●ఆది నుంచీ అనుమానాస్పదమే | - | Sakshi
Sakshi News home page

●ఆది నుంచీ అనుమానాస్పదమే

Mar 27 2025 1:37 AM | Updated on Mar 27 2025 1:33 AM

భద్రాచలం: భద్రాచలానికి శ్రీనివాసం శ్రీరామ స్వాతి – శ్రీపతి దంపతులు పదేళ్ల క్రితం వచ్చారు. అప్పటి నుంచి పలు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీపతి తెలుపు, కాషాయ వస్త్రాలు ధరించి, గుబురు గడ్డంతో స్వామిజీలా కనిపించేవారు. ఆ తర్వాత పాత భవనాన్ని కొనుగోలు చేసి అక్కడే ఆలయ నిర్మాణం ప్రారంభించారు. అది పూర్తికాక ముందే జీ ప్లస్‌ 5 భవన నిర్మాణం మొదలుపెట్టారు. ఆధ్యాత్మిక ముసుగులో అక్రమ కట్టడాలేమిటని ప్రశ్నించిన స్థానికులతో పలుమార్లు తగదా పడ్డారు. భవన నిర్మాణ పనులపై అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజన సంఘాల నేతలతోనూ గొడవ పెట్టుకున్నారు. భవనం కూలిపోయిన తర్వాత ఈ దంపతుల విషయమై స్థానికులను వాకబు చేయగా ఎవరూ పూర్తి వివరాలు చెప్పలేకపోయారు. అయితే, శ్రీపతిని బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నా స్పష్టత రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement