతీక అని తెలిశాక గర్వంగా ఉందన్నారు. అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనపడుతుందో వీడియో రూపంలో చూపారు.ఇక, ఇదే సమయంలో బెంగళూరులో ట్రాఫిక్ పరిస్థితిని వివరిస్తూ.. అంతరిక్షయానంపై తాను చేసే ప్రసంగ సమయంతో పోలిస్తే బెంగళూరు రహదారులపై ప్రయాణం మూడు రెట్లు అధికమని వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా మారతహళ్లి నుంచి మూడు గంటలపాటు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇందులో మూడో వంతు సమయంలోనే తాను ప్రసంగాన్ని పూర్తి చేశానన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.Group Capt. Shubhanshu Shukla, began his session at #BTS2025 with a sarcastic remark on #bengalurutraffic, saying he had taken “three times longer to reach the venue from Marathahalli, than the duration of his presentation.”@gagan_shux pic.twitter.com/1s2ewScM2J— Elezabeth Kurian (@ElezabethKurian) November 20, 2025ఇదిలా ఉండగా.. అంతకుముందు బెంగళూరులోని అధ్వానపు రోడ్ల సమస్యపై బయోకాన్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్-షా, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య నడుస్తున్న మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. కిరణ్ మజుందార్-షా వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఘాటుగా స్పందిస్తూ, "ఆమె తన మూలాలను మరచిపోయారని", దీని వెనుక "వ్యక్తిగత అజెండా" ఉందని ఆరోపించారు. అయితే, షా ఈ ఆరోపణలను ఖండించారు. అనంతరం ఆమె రోడ్ల అభివృద్ధికి నిధులు ఇస్తానని ప్రకటించగా, దానికి డీకే శివకుమార్ సానుకూలంగా స్పందించారు. ఆమె ఏ రోడ్లను అభివృద్ధి చేయాలనుకున్నా ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. -
పవర్ పాలిటిక్స్ వేళ డీకే ఆసక్తికర ట్వీట్
సాక్షి, ఢిల్లీ: కర్ణాటకలో మళ్లీ పవర్ పాలిటిక్స్ ఊపందుకున్నాయి. కర్ణాటక సర్కార్ ఏర్పడి నిన్నటితో రెండున్నరేళ్లు పూర్తైంది. దీంతో పవర్షేరింగ్ ఒప్పందం ప్రకారం సీఎం సిద్ధరామయ్యను గద్దె దించి.. తనను సీఎం పీఠం మీద కూర్చోబెట్టాలని పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో ఆయన నేరుగా రంగంలోకి దిగకుండా.. తన అనుచరులను అధిష్టానంతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. డీకే శివకుమార్కు కర్ణాటక ప్రభుత్వంలో 20 మంది ఎమ్మెల్యేలు.. ముగ్గురు మంత్రుల మద్దతు ఉంది. ఇందులో పది మంది తాజాగా ఢిల్లీకి వెళ్లారు. నాయకత్వాన్ని మార్చాల్సిందేనని హైకమాండ్ను వాళ్ల కోరనున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అప్పాయింట్మెంట్ లభించినట్లు సమాచారం. మరోవైపు.. సిద్ధరామయ్య తన మాట నిలబెట్టుకోవాలంటూ డీకే శివకుమార్ సోదరుడు, డీకే సురేష్ కోరుతున్నారు.నాయకత్వ మార్పు ప్రయత్నాల్లో వేగం పెంచిన డీకే.. ఈ ఉదయం ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ‘‘ఎక్కడ ప్రయత్నాలు ఉంటాయో.. అక్కడ ఫలితం ఉంటుంది ... ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు’’ అంటూ నర్మగర్భంగా ట్వీట్ చేశారు. ಎಲ್ಲಿ ಶ್ರಮ ಇದೆಯೋ ಅಲ್ಲಿ ಫಲವಿದೆ, ಎಲ್ಲಿ ಭಕ್ತಿ ಇದೆಯೋ ಅಲ್ಲಿ ಭಗವಂತ ಇದ್ದಾನೆ.. pic.twitter.com/7HyiIPWk1y— DK Shivakumar (@DKShivakumar) November 21, 2025అయితే ఐదేళ్లు సీఎంగా తానే కొనసాగాలని సిద్ధరామయ్య భావిస్తున్నారు. ఇప్పటికే మంత్రి వర్గ విస్తరణకు అనుమతి కోరిన ఆయన.. తన వర్గీయులను కూడా ఢిల్లీకి పంపించే యోచనలో ఉన్నట్లు సమాచారం. క్యాబినెట్ విస్తరణతో అసమ్మతికి చెక్ పెట్టాలని ఆయన భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అంతేకాదు.. పీసీసీ చీఫ్ పదవి నుంచి శివకుమార్ను తొలగించే ప్రయత్నాల్లో ఆయన సగం సక్సెస్ అయినట్లు సమాచారం. ఇక.. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఇప్పట్లో నాయకత్వ మార్పిడి లేదని సంకేతాలు ఇస్తోంది. ఎవరినీ ఢిల్లీకి రావొద్దని కోరింది. అయినప్పటికీ.. ఇరు వర్గాల ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలను ఆపడం లేదు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇప్పటికే నాయకత్వం మార్పిడిపై తుది నిర్ణయం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీదేనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు.. కాంగ్రెస్ అధిష్టానం చెప్పిందే తమకు శిరోధార్యమణి మరికొందరు ఎమ్మెల్యేలు చెబుతుండడం గమనార్హం. దీంతో.. సిద్ధూ, డీకే.. అధిష్టానం.. ఇలా మూడు వర్గాలుగా కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చీలినట్లు స్పష్టమవుతోంది. -
డీకే వర్సెస్ సిద్ధు.. ముదురుతున్న కర్ణాటక సంక్షోభం
సాక్షి, బెంగళూరు: అందరూ ఊహించినట్లే కర్ణాటకలో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. 2023 వేసవిలో ఎన్నికల అనంతరం కుదిరిన చెరో రెండున్నరేళ్ల ఒప్పందం ప్రకారం... సీఎంగా సిద్ధరామయ్య వైదొలగాల్సి ఉంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలి. గురువారంతో కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న క్రమంలో అధికార మార్పిడిపై ఉత్కంఠ నెలకొంది. కానీ, అలాంటిదేమీ లేదని సంకేతాలు రావడంతో పాటు మంత్రివర్గ విస్తరణ కూడా ఉండదని తేలింది.దీంతో డీకే శివకుమార్ వర్గానికి చెందిన మంత్రులు చెలువరాయస్వామి, దినేశ్ గుండూరావు, ఎమ్మెల్యేలు ఇక్బాల్ హుస్సేన్, హెచ్సీ బాలకృష్ణ, ఎస్ఆర్ శ్రీనివాస్, గుబ్బి శ్రీనివాస్, రవిగణిగ, ఉదయ్గౌడ, అనేకల్ శివణ్ణ, రంగనాథ్, బసవరాజు తదితర పదిమందిపైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకునేందుకు ఢిల్లీ వెళ్లారు. అధికార మారి్పడి దిశగా చర్యలు లేకపోవడాన్ని ఢిల్లీలో అగ్ర నేతల ఎదుట లేవనెత్తేందుకు సిద్ధమయ్యారు. డీకేను సీఎం చేయాలని డిమాండ్ చేయనున్నారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ కోరారు. ఆయనతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాం«దీతో కూడా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం వీరు అధిష్ఠానం పెద్దలను కలిసే అవకాశం ఉంది.కర్ణాటకలో 2023 వేసవిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సిద్ధు, డీకే వర్గాలు గట్టిగా పోటీపడడంతో సీఎం పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఎవరూ పట్టు వీడలేదు. దీంతో చెరో రెండున్నరేళ్లు ప్రతిపాదన తెచ్చి ముందుగా సిద్ధును సీఎంను చేసేలా అనధికార ఒప్పందం జరిగింది. అప్పటికి ఉప ముఖ్యమంత్రి పదవితో డీకే సర్దుకున్నారు. ఇప్పుడు రెండున్నరేళ్లు పూర్తి కావడంతో తమ నేతను సీఎం చేయాలంటూ డీకే మద్దతుదారులు, ఎమ్మెల్యేలు హస్తిన బాట పట్టారు. ఐదేళ్లు నేనే సీఎం.. మిగతా రెండున్నరేళ్లు తానే సీఎంగా ఉంటానని, అధికార మారి్పడి లాంటిదేమీ లేదని సీఎం సిద్ధు ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రజలు తమకు ‘ఐదేళ్లు’ అవకాశం ఇచ్చారని.. తాను కొనసాగుతానా? లేదా? అన్నది అప్రస్తుత చర్చ అని అంటున్నారు. నవంబర్ విప్లవం అంటూ సాగుతున్న ప్రచారం మీడియా కల్పితం అని కొట్టిపడేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కూడా తానే బడ్జెట్ ప్రవేశపెడతానని తేల్చిచెప్పారు.రెండున్నరేళ్ల కాలం ముగిసినందున కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ అంశాన్ని పరిశీలించవచ్చని అధిష్ఠానాన్ని కోరినట్లు చెప్పారు. అయితే, దీనిపై రాహుల్తో చర్చించి చెబుతానని ఖర్గే హామీ ఇవ్వగా.. దానిని అధికార మార్పిడి అంటూ తప్పుగా అర్థం చేసుకుని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎంగా తానే కొనసాగుతానని సిద్ధు చాలా స్పష్టంగా చెప్పడం, డీకే వర్గం అలర్ట్ కావడంతో కర్ణాటక కాంగ్రెస్ రాజకీయం సంక్షోభ దిశగా సాగుతోందిఅధిష్ఠానం ఇప్పుడు మార్పు చేస్తుందా? బిహార్ ఎన్నికల్లో చతికిలపడి వారం రోజులు కూడా కాకముందే.. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి కర్ణాటక తలనొప్పి మొదలైంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంలో మార్పులు చేసి ఇబ్బంది కొని తెచ్చుకోవడం ఎందుకనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. దీంతో సిద్ధు ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అందుకే ఆయన అంత ధైర్యంగా, బహిరంగంగా వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఈ క్రమంలో తమకు అన్యాయం జరుగుతున్నదని గ్రహించిన డీకే వర్గం వెంటనే తేరుకుంది. అధిష్ఠానం వద్ద తేల్చుకునేందుకే డీకే వర్గం ఎమ్మెల్యేలు, నేతలు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. -
ప్రతి ఉద్యోగికి రూ.50,000 ప్రోత్సాహకం!
కర్ణాటకలో ఐటీ వృద్ధిని కేవలం బెంగళూరుకే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని ఇతర పట్టణాలకు విస్తరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఐటీ పాలసీ 2025-2030ను ప్రకటించింది. బెంగళూరు టెక్ సమ్మిట్ (BTS) 28వ ఎడిషన్ ప్రారంభోత్సవంలో ఈ పాలసీని ఆవిష్కరించారు.రాష్ట్రంలో బెంగళూరు దాటి ఇతర ప్రాంతాల్లో తమ ప్రతిభను విస్తరించే సంస్థలకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాన్ని అందించనుంది. కంపెనీలు నియమించే ప్రతి ఉద్యోగికి రూ.50,000 వరకు వన్-టైమ్ రీలొకేషన్ ప్రోత్సాహకాన్ని అందిస్తామని ప్రకటించింది. ఈ ప్రోత్సాహకంలో భాగంగా బెంగళూరు నుంచి మైసూరు, మంగళూరు, హుబ్లీ-ధార్వాడ్, కలబురగి, శివమొగ్గ వంటి నగరాలకు ఉద్యోగులను తరలించే సంస్థలకు ఈ ప్రోత్సాహకం ఇస్తామని తెలిపింది.ఈ సందర్భంగా కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ..‘బెంగళూరు మినహా ఇతర నగరాల్లో ఐటీ కంపెనీల కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఆర్థిక ప్రోత్సాహకాల కోసం ప్రభుత్వం రూ.445 కోట్లు కేటాయించింది’ అని చెప్పారు.డీప్టెక్ ఇన్నోవేషన్ హబ్కొత్త ఐటీ పాలసీ 2025-30 కర్ణాటకను డీప్టెక్ ఇన్నోవేషన్ గమ్యస్థానంగా నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ‘భారతదేశపు అతిపెద్ద ఐటీ ఆర్ అండ్ డీ, ఉత్పత్తి అభివృద్ధి కేంద్రం కర్ణాటక. రూ.3.2 లక్షల కోట్లకు పైగా విలువైన దేశ ఐటీ ఎగుమతుల్లో 42% వాటా కర్ణాటకదే. ఇది సంవత్సరానికి 27% చొప్పున పెరుగుతోంది. రాష్ట్రంలో 550 కంటే ఎక్కువ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు ఉన్నాయి. ఇది భారతదేశం మొత్తంలో మూడింట ఒక వంతు. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 400 కంటే ఎక్కువ సంస్థలు బెంగళూరులో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి’ అన్నారు.ఇదీ చదవండి: బీమా ఏజెంట్లు చెప్పని విషయాలు.. -
‘సీఎంగా ఇంకెన్ని రోజులు ఉంటానో తెలియదు’
కొంతకాలంగా కర్ణాటకలో సీఎం మార్పుపై ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. పవర్ షేరింగ్ ఫార్ములా తెర మీదకు రావడం.. తన తండ్రి రాజకీయ భవిష్యత్తుపై సీఎం సిద్ధరామయ్య కొడుకు చేసిన వ్యాఖ్యలు.. అటుపై రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలన పూర్తి కావడంతో నవంబరులో నాయకత్వ మార్పు (Karnataka CM) తథ్యమని ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో పవర్ పాలిటిక్స్పై కర్ణాటక బీజేపీ యూనిట్ వ్యంగ్యంగా స్పందిస్తోంది. మొన్నీమధ్యే.. నవంబర్ వచ్చినా డీకేకు సీఎం సీటు మాత్రం దక్కలేదని పేర్కొంటూ ఏఐ ఫన్నీ (BJPs AI video) ఏఐ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా సీఎం సిద్ధరామయ్యను ఉద్దేశించి మరో వీడియోను పోస్ట్ చేసింది. అందులో.. సిద్ధరామయ్య ఫేస్బుక్ లైవ్లో ఉంటారు. సీఎంగా రెండున్నరేళ్ల పాలన పూర్తైందని.. సీఎంగా ఇంకా ఎంత కాలం కొనసాగుతానో తెలియదని.. అందుకే మీ ముందుకు వచ్చానని అంటారు. ఈలోపు.. కింద కామెంట్ సెక్షన్లో అజ్మల్, జమాల్, రఫీక్, ఫైజ్.. అనే యూజర్లు ‘ఐదేళ్లు మీరే సీఎంగా ఉండాలి’ అంటూ కామెంట్ పెడతారు. అయితే శంకర్ కనకపుర అనే వ్యక్తి మాత్రం.. ‘ఇంకెంత కాలం సీఎంగా ఉంటారు. రాజీనామా చేసి దిగిపోండి’ అని కామెంట్ చేస్తాడు. దీంతో అగ్గి మీద గుగ్గిలం అయిన సిద్ధరామయ్య.. ఎవరా వ్యక్తి.. అతన్ని బ్లాక్ చేస్తా అంటాడు. రెండు వర్గాలను ఉద్దేశించేలా.. కాంగ్రెస్ సర్కార్పై బీజేపీ చేసిన ఈ సెటైరిక్ ఈ వీడియో ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. నాయకత్వ మార్పు నేపథ్యంతో అంతకు ముందు బీజేపీ ఏఐ ఆధారిత వీడియోలో డీకే శివకుమార్ని టార్గెట్ చేసింది. అందులో.. రాహుల్ గాంధీ వాట్సాప్లో హాయ్ అనే మెసేజ్ పంపిస్తారు. ఆ సమయంలో రాహుల్ పక్కన సిద్ధరామయ్య కూడా ఉంటారు. ఆ తర్వాత స్క్రాచ్ కార్డు పంపుతారు. డీకే దానిని స్క్రాచ్ చేయగా..‘నో ఛైర్ నవంబర్’ (No Chair November) అనే మెసేజ్ చూసి షాక్ అవుతాడు. మరోవైపు రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య కూడా నవ్వుకుంటారు. అనంతరం స్క్రీన్పై హస్కీ డ్యాన్స్ను దీనికి జోడించారు. బీజేపీ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. శివకుమార్కు ఇది కుర్చీలేని నవంబర్ అని వ్యంగ్యాస్త్రాలు విసిరింది. View this post on Instagram A post shared by BJP Karnataka (@bjp4karnataka) -
ఆర్బీఐ అధికారుల్లా నటిస్తూ రూ.7 కోట్ల చోరీ
బెంగళూరు: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) అధికారులమంటూ ఏటీఎం కరెన్సీ వ్యాన్ సిబ్బందిని నమ్మించి ఏకంగా రూ.7.11 కోట్ల కరెన్సీ కట్టలను దోచుకెళ్లిన ఉదంతం కర్ణాటక రాజధాని బెంగళూరులో పట్టపగలే చోటుచేసుకుంది. బుధవారం మధాŠయ్హ్నం 12.24 గంటలకు జేపీ నగర్ హెచ్డీఎఫ్సీ కరెన్సీ చెస్ట్ నుంచి రూ.7.11 కోట్ల విలువైన కరెన్సీ కట్టలను తీసుకుని వేర్వేరు ఏటీఎంలలో నింపేందుకు బయల్దేరిన సీఎంఎస్ ఇన్నో సిస్టమ్స్ వారి ఏటీఎం క్యాష్వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అశోకా పిల్లర్ వద్ద అడ్డగించారు. ప్రభుత్వ స్టిక్టర్ అంటించి ఉన్న ఖరీదైన ఎస్యూవీ వాహనంలో దిగిన ఆ దొంగలు తాము ఆర్బీఐ ఉన్నతాధికారులమంటూ నమ్మబలికారు. డాక్యు మెంట్లను వెంటనే క్షుణ్ణంగా తనిఖీ చేయాలంటూ కస్టోడియన్ అఫ్తాబ్, గన్మెన్ రాజన్న, తమ్మయ్యలనూ తమ వాహనంలోకి ఎక్కించుకున్నారు. తమ వాహనాన్ని అనుసరించాలని ఏటీఎం క్యాష్ వాహన డ్రైవర్కు సూచించారు. డైరీ సర్కిల్ ఫ్లైఓవర్ వద్దకు రాగానే పిస్టల్ చూపించి డ్రైవర్ను బెదిరించి కరెన్సీ కట్టలు తీసుకుని ఉడాయించారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ దొంగతనంలో దాదాపు ఆరుగురు దొంగలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. -
పని చేసేవారు ఒకరు.. లాభపడేవారు మరొకరు
నవంబర్ 20.. కర్ణాటక రాజకీయాల్లో కీలక దినంగా మారనుందా?. కాంగ్రెస్ ప్రభుత్వం సగం ఏడాది పూర్తి చేసుకుంటున్న తరుణంలో.. నాయకత్వ మార్పు ఉంటుందా? లేదా? అనే చర్చ జోరుగా నడుస్తోంది. ఈ దరిమిలా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఏమైనా సంచలన ప్రకటన చేస్తారా? అని రాజకీయ వర్గాలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి. నాయకత్వ మార్పు ప్రచారంపై డీకే శివకుమార్ ఎప్పటికప్పుడు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాను కరడుగట్టిన.. నిబద్ధత కలిగిన కాంగ్రెస్ కార్యకర్తనని చెబుతూనే.. కష్టపడి వాళ్లకు, త్యాగాలు చేసేవాళ్లకు ఆశలు ఉండడం సహజమంటూ ప్రకటనలు ఇస్తూ వస్తున్నారాయన. అయితే సీఎం మార్పు సంగతి ఏమోగానీ.. ఈలోపే డీకే శివకుమార్ మరో బాంబ్ పేల్చారు. టీపీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఇవాళ ఇందిరా గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు. మనుషులు రెండు రకాలు ఉంటారు. ఒకరు పని చేస్తే.. మరొకరు లాభపడుతుంటారు. మొదటి రకంగా ఉండాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలకు దివంగత ఇందిరా గాంధీ పిలుపు ఇస్తూ ఉండేవారు. పీసీసీ చీఫ్గా ఐదున్నరేళ్లు పూర్తి చేసుకున్నా. అలాగని శాశ్వతంగా ఆ పదవిలో కొనసాగలేను. మరొకరికి ఆ అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే కార్యకర్తలకు ఒక నాయకుడిగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను అని వ్యాఖ్యానించారాయన. ఇదిలా ఉంటే.. తాజాగా ఢిల్లీ పర్యటనలో పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారాన్ని డీకే శివకుమార్ తోసిపుచ్చారు. అలాంటిదేం ఉండబోదని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలదాకా తానే ఆ పదవిలో ఉంటానని.. పార్టీని గెలిపించుకుని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తానని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లి అధిష్టానాన్ని కలిసి వచ్చారు. ఏం జరిగిందో తెలియదుగానీ.. ఇవాళ ఆ పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానంటూ డీకే శివకుమార్ ప్రకటించడం గమనార్హం. 2026 మార్చికి శివకుమార్ పీసీసీ పదవీకాలం ఆరేళ్లు పూర్తి కానుంది. అయితే.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుచరులు కొత్త పీసీసీ చీఫ్ను చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ రేసులో సతీష్ జర్కీహోళీ, మంత్రి ఈశ్వర ఖాంద్రే పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ అంశంపై రేపు(గురువారం) స్పష్టమైన ప్రకటన ఉంటుందని మాజీ ఎంపీ డీకే సురేష్ చెబుతున్నారు. ఇంకోపక్క.. డీకే శివకుమార్ వర్గీయుడు ఎమ్మెల్యే హచ్డీ రంగనాథ్ సిద్ధరామయ్య ప్రభుత్వం బాగా పని చేస్తోందని.. అంతా సవ్యంగానే ఉందంటూ వ్యాఖ్యానించడంతో నాయకత్వ మార్పు ఉండకపోవచ్చనే కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. 2023 మే నెలలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ సమయంలో సీఎం సీటు కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే.. పవర్ షేరింగ్ ఫార్ములా కింద వీళ్లిద్దరినీ కాంగ్రెస్ అధిష్టానం ఒప్పించిందని.. చెరో రెండున్నరేళ్లు సీఎంలుగా ఉంటారనే ప్రచారం నడిచింది(ఇద్దరూ దానిని ఖండించారు కూడా). అదే సమయంలో.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకునేందుకు డీకే శివకుమార్ సిద్ధపడ్డారు. అయితే.. ఖర్గే, రాహుల్ గాంధీ వద్దని సూచించడంతో ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. మరోపక్క లోక్సభ ఎన్నికల దాకా డీకేనే పీసీసీ చీఫ్గా కొనసాగుతారని పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. -
ఇన్వెస్టర్ల క్యూ : కొత్త ఐటీ నగరం వచ్చేస్తోంది!
కర్ణాటకలో మరో కొత్త ఐటీ నగరం రూపుదిద్దుకోబోతోంది. బిడది (Bidadi)లో కొత్త ఐటీ నగరాన్ని నిర్మించ నున్నామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకె శివకుమార్ (DK Shivakumar) చెప్పారు. అనేక దేశాల నాయకులు ఇటీవల బెంగళూరు సందర్శించారని, భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి ఉత్సాహంగా డిప్యూటీ సీఎం ఉన్నారని చెప్పారు. బెంగళూరు టెక్ సమ్మిట్ 2025 సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.బెంగళూరు-మైసూరు ఎక్స్ప్రెస్వేలో ఉన్న బిడదిలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఐటీ నగరాన్ని ప్లాన్ చేస్తోందని డీకే ప్రకటించారు. గ్రేటర్ బెంగళూరు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ (GBIT) ప్రాజెక్ట్ అంతర్జాతీయ వ్యాపారవేత్తలను ఆకర్షిస్తోందని, గణనీయమైన పెట్టుబడులకు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. ఈ పెట్టుబడులను తాము స్వాగతిస్తున్నట్టు చెప్పారు.చదవండి: ఎనిమిదేళ్లనాటి దారుణ హత్యలు : క్లూ ఇచ్చిన ల్యాప్ట్యాప్60 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సమ్మిట్ మూడు రోజుల పాటు ఐటీ భవిష్యత్తుపై చర్చిస్తుందన్నారు. కర్ణాటకలోని నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి,అభివృద్ధి చెందుతున్న స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థ యొక్క బలాలను నొక్కిచెప్పారు. "స్థానిక ప్రతిభ, ఆవిష్కరణ, సాంకేతికత మరియు స్టార్ట్-అప్లను సరిగ్గా ప్రోత్సహిస్తే కర్ణాటకను కొత్త దిశలో తీసు కెళతాయన్నారు. ప్రపంచ స్థాయిలో పోటీ పడాలని తానెపుడూ యువను కోరుతూ ఉంటానన్నారు. అలాగే అవకాశాలను కోరుతూ కర్ణాటకకు వచ్చే వారికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. ఈ సందర్బంగా ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే , కియోనిక్స్ అధిపతి శరత్ బచ్చే గౌడల కృషిని ఆయన ప్రశంసించారు, బెంగళూరు నగరాన్ని ఈ రంగంలో అగ్రగామిగా మార్చడానికి నగర 25 లక్షల ఐటీ నిపుణుల సహకారాన్ని ఆయన కొనియాడారు.ప్రపంచంలో ఇంతటి ప్రతిభ మరెక్కడా లేదని పేర్కొన్నారు శివకుమార్.ఇదీ చదవండి: H-1B వీసాలు ట్రంప్ దెబ్బ : టాప్లో ఆ కంపెనీల జోరు -
రవిచంద్రన్ డబుల్ సెంచరీ.. కర్ణాటక ఘనవిజయం
రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’లో కర్ణాటక జట్టు రెండో విజయం నమోదు చేసుకుంది. చండీగఢ్తో మంగళవారం ముగిసిన పోరులో కర్ణాటక ఇన్నింగ్స్, 185 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓవర్నైట్ స్కోరు 72/4తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన చండీగఢ్... 63.2 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మనన్ వోహ్రా (161 బంతుల్లో 106 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేయగా... తక్కిన వాళ్లంతా విఫలమయ్యారు. కర్ణాటక బౌలర్లలో శ్రేయస్ గోపాల్ 7 వికెట్లతో సత్తా చాటాడు. దీంతో తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం దక్కించుకున్న కర్ణాటక జట్టు... ప్రత్యరి్థని ఫాలోఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్లోనూ అదే వైఫల్యం కొనసాగించిన చండీగఢ్ 33.5 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. శివమ్ బాంబ్రీ (43) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ మనన్ వోహ్రా (6) సహా మిగిలిన వాళ్లంతా ఒకరి వెంట ఒకరు పెవిలియన్కు క్యూ కట్టారు. కర్ణాటక బౌలర్లలో శ్రేయస్ గోపాల్ 3, శిఖర్ శెట్టి 5 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు కర్ణాటక తొలి ఇన్నింగ్స్ను 547/8 వద్ద డిక్లేర్ చేసింది. డబుల్ సెంచరీతో చెలరేగిన కర్ణాటక బ్యాటర్ రవిచంద్రన్ స్మరణ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు ఆడిన కర్ణాటక 2 విజయాలు, 3 ‘డ్రా’లతో 21 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. షాబాజ్ అహ్మద్ సెంచరీ ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్ (122 బంతుల్లో 101; 11 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా అస్సాంతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘సి’ మ్యాచ్లో బెంగాల్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 109.1 ఓవర్లలో 442 పరుగులకు ఆలౌటైంది. సుమంత గుప్తా (97) మూడు పరుగుల తేడాతో శతకం చేజార్చుకున్నాడు. టీమిండియా ప్లేయర్ మొహమ్మద్ షమీ (14 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అస్సాం జట్టు... మూడో రోజు ఆట ముగిసే సమయానికి 38 ఓవర్లలో 3 వికెట్లకు 98 పరుగులు చేసింది. షమీ (2/29) వరుస ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టి అస్సాంను కట్టడి చేశాడు. నేడు ఆటకు ఆఖరి రోజు కాగా... చేతిలో 7 వికెట్లు ఉన్న అస్సాం ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరు సమం చేసేందుకే ఇంకా 144 పరుగులు చేయాల్సి ఉంది. విహారి, విజయ్ విఫలం రంజీ ట్రోఫీలో త్రిపుర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత ఆటగాళ్లు హనుమ విహారి, విజయ్ శంకర్ మరోసారి విఫలమయ్యారు. ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా రైల్వేస్తో జరిగిన పోరులో ఈ ఇద్దరూ విఫలమయ్యారు. రెండో ఇన్నింగ్స్లో విహారి 42 బంతులాడి 6 పరుగులు చేయగా... విజయ్ శంకర్ (11) కూడా ఫ్రభావం చూపలేకపోయాడు. దీంతో త్రిపుర రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా రైల్వేస్ జట్టు ఇన్నింగ్స్ 117 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు త్రిపుర తొలి ఇన్నింగ్స్లో 136 పరుగులే చేయగా... రైల్వేస్ 446/9 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రాజ్ చౌదరీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. సౌరాష్ట్రతో మ్యాచ్లో గోవా పోరాడుతోంది. సౌరాష్ట్ర 585/7 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా... గోవా జట్టు తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. మధ్యప్రదేశ్తో మ్యాచ్లో కేరళ జట్టు 315 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 192 పరుగులకు ఆలౌట్ కాగా... కేరళ రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. సచిన్ బేబీ (85 బ్యాటింగ్), బాబా అపరాజిత్ (89 బ్యాటింగ్) అజేయ అర్ధశతకాలతో రాణించారు. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా పాండిచ్చేరితో మ్యాచ్లో ముంబై జట్టు విజయానికి చేరువైంది. ముంబై 630/5 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా... పాండిచ్చేరి తొలి ఇన్నింగ్స్లో 132 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. రాజస్తాన్తో మ్యాచ్లో ఢిల్లీ జట్టు తొలి ఇన్నింగ్స్లో 296 పరుగులకు ఆలౌటైంది. 570/7 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన రాజస్తాన్కు 274 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. విదర్భతో జరుగుతున్న మ్యాచ్లో బరోడా జట్టు విజయానికి 203 పరుగుల దూరంలో ఉంది. విదర్భ తొలి ఇన్నింగ్స్లో 169 పరుగులు చేయగా... బరోడా 166 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో విదర్భ 272 పరుగులు చేసి బరోడా ముందు 276 పరుగుల లక్ష్యం నిలిపింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బరోడా రెండో ఇన్నింగ్స్లో 32 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో టీమిండియా ప్లేయర్ రింకూ సింగ్ (157 బంతుల్లో 98 బ్యాటింగ్; 9 ఫోర్లు, 3 సిక్స్లు) పోరాడటంతో ఉత్తర ప్రదేశ్ జట్టు 113 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో తమిళనాడు జట్టు 455 పరుగులకు ఆలౌట్ కాగా... ఉత్తరప్రదేశ్ ప్రస్తుతం 116 పరుగులు వెనుకబడి ఉంది. -
ట్రాఫిక్ కానిస్టేబుల్గా ఎమ్మెల్యే.. రెండు గంటలు డ్యూటీ
బెంగళూరు: బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సురేష్ కుమార్ మంగళవారం ట్రాఫిక్ పోలీస్ అవతార మెత్తారు. నగరంలోని భాష్యం సర్కిల్ దగ్గర రెండు గంటలపాటు ట్రాఫిక్ పోలీస్గా విధులు నిర్వహించారు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ప్రారంభించిన ‘ట్రాఫిక్ కాప్ ఫర్ ఎ డే’అనే వినూత్న ప్రయోగంలో భాగంగా ఆయన ట్రాఫిక్ కానిస్టేబుల్ పాత్ర పోషించారు.ట్రాఫిక్ పోలీసు జాకెట్ ధరించిన ఆయన, ఇతర పోలీసు సిబ్బందితో కలిసి పనిచేశారు. ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు ట్రాఫిక్ నిర్వహించడంతోపాటు వారితో సంభాషించారు. సిగ్నల్ కంట్రోల్ పోస్ట్ను నిర్వహించిన ఆయన.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారిని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ‘ఒక రోజు ట్రాఫిక్ కానిస్టేబుల్గా పనిచేయడం నాకు మంచి అనుభవం. ఈ పనిని నేను ఆస్వాదించాను. బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల ఈ చొరవ స్వాగతించదగినది.’ అని ఆయన ఫేస్బుక్లో పేర్కొన్నారు. అంతేకాదు, ఇక నుంచి ప్రతి సోమవాకం ఒక గంట పాటు ట్రాఫిక్ నిర్వహణలో పోలీసులకు సహాయం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.‘ఈ రోజు నాకు ఒక పండుగలా ఉంది. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నారా? వాటికి ఎలా స్పందిస్తున్నారు? వంటి విషయాలను వ్యక్తిగతంగా తెలుసుకున్నాను. ఇది జీవితంలో మంచి అనుభవం’ ఓ వీడియోలో పేర్కొన్నారు. ట్రాఫిక్ నిర్వహణలో పోలీసులకు సహకరించాలనుకునే పౌరులకు ‘బీటీపీ ఏఎస్టీఆర్ఏఎమ్’ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకునే అవకాశాన్ని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు కల్పించారు. ఇందులో నమోదు చేసుకున్న పౌరులు ఆ పరిధిలోని స్టేషన్ అధికారులు లేదా సిబ్బందితో కలిసి పనిచేసే అవకాశాన్ని అందిస్తుంది. -
కర్ణాటక ప్రభుత్వ ఆవిష్కరణ!
డిజిటల్ యుగంలో కర్ణాటక ప్రభుత్వం భారీ ఆవిష్కరణ చేసింది. అత్యంత చౌకైన ఏఐ పర్సనల్ కంప్యూటర్ను అభివృద్ధి చేసింది. KEO (Knowledge-driven, Economical, Open-source) పేరుతో తయారైన ఈ కంప్యూటర్ డిజిటల్ అంతరాలను తగ్గించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని అంచనా. త్వరలో జరగబోయే టెక్ సదస్సులో ఈ అత్యంత చౌక ఏఐ పీసీని ఆవిష్కరించనున్నట్లు కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి...దేశం ఐటీ రంగంలో దూసుకెళుతున్నప్పటికీ సమాజంలోని అన్ని వర్గాల వారికీ అందుబాటులో లేదు. పర్సనల్ కంప్యూటర్లనే ఉదాహరణగా తీసుకుంటే దేశం మొత్తమ్మీద పీసీలున్న కుటుంబాలు పది-15 శాతానికి మించవని ఇటీవలి జాతీయ కుటుంబ సర్వే చెబుతోంది. పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రతి నాలుగు కుటుంబాల్లో ఒకరికి పీసీ ఉంటే.. పల్లెల్లో ఇది ఐదు నుంచి ఏడు శాతం మించడం లేదు. స్మార్ట్ఫోన్లపైనే ఆధారపడుతున్నారు. ఫలితంగా ఉద్యోగాలతోపాటు అన్ని రంగాల్లోనూ గ్రామీణులు నగర వాసులతో పోటీ పడలేని పరిస్థితి ఏర్పడుతుంది. నగరాల్లోని విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు, విషయ పరిజ్ఞానాన్ని పెంచే ఇతర డిజిటల్ టూల్స్ అందుబాటులో ఉంటున్నాయి. వీటన్నింటినీ అందించే పీసీలు కొనలేక గ్రామీణ విద్యార్థులు వెనుకబడి పోతున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం అభివృద్ధి చేసిన KEO ఏఐ పర్సనల్ కంప్యూటర్కు ప్రాధాన్యం ఏర్పడుతోంది. ఈ పీసీలో కృత్రిమ మేథ కోసం ప్రత్యేక కోర్ ఉండటం గమనార్హం. RISC-V ప్రాసెసర్, BUDDH అనే ఆన్-డివైస్ AI ఇంజిన్ ఆధారంగా పనిచేస్తుంది.అత్యంత చౌకైన పీసీగా రూపొందుతున్న దీంట్లో 4జీ కనెక్టివిటీతోపాటు ఈథర్నెట్ కూడా ఉంటుంది. యూఎస్బీ ఏ, యూఎస్బీ-సీ, హెచ్డీఎంఐ పోర్టులు, ఆడియో జాక్లు ఉంటాయి. అంతేకాకుండా.. కంప్యూటర్ ప్రోగ్రామింగ్తోపాటు వర్డ్, ఎక్సెల్ వంటి ప్రొడెక్టివిటీ టూల్స్ను కూడా ముందుగానే ఏర్పాటు చేసి ఉంచారు. ఏఐ ఇంజిన్ బుధ్ను కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే రూపొందించిన ఆఫ్లైన్ సిలబస్తో అనుసంధానమై ఉంటుంది. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 15 శాతం లోపు ఇళ్లలో మాత్రమే కంప్యూటర్లు ఉన్నాయని, దాదాపు 60 శాతం విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు, ఇతరత్ర ప్రాజెక్టుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కర్ణాటక ప్రభుత్వ అధికారులు తెలిపారు. దాదాపు 45శాతం పాఠశాలలలో అసలు కంప్యూటర్లే లేవని దీంతో విద్యార్థులు డిజిటల్ సాంకేతికతను అందిపుచ్చుకోవడం లేదన్నాయి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని తక్కువ ఖర్చులో కంప్యూటర్ను అందించడానికి KEONICS సాయం తీసుకున్నట్లు వివరించారు.ఇది కేవలం విద్యార్థులకు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలకు ఉపయోగపడుతుందని తెలిపారు. -
రూ. 30 లక్షలతో రిటైన్.. కట్ చేస్తే! ఎస్ఆర్హెచ్ బ్యాటర్ డబుల్ సెంచరీ
రంజీ ట్రోఫీ 2025/26 సీజన్లో కర్ణాటక స్టార్ బ్యాటర్ స్మరణ్ రవిచంద్రన్ అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. హుబ్లీ వేదికగా చండీగఢ్తో జరుగుతున్న ఎలైట్ గ్రూప్ బి మ్యాచ్లో రవిచంద్రన్ అజేయ డబుల్ సెంచరీతో చెలరేగాడు. స్మరణ్ 362 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్లతో 227 పరుగులు చేశాడు. ఈ సీజన్లో ఇది అతడికి రెండో ద్విశతకం కావడం గమనార్హం. అంతకుముందు కేరళతో జరిగిన మ్యాచ్లోనూ డబుల్ సెంచరీ సాధించాడు. ఓవరాల్గా స్మరణ్కు ఇది మూడో ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీ. ఈ మ్యాచ్లోనే అతడు 1,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఫీట్ను కేవలం 13 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లలోనే సాధించడం విశేషం.రవిచంద్రన్ డబుల్ సెంచరీ ఫలితంగా కర్ణాటక తమ తొలి ఇన్నింగ్స్ను 547/8 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. స్మరణ్తో పాటు కరుణ్ నాయర్(95), శ్రేయస్ గోపాల్(62), శిఖర్ శెట్టి(59) హాఫ్ సెంచరీలతో రాణించారు. చండీఘడ్ బౌలలర్లలో జగజీత్ సింగ్, విషు తలా రెండు వికెట్లు సాధించారు.ఎస్ఆర్హెచ్లో స్మరణ్..ఐపీఎల్లో స్మరణ్ రవిచంద్రన్ సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.. గత సీజన్లో గాయపడిన ఆడమ్ జంపా స్థానంలో స్మరణ్ను ఎస్ఆర్హెచ్ తమ జట్టులోకి తీసుకుంది. అతని బేస్ ధర రూ. 30 లక్షలకు సొంతం చేసుకుంది. అయితే ప్రాక్టీస్ సెషన్లో స్మరణ్ గాయపడడంతో సీజన్ మధ్యలోనే వైదొలిగాడు. అతడి స్దానంలో హర్ష్ దూబేకి అవకాశం దక్కింది. అయితే ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు సన్రైజర్స్ అతడిని రిటైన్ చేసుకుంది.చదవండి: 'ఏమి చేయాలో అతడికి తెలుసు.. మధ్యలో నీ జోక్యమెందుకు' -
నవంబర్ 20 ఆ.. అదేంటో జ్యోతిష్కుడిని అడగండి
సాక్షి, బెంగళూరు/ ఢిల్లీ: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మరోసారి మీడియా ముందు తన అసహనం వ్యక్తం చేశారు. ఆశలు కలిగి ఉండడంలో తప్పేముంది? అంటూ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో నాయకత్వ మార్పు ఊహాగానాలు జోరందుకున్న వేళ.. ఆయన వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి ఇప్పుడు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్లు.. త్యాగాలు చేసినవాళ్లు ఆశలు పెట్టుకోవడం సహజం. అందులో తప్పేముంది? అని మీడియాను ఉద్దేశించి శివకుమార్ వ్యాఖ్యానించారు. నవంబర్ 20న నాయకత్వ మార్పు ప్రకటన ఉంటుందా? అనే ప్రశ్నకు.. అదేంటో జ్యోతిష్యుడినే అడగాలంటూ వ్యాఖ్యానించారాయన. అయితే.. నవంబర్ క్రాంతి, భ్రాంతి అలాంటేవీ లేవని కర్ణాటక కాంగ్రెస్ నేతలు చెబుతున్నప్పటికీ.. తెరవెనుక మాత్రం భిన్నమైన ఆట సాగుతోంది. ఈ ఊహాగానాలన్నింటికీ నవంబర్ 20 డెడ్లైన్గా కనిపిస్తోంది. ఆ రోజుకు సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన కాలాన్ని పూర్తి చేసుకోనుంది. ఈ రెండున్నరేళ్ల కాలంలో ఇతర విషయాల కంటే కూడా ముఖ్యమంత్రి మార్పు అంశమే ఎంతో ముఖ్యమైన చర్చనీయాంశంగా మారింది. సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ల ప్రకటనలు, ఢిల్లీ యాత్రలు మరింత సెగలను రాజేశాయి. అంతటా సస్పెన్స్ నవంబర్ 20లోగానే రాజకీయ పెను మార్పులు సంభవిస్తాయని కొందరి వాదన అయితే, అలాంటిది ఏదీ ఉండకపోవచ్చని సీఎం వర్గీయులు చెబుతున్నారు. కానీ వారిలోనూ సస్పెన్స్ కలుగుతోంది. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి తన పీఠాన్ని భద్రం చేసుకోవడంతో పాటు అనుచరులకు మంత్రి పదవులు కట్టటెట్టి శివకుమార్ వర్గానికి పెద్ద షాక్ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 20 నుంచి రాహుల్ గాంధీ ముందు రెండు వర్గాలు తమ బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనే ఆసక్తి నెలకొంది. ఈ పరిణామాల మధ్య కర్ణాటకలో అధికారాన్ని నిలుపుకోవడంతో పాటు ప్రభుత్వాన్ని సజావుగా నడిపించడం రాహుల్గాంధీ శిబిరానికి అగి్నపరీక్ష అయ్యింది. ఢిల్లీలో డీకే మంత్రాంగం డీసీఎం డీ.కే.శివకుమార్ ఢిల్లీలో పార్టీ అగ్రనేత రాహుల్గాంధీని కలిశారు. సీఎం పదవి, మంత్రి పదవుల పంపిణీ గురించి, పార్టీ అంశాల మీద ఆయన చర్చించినట్లు చర్చ నడుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలిశారు. ఆ సమయంలో సోదరుడు డీకే సురేశ్ను ఆయన వెంటబెట్టుకెళ్లారు. ఖర్గేతో సుమారు 50 నిమిషాల పాటు చర్చలు జరిపారు. తన చేతిలో ఉన్న కేపీసీసీ అధ్యక్ష స్థానం చేజారకుండా డీకే పావులు కదపడంతో పాటు, ముఖ్యమంత్రి పదవి గురించి మనసులో మాట చెప్పారు. కాగా, సోమవారం ఢిల్లీలో సీఎం సిద్దరామయ్యను కూడా డీకే శివ కలిసి మాట్లాడి, ఆపై బెంగళూరుకు పయనమయ్యారు. వెంటనే సిద్దూ కూడా..మంత్రిమండలి ప్రక్షాళన ముందుకు రావడంతో రాష్ట్ర కాంగ్రెస్లో కార్యకలాపాలు ఊపందుకున్నాయి. సీఎం సిద్దరామయ్య సోమవారం ఢిల్లీకి వెళ్లే ముందుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనతో వరుసగా భేటీ అయ్యారు. అందులో అనేకమంది మంత్రి పదవుల ఆకాంక్షులు ఉన్నట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు ప్రదీప్ ఈశ్వర్, అశోక్ పట్టణ్, కాశప్పనవర్, ఏ.ఎస్.పొన్నణ్ణ, కే.ఎస్.రాజణ్ణ తదితరులు ఉన్నారు. రాజణ్ణతో చాలాసేపు మాట్లాడడం కుతుహలానికి దారితీసింది. ఓట్ చోరీ గురించి రాజణ్ణ వ్యతిరేకంగా మాట్లాడి మంత్రి పదవిని పోగొట్టుకోవడం తెలిసిందే. తన గురించి నాయకత్వానికి మంచిగా చెప్పాలని సిద్దరామయ్యను కోరినట్లు తెలిసింది. ఎమ్మెల్యే విజయానంద కాశప్పనవర్ మంత్రి పదవి ఇవ్వాలని మరీ మరీ కోరారు. ఢిల్లీకి వెళ్లాక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సీఎం కలిసినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మార్పు వంటిది ఉండకుండా చూడాలని, ఆ మేరకు హైకమాండ్ను ఒప్పించాలని కోరినట్లు సమాచారం. -
ఫేక్ మైక్రోసాఫ్ట్ టెక్ సపోర్ట్ : అమెరికన్లకే భారీ మొత్తంలో టోపీ
కర్ణాటకలోని బెంగళూరులో ఇటీవల వెలుగులోకి వస్తున్న సైబర్ నేరాల కేసులు ఆందోళన రేపుతున్నాయి. డిజిటల్ అరెస్ట్ అంటూ జనాలను బెదిరించి, కోట్ల రూపాయలుదండుకుంటున్న వైనం కలకలం రేపుతోంది. తాజాగా మైక్రోసాఫ్ట్ టెక్ సపోర్ట్ అంటూ ఒక ముఠా రెచ్చిపోయింది. అమెరికన్ల నుంచి కోట్లాది రూపాయలను కాజేసింది.టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం హానికరమైన ఫేస్బుక్ ప్రకటనలు చేశారని అమెరికన్ వినియోగదారులను నమ్మించడమే కాదు, భద్రతా హెచ్చరికలు , సర్వీస్ లింక్స్ అంటూ వారిని మభ్యపెట్టింది. 'మైక్రోసాఫ్ట్ టెక్నీషియన్ల’ పేరుతో బెంగళూరుకు ఒక ముఠా అమెరికన్లకు భారీగా దోచేసింది.కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని వారి భయపెట్టి, ఫేక్ సేఫ్టీ సొల్యూషన్స్, నకిలీ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) సమ్మతి విధానం అంట వారిని నమ్మించి కోట్ల రూపాయలను వారినుంచి రాబట్టింది సైబర్ నేరస్థుల ముఠా.ఎలా అంటే ఒక యూజర్ ప్రకటనపై క్లిక్ చేసిన తర్వాత, కోడ్ కంప్యూటర్ను స్తంభింపజేసి, మైక్రోసాఫ్ట్ గ్లోబల్ టెక్నికల్ సపోర్ట్ నుండి వచ్చినట్లుగా ఒక ఫేక్ మెసేజ్ పాప్-అప్ అవుతుంది. దీనిమీద నకిలీ హెల్ప్లైన్ నంబర్ కూడా డిస్ప్లే అవుతుందని సీనియర్ ఒకరు అధికారి చెప్పారు. బాధితుడు ఆ నంబర్కు కాల్ చేయడానే వీళ్ల కపట దందాకు తెరలేస్తుంది. మైక్రోసాఫ్ట్ టెక్నీషియన్లుగా నటిస్తున్న మోసగాళ్ళు సిస్టం హ్యాక్,ఐపీ అడ్రస్ హ్యాక్ అయింని, దీంతో బ్యాంకింగ్ డేటా ప్రమాదంలో పడిందని బెదిరించారు. దీనికి పరిష్కారంగా ఫేక్ సేఫ్టీ సెక్యూరిటీ పేరుతో భారీ మొత్తంలో డబ్బులు దండుకున్నారు. అమెరికాలో ఉంటున్న అనుమానాస్పద పౌరులను లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలతో నగరానికి చెందిన సైబర్ క్రైమ్ సిండికేట్తో సంబంధం ఉన్న 21 మందిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక కోర్టు ముందు హాజరుపరిచారు, వారిని పోలీసు కస్టడీకి తరలించారు.ఈ ముఠా నకిలీ "ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC)" ఉల్లంఘనలను ఉదహరించి అనేక కోట్ల రూపాయలు దోచుకుంది. సైబర్ కమాండ్ స్పెషల్ సెల్, వైట్ఫీల్డ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు చెందిన బృందాలు సిగ్మా సాఫ్ట్ టెక్ పార్క్లోని డెల్టా భవనంలోని ఆరవ అంతస్తులో ఉన్న మస్క్ కమ్యూనికేషన్స్ కార్యాలయంపై దాడి చేసినట్టు తెలుస్తోంది. సెర్చ్ వారెంట్తో శుక్రవారం మరియు శనివారం నిర్వహించిన ఈ ఆపరేషన్లో కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు, మొబైల్ ఫోన్లు, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.దీనిపై ఆఫీసు యజమాని పాత్రపై కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. -
ఆర్బీఐ, సీబీఐ అంటూ.. 6 నెలల్లో రూ. 32 కోట్లు!
డిజిటల్ అరెస్ట్ స్కామ్లో బెంగళూరుకు చెందిన ఒక మహిళ దారుణంగా మోసపోయింది. సైబర్ క్రైమ్ విభాగం, ఆర్బీఐ, సీబీఐ అంటూ నెల రోజులు పాటు వేధించి కోట్ల రూపాయలను దోచుకున్నారు.బెంగళూరుకు చెందిన 57 ఏళ్ల మహిళ ‘‘డిజిటల్ అరెస్ట్" స్కామ్లో చిక్కుకుంది. నెల రోజులపాటు ఆమెను వర్చువల్ కస్టడీకి పరిమితం చేశారు సైబర్ నేరగాళ్లు. కొరియర్ DHL సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సీనియర్ అధికారులం అంటూ నమ్మించి భయ భ్రాంతురాల్ని చేశారు.నవంబర్ 14న దాఖలు చేసిన FIR ప్రకారం 2024 సెప్టెంబర్ 15న ఆమెకు ఒక కొరియర్ వచ్చినట్టు వ్యక్తి నుండి కాల్ వచ్చింది. ముంబైలోని అంధేరి నుండి ఆమె పేరు మీద బుక్ చేసుకున్న ప్యాకేజీలో నాలుగు పాస్పోర్ట్లు, మూడు క్రెడిట్ కార్డులు , MDMA వంటి నిషేధిత వస్తువులు ఉన్నాయని చెప్పాడు. అయితే తాను ముంబైకి ప్రయాణించలేదని మొత్తుకుంది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఇది సైబర్ క్రైమ్ కేసు కిందికి వస్తుందని భయపెట్టారు. ఏంజరిగిందో ఆలోచించుకునే లోపే సీబీఐ అధికారులు అంటూ మరో కాల్ వచ్చింది. మీరు పెద్ద నేరమే చేశారు, మిమ్మల్ని అరెస్టు చేస్తామని బెదిరించారు. దీనికి సంబంధించి తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని ఆరోపించారు . అంతేకాదు దీనిపై స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకూడదని కూడా హెచ్చరించారు. రెండు రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. దుర్భాషలాడారు. ఆమె ఫోన్ యాక్టివిటీ , లొకేషన్ గురించి తెలుసని, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలంటే తాము చెప్పినట్టు చెయ్యాలని పట్టుబట్టారు. నకిలీ సీబీఐ ఆఫీసర్లు, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నకిలీ లేఖలను కూడా సమర్పించారు. స్కైప్ ద్వారా రోజువారీ నిఘాలో ఉంచారు. దీంతో కుటుంబ భద్రతకు భయపడి, బాధితురాలు ఆమె అడిగిన డబ్బును చెల్లించేందుకు ఒప్పుకుంది.దీన్నుంచి బయట పడాలంటే RBI కింద ఉన్న ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU) ద్వారా ధృవీకరణ కోసం ఆమె ఆస్తులు, బ్యాంకు ఖాతాలను వివరాలను సమర్పించడం ఒక్కటే ఏకైక మార్గమని చెప్పారు. చెప్పబడింది. సెప్టెంబర్ 24-అక్టోబర్ 22, 2024 మధ్య అన్ని బ్యాంకు వివరాలను అందజేసింది. ఈ ఆస్తులకు 90 శాతం క్లియరెన్స్ కావాలంటే కొంత సొమ్మును డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ తరువాత దీనికి అదనంగా రూ. 2 కోట్లు పూచీకత్తుగా డిపాజిట్ చేయాలని, పన్నులు ఇంకొంత సొమ్మును లాక్కున్నారు. ఇలా మొత్తంగా, 187 లావాదేవీల్లో ఆ మో రూ. 31.83 కోట్ల విలువైన డబ్బును బదిలీ చేసింది. ఈ స్కామ్ ప్రధానంగా ఆమె మొబైల్ నంబర్కు కాల్స్, నిరంతర పర్యవేక్షణ ద్వారా జరిగింది.డిసెంబర్ 1 ఆమెకు నకిలీ క్లియరెన్స్ లెటర్ వచ్చింది. దీంతో డిసెంబర్ 6న ఆమె కొడుకు నిశ్చితార్థాన్ని కార్యక్రమాన్ని ముగించింది. కానీ విపరీతమైన మానసిక, శారీరక ఒత్తిడికి లోనైంది. ఫలితంగా నెలరోజుల పాటు అనారోగ్యానికి గురైంది. 2025 ప్రారంభం దాకా స్కామర్ల దందా కొనసాగింది. అడిగిన ప్రతీసారి డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి వచ్చేస్తామని హామీ ఇస్తూనే వచ్చారు. చివరికి 2025 మార్చిలో అకస్మాత్తుగా వారి మొత్తం కమ్యూనికేషన్ బంద్ అయింది. ఒక వైపు తన అనారోగ్యం, మరోవైపు కొడుకు పెళ్లి, కారణంగా ఆలస్యంగా ఫిర్యాదు చేసినట్టు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఈ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
చెట్ల అవ్వ వెళ్ళిపోయింది
చెట్టు అంటే ఏమిటి? అది ప్రాణవాయువు. అది ఆకు కొమ్మ ఫలం. అది పువ్వు. అది నీడ. అది గూడు. అది గుర్తు. చెట్టు బతికితే మనిషి బతుకుతాడు. జీవితాంతం చెట్లు నాటుతూ బతికిన సాలుమరద తిమ్మక్క 114 ఏళ్ల వయసులో కన్ను మూశారు. పచ్చటి సందేశమై ఆమె మనకు కర్తవ్యాన్ని బోధపరుస్తూనే ఉంటారు.వృక్షో రక్షతి రక్షితః... ఇది కొందరికి ఒట్టి వేదవాక్కు. కాని ‘సాలుమరద’ తిమ్మక్కకు అది జీవనవేదం. చెట్లను తన బిడ్డలుగా భావించి, వాటిని పెంచి పోషించిన ఆ చెట్ల అవ్వ ఇక లేరు. సాలుమరద అంటే చెట్ల వరుస అని కన్నడంలో అర్థం. ప్రజలు ఇచ్చిన ఇంటి పేరును తన పేరులో కలుపుకున్న కర్ణాటకకు చెందిన సాలుమరద తిమ్మక్క శుక్రవారం కన్నుమూశారు. అల్లారుముద్దుగా తమను పెంచిన ఆ తల్లి తరలిపోగా వృక్షాలన్నీ మౌనంగా దుఃఖిస్తున్నాయి.ఆ వనంలాంటి రోడ్డుకర్ణాటక రాష్ట్రం రామనగర జిల్లాలోని కూడూర్–హలికల్ మధ్యనున్న స్టేట్ హైవే నం.94లో ఉన్న మర్రిచెట్లను ఓమారు పలకరించండి. 4.5 కిలోమీటర్ల దూరం వరకూ ఆ రోడ్డుకు అటూ ఇటూ భారీగా ఎదిగిన ప్రతిచెట్టు తమ బతుకు వెనుక తిమ్మక్క ఉందని చెప్తుంది. ఎన్నో విషయాలు వివరిస్తుంది. నీరు దొరకడమే గగనమైన ఆనాటి రోజుల్లో ఒక్కో మొక్కకు నీరు పోసి, పెంచి, బాగోగులు చూసి వాటిని కంటికి రెప్పలా కాపాడిన తిమ్మక్క, చిక్కయ్య దంపతుల గొప్పతనం అక్కడున్న ప్రతి చెట్టు తెలియజేస్తుంది. మొత్తం 385 మర్రిచెట్లను నాటి, వాటిని పెంచి, ఆ ప్రాంతంలో పచ్చదనం నెలకొల్పిన ఘనత తిమ్మక్కదే. బిడ్డలులేని ఆమె చెట్టునే బిడ్డ అనుకుంది. అయితే ఒకరిద్దరితో ఆ సంతానాన్ని నియంత్రించలేదు. మొక్కలు నాటడాన్ని ఆపలేదు. తాను జీవించి ఉన్నంత కాలం మొక్కలు నాటుతూ పంచుతూ పెంచుతూ ఉండిపోయింది. అందుకే 2019లో అప్పటి ప్రభుత్వం రోడ్డు విస్తరణలో భాగంగా ఆ చెట్లను కొట్టేయాలని యోచించినప్పుడు ముఖ్యమంత్రి కుమారస్వామికి తిమ్మక్క లేఖ రాశారు. 70 ఏళ్ల వయసున్న ఆ వృక్షాలను రక్షించాలని కోరారు. ఆమె మాటతో ముఖ్యమంత్రి ఆ చెట్ల కొట్టివేతను ఆపి, ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని అధికారులను ఆదేశించారు. ఇదంతా తిమ్మక్క వల్లే సాధ్యమైంది.ప్రపంచమంతా మెచ్చుకోలుతిమ్మక్క దశాబ్దాలుగా మొక్కలు నాటే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నా దేశవిదేశాల్లో అనేకమంది ఆమె కృషిని గుర్తించినా 2016లో ప్రపంచంలో అత్యంత ప్రభావవంత మహిళల జాబితాలో బీబీసీ ఆమె పేరును పేర్కొన్నా మన దేశం మాత్రం తిమ్మక్కను గుర్తించడంలో చాలా ఆలస్యం చేసిందని ఆమె గురించి తెలిసినవారు అంటారు. 108 ఏళ్ల వయసులో ఆమెకు కేంద్రం ‘పద్మశ్రీ’ ప్రకటించింది. అది చాలా ఆలస్యమని, అయినా ఆమెకు తన పని మీద తప్ప ఇటువంటి వాటి మీద ఆసక్తి లేదని ఆమె అభిమానుల మాట. ఆ తర్వాతే దేశంలోని అనేకమందికి తిమ్మక్క గురించి తెలిసింది. ఆమె వివరాలు, ఆమె చేస్తున్న పని ప్రాచుర్యం పొందాయి. కాలిఫోర్నియాలో పర్యావరణం మీద పని చేసే ఒక ఎన్.జి.ఓ తన సెంటర్కు సాలుమరద తిమ్మక్క పేరు పెట్టింది.చెట్లే ఆరోగ్యంతిమ్మక్క జీవితం చూస్తే చెట్లే ఆమెకు ఆరోగ్యాన్ని ఇచ్చాయా అనిపిస్తుంది. సగటు మనుషులు 50 దాటక ముందే అనారోగ్యం బారిన పడుతున్న వేళ తిమ్మక్క వందేళ్లు దాటాక కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవారు. తన పనులు తానే చేసుకునేవారు. ఖాళీగా కూర్చోవడం, దిగులుతో బాధపడటం ఆమెకు తెలియదు. 1991లో భర్త మరణించిన తర్వాత అన్ని పనులూ భుజాన వేసుకున్నారు. చెట్లు నాటడమే కాకుండా, ఇతర సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనేవారు. 2020లో నడుముకు సంబంధించి ఆమెకు శస్త్రచికిత్స చేశారు. అది విజయవంతంగా జరిగిందని, తాను బాగానే ఉన్నానని ఆమె తెలిపారు. కొద్దికాలంగా అనారోగ్యం బారిన పడ్డ ఆమె మునుపటిలా ఉత్సాహంగా ఉండలేకపోయారు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఇతర ఆరోగ్య సమస్యలతో నవంబర్ 14న కన్నుమూశారు. ఆమెకు ఒక పెంపుడు కొడుకు ఉన్నాడు. తిమ్మక్క శివైక్యం చెందారు. ఆమె నాటిన చెట్లు కలకాలం పచ్చగా ఆమెను గుర్తు చేస్తుంటాయి. -
పద్మశ్రీ ‘సాలుమరద’ తిమ్మక్క కన్నుమూత
బెంగళూరు: ప్రముఖ పర్యావరణ వేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత, వృక్షమాతగా పేరు తెచ్చుకున్న సాలుమరద తిమ్మక్క శుక్రవారం కన్నుమూశారు. 114 ఏళ్ల తిమ్మక్క కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆమె అక్కడే తుది శ్వాస విడిచారు.1911 జూన్ 30న జన్మించిన తిమ్మక్క బెంగళూరు దక్షిణ జిల్లాలోని హులికల్–కుదూర్ మధ్య 4.5 కి.మీ. విస్తీర్ణంలో 385 మర్రి చెట్లను నాటడంతో ఆమెకు ‘సాలుమరద’అనే పేరు వచ్చింది. నిరక్షరాస్యురాలైన తిమ్మక్కకు పిల్లలు లేకపోవడంతో.. మొక్కలనే పిల్లల్లా పెంచారు. ఆమె చేసిన కృషికి 2019లో పద్మశ్రీ అందుకున్నారు. అంతకుముందు హంపి విశ్వవిద్యాలయం నుంచి 2010లో నాడోజ అవారు, 1995లో జాతీయ పౌర పురస్కారం, 1997లో ఇందిరా ప్రియదర్శిని వృష మిత్ర అవార్డుతో సహా పలు అవార్డులు అందుకున్నారు. ప్రముఖుల సంతాపం.. తిమ్మక్క మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంతాపం తెలిపారు. ‘వేలాది చెట్లను నాటి, వాటిని తన సొంత పిల్లలలాగా పోషించిన తిమ్మక్క, తన జీవితాన్ని పర్యావరణ పరిరక్షణకు అంకితం చేసింది. పర్యావరణం పట్ల అమితమైన ప్రేమ కలిగిన ఆమెకు మరణం లేదు. ఆమె మరణం ఈ ప్రాంతానికి తీరని లోటు’అని పేర్కన్నారు. తిమ్మక్క మృతిపట్ల మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ, ఆయన కుమారుడు, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, కర్ణాటక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. -
అటు రాజకీయ నాయకురాలు.. ఇటు ఆర్మీ అధికారిగా..!
పాలన, రక్షణ రంగాలను వారధిగా చేసుకుని దేశ సేవ చేయాలనే ఆమె ద్వంద్వ వైఖరి అందరికి స్ఫూర్తిదాయకం. ఇది ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, దేశానికే గర్వకారణం కూడా. సింపుల్గా చెప్పాలంటే బహువిధ మార్గాల్లో దేశానికి సేవ చేయడం అంటే ఏంటో యువతకు ప్రేరణని ఇచ్చారామె. మరి ఇలా రెండు రకాలుగా దేశానికి సేవలందిస్తున్న ఆమె విజయ ప్రస్థానం ఎలా సాగిందో తెలుసుకుందామా.కర్ణాటకలోని బెంగళూరులో పుట్టి పెరిగిన భవ్య నరసింహమూర్తి(Bhavya Narasimhamurty) గతేడాది టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్గా ఎంపికయ్యారు. ఇటీవట గత మూడు నెలలుగా డెహ్రాడూన్లోని ప్రతిష్టాత్మక ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA)లో తన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. దీంతో ఆమె ప్రతి ఏడాది ఒక నిర్దిష్ట కాలానికి లెఫ్టినెంట్ హోదాలో భారత సైన్యంలో సేవలందిస్తూనే ఉంటారామె. అంతేగాదు భవ్య దక్షిణ భారతదేశం నుంచి మొదటి మహిళా టెరిటోరియల్ ఆర్మీ (TA) అధికారిగా ఘనత సృష్టించింది. ఇది నిజంగా భారత సైనిక చరిత్రలో ఒక చారిత్రాత్మక మైలురాయి. రాజకీయ ప్రస్థానం..భవ్య నరసింహమూర్తి 2020లో అధికారికంగా భారత జాతీయ కాంగ్రెస్ (INC)లో చేరారు. ఆ తర్వాత కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) ప్రతినిధిగా , టెలివిజన్ చర్చలలో సుపరిచితమైన వ్యక్తిగా మారింది. పార్టీ విధానాలను ఉద్రేకంతో సమర్థిస్తూ, ప్రతిపక్షాలను విమర్శించేది. ఆమె స్పష్టమైన వాదనలు సామాజిక సమస్యలపై లోతైన అవగాహన తదితరాలు భవ్యను కర్ణాటక రాజకీయ రంగంలో ఒక ప్రత్యేక వ్యక్తిగా నిలిపాయి. అలా ఆమెను 2023లో AICC సోషల్ మీడియా అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్ల జాతీయ సమన్వయకర్తగా నియమించింది. ఈ పదవి ఆమెకు డిజిటల్ కమ్యూనికేషన్లో తనకున్న నైపుణ్యంతో పార్టీ ఆన్లైన్ ఉనికిని రూపొందించి ఓటర్లతో సన్నిహితంగా ఉండటానికి, అలాగే ప్రగతిశీల భారతదేశం కోసం కాంగ్రెస్ దార్శనికతను ప్రోత్సహించడానికి వీలు కల్పించింది. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో, భవ్య రాజాజీనగర్ నియోజకవర్గం టికెట్ కోసం బలమైన పోటీదారుగా నిలిచింది.అలా ఆర్మీవైపు అడుగులు..ఆమె 2022లో కఠినమైన టెరిటోరియల్ ఆర్మీ (TA) ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. ఆ ఏడాది ఎంపికైన ఏకైక మహిళా అభ్యర్థిగా భవ్య నిలిచింది. మే 2024లో, ఆమెను ఇండో-పాక్ నియంత్రణ రేఖ (LOC) సమీపంలోని ఆర్మీ యూనిట్కు నియమించారు. అక్కడ ఆమె ఇంటెన్సివ్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని, లెఫ్టినెంట్గా నియమితురాలైంది. రాజకీయాల నుంచి సైన్యంలోకి ఆమె తీసుకున్న యూటర్న్.. జాతీయ సేవపట్ల తనకున్న బహుముఖ నిబద్దతను తెలియజేస్తోంది. ఇలా పౌరులు తమ వృత్తిపరమైన కెరీర్ల తోపాటు ఆర్మీలో సేవ చేయడానికి వీలు కల్పించే టెరిటోరియల్ ఆర్మీ,భారతదేశ రక్షణకు తోడ్పడటానికి భవ్యకు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందించింది. ఇలా టెరిటోరియల్ ఆర్మీ ఆపీసర్గా క్రికెటర్ ఎంఎస్ ధోని, రాజకీయ నాయకుడు సచిన్ పైలట్ వంటి ప్రముఖ వ్యక్తులు ఎందరో భాగమయ్యారు. కానీ దక్షిణ భారతదేశం నుంచి తొలి మహిళగా భవ్య సాధించిన విజయం సైన్యంలో చేరాలనుకునే ఎందరో ఔత్సాహిక మహిళలకు ప్రేరణగా నిలుస్తుంది. ఇక భవ్య నరసింహమూర్తి కూడా సోషల్ మీడియా ఎక్స్లో తన అనుభవాన్ని షేర్ చేస్తూ.."ఈ ఆర్మీ శిక్షణ చాలా సవాలుతో కూడుకున్నది, పైగా గొప్ప అసాధారణ అనుభవాన్ని అందించింది. ముఖ్యంగా నా శారీరక బలాన్ని, మానసిక ప్రశాంతతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది." అని భవ్య పోస్ట్లో రాసుకొచ్చారామె. అంతేగాదు తాను భారత సైన్యంలో అధికారిగా, అలాగే రాజకీయ నాయకురాలిగా నా మాతృభూమికి సేవ చేయగలిగే అద్భుతమైన అవకాశాన్ని అందించిన ఆ భగవంతుడుకి సదా కృతజ్ఞతలు అని పోస్ట్ని ముగించిందామె. Late post After my selection as a Lieutenant in Territorial Army of Indian Army, every year I serve in Indian army for a short period. This year with your love and blessings I successfully completed 3 months training at the prestigious Indian Military Academy Dehradun, now I am… pic.twitter.com/Qs0fB2zlLG— Bhavya Narasimhamurthy (@Bhavyanmurthy) November 4, 2025 (చదవండి: రూ. 5 వేలతో మొదలై కోటి దాకా : సక్సెస్ స్టోరీ) -
T20: చాంపియన్ కర్ణాటక.. ఫైనల్లో ఆంధ్ర జట్టుపై గెలుపు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అండర్–19 మహిళల టీ20 ట్రోఫీ ఎలైట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు రన్నరప్గా నిలిచింది. కోల్కతా వేదికగా బుధవారం జరిగిన ఫైనల్లో ఆంధ్ర జట్టు ఏడు వికెట్ల తేడాతో కర్ణాటక (Karnataka vs Andhra) జట్టు చేతిలో ఓడిపోయింది. మొహమ్మద్ మెహక్ సారథ్యంలోని ఆంధ్ర జట్టు మొదట బ్యాటింగ్కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 119 పరుగులు సాధించింది.ధాటిగా ఆడిన దీక్ష.. కానీఆంధ్ర ఓపెనర్ కాట్రగడ్డ దీక్ష (21 బంతుల్లో 36; 5 ఫోర్లు, 2 సిక్స్లు) క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడింది. సేతు సాయి (46 బంతుల్లో 45; 6 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచింది. గ్రీష్మ సైనీ (12 బంతుల్లో 11; 2 ఫోర్లు), అంజుమ్ (22 బంతుల్లో 14; 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. ఈ నలుగురు మినహా మిగతా బ్యాటర్లు రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు.కర్ణాటక బౌలర్లలో జె.దీక్ష 21 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా... వందిత రావు, వేద వర్షిణి 2 వికెట్ల చొప్పున తీశారు. అనంతరం 120 పరుగుల లక్ష్యాన్ని కర్ణాటక 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకొని చాంపియన్గా అవతరించింది. ఒకదశలో 55 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన కర్ణాటక జట్టును సీడీ దీక్ష (39 బంతుల్లో 47 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), కాష్వీ కందికుప్ప (20 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు) విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరు నాలుగో వికెట్కు అజేయంగా 65 పరుగులు జోడించారు.రెండో స్థానంలో నిలిచిఆంధ్ర బౌలర్లలో తమన్నా, బీఎస్ దీప్తి, అంజుమ్ ఒక్కో వికెట్ తీశారు. మొత్తం 30 జట్లు పాల్గొన్న ఈ టోరీ్నలో గ్రూప్ ‘ఎ’లో ఉన్న ఆంధ్ర జట్టు లీగ్ మ్యాచ్లు ముగిశాక రెండో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర 27 పరుగుల తేడాతో రాజస్తాన్ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గుజరాత్ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర ఐదు వికెట్ల తేడాతో నెగ్గి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. బెంగాల్తో జరిగిన సెమీఫైనల్లో ఆంధ్ర ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి టైటిల్ పోరుకు చేరుకుంది.చదవండి: హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం -
మయాంక్ అగర్వాల్ సూపర్ సెంచరీ
రంజీ ట్రోఫీ 2025-26లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఈ ఎడిషన్లో ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు చేసిన అతను.. ఇవాళ (నవంబర్ 11) మహారాష్ట్రపై అద్భుతమైన శతకాన్ని (103) బాదాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో ఇది వచ్చింది. ఇదే మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లోనూ (80) మయాంక్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.తాజా సెంచరీ మయాంక్కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 20వది. ఈ ఇన్నింగ్స్తో అతను 8500 ఫస్ట్ క్లాస్ పరుగుల మార్కును (118 మ్యాచ్ల్లో 8533 పరుగులు) కూడా దాటాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 313 పరుగులకే ఆలౌటైంది.మయాంక్, స్మరణ్ రవిచంద్రన్ (54), శ్రేయస్ గోపాల్ (71) అర్ద సెంచరీలతో రాణించారు. అభినవ్ మనోహర్ (47), అనీశ్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మహారాష్ట్ర బౌలర్లలో జలజ్ సక్సేనా 4, ముకేశ్ చౌదరీ 3, విక్కీ ఓత్సాల్ 2, రామకృష్ణ ఘోష్ ఓ వికెట్ తీశారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన మహారాష్ట్ర కర్ణాటక స్కోర్కు ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేసింది. పృథ్వీ షా (71), జలజ్ సక్సేనా (72) రాణించడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 300 పరుగులు చేసింది. కర్ణాటక బౌలర్లలో శ్రేయస్ గోపాల్ 4, మొహిసిన్ ఖాన్ 3, విధ్వత్ కావేరప్ప 2 వికెట్లు తీశారు.13 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక మ్యాచ్ ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. మయాంక్ సెంచరీతో సత్తా చాటగా.. అభినవ్ మనోహర్ (96) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మహారాష్ట్ర బౌలర్లలో ముకేశ్ చౌదరీ 3, విక్కీ ఓస్వాల్ 2, జలజ్, రజనీష్, సిద్దేశ్ వీర్ తలో వికెట్ తీశారు. చదవండి: రాణించిన బంగ్లా బౌలర్లు -
ఇది జైలా.. రిసార్టా.. డేంజర్ ఖైదీలకు VIP సుఖాలు..
-
ఆ రాష్ట్రాల్లో వేధింపులు.. కేరళ బస్సులు బంద్
తిరువనంతపురం: ఇకపై కేరళ టూరిస్ట్ బస్సులు కర్ణాటక, తమిళనాడుకు వెళ్లవు. ఆ రెండు రాష్ట్రాలకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు కేరళ రాష్ట్ర కమిటీ లగ్జరీ బస్సు యజమానుల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. దీని వెనుకగల కారణం ఏమిటి? ఆయా రాష్ట్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురువుతున్నాయా? అనే విషయంలోకి వెళితే..కేరళ నుండి తమిళనాడు, కర్ణాటకకు అంతర్రాష్ట్ర పర్యాటక బస్సు సర్వీసులను (నేడు)సోమవారం సాయంత్రం 6 గంటల నుండి నిలిపివేస్తున్నట్లు లగ్జరీ బస్సుల యజమానుల సంఘం, కేరళ రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. పొరుగు రాష్ట్రాలు భారీ జరిమానాలు విధించడం, చట్టవిరుద్ధమైన రాష్ట్ర స్థాయి పన్నులు విధించడం, దీనికితోడు కేరళ ఆపరేటర్లకు చెందిన ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ (ఏఐటీపీ) బస్సులను సీజ్ చేయడం తరచూ జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏజే రిజాస్ తెలిపారు.కేంద్ర ప్రభుత్వ మోటారు వాహనాల చట్టం కింద జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఏఐటీపీలు ఉన్నప్పటికీ, కేరళ నుండి వచ్చే పర్యాటక వాహనాలను తమిళనాడు, కర్ణాటకలో ఆపడం, జరిమానా విధించడం, నిర్బంధించడం జరుగుతున్నదని ప్రధాన కార్యదర్శి మనీష్ శశిధరన్ మీడియాకు తెలిపారు. ‘ఏడాదిగా తమిళనాడు అధికారులు కేరళలో రిజిస్టర్ అయిన వాహనాల నుండి ఇష్టారాజ్యంగా పన్ను వసూలు చేస్తున్నారు. ఫలితంగా ఆపరేటర్లకు, ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేరళ ప్రభుత్వం కూడా తమకు సహకరించడంలేదని అన్నారు.వాహనాలను స్వాధీనం చేసుకుంటున్న కారణంగా చాలా మంది ఆపరేటర్లు అంతర్రాష్ట్ర సేవలను నిర్వహించేందుకు వెనుకాడుతున్నారని తెలిపారు. ఈ సర్వీస్ సస్పెన్షన్ స్వచ్ఛంద నిరసన కాదని, వాహనాలు, డ్రైవర్లు, ప్రయాణికుల భద్రత కోసం తీసుకున్న చర్య అని అసోసియేషన్ తెలిపింది. ఈ సమస్య పరిష్కారానికి తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రభుత్వాలు సమావేశం కావాలని అసోసియేషన్ అభ్యర్థించింది. అలాగే ఈ సమస్య పరిష్కారానికి అసోసియేషన్ కేరళ రవాణా మంత్రి కేబీ గణేష్ కుమార్కు కూడా ఒక లేఖ రాసింది.ఇది కూడా చదవండి: ‘శ్వాస చంపేస్తోంది’.. ఢిల్లీలో భారీ నిరసనలు -
బెంగళూరు జైల్లో విలాసాలు.. వీడియోలు వైరల్
సాక్షి, బనశంకరి: బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఖైదీలు యథేచ్ఛగా సౌకర్యాలు పొందుతున్నారని తరచూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరడుగట్టిన నేరగాళ్లు కటకటాల నుంచి ఫోన్లలో బయట వ్యవహారాలు చక్కబెడుతున్నట్లు విమర్శలున్నాయి. తాజాగా ఖైదీలు మద్యం తాగుతూ పార్టీ చేసుకుంటున్న మరో వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు జైలులో సోదాలను జరిపారు. అయితే మొబైల్స్తో పాటు ఎలాంటి వస్తువులు లభించలేదు. అత్యాచారం కేసులో దోషి ఉమేశ్రెడ్డి మొబైల్ఫోన్లో మాట్లాడుతూ టీవీ చూడటం, లష్కరే ఉగ్రవాది మొబైల్ వాడడం, బంగారం కేసు నిందితుడు అక్రమంగా సౌకర్యాలు పొందడం తదితరాలపై శనివారం ఫోటోలు, వీడియోలు గుప్పుమన్నాయి, దీంతో జైలు అధికారులు ముందే జాగ్రత్త పడినట్లు సమాచారం. Now videos of booze, bar snacks and parties have emerged from Bengaluru Central Jail. A high level meeting has been called by the Home Minister to probe all these issues. https://t.co/gIOf6Wr5Ke pic.twitter.com/8NZnIs5sBL— Deepak Bopanna (@dpkBopanna) November 9, 2025రౌడీ.. కేక్ కటింగ్ జైళ్ల శాఖ చీఫ్ దయానంద్ పరప్పన అధికారుల నుంచి సమాచారం తెలుసుకున్నారు. ఆ వీడియోల గురించి అంతర్గత దర్యాప్తునకు ఆదేశించారు. కొన్నిరోజుల కిందట జైలులో రౌడీషీటర్ గుబ్బచ్చి శీనా పుట్టినరోజు కేక్ కట్చేయడం తీవ్రవిమర్శలకు దారితీసింది. విచారణ ఖైదీలకు ఎల్ఇడీ టీవీ సౌలభ్యంతో పాటు వంట చేసుకోవడానికి పాత్రలు, వంట పదార్థాలు, లభిస్తాయి. కానీ కోడిగుడ్లు, చికెన్, మొబైల్ చార్జర్ , పార్టీ చేసుకోవడానికి సౌండ్బాక్స్ తదితరాలు పొందడం అనుమానాలకు తావిస్తోంది. కొందరు ఖైదీలకు రాజమర్యాదలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. అనుమానిత ఐసిస్ ఉగ్రవాది జుహద్ షమీద్ షకీల్ మున్నా జైలులో మొబైల్ వాడుతున్నట్లు లీకైంది. చర్యలు తీసుకుంటాం: హోంమంత్రి జైలులో అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మంగళూరు, బెళగావితో పాటు చాలా చోట్ల అదికారులను సస్పెండ్ చేశామన్నారు. గతంలో పరప్పనలోనూ కొందరిపై వేటు వేశామన్నారు. ఏడీజీపీ దయానంద్ తో మాట్లాడానని, కారకులపై కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. తక్షణం నివేదిక అందించాలని సూచించానని, జైలులో మొబైల్ ఇతర సౌలభ్యాలు ఎవరికీ లేవని చెప్పారు. సౌలభ్యాలను కలి్పస్తే అది జైలు ఎలా అవుతుందని , ఉగ్రవాదులతో పాటు ఎవరికీ రాజమర్యాదలు కల్పించరాదని చెప్పారు. బెడ్, దిండు కోసం నటుడు దర్శన్ కోర్టుకు వెళ్లారని, ఇతర ఖైదీలకు సులభంగా ఎలా లభిస్తున్నాయనేది తనిఖీ చేస్తున్నామని చెప్పారు. నేడు సీఎం సమీక్ష.. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రలు జైలులో ఖైదీలకు రాచమర్యాదలు కల్పిస్తున్నారనే ఆరోపణపై అధికారులతో నేడు (సోమవారం) ప్రత్యేక సమావేశం నిర్వహిస్తాను, అక్రమాలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఎం సిద్దరామయ్య చెప్పారు. ఆయన ఆదివారం ఉమ్మడి బళ్లారి జిల్లాలోని హరపనహళ్లి తాలూకాలో మాజీ మంత్రి పరమేశ్వర నాయక్ కుమారుడు భరత్ వివాహ వేడుకలో పాల్గొని విలేకరులతో మాట్లాడారు. జైలులో అక్రమాల గురించి ప్రస్తావించగా, అవకతవకలకు కొమ్ముకాస్తున్న జైలు అధికారులపై చర్యలు తప్పవని స్పష్టంచేశారు. ఒక్క ఆర్ఎస్ఎస్నే కాదు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే సంస్థలను నిషేధించాలని కోరుతున్నామని చెప్పారు. జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల మీద హైకోర్టు తీర్పు మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. మొక్కజొన్నకు కేంద్రం మద్దతు ధరను కలి్పంచాలని కోరారు. అతివృష్టి వల్ల రాష్ట్రంలో 11 లక్షల హెక్టార్లలో పంటనష్టం ఏర్పడిందని, పరిహారం ఇవ్వడానికి సర్కారుకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చెరకు రైతులకు మద్దతు ధర ఇవ్వని చక్కెర ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా తిరిగొచ్చిన ప్రాణం
రాయచూరు రూరల్: చనిపోయినవారు బతకడం చాలా అరుదు. అలాంటి వింత ఘటన ఉత్తర కర్ణాటకలోని గదగ్ జిల్లా బెటగేరిలో వెలుగుచూసింది. శుక్రవారం బెటగేరిలో ప్రైవేట్ ఆస్పత్రిలో మూత్ర పిండాల చికిత్స కోసం నారాయణ (38) అనే వ్యక్తిని చేర్పించారు. వైద్యులు అతనికి ఆపరేషన్ చేశారు. 6 గంటల తరువాత ఆయన చనిపోయాడని వైద్యులు చెప్పారు. దీంతో బంధువులు తీవ్ర రోదనల్లో మునిగిపోయారు. చివరికి అంబులెన్సులో శవాన్ని ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. అంతలోనే నారాయణ కళ్లు తెరిచి ఊపిరి తీసుకోవడం మొదలు పెట్టాడు. చనిపోయాడనుకున్న వ్యక్తి బతికొచ్చాడని అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. -
అన్నా.. ప్లీజ్ అన్నా.. వద్దన్నా..!
బైక్పై వెళ్తున్న టైంలో హఠాత్తుగా అతను నా కాళ్లపై చేతులు వేశాడు. వద్దని చెప్పినా మళ్లీ మళ్లీ అదే పని చేశాడు. నా గుండె ఆగినంత పనైంది. నాకేం చేయాలో అర్థం కాలేదు. అందుకే ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉండిపోయా. ఇలాంటి పరిస్థితి ఏ మహిళకు ఎదురు కాకూడదని కోరుకుంటున్నా.. ఇన్స్టాగ్రామ్లో ఓ బైక్ డ్రైవర్తో తనకు ఎదురైన పరిస్థితిని ఓ యువతి పంచుకోగా అది నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు స్పందించాల్సిన పరిస్థితి ఎదురైంది. మెట్రో నగరం బెంగళూరులో ఓ యువతితో బైక్ డ్రైవర్ అనుచితంగా ప్రవర్తించాడు. బైక్పై వెళ్తున్న సమయంలో ఆమెను తాకుతూ ఇబ్బంది పెట్టాడు. ఈ వేధింపులను ఆ యువతి తన ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. గురువారం సాయంత్రం విల్సన్ గార్డెన్ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో నేపథ్యం, బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధిత యువతి చర్చ్ చర్చ్ స్ట్రీట్ నుంచి తాను ఉండే హాస్టల్కు ర్యాపిడో ద్వారా బైక్ రైడ్ను బుక్ చేసుకుంది. ప్రయాణం ప్రారంభమైన కాసేపటికి కెప్టెన్ తన చేతులతో ఆమె తొడలను తాకడం ప్రారంభించాడు. దీంతో ఆమె అతన్ని వారించింది. అయినా కూడా పట్టించుకోకుండా అతను అదే పని చేస్తూ ఉండిపోయాడు. దీంతో ఆమె ‘‘అన్నా.. ఏం చేస్తున్నావ్?.. వద్దన్నా..’’ అంటూ బతిమాలుకుంది. అయినా ఆ కామాంధుడు వినలేదు. ఈలోపు.. తన గమ్యస్థానం రావడంతో ఆమె దిగేసింది. ఆ సమయంలోనూ ఆమె ఇబ్బందిని గమనించిన ఓ వ్యక్తి వాళ్ల దగ్గరకు వచ్చి ఏం జరిగిందని ఆరా తీశాడు. జరిగిందంతా చెప్పడంతో ఆ వ్యక్తి ఆ కెప్టెన్ను నిలదీశాడు. దీంతో తప్పైపోయిందంటూ అక్కడి నుంచి వెళ్లిపోసాగాడు. కాస్త దూరం వెళ్లాక యువతిని చూస్తూ చేతులతో అసభ్య సంజ్ఞలు చేశాడు. దీంతో ఆమె భరించలేకపోయింది. పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.తాను సిటీకి కొత్త అని, అందుకే ఆ రైడ్ను మధ్యలో ఆపలేకపోయానని, ఇలాంటి ఘటనలు కొత్త కాకపోయినా తనకు ఎదురైన అనుభవం మరేయితర మహిళకు ఎదురుకాకూడదని, ఇలాంటి ప్రయాణాల్లో ఒంటరి మహిళలు భద్రంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఓ పోస్ట్ చేసింది. నిందితుడి కోసం గాలింపు జరుపుతున్నట్లు విల్సన్ గార్డెన్ పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై ర్యాడిడో సంస్థ స్పందించాల్సి ఉంది.ఇదీ చదవండి: తుపాకులు కావాలా? ల్యాప్ట్యాప్లు కావాలా? -
ప్రియుడిపై పగ.. పోలీసులతో ఐటీ ఉద్యోగిని ఆటలు
సాక్షి, బనశంకరి: ప్రేమ విఫలం కావడంతో ప్రియుడి పగ పెంచుకున్న ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. ప్రేమ విఫలమైన బాధ ఆమెను వెంటాడంతో ప్రియుడిపై కసి తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ప్రియుడి పేరుతో బాంబు బెదిరింపులకు పాల్పడింది. విమానాశ్రయాలు, బడులు, కాలేజీలు, ప్రభుత్వ సంస్థలను తరుచూ బెదిరిస్తున్న ఆ యువతిని పోలీసులు అరెస్టు చేశారు.వివరాలను సిటీ పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్సింగ్ మీడియాకు వెల్లడించారు. రెని జోషిల్డా బెంగళూరులో రోబోటిక్స్ ఇంజినీర్గా పనిచేసేది. సహోద్యోగితో ప్రేమ విఫలం కావడం.. అతను మరో యువతిని పెళ్లాడాడు. దీంతో అతనిపై పగ పెంచుకుంది. ప్రియుడి పేరుతో నకిలీ ఈ–మెయిల్స్, వాట్సాప్ అకౌంట్లు సృష్టించి.. వాటి ద్వారా బాంబు బెదిరింపులకు పాల్పడడం మొదలుపెట్టింది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్లోని స్కూళ్లు, కాలేజీలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లకు బాంబు బెదిరింపులు పంపించేది.అహ్మదాబాద్లో నరేంద్రమోదీ క్రికెట్ ప్రాంగణంతో పాటు బెంగళూరులోని ఆరు విద్యాలయాల్లో బాంబులు పెట్టినట్లు గతంలో హెచ్చరించింది. ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదానికి తన ప్రియుడు కారణమంటూ ఈ–మెయిల్ పంపింది. ప్రియుడి పేరిట బెదిరిస్తే.. అతడిని అరెస్టు చేస్తారనేది ఆమె ప్లాన్. ఇలా జూన్ 14న బెంగళూరు వాసులను హడలెత్తించింది. ఆ కేసు విచారణ ఉత్తర విభాగం సైబర్ క్రైమ్ పోలీసులు చేపట్టారు. ఆరు పాఠశాలలకు బెదిరింపు సందేశాలు పంపినట్లు ఆమె ప్రాథమిక విచారణలో అంగీకరించిందని కమిషనర్ వివరించారు. దీంతో, దర్యాప్తు మొదలుపెట్టిన గుజరాత్ పోలీసులు.. విచారణ జరిపి రెని జోషిల్డాను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను అహ్మదాబాద్ జైలు నుంచి వారెంట్పై బెంగళూరుకు తెస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. మరిన్ని వివరాలు సేకరించేందుకు ఆమెను విచారిస్తున్నామని వెల్లడించారు. -
ప్రియుడు చెబితే.. కెమెరా పెట్టాను
సాక్షి, హోసూరు: కర్ణాటకలోని హోసూరు సమీపంలోని టాటా ఎలక్ట్రానిక్ కంపెనీ మహిళా సిబ్బంది ఉండే హాస్టల్లోని బాత్రూంలో రహస్య కెమెరా ఎపిసోడ్లో సంచలన విషయం బయటకు వచ్చింది. తన ప్రియుడు చెబితేనే బాత్రూంలో తాను సీక్రెట్ కెమెరా అమర్చినట్టు నిందితురాలు చెబుతోంది. ఇక, ఈ ఘటనలో కెమెరా అమర్చిన ఉద్యోగినిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. హోసూరు సమీపంలోని నాగమంగలం వద్ద టాటా ఎలక్ట్రానిక్ పరిశ్రమలో 20 వేల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళా కార్మికుల కోసం హాస్టల్ వసతి కల్పించింది. ఉద్దనపల్లి సమీపంలో ఒడిశా, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన 6 వేల మందికి పైగా మహిళా కార్మికులు హాస్టళ్లలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ హాస్టల్లోని బాత్రూంలో ఒడిశాకు చెందిన నీలాకుమారి గుప్తా (23) అనే కార్మికురాలు రహస్య కెమెరా ఏర్పాటు చేసి ఇతర మహిళల వీడియోలను రికార్డు చేసి తన ప్రియుడు సంతోష్కి పంపిస్తోంది.బెంగళూరులో అరెస్టు చేసి..అతడు వాటిని ఇంటర్నెట్లో పోస్టు చేయసాగాడు. తమ స్నానాల వీడియోలు వైరల్ అయినట్లు తెలిసి వేలాది మంది మహిళలు పరిశ్రమ యంత్రాంగం దృష్టికి తీసుకెళితే పట్టించుకోలేదు. దీంతో మంగళవారం రాత్రి నుంచి హాస్టల్ ముందు ధర్నా చేయసాగారు. పలువురు నేతలు మహిళలకు మద్దతు తెలిపారు. ఉద్దనపల్లి పోలీసులు దర్యాప్తు జరిపి నిందితురాలు నీలాకుమారి గుప్తాని అరెస్ట్ చేశారు. ప్రియుడు సంతోష్కుమార్ సూచనల మేరకు రహస్య కెమెరా ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపింది. బెంగళూరులో దాగి ఉన్న నిందితున్ని గురువారం అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇతడు కూడా ఒడిశా వాసి కాగా బెంగళూరులో పనిచేసుకునేవాడు. వారిద్దరినీ తీవ్ర విచారణ జరుపుతున్నారు. తమ వీడియోలను ఇంటర్నెట్ నుంచి తొలగించాలని, హాస్టళ్లలో భద్రత కల్పించాలని మహిళా సిబ్బంది డిమాండ్ చేశారు. -
రోడ్డు ప్రమాదంలో రియాల్టీ షో డ్యాన్సర్ దుర్మరణం
బెంగళూరు: రియాలిటీ షోలలో తన పెర్ఫామెన్స్తో పేరు తెచ్చుకున్న ప్రముఖ డ్యాన్సర్ సుధీంద్ర (30) మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కొత్త కారు కొనుగోలు చేసిన సుధీంద్ర, ఈ ఆనందాన్ని తన సోదరుడితో పంచుకునేందుకు వెడుతుండగా బెంగళూరు నగర శివార్లలోని నెలమంగళలోని పెమ్మనహళ్లి సమీపంలో ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో ఆయన కుటుంబం సభ్యులు విచారంలో మునిగిపోయారు.‘డాన్స్ షో’తో సహా కన్నడ రియాలిటీ షోలతో పేరుతెచ్చుకున్న సుధీంద్ర,కర్ణాటకలోని త్యామగోండ్లు గ్రామానికి చెందిన వాడు. డోబ్స్పేటలో ఒక పాఠశాలను కూడా నడుపుతూ ప్రజాదారణ పొందాడు. సోమవారం కొత్త కారును కొనుగోలు చేశాడు. అనంతరం పెమ్మనహళ్లిలోని సోదరుడికి ఇంటికి బయలుదేరాడు. ప్రయాణం మధ్యలో, కారులో సాంకేతిక లోపం ఏర్పడింది, దీనితో డ్యాన్సర్ వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి తనిఖీ చేస్తుండగా, అటునుంచి వస్తున్న ట్రక్కు అతణ్ని బలంగా ఢీట్టింది. దీంతో అతను అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.#Accident near #Bengaluru 36-year-old dancer Sudheendra died near Nelamangala after a truck rammed into him. He had stopped to inspect his new car that developed a snag. He was on his way to his brother’s house to show the car when the mishap occurred.@timesofindia pic.twitter.com/DyeIROeWuL— TOI Bengaluru (@TOIBengaluru) November 4, 2025 సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డైనాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ నెట్టింట సంచలనగా మారింది. ఇది ప్రమాదం కాదు, హత్య అనే ఆరోపణలు వినిపించాయి. టక్కు వేగంగా లేదనీ, కావాలనే ఢికొట్టినట్టు కనిపిస్తోందని, లేదంటే డ్రైవర్ తాగి ఉన్నాడా? నిద్ర మత్తులో ఉన్నాడా? అనే అనుమానాలు వెల్లువెత్తాయి. ఏం జరిగింది అనేది పోలీసుల విచారణలో తేలనుంది. మరోవైపు కేసు నమోదు చేసిన డోబ్స్పేట పోలీసులు ట్రక్కు డ్రైవర్ను అరెస్టు చేశారు. -
బీదర్లో ఘోర ప్రమాదం.. తెలంగాణవాసులు మృతి
బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. వ్యాను, కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలైనట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బీదర్లో బుధవారం ఉదయం డీటీడీసీ కొరియర్ వ్యాను, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారికి ఆసుపత్రికి తరలించారు. మృతులు నారాయణఖేడ్ మండలం జగన్నాథ్పూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా గణగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం. -
భారీ విజయంతో కర్ణాటక బోణీ
తిరువనంతపురం: స్పిన్నర్ మోసిన్ ఖాన్ (6/29) తిప్పేయడంతో రంజీ ట్రోఫీలో కర్ణాటక భారీ విజయం సాధించింది. కేరళ సొంతగడ్డపై జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్లో కర్నాటక ఇన్నింగ్స్ 164 పరుగుల తేడాతో కేరళపై ఘనవిజయం సాధించింది. ఈ సీజన్లో కర్ణాటక జట్టుకిది తొలి గెలుపు. సౌరాష్ట్ర, గోవాలతో జరిగిన గత రెండు మ్యాచ్లు కూడా ‘డ్రా’గానే ముగిశాయి. డబుల్ సెంచరీతో భారీస్కోరుకు బాట వేసిన కర్ణాటక బ్యాటర్ కరుణ్ నాయర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మంగళవారం 10/0 ఓవర్ నైట్ స్కోరుతో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన కేరళ... సొంతగడ్డపై కనీసం 200 పరుగులైనా చేయలేకపోయింది. ఫాలోఆన్ ఆడిన కేరళ 79.3 ఓవర్లలో 184 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ కృష్ణప్రసాద్ (33; 5 ఫోర్లు) కాస్త మెరుగ్గా ఆడాడు. మిగతా టాపార్డర్ బ్యాటర్లు ని«దీశ్ (9), అక్షయ్ చంద్రన్ (0)లను పేసర్ విద్వత్ కావేరప్ప వరుస బంతుల్లో అవుట్ చేయడంతోనే కేరళ పతనం మొదలైంది. కెప్టెన్ అజహరుద్దీన్ (15)ను శిఖర్ పెవిలియన్ చేర్చగా మిగతా బ్యాటర్లకు మోసిన్ స్పిన్ ఉచ్చు బిగించడంతో కేరళ క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది. నిజానికి 140 పరుగులకే 9 వికెట్లను కోల్పోయిన కేరళ 150 పరుగుల్లోపే ఆలౌట్ ఖాయమనిపించింది. అయితే ఆఖరి వరుస బ్యాటర్ ఇడెన్ ఆపిల్ టామ్ (68 బంతుల్లో 39 నాటౌట్; 7 ఫోర్లు) చేసిన పోరాటంతో కర్ణాటక విజయం కాస్త ఆలస్యమైంది.మిగతా మ్యాచ్ల్లో గ్రూప్ ‘ఎ’లో జార్ఖండ్ ఇన్నింగ్స్ 196 పరుగుల తేడాతో నాగాలాండ్పై జయభేరి మోగించింది. వడోదరలో వర్షం వల్ల బరోడా, ఉత్తర ప్రదేశ్ మ్యాచ్లో అసలు టాస్ కూడా పడలేదు. మ్యాచ్ పూర్తిగా వర్షార్పణమైంది. ‘బి’లో సౌరాష్ట్ర–మహారాష్ట్ర, పంజాబ్–గోవా, మధ్యప్రదేశ్–చండీగఢ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. విహారి, మురాసింగ్ల పోరాటంతో... అగర్తలా: హనుమ విహారి (253 బంతుల్లో 141; 19 ఫోర్లు, 1 సిక్స్), కెపె్టన్ మణిశంకర్ మురాసింగ్ (130 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్స్లు)ల పోరాటంతో త్రిపుర డ్రాతో గట్టెక్కడమే కాదు... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కూడా సంపాదించింది. దీంతో గ్రూప్ ‘సి’లో బెంగాల్తో జరిగిన మ్యాచ్లో త్రిపుర కీలకమైన 3 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఓవర్నైట్ స్కోరు 273/7తో తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన త్రిపుర 103.2 ఓవర్లలో 385 పరుగుల వద్ద ఆలౌటైంది. తద్వారా బెంగాల్ (336)పై తొలి ఇన్నింగ్స్లో 49 పరుగులు ఆధిక్యం లభించింది. మూడో రోజే విహారి శతక్కొట్టగా, ఆఖరి రోజు మురాసింగ్ వన్డేను తలపించే విధంగా ధాటిగా ఆడి సెంచరీ సాధించాడు. ఇద్దరు ఎనిమిదో వికెట్కు 116 పరుగులు జోడించారు. విహారి అవుటయ్యాక టెయిలెండర్ రాణా దత్త (27; 4 ఫోర్లు) కూడా మురాసింగ్కు అండగా నిలిచాడు. బెంగాల్ బౌలర్లలో భారత వెటరన్ సీమర్ షమీకి ఒక్క వికెట్ కూడా దక్కలేదు. కైఫ్ 4, ఇషాన్ పొరెల్ 3 వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన బెంగాల్ 25 ఓవర్లలో 3 వికెట్లకు 90 పరుగులు చేసింది. షహబాజ్ అహ్మద్ (51 నాటౌట్) అర్ధసెంచరీ సాధించాడు. శ్రమించి గెలిచిన హరియాణా అహ్మదాబాద్: గ్రూప్ ‘సి’లో గుజరాత్తో జరిగిన మ్యాచ్లో సులువైన 62 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా హరియాణా తెగ కష్టపడింది. చివరకు 6 వికెట్లు కోల్పోయి ఈ ఆరు పదుల లక్ష్యాన్ని ఛేదించి గెలిచింది. మొత్తానికి గ్రూప్ ‘సి’లోనే కాదు... ఈ సీజన్లోనే అన్ని గ్రూపుల్లో ఆడిన మూడు మ్యాచ్లు గెలిచిన ఏకైక జట్టుగా హరియాణా ‘హ్యాట్రిక్’ విజయాలు సాధించింది. మంగళవారం 113/8 ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన గుజరాత్ 60.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది.ఇంకో 24 పరుగులు చేసి మిగిలిన 2 వికెట్లు కోల్పోయింది. రవి బిష్ణోయ్ (2)ని పార్థ్వత్స (2/38), క్షితిజ్ పటేల్ (37; 2 ఫోర్లు)ను నిఖిల్ కశ్యప్ (4/59) అవుట్ చేయడంతో ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్లో 76 పరుగుల ఆధిక్యం పొందిన హరియాణా ముందు కేవలం 62 పరుగుల లక్ష్యమే ఉంది. అయితే రెండో ఇన్నింగ్స్లో హరియాణా టాప్–6 బ్యాటర్లు లక్ష్యయ్ (1), అంకిత్ (1), శాండిల్యా (3), నిశాంత్ (13), అమన్ (3), ధీరు సింగ్ (13)లను గుజరాత్ బౌలింగ్ త్రయం విశాల్ (3/23), సిద్ధార్థ్ దేశాయ్ (2/25), బిష్ణోయ్ (1/13) మూకుమ్మడిగా అవుట్ చేయడంతో 43 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. పార్థ్ వత్స (14 నాటౌట్), యశ్వర్ధన్ (13 నాటౌట్) అజేయంగా నిలువడంతో హరియాణా 4 వికెట్ల తేడాతో గెలిచి నిట్టూర్చింది. ఇదే గ్రూప్ ‘సి’లో జరిగిన మ్యాచ్లో బౌలర్ల అద్భుత ప్రతిభతో ఉత్తరాఖండ్ 17 పరుగుల తేడాతో సర్వీసెస్పై గెలుపొందింది. 123 పరుగుల స్వల్పలక్ష్యాన్ని ఛేదించేందుకు ఆఖరి రోజు 71/5 ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సర్వీసెస్ 48.4 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. 34 పరుగులు మాత్రమే చేసి మిగతా సగం (5) వికెట్లను కోల్పోయింది. మయాంక్ మిశ్రా (5/45), సుచిత్ (2/12), అవనీశ్ (2/27) సర్వీసెస్ బ్యాటర్లను క్రీజులో నిలువనీయలేదు. -
జనసేన నేత వేధింపులతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘కూటమి’ ప్రభుత్వ వేధింపులతో కర్ణాటక వాసి ఆత్మహత్యకు యత్నించి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అనంతపురం జిల్లా రాయదుర్గం జనసేన ఇన్చార్జ్ మంజునాథ్కు మద్దతుగా పోలీసులు చేసిన ఈ చర్య ‘అనంత’లో కలకలం రేపుతోంది. మంజునాథ్కు రాయదుర్గం, కర్ణాటక సరిహద్దు బండ్రావి అనే గ్రామంలోని రాగుల సిద్ధప్పకు మధ్య నగదు లావాదేవీలున్నాయి. ఇద్దరి మధ్య జరిగిన లావాదేవీలలో మంజునాథ్కు సిద్ధప్ప బాకీ పడ్డాడు. ఈ క్రమంలో మంజునాథ్ సిఫార్సుతో రాయదుర్గం పోలీసులు సిద్ధప్పను అదుపులోకి తీసుకున్నారు. అతడిని వేధించడంతో పాటు రెండు రోజులు చిత్తకొట్టినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగక సిద్ధప్పకు సంబంధించిన రెండు ట్రాక్టర్లు, రెండు బొలెరో వాహనాలను కూడా స్టేషన్కు తెప్పించారు.సిద్ధప్ప తండ్రి బండ్రావప్పను సీఐ వెంకటరమణ, ఎస్ఐ గురుప్రసాద్ పిలిపించారు. డబ్బుల విషయమై ఒత్తిడి చేశారు. దీంతో వారికి బండ్రావప్ప రూ.10 లక్షలిచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో రూ.లక్ష వారు తీసుకుని, రూ.9 లక్షలు మంజునాథ్కు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో రూ.20 లక్షలు అప్పు ఉందని తేల్చి, ఖాళీ పత్రాలపై బండ్రావప్పతో బలవంతంగా సంతకాలు చేయించుకున్నట్లు సమాచారం. కుమారుడిపై పోలీసుల దాడి, తనతో బలవంతంగా సంతకాలు, వాహనాలు తీసుకెళ్లడంతో గ్రామంలో పరువు పోయిందని భావించిన బండ్రావప్ప ఆదివారం పురుగుమందు తాగాడు. కుటుంబసభ్యులు బళ్లారిలోని విమ్స్లో చేర్పించారు. ప్రస్తుతం అతడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఉలిక్కిపడిన పోలీసులు బండ్రావప్ప ఆత్మహత్యాయత్నంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. తమ అదుపులో ఉన్న సిద్ధప్ప, వాహనాలను వదిలిపెట్టారు. బండ్రావప్పను ఎవరూ కలవకుండా, ఆస్పత్రిలో ఫొటోలు తీయకుండా తమకు అనుకూలమైన ఒక లెక్చరర్ను కాపలా ఉంచారు. ఇక వ్యవహారం రాయదుర్గంలోని కీలక ప్రజాప్రతినిధి వద్దకు చేరింది. దీంతో విషయం బయటకు రానీయొద్దని, సిద్ధప్పను ఒప్పించి ఆయన ఇచ్చిన రూ.10 లక్షలు తిరిగి ఇచ్చేస్తామని బలవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
లైట్ ఆర్పనందుకు మేనేజర్నే చంపేశాడు!
బెంగళూరు : మనుషుల్లో అంతకంతకూ వివేచన, విచక్షణ జ్ఞానం అనేది అంతకంతకూ నశించిపోతోంది. స్వల్ప వివాదానికే ఆవేశంతో ఊగిపోతున్నారు. చివరకు హత్యలకు కూడా తెగబడుతున్నారు. తాజాగా బెంగళూరులో జరిగిన ఒక హత్యోందంతం దిగ్భ్రాంతి రేపక మానదు.ఆఫీసులో లైట్లు ఆర్పే విషయంలో ఏర్పడిన చిన్న తగాదా హత్యకు దారి తీసింది. చిత్రదుర్గకు చెందిన భీమేష్ బాబు అనే 41 ఏళ్ల మేనేజర్ను అతని సహోద్యోగి డంబెల్తో కొట్టి చంపాడు. శనివారం తెల్లవారుజామున గోవిందరాజనగర్ పోలీస్ పరిధిలోని డేటా డిజిటల్ బ్యాంక్ కార్యాలయంలో తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో, విజయవాడకు చెందిన టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ సోమల వంశీ (24)ని లైట్లు ఆర్పేయమని తన మేనేజర్ భీమేష్ను కోరాడు. లైట్లు, వెలుగులు పడని వంశీ అవసరం లేనప్పుడు వాటిని ఆఫ్ చేయమని సహోద్యోగులను తరచుగా కోరుతూ ఉంటాడట. అదే విధంగా భీమేష్ను కూడా లైటు ఆఫ్ చేయమని కోరాడు. భీమేష్ వినకపోవడంతో అది వాగ్వాదానికి తీసింది. కోపంతో ఊగిపోయిన వంశీ బాబుపై కారం పొడి విసిరి, తల, ముఖం, ఛాతీపై డంబెల్తో పదేపదే కొట్టడంతో అతను కుప్పకూలి పోయాడు. ఆ తరువాత వంశీ భయాందోళనకు గురై ఇతర ఉద్యోగుల సహాయం కోరాడు. అంబులెన్స్కు ఫోన్ చేశారు. కానీ బాబు అక్కడికక్కడే మరణించాడు. చదవండి: నీతా అంబానీకి స్టాఫ్ సర్ప్రైజ్ : భర్త, తల్లి కాళ్లు మొక్కి బర్త్డే సెలబ్రేషన్స్ చూశారా? ఆ తరువాత వంశీ స్వయంగా గోవిందరాజనగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. హత్య కేసు నమోదు చేయబడింది. ఆఫీసు లైట్లు వెలిగించాలనే వివాదం హత్యకు దారితీసిందని డిసిపి (వెస్ట్) గిరీష్ ఎస్ ధృవీకరించారు. -
కరుణ్ నాయర్ డబుల్ సెంచరీ
రంజీ ట్రోఫీ 2025-26 ఎడిషన్లో కర్ణాటక ఆటగాడు కరుణ్ నాయర్ సూపర్ ఫామ్ను కొనసాగించాడు. తొలి మ్యాచ్లో సౌరాష్ట్రపై హాఫ్ సెంచరీ (73), రెండో మ్యాచ్లో గోవాపై భారీ సెంచరీ (174 నాటౌట్) చేసిన అతడు.. తాజాగా కేరళతో జరుగుతున్న మ్యాచ్లో ఏకంగా డబుల్ సెంచరీతో (233) చెలరేగాడు. ఇదే ఇన్నింగ్స్లో మరో కర్ణాటక ఆటగాడు స్మరణ్ రవిచంద్రన్ (171 నాటౌట్) కూడా డబుల్ సెంచరీ దిశగా సాగుతున్నాడు.కరుణ్, స్మరణ్ చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేస్తున్న కర్ణాటక భారీ స్కోర్ (514/4) చేసింది. స్మరణ్తో పాటు అభినవ్ మనోహర్ (15) క్రీజ్లో ఉన్నాడు. కృష్ణణ్ శ్రీజిత్ (65) అర్ద సెంచరీతో రాణించాడు. బాసిల్ 2, నిధీష్, బాబా అపరాజిత్ తలో వికెట్ తీశారు. ప్రస్తుతం మ్యాచ్ రెండో రోజు రెండో సెషన్ ఆట కొనసాగుతుంది.చదవండి: PAK Vs SA: రాణించిన బాబర్, అఫ్రిది.. పాకిస్తాన్దే టీ20 సిరీస్ -
దోసె బిజినెస్తో నెలకు రూ. కోటి సంపాదిస్తున్న జంట
ఒక్కోసారి మనకు తగిలిన దెబ్బలే విజయపథంవైపు అడుగులు వేయిస్తాయి. మన అభిరుచులు, కోరికలే మన జీవితంలోఊహించని సక్సెస్కు బాటలు వస్తాయి.ముంబైకు చెందిన జంట సక్సెస్ స్టోరీ కూడా అలాంటిదే.బెంగళూరుకు చెందిన అఖిల్, శ్రీయ దంపతులు ముంబైలో మొదట్లో కొన్ని కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకుంటూ అరకొర జీతాలతో నెట్టుకొచ్చేవారు. దీంతో ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచన ఇద్దరిలోనూ బాగా ఉండేది. అఖిల్ అయ్యర్, శ్రియ నారాయణకు కర్ణాటకలోని దావణగిరె దోసెలంటే పిచ్చి ప్రేమ. దాన్ని తమ స్నేహితులకు రుచి చూపించారు. మంచి స్పందన లభించింది. అంతే వ్యాపార ఆలోచనకు పదును పెట్టారు. ఆ అభిరుచి, పట్టుదలకు కృషి తోడైంది. అలా ఎంబీఏలు, ఐఐటీలు లేకుండానే నెలకు కోటి రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగారు. View this post on Instagram A post shared by Benne (@benne.bombay) ఎలాంటి పెట్టుబడి దారులు, ఫుడ్ ఇండస్ట్రీలో అనుభవం లేకుండానే బాంద్రాలో ఒక చిన్న కేఫ్ను ప్రారంభించారు. కేవలం 12 సీట్లతో కెఫే మొదలైంది. మెల్లిగా మంచి పేరు తెచ్చుకుంది. తాజా దోసెకు తోడు రుచికరమైన చట్నీ ఇంత కంటే ఏం కావాలి. స్పందన అఖండంగా మారిపోయింది. త్వరలోనే, నగరం నలుమూలల నుండి ప్రజలు బెన్నే దోసెల రుచి చూడటానికి అవుట్లెట్ వెలుపల బారులు తీరారు. నేడు ప్రతీ రోజుకి 800కు పైగా దోసెలమ్మే స్థాయికి వారి బిజినెస్ వృద్ధి చెందింది. ఒక్కో దోసె ధర రూ. 250 నుండి రూ. 300 వరకు ఉంటుంది. ఫలితంగా నెలకు రూ. 1 కోటి సంపాదన ఆర్జించే వ్యాపారంగా మారింది. దోసె టేస్టే పెద్ద సక్సెస్ ఫ్యాన్సీ ఇంటీరియర్స్ లేదా సెలబ్రిటీ ఎండార్స్మెంట్లేవీ లేవు. ఒక చిన్న ప్రాంతాన్ని అద్దెకు తీసుకుని దానిని క్లౌడ్ కిచెన్లా మార్చారు. తమ కలల కేఫ్ అయిన బెన్నేగా పేరుపెట్టుకున్నారు. శుభ్రత, నిజమైన రుచి, తాజా వంటలు ఆహార ప్రియులకు తెగ నచ్చేశాయి. ఆ నోటా ఈ నోటా కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారా మంచి గిరాకీ వచ్చింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల ద్వారా ఈ రెస్టారెంట్ ఖ్యాతి పెరిగింది. ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ , అనుష్క జంట 2024లో బెన్నే కేఫ్ను సందర్శించి ఆహా అని అరగించారు. ఇంకా రోహిత్శర్మ లాంటి ప్రముఖుల మనసు దోచుకుందీ బెన్నే దోసె ఇంకా దీపికా పదుకొనే, రణవీర్ సింగ్, రాజ్కుమార్ రావు, శ్రద్ధా కపూర్ , దియా మీర్జా వంటి ప్రముఖులు విరాట్ జంటతో కలిసి కన్నడ బెన్నే దోసెలమీద మనసు పారేసుకున్నవారే. అంతేకాదు సోషల్మీడియా ద్వారా బాగా ప్రచారం చేసుకున్నారు. రీల్స్ ద్వారా మంచి ఆదరణను పెంచుకున్నారు. ఇక్కడ అన్ని రకాల దోసెలతో పాటు, ఇడ్లీ, ఇతర సౌత్ ఇండియన్ టిఫిన్లు, కాఫీ కూడా ప్రత్యేకమే. కాగా శ్రియ నారాయణ్ , అఖిల్ అయ్యర్ దంపతులు ముంబైలో ‘బెన్నే, బెంగళూరు హెరిటేజ్’ గోవాలో ‘బెన్నే బ్రాంచ్లను నిర్వహిస్తున్నారు. అన్నట్టు అఖిల్ ఒకప్పుడు సినిమా నిర్మాత. కాగా ఆమె మనస్తత్వవేత్త. View this post on Instagram A post shared by Benne (@benne.bombay) -
‘ఆ రాష్ట్రాలకు శుభాకాంక్షలు’: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (ఈరోజు) శనివారం కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ, హర్యానా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయా రాష్ట్రాలు నేడు వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఛత్తీస్గఢ్ ఏర్పడి నేటికి 25 ఏళ్లు పూర్తియిన సందర్భంగా ప్రధాని మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు.ప్రధాని మోదీ తన ‘ఎక్స్’ పోస్ట్లో ‘ప్రకృతి, సంస్కృతికి అంకితమైన ఛత్తీస్గఢ్ నేడు ప్రగతికి సరికొత్త ప్రమాణాలను నెలకొల్పడంలో నిమగ్నమై ఉంది. ఒకప్పుడు నక్సలిజం బారిన పడిన ఇక్కడి ప్రాంతాలు నేడు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి’ అని పేర్కొన్నారు. 1956లో ఇదేరోజున ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ, 1966లో పంజాబ్, హర్యానా, 2000లో ఛత్తీస్గఢ్ ఏర్పాటయ్యాయని ప్రధాని మోదీ గుర్తుచేశారు. Today, when we mark Kannada Rajyotsava, we celebrate the spirit of excellence and industrious nature that the people of Karnataka are synonymous with. We also celebrate the outstanding culture of Karnataka, reflected in its literature, art, music and more. The state embodies the…— Narendra Modi (@narendramodi) November 1, 2025కన్నడ రాజ్యోత్సవం సందర్భంగా కర్ణాటక ప్రజలను ప్రధాని అభినందించారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’ ఇదేవిధంగా కేరళ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించే మధ్యప్రదేశ్ ప్రజలకు కూడా ప్రధాని మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. హర్యానా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ‘మన రైతు సోదరులు, సోదరీమణుల అవిశ్రాంత కృషి, సైనికుల అసమానమైన పరాక్రమం కారణంగా ఈ చారిత్రాత్మక భూమి.. దేశానికి ఒక ఉదాహరణగా నిలిచిందని’ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ‘ఢిల్లీ కాదది.. ఇంద్రప్రస్థ’.. సాక్ష్యాలతో ఎంపీ లేఖ -
‘నా కుమార్తె చనిపోయిందన్న కనికరంలేదు వీళ్లకి.. లంచం పేరుతో కాల్చుకు తిన్నారు’!
సాక్షి,బెంగళూరు: గుండెను మెలిపెట్టే ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషాద ఘటనలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఉన్నత ఉద్యోగి ఒక్కగానొక్క కుమార్తె మరణించిన తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసేందుకు లంచాలు ఇచ్చారు. అంబులెన్స్ డ్రైవర్ నుంచి ఉన్నతస్థాయి పోలీసు అధికారి వరకు ఎలా లంచాలు అడిగారో? అందుకు తాను లంచాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో?లింక్డిన్ పోస్టులో సుదీర్ఘంగా వివరించారు. ఆ పోస్టును కొద్దిసేపటికే డిలీట్ చేశారు. అప్పటికే ఆ పోస్టు వైరల్గా మారింది.ఆ లింక్డిన్ పోస్టులో..బెంగళూరులో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)కె.శివకుమార్ కుమార్తె అక్షయ శివకుమార్(34). కంప్యూటర్ సైన్స్లో బీటెక్, అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ప్రముఖ పెట్టుబడుల సంస్థ గోల్డ్మన్ సాచ్స్ ఎనిమిదేళ్లు పనిచేశారు. ఇతర సంస్థల్లో మూడేళ్లు పనిచేశారు.అయితే ఈ క్రమంలో వర్క్ఫ్రమ్ హోమ్లో విధులు నిర్వహిస్తున్న అక్షయ గతనెల సెప్టెంబర్ 18 మెదడు రక్తస్రావం కారణంగా ఇంట్లోనే మరణించారు. అక్షయ మరణించిన తర్వాత అధికారిక లాంఛనాలను పూర్తి చేశారు. ఆ సమయంలో పలువురు తన వద్ద నుంచి లంచం డిమాండ్ చేశారని, మరికొందరు తనపట్ల దారుణంగా వ్యవహరించారని వాపోయారు. https://t.co/yJRWH989TU— DCP Whitefield Bengaluru (@dcpwhitefield) October 30, 2025 ‘నా కుమార్తె మరణం తర్వాత..అవసరమైన ఫార్మాలటీస్లను పూర్తిచేసేందుకు అవసరమైన పత్రాలను పొందడానికి అంబులెన్స్ ఆపరేటర్ నుంచి పోలీసు అధికారుల వరకు..శ్మశానవాటిక నుంచి బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) కార్యాలయ సిబ్బంది వరకు దాదాపు అందరికీ లంచాలు చెల్లించాల్సి వచ్చింది.పోలీస్ స్టేషన్లో కూడా తనను నగదు రూపంలో చెల్లించమని బలవంతం చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్,పోస్టుమార్టం నివేదిక కాపీని ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం పోలిస్స్టేషన్ చుట్టూ నాలుగు రోజులు తిరిగాం. పనికాలేదు. పోలీసులు స్టేషన్లోని బహిరంగంగా నన్ను లంచం డిమాండ్ చేశారు. ఆ లంచాన్ని కూడా పోలిస్ స్టేషన్లోనే ఇచ్చారు. నేను నా ఏకైక బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఖంతో ఉంటే.. ఈ సమాజం సానుభూతి లేకుండా నన్ను లంచం పేరుతో కాల్చుకు తిన్నది. ఇది దారుణం. నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను చెల్లించాను. మరి పేదల పరిస్థితి ఏంటి?నా కుమార్తె భౌతికకాయాన్ని కసవనహళ్లిలోని ఓ ఆస్పత్రి నుంచి కోరమంగళలోని సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించాల్సి ఉంది. ఇందుకోసం అంబులెన్స్ డ్రైవర్ రూ.3వేలు డిమాండ్ చేశాడు. పోలీసుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాపట్ల కుమార్తె చనిపోయిందన్న కనికరం కూడా చూపించలేదు పోలీసు అధికారులు లంచం అడిగారు. అసభ్యంగా మాట్లాడారు. ‘(తన గురించి మాట్లాడుతూ..)ఒక వ్యక్తి ఇప్పటికే మానసికంగా కుంగిపోయి, భావోద్వేగంగా తల్లడిల్లుతున్న సమయంలో పోలీసులు డబ్బులు డిమాండ్ చేయడం,నిర్లక్క్ష్యంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం. వాళ్లకు కుటుంబం లేదా? వారికి బావోద్వేగాలు ఉండవా? ఇది అక్కడితో ఆగలేదు. బీబీఎంపీ నుంచి డెత్ సర్టిఫికెట్ పొందడానికి చాలా ఇబ్బంది పడ్డా. డెత్ సర్టిఫికెట్ కోసం బీబీఎంపీ కార్యాలయానికి ఐదురోజుల పాటు కాళ్లరిగేలా తిరగా. కొనసాగుతున్న ‘కుల సర్వే’ కారణంగా ఎవరూ అందుబాటులో లేరు. చివరికి బీబీఎంపీ సీనియర్ అధికారిని సంప్రదించిన తర్వాతే డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇందుకోసం సదరు అధికారి నా వద్ద నుంచి ప్రభుత్వం నిర్ధేశించిన రుసుము కంటే ఎక్కువ మొత్తంలో వసూలు చేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. చివరిలో.. ఈ అరాచకం నుంచి బెంగళూరును రక్షించగలరా? నారాయణ మూర్తి, అజీమ్ ప్రేమ్జీ, మజుందార్ షాలు బిలియన్ల కొద్దీ డబ్బున్న పెద్దలు ఈ నగరాన్ని రక్షించగలరా? వారు చాలా మాట్లాడతారు కానీ...అని ముగించారు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బెంగళూరు వైట్ఫీల్డ్ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. శివకుమార్ ట్వీట్లో పేర్కొన్న సంఘటనకు సంబంధించి, బెల్లందూర్ పోలీస్ స్టేషన్కు చెందిన ఓ పీఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి అసభ్యకరమైన లేదా అనుచితమైన ప్రవర్తనను సహించదు’అని పోలీసులు తెలిపారు. -
సైడ్ మిర్రర్ను తాకాడని..
మెట్రో నగరం బెంగళూరులో మరో ఘాతుకం చోటు చేసుకుంది. తమ కారు సైడ్ మిర్రర్కు తాకిందని బైకర్తో గొడవపడి.. ఆపై ఆ యువకుడిని వెంటాడి కారుతో గుద్ది చంపారు ఇక్కడో జంట. ఈ షాకింగ్ ఘటనలో పోలీసులు వెల్లడించిన వివరాలు ఉన్నాయి. ఈ నెల 25న అర్ధరాత్రి దర్శన్ తన స్నేహితుడు వరుణ్తో కలిసి ఫుట్టనహెళిలోని శ్రీరామ లేఅవుట్ ప్రాంతంలో బైకుపై వెళ్తున్నారు. ఆ సమయంలో పక్కగా వెళుతున్న ఓ కారు సైడు మిర్రర్ను వీరి బైకు తాకింది. కారులో ఉన్న దంపతులు బైక్ నడుపుతున్న దర్శన్తో గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో ముందు వెళుతున్న బైకును దంపతులు కారులో రెండు కి.మీ. వెంబడించారు. వెనక నుంచి బైకును ఢీకొట్టి వెళ్లిపోయారు.#Bengaluru Road Rage Turns Deadly!A Kalaripayattu trainer & his wife were arrested for killing a delivery agent near JP Nagar: They rammed their car into his bike after its handle grazed their rear-view mirror. The pillion rider survived the crash.@timesofindia pic.twitter.com/IqlaIedTGt— TOI Bengaluru (@TOIBengaluru) October 29, 2025ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దర్శన్, వరుణ్లను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. దర్శన్ చనిపోగా.. వరుణ్ చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న జేపీనగర పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. యాక్సిడెంట్ తర్వాత కారు నుంచి విడిభాగాలు పడిపోతే ఆ జంట మాస్కులతో వెనక్కి వచ్చి మరీ వాటిని తీసుకెళ్లడం రికార్డైంది. ఈ క్రమంలో.. లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులకు నిందితుల ఆచూకీ లభ్యమైంది. నిందితులను భార్యాభర్తలైన మనోజ్, ఆరతిగా గుర్తించి బుధవారం అరెస్టు చేశారు. విచారణలో తాము నేరానికి పాల్పడినట్లు వాళ్లు ఒప్పుకున్నారు. తొలుత బైక్తో ఢీ కొట్టడానికి ప్రయత్నించగా.. వాళ్లు తప్పించుకున్నారని, ఆపై యూటర్న్ తీసుకుని మరోసారి వెంబడించి మరీ ఢీ కొట్టామని ఈ దంపతులు పోలీసులకు తెలిపారు. -
మన బంధువే.. సెటిల్ చేసుకుంటారులే..
కర్నాటక రాష్ట్రం: రైతుకు డబ్బులు ఎగ్గొట్టిన హైదరాబాద్ వ్యాపారులకు మద్దతుగా కర్ణాటక మంత్రి ఫోన్ చేయడం వైరల్ అయ్యింది. బెంగళూరు సమీపంలో చిక్కబళ్లాపురం వద్ద పెరేసంద్ర గ్రామంలో జొన్నల వ్యాపారి రామక్రిష్ణప్ప హైదరాబాద్లోని అబ్దుల్ రజాక్, అక్బర్ బాషా, నసీర్ అనే దళారులకు జొన్నల లోడ్లను పంపారు. ఇందుకుగాను రూ. 1.89 కోట్లు వారు దళారీ రామక్రిష్ణప్పకు చెల్లించాల్సి ఉంది. అయితే డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితుడు పేరేసంద్ర ఠాణాలో ఫిర్యాదు చేయడంతో సబ్ ఇన్స్పెక్టర్ జగదీశ్రెడ్డి కేసు నమోదు చేశారు. హైదరాబాద్లో ఉంటున్న అక్బర్ను ఠాణాకు తీసుకు వచ్చారు. నేను సెటిల్ చేస్తా..ఇక్కడే కథ మలుపు తిరిగింది. సదరు వ్యాపారిని సీఐ విచారిస్తుండగా గృహ నిర్మాణ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ఖాన్ ఆఫీసు నుంచి అతడి సహాయకుడు లక్ష్మీనారాయణ ఠాణాలోని సిబ్బందికి కాల్ చేసి, మంత్రి మీతో మాట్లాడతారని ఫోన్ మంత్రికి ఇచ్చారు. దీంతో లైన్లోకి వచ్చి మంత్రి జమీర్ అహ్మద్ సమస్తే బ్రదర్, హైదరాబాద్లో ఉంటున్న మన బంధువు అక్బర్ ఇక్కడ ఎవరికో డబ్బులు ఇవ్వాలని తీసుకువచ్చారట, ఏమి కేసు అది? అని అడిగారు. దీనిపై ఎస్ఐ జగదీశ్రెడ్డి స్పందిస్తూ ఇక్కడ జొన్నల వ్యాపారికి డబ్బులు ఇవ్వాలని, అందుకు సంబంధించి రికార్డులు ఉన్నాయని, వారి పైన ఎఫ్ఐఆర్ నమోదైనందున వారిని తీసుకువచి్చనట్లు చెప్పాడు. దీంతో మంత్రి మాట్లాడుతూ అది అంత మొత్తం కాదు, కూర్చుని సెటిల్మెంట్ చేసుకుంటారట, మేము ఆ పని చేస్తాము, మీరు వారిని వదిలిపెట్టండి అని సూచించారు. ఈ ఆడియో వైరల్ అయింది. బాధితుడు రామక్రిష్ణప్ప మాట్లాడుతూ రైతులకు సహాయం చేయాల్సిన మంత్రి ఇలా చేస్తే ముఖ్యమంత్రి ఇంటి ఎదుట ధర్నా చేపడతామని పేర్కొన్నాడు. -
పరస్పర సమ్మతితో లైంగిక క్రియ నేరం కాదు
కర్ణాటక: పరస్పర సమ్మతితో లైంగిక క్రియ నేరం కాదని కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. డేటింగ్ యాప్లో పరిచయమైన యువకుడు, తనను ఓయో రూమ్కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఓ మహిళ ఇటీవల ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు సాంప్రస్ ఆంథోనిపై బెంగళూరులోని ఓ ఠాణాలో కేసు దాఖలైంది. దీనిపై నిందితుడు హైకోర్టులో పిటిషన్ వేశాడు. తామిద్దరి మధ్య అంగీకారం ఉందని పేర్కొన్నాడు. విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న.. పరస్పర సమ్మతితో జరిగే లైంగిక క్రియ నేరం కాదని వ్యాఖ్యానించారు. సమ్మతితో ఆరంభమైన సంబంధం నిరాశతో అంతమైందని పేర్కొన్నారు. నిందితుడిపై దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని ఆదేశించారు. -
గోదావరి-కావేరి అనుసంధానంపై ముందడుగు!
సాక్షి, అమరావతి: గోదావరి–కావేరి అనుసంధానానికి ముందడుగు పడింది. ఇచ్చంపల్లి నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీనికి తెలంగాణ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని 148 టీఎంసీలను తాత్కాలికంగా తరలించేలా అనుసంధానం చేపడతామని చెబుతున్నారని, హిమాలయ నదుల నుంచి గోదావరికి నీటిని తెచ్చాక వాటిని శాశ్వత ప్రాతిపదికన కావేరికి మళ్లిస్తామని అంటున్నారని, అసలు హిమాలయ నదుల నుంచి గోదావరికి నీటిని ఎప్పుడు తెస్తారో చెప్పాలని కేంద్రాన్ని ఏపీ సర్కార్ కోరింది.జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్డబ్ల్యూడీఏ) పాలకమండలి 75వ సమావేశం ఈ నెల 1న కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు అధ్యక్షతన జరిగింది. అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖ కార్యదర్శులు పాల్గొన్న ఈ సమావేశంలో గోదావరి–కావేరి అనుసంధానంపై చర్చించారు. ఆ వివరాలను పాలకమండలి విడుదల చేసింది.రాష్ట్రాల సమ్మతి ప్రకారమే.. ఇంద్రావతి సబ్ బేసిన్లో ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని 148 టీఎంసీల గోదావరి జలాలను ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్(కృష్ణా), సోమశిల(పెన్నా), అరణియార్ రిజర్వాయర్ల మీదుగా కావేరికి గోదావరి జలాలను తరలించేలా 2022లో ఎన్డబ్ల్యూడీఏ డీపీఆర్ను రూపొందించింది. అంతర్భాగంగా కర్ణాటకలో బెడ్తి–వరద అనుసంధానం చేపడతామని పేర్కొంది. కావేరికి తరలించే 148 టీఎంసీల గోదావరి జలాలు, బెడ్తి–వరద అనుసంధానంలో తరలించే 18.5 టీఎంసీలు కలిపి మొత్తం 166.5 టీఎంసీల్లో... తెలంగాణకు 43.65, ఆంధ్రప్రదేశ్కు 43.86, తమిళనాడుకు 40.93, కర్ణాటకకు 34.40, పుదుచ్చేరికి 2.19 టీఎంసీలు కేటాయిస్తామని తెలిపింది. దీనివల్ల 6,78,797 హెక్టార్లకు సాగునీరు, తాగునీటిని అందించవచ్చని పేర్కొంది.ఈ డీపీఆర్పై బేసిన్లోని రాష్ట్రాలతో కేంద్రం పలుమార్లు సంప్రదింపులు జరిపింది. తాజా సమావేశంలో ఇంద్రావతి సబ్ బేసిన్లో ట్రిబ్యునల్ కేటాయించిన జలాలను తాము వాడుకుంటామని.. అదనంగా ఉన్న నీటిని కావేరికి మళ్లిస్తే తమకు అభ్యంతరం లేదని ఛత్తీస్గఢ్ పేర్కొంది. ఈ అనుసంధానానికి తెలంగాణ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అనుసంధానం ద్వారా మళ్లించే జలాల్లో 50 శాతం తమకు కేటాయించాలని కోరింది. గోదావరిలో నికర జలాల్లో మిగులు లేదని.. తాత్కాలికంగా ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని నీటినే కావేరికి తరలిస్తామని కేంద్రం చెబుతోంది.హిమాలయ నదుల నుంచి గోదావరికి నీటిని తెచ్చాక.. ఆ నీటిని శాశ్వత ప్రాతిపదికన కావేరికి మళ్లిస్తామని అంటోంది. ఈ నేపథ్యంలో హిమాలయ నదుల నీటిని గోదావరికి ఎప్పుడు తెస్తారో చెప్పాలని ఏపీ కోరింది. లేదంటే తమ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని తెలిపింది. కృష్ణా జలాల్లో తమకు అదనపు వాటా పెంచాలని కర్ణాటక, మహారాష్ట్ర డిమాండ్ చేశాయి. తక్షణమే అనుసంధానం చేపట్టాలని తమిళనాడు, పుదుచ్చేరి కోరగా.. కావేరి జలాల్లో అదనపు వాటా కావాలని కేరళ డిమాండ్ చేసింది. బేసిన్లోని రాష్ట్రాల సమ్మతి, ట్రిబ్యునల్ అవార్డుల ప్రకారమే ఈ అనుసంధానం చేపడతామని కేంద్రం స్పష్టం చేసింది. -
టీమిండియా పొమ్మంది.. కట్ చేస్తే! సెంచరీతో సెలక్టర్లకు వార్నింగ్
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు ముందు టీమిండియా వెటరన్ కరుణ్ నాయర్ అద్భుత సెంచరీతో సెలక్టర్లకు సవాల్ విసిరాడు. భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన వెటరన్ కరుణ్ నాయర్.. ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో కర్ణాటకకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఈ క్రమంలో శిమొగా వేదికగా గోవాతో జరుగుతున్న మ్యాచ్లో నాయర్ శతక్కొట్టాడు. 65 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కర్ణాటకను నాయర్ తన సెంచరీతో ఆదుకున్నాడు. తొలుత అభినవ్ మనోహర్తో భాగస్వామ్యం నెలకొల్పిన నాయర్.. తర్వాత శ్రేయస్ గోపాల్తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు.కరుణ్ ప్రస్తుతం 129 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. అతడి ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 11 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అంతకుముందు సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్లో కూడా హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్లో 95 ఓవర్లు ముగిసే సరికి కర్ణాటక 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది.నాయర్ మళ్లీ వస్తాడా?కాగా దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్.. ఇంగ్లండ్ గడ్డపై తనను లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ సిరీస్లో నాలుగు టెస్టులు ఆడి కేవలం 25.63 సగటుతో 205 పరుగులు మాత్రమే చేశాడు. భారత బ్యాటర్లు సెంచరీల మోత మ్రోగించిన చోట.. నాయర్ కనీసం ఒక్కసారి కూడా మూడెంకెల స్కోర్ సాధించకపోవడం సెలక్టర్లను తీవ్రంగా నిరాశపరిచింది.దీంతో స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన టెస్టు సిరీస్కు కరుణ్ నాయర్ను జట్టు నుంచి తప్పించారు. అతడి స్ధానంలో దేవ్దత్త్ పడిక్కల్కు అవకాశమిచ్చారు. ఇప్పుడు మళ్లీ తన ఫామ్ను తిరిగి అందుకోవడంతో నాయర్ను సౌతాఫ్రికా సిరీస్కు ఎంపిక చేస్తారో లేదో వేచి చూడాలి.చదవండి: రోహిత్ శర్మ రిటైర్మెంట్ అప్పుడే.. కన్ఫర్మ్ చేసిన కోచ్ -
మాజీ ఎమ్మెల్యేను కుమ్మేసిన ఎద్దు.. పోటీల్లో అపశృతి
బెంగళూరు: కర్ణాటకలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఎద్దుల పందెం పోటీల ఉత్సవం సందర్భంగా ఓ ఎద్దు.. మాజీ ఎమ్మెల్యేను ఎత్తి పాడేసింది. దీంతో, ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కర్ణాటకలోని శివమొగ్గలోని బల్లిగావిలో హోరీ హబ్బా అనే సాంప్రదాయ ఎద్దుల పందేల ఉత్సవం జరిగింది. ఈ సందర్బంగా శికారిపుర పట్టణానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మహాలింగప్ప, స్థానికులు ఈ కార్యక్రమం చూసేందుకు వచ్చారు. ఈ కార్యక్రమం జరుగుతుండగా.. ఒక ఎద్దు అక్కడున్న వారిపైకి దూసుకొచ్చింది. ఇంతలో ఒక ఇంటి ముందే నిలుచున్న మాజీ ఎమ్మెల్యే మహాలింగప్పపైకి ఎద్దు దూసుకెళ్లింది. తన కొమ్ములతో అతడిని ఎత్తి పడేసింది. దీంతో, మహాలింగప్ప తీవ్రంగా గాయపడి అక్కడే పడిపోయాడు. అనంతరం, స్థానికుల.. ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మహాలింగప్ప చికిత్స పొందుతున్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కర్ణాటకలో హోరీ అనేది ఒక సాంప్రదాయ గ్రామీణ క్రీడ. ఈ సందర్బంగా అలంకరించబడిన ఎద్దులను పెద్ద సంఖ్యలో ప్రేక్షకులపైకి పరుగెత్తిస్తారు. ఇందులో పాల్గొనే కొంతమంది వాటిని లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కొన్ని రోజుల క్రితం హోరీ పోటీల సమయంలో హవేరి జిల్లాలో నలుగురు మరణించారు. హవేరి, తిలవల్లి తాలూకాలతో సహా వివిధ ప్రాంతాలలో ప్రాణనష్టం జరిగినట్టు అధికారులు నిర్ధారించారు.Video: Karnataka Ex-MLA Gored During Bull Race Festival https://t.co/4HGPlNhBap pic.twitter.com/NAFHOLB2Lb— NDTV (@ndtv) October 25, 2025 -
బిగ్బాస్ ఫేమ్ దివ్యపై హిట్ అండ్ రన్ కేసు.. ఏం జరిగిందంటే?
సాక్షి, యశవంతపుర: బిగ్బాస్ అనగానే వివాదాలు, గొడవలు గుర్తుకువస్తాయి. అదే మాదిరిగా బుల్లితెర నటి, గతంలో బిగ్బాస్–8 పోటీదారు దివ్య సురేశ్ హిట్ అండ్ రన్ కేసులో చిక్కుకుంది. బైక్ను ఢీకొనడంతో ఓ యువతి కాలు విరిగినట్లు తెలిసింది. దీంతో, ఆమెను విచారించి కారును సీజ్ చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఈనెల నాలుగో తేదీ అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో బెంగళూరు బ్యాటరాయనపుర ఎంఎం రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. కిరణ్, అనుషా, అనిత కలిసి బైకులో ఆస్పత్రికి వెళుతున్నారు. కుక్కలు అడ్డురావటంతో భయంతో కిరణ్ బైకును కొద్దిగా కుడివైపు తిప్పాడు. అదే సమయంలో వెనుక వేగంగా వస్తున్న దివ్య సురేశ్ కారు.. వీరి బైక్ను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు కింద పడ్డారు. అనిత కాలికు దెబ్బ తగిలింది. అయినా కూడా దివ్య కారు ఆపి ఏమైందో తెలుసుకోకుండా అలాగే ఉడాయించింది. రూ.2 లక్షలు ఖర్చయింది ఈ క్రమంలో కిరణ్ ఏడో తేదీన కారు హిట్ అండ్ రన్పై బ్యాటరాయనపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం, పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా అది దివ్య సురేశ్ కారుగా గుర్తించారు. దీంతో, ఆమెను విచారించి కారును సీజ్ చేశారు. అనిత కాలు ఫ్రాక్చర్ కావడంతో ఆస్పత్రిలో చేరింది. చికిత్సగానూ రూ. 2లక్షలు ఖర్చయినట్లు, తమకు న్యాయం చేయాలని కిరణ్ ఫిర్యాదులో కోరాడు. Weeks after a late-night hit-and-run accident in Bengaluru, the city traffic police on Friday identified ex Bigg Boss Kannada contestant Divya Suresh as the alleged driver of the car involved in the accident that left three people injured. The accident took place near Nithya… pic.twitter.com/ucoigQ6FWn— Karnataka Portfolio (@karnatakaportf) October 24, 2025 -
అక్కడ మహాలయ అమావాస్యే దీపావళి పండుగ..!
దేశమంతా దివ్వెల కాంతులు అద్దుకుని, తారాజువ్వలతో నింగి కూడా మెరిసి΄ోయేది దీపావళి అమావాస్య నాటి రాత్రే! కానీ కర్ణాటక, దావణగేరేలోని లోకికేరే పల్లెలో మాత్రం సీన్ చిత్రంగా ఉంటుంది. ఆ ఊరివాసులు దాదాపు రెండువందల ఏళ్లుగా దీపావళి పండుగను జరుపుకోవట్లేదు. ఆ రాత్రి అక్కడ ముంగిళ్లలో దీపాల కొలువు.. టపాసుల సందడి కాదుకదా కనీసం వీధి దీపాలు కూడా వెలగని విషాదం కనిపిస్తుంది. దానికి ఒక నేపథ్యం ఉంది.అదేంటంటే...రెండు శతాబ్దాల కిందట.. దీపావళికి ముందు.. పండుగకోసం అవసరమైనవి తీసుకురావడానికి లోకికేరేకి చెందిన కొంతమంది యువకులు దగ్గర్లో ఉన్న అడవికి వెళ్లారు. ఆ వెళ్లినవారు ఎంత పొద్దెక్కినా తిరిగి రాలేదు. గ్రామస్తులంతా ఆ అడవికి వెళ్లి అణువణువు గాలించారు. అయినా లాభం లేక΄ోయింది. వాళ్ల ఆనవాళ్లను కూడా కనిపెట్టలేకపోయారు. ఆ యువక బృందం ఆ రాత్రే కాదు.. ఎప్పటికీ తిరిగి రాలేదు. ఆ బాధలో వాళ్లు దీపావళి జరుపుకోలేదు. తర్వాత ఏడాదికీ ఆ విషాదాన్ని మరువలేక΄ోయింది ఆ గ్రామం. కొంతమంది పండుగ ఆనవాయితీకి అంతరాయం ఎందుకు కలిగించాలని ప్రయత్నించి పండుగ జరిపారు. యాదృచ్చికంగా వాళ్లు నష్టాలను చవిచూడటం, అనారోగ్యం, ఇంట్లో దొంగలు పడటం లాంటి పరిణామాలను ఎదుర్కొన్నారు. కుర్రాళ్లు కనిపించకుండా ΄పోయిన బాధను మరిచి వాళ్లు పండుగ జరుపుకున్నందుకే ఆ అరిష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని నమ్మారు. దాంతో ఆ నమ్మకమే స్థిరపడి నాటినుంచి ఆ ఊళ్లో దీపావళినాడు ఊరంతా దీపాలు వెలిగించి దీపావళి జరపకోవడాన్నే సంప్రదాయంగా మలుచుకున్నారు. అదలా ఇప్పటికి రెండువందల ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది.అయితే...మహాలయ అమావాస్యను మాత్రం ఆ పల్లెలోని పూర్వీకుల సంస్మరణ దినంగా పండుగ జరుపుకుంటారు. ఆ రోజు వాళ్ల సంప్రదాయ, సంస్కృతుల మేరకు దీపావళి నాడు చేయాల్సిన కార్యక్రమాలన్నిటినీ నిర్వహిస్తారు. అంటే మహాలయ అమావాస్యనాడు తమదైన తీరులో దీపావళి జరుపుకుంటారు. ఒకరకంగా మహాలయ అమావాస్యే వారికి దీపావళి. ఇదీ లోకికేరే దీపావళి కథ! (చదవండి: దీపావళి 2025: ఆ పండుగ పేరుతోనే రెండు గ్రామాలు..కానీ అక్కడ..) -
ఓటుకు రూ.80 వసూలు.. ఓట్ చోరులను గుర్తించిన కర్నాటక సిట్
బెంగళూరు: 2023 కర్నాటక అసెంబ్లీ ఎన్నిక ల్లో అలంద్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా లో అవకతవకలు జరిగినట్లు వస్తున్న ఆరోప లు నిజమేనని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తెలిపింది. ఓటర్ల పేర్లను తొలగించే కుంభకోణంతో కనీసం ఆరుగురికి సంబంధమున్నట్లు గుర్తించింది.ఇక, వీరికి ఓ డేటా సెంటర్తో సంబంధాలున్నాయని, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ ద్వారా ఓటరు జాబితా నుంచి పేర్లను తొలగించారని సిట్కు సారథ్యం వహించిన సీఐడీ అద నపు డీజీ బీకే సింగ్ చెప్పారు. పేర్లను తొలగించాలంటూ అందిన మొత్తం 6,994 అభ్యర్థన ల్లో ఏవో కొన్ని మినహా చాలామటుకు బోగస్ వేనని గుర్తించామన్నారు. అలంద్లో ఓటర్ల తొలగింపునకు కుట్ర జరిగింది వాస్తవమని చెప్పారు. మొత్తం 30 మంది వరకు ప్రశ్నించి, అనుమానితులుగా ఆరుగురిని నిర్ధారించామని, వీరిని త్వరలో అరెస్ట్ చేస్తామని వివరించారు. విచారణలో వెల్లడైన సమాచారం ఆధారంగా కొన్ని ప్రాంతాల్లో దాడులు జరిపామన్నారు.ఇందులో అప్పట్లో అలంద్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమిపాలైన సుభాష్ గుత్తేదార్, ఆయన ఇద్దరు కుమారుల ఇళ్లు కూడా ఉన్నాయన్నారు. సోదాల సమయంలో సుభాష్ ఇంటికి సమీపంలో కాలిపోయిన ఓటరు జాబితాలు బయటపడినట్లు ఆయన వెల్లడించారు. అయితే, దీపావళి సందర్భంగా తమ సిబ్బంది వృథా వస్తువులను తొలగించే క్రమంలో పనికి రాని ఓటరు జాబితాలను సైతం కాల్చేశారని సుభాష్ గుత్తేదార్ వివరించారు. ఇందులో ఎలాంటి కుట్రకోణం లేదన్నా రు.ఇలా ఉండగా, అలంద్ నియోజకవర్గం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సొంత జిల్లా కలబురిగి పరిధిలోనిదే కావడం గమనార్హం. అలంద్లో ఓట్ చోరీ జరిగినట్లు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ ఇటీవల చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. దీనిపై దర్యాప్తు కోసం కర్నా టకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ను నియమించింది. కాగా, అలంద్ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి అవకతవకలు జరిగాయని మంత్రి ప్రియాంక్ ఖర్గే గురువారం ఆరోపించారు. వాటిపైనా సమగ్ర దర్యాప్తు జరపాల్సి ఉందన్నారు. ఈ ముఠా ఓటుకు రూ.80 చొప్పున వసూలు చేసిందన్నారు. ఇదంతా బీజేపీ నేతలు పాల్పడిన కుంభకోణమేనన్నారు. బాధ్యులను కటకటా ల్లోకి నెట్టాలని డిమాండ్ చేశారు. కాగా, అప్పట్లో చీఫ్ ఎలక్టోరల్ అధికారి అడ్డుకోవడం వల్లే ఓట్ల తొలగింపు కుంభకోణానికి బ్రేకులు పడ్డాయని అలంద్లో 10వేల ఓట్ల తేడాతో గెలుపొందిన కాంగ్రెస్ సీనియర్ నేత బీఆర్ పాటిల్ తెలిపారు. -
‘మా నాన్న తర్వాతి సీఎం ఆయనే’.. బాంబు పేల్చిన సిద్ధరామయ్య కుమారుడు
సాక్షి,బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కుమారుడు ఎమ్మెల్సీ యతీంద్ర సిద్ధరామయ్య బాంబు పేల్చారు. మా నాన్న కెరీర్ ముగిసింది. ఇక కర్ణాటక కాంగ్రెస్ను ముందుండి నడిపించే శక్తిసామర్ధ్యాలు, ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఆ రాష్ట్ర ప్రజా పనుల వ్యవహారాల శాఖ మంత్రి (పీడబ్ల్యూడీ) సతీష్ జార్కిహోళికే ఉన్నాయని వ్యాఖ్యానించారు.బెళగావి జిల్లాలోని రాయ్బాగ్ తాలూకా కప్పలగుడ్డి గ్రామంలో మహాకవి కనకదాసు విగ్రహ ఆవిష్కరణలో యతీంద్ర సిద్ధరామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా యతీంద్ర తన తండ్రి, సీఎం సిద్ధరామయ్య రాజకీయ భవిష్యత్పై సంచలన వ్యాఖ్యలు చేశారు.‘నా తండ్రి తన రాజకీయ జీవితంలో చివరి దశలో ఉన్నారు. ఈ దశలో, ఆయనకు బలమైన భావజాలం, ప్రగతిశీల మనస్తత్వం కలిగిన నాయకుడు అవసరం. అలాంటి నాయకుడికి సిద్ధరామయ్య మార్గదర్శకుడిగా ఉంటారు. ఆ నాయకుడే మంత్రి సతీష్ జార్కిహోళి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నిలబెట్టి, పార్టీని సమర్థవంతంగా నడిపించగల వ్యక్తి. అటువంటి సైద్ధాంతిక విశ్వాసం ఉన్న నాయకుడిని గుర్తించడం చాలా అరుదు’ అని నేను గట్టిగా నమ్ముతున్నాను. సతీష్ సీఎంగా బాధ్యతలు చేపట్టాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్లో వర్గపోరు బయటకొచ్చిన వేళ..సిద్ధారామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలతో కర్ణాటక కాంగ్రెస్లో వర్గపోరు బహిర్గతమైంది. పీడబ్యూటీ మంత్రిగా పని చేస్తున్న సతీష్ జార్కిహోళిని తదుపరి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అంటూ యతీంద్ర సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలతో డీకే శివకుమార్తో ఉన్న విభేదాల్ని బహిర్గతం చేసింది. కర్ణాటకలో సిద్ధారామయ్య వారసుడిగా డీకే శివకుమార్ పేరే ప్రధానంగా వినిపిస్తున్న తరుణంలో యతీంద్ర చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్లో హీట్ పుట్టించాయి. యతీంద్ర తన మనసులోని మాటను ఒక ప్రజావేదికపై బయటపెట్టడంతో డీకేతో ఉన్న విభేదాలు ఉన్నాయనే దానికి మరింత బలం చేకూర్చింది. గతంలో సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా ఎన్నుకునే క్రమంలో డీకే శివకుమార్తో ఒప్పందం కూడా జరిగింది. తలో రెండున్నర ఏళ్లు చేయడానికి ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం సిద్ధరామయ్య రెండున్నరేళ్ల కాలం పూర్తి కావడానికి సమయం దగ్గర పడుతున్న సమయంలో తదుపరి డీకేకే రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలి. ఈ విషయంపై ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ వద్ద పంచాయతీ కూడా జరిగింది. మరి అటువంటిది ఇప్పుడు డీకేను కాదని, మంత్రి సతీష్ను తెరపైకి తీసుకురావడంతో కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు బయటకొచ్చాయి. VIDEO | Mysuru: “My father, (Siddaramaiah), is in the final stages of his political career. Satish Jarkiholi must take the Congress forward,” says Karnataka CM Siddaramaiah’s son, Yathindra Siddaramaiah.(Source: Third Party)#Karnataka (Full video available on PTI Videos -… pic.twitter.com/pCkXLEjqz7— Press Trust of India (@PTI_News) October 22, 2025 -
Karnataka: ‘వరల్డ్ రికార్డు’తో సీఎం సిద్దరామయ్య నవ్వులపాలు?
బెంగళూరు: తమ ప్రభుత్వం చేపట్టిన పథకానికి ‘లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ నుంచి సర్టిఫికెట్ అందిందని గొప్పగా ప్రకటించిన కర్ణాటక సీఎం ఇప్పుడు నవ్వులపాలవుతున్నారు. ఆ సర్టిఫికెట్ నకిలీదని తేలిన దరిమిలా సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల.. రాష్ట్రంలోని మహిళలకు ‘శక్తి యోజన’పేరుతో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించామని, ఈ నేపధ్యంలో మహిళలు అత్యధికంగా ఉచితంగా బస్సు ప్రయాణాలు చేశారని తెలిపారు. దీనిని ప్రపంచ రికార్డుగా ‘లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ గుర్తించిందని ప్రకటించారు. కర్ణాటక రెండు చరిత్రాత్మక రికార్డులతో ప్రపంచ వేదికపైకి ప్రవేశించిందని పేర్కొన్నారు.‘శక్తి యోజన’ పథకం కింద మహిళలు మొత్తంగా 564.10 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని, ఇది మహిళల రోజువారీ ప్రయాణాలలో కొత్త రికార్డు అని సిద్దరామయ్య తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు. దీనికితోడు కర్ణాటక రాష్ట్ర రవాణా సంస్థ 1997 నుంచి ఇప్పటివరకూ 464 జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకుందని చెబుతూ, రెండు సర్టిఫికెట్ల ఫొటో కాపీలను షేర్ చేశారు.ఈ రెండు సర్టిఫికెట్లపై లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్(ఇండియా)డాక్టర్ అవినాష్ డి. సకుండే, యూరోపియన్ యూనియన్ హెడ్(క్రొయేషియా)డాక్టర్ ఇవాన్ గచినాల సంతకాలున్నాయి. A BIG embarrassment for Congress.Yesterday, no less than Karnataka CM Siddaramaiah proudly claimed that two state schemes were recognised by the London Book of Records.Turns out — it’s FAKE. Someone literally conned the Congress! 😂The so-called “certificate” is full of… pic.twitter.com/N0NPu3OUji— Amit Malviya (@amitmalviya) October 17, 2025ఈ సర్టిఫికెట్లను గమనించిన ప్రతిపక్ష పార్టీలు ఇది కేవలం ప్రచార స్టంట్ అని ఆరోపించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత పథకాలకు అధికంగా ఖర్చు చేస్తోందని, రాష్ట్రంలోని నాలుగు రవాణా సంస్థలు మొత్తం రూ.6,330 కోట్ల అప్పును కలిగి ఉన్నాయని, ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపాయి. కాగా ‘లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ బ్రిటన్లో నమోదైన ఒక ప్రైవేట్ సంస్థ. ఈ సంస్థ అధికారికంగా 2025, జూలై 15న మూతపడింది. అవినాష్ ధనంజయ్ సకుండే 2024, జూన్ 28న ఈ సంస్థ డైరెక్టర్గా నియమితులయ్యారు. లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇప్పుడు మనుగడలో లేదు. దీంతో కర్ణాటక ప్రభుత్వం చూపిస్తున్న సర్టిఫికెట్లు చెల్లనివని నిరూపితమయ్యాయి. బీజేపీ నేత అమిత్ మాలవియ కర్నాటక ప్రభుత్వం చూపిస్తున్న సర్టిఫికెట్లు ఫేర్ అంటూ ఆధారాలతో సహా షేర్ చేసిన పోస్టు ఇప్పుడు వైరల్గా మారింది. దీంతో నెటిజన్లు సీఎం సిద్దరామయ్యపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.ఇది కూడా చదవండి: Pakistan: శుభాకాంక్షలకు ‘ఏఐ’.. ప్రధానిపై నెటిజన్ల ఆగ్రహం -
కర్నాటకలో ఆర్ఎస్ఎస్ మార్చ్కి నో
కలబురిగి: కర్నాటకలో రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్) తలపెట్టిన ర్యాలీకి అధికారులు అనుమతి నిరాకరించారు. మంత్రి ప్రియాంక్ ఖర్గే సొంత నియోజకవర్గం చిట్టాపూర్లో ఆదివారం ఆర్ఎస్ఎస్ ‘రూట్ మార్చ్’నిర్వహించాలని భావించింది. ఈ మేరకు తహశీల్దార్కు దరఖాస్తు చేసుకుంది. అయితే, శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశముందంటూ తహశీల్దార్ అనుమతి నిరాకరించారు. ఆ దరఖాస్తును తిరస్కరించారు. కలబురిగి జిల్లా చిట్టాపూర్ పట్టణంలో అక్టోబర్ 19వ తేదీన ఆర్ఎస్ మార్చ్ నిర్వహణకు అనుమతి కోరిందని తహశీల్దార్ చెప్పారు. భీమ్ ఆర్మీ, ఇండియన్ దళిత్ పాంథర్స్ కూడా అదే రోజు ర్యాలీలు జరుపుతామని దరఖాస్తు చేసుకున్నాయన్నారు. వీటితో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశాలున్నాయంటూ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ నుంచి అందిన నివేదిక మేరకు ఆర్ఎస్ఎస్ ర్యాలీకి నో చెప్పామన్నారు. అదేవిధంగా, ర్యాలీకి అనుమతివ్వక మునుపే ఏర్పాటు చేశారంటూ పట్టణ ప్రధాన రహదారిపైని ఆర్ఎస్ఎస్ కటౌట్లు, బ్యానర్లను శనివారం భారీ పోలీసు బందోబస్తు నడుమ మున్సిపల్ సిబ్బంది తొలగించి వేశారు. ప్రభుత్వ ప్రాంగణాలు, భవనాల్లో అనుమతి లేకుండా ఏ సంస్థలు గానీ వ్యక్తులు గానీ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదంటూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం సైతం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. -
అరుదైన ఘటన: ఇద్దరు బాల్య స్నేహితురాళ్లను పెళ్లాడిన వ్యక్తి..!
మనదేశంలో బహుబభార్యత్వం చట్టవిరుద్ధం. పైగా ఇద్దరమ్మాయిలను పెళ్లి చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఎక్కడో అరుదుగా జరుగుతుంటాయి. అది కూడా మహా అయితే ఇద్దరు కవలలు, లేదా తోడబుట్టిన అక్కా చెల్లెళ్లను పెళ్లాడిన ఘటనలు చూసుంటారు. కాని ఇద్దరు బాల్య స్నేహితురాళ్లును పెళ్లి చేసుకోవడం అనేది అత్యంత అరుదు. అలాంటి విచిత్ర ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. ఈ అరుదైన విచిత్రమైన పెళ్లిని చూసేందుకు జనాలు వేలాదిగా తరలి వచ్చారు. కర్ణాటకకు చెందిన 25 ఏళ్ల వసీం షేక్ తన చిన్న నాటి ప్రాణ స్నేహితులైన షిఫా షేక్, జన్నత్ మఖందర్ల పెళ్లి చేసుకున్నాడు. చిత్రదుర్గ జిల్లాలోని హోరాపేటలోని ఎంకే ప్యాలెస్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఒకే వేడుక వద్ద పెళ్లితో ఒక్కటి కానున్న ఈ ముగ్గురి వివాహాన్ని చూసేందుకు బంధు మిత్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కొందరూ ఈ పెళ్లిని స్వాగతించగా, మరికొందరు ఇదేం పెళ్లి అన్నట్లు ముఖం చిట్లించారు. ఈ ముగ్గురి వివాహాన్ని వారివారి కుటుంబాలు అంగీకరించడం, పెళ్లిచేయడం విశేషం. ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతే ఈ పెళ్లి పెద్ద చర్చనీయాంశంగా మారింది. కాగా, బహుభార్యత్వం భారతీయ పౌర చట్టం ప్రకారం..అనుమతి లేకపోయినా, కొన్ని వ్యక్తిగత చట్టాలకింద మినహాయింపులు ఉన్నాయట. ఇలాంటి పెళ్లిళ్లు చెల్లుబాటు అనేది సామాజిక అంగీకారం, నిబంధనలు, ఆయా సంఘాలు చట్టబద్ధత, మతపరమైన అంశాలు వంటి వాటిపై ఆధారపడి ఉంటుందట. View this post on Instagram A post shared by Logkyakahenge (@log.kya.kahenge) (చదవండి: బాణసంచా కాల్చడం ఎలా మొదలైందో తెలుసా..!) -
Karnataka: ఆర్ఎస్ఎస్ మార్చ్కు హాజరైన పంచాయతీ అధికారి సస్పెండ్
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)నిర్వహించిన మార్చ్లో పాల్గొన్న అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. కర్నాటకలోని రాయ్చూర్ జిల్లాలోగల సిర్వార్ తాలూకాలో ప్రభుత్వ అధికారిగా పనిచేస్తున్న కేపీ ప్రవీణ్ కుమార్ను గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ (ఆర్డీపీఆర్) విభాగం సస్పెండ్ చేసింది. ఆయన లింగ్సుగూర్లో జరిగిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది రూట్ మార్చ్లో ఆ సంస్థ యూనిఫారం ధరించి పాల్గొన్నారు. ఫలితంగా ఆయన సస్పెన్షన్కు గురయ్యారు.ఐఏఎస్ అధికారిణి అరుంధతి చంద్రశేఖర్ జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులో కేపీ ప్రవీణ్ కుమార్.. కర్ణాటక సివిల్ సర్వీసెస్ (ప్రవర్తన) నియమాలు, 2021లోని మూడవ నియమం ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఈ నిబంధనల ప్రకారం ప్రభుత్వ అధికారులు రాజకీయ తటస్థత, క్రమశిక్షణ, తగిన ప్రవర్తనను కలిగివుండాలి. కుమార్పై డిపార్ట్మెంటల్ విచారణ జరిగే వరకు ఆయనకు జీవనాధార భత్యం అందిస్తారు.కర్ణాటక ప్రభుత్వం- ఆర్ఎస్ఎస్ మధ్య ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ క్రమశిక్షణా చర్య తీసుకోవడం గమనార్హం. ప్రభుత్వ సంస్థలలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధించాలని,సంస్థతో సంబంధం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐటీ, ఆడీపీఆర్ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఇటీవల ముఖ్యమంత్రిని కోరారు. కేపీ ప్రవీణ్ కుమార్పై సస్పెన్షన్ వేటువేయడాన్ని మంత్రి ఖర్గే సమర్థించారు. ఏ మతాన్నీ లక్ష్యంగా చేసుకోలేదని పేర్కొన్నారు. కాగా బీజేపీ ఈ సస్పెన్షన్ను ఖండించింది. ఇది రాజకీయ ప్రేరేపితమని, హిందూ సంస్థలపై కాంగ్రెస్ అసహనాన్ని కలిగి ఉందని ఆరోపించింది. -
రోడ్లపై కిరణ్ మజుందార్ షా విమర్శలు.. డీకే స్ట్రాంగ్ కౌంటర్
బెంగళూరు: ఇటీవలి కాలంలో బెంగళూరు రోడ్ల (Bengaluru Roads) పరిస్థితిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్, చర్చ నడుస్తోంది. ఓ విదేశీ విజిటర్.. బెంగళూరు నగరంలోని రోడ్లు, చెత్తపై చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బందిపడ్డానని ఆమె ఓ పోస్టులో వెల్లడించారు. దీంతో, ఆమె పోస్టుపై బయోకాన్ (Biocon) లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా(Kiran Mazumdar-Shaw) విమర్శలు చేయడం తీవ్ర చర్యనీయాంశమైంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shivakumar) స్పందించారు.తాజాగా డీకే శివకుమార్ రోడ్లపై పెడుతున్న పోస్టులపై కౌంటరిచ్చారు. ఘాటుగా బదులిస్తూ... మజుందార్ షా రోడ్లను అభివృద్ధి చేయాలనుకుంటే చేయవచ్చు అని డీకే పేర్కొన్నారు. ఆమె వచ్చి అడిగితే.. ఆ గుంతలు పూడ్చేందుకు రోడ్లను కేటాయిస్తామన్నారు. ఈ సందర్భంగా బెంగళూరు నగర అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిందన్నారు. బెంగళూరులో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు. మౌలిక సదుపాయాలకు అవసరమైనవన్నీ చేస్తున్నామన్నారు.అంతకుముందు, కర్ణాటక రాజధాని బెంగళూరులో అస్తవ్యస్త పరిస్థితులను బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా ట్విట్టర్ వేదికగా..‘చెత్త కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లోని ఏ మున్సిపాల్టీ కూడా దీనిని పరిష్కరించడం లేదు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు లాంటి నగరాల్లో ఈ చెత్త సమస్య చాలా చాలా దయనీయంగా ఉంది’ అని పేర్కొన్నారు.Kiran Mazumdar Shaw has not spoken to me. But I will invite her for discussion & whatever the complaints, let her give it in writing. If she wants to develop roads, ready to hand over them for development: K’taka DyCM DK Shivakumar responding to Shaw’s recent tweets. pic.twitter.com/Pr8B0Qk7bt— TOI Bengaluru (@TOIBengaluru) October 18, 2025అయితే, బెంగళూరులో పరిస్థితుల్లో గతంలో కూడా ‘బ్లాక్బక్’ అనే కంపెనీ సీఈఓ రాజేశ్ యాబాజీ కూడా గతంలో ఓ పోస్టు పెట్టారు. రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. తాజాగా బయోకాన్ పార్క్కు వచ్చిన ఓ విదేశీ విజిటర్.. నగరంలోని రోడ్లు, చెత్తపై చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బందిపడ్డానని పోస్టులో వెల్లడించారు. దీంతో, ఆమె పోస్టు వైరల్ అయ్యింది. Garbage is a serious malaise countrywide n no municipality of big cities has managed to solve it. Indore n Surat seemed to have cracked it but mumbai delhi Bengaluru etc haven’t. Very very pathetic which shows citizens lack of civic sense n huge apathy by both citizens n… https://t.co/rpBf0rZlaL— Kiran Mazumdar-Shaw (@kiranshaw) October 16, 2025 -
లోకేశ్ పోస్టులపై భగ్గుమంటున్న కర్ణాటక వాసులు
సాక్షి, అమరావతి: ఏ రాష్ట్రమైనా పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలను కొనసాగించాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి పునర్విభజితమైన కొత్త రాష్ట్రాలు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ మంత్రి లోకేశ్ చేస్తున్న వరుస ట్వీట్లపై కర్ణాటకవాసులు భగ్గుమంటున్నారు. లోకేశ్ ట్వీట్లతో జాతీయస్థాయిలో ఏపీ పరువు పోతుండటంతో పాటు కర్ణాటకలో నివసిస్తున్న తెలుగువారిపై స్థానికుల ఆగ్రహావేశాలకు దారితీస్తున్నాయి. ఇదే విషయాన్ని చాలామంది ఎక్స్ వేదికగా పంచుకుంటున్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో చాలామంది ఏపీ ప్రజలు పని చేసుకుంటున్నారని, పోస్టు చేసేముందు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఎక్స్లో ట్వీట్ చేస్తున్నారు. తాజాగా లోకేశ్ పెట్టిన పోస్టుతో కూటమి సర్కారు ఆర్థిక నిర్వహణ తీరును కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఎక్స్ వేదికగా నిలదీశారు. ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడాన్ని కర్ణాటక వాసులు తట్టుకోలేకపోతున్నారంటూ పరోక్షంగా లోకేశ్ ఎక్స్లో పెట్టిన పోస్టు ఇప్పుడు జాతీయస్థాయిలో ప్రధాన చర్చనీయాంశంగా మారిపోయింది. ఏపీ ఆహారం చాలా స్పైసీగా ఉంటుందని, ఇప్పుడు ఇది పెట్టుబడులకు కూడా వ్యాప్తి చెందడంతో పొరుగువారి కడుపులో మంట మొదలైందంటూ లోకేశ్ గురువారం ఎక్స్లో చేసిన ఈ వ్యాఖ్యపై కర్ణాటక మంత్రి అంతే ఘాటుగా స్పందించారు.గతంలోనూ ఇదే తీరు బెంగళూరులో ట్రాఫిక్ సమస్య అనో.. లేక ఏదైనా కంపెనీ కర్ణాటకలో పెట్టుబడులపై ఆలోచిస్తున్నట్లు ఒక చిన్న వార్త వస్తే చాలు వెంటనే లోకేశ్ ఎక్స్లో పోస్టులు పెడుతుండటం కర్ణాటక వాసుల ఆగ్రహానికి ప్రధాన కారణంగా ఉంది. గతంలో ఇదేవిధంగా ఒకసారి లోకేశ్ పోస్టు చేస్తే ప్రియాంక్ ఖర్గే ఇదేవిధంగా ఘాటుగా స్పందించారు. బలహీనమైన ఎకో సిస్టమ్ ఉన్నవాళ్లు బలమైన వాళ్లపై ఆధారపడి జీవించడం సహజమంటూ పరాన్నజీవిగా అభివర్ణించారు. మీ ఘనత.. ఏడాదిలో రూ.1.61 లక్షల కోట్ల అప్పులు చేయడం ప్రియాంక్ ఖర్గే ఏం ట్వీట్ చేశారంటే.. ప్రతి ఒక్కరు ఆహారంలో కాస్తాకూస్తో స్పైసీని ఆస్వాదిస్తారని, కానీ ఇది పోషకాహార నిపుణులు సిఫార్సు చేసిన మేరకే పరిమితం చేస్తామన్నారు. ఆర్థికవేత్తలు కూడా బడ్జెట్ నిర్వహణలో సమతుల్యతను పాటిస్తారు. ఏపీ ఏడాదిలో రూ.1.61 లక్షల కోట్లు అప్పులు తీసుకుందని, రాష్ట్ర జీఎసీడీపీలో అప్పుల వాటా 2.61 శాతం నుంచి 3.61 శాతానికి పెరగడం ద్వారా ఏపీ ఆర్థికవ్యవస్థ దిగజారిపోయిందంటూ పోస్టు చేశారు. -
‘వారిది ఇన్ఫోసిన్.. అలా అంటే మనం ఏం చేస్తాం?’
బెంగళూరు: కర్ణాటకలో చేపట్టిన సామాజిక, విద్యా సర్వేను వ్యతిరేకించిన కారణంగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణమూర్తి, ఆయన భార్య సుధామూర్తిపై కర్ణాటక ప్రభుత్వ పెద్దలు విమర్శలు గుప్పిస్తున్నారు. వీరికి(నారాయణమూర్తి దంపతులకు) వెనుకబడిన వర్గాలన్నా, కుల గణన అన్నా చిత్తశుద్ధి లేదని మండిపడుతున్నారు. ఇదే వ్యవహారంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం తన నోటికి పని చెప్పారు. వారికి అన్ని తెలుసంటూనే. వారికి మనం ఏం చెబుతామంటూ సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు.‘ ఇది కేవలం సామాజిక మరియు విద్యా సర్వే. అంతే కానీ వెనుకబడిన వర్గాల సర్వే కానే కాదు.. ఇది జనాభా గణాంకాల కోసం నిర్వహించే సర్వే మాత్రమే. ఈ విఫయాన్ని చాలాసార్లు చెప్పాం కూడా. ఇప్పటి వరకూ కనీసం 20 సార్లు అయినా ఇది జనాభా లెక్కల సర్వే అని చెప్పాం. అయినా వారు వెనుకబడిన వర్గాల గణాంకాల సర్వే అనుకుని అందులో పాల్గొనమని చెప్పారు. అది వారికే వదిలేద్దాం. ఈ విసయాన్ని వారు అర్థం చేసుకోలేకపోతే మనం చేస్తాం. వారిది ఇన్ఫోసిన్.. వారికంతా తెలుసు’ అంటూ సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాగా, కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ (KSCBC) చేపట్టిన సామాజిక సర్వే, కులగణన అక్టోబర్ 19 వరకు కొనసాగుతుంది. రూ. 420 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ సర్వేలో 60 ప్రశ్నలు ఉన్నాయి. ఈ సంవత్సరం చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి సర్వే నివేదిక అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.ఇదీ చదవండి:మూర్తిగారూ.. ఇదేంటండీ? -
ఇంజనీరింగ్ కాలేజీ ఘటనలో విస్తుపోయే విషయాలు
ఆ ఇద్దరూ క్లాస్మేట్స్. అయితే బ్యాక్లాగ్స్తో అతగాడు ఆమెకు ఓ సెమిస్టర్ జూనియర్ అయిపోయాడు. అయినా వాళ్ల మధ్య స్నేహం కొనసాగింది. ఇదే అదనుగా.. అదీ కాలేజీ క్యాంపస్లో.. అందులోనూ మెన్స్ టాయ్లెట్లో ఆమెపై ఆ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన వివరాల్లోకి వెళ్తే.. సౌత్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అత్యాచార ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. నిందితుడిని జీవన్ గౌడ(21)గా నిర్ధారించిన పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేశారు. గురువారం అతనితో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి కీలక విషయాలు వెల్లడించారు. బాధితురాలు(20), జీవన్ ఒకేసారి కాలేజీలో చేరారు. ఈ క్రమంలో జీవన్ ఓ సెమిస్టర్ తప్పడంతో వెనకబడిపోయాడు. అక్టోబర్ 10వ తేదీ ఉదయం కాలేజీకి బాధితురాలికి ఓ పార్సిల్ వచ్చింది. దానిని జీవన్ రిసీవ్ చేసుకుని ఆ వంకతో యువతిని కలిసి అందించాడు. దానిని అందుకుని ఆమె అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయింది. అయితే.. మధ్యాహ్నాం లంచ్ సమయంలో ఆమెకు పదే పదే ఫోన్ చేసి మాట్లాడాలంటూ ఏడో ఫ్లోర్లో ఉన్న అర్కిటెక్ట్ బ్లాక్ దగ్గరకు రావాలంటూ పిలిచాడు. అక్కడికి వెళ్లిన ఆమెకు ఎవరూ లేనిది చూసి బలవంతంగా ముద్దు పెట్టాడు. ఈ పరిణామంతో భయానికి గురైన యువతి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ పరిగెత్తింది. అయితే.. లిఫ్ట్లో ఆమెతో పాటే కిందకు వెళ్లి.. ఆమె నోరు మూసేసి ఆరో ఫ్లోర్లో ఉన్న మెన్స్ టాయ్లెట్లోకి లాక్కెల్లాడు. అక్కడ వాష్రూంలో తలుపు బిగించి 20 నిమిషాలపాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటన తరవాత ఆమె హాస్టల్కు పరిగెత్తుకుంటూ వెళ్లి స్నేహితులకు విషయం చెప్పింది. ఆ సమయంలో మరోసారి కాల్ చేసిన నిందితుడు పిల్ కావాలా సీనియర్?( ఎమర్జెన్సీ గర్భనిరోధక మాత్ర) అంటూ వెటకారంగా నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు. అయితే.. ఇదంతా మాములు విషయమని, పెద్దది చేయొద్దంటూ తోటి రూమ్స్మేట్స్కు ఆమెకు సలహా పడేశారు.అయితే.. జరిగిన విషయాన్ని రెండు రోజుల తర్వాత పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వాళలు బెంగళూరు వచ్చి.. అక్టోబర్ 15వ తేదీన హనుమంత నగర పీఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన క్యాంపస్ ఫ్లోర్లో సీసీకెమెరాలు లేకపోవడంతో.. ఫోరెన్సిక్, డిజిటల్ ఎవిడెన్స్ ఆధారంగా విచారణ జరిపారు. చివరకు జీవన్ నేరానికి పాల్పడింది నిర్ధారించుకుని.. అరెస్ట్ చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 64 ప్రకారం.. రేప్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాజకీయ దుమారం రేపింది. కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని ఈ ఘటనతో రుజువైందని ప్రతిపక్ష బీజేపీ విమర్శించగా.. ప్రభుత్వం ఈ విమర్శలను తోసిపుచ్చింది. ఇదిలా ఉంటే.. సదరు ఇంజనీరింగ్ కాలేజీ ఇప్పటిదాకా ఘటనపై ఎలాంటి స్పందన తెలియజేయలేదు.ఇదీ చదవండి: వెనక నుంచి వచ్చి.. యామిని మెడపై కత్తి పెట్టి! -
భార్య నరికివేత
కర్ణాటక: కుటుంబ కలహాలతో భార్యను భర్త నరికి చంపిన ఘటన చిక్కమగళూరు జిల్లాలో జరిగింది. అజ్జంపుర తాలూకా చిక్కనావంగళ గ్రామానికి చెందిన తను (25) హతురాలు. వివరాలు ఇలా ఉన్నాయి.. తనుతో రమేశ్కు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఆరేళ్ల కొడుకు ఉన్నాడు. అయితే భర్తతో తరచూ గొడవలు రావడంతో ఆమె రెండేళ్ల నుంచి వేరేగా ఓ వక్కతోటలోని ఇంటిలో నివసిస్తోంది. బుధవారం రాత్రి మద్యం మత్తులో రమేశ్ తను ఇంటికి వెళ్లాడు. ఆమెను కొడవలితో నరికి చంపాడు. తరువాతన తన చేతిని కోసుకొని.. భార్యే నన్ను చంపడానికి యత్నించినట్లు గ్రామస్థులకు చెప్పాడు. ఏమి జరిగిందో చూద్దామని ఆమె ఇంటికి గ్రామస్థులు వెళ్లగా రక్తపు మడుగులో మృతదేహం పడి ఉంది. రమేశ్ను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. భర్త, అతని అక్క, చెల్లెలు, అత్తమామలతో పాటు 9 మందిపై తను తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ 9 మందినీ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. -
అయ్యో.. యామిని!
కర్ణాటక రాజధాని నగరంలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది జరిగింది. ఓ యువతిని వెనక నుంచి వచ్చిన ఓ యువకుడు గొంతుకోసి పరారయ్యాడు. ఈ ఘటనలో.. గిలగిలా కొట్టుకుంటూ ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. గురువారం మధ్యాహ్నాం శ్రీరాంపుర ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హోస్కెరెహళ్లి ಹೊಸಕೆರೆಹಳ್ಳಿలో యామిని ప్రియ(20) కుటుంబం నివాసం ఉంటోంది. స్థానికంగా బీఫార్మసీ చదువుతున్న ఆమె గురువారం పరీక్ష కోసమని ఉదయం 7.గంకే ఇంటి నుంచి బయల్దేరింది. అయితే.. మధ్యాహ్నాం 3గం. సమయంలో మంత్రిమాల్ వద్ద శ్రీరాంపుర రైల్వే ట్రాక్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న ఆమెపై ఓ యువకుడు దాడి చేశాడు. వెనుక నుంచి వచ్చి గొంతు కోసి పరారయ్యాడు. రక్తపు మడుగులో యామిని ప్రియ కుప్పకూలిపోగా.. ఊహించని ఆ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. విషయం తెలిసి పెద్దసంఖ్యలో జనం పోగయ్యారు. శ్రీరాంపుర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.ప్రియా యామిని ఆ నిందితుడి బైక్ మీదే వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో ప్రేమ కోణం ఉందనే చర్చ నడుస్తోంది. పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.A 20 year old college student, Yamini Priya,was murdered by a known individual who slit her throat near the railway tracks in Srirampura,#Bengaluru.The victim was returning from college when she was attacked.Police have launched a manhunt to apprehend the accused..@DCPNorthBCP pic.twitter.com/3zMrcVEx1s— Yasir Mushtaq (@path2shah) October 16, 2025ఇదీ చూశారా?.. యువకుడి టైమింగ్తో తల్లీబిడ్డా సేఫ్! -
భార్యను చంపి బోరు బావిలోపాతిపెట్టి..పార్టీ ఇచ్చాడు!
కర్ణాటక: భార్యను హత్య చేసి బోరు బావిలో పాతిపెట్టిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా అలఘట్ట గ్రామంలో నెలన్నర క్రితం విజయ్ తన భార్య భారతిని హత్య చేశాడు. ఎవరికీ తెలియకుండా తోటలోని బోరు బావిలో శవాన్ని పాతి పెట్టాడు. భార్య పీడ తప్పిందని మూడు జంతువులను బలిచ్చి బంధువులకు విందు భోజనం పెట్టాడు. రేకుపై భార్య పేరు రాసి దెయ్యం, పీడ, పిశాచి పట్టకూడదని రాసి పూజలు చేయించాడు. అనంతరం తన భార్య మానసిక అస్వస్థతతో ఇల్లు వదలి వెళ్లినట్లు బంధువులు, గ్రామస్తులను నమ్మించాడు. అదృశ్యమైన తన భార్య ఆచూకీ కనిపెట్టాలంటూ కడూరు పోలీసులకు విజయ్ ఫిర్యాదు చేశాడు. భారతి తల్లిదండ్రులు కూడా కుమార్తె అదృశ్యంపై పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. భర్త విజయ్పై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఘటనకు సంబంధించి భర్త విజయ్తో పాటు అత్తమామలు తాయమ్మ, గోవిందప్పను అరెస్ట్ చేశారు. మృతురాలు భారతి తన అవ్వను చూడటానికి శివమొగ్గకు వెళ్లారు. తిరిగి వాపస్ రాలేదని సెపె్టంబర్ 5న భర్త విజయ్.. కడూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నెలన్నర తరువాత భారతి తల్లి, ఎమ్మెదొడ్డి పరదేశీహాళ్కు చెందిన లలితమ్మ కడూరు పోలీసులకు మళ్లీ అక్టోబర్ 13న ఫిర్యాదు చేశారు. ‘6 ఏళ్ల క్రితం భారతిని విజయ్కి ఇచ్చి వివాహం చేశాం. అనేక సార్లు కట్నం కావాలని విజయ్ వేధించేవాడని భారతి తల్లిదండ్రులు ఫిర్యాదులో వివరించారు. దీంతో పోలీసులు విజయ్ను విచారించగా అసలు విషయం బయట పడింది. లలితమ్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అల్లుడు విజయ్, అతడి తలి తాయమ్మ, తండ్రి గోవిందప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మొరింగా సాగుతో.. రూ. 40 లక్షల టర్నోవర్
వ్యవసాయం చేయడం అంటే మాటలుకాదు. చెమటలు చిందించాలి. ఆను పాను తెలియాలి. ఏ పంటకు ఎలాంటి చీడపీడలు వస్తాయి, వాటికి పరిష్కారం ఏమిటి అనేదానిపై పూర్తి అవగాహన ఉండాలి. కష్టాలు కన్నీళ్లు ఎన్ని వచ్చినా ఓపిగ్గా ఉంటూ కృషిని నమ్ముకోవాలి. వీటన్నింటికి తోడు మట్టిని ప్రేమించాలి. అపుడు మాత్రమే ఊహించని ఫలితాలు సాధ్యం. అలా కర్ణాటకకు చెందిన ఒక రైతు అద్భుతాలు సాదించాడు. ఏడాదికి 40 లక్షల రూపాయల ఆదాయాన్ని కళ్ళ చూస్తున్నాడు. పదండి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.కర్ణాటకకు చెందిన ఉమేశ్ రావు మునగ సాగుతో భారీ లాభాలు సాధించిన తనలాంటి ఔత్సాహిక రైతులకు ప్రేరణగా నిలిచాడు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన ఉమేశ్ కుటుంబ భారాన్ని మోయాల్సి వచ్చింది. దీంతో పూర్వీకుల భూమిలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎనిమిది ఎకరాలకు పైగా చెరకు, మొక్కజొన్న, రాగులు, కూరగాయలు, ఇతర పంటలను పండించాడు. కానీఆశించిన ఫలితాలు పెద్దగా లభించ లేదు. ఇంతలో మొరింగ సాగు గురించి తెలుసుకున్నాడు.2010లో మొరింగ ఒలిఫెరా మొక్క విత్తనాలను నాటాడు ఉమేష్. దాదాపు 900 మొక్కలతో తన జర్నీని మొదలు పెట్టాడు. మొదట్లో మునక్కాయలను క్రమంగా మునగాకు పౌడర్ను విక్రయించడం మొదలు పెట్టాడు. పదేళ్ల పాటు ఆర్థికంగా కుదుట పడ్డాడు. 2020లో కోవిడ్ మహమ్మారి రావడంతో మునగ పొడి డిమాండ్ భారీగా పెరిగింది. ఈ డిమాండ్ కనుగుణంగా ఇతర పంటలను నిలిపివేసి సేంద్రీయ పద్ధతుల్లో మునగ సాగు చేశాడు.చదవండి: ఫ్యామిలీ కోసం కార్పొరేట్ జీతాన్ని వదులుకుని రిస్క్ చేస్తే..!ఇది ఇలా ఉండగా భూవిషయంలో కుటుంబ వివాదం నేపథ్యంలో తన సాగును వేరే చోటికి తరలించాల్సి వచ్చింది. అయినా నిరాశపడలేదు. కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలోని గౌరిబిదనూర్లో బంజరు భూమిని పదేళ్లకు లీజుకు మోరింగ వ్యవసాయాన్ని ప్రారంభించాడు. ఇట్లా చిన్నమొత్తంలో కేవలం రెండు ఎకరాల్లో ఒకవైపును సాగును కంటిన్యూ చేస్తూ భూమిని సారవంతం చేసుకున్నాడు. కోడి ఎరువు, మేక ఎరువు , ఆవు పేడ ఎరువును కలిపి నేలను సారవంతంగా తయారు చేసాడు. ఇది నేల సారాన్ని, నీటిని నిలుపుకోవడాన్ని పెంచుతుంది వాతావరణం నుండి కార్బన్ డయాక్సైడ్ను వేరు చేయడం ద్వారా వాతావరణ మార్పులను తగ్గించడంలో సహాయపడింది. ఆర్గానిక్ పద్ధతుల్లో వ్యవసాయం చేయడంతో మంచి ఫలితాలు లభించాయి. మార్కెట్ను స్టడీ చేసి మెరుగైన (ఓడీసీ-3 వెరైటీ) చెందిన మొక్కలను నాటాడు. ఇవి అనుకున్నట్టుగానే 3-4 నెలల్లోనే కాపుకు వచ్చి , ఆరు నెలల్లో మంచి దిగుబడి వచ్చింది.ప్రస్తుతం ఉమేష్ ఎకరానికి 10 టన్నుల తాజా మునగ ఆకులను సేకరిస్తాడు. ఆకులను షేడ్ నెట్ల కింద సహజంగా ఎండబెట్టి, దాదాపు 2.5 నుండి 3 టన్నుల దాకా, కిలోకు సగటున రూ.140 చొప్పున విక్రయిస్తాడు. ఎక్స్ట్రాక్టర్లు, ఫార్మా కంపెనీలు, న్యూట్రాస్యూటికల్ కంపెనీలు ,ఎరువుల కంపెనీలు వీటిని కొనుగోలు చేస్తాయి. దీని ఫలితంగా ఎకరానికి రూ.4 లక్షల టర్నోవర్ వస్తుందని ఉమేష్ చెప్పారు. ఇదీ చదవండి: 45 కిలోలకు పైగా వెయిట్లాస్..బెల్లీ ఫ్యాట్ దెబ్బకి కరిగింది!ఏడాదికి రూ. 40 లక్షలుఅలా ఎకరానికి 10 లక్షల టన్నుల వరకు మునగాకును, మునగకాయలను పండిస్తున్నాడు. వీటిని కేజీకి రూ. 140 చొప్పున విక్రయిస్తున్నాడు. డిమాండ్ను బట్టి కొన్ని సందర్భాల్లో కేజీ రూ. 500కు కూడా విక్రయిస్తున్నాడు. అలా మునగకాయలను, ఆకులను విక్రయిస్తూ.. ఎకరానికి రూ. 4 లక్షల ఆదాయం సంపాదిస్తూ.. ఏడాదికి 10 ఎకరాలకు రూ. 40 లక్షల టర్నోవర్కు ఎదిగాడు ఉమేశ్. ఇక ఎండబెట్టిన మునగాకును ఫార్మా కంపెనీలు, ఫర్టిలైజర్ కంపెనీలకు విక్రయిస్తున్నట్లు ఉమేశ్ తెలిపాడు. -
కిడ్నాప్ చేసి చిత్రహింసలు
కర్ణాటక: డబ్బుతిరిగి ఇవ్వాలన్నందుకు చిత్రహింసలకు గురిచేశారు, ఈ ఘటన బెంగళూరు కోరమంగల ఠాణా పరిధిలో జరిగింది. వివరాలు.. తండ్రికి కిడ్నీలు దెబ్బతిన్నాయి, వైద్యంచేయించాలని సగాయ్రాజ్ నుంచి అనందకుమార్, అతని కూతురు ఐశ్వర్య రూ. 3 లక్షలు తీసుకున్నారు. ఇంటిని విక్రయించి డబ్బు ఇస్తానని ఆనంద్కుమార్ చెప్పగా, తనకే అమ్మాలని సగాయ్రాజ్ కోరాడు. అగ్రిమెంట్ కు ముందు కోటి రూపాయలు ఇవ్వగా మిగిలిన డబ్బు తరువాత ఇస్తానని మాట్లాడుకున్నారు. డబ్బు తీసుకున్న ఆనందకుమార్ ఇంటిని రాసివ్వలేదు, డబ్బు కూడా వెనక్కి ఇవ్వలేదు. దీంతో డబ్బు ఇవ్వాలని సగాయ్రాజ్ ఒత్తిడి చేయసాగాడు. ఈ నేపథ్యంలో సగాయ్రాజ్ని తండ్రీ కూతురు, మరో వ్యక్తి ఆశీష్లు కలిసి కిడ్నాప్ చేశారు, నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి చేతులు కాళ్లుకట్టి వేసి మర్మాంగానికి సిగరేట్తో కాల్చి, ఇంజెక్షన్ వేసి చిత్రహింసలకు గురిచేశారు. అంతేగాక వీడియో తీసి బెదిరించారు. కారులో రాత్రంతా నగరంలో తిప్పి వేధించారు. ఉదయం సమయంలో సగాయ్రాజ్ కాపాడండి అంటూ గట్టిగా కేకలు వేసి స్థానికుల సాయంతో ప్రాణాలతో బయటపడ్డానని చెప్పాడు. ఈ మేరకు కోరమంగల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
‘నేనెప్పుడూ అలా అనలేదు..’ మీడియాపై డీకే శివకుమార్ సీరియస్
బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశం మళ్లీ తెర మీదకు వచ్చింది. ఈ ఏడాది చివరినాటికి ఆ మార్పు తథ్యమంటూ అక్కడి మీడియా చానెల్స్ వరుసబెట్టి కథనాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేరిట కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. దీంతో కన్నడ మీడియాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.నేను ముఖ్యమంత్రిని అయ్యే సమయం దగ్గరపడుతోంది అని నేను ఎక్కడా అనలేదు. కొంత మంది నేను సీఎం కావాలి అంటూ నినాదాలు చేస్తూ హడావిడి చేస్తున్నారు. కానీ, నా తలరాత ఏంటో నాకు తెలుసు. నాకేం తొందరలేదు అని వ్యాఖ్యానించారాయన. ఈ క్రమంలో.. కొన్ని మీడియా సంస్థలు తన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రసారం చేస్తున్నాయని, అలా అసత్య ప్రచారాలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తానేం సీఎం పదవికి ఆశపడడం లేదని మరోసారి స్పష్టం చేసిన డీకే.. తాను రాజకీయాల కోసం కాదని, ప్రజల సేవ కోసం పని చేస్తున్నానని అన్నారు. ఈ నేపథ్యంలో.. ఈ అంశంపై మరోసారి తనను సంప్రదిస్తే మీడియాకు సహకరించబోనని స్పష్టం చేశారు. బెంగళూరులో లాల్బాగ్ వద్ద శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఇదీ చదవండి: తెలుగు ఐపీఎస్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్ -
నికర జలాలు పోయేట్లు ఉన్నాయ్.. బనకచర్లపై హరీష్రావు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: అవకాశం లేని బనకచర్ల పై కేంద్ర ప్రభుత్వం అప్రజైల్ ఇస్తే.. ఇక్కడి ఇద్దరు కేంద్ర మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని మాజీ మంత్రి హరీష్రావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. శనివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ముందు నుంచి హెచ్చరిస్తున్నట్లే బనకచర్ల ప్రాజెక్ట్ తెలంగాణాకు ప్రమాదంగా మారబోతోంది. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ సీఎం రేవంత్కు ఇరువై రోజుల క్రితం లేఖ రాశారు. సీడబ్యూసీ(CWC) నిబంధనల ప్రకారం నికర జలాల మీదే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది. అలాంటప్పుడు నిబంధనలకు వ్యతిరేకంగా వరద జలాలపై ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా ఇస్తారు?.. రేవంత్ రెడ్డి పరోక్షంగా బనకచర్లకు సహకరిస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాలు చూస్తారా ? సీఎం వ్యక్తిగత ప్రయోజనాలు చూస్తారా ?. 112 టీఎంసీల నీళ్లు ఆపుకుంటామని కర్ణాటక లేఖ రాసింది. పైన కృష్ణా, కింద గోదావరి జలాలు పోతే తెలంగాణ పరిస్థితి రెంటికి చెడిన రేవడిగా మారుతుంది. ఫ్లడ్ వాటర్ తో ప్రాజెక్ట్ కట్టుకోవాలనుకుంటే తాము కూడా ప్రాజెక్ట్ కట్టుకుంటామని మహారాష్ట్ర అంటోంది. అయినా తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది. పోలవరం రైట్ కెనాల్ ద్వారా 11 వేల 500 క్యూసెక్కుల కెపాసిటీ కేంద్రం అనుమతి ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం 23 వేల క్యూసెక్కుల కెపాసిటీతో కాలువలకు ఎలా టెండర్లు పిలిచారు ?. కాలువలు తవ్విన టీడీపీ ది తప్పు అయితే బీజేపీ ఎందుకు కళ్ళు మూసుకుంది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కు కనీస బాధ్యత లేదా ?. అవకాశం లేని బనకచర్ల పై కేంద్ర ప్రభుత్వం అప్రజైల్ ఇస్తే కేంద్ర మంత్రులు ఎందుకు పెదవులు మూసుకుంటారా?. చంద్రబాబు ఒత్తిడితో బీజేపీ తలొగ్గుతోంది. బీజేపీ తమకు అనుకూలంగా ఉండే రాష్ట్రాలకు ఒక విధంగా, ఇతర రాష్ట్రాలకు మరో రకంగా వ్యవహరిస్తుంది. అసలు తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదు?. అటు కేంద్రం పట్టించుకోదు.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోదుకేంద్ర మంత్రి లేఖ రాసి ఇరువై రోజులు అయ్యింది.. కర్ణాటక లేఖ రాసి రెండు వారాలు అవుతుంది. ఇంకోవైపు మహారాష్ట్ర మరోవైపు లేఖ రాసింది. ఈ పరిస్థితి చూస్తుంటే.. వరద జలాలే కాదు.. నికర జలాలు పోయేటట్లు ఉన్నాయి. వరద జలాల మీద ప్రాజెక్ట్ ఎలా కడతారు అని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు?. కేంద్ర మంత్రి, కర్ణాటక, మహరాష్ట్ర ప్రభుత్వాలు రాసిన లేఖలు అబద్దమా?. ఢిల్లీ వెళ్లి ఎందుకు రేవంత్ కొట్లాడడం లేదు?. నల్లమల పులి అని చెప్పుకునే రేవంత్.. కృష్ణా జలాలు ఆపుతామని అంటే పిల్లిలా మారారా?. ఆల్మట్టి ఎత్తు పెంచకుండా ఖర్గే, సిద్దరామయ్యతో ఎందుకు మాట్లాడం లేదు?. కనీసం రాహుల్ గాంధీతో ఫోన్ కూడా చేయించలేకపోతున్నారా?.రేవంత్ రెడ్డి బ్యాగులు మోయడమే కాదు తెలంగాణ బాగోగులు కూడా పట్టించుకోవాలి. రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారు? అని హరీష్ ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: ఆ కండిషన్తో స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చట! -
మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం, 12 సెలవులు
కర్ణాటక ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని మహిళలందరికీ ప్రతి నెలా ఒక రోజు, అంటే సంవత్సరానికి 12 రోజుల వేతనంతో కూడిన పీరియడ్స్ లీవ్ (ఋతుస్రావ సెలవు) Policy-2025ను ఆమోదించింది. ఈ విధానం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలోని మహిళా ఉద్యోగులకు వర్తిస్తుందని రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు తెలిపింది. మహిళల శ్రేయస్సును మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన ట్వీట్ ద్వారా తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, వస్త్ర పరిశ్రమలు, బహుళజాతి కంపెనీలు, ఐటీ సంస్థలు మరియు ఇతర ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేసే శ్రామిక మహిళా ఉద్యోగులకు నెలకు ఒక వేతనంతో కూడిన రుతు సెలవును పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఇది శ్రామిక మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని రాష్ట్ర న్యాయ మంత్రి హెచ్కె పాటిల్ తెలిపారు. ఈ విధానం ఇతర రాష్ట్రాల్లో విజయవంతమైన నేపథ్యంలో తాము కూడా దీనిని స్వీకరించాలని నిర్ణయించుకున్నామని ఆయన క్యాబినెట్ సమావేశం తర్వాత విలేకరులతో అన్నారు. దీనిపై సర్వత్రా హర్హం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం అనధికారిక రంగంలో సవాలే అయినప్పటికీ, విస్తృత ఆరోగ్య సాధికారతకు కీలకమైన పునాది వేస్తుందనీ, మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతుంది, రాష్ట్ర సమగ్ర వృద్ధిని ప్రోత్సహిందంటూ సంతోషం వ్యక్తం చేశారు మహిళా హక్కుల కార్యకర్త బృందా అడిగే.మహిళల నిజమైన ఆరోగ్య అవసరాలను గుర్తించడంలో ప్రశంసనీయమైన అడుగు అని కొనియాడారు.Our Government stands committed to dignity and wellbeing at work.Through the Menstrual Leave Policy 2025, women employees across Karnataka will now receive one paid leave day every month - a step towards a more humane, understanding, and inclusive workplace.#MenstrualLeave… pic.twitter.com/HmxCHutJv0— Siddaramaiah (@siddaramaiah) October 9, 2025 తాజా నిర్ణయంతో పీరియడ్ అమలు అమలు చేసిన రాష్ట్రాల జాబితాలో కర్ణాటక చేరింది. వేతనంతో కూడిన రుతు సెలవులను అమలు చేసిన ఇతర రాష్ట్రాలలో బీహార్, ఒడిశా, కేరళ, సిక్కిం ఉన్నాయి. విధానం ఉన్నా లేకపోయినా, ఏదైనా ప్రైవేట్ రంగ సంస్థ దీనిని అమలు చేయవచ్చు. జీతంతో కూడిన రుతు సెలవులను ప్రకటించిన వాటిలో జొమాటో, స్విగ్గీ, లార్సెన్ & టూబ్రో (ఎల్ అండ్ టి), బైజూస్ మరియు గోజూప్ ఉన్నాయి.ఇదీ చదవండి: హ్యాపీగా ఏసీ కోచ్లో తిష్ట, చూశారా ఈవిడ డబల్ యాక్షన్! -
గిట్టుబాటులేక రోడ్డు మీదే.. పూల రైతుకు మిగిలింది కన్నీరే
కోలారు: బెంగళూరులోని కోలారు ప్లవర్ మార్కెట్లో వారం రోజుల క్రితం కిలో రూ.60 నుంచి రూ.70 ధర పలికిన బంతిపూల ధరలు మళ్లీ పాతాళానికి దిగజారాయి. దీంతో గిట్టుబా టుకాక రైతులు తాము పండించిన బంతి పూలను రోడ్డుపై పారబోసి వెళుతున్నారు. శ్రావణ మాసంలో వరుసగా పండుగలు రావడంతో పూల ధరలు ఆశాజనకంగా ఉండే వి. అనంతరం ఆశ్వీయుజ మాసంలో దనరా పండుగ కారణంగా బంతిపూలకు మంచి ధరలే లభించాయి. అయితే దసరా అనంతరం డిమాండ్ బాగా తగ్గింది. కిలో బంతిపూలు రూ.10, చేమంతులు కిలో రూ.40, గులాబీలు కిలో రూ.50 ధర పలుకుతున్నాయి. మంగ ళవారం మార్కెట్కు తీసుకు వచ్చిన పూలకు సరైన ధరలు లభించక రైతులు వాటిని బంగారుపేట-కోలారు రోడ్డు పక్కనే పారబోసి వెళ్లారు. పూలు విడిపించడానికి, మార్కెట్కు తరలించడానికి అయ్యే ఖర్చులు కూడా మిగ లడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు రైతులు పూల కోతకోయకుండా పాలంలో అలాగే వదిలేస్తున్నారు. కాగా అక్టోబర్ నెలలో పెద్ద ప్రమాణంలో బంతి పూల కోతకు రావడంతో డిమాండ్ తగ్గి ధరలు భారీగా తగ్గాయని వ్యాపారులు అంటున్నారు. -
భార్య శవాన్ని పరుపు కింద దాచి, ఆపై..
ఆ జంటకు పెళ్లై.. నాలుగు నెలలే అయ్యింది. బంధువులకు, చుట్టుపక్కల వాళ్లకు ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ వచ్చింది. అయితే హఠాత్తుగా ఏం జరిగిందో ఏమో తెలియదు. ఆమె మృతదేహంగా మంచం కింద కనిపించింది. భర్త జాడ లేకుండా పోయాడు. అతని తల్లే ఈ విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది.కర్ణాటక బెళగావిలోని కమల్దిన్ని గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన నాలుగు నెలలకే ఓ యువతి కిరాతకంగా హత్యకు గురైంది. మృతురాలిని సాక్షిగా గుర్తించిన పోలీసులు.. ఆమె భర్త ఆకాశ్ కాంబర్ హత్య చేసి పరారై ఉంటాడని భావిస్తున్నారు(Belagavi Husband Kills Wife). ఈ జంటకు ఈ ఏడాది మే నెలలోనే వివాహం జరిగింది.పని మీద సొంత గ్రామానికి వెళ్లిన ఆకాశ్ తల్లికి బుధవారం ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఇంట్లో దుర్వాసన రావడంతో అంతా వెతికి చూడగా.. పరుపు కింద కోడలు విగత జీవిగా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు అయ్యింది. మరోవైపు ఆకాశ్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండడంతో.. సాక్షిని చంపి పరారై ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మూడు రోజుల కిందట హత్య జరిగి ఉంటుందని భావిస్తున్న పోలీసులు.. ఆకాశ్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు మొదలుపెట్టారు.ఇదిలా ఉంటే.. పెళ్లైన కొన్నాళ్లకే తమ బిడ్డను ఆకాశ్ అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడని సాక్షి కుటుంబం ఆరోపిస్తోంది(Dowry Harassment). అయితే ఆకాశ్ తల్లి ఆ ఆరోపణలను తోసిపుచ్చుతోంది. ఈ మధ్యే ఉత్తరప్రదేశ్లోని మైన్పురి జిల్లాలో ఓ గర్భవతిని ఆమె భర్త, అత్తమామలు కలిసి అదనపు కట్నం కోసం చితక్కొట్టి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.జాతీయ నేర గణాంకాల బ్యూరో (NCRB) ప్రకారం.. వరకట్న వేధింపుల ఘటనలు, ఆ వేధింపుల కారణంగా మరణిస్తున్న కేసులూ దేశంలో అంతకంతకు పెరుగుతూ వస్తున్నాయి. ఈ జాబితాలో యూపీ, బీహార్ తర్వాతి స్థానంలో కర్ణాటక ఉంది. ఇదీ చదవండి: సీనియర్లు వేధించారనే ఐపీఎస్ సూసైడ్! -
మల్లమ్మ మాట.. పల్లె పదాల మూట
తెలంగాణలో గంగవ్వ ఎలాగో కర్నాటకలో మల్లమ్మ అలాగ. కన్నడ భాషలోని పల్లె పలుకుబడిలో వర్తమాన విషయాలపై మల్లమ్మ చేసే వ్యంగ్య వ్యాఖ్యానానికి చాలామంది ఫాలోయెర్స్ ఉన్నారు. ఆమె ‘మల్లమ్మ టాక్స్’ యూట్యూబ్ చానల్కు 50 వేల మంది సబ్స్క్రయిబర్స్. అందుకే ఆమెకు కన్నడ బిగ్బాస్లో పిలుపు వచ్చింది. మారుమూల పల్లెల్లో ఉన్నామని చిన్నబుచ్చుకోక గంగవ్వలా, మల్లమ్మలా ఎవరైనా వెలగొచ్చు.కిచ్చా సుదీప్ హోస్ట్ చేస్తోన్న ‘కన్నడ బిగ్బాస్ 12’వ సీజన్ప్రారంభమైంది. అన్ని బిగ్బాస్ షోలకు ఉన్నట్టే అక్కడా దానికి ఒక క్రేజ్ ఉంది. ప్రతిసారీ హౌస్లోకి వచ్చేవారు ఎవరా అనే కుతూహలం ఉంటుంది. ఈసారి హౌస్లోని అభ్యర్థుల్లో పాపులర్ వ్యక్తులు చాలా మందే ఉన్నారు. అయితే వారందరిని మించి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆమే మల్లమ్మ అలియాస్ ‘మటిన మల్లి’ (మాటల రాణి– ఆమెను అభిమానంగా పిలుచుకునే పేరు). బిగ్బాస్లో అందరికంటే ఎక్కువ వయసు మల్లమ్మదే. 70 ఏళ్లు. మల్లమ్మ సరళమైన జీవనశైలి, హాస్యం, గ్రామీణ జీవితంపై ఆమె చేసే కంటెంట్ సోషల్ మీడియాలో ఆమెను వైరల్గా మార్చాయి. ఇక్కడ బిగ్బాస్లో ఎలాగైతే తెలంగాణ గంగవ్వకు చోటు లభించిందో ఆమెకు అలా అక్కడ చోటు లభించింది. బిగ్బాస్లో పాల్గొన్న గంగవ్వ ఆ షో పుణ్యమా అని సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోగలిగింది. మరి మల్లమ్మకు ఏం ప్రయోజనం కలుగుతుందో చూడాలి.కథలు చెప్పే మల్లమ్మఉత్తర కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా సురపుర గ్రామానికి చెందిన మల్లమ్మ మంచి మాటకారి. సోషల్మీడియా కంటెంట్ క్రియేటర్. ఆమె వీడియోలకు లక్షల్లో వీక్షకులున్నారు. ఆమె సోషల్ మీడియా ప్రయాణం విచిత్రంగా మొదలైంది. ఆమె గతంలో బెంగళూరులోని ఓ ఫ్యాషన్ డిజైన్ కంపెనీలో పని చేసింది. ఆమె మంచి టైలర్. ఆ సమయంలో స్టోర్ యజమానులను ఇంటర్వ్యూ చేసి ఆ వీడియోలను అప్లోడ్ చేసింది. అవి పాపులర్ కావడంతో ఇతర అంశాలపైనా దృష్టి సారించి, మరిన్ని వీడియోలు చేసింది.పల్లెటూరి పనులు, వంటలు, షాపుల్లో పల్లెజనం బేరసారాలు చేసే తీరు, జాతరలు ఇవన్నీ యథాతథంగా ఎలా ఉంటాయో ఆమె చూపడం వల్ల ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఇన్స్టాగ్రామ్కు 1.83 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మల్లమ్మ అప్పుడప్పుడూ సరదా కథల్ని కూడా తన వీడియోల్లో పంచుకుంటోంది. ఇంత పాపులారిటీ ఉండటం వల్ల సహజంగానే బిగ్బాస్ షోకు ఆహ్వానం అందింది. హోస్ట్ సుదీప్తో ఆమె మాట్లాడుతూ బిగ్బాస్ హౌస్ నియమాల గురించి తనకేమీ తెలియదని అన్నారు. ‘మల్లమ్మ ఎప్పుడూ తనంతట తానుగా జీవితాన్ని గడిపే వ్యక్తి’ అని సుదీప్ అన్నారు. మల్లమ్మకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.ప్రశంసలతోపాటు వివాదాలుమల్లమ్మ చేసిన వీడియోలకు అనేక ప్రశంసలు వచ్చాయి. ఒక్క వీడియో మాత్రం తీవ్రమైన విమర్శలు మూటగట్టుకుంది. ఒక తెలుగు సినిమాలోని పాట గురించి ఆమె మాట్లాడిన మాటలతో అనేకమంది తీవ్ర విమర్శలు చేశారు. దీంతో తన అకౌంట్ను మూసివేయాలని అనుకున్నట్లు ప్రకటించింది. అయితే అలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆమె అభిమానులు ఆమెను ఒప్పించారు. అలా ఆమె వీడియోల్లో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. విక్కీ కౌశల్ ‘తౌబా తౌబా’ డ్యాన్స్, ఉర్ఫీ జావేద్ డ్రెస్సింగ్ స్టైల్, ఉత్తర భారతదేశ వంటలు, వైరల్ రీల్స్.. ఇలా అన్నింటి గురించి ఆమె వీడియోలు చేసింది. అయితే ప్రస్తుతం కన్నడ బిగ్బాస్ షో తాత్కాలిక కష్టాల్లో పడింది. పర్యావరణ అనుమతులు లేవని ΄ోలీసులు బిగ్బాస్ హౌస్ను మంగళవారం సాయంత్రం సీజ్ చేసి కంటెస్టెంట్లను ఒక రిసార్ట్కు తరలించారు. బిగ్బాస్ హౌస్లో నుంచి బయటకు వచ్చే మురుగు నీరు, వ్యర్థ పదార్థాల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోలేదని నిర్వాహకుల మీద అధికారులు చర్యలు చేపట్టారు. ఎంతో సంతోషంగా హౌస్లో అడుగు పెట్టిన మల్లమ్మ ప్రస్తుతం రిసార్ట్కు చేరింది. అయితే సమస్య అతి త్వరలో సద్దుమణిగి షో కొనసాగుతుందనే అభిమానులు ఆశిస్తున్నారు. -
కర్ణాటక: విహారయాత్రలో విషాదం.. చిన్నారులు మృతి
బెంగళూరు: కర్ణాటకలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విషాద యాత్ర సందర్భంగా విషాదం నెలకొంది. విహార యాత్రకు వెళ్లిన వ్యక్తులు.. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు ఏడుగురు గల్లంతు అవగా.. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలో మార్కోనహళ్లి ప్రాజెక్ట్ వద్దకు 15 మంది కలిసి విహార యాత్రకు వెళ్లారు. అనంతరం, వారిలో ఒక మహిళ, ఆరుగురు పిల్లలు కలిసి.. నీళ్లు ఉన్న ప్రాంతం వద్ద ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. దీంతో, నీటిలో గల్లంతయ్యారు. వారిని కాపాడేందుకు నవాజ్ అనే వ్యక్తి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.పిల్లలను కాపాడే క్రమంలో నవాజ్ కూడా నీటిలో కొట్టుకుపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, రెస్య్కూ బృందాల అక్కడి చేరుకుని వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కేవలం నవాజ్ను మాత్రమే ప్రాణాలతో కాపాడారు. అనంతరం, ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన మహిళ, పిల్లల కోసం గాలిస్తున్నారు. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, వీరంతా కర్ణాటకలోని తుమకూరుకు చెందిన వారిగా గుర్తించారు. విహార యాత్రకు వెళ్లి తమ పిల్లలు ఇలా చనిపోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. -
కర్ణాటక కెప్టెన్గా రాహుల్ ద్రవిడ్ కొడుకు.. కరుణ్ నాయర్ రీఎంట్రీ
త్వరలో జరుగనున్న వినూ మన్కడ్ ట్రోఫీ, రంజీ ట్రోఫీల కోసం కర్ణాటక జట్లను ఇవాళ ప్రకటించారు. వినూ మన్కడ్ ట్రోఫీలో పాల్గొనే జట్టుకు టీమిండియా దిగ్గజ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ (Anvay Dravid) సారధిగా ఎంపిక కాగా.. రంజీ ట్రోఫీ జట్టుకు మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) కెప్టెన్గా కొనసాగాడు. ఈసారి రంజీ జట్టులో పలు కొత్త ముఖాలకు చోటు దక్కింది. కృతిక్ కృష్ణ, శిఖర్ షెట్టి, మొహిసిన్ ఖాన్ తొలిసారి రంజీ జట్టులో చోటు దక్కించుకున్నారు.కరుణ్ నాయర్ రీఎంట్రీఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో విఫలమై, విండీస్ పర్యటనకు ఎంపిక కాని కరుణ్ నాయర్ (karun Nair) కర్ణాటక రంజీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. కరుణ్ గత రెండు రంజీ సీజన్లలో విదర్భ తరఫున ఆడాడు. గత సీజన్లో విదర్భ ఛాంపియన్గా నిలవడంలో కరుణ్ కీలకపాత్ర (16 ఇన్నింగ్స్ల్లో 53.96 సగటున 863 పరుగులు) పోషించాడు. గతకొంతకాలంగా దేశవాలీ క్రికెట్లో పరుగులు వరద పారించి, సెంచరీల మోత మోగించి టీమిండియాకు ఎంపికైన కరుణ్ ఇంగ్లండ్ పర్యటనలో నిరాశపరిచాడు. అక్టోబర్ 15న రాజ్కోట్లో సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్తో కరుణ్ కర్ణాటక తరఫున పునరాగమనం చేసేందుకు సిద్దంగా ఉన్నాడు.2025/26 రంజీ సీజన్ కోసం కర్ణాటక జట్టు: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), కరుణ్ నాయర్, ఆర్ స్మరణ్, కేఎల్ శ్రీజిత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ గోపాల్, వైశాక్ విజయకుమార్, విద్వత్ కవేరప్ప, అభిలాష్ శెట్టి, ఎం వెంకటేష్, నికిన్ జోస్, అభినవ్ మనోహర్, కృతిక్ కృష్ణ (వికెట్ కీపర్), కేవీ అనీష్, మోహ్సిన్ ఖాన్, శిఖర్ శెట్టి.కెప్టెన్గా అన్వయ్ ద్రవిడ్50 ఓవర్ల ఫార్మాట్లో జరిగే వినూ మన్కడ్ ట్రోఫీ అక్టోబర్ 9 నుంచి 17 వరకు డెహ్రాడూన్లో జరుగనుంది. ఈ టోర్నీ కోసం కర్ణాటక జట్టు కెప్టెన్గా అన్వయ్ ద్రవిడ్ ఎంపికయ్యాడు. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) ఎస్ మణికాంత్ నియమితుడయ్యాడు.వినూ మన్కడ్ ట్రోఫీ 2025 కోసం కర్ణాటక జట్టు: అన్వయ్ ద్రవిడ్ (కెప్టెన్, వికెట్ కీపర్), నితీష్ ఆర్య, ఆదర్శ్ డి ఉర్స, ఎస్ మణికాంత్ (వైస్ కెప్టెన్), ప్రణీత్ శెట్టి, వాసవ్ వెంకటేష్, అక్షత్ ప్రభాకర్, సి వైభవ్, కుల్దీప్ సింగ్ పురోహిత్, రతన్ బీఆర్, వైభవ్ శర్మ, కేఏ తేజస్, అథర్వ్ మాల్వియా, సన్నీ కాంచి, రెహాన్ మహమ్మద్అన్వయ్ ద్రవిడ్కు అవార్డుగత ఎడిషన్ అండర్-19 విజయ్ మర్చంట్ ట్రోఫీలో (రెడ్బాల్) సత్తా చాటిన అన్వయ్ ద్రవిడ్ను కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సన్మానించింది. ఈ టోర్నీలో అన్వయ్ 6 మ్యాచ్ల్లో 91.80 సగటున 459 పరుగులు సాధించి, కర్ణాటక తరఫున టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి.కాగా, రాహుల్ ద్రవిడ్ మరో కుమారుడు (పెద్దవాడు) కూడా క్రికెటరే అన్న విషయం తెలిసిందే. తమ్ముడు అండర్-16 విభాగంలో సత్తా చాటుతుంటే, అన్న సమిత్ సీనియర్ లెవెల్లో పర్వాలేదనిపిస్తున్నాడు. సమిత్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కాగా.. అన్వయ్ వికెట్ కీపర్ బ్యాటర్. చదవండి: తగ్గేదేలే!.. 459 పరుగులు.. ద్రవిడ్ చిన్న కుమారుడి జోరు.. -
దెయ్యాలు బాబోయ్
మండ్య : సోషల్ మీడియాలో వైరల్ కావాలని చిత్ర విచిత్రమైన వీడియోలను తయారు చేస్తూ ఉంటారు కొందరు. అదే కోవలో దెయ్యాలు తిరుగుతున్నాయని, కనిపించినవారిపై దాడులు చేస్తున్నాయని వీడియోలు తీసిన ఓ ఘనుని ఉదంతమిది. మండ్య జిల్లాలోని నాగమంగలలో వెలుగుచూసింది. వివరాలు.. పట్టణవాసి గోపి యూట్యూబ్ వీడియోలు చేస్తుంటాడు. దేవలాపుర హ్యాండ్పోస్ట్ వద్ద దెయ్యాలు తిరుగుతున్నాయని, అవి ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతున్నాయని ఓ వీడియోను సృష్టించి పోస్ట్ చేశాడు. అందులో ఓ మహిళ దయ్యం మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ వీడియో చూసిన ప్రజలు నిమేననుకుని హడలిపోయారు. ఈ విషయం పోలీసులకు తెలిసి గోపిని పిలిపించారు. ఎలాంటి దయ్యాలు లేవని, వ్యూస్ కోసం నకిలీ వీడియోను రూపొందించానని గోపి చెప్పాడు. ఆ వీడియోను తొలగించాడు. ఎలాంటి దయ్యాలు లేవు, ప్రజలు భయపడకండి అని పోలీసులు ఫ్యాక్ట్ చెక్ అని ఓ పోస్టింగ్ను ఉంచారు. -
తగ్గేదేలే!.. 459 పరుగులు.. ద్రవిడ్ చిన్న కుమారుడి జోరు..
టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కుమారులు ఇద్దరూ తండ్రి బాటలోనే నడుస్తున్నారు. పెద్ద కుమారుడు సమిత్ ద్రవిడ్, చిన్న కొడుకు అన్వయ్ ద్రవిడ్ (Anvay Dravid) కర్ణాటక క్రికెట్ జట్టు తరఫున సత్తా చాటుతున్నారు.సమిత్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కాగా.. అన్వయ్ వికెట్ కీపర్ బ్యాటర్గా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. కాగా అండర్-16 క్రికెట్లో సత్తా చాటుతున్న అన్వయ్కు తాజాగా అవార్డు లభించింది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA) అతడిని సత్కరించింది.అత్యధిక పరుగుల వీరుడిగా మయాంక్తమ రాష్ట్రం తరఫున సత్తా చాటుతున్న క్రికెటర్లకు కేఎస్సీఏ ప్రతి ఏడాది అవార్డులు ఇస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం పురస్కారాలు అందజేసే కార్యక్రమం నిర్వహించింది. ఇందులో భాగంగా టీమిండియా వెటరన్ ఆటగాడు మయాంక్ అగర్వాల్ను సత్కరించింది.గతేడాది దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో ఓపెనింగ్ బ్యాటర్ మయాంక్ అగార్వల్ సగటు 93తో 651 పరుగులు చేసి.. లిస్ట్-ఎ క్రికెట్లో కర్ణాటక తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ఇక టీమిండియా దిగ్గజం, మాజీ హెడ్కోచ్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ వరుసగా రెండో ఏడాది సత్తా చాటి అవార్డు అందుకున్నాడు.రెండు సెంచరీలు.. 459 పరుగులు.. అండర్-19 విజయ్ మర్చంట్ ట్రోఫీ (రెడ్బాల్)లో భాగంగా ఆరు మ్యాచ్లు ఆడిన అన్వయ్.. 91.80 సగటుతో 459 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండగా.. 46 బౌండరీలు కూడా అన్వయ్ ఖాతాలో చేరాయి. తద్వారా కర్ణాటక తరఫున టాప్ రన్ స్కోరర్గా నిలిచి అన్వయ్ అవార్డు అందుకున్నాడు.ఈ నేపథ్యంలో తండ్రి తగ్గ తనయుడు అంటూ అన్వయ్ను ద్రవిడ్ అభిమానులు కొనియాడుతున్నాడు. ఇదే జోరు కొనసాగిస్తూ.. టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.వీరికి కూడా అవార్డులుఇదిలా ఉంటే.. మిగతా వారిలో ఎడమచేతి వాటం బ్యాటర్ ఆర్. స్మరణ్ రంజీ ట్రోఫీలో రెండు శతకాల సాయంతో 516 పరుగులు చేసి.. టాప్ రన్ స్కోరర్గా అవార్డు అందుకున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో వాసుకీ కౌశిక్ గతేడాది 23 వికెట్లు పడగొట్టి పురస్కారం అందుకున్నాడు. అయితే, ఈ ఏడాది అతడు గోవాకు ఆడబోతుండటం గమనార్హం.అదే విధంగా.. లెగ్ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ శ్రీజిత్ కూడా సత్తా చాటి పురస్కారాలు అందుకున్నారు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గోపాల్ 14 వికెట్లు తీయగా.. శ్రీజిత్ 213 పరుగులు సాధించాడు.ఇక మహిళా క్రికెటర్లకు కూడా KSCA ఈ సందర్భంగా అవార్డులు అందజేసింది. మలేషియా వేదికగా జరిగిన ఐసీసీ అండర్-19 వుమెన్స్ టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యులైన నికీ ప్రసాద్, మిథిలా వినోద్లను సత్కరించింది. అదే విధంగా పర్ఫామెన్స్ అనలిస్ట్ మాలా రంగస్వామికి కూడా అవార్డు అందజేసింది.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
ప్రియురాలిని లాడ్జికి పిలుచుకెళ్లిన ప్రియుడు
కర్ణాటక రాష్ట్ర: వివాహమై ఇద్దరు పిల్లల తల్లి అయిన ఓ మహిళ తన ప్రియుడు మోసగించాడని మనో వేదనతో ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. వివరాలు.. యశోద ఆత్మహత్య చేసుకొన్న మహిళ. మృతురాలు యశోదకు వివాహమై భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా కూడా ఆమె పక్క వీధిలో ఉన్న ఆడిటర్ విశ్వనాథ్ అనే వ్యక్తితో గత తొమ్మిదేళ్లుగా అక్రమ సంబంధం కలిగి ఉంది. అయితే కొంతకాలం క్రితం యశోద తన స్నేహితురాలిని ప్రియుడు విశ్వనాథ్కి పరిచయం చేసింది. దీంతో ప్రియుడు యశోద స్నేహతురాలితో చనువు పెంచుకొని ఆమెను ప్రేమ వలలో పడేశాడు. అంతేకాకుండా ఆమెను ఓ గదికి తీసుకెళ్లాడు. ఈ విషయం యశోద చెవిలో పడింది. ప్రియుడితో కలిసి స్నేహితురాలు ఉన్న లాడ్జికి వెళ్లి గొడవ పడింది. ప్రియుడు సరిగా స్పందించకపోవటంతో మనోవేదనతో అక్కడే పక్క గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై మాగడి రోడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
బెడ్రూమ్లో సీక్రెట్ కెమెరాలు.. ఫ్రెండ్స్కు వీడియోలు పంపిన భర్త
కర్ణాటక: ఓ వికృత భర్త నిజ స్వరూపాన్ని చూసి భార్య నిశ్చేష్టురాలైంది. పడక గదిలో రహస్యంగా కెమెరాలను అమర్చి భార్యతో సన్నిహితంగా వీడియోలను తీసుకున్న భర్త వాటిని స్నేహితులకు పం పించి పైశాచికానందం పొందాడు. సభ్య సమాజాన్ని విస్తుగొలిపే ఈ ఘటన సిలికాన్ సిటీ బెంగళూరులో శుక్రవారం వెలుగుచూసింది. బాధితురాలు, పుట్టేనహళ్లి పోలీసుల కథనం ప్రకారం..బెంగళూరుకు చెందిన సయ్యద్ ఇనాముల్ గతంలో పెళ్లయిం ది. కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి గతసెప్టెంబర్ బాధిత యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వ్యాపారం చేస్తానని, ఆస్తిపరుడిని అని చెప్పుకున్నాడు. 350 గ్రాముల బంగారం, ఓ ఖరీదైన బైకు కట్నంగా తీసుకున్నాడు. తొలిరోజు నుంచే భార్యను వేధించడం ప్రారంభించాడు. తనకు 19మంది మహిళలతో సంబంధాలున్నట్లు గొప్పలు చెప్పుకునేవాడు. బెడ్ రూంలో కెమెరాలను ఏర్పాటు చేసి భార్యతో సన్నిహితంగా ఉన్న దృశ్యాలను రికార్డ్ చేసేవాడు. ఆ వీడియోలను దుబాయ్లోని తన స్నేహితులకు పంపేవాడు. వారితో లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని భార్యపై ఒత్తిడి చేసేవాడు. భర్తకు అత్తమామలు, ఆడపడుచు, ఆమె భర్త సహకరించేవారు, వారూ వేధించేవారు. బయట సినిమాలు, పార్కులకు వెళ్లినప్పుడు కూడా సయ్యద్ భార్యను అవమానించేవాడు. దీంతో విసిగివేసారిన బాధితురాలు పుట్టేనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు విచారణలో సయ్యద్ భార్య ఆరోపణలు నిజమేనని అంగీకరించడంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి ఫోన్, కంప్యూటర్ సీజ్ చేశారు. -
పాము కడుపులో ప్లాస్టిక్ బాటిల్.. ఎలా బయటకు వచ్చిందో చూశారా?
ప్లాస్టిక్ భూతం పర్యావరణాన్ని మింగేస్తున్న భయంకరమైన ముప్పు. ఇది మనకెప్పుడో తెలుసు, అయినా మన చర్యలు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. అయితే మనిషి నిర్లక్ష్యం ప్రకృతిలోని మిగతా జీవుల ప్రాణాలకూ ముప్పుగా మారుతోంది. తాజాగా కర్ణాటక చిత్రదుర్గలో జరిగిన ఈ ఘటన గురించి తెలిస్తే మీరూ అయ్యో పాపం అనుకుంటున్నారు. 2025 సెప్టెంబర్ 16న కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా కల్లహళి గ్రామంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఓ పాడుబడిన ఇంట్లో ఆరడుగుల పాము కదల్లేని స్థితిలో అవస్థలు పడుతూ కనిపించింది. అది విషపూరిత కేరు హావు సర్పం (రసెల్ వైపర్) కావడంతో గ్రామస్తులు స్థానికంగా ఉండే ఉరగప్రేమి(స్నేక్ క్యాచర్) ‘స్నేక్ శివు’కి సమాచారం అందించారు. ఆయన దానిని చాకచక్యంగా పట్టుకున్నాడు. అయితే.. దాని పొట్ట భాగం ఉబ్బిపోయి కనిపించడంతో దాని ఆ అవస్థకు అదే కారణమని గుర్తించారు. వెంటనే.. చిత్రదుర్గ పశువైద్య ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వాళ్లు చేతులెత్తేయడంతో.. దానిని బెంగళూరులోని “పీపుల్ ఫర్ అనిమల్స్” (People For Animals) ఆసుపత్రికి తరలించాడు స్నేక్ శివు. అక్కడ దాని కడుపులో ప్లాస్టిక్ బాటిల్ ఉన్నట్లు గుర్తించారు(Plastic Bottle in Snake Stomach). వెటర్నిటీ డాక్టర్లు డా. నవాజ్ షరీఫ్, డా. మాధవ్ బృందం అక్టోబర్ 2వ తేదీన అరుదైన శస్త్రచికిత్స నిర్వహించింది. సుమారు రెండు గంటలు శ్రమించి.. సర్జరీ చేసి దాని పొట్ట నుంచి బాటిల్ను తొలగించింది. అది ఒక సన్స్క్రీన్ లోషన్ బాటిల్ అని, ఆ బాటిల్ కారణంగా దాని పేగు తెగిపోయి కదల్లేని స్థితిలో.. ప్రాణాంతక పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడిందని తెలిపారు. ప్రస్తుతం పాము అత్యవసర విభాగంలో చికిత్స పొందుతుందని, అది కోలుకునేందుకు 15 రోజుల సమయం పడుతుందని వారు అంటున్నారు. ఆ తర్వాతే దానిని సమీపంలోని అడవిలో వదిలిపెడతామని తెలిపారు. పామును రక్షించిన స్నేక్ శివుపై సర్వత్రా అభినందనలు కురుస్తున్నాయి. ఇదీ చదవండి: ఒక్కో మెట్టు.. ఆరోగ్యం సూపర్ హిట్టూ! -
Karnataka: సీఎం మార్పుపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు
‘సీఎం మార్పు’ అంశంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి ఐదేళ్ల పదవీ కాలానికి తానే సీఎంగా ఉంటానని.. వచ్చే ఏడాది మైసూర్లో దసరాకీ తానే పూజ చేస్తానంటూ నొక్కి చెప్పారు. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై జరుగుతున్న ఊహాగానాలపై మాట్లాడుతూ.. "నేను రెండోసారి ముఖ్యమంత్రిని కాలేనని చాలామంది జోస్యం చెప్పారు, కానీ నేను అయ్యాను. నా కారుపై కాకి వాలడం దుశ్శకునం అని.. నేను సీఎం కొనసాగలేనని చాలామంది అన్నారు. నేను బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేనన్నారు.. కానీ ఏం జరిగింది’’ అంటూ చెప్పుకొచ్చారు.కాగా, గత కొంతకాలంగా కర్ణాటకలో ‘సీఎం మార్పు’పై గందరగోళం కొనసాగుతన్న సంగతి తెలిసిందే.. తాజాగా డిప్యూటీ సీఎం శివకుమార్ దీనిపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి కాలమే సమాధానం చెబుతుందని అన్నారాయన. ప్రపంచంలో ఏ మనిషైనా ఆశతోనే బతుకుతారని... ఆ ఆశే లేకుంటే జీవితమే లేదు. మీరడిగిన ప్రశ్నకు నేను కాదు.. కేవలం కాలమే దీనికి సమాధానం చెబుతుంది అని అన్నారాయన. సీఎం పదవి నిర్ణయం పార్టీ హై కమాండ్దేనని డీకే మరోసారి కుండబద్ధలు కొట్టారు.కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2023 మే 20న అధికారంలోకి వచ్చింది. ఈ నవంబర్కు రెండున్నర సంవత్సరాలు పూర్తవుతాయి. రెండున్నరేళ్ల అనంతరం ముఖ్యమంత్రి పీఠం మార్పు ఉంటుందని కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. -
ఖర్గేకు పేస్మేకర్
బెంగళూరు: ఏఐసీసీ చీఫ్(AICC Chief) మల్లికార్జున ఖర్గే(83) ఆరోగ్యం నిలకడగానే ఉందని ఇటు వైద్యులు, అటు కుటుంబ సభ్యులు ప్రకటించారు. మంగళవారం అర్ధరాత్రి అస్వస్థతకు గురైన ఆయన్ని నగరంలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. జ్వరం, కాళ్ల నొప్పులతో ఆయన బాధపడుతున్నట్లు తొలుత వైద్యులు ప్రకటించారు. అయితే.. ఆయనకు ఫేస్మేకర్(Kharge pacemaker) అమర్చాలని వైద్యులు సూచించారట. ఈ విషయాన్ని ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గ్ ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోందన్న ఆయన.. ఆయన ఆరోగ్యం పట్ల ఆరా తీసిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదిలా ఉంటే.. ప్రత్యేక వైద్య బృందం ఖర్గేకు చికిత్స అందిస్తోంది. సీఎం సిద్ధరామయ్య ఆస్పత్రికి వెళ్లి ఖర్గేను పరామర్శించారు. మరోవైపు.. Sri Kharge was advised pacemaker to be implanted and is admitted to the hospital for the planned procedure. He is stable and doing well.Grateful to all of you for your concern and wishes.— Priyank Kharge / ಪ್ರಿಯಾಂಕ್ ಖರ್ಗೆ (@PriyankKharge) October 1, 2025ఖర్గే అస్వస్థత(Mallikarjun Kharge Hospitalised) వార్తతో కాంగ్రెస్ శ్రేణులు అందోళన వ్యక్తం చేశాయి. పార్టీ సీనియర్ నేతలు ఆయన ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అక్టోబర్ 7వ తేదీన కోహిమా(నాగాలాండ్)లో కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీకి ఖర్గే హాజరు కావాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. పూర్తిగా కోలుకునేంత వరకు ఆస్పత్రిలోనే ఉంటారని ఖర్గే కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ తరుణంలో ఆ కార్యక్రమానికి ఆయన దూరంగా ఉండే అవకాశం లేకపోలేదు.పేస్మేకర్ అంటే.. హృదయ స్పందన (heart rhythm) సరిగ్గా లేకపోతే దాన్ని నియంత్రించేందుకు శరీరంలో అమర్చే చిన్న ఎలక్ట్రానిక్ పరికరం. వయసు పైబడిన వాళ్లలో.. హార్ట్బీట్ మందగించిన సమస్యలుంటే దీనిని అమరుస్తారు. ఇదీ చదవండి: నన్ను ఏమైనా చేస్కోండి, కానీ..: టీవీకే విజయ్ ఆవేదన


