ట్యాంకులతో సరఫరా
దహెగాం: కాగజ్నగర్ మండలంలోని అందవెల్లి పెద్దవాగు వద్ద అప్రోచ్ రోడ్డు పనులు ప్రారంభించడంతో మిషన్ భగీరథ పైప్లైన్ను తొలగించారు. దీంతో వంతెన ఇవతలి వైపు ఉన్న 40 గ్రామాలకు నీటిసరఫరా నిలిచి పోయింది. మండలంలోని చిన్న ఐనం గ్రామంలో తాగునీటి ఇబ్బందులు తీర్చడానికి రెండేళ్ల క్రితం గ్రామ సమీపంలోని వాగులో బోరు వేశారు. అందులో ఇసుక చేరడంతో బోరు పని చేయడం లేదు. దీనికి తోడు భగీరథ నీళ్లు రాకపోవడంతో ఉదయం, సాయంత్రం గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. బ్రహ్మన్ చిచ్యాల గ్రామంలో సైతం ట్యాంకర్ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment