
నేడు ‘జై బాపు.. జై భీం.. జై సంవిధాన్ యాత్ర’
ఖమ్మం వన్టౌన్: ఖమ్మంలో బుధవారం నిర్వహించనున్న ‘జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్’ యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల పార్టీ శ్రేణులకు పిలునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. బుధవారం ఉదయం 9గంటలకు ఖమ్మం 18వ డివిజన్ శ్రీరాంహిల్స్ నుంచి మొదలయ్యే యాత్రలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఈసందర్భంగా అంబేద్కర్, మహాత్మాగాంధీతో పాటు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఈసమావేశంలో మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్లు కమర్తపు మురళి, మండడపు లక్ష్మి మనోహర్, పాకాలపాటి విజయ, నిర్మల శేషగిరి, ఆళ్ల నిరీష అంజిరెడ్డి, చామకూరి వెంకటనారాయణ, అలియా తదితరులు పాల్గొన్నారు.