●దారి చూపిన దేవత.. అమ్మ | - | Sakshi

●దారి చూపిన దేవత.. అమ్మ

Apr 2 2025 12:45 AM | Updated on Apr 2 2025 12:45 AM

●దారి చూపిన దేవత.. అమ్మ

●దారి చూపిన దేవత.. అమ్మ

సత్తుపల్లి: తండ్రి చిన్నతనంలోనే కన్నుమూశాడు.. అప్పటి నుంచి అన్నీ తానై పెంచిన తల్లి ప్రజలకు సేవ చేసే ఉద్యోగం సాధించాలని చెబుతుండేది. ఆమె కోరిక మేరకు కష్టపడి చదివిన యువకుడు గ్రూప్‌–1 ర్యాంకు సాధించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని తాటి సుబ్బన్నగూడెంకు చెందిన తాటి రామచంద్రరావుకు భార్య సుదర్శనమ్మతో పాటు కుమారులు ప్రమోద్‌సాయి, ప్రదీప్‌చంద్ర ఉన్నారు. పిల్లల చిన్నవయస్సులోనే రామచంద్రరావు మృతి చెందగా తల్లి అన్నీ తానై పెంచి పెద్దచేసింది. ప్రస్తుతం ఆమె సత్తుపల్లి మండలం కాకర్లపల్లి హైస్కూల్‌లో సోషల్‌ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ప్రమోద్‌ సత్తుపల్లిలోని వీ.వీ.విద్యాలయంలో 10వ తరగతి పూర్తిచేశాక ఇంటర్‌ అనంతరం హైదరాబాద్‌లోని వీఎన్‌ఆర్‌ విజ్ఞాన్‌ జ్యోతి కాలేజీలో ఇంజనీరింగ్‌ పూర్తిచేశాడు. అయితే, సివిల్‌ సర్వెంట్‌గా ఉద్యోగం సాధించాలని, తద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కుతుందన్న తల్లి సూచనలతో ప్రమోద్‌ సివిల్స్‌కు సిద్ధమయ్యాడు.

ప్రమాదంలో తీవ్రగాయాలు

సివిల్స్‌కు సిద్ధమయ్యే క్రమాన ప్రమోద్‌సాయి ఢిల్లీలోని వాజిరం కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటుండగా 2019లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగాగ గాయపడ్డాడు. దీంతో ఆరేళ్ల సమయాన్ని చికిత్స కారణంగా కోల్పోయినా ఆయన ఆత్మవిశ్వా సం చెక్కుచెదరలేదు. తల్లి ప్రోత్సాహంతో ఎలాంటి శిక్షణ తీసుకోకుండా ఇంటి వద్దే సిద్ధమైన ఆయన గ్రూప్‌–1లో రాష్ట్ర స్థాయిలో 317, ఎస్టీ కేటగిరీ జోన్‌–1లో 10వ ర్యాంక్‌ సాధించడం విశేషం. తద్వారా తల్లి కోరికను నెరవేర్చారనని ప్రమోద్‌ తన ఆనందాన్ని పంచుకున్నాడు.

గ్రూప్‌–1 సాధించి తల్లి కోరిక నెరవేర్చిన యువకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement