ప్రారంభమైన శ్రీ కోటమైసమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన శ్రీ కోటమైసమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు

Apr 1 2025 12:27 PM | Updated on Apr 1 2025 3:27 PM

ప్రారంభమైన శ్రీ కోటమైసమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు

ప్రారంభమైన శ్రీ కోటమైసమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు

కారేపల్లి: కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లిలో కొలువుదీరిన శ్రీ కోటమైసమ్మ తల్లి ఆలయంలో బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. బుధవారం జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఈఓ వేణుగోపాలాచార్యులు, పర్సా ట్రస్ట్‌ చైర్మన్‌ పర్సా పట్టాభిరామారావు నేతృత్వాన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కొత్తలంక కై లాశశర్మ, వేద పండితులు కొనమంచలి ఫణికుమార్‌ శర్మ తొలిరోజు మృత్యుంజయ అమృత పాశుపతం హోమం నిర్వహించగా భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అలాగే, ఇల్లెందు మార్గదర్శి స్కూల్‌ ప్రతినిధులు అర్వపల్లి రాధాకృష్ణ, వేణుగోపాల్‌ గుప్తా సహకారంతో ఏర్పాటుచేసిన అన్నదానాన్ని దేవాదాయ, ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్‌ ఎం.వీరస్వామి ప్రారంభించారు. ఆలయ ఉద్యోగులు పగడాల మోహన్‌కృష్ణ, పర్సా లలిత్‌సాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement