ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన బోధన | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన బోధన

Mar 26 2025 1:11 AM | Updated on Mar 26 2025 1:09 AM

చింతకాని/వైరా రూరల్‌: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడమే కాక నాణ్యమైన బోధన అందిస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖర్మ శర్మ తెలిపారు. చింతకాని మండలంలోని మత్కేపల్లి ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10మంది విద్యార్థులకు వైరా మండలం అష్ణగుర్తికి చెందిన సువిధ వికాస్‌ ట్రస్ట్‌ సమకూర్చిన సైకిళ్లను మంగళవారం ఆయన అందజేసి మాట్లాడారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో పాటు దాతల చేయూతను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థానాలకు చేరాలని సూచించారు. అలాగే, వైరా మండలం రెబ్బవరం జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ఏడుగురికి సువిధ ట్రస్ట్‌ బాధ్యులు సైకిళ్లు అందించారు. ఈకార్యక్రమాల్లో ఎంఈఓలు వీరపనేని శ్రీనివాసరావు, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, అమ్మ ఆదర్శ పాఠశాలల చైర్మన్లు బొల్లికొండ మంగమ్మ, ఆకుల లలిత, ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎంలు అనిత, గంగవరపు వెంకట్రావు, ఉపాధ్యాయులు గండేపల్లి శ్రీనివాసరావు, ఉమామహేశ్వరరావు, సురేష్‌, నాగమణి, హసీనా, సమ్మయ్య, దొడ్డా వరప్రసాద్‌, జీ.వీ.సూర్యప్రకాష్‌, ట్రస్ట్‌ బాధ్యులు అమరనేని మన్మధరావు, వేంసాని వెంకట్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement