భక్తిశ్రద్ధలతో రంజాన్‌ | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో రంజాన్‌

Apr 1 2025 12:33 PM | Updated on Apr 1 2025 2:31 PM

భక్తి

భక్తిశ్రద్ధలతో రంజాన్‌

నెల పాటు ఉపవాస దీక్ష ఆచరించిన ముస్లింలు సోమవారం రంజాన్‌(ఈద్‌ ఉల్‌ ఫితర్‌) పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయాన్నే సమీపంలోని ఈద్గాలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మతపెద్దలు ప్రవక్త బోధనలు వినిపించడమే కాక సాటి మానవులకు సాయపడేలా ప్రవక్త బాటను అనుసరించాలని సూచించారు. అనంతరం ముస్లింలు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఆతర్వాత కులమతాలకతీతంగా స్నేహితులను ఇళ్లకు ఆహ్వానించి విందు ఇచ్చారు. మధిరలోని పలువురు ముస్లింల ఇళ్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లి శుభాకాంక్షలు తెలపగా.. ఖమ్మంలోని గొల్లగూడెం ఈద్గాలో జరిగిన ప్రార్థనలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. – ఫొటోలు 9లో...

ఈద్గాల్లో సామూహికంగా ప్రత్యేక ప్రార్థనలు ప్రవక్త బోధనలు వినిపించిన మతపెద్దలు

భక్తిశ్రద్ధలతో రంజాన్‌1
1/1

భక్తిశ్రద్ధలతో రంజాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement