● ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులకు పదిరోజుల శిక్షణ ● పెట్రోల్ వాహనాన్ని ఎలక్ట్రిక్గా మార్చడం, సర్వీసింగ్లో నైపుణ్యం ● ప్రైవేట్ సంస్థ సహకారంతో ప్రతిభ
ఖమ్మం సహకారనగర్: ఆలోచనలు బాగుంటే ఆవిష్కరణలు మరింత అద్భుతంగా వస్తాయి. కాస్త సహకారం తోడైతే చాలు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులు సైతం సత్తా చాటుతారని మరోసారి నిరూపితమైంది. ఖమ్మం టేకులపల్లిలోని ప్రభుత్వ ఐటీఐలో కళాశాలలో హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్ సంస్థ, సెంటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్(సీఎస్డీ) కలిపి ‘ఎలక్ట్రికల్ వెహికిల్ సర్వీస్ టెక్నీషియన్’ అంశంపై పది రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. నలభై మంది శిక్షణ పొందగా.. వారి ఆలోచనతో పెట్రోల్తో నడిచే ద్విచక్ర వాహనాన్ని ఎలక్ట్రిక్ వాహనంగా మార్చడం విశేషం.
శిక్షణ ఇలా
డాక్టర్ రెడ్డీస్ సంస్థ సెంటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్(సీఎస్డీ) సంస్థ నేతృత్వాన ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు అనుమతితో ఈ శిక్షణ మొదలైంది. ఈమేరకు శిక్షణకు కావాల్సిన వాహనం, టూల్స్, పరికరాలను సమకూర్చి తరగతి గదులను కేటాయించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 10వ తరగతి చదవడమే కాక ఐటీఐ ఉత్తీర్ణులైన 40మంది నిరుపేదలను గుర్తించారు. వీరికి మధ్యాహ్న భోజనం, వసతి సదుపాయంతో శిక్షణ ఇవ్వగా... పెట్రోల్తో నడిచే స్కూటీని ఎలక్ట్రికల్ స్కూటీగా మార్చడం విశేషం. టెస్ట్ డ్రైవ్లోనూ విజయవంతమైందని వెల్లడించారు. ఇక శిక్షణ అనంతరం చివరి రోజు అభ్యర్థులకు పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్లు అందజేశారు. తద్వారా భవిష్యత్లో ఎలక్ట్రిక్ వాహనాలు పెరగనున్నందున టెక్నీషి యన్లుగా వీరికి ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఆలంబనే అండగా అద్భుతం