విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి చదవాలి | - | Sakshi

విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి చదవాలి

Mar 27 2025 1:37 AM | Updated on Mar 27 2025 1:33 AM

ఎర్రుపాలెం: చిన్నతనం నుంచే విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని కష్టపడి చదివితే ఉన్నత స్థానాలకు చేరొచ్చని డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. ఎర్రుపాలెంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని బుధవారం తనిఖీ చేసిన ఆయన పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఇప్పటివరకు పరీక్షలు ఎలా రాశారని ఆరా తీసిన ఆయన చదువులో రాణిస్తున్న ఆడపిల్లలు మరింత శ్రద్ధ వహించాలని సూచించారు. ఆ తర్వాత పాఠశాల రికార్డులను పరిశీలించిన డీఈఓ, మెనూ అమలు, మరమ్మతుల వివరాలు తెలుసుకున్నారు. సూపరింటెండెంట్‌ కె.సరిత, ఎంఈఓ బి మురళీమోహన్‌రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement