
జాతీయ ఉషూ టోర్నీకి నలుగురి ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్ : జాతీయస్థాయి సీనియర్ ఉషూ టోర్నీకి జిల్లా నుంచి నలుగురు ఎంపికయ్యారు. బిలాస్పూర్లో జరుగనున్న ఫెడరేషన్ కప్ పోటీల్లో వీరి రాష్ట్ర జట్టు తరఫున ఆడనున్నారు. ఎంపికై న వారిలో పి.పవిత్రాచారి, పి.సత్యజిత్చారి, బి.హర్షవర్దన్, ఎస్. ఉదయ్కిరణ్ ఉన్నారు. జిల్లా నుంచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, కోచ్ పి.పరిపూర్ణాచారి హర్షం వ్యక్తం చేశారు.
టీడీసీఏ క్రికెట్ జట్టుకు..
తెలంగాణ జిల్లా క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే టోర్నీకి జిల్లా నుంచి నలుగురు ఎంపికయ్యారు. హైదరాబాద్లో ఈనెల 24 నుంచి 31 వరకు జరుగనున్న ఈ టోర్నీలో ఉమ్మడి జిల్లాకు చెందిన క్రికెటర్లు పాల్గొనున్నారు. ఎంపికై న వారిలో గోవర్దన్, సాయి సాకేత్, ప్రియాంష్రెడ్డి, చందు ఉన్నారు. ఎంపికై న వారిని సీపీ సునీల్దత్, డీవైఎస్ఓ సునీల్రెడ్డి, టీడీసీఏ కోఅర్డినేటర్ ఎం.డి.మతిన్, కోచ్ సంపత్, నిరంజన్, నాగేశ్వరరావు, ఇమ్రాన్, శ్రీనివాస్, రాంబాబు అభినందించారు.
కాలినడకన
ద్వారకా తిరుమలకు
సత్తుపల్లిరూరల్: మండల పరిధిలోని గంగారం గ్రామానికి చెందిన 16 మంది ఆదివారం స్థానిక శ్రీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి కాలినడకన ద్వారకా తిరుమలకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంతరాలు రాకుండా చూడాలని స్వామివారిని వేడుకున్నారు. పాదయాత్రగా వెళ్లినవారిలో మధుబాబు యూత్ సభ్యులు కోలగట్ల చెన్నకేశ్వరరావు, ముత్తా అబ్బులురావు, తిరుమలశెట్టి సాయి, వనపర్తి మోహన్రావు, మలిశెట్టి రాంబాబు, పాకిన వెంకటకృష్ణ, చిన్న వెంకటేశ్వరరావు, అరిగే భీమాచారి, జల్లిపల్లి వాసుదేవరావు తదితరులు ఉన్నారు.
భువనగిరికి బ్రాహ్మణ సమాఖ్య ప్రతినిధులు
ఖమ్మంగాంధీచౌక్: తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య(టీబీఎస్ఎస్ఎస్) నూతన కమిటీ ఎన్నిక ఆదివారం యాదాద్రి జిల్లా భువనగిరి సమీపంలో గల స్వర్ణగిరి ఆలయంలో జరగగా, జిల్లా సంఘం ప్రతినిధులు హాజరయ్యారు. ఎన్నికల కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సురావజ్జల వాసుశర్మ, యువజన అధ్యక్షుడు సరస్వతిభట్ల శ్రీధర్ శర్మ, రాష్ట్ర రీజనల్ కో–ఆర్డినేటర్ తాటికొండాల సీతారామశాస్త్రి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆమంచి సురేష్ శర్మ, ప్రతినిధులు జిలుగుల సతీష్ శర్మ, సన్నిధానం జగన్నాధం, రమామనోహర్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి నిత్యకల్యాణ వేడుక ఆదివారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన, తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివా రిని మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.

జాతీయ ఉషూ టోర్నీకి నలుగురి ఎంపిక