‘నవోదయ’ ఫలితాలు విడుదల | - | Sakshi
Sakshi News home page

‘నవోదయ’ ఫలితాలు విడుదల

Mar 26 2025 1:11 AM | Updated on Mar 26 2025 1:09 AM

కూసుమంచి: నవోదయ విద్యాలయాల్లో ఆరు, తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు ఇటీవల నిర్వహించిన అర్హత పరీక్ష ఫలితాలు వెల్లడయ్యా యి. ఈమేరకు ఫలితాలను విద్యాలయ సమితి మంగళవారం తన వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. దీంతో పరీక్ష రాసిన విద్యార్థులు తమ రోల్‌ నంబర్ల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. అయితే, తమకు విద్యాలయ సమితి నుండి ఇంకా జాబితా అందలేదని, వచ్చాక అర్హత సాధించిన వారి రోల్‌ నంబర్లు ప్రకటిస్తామని పాలేరు విద్యాలయ ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు.

‘కారుణ్య’ ఉద్యోగులకు విధులపై అవగాహన

ఖమ్మంవన్‌టౌన్‌: కారుణ్య నియామకాల ద్వారా జిల్లా నుంచి 27మందికి అవకాశం దక్కగా ఇటీవల హైదరాబాద్‌లో ఉత్తర్వులు అందుకున్నారు. ఈమేరకు జూనియర్‌ సహాయకులుగా నియమితైలన వారికి జెడ్పీ హాల్‌లో మంగళవారం విధినిర్వహణపై అవగాహన కల్పించారు. జెడ్పీ సీఈఓ దీక్షారైనా పాల్గొని విధులు, సర్వీస్‌ అంశాలను వివరించారు. డిప్యూటీ సీఈఓ నాగపద్మజ, మినిస్టీరియల్‌ ఉద్యోగ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మామునూరు రాజేష్‌, గుప్తా, జెడ్పీ ఉద్యోగులు రమణశేఖర్‌, రమణ, బండి భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

రూ.30.30లక్షలకు

పిండిప్రోలు సంత వేలం

తిరుమలాయపాలెం: మండలంలోని పిండిప్రోలులో ప్రతీ శనివారం నిర్వహించే వారంతపు సంత ఈసారి రికార్డు ధర పలికింది. ఎంపీడీఓ సిలార్‌సాహెబ్‌ ఆధ్వర్యాన మంగళవారం నిర్వహించిన వేలంలో రూ.50వేల చొప్పున డిపాజిట్‌ చెల్లించిన 90మందికి పైగా పాల్గొన్నారు. 2024–25లో రూ.14లక్షలు పలకగా.. ఈసారి వరంగల్‌ జిల్లా నర్సంపేటకు చెందిన అప్పాల సుదర్శన్‌ రూ.30.30లక్షలకు దక్కించుకోవడం విశేషం. దీంతో రూ.16లక్షలకు పైగా ధర పెరిగినట్లయింది. ఏపీడీ నూరుద్దీన్‌, పిండిప్రోలు, తిరుమలాయపాలెం, బచ్చోడు పంచాయతీ కార్యదర్శులు రాము, సుజాత, నిఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.

పంటల్లో సస్యరక్షణ చర్యలే కీలకం

వైరా: ఏ పంట సాగు చేసినా వాటిని ఆశించే తెగుళ్లను గుర్తించడం.. వీటిని నిర్మూలించే చర్యలే కీలకంగా నిలుస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. వైరా కృషి విజ్ఞాన కేంద్రంలోని రైతు శిక్షణా కేంద్రంలో నిర్వహిస్తున్న ఉత్తర తెలంగాణ వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా సంఘం సమావేశాలు మంగళవారం రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆపత్కాల పంటల ప్రణాళికలు – అనుసరించాల్సిన వ్యూహాలను సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎస్‌జీ.మహదేవప్ప వివరించారు. అనంతరం సంయుక్త వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణ, చీడపీడల గుర్తింపు.. ఆపై శాస్త్రవేత్తల సలహాతో నిర్మూలించడం వంటి అంశాలను ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకుడు డాక్టర్‌ ఎం.బలరామ్‌ వివరించారు. ఆపై జిల్లా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు వివిధ పంటల సాగుపై చర్చించి చేయాల్సిన పరిశోధనలను నిర్ణయించారు.

మిర్చి రైతులను ఆదుకోవాలి

ఖమ్మంవన్‌టౌన్‌: మిర్చి సాగు చేస్తున్న రైతులకు మద్దతు ధర దక్కేలా కేంద్రం చొరవ చూపాలని ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి కోరారు. ఈసందర్భంగా ఆయన లోక్‌సభలో మంగళవారం మాట్లాడారు. తెలంగాణలో అత్యధికంగా ఖమ్మం, వరంగల్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో మిరప పంట సాగవుతోందని తెలిపారు. ఈనేపథ్యాన రైతుల సమస్యలను పరిగణనలోకి తీసుకుని, వాటిని పరిష్కరించడం ద్వారా అండగా నిలవాలని ఎంపీ కోరారు.

‘నవోదయ’ ఫలితాలు విడుదల 
1
1/2

‘నవోదయ’ ఫలితాలు విడుదల

‘నవోదయ’ ఫలితాలు విడుదల 
2
2/2

‘నవోదయ’ ఫలితాలు విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement