breaking news
Kumuram Bheem District News
-
అందుబాటులో సరిపడా యూరియా
వాంకిడి: వర్షాకాలం సాగుకు సంబంధించి జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటి అన్నారు. మండల కేంద్రంలోని ఎరువులు, విత్తనాల దుకాణాలను శుక్రవారం తనిఖీ చేశారు. స్టాక్ రికార్డులు, బిల్లింగ్ రశీదులు పరిశీలించారు. దుకాణాల నిర్వాహకులు తప్పనిసరిగా రైతులకు బిల్లు అందించాలని ఆదేశించారు. స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు ప్రదర్శించాలన్నారు. అధిక ధరలకు యూరియా విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అధిక ఎరువులు, రసాయనాల వాడకం దిగుబడిపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. -
సరిహద్దులో సర్కు బ్రేక్
కెరమెరి: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని వివాదాస్పద గ్రామాల్లో సర్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. కలెక్టర్ కె.హరిత ఆదేశాల మేరకు శుక్రవారం తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో అంజద్పాషా, సర్ సూపర్వైజర్లు విజయలక్ష్మి, ఇర్షాద్ ఆయా గ్రామాలను సందర్శించారు. ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకుని వివరాలు నింపి ఇవ్వాలని సూచించగా విముఖత వ్యక్తం చేశారు. పరంధోళి, మహరాజ్గూడలోని ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు స్వీకరిస్తామని పేర్కొనగా.. పరంధోలి, పరంధోళి తండా, కోటా, లేండిజాల, శంకర్లొద్ది, ముకదంగూడ గ్రామాల్లోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఫారాలు స్వీకరించలేదు. ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు ఎందుకు పథకాలు వర్తింపజేయడం లేదని పరంధోళి మాజీ సర్పంచ్ కాంబ్డె లక్ష్మణ్, ముకదంగూడకు చెందిన సామాజిక కార్యకర్త రణ్వీర్ రాందాస్ అధికారులను ప్రశ్నించారు. మరోవైపు మరాఠీ మాట్లాడే మేమంతా భాషా ప్రాతిపదికన మహారాష్ట్రలోనే కొనసాగుతామని సామాజిక కార్యకర్త రణ్వీర్ రాందాస్ అధికారులకు తేల్చిచెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం సర్వే పూర్తి చేసిందని, త్వరలోనే భూములకు పట్టాలు ఇవ్వనుందని తెలిపారు. -
వర్షం.. రైతుల్లో హర్షం
ఆసిఫాబాద్: రెండు రోజులుగా జిల్లాలో వర్షం కురుస్తుండడంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. వాతావరణం చల్లబడింది. తొలకరి వర్షాలతో రైతుల ముఖాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పంట పొలాల్లో పత్తి విత్తనాలు విత్తగా, మొలకెత్తని వాటి స్థానంలో తిరిగి విత్తేందుకు సిద్ధమవుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. జిల్లాలో సగటు వర్షపాతం 12.4 మిల్లీమీటర్లు నమోదైంది. అత్యధికంగా వాంకిడిలో 40.6 మిల్లీమీటర్లు నమోదు కాగా, లింగాపూర్లో 36.4, జైనూర్ 17.2, సిర్పూర్–యు 19.4, రెబ్బెన 8, దహెగాంలో 37.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వర్షాలతో ఇప్పుడిప్పుడే ప్రాజెక్టుల్లోకి వరద చేరుతోంది. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. -
బడుల్లో తిథి భోజనం
కెరమెరి: ఒకప్పుడు పుట్టిన రోజులు, వివాహ వార్షి కోత్సవాలు, శుభకార్యాలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకే పరిమితమయ్యేవి. ప్రస్తుతం ప్ర జల ఆలోచన విధానంలో మార్పు వ చ్చింది. వ్యక్తిగత సంతోషాన్ని సమాజంతో పంచుకోవాలనే భావ న బలపడింది. అనాథ అశ్రమాలకు విరాళాలు ఇవ్వడం, అన్నార్థుల కు ఆహారం అందించడం వంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్ర మంలో మారుతున్న సామాజిక ధోరణుల కు అనుగుణంగా ప్ర భుత్వ పాఠశాలల్లో పీఎం పోషణ్ పథకంలో భాగంగా ‘తిథి భోజ నం’ కార్యక్రమానికి పిలు పునిచ్చింది. 2026–27 విద్యా సంవత్సరానికి పీఎం పోషణ్ మార్గదర్శకాల్లో ప్రత్యేకంగా దీనిని చేర్చారు. ప్రత్యేక రోజులు పాఠశాలల్లో..జిల్లాలోని 994 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కొనసాగుతోంది. ప్రస్తుతం 35,976 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలు గతంలో కేవలం విద్యా సంస్థలుగా మాత్రమే కాకుండా సామాజిక జీవితానికి కేంద్ర బిందువుగా ఉండేవి. విద్యార్థుల సంక్షేమం గురించి గ్రామ పెద్దలు, దాతలు, పూర్వ విద్యార్థులు బాధ్యతగా తీసుకునేవారు. కాలక్రమేణా విద్యావ్యవస్థ, సమాజానికి మధ్య అంతరం పెరిగింది. ఈ నేపథ్యంలో పాఠశాలలను తిరిగి ప్రజలకు చేరువ చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ‘తిథి భోజనం’ కార్యక్రమాని కి ప్రాధాన్యతనిస్తోంది. బర్త్డేలు, వివాహ వార్షికో త్సవాలు, కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం నిర్వహించే కార్యక్రమాలను పాఠశాలల్లో జరుపుకొనేలా చర్యలు తీసుకోనున్నారు. ఒక కు టుంబం, సామాజిక సంస్థలు, మిత్ర బృందాలు తమ సంతోషాన్ని బడి పిల్లలతో పంచుకునే అవకాశం కల్పిస్తారు. తద్వారా విద్యార్థులకు ప్రత్యేక భోజనం, అదనపు పోషకాహారం అందుతుందని అధికారులు చెబుతున్నారు. కేవలం దాతృత్వం కోణంలోనే కాకుండా పాఠశాలలకు, సమాజానికి మధ్య అనుబంధంగా బలపర్చే గొప్ప వేదికగా మారుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే గుజరాత్లో విజయవంతంమైన ఈ నమూనాను తెలంగాణలో కూడా అమలు చేయనున్నారు. నాణ్యత, పరిశుభ్రతలో రాజీలేకుండా..ఇప్పటికీ అన్నదానం అనేది ఒక మహోన్నత సంప్రదాయంగా కొనసాగుతోంది. తిథి భోజనం కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పోషకాహారం అందించమే కాకుండా సమాజం తమ వెంట ఉందనే భరోసాను అందిస్తుంది. పోషకాహార లోపాలు తగ్గించడం, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు దోహదపడుతుంది. వలస వెళ్లిన ప్రజలు, ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు తమ బడితో అనుబంధాన్ని కొనసాగించేందుకు వేదికగా నిలుస్తుంది. అనుబంధం పెరిగితే పాఠశాలలకు అవసరమైన గ్రంథాలయాలు, క్రీడాసామగ్రి, ఇతర మౌలిక వసతుల కల్పనకు మరికొంత మంది ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే తిథి భోజనంలో ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించింది. జంక్ ఫుడ్ పిల్లల దరికి చేరకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. వ్యక్తిగత ప్రచారానికి వేదిక కాకుండా చూసుకోవాలి. విద్యార్థుల మధ్య వివక్ష లేకుండా పాఠశాల యాజమాన్యమే చర్యలు చేపట్టాలి. ప్రచారం నిర్వహించాలిప్రభుత్వం పాఠశాలల్లో తిథి భోజనం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమం ఎంతో మంచిది. ప్రభుత్వ పాఠశాలలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయి. అన్ని పాఠశాలలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమంపై విస్తృత ప్రచారం కల్పించాలి. పెళ్లి రోజులు, జన్మదినాలు, ఇతర కార్యక్రమాలు బడిలో నిర్వహించాలనే ఆలోచన ప్రజల్లో కలిగించాలి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తుల మధ్య అనుబంధం పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. – ఆడే ప్రకాశ్, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు -
ర్యాలీ తీసి.. అవగాహన కల్పించి
ఆసిఫాబాద్: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతి రేక దినాన్ని పురస్కరించుకుని పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్ నుంచి గాంధీ చౌక్ మీదుగా అంబేడ్కర్ చౌక్ నుంచి తిరిగి పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు విద్యార్థులతో కలిసి 2కే రన్ నిర్వహించారు. ఎస్పీ కార్యాలయం నుంచి ప్రధాన రహదారుల మీదుగా అంబేడ్కర్ చౌక్ చేరుకుని మానవహారం చేపట్టారు. ఎస్పీ నితిక పంత్ మాట్లాడుతూ గంజాయి వంటి మత్తు పదార్థాలు యువత భవిష్యత్ను నాశనం చేస్తున్నాయని, ప్రతిఒక్కరూ వాటికి దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు సమాజాన్ని చైతన్యపర్చడం ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. యువతను మత్తు పదార్థాల నుంచి కాపాడేందుకు ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాలన్నారు. అనంతరం ‘వాల్ ఆఫ్ ప్రామిస్’పై ఎస్పీతోపాటు పోలీసు అధికారులు, విద్యార్థులు, డ్రగ్స్ నిరోధక సందేశాలు రాసి సంతకాలు చేశారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చిత్తరంజన్, డీఎస్పీ అశోక్, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
వానల్లో పూడికతీత
ఆసిఫాబాద్రూరల్: వట్టివాగు ప్రాజెక్టు కాలువ పూడికతీత పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యా యి. ఓ వైపు రైతులు సాగుకు సిద్ధమవుతుండగా, వర్షాలు పడుతున్న సమయంలో పూడికతీయడంపై విమర్శలు వస్తున్నాయి. సకాలంలో పనులు పూర్తవుతాయా.. లేదా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2001 వట్టివాగు ప్రాజెక్టును రెండు ప్రధాన కాలువలు, 18 పిల్ల కాలువలతో నిర్మించారు. 2.98 టీఎంసీల నీటి సామర్థ్యంతో 27 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనేది లక్ష్యం. అయితే ప్రాజెక్టు ప్రారంభమై 20 ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడం రైతులకు శాపంగా మారింది. 2025 నవంబర్లో కాలువల పూడికతీత కోసం ప్రభుత్వం రూ.50 లక్షల నిధులు మంజూరు చేసింది. అధికారులు నాలుగు రోజుల క్రితం పనులను ప్రారంభించారు. వర్షాకాలంలో ప నులు ప్రారంభించడంతో సక్రమంగా ముందుకు సాగడం లేదు. కాలువల్లో వరద చేరి బురదమయంగా మారడంతో పనులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ మొదలుకావడంతో ఈ పనులు ఎంతవరకు జరుగుతాయి? పూర్తి స్థాయిలో పూర్తవుతాయా లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో పనులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఈసారి కూడా రైతులకు సాగునీటి కష్టాలు తప్పేలా లేవని స్పష్టమవుతోంది. రైతులకు తప్పని ఇబ్బందులుప్రాజెక్టు నీటి సామర్థ్యం ప్రకారం 27 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ప్రాజెక్టు దిగువన కేవలం 1200 నుంచి 1400 ఎకరాల్లో మాత్రమే వరి సాగవుతోంది. 20 ఏళ్లుగా అధికారులు, పాలకుల నిర్లక్ష్యంతో కాలువలకు మ రమ్మతులు చేపట్టలేదు. ప్రాజెక్టులో నీరున్నా భూ ములకు అందలేని దుస్థితి నెలకొంది. కాలువలు సిమెంట్ లైనింగ్ కోల్పోయి పూర్తిగా పూడికతో నిండిపోయాయి. పిచ్చిమొక్కలు, తుంగ పెరిగి శిథిలా వస్థకు చేరాయి. సాగునీటిని విడుదల చేసినా అది పొలాలకు చేరడం లేదు. సగంలోనే గండ్లు పడటం ప్రధాన సమస్యగా మారింది. ప్రతీ సంవత్సరం రైతులు తమ సొంత డబ్బులతో జేసీబీలను అద్దెకు తెచ్చుకుని కాలువలను సరిచేసుకుంటూ పంటలు పండించుకుంటున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కాలువలకు దిగువన ఉన్న రైతులు మాత్రమే వరి పంట సాగు చేస్తుండగా, మిగతా రైతులు పత్తి, కంది వంటి ఇతర ప్రత్యామ్నాయ పంటలను పండిస్తున్నారు.పనులు కొనసాగుతున్నాయి కాలువల పూడికతీత కోసం మంజూరైన రూ.50 లక్షలతో ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. వర్షాలతో ఇప్పుడు సాధ్యమైనంత వరకు పూర్తి చేస్తాం. మిగతా పనులను వచ్చే సంవత్సరం చేపట్టాల్సి వస్తుంది. ఈసారికి 50 శాతం పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. – పవన్ కల్యాణ్, ప్రాజెక్టు ఏఈఈ -
పనులు పూర్తయ్యేనా..?
వట్టివాగు ప్రాజెక్టుకు రెండు ప్రధాన కాలువలతోపాటు 18 పిల్ల కాలువలు ఉన్నాయి. ఇందులో కుడి కాలువ 21 కిలోమీటర్లు, ఎడమ కాలువ 7 కిలోమీటర్ల మేరకు ఉంది. ప్రధాన కాలువలతోపాటు పిల్ల కాలువల్లోనూ పూడికతీత పనులు చేపట్టాల్సి ఉంది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ప్రస్తుతం రెండు పొక్లేన్లతో డీ–6, డీ–8, డీ–10 పిల్ల కాలువల్లో నాలుగు రోజుల క్రితం పూడికతీత పనులను ప్రారంభించారు. ప్రధాన కాలువలో పూడిక తీయాలంటే పెద్ద యంత్రాలు అవసరం అవుతాయి. కానీ ప్రస్తుతం చిన్న కాలువల్లో మాత్రమే పనులు జరుగుతున్నాయి. ఈ పనులను ఏప్రిల్, మే నెలల్లోనే ప్రారంభించి ఉంటే ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తయ్యే అవకాశం ఉండేది. ప్రస్తుతం వర్షాలు మొదలవడంతో పాటు వరినార్లు పోసుకునే సమయం ఆసన్నమవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. -
ఘనంగా ఛత్రపతి సాహూ మహరాజ్ జయంతి
వాంకిడి: మండల కేంద్రంలోని ఛత్రపతి శివా జీ విగ్రహం వద్ద శుక్రవారం ఆరె సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఛత్రపతి సాహూ మహరా జ్ 152వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ భారతీయ సామాజిక న్యాయ చరిత్రలో అగ్రగన్యుడిగా సాహూ మహరాజ్ను అభివర్ణించారు. సామాజిక అసమానతలు రూపుమాపి సమసమాజ స్థాపన కోసం ఆయన చేసిన కృషి అపారమైందన్నారు. కార్యక్రమంలో ఆరె సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జైరాం, మండల అధ్యక్షుడు బొయిరె ప్రకాశ్, నాయకులు పెంటు, విలాస్, తదితరులు పాల్గొన్నారు. అలాగే మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహారలో నిర్వహించిన జయంతి కార్యక్రమాల్లో బీఎస్ఐ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహోల్కర్, ఎస్ఎస్డీ జిల్లా అధ్యక్షుడు దుర్గం సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
సర్పాల భయం..!
కౌటాల: వర్షాకాలం ప్రారంభంతో జిల్లాలో పాముకాట్ల భయం మళ్లీ మొదలైంది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవగాహన లేకపోవడం, సకాలంలో వైద్యం అందకపోవడంతో విలువైన ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇటీవల కాగజ్నగర్ మండలం భట్టుపల్లికి చెందిన బొమ్మెళ్ల సత్తయ్య(63) అనే వృద్ధుడు పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయా డు. ఈ నెల 21న రాత్రి ఇంటి ఆవరణలో నేలపై నిద్రిస్తున్న సమయంలో ఆయనను పాము కాటేసింది. గమనించిన కుటుంబ సభ్యులు కాగజ్నగర్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలిస్తుండగా సోమవారం వేకువజామున మార్గమధ్యంలోనే కన్నుమూశాడు. జిల్లా ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధారపడుతుంటారు. ఆధునిక కాలంలోనూ పాముకాటు మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల వర్షాలకు భూమి పొరల్లో ఉండే క్రిమికీటకాలు, పాములు బయటకు వస్తున్నాయి. చల్ల దనం, భద్రత కోసం ఇళ్ల పరిసరాలకు చేరుతుంటాయి. మనుషులు, పశువులను కాటేస్తున్నాయి. నాటువైద్యంతోనే ముప్పుమారుమూల గ్రామాల్లోని చాలామంది ప్రజలకు ఇప్పటికీ పాముకాటుపై సరైన అవగాహన లేదు. గిరిజనులు, గ్రామీణ ప్రజలు నాటు వైద్యాన్ని నమ్ముకోవడం ప్రమాదకరంగా మారుతోంది. పాము కరిచినప్పుడు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రాణాల మీదికి వస్తోంది. పాముకాటుకు విరుగుడుగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో యాంటీ స్నేక్ వీనమ్ టీకాలు అందుబాటులో ఉన్నట్లు వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. కానీ పూర్తిస్థాయిలో వైద్య సిబ్బంది లేకపోవడంతో సరైన సమయానికి చికిత్స అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పాము తన ఆత్మరక్షణ కోసం విధిలేని పరిస్థితుల్లో మాత్రమే మనుషులను కాటు వేస్తుంది. ఒకవేళ పాము కరిస్తే తక్షణమే సమీప ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవడం ఉత్తమం. కొన్ని పాములతోనే ప్రమాదంనిజానికి అన్ని పాముల్లోనూ విషం ఉండదు. త్రాచు, కట్లపాము వంటి కేవలం 15 శాతం సర్పజాతులతోనే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా 50 శాతం పాముకాట్లు విషం లేని, ప్రమాదకరం కాని మామూలు గాయాలే. వీటికి సాధారణ చికిత్స అందిస్తే సరిపోతుంది. అయితే పాము కాటు వేయగానే చాలా మంది తీవ్రమైన భయాందోళనలకు గురవుతారు. ఆ పాముకు విషం లేకపోయినా షాక్తో చనిపోయే ప్రమాదం ఉంది. బాధితుడికి కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పాలి. జాగ్రత్తలు తప్పనిసరిఆస్పత్రుల్లో యాంటీ వీనమ్ వర్షాకాలంలో రైతులు పొలం పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో తరచూ పాము, తేలు కాటుకు గురవుతుంటారు. బాధితులకు గాయమైన చోట వెంటనే సబ్బుతో శుభ్రంగా కడగాలి. అనంతరం ఆలస్యం చేయకుండా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో యాంటీ స్నేక్ వీనమ్ అందుబాటులో ఉంచాం. పాముకాటు వేసిన వారికి నాటువైద్యం అందిస్తే ప్రాణాలకే ప్రమాదం. త్వరలోనే పాము, తేలు కాట్లపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తాం. – సీతారాం, డీఎంహెచ్వో -
ఆబ్కారీశాఖకు అంతా కొత్తవారే..
సాక్షి, ఆదిలాబాద్: ఎకై ్సజ్ శాఖలో బదిలీలు చోటుచేసుకున్నాయి. డిప్యూటీ కమిషనర్ నుంచి డీపీఈవో (ఎకై ్సజ్ సూపరింటెండెంట్) వరకు అందరూ ట్రా న్స్ఫర్ అయ్యారు. ఈ శాఖలో రెండున్నర నెలల కిందటే ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయింది. సీఐలు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, ఈఎస్లు, ఏసీలతోపాటు డిప్యూటీ కమిషనర్ (డీసీ) వరకు ప్రమోష న్ లభించింది. అప్పుడు వారు ఎక్కడైతే పోస్టింగ్లో ఉన్నారో వారిని అదే స్థానంలో కొనసాగించారు. తాజాగా బదిలీలు చేపట్టి ప్రమోషన్ పొందిన పోస్టింగ్ కల్పించారు. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ కె.హరికిరణ్ నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రెగ్యులర్ డిప్యూటీ కమిషనర్గా జి.జనార్దన్రెడ్డి నియమితులయ్యారు. ఖమ్మంలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తూ ప్రమోషన్ పొందిన ఆయన తాజాగా ఆదిలా బాద్ డీసీగా రానున్నారు. హైదరాబాద్ డీసీ కార్యాలయం రెగ్యులర్ అధికారిగా ఉండి ఆదిలాబాద్ ఇన్చార్జి డీసీగా వ్యవహరించిన రఘురాం స్థానంలో జనార్దన్రెడ్డిని నియమించారు. ఇదే కార్యాలయంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కమిషనర్ పోస్టును తాజాగా భర్తీ చేశారు. హన్మకొండ–1 టీజీబీసీఎల్లో ఏసీగా వ్యవహరిస్తున్న కె.రాజ్యలక్ష్మి ఆదిలాబాద్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీగా నియమితులయ్యారు. గతంలో ఆమె ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ డీపీఈవోగా పని చేశారు. కొత్త డీపీఈవోలు వీరే..ఉమ్మడి జిల్లాలోని నాలుగు డీపీఈవో పోస్టులకు కొత్త అధికారులు నియమితులయ్యారు. నల్గొండలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఎ.కిషన్ను ఆదిలాబాద్కు, బి.చాణక్యను మంచిర్యాలకు, భూపాలపల్లి నుంచి వి.శ్రీనివాస్ను నిర్మల్కు, సూర్యపేట నుంచి కుమురంభీం ఆసిఫాబాద్కు జిల్లాకు లక్ష్మనాయక్కు బదిలీలతోపాటు పోస్టింగ్ కల్పిస్తూ కమిషనర్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇదివరకు డీపీఈవోలుగా వ్యవహరించిన హిమశ్రీ ఆదిలాబాద్ నుంచి సిరిసిల్లకు, ఎంఏ రజాక్ నిర్మల్ నుంచి ఎల్బీనగర్కు, కేజీ నందగోపాల్ మంచిర్యాల నుంచి నిజామాబాద్కు, జ్యోతికిరణ్ కుమురంభీం ఆసిఫాబాద్ నుంచి ప్రమోషన్ కల్పిస్తూ రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్కు ఏసీగా నియమించారు. పర్యవేక్షణ పటిష్టమయ్యేనా?ఎకై ్సజ్ శాఖలో తాజాగా డిప్యూటీ కమిషనర్ను రెగ్యులర్ అధికారిని నియమించారు. కొంత కాలంగా ఇన్చార్జీలతో నెట్టుకొచ్చారు. ఇక ఎన్ఫోర్స్మెంట్ ఏసీ పోస్టు ఖాళీగానే ఉండగా, తాజాగా ప్రమోష న్ల ద్వారా భర్తీ చేశారు. ఎన్ఫోర్స్మెంట్లోని ఏఈ ఎస్ పోస్టులు కూడా ఖాళీగా ఉండగా, త్వరలో భర్తీ చేసే అవకాశాలున్నాయి. సరైన పర్యవేక్షణ లేక జి ల్లాలో గంజాయి, గుడుంబా కేసులు పెరిగాయి. క్షే త్రస్థాయిలో కొందరు అధికారుల అవినీతి, అక్రమాలకు అడ్డూఅదుపు లేకపోయిందన్న విమర్శలున్నా యి. తాజాగా ప్రభుత్వం పోస్టుల భర్తీపై దృష్టి పెట్టడం, ఇప్పటికే కొన్ని నియమించడంతో ఎకై ్సజ్ శాఖలో పర్యవేక్షణ పటిష్టం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కుమురం భీం
7విస్తరణ కలేనా? కెరమెరి ఘాట్ మూలమలుపులతో ప్రమాదకరంగా మారింది. విస్తరణను విస్మరించడం, సింగిల్ రోడ్డు కావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. 9లోu ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. రుతుపవనాల ప్రభావంతో జిల్లా అంతటా వర్షం కురిసే అవకాశం ఉంది. ‘బాసర’కు భద్రత కావాలి బాసర ఆలయంలో చోరీ ఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆలయ అధికా రులు, ప్రభుత్వం సమగ్ర భద్రతా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. 8లోu శుక్రవారం శ్రీ 26 శ్రీ జూన్ శ్రీ 2026 -
‘సర్’ షురూ
ఆసిఫాబాద్అర్బన్: కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(సర్) సర్వే గురువారం నుంచి జిల్లాలో ప్రారంభమైంది. 2002 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుని మ్యాపింగ్ చేపడుతున్నారు. తొలిరోజు పెంచికల్పేట్ మండలంలో కలెక్టర్ కె.హరిత హాజరై సిబ్బందికి సూచనలు చేశారు. వాంకిడి మండలం నవేగాంలో ఆర్డీవో లోకేశ్వర్రావు, జిల్లా కేంద్రంలో మున్సిపల్ కమిషనర్ ఆకాష్ మెంగ్రె, వైస్ చైర్మెన్ ఎండీ అహ్మద్ పర్యవేక్షించారు. అయితే కెరమెరి మండలంలోని వివాదాస్పద సరిహద్దు గ్రామ పంచాయతీల్లో సర్ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. అంతాపూర్, భోలాపటార్ పంచాయతీల పరిధిలో కొందరు ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకోగా, పరంధోళి, ముకదంగూడ పంచాయతీలోని వారు మాత్రం వివరాలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. కుమురంభీం ఆసిఫాబాద్, చంద్రాపూర్ జిల్లాల కలెక్టర్లు గ్రామాలకు వచ్చి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పకడ్బందీగా చేపట్టాలిపెంచికల్పేట్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పకడ్వందీగా చేపట్టాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. పెంచికల్పేట్ మండలంలోని చేడ్వాయి, బొంబాయిగూడ, ఎల్కపల్లి గ్రామాల్లో సర్వేను గురువారం పరిశీలించారు. ప్రతీ ఇంటికి తిరుగుతూ అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చాలన్నా రు. బీఎల్వోలు, సూపర్వైజర్లు సమన్వయంతో సర్వే తప్పులు లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకు ముందు ఎల్కపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాదారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో సంతోష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముందస్తు ప్రణాళికే పెట్టుబడి!
చింతలమానెపల్లి: వర్షాల రాకతో జిల్లాలో సాగు పనులు జోరందుకున్నాయి. 4.38 లక్షల ఎకరాల సాగుభూమి కలిగిన జిల్లాలో అధికశాతం వర్షాధారంగానే పంటలు సాగు చేస్తారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. పరిమితికి మించి రసాయన ఎరువులు, పురుగుల మందుల వినియోగాన్ని తగ్గించుకుంటే ఖర్చులు తగ్గి రైతులపై పెట్టుబడి భారం ఉండదు. అలాగే తక్కువ నీటి వినియోగం ఉండే విత్తనాల ఎంపిక కూడా కీలకంగా మారుతుంది. జిల్లాలో పెద్దవాగు, ప్రాణహిత, పెన్గంగ, వట్టివాగు వంటి నదులు, వాగులు ఉన్నాయి. సిర్పూర్ నియోజకవర్గంలో ప్రాణహిత, పెన్గంగ నదులపై ఏడు ఎత్తిపోతల పథకాలు ఉన్నా వీటిలో సాండ్గాం ఎత్తిపోతల పథకం పరిధిలో మాత్రమే సాగు నీరందుతోంది. జగన్నాథ్పూర్ ప్రాజెక్టు, అడ, వట్టివాగు ప్రాజెక్టుల ఆయకట్టు కింద సాగు తక్కువే. ఈ నేపథ్యంలో అన్నదాతలు అప్రమత్తతతో ఉంటే నష్టాల నుంచి తప్పించుకోవచ్చు. విత్తన ఎంపికే కీలకంజిల్లాలో ఏటా రైతులు వాతావరణ మార్పులతో దిగుబడి తగ్గి నష్టపోతున్నారు. ఒకసారి వర్షాభావ పరిస్థితులు, మరో ఏడాది అధిక వర్షాలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన పంటలైన వరి, పత్తిలో రైతులు సరైన విత్తన రకాలు, వర్షాభావ పరిస్థితుల్లో తక్కువ నీటి వినియోగం ఉండే వాటిని ఎంచుకోవా లి. స్వల్ప, మధ్య కాలిక రకాలను సాగు చేయాలి. జిల్లాలోని పత్తి చేలు చాలా వరకు నీటి వసతికి దూ రంగా, అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్నాయి. వర్షాభావ పరిస్థితులను సైతం తట్టుకునే మేలు రకం బీటీ విత్తనాలు విత్తుకోవాలి. అంతర పంటగా కంది, పెసర సాగు చేస్తే ఒక పంట దెబ్బతిన్నా మరొకటి చేతికందుతుంది. అంతర పంటలతో భూసారం పెరగడంతోపాటు అదనపు ఆదాయం వస్తుంది. ఎల్నినో నేపథ్యంలో వర్షపు నీటిని సక్రమంగా వినియోగించడం కీలకం. నీటిని పొలంలోనే ఇంకేలా చర్యలు చేపట్టాలి. పొలం చుట్టూ గట్లు వేయడం, పత్తి చేనులో బోదె సాలు పద్ధతి పాటిస్తే తేమ ఎక్కువ రోజులు ఉంటుంది. ఎరువుల వినియోగంపై దృష్టిసాధారణంగా రైతులు అవసరానికి మించి ఎరువులను వినియోగిస్తుంటారు. యూరియా, డీఏపీ అధి కంగా వాడితే పెట్టుబడి వ్యయం పెరగడంతోపాటు చీడపీడలు ఆశిస్తాయి. వీటి స్థానంలో సహజ ఎరువులను వినియోగిస్తే ఖర్చు తగ్గుతుంది. నేలతో తేమశాతం తగ్గకుండా ఉంటుంది. విత్తనాలు వేయడానికి ముందే జీలుగ, జనుము లాంటి పచ్చిరొట్ట సాగు చేసి భూమిలో కలియదున్నాలి. పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్ వినియోగించాలి. ఆవుపేడ, మూత్రంతో తయారయ్యే జీవామృతం వినియోగి స్తే మిత్ర పురుగులు పెరిగి పంటలకు అవసరమైన పోషకాలు అందుతాయి. అలాగే ఖరీదైన రసాయన పురుగు మందుల వినియోగం తగ్గించాలి. లింగాకర్షక బుట్టలు, పసుపురంగు జిగురు అట్టలు ఎకరా నికి 4 నుంచి 5 చొప్పున అమర్చితే రెక్కల పురుగులు, రసం పీల్చే పురుగులను ప్రాథమిక దశలోనే నివారించవచ్చు. పురుగుల ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు వేపనూనె పిచికారీ చేస్తే ఇది పురుగుల గుడ్లను నాశనం చేస్తుంది.జిల్లాలో వర్షపాతం వివరాలు (జూన్ 1 నుంచి 25 వరకు)కురవాల్సింది 148.6 మి.మీ. కురిసింది 114.9 మి.మీ. వ్యత్యాసం – 23శాతం లోటు లోటు వర్షపాతం ఉన్న మండలాలు రెబ్బెన – 34శాతం చింతలమానెపల్లి – 35శాతం పెంచికల్పేట్ – 47 శాతం తీవ్ర లోటు ఉన్న మండలాలు వాంకిడి – 61శాతం కాగజ్నగర్ – 60శాతం బెజ్జూర్ – 81శాతం దహెగాం – 62 శాతం అవగాహన కల్పించాలి వాతావరణ పరిస్థితులను గమనించకుండా సాగు చేయడంతో అనుకున్న దిగుబడి రాలేదు. పంట చేతికందే దశలో వర్షాలతో నష్టపోయాను. ఈ ఏడాది కరువు వస్తుందని అంటున్నారు. వర్షాలు తక్కువగా ఉంటే పంటలను కాపాడుకోవడం ఎలా అనేదానిపై అధికారులు అవగాహన కల్పించాలి. – గుర్లె సత్తయ్య, రుద్రాపూర్ సలహాలు పాటించాలి రైతులు అధిక సాంద్రత పత్తి సాగు విధానంలో అధిక సంఖ్యలో మొక్కలు నాటాలి. దీని ద్వారా దిగుబడి ఎక్కువగా వస్తుంది. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో తేమను కాపాడుకునే చర్యలు చేపట్టాలి. సాగు ఖర్చులు తగ్గించుకోవడానికి, దిగుబడులు సాధించడానికి వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు, సలహాలు పాటించాలి. – వెంకట్, జిల్లా వ్యవసాయ అధికారి -
అయ్యేనా?
గేమ్చేంజ్ ఆసిఫాబాద్రూరల్/కౌటాల: జిల్లాలో క్రీడాకారులకు కొదవలేదు. కానీ ఆట స్థలాలు, సరైన సౌకర్యాలు లేక ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. జిల్లాకు చెందిన ఆడె సంతోష్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో మెరుగైన ప్రదర్శన చేయగా, అతడిని టీజీ20 లీగ్లో రూ.95 వేలకు అన్విత ఖమ్మం ఏసెస్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. కౌటాల, ఆసిఫాబాద్, రెబ్బెన, బెజ్జూర్, సిర్పూర్(టి), కాగజ్నగర్, చింతలమానెపల్లి, దహెగాం, వాంకిడి, పెంచికల్పేట్ మండలాల్లో ఐపీఎల్ తరహాలో ఏటా స్థానిక లీగ్లు నిర్వహిస్తున్నారు. క్రికెట్తోపాటు కబడ్డీ, వాలీబాల్ పోటీలను కూడా పెద్దఎత్తున సాగుతున్నాయి. అయితే కౌటాల మినహా మరెక్కడా పూర్తి స్థాయి మైదానాలు లేవు. ఈ నెల 22న జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ వైస్ చైర్ పర్సన్ సోని బాలాదేవి క్రీడామైదానాల అభివృద్ధికి ప్రతి పాదనలు సిద్ధం చేయాలని ఆదేశించడంతో స్థానిక క్రీడాకారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జన్కాపూర్ క్రీడామైదానానికి స్థలం, వసతుల కల్పనతో పాటు కౌటాల మినీ స్టేడియం అభివృద్ధికి ప్రతిపాదనలు పంపాలని ఆమె ఆదేశించారు. మైదాన స్థలంలో పిచ్చిమొక్కలుగతంలో బస్స్టేషన్ పక్కన ఉన్న క్రీడామైదానం అందరికీ అందుబాటులో జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉండేది. కొత్త జిల్లా ఏర్పాటు తర్వాత ఆ మైదానా న్ని పోలీస్ శాఖ ఆధీనంలోకి తీసుకుంది. అక్కడికి వెళ్లే అవకాశం లేకపోవడంతో క్రీడాకారులు, వాకింగ్ చేసేవారు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ క్రీడామైదానం కోసం 12 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. ఈ స్థలంలో పిచ్చిమొక్కలు, చెట్లు దట్టంగా పెరిగా యి. వీటిని తొలగించి చుట్టూ ప్రహరీ నిర్మించి లోపలికి ఎవరూ వెళ్లకుండా గేటు ఏర్పాటు చేయా లి. క్రీడాసామగ్రి భద్రపరచడానికి గదులు, మరుగుదొడ్లు, మంచినీరు, విద్యుత్ సౌకర్యంతో పాటు 400 మీటర్ల వాకింగ్ ట్రాక్, వాలీబాల్, ఫుట్బాల్ కోర్టులను ఏర్పాటు చేయాలి. తద్వారా పోలీస్, ఆర్మీ ఉద్యోగాల కోసం సాధన చేసే యువతకు ఎంతో ఉపయోగకరంగా మారుతుంది. కౌటాల మినీ స్టేడియం మారేనా..!కౌటాల మండల కేంద్రానికి సమీపంలో 25 ఏళ్ల క్రితం ఆరెకరాల స్థలంలో మినీ స్టేడియం ఏర్పాటు చేశారు. ఇందులోనే రూ.లక్షలు వెచ్చించి ఇండోర్ స్టేడియం సైతం నిర్మించారు. ఆట పరికరాలు, శిక్షకులు అందుబాటులో లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. గతేడాది నుంచి ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్కడ యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. వాకింగ్ ట్రాక్ లేకపోవడంతో మైదానం ప్రహరీ చుట్టూనే నడుస్తున్నారు. మైదానంలోనే 33 కేవీ విద్యుత్ లైన్కు సంబంధించిన ఏడు స్తంభాలు ఉండడంతో ఆటల నిర్వహణకు ఇబ్బందులు తప్పడం లేదు. వాకింగ్ ట్రాక్పైనే ఈ స్తంభాలు ఉండడంతో ప్రమాదం పొంచి ఉంది. భవనం నిరుపయోగంగా ఉండడంతో మందుబాబులకు అడ్డాగా మారుతోంది. ఇక్కడ అథ్లెటిక్స్, వాలీబా ల్, కబడ్డీ, ఖోఖో, బాస్కెట్బాల్ వంటి వివిధ క్రీడల కోసం ప్రత్యేక కోర్టులు నిర్మించాల్సి ఉంది. క్రీడాకారుల కోసం వాకింగ్ ట్రాక్, రన్నింగ్ ట్రాక్, స్టేడియం ఆవరణలో సరిపడా లైటింగ్, తాగునీరు తదితర సదుపాయాలు కల్పించాలి. క్రికెట్ కోసం టర్ఫ్ పిచ్ ఏర్పాటు చేసి సరైన శిక్షణ అందిస్తే స్థానిక యువత సైతం దేశవాళీ, ఐపీఎల్ పోటీలకు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఓపెన్ జి మ్లు, క్రికెట్ కోచింగ్ నెట్లు కూడా ఏర్పా టు చేయాలని క్రీడాకారులు కోరుతున్నారు. -
సీపీఎస్ రద్దు చేయాలని నిరసన
ఆసిఫాబాద్రూరల్: సీపీఎస్ రద్దు చేయాలని గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదు ట స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు నిరసన చేపట్టారు. అనంత రం కలెక్టర్కు వినతిపత్రం అందించారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఊషన్న మాట్లాడుతూ ప్రభుత్వం నూతన విద్యావిధానం– 2020 రద్దు చేయాలని, అవసరమైన ప్రాంతాల్లో నూతన పాఠశాలలు తెరవాలని డిమాండ్ చేశారు. 1– 7– 2023 నుంచి పీఆ ర్సీ అమలు చేసి, ఐదు పెండింగ్ డీఏలు మంజూరు చేయాలన్నారు. సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయిస్తూ, విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 23ను సవరించాలని కోరారు. నాయకులు ఇందురావు, రమేశ్, హేమంత్, రాజలింగు, సంతోష్, తిరుపతి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ సదుపాయాల బలోపేతమే లక్ష్యం
దహెగాం/కౌటాల/సిర్పూర్(టి): విద్యుత్ సరఫ రా, సదుపాయాల బలోపేతమే తమ లక్ష్యమని టీ జీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి అన్నా రు. కాగజ్నగర్ డివిజన్లో గురువారం విస్తృతంగా పర్యటించారు. సిర్పూర్(టి), బెజ్జూర్, కౌటాల, దహెగాంలోని 32/11 కేవీ సబ్ స్టేషన్లను పరిశీలించారు. కన్నెపల్లి నుంచి దహెగాంకు వచ్చే ఇంటర్ లింక్ లైన్ పనులను తనిఖీ చేశారు. 20 కిలోమీటర్ల ఇంటర్ లింకింగ్ లైన్తో దహెగాం, పెంచికల్పేట్ మండలాలకు ఈదురుగాలుల సమయంలోనూ అంతరాయం తప్పుతుందని పేర్కొన్నారు. విద్యుత్ మరమ్మతుల సమయంలో సిబ్బంది భద్రత పాటించాలని సూచించారు. యాప్ ద్వారానే ఎల్సీలు తీ సుకోవాలన్నారు. అటవీ ప్రాంతాలైన వేంపల్లి, పెద్దబండ, సార్సాల, ఎల్కపల్లి వరకు సుమారు 16 కిలోమీటర్ల మేర కవర్డ్ కండక్టర్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. బెజ్జూర్ నుంచి కర్జవెల్లి వరకు 20 కిలోమీటర్ల ఇంటర్ లింకింగ్ లైన్ పనులు వారంలో పూర్తి చేయాలని ఆదేశించారు. డీఈ నాగరాజు, డీఈ టెక్నికల్ సుధాకర్, ఈఈ సివిల్ శ్రీనివాస్, ఏఈ రవీందర్, సబ్ ఇంజినీరు వెంకటేశ్వర్లు, ఎస్ఎల్ఐ మురళీధర్, డీఈటీ సుధాకర్, ఏడీఈలు ఇర్ఫాన్ అహ్మద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లలో అధికారుల కృషి అభినందనీయం
ఆసిఫాబాద్అర్బన్: యాసంగి వరిధాన్యం కొనుగోళ్లు గడువులోగా పూర్తిచేయడంలో అధికారుల కృషి అభినందనీయమని కలెక్టర్ కె.హరిత అన్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1.50కోట్ల మెట్రిక్ ట న్నుల ధాన్యం కొనుగోళ్లు చేపట్టిన నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సన్నబియ్యంతో చేసిన ఏడు రకాల పిండివంటల కిట్లను గురువారం సంబంధిత అధికారులకు అందించారు. ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభంకాగజ్నగర్టౌన్: పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో గురువారం కలెక్టర్ కె.హరిత ఆర్వో వాటర్ ప్లాంట్ను గురువారం ప్రారంభించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్లాంట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమలో సూపరింటెండెంట్ అవినాష్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అపోహలొద్దు.. సురక్షితమే!
వాంకిడి: గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ను నివారించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న హెచ్పీవీ(హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకాల పంపిణీ వేగం పుంజుకోవడం లేదు. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా అన్ని ప్ర భుత్వ ఆస్పత్రుల్లో బాలికలకు ఉచితంగా అందించేందుకు వైద్యారోగ్యశాఖ కార్యాచరణ రూపొందించినా ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. 24 ఆరోగ్య కేంద్రాలలో టీకాలు అందుబాటులో ఉంచి, వైద్యారోగ్య శాఖ అధికారులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా బాలికలు ముందుకు రా వడం లేదు. మార్చిలో వార్షిక పరీక్షల నేపథ్యంలో బాలికలు ముందుకురావడం లేదని అధికారులు భావించారు. వేసవి సెలవుల్లో లక్ష్యాన్ని చేరుకోవచ్చని అనుకున్నా పరిస్థితి మెరుగుపడలేదు. విద్యాసంస్థలు ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాలలపై దృష్టి సారిస్తేనే లక్ష్యం చేరుకునే అవకాశం ఉంది. 786 మందికే టీకా.. జిల్లాలోని వసతి గృహాలు, ఉన్నత పాఠశాలలు, అంగన్వాడీల రికార్డుల ప్రకారం జిల్లాలో 14–15 ఏళ్ల వయస్సు గల బాలికలు 3980 మంది ఉన్న ట్లు అధికారులు గుర్తించారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించిన సందర్భాల్లో ఏఎన్ఎంలు, ఆశ, అంగన్వాడీ సిబ్బంది ద్వారా హెచ్పీవీ టీకాలపై అవగాహన కల్పిస్తున్నారు. నాలుగు నెలలు కావొస్తున్నా ఇప్పటివరకు 786 మంది బాలికలు మాత్రమే టీకా వేయించుకున్నారు. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా 20 శాతం మాత్రమే ముందుకువచ్చారు. బాలికల్లో సరైన అవగాహన లేకపోవడం ఒక కారణమైతే.. తల్లిదండ్రుల్లో వ్యాక్సిన్పై అపోహాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉచితంగా అందిస్తున్నా.. మహిళలల్లో ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్ నిరోధించేందుకు హెచ్పీవీ వ్యాక్సిన్ను ప్రభుత్వం ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంది. కిశోర బాలికలు ముందస్తుగా ఈ వ్యాక్సిన్ తీసుకుంటే గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇదే వ్యాక్సిన్ సుమారు రూ.4000 నుంచి రూ.5000 వరకు ఉంటుంది. ప్రాణాంతక గర్భాశయ కాన్సర్ నుంచి రక్షణ కల్పించే టీకా విషయంలో బాలికలు, తల్లిదండ్రుల్లో అపోహాల కారణంగా లక్ష్యం చేరుకోవడం లేదు. అనారోగ్య సమస్యలు రావొచ్చనే అనుమానంతో వెనుకంజ వేస్తున్నారు. వైద్యాధికారులు విస్తృతంగా అవగాహన కల్పిస్తే గానీ ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా కన్పించడం లేదు. -
రికార్డులు సక్రమంగా నిర్వహించాలి
కెరమెరి: గిరిజన సహకార సంస్థ రికార్డులు సక్రమంగా నిర్వహించాలని జీసీసీ డివిజనల్ మేనేజర్(డీఎం) జి.సందీప్కుమార్ అన్నారు. జైనూర్ మండలం ఉషేగాంలోని డీఆర్ డిపోను బుధవారం తనిఖీ చేశారు. బియ్యం, సరుకుల స్టాక్ వివరాలు పరిశీలించారు. ఇప్పపువ్వు, తేనె వంటి అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని, నిత్యావసర వస్తువుల విక్రయాలు పెంచాలన్నారు. అనంతరం జైనూర్ మండల కేంద్రంలో జీసీసీ, ఐటీడీఏ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ను సందర్శించారు. ఇంధన విక్రయాల గురించి అడిగి తెలుసుకున్నారు. -
సమర్థవంతంగా ‘సర్’ సర్వే
కాగజ్నగర్టౌన్: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్(సర్) సర్వే సమర్థవంతంగా చేపట్టాలని ము న్సిపల్ కమిషనర్ తిరుపతి అన్నారు. ము న్సిపల్ కార్యాలయంలో బుధవారం బూత్ లె వల్ అధికారులు, ఏజెంట్లతో సమావేశమయ్యారు. కమిషనర్ మాట్లాడుతూ ఓటరు జా బితా ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిగా ని లుస్తుందని, అర్హుల పేర్ల నమోదు, అనర్హుల తొలగింపు ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలని సూచించారు. ఇంటింటి సర్వే నిర్వహించే సమయంలో పొరపాట్లకు తావులేకుండా పూర్తి వివరాలు సేకరించాలన్నారు. కొత్తగా 18 సంవత్సరాలు నిండిన వారిని ఓట ర్లుగా నమోదు చేయడంతోపాటు చిరునామా మారిన వారిని, మరణించిన వారి వివరాలను సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు. -
పట్నాలు వేసి.. బోనాలు సమర్పించి
నెత్తిన బోనం.. చుట్టూ జనం.. అడుగులో అడుగేస్తూ ముందుకు కదులుతున్న మహిళలు.. డప్పుచప్పుళ్ల మధ్య కౌటాల బీరన్న ఉత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శీర్షా గ్రామానికి చెందిన గొల్ల కురుమలు మండల కేంద్రంలోని బీరన్న ఆలయం వద్ద వారం రోజులుగా సంప్రదాయబద్ధంగా పూజలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పట్నాలు వేశారు. ఎమ్మెల్సీ దండె విఠల్ నాయకులతో కలిసి పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి కృషి చేయడంతోపాటు గొల్లకురుమల సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం జానకీరావు, మండల అధ్యక్షుడు నికాడే గంగారాం, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. – కౌటాల -
మార్కెట్ కమిటీకి స్థిరమైన ఆదాయం
కెరమెరి: మార్కెట్ కమిటీ కార్యాలయంతోపాటు 12 గదుల భవన సముదాయాల నిర్మాణంతో మార్కెట్ కమిటీకి స్థిరమైన ఆదాయం వస్తుందని కలెక్టర్ కె.హరిత అన్నారు. జైనూర్ మండల కేంద్రంలో రూ.1.25కోట్లతో నిర్మించిన మార్కెట్ కమిటీ భవనాన్ని బుధవారం ఆసిఫాబాద్, ఖానా పూర్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జుతో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు వాడాలన్నారు. విత్తనాలు, ఎరువుల కొ నుగోలు సమయంలో తప్పనిసరిగా రశీదులు తీసుకోవాలని సూచించారు. పంట చేతికొచ్చేవరకు వా టిని భద్రపర్చుకోవాలన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు వ్యవసాయ అధికారులు తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్, వైస్ చైర్మన్ జైవంతరావు, డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, గ్రంథాలయ చైర్మన్ అనిల్, డీసీసీ ప్రధాన కార్యదర్శి ముఖీద్, సర్పంచ్ ప్రకాశ్ పాల్గొన్నారు. -
చినుకులకే దారిద్రం..!
దహెగాం: దహెగాం మండలానికి దారులు మూసుకుపోతున్నాయి. రహదారులు, వంతెనల పనులు అసంపూర్తిగా ఉండగా, చినుకులకే బురదమయంగా మారి రాకపోకలు కష్టతరంగా మారుతున్నాయి. కోత్మీర్ నుంచి దహెగాం వరకు డబుల్ రోడ్డు నిర్మాణంలో భాగంగా మట్టి పనులు కొనసాగుతున్నాయి. అలాగే దహెగాం– పెంచికల్పేట్ మండలాల మధ్యలోని లగ్గాం సమీపంలో మరో వంతెన పనులు చేపడుతున్నారు. ప్రస్తుత వర్షాలకు మట్టిరోడ్లు బురదమయంగా మారుతున్నాయి. భారీ వర్షాలు పడితే మండలానికి రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. నాలుగేళ్ల క్రితం భారీ వర్షాలకు వరదలు పోటెత్తి పెద్దవాగు ఉప్పొంగడంతో కాగజ్నగర్ మండలం అందవెల్లి వద్ద పెద్దవాగుపై వంతెన కుంగికూలిపోయింది. అప్పుడు దహెగాం, భీమిని, కాగజ్నగర్ మండలాల ప్రజలకు సంబంధాలు తెగిపోయాయి. పెద్దవాగు వంతెన నిర్మాణం పూర్తికావడంతో కొంత రవాణా కష్టాలు తీరాయి. చిత్తడిగా డబుల్ రోడ్డు కోత్మీర్ నుంచి దహెగాం వరకు సింగిల్ రోడ్డు ఉండగా రెండున్నర ఏళ్ల క్రితం ప్రభుత్వం డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.32 కోట్లు మంజూరు చేసింది. కాంట్రాక్టర్ ఆలస్యంగా పనులు ప్రారంభించి మొదట కల్వర్టులు నిర్మించాడు. అనంతరం అంతరాయం ఏర్పడటంపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితం కావడంతో స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు స్పందించి పనుల ప్రారంభానికి చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మట్టి పనులు కొనసాగుతుండగా వర్షాలకు రోడ్డంతా చిత్తడిగా మారుతోంది. వాహనాలు బురదలో ముందుకు కదలడం లేదు.వర్షాలకు చిత్తడిగా మారిన డబుల్ రోడ్డు పెంచికల్పేట్ మీదుగా అదే దుస్థితి ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దహెగాం మండల ప్రజలు కొందరు కాగజ్నగర్, ఆసిఫాబాద్ పట్టణానికి అవసరాల నిమిత్తం పెంచికల్పేట్ మీదుగా వెళ్తున్నారు. అయితే లగ్గాం సమీపంలో చిన్న వంతెన వద్ద మరో ఎత్తు వంతెన పనులు కొనసాగుతున్నాయి. పెద్దవాగుపై నిర్మాణం పూర్తయిన వంతెన వద్ద రెండు వైపుల అప్రోచ్ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. మట్టి పోసి వదిలేయగా, ప్రజలు తాత్కాలికంగా ప్రయాణాలు సాగిస్తున్నారు. ఒర్రైపె వంతెన నిర్మాణం, 400 మీటర్ల అప్రోచ్ రోడ్డుకు గతేడాది సీఆర్ఐఎఫ్(సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) కేంద్రం నుంచి రూ.18 కోట్లు మంజూరు చేసింది. పాత రోడ్డు బురదగా మారుతోంది. -
‘దీక్షలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు’
కాగజ్నగర్టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లులో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని నెల రోజులుగా కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. పట్టణంలోని ఎస్పీఎం గేటు ఎదుట కార్మికుల దీక్ష శిబిరాన్ని సోమవారం సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ మిల్లు నుంచి వెలువడే విషవాయువులతో సమీప సంఘం బస్తి, సర్దార్ బస్తి, ఓల్డ్ కాలనీ, నిజాముద్దీన్ కాలనీ ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆరోపించారు. మిల్లు యాజమాన్యం మొండి వైఖరి విడిచి పెట్టాలన్నారు. 10 సభ్యుల కమిటీని రద్దు చేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కొంగ సత్యనారాయణ, వెంకటేశం, ఓదెలు, కార్మికులు రాజేశం, శ్యాంరావు తదితరులు పాల్గొన్నారు. -
సాగు పనులు అడ్డుకుంటే సహించం
ఆసిఫాబాద్అర్బన్: సర్వే పేరుతో సాగు పనులను అడ్డుకుంటే సహించేది లేదని ఎమ్మెల్యే కోవ లక్ష్మి హెచ్చరించారు. పోడు భూముల సమస్యలు పరి ష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కెరమెరి, జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాలకు చెందిన రైతులతో కలిసి జిల్లా కేంద్రంలోని డీఎఫ్వో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ‘మా భూములు.. మాకు కావాలి, మా భూములను లాక్కోవద్దు’ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తరతరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న గిరిజన, ఆదివాసీ రైతుల భూములను లాక్కుంటే ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారన్నారు. పోడు భూములపై రైతులకు హక్కులు కల్పించేవరకు పోరాడతానని హామీ ఇచ్చారు. విత్తనాలు వేసుకునే సమయంలో ఆటంకాలు సృష్టించొద్దని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో పోడు రైతులకు పోడు పట్టాలు అందించగా, కాంగ్రెస్ ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
డిమాండ్ ఉన్న రకాలకు ప్రభుత్వ ప్రోత్సాహం
రెబ్బెన: మార్కెట్లో డిమాండ్ ఉన్న ఏడు సన్నరకం వరిధాన్యం వంగడాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, వాటినే రైతులు సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్ అన్నా రు. మండల కేంద్రంలోని రైతువేదికలో మంగళవారం ఏర్పాటు చేసిన విత్తన మేళాకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంపిక చేసిన తెలంగాణ సోనా, జై శ్రీరాం, హెచ్ఎంటీ సోనా, బీపీటీ– 5204, కేఎన్ఎం– 1638, కేఎన్ఎం– 7715 రకాలను మాత్రమే రైతులు ఎంచుకోవాలని సూచించారు. రైతులు మామూలు యూరియా, డీఏపీల వాడకాన్ని తగ్గించి నానో యూరియా, నానో డీఏపీ వాడుకోవాలన్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పంట మార్పిడి వైపు దృష్టి పెట్టాలని కోరారు. తక్కువ నీటి వినియోగం ఉండే కందులు, జొన్నలు వంటి పంటల సాగు ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చని అన్నారు. ఈ నెల 30న జరిగే రైతుమేళాలో నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో దిలీప్కుమార్, ఏఈవో శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
సబ్ స్టేషన్ మంజూరు చేయాలని వినతి
దహెగాం: మండలంలోని చిన్న ఐనం గ్రామంలో 33/11 కేవీ సబ్స్టేషన్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరా బాద్లోని ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందించారు. చిన్న ఐనం, పెద్ద ఐనం, పోలంపల్లి, మురళీగూడ, పెసరికుంట గ్రామాల్లో లోవోల్టేజీ, హైవోల్టేజీ, బ్రేక్ డౌన్ సమస్యలు అధిగమించడానికి సబ్స్టేషన్ అవసరమని పేర్కొన్నారు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారని, త్వరలో సబ్స్టేషన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. -
ఇళ్ల మంజూరు తీరుపై ఆందోళన
కెరమెరి: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అనర్హులకు ఇళ్లు మంజూరు చేశారని ఆరోపిస్తూ మంగళవారం మండలంలోని గోయగాం గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన తెలిపారు. గ్రామానికి 42 ఇళ్లు మంజూరు కాగా, ఒకే వార్డులో అనర్హులకు కేటా యించారని ఉదయం పంచాయతీ కార్యాలయంలో అధికారులను నిలదీశారు. జిల్లా అధికారులు అందించిన జాబితా ప్రకారమే సర్వే చేశామని, ఇళ్ల కేటాయింపులో తమ ప్రమేయం లేదని అధికారులు స్పష్టం చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. కలెక్టర్ వచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గ్రామస్తులను సముదాయించారు. సమస్యను అధి కారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. బాపూజీ, పోశెట్టి, ప్రేమల, ఇస్లాంబిన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, ఎన్ఎంఆర్, ఫిక్స్డ్ పే కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కుమురంభీం చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు కార్మికులు, సిబ్బంది నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ కనీస వేతనంగా రూ.26వేలు నిర్ణయించాలని, ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని, రెయిన్ కోట్లు, స్వెటర్లు, బట్టలు, కొబ్బరినూనె, ఇతర సామగ్రి అందించాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ బకాయిలు జమ చేయాలని, మృతి చెందిన కార్మికుల దహన సంస్కారాలకు ఖర్చుల నిమిత్తం రూ.30వేలు చెల్లించాలని, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణమాచారి, పెరక శ్రీకాంత్, మాట్ల రాజు, శంకర్, సంజీవ్, తోట సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి మంగళవారం ఘనంగా నిర్వహించా రు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం మాట్లాడుతూ దేశ సమగ్రత, ఐక్యత కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఒక దేశం– ఒకే రాజ్యాంగం సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లిన మహోన్న త నాయకుడని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ అనిత, నాయకులు కొత్తపల్లి శ్రీనివాస్, పుల్ల అశోక్, రాము, విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలి
ఆసిఫాబాద్అర్బన్: వివిధ కారణాలతో జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని, మంచి ఆలోచనలతో జీవి తాన్ని గడపాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ వి.సంకేత్ మిత్ర అన్నారు. జిల్లా కేంద్రంలోని సబ్ జైలును మంగళవా రం సందర్శించారు. ఖైదీల ఆరోగ్య సమస్యలు, కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఖైదీలు ప్రైవేట్ న్యా యవాదులను నియమించుకునే స్థోమత లేకుంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ ద్వారా అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కా ర్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ ప్రేమ్కుమార్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అంజనీదేవి తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణిలో సమ్మె మేఘాలు
శ్రీరాంపూర్: సింగరేణిలో సమ్మె మేఘాలు కమ్ముకుంటున్నాయి. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 8న యాజమాన్యానికి, 9న డిప్యూటీ సీఎల్సీకి సమ్మె నోటీస్ ఇచ్చింది. డిమాండ్లు నెరవేర్చకుంటే ఈ నెల 22తర్వాత ఎప్పుడైనా నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించింది. గుర్తింపు సంఘంగా గెలిచి రెండేళ్లు దాటినా కార్మికుల ప్రధాన డిమాండ్ల సాధనకు యాజమాన్యం ముందుకురావడం లేదని ఏఐటీయూసీ నేతలు ఆరోపిస్తున్నారు. స్ట్రక్చరల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, జరిగిన ఒప్పందాలూ అమలయ్యేలా యాజమాన్యం ఉత్తర్వులు ఇవ్వడం లేదని విమర్శించారు. చాలాకాలంగా కార్మికుల 31 ప్రధాన డిమాండ్లు పెండింగ్లో ఉన్నాయని ఈసారి సమ్మెతో వీటిని సాధిస్తామని పేర్కొంటున్నారు. కాగా, సమ్మె నోటీసులపై ఈ నెల 25న ఆర్ఎల్సీ చర్చలకు పిలిచింది. యాజమాన్యం, గుర్తింపు సంఘానికి మధ్య జరిగే ఈ చర్చల్లో తమ డిమాండ్లకు అంగీకరించకుంటే ఫెయిల్యూర్ రిపోర్ట్ తీసుకుని సమ్మెకు పోతామని ఏఐటీయూసీ నేతలు చెబుతున్నారు. కేంద్రం తెచ్చిన కొత్త లేబర్కోడ్లు అమలవుతున్న ఈ తరుణంలో సమ్మె నోటీస్కు, సమ్మెకు మధ్య 60రోజుల గడువు ఉండాలనే నిబంధన అమలులో ఉందని తెలిసింది. సమ్మైపె భిన్నాభిప్రాయాలుసమ్మైపె మిగతా కార్మిక సంఘాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. రెండున్నరేళ్లు అధికారం అనుభవించి నేడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమ్మె నోటీస్ ఇవ్వడంలో రాజకీయ దురుద్దేశం ఉందని టీబీజీకేఎస్, హెచ్ఎమ్మెస్, సీఐటీయూ ఆరోపిస్తున్నాయి. ఈ సమ్మెనూ ఐన్టీయూసీ తప్పుపడుతోంది. ఐక్యపోరాటాలే సింగరేణిలో నేడు శరణ్యమని, ఒంటరిగా సమ్మెకు వెళ్తే విఫలమై కార్మికులు నష్టపోతారని ప్రతిపక్ష కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఒంటెద్దు పోకడలతో కాకుండా అన్ని సంఘాలతో చర్చించి ఏకాభిప్రాయం మేరకే సమ్మె చేయాలని సూచిస్తున్నాయి.ఇవే సమ్మె డిమాండ్లు.. నోటీస్ ఇచ్చిన గుర్తింపు సంఘం -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
వాంకిడి: అనారోగ్యంతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి, ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాలను మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రిలోని వార్డులు, మందుల నిల్వలు, సిబ్బంది హాజరు పట్టిక, రికార్డులు తనిఖీ చేశారు. రోగులతో మర్యాదగా వ్యవహరించాలని, విధుల్లో సమయ పాలన పాటించాలని అన్నారు. వర్షాకాలం నేపథ్యంలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ కవిత, ఎంపీవో ఖాజా అజీజు ద్దీన్, ఏపీవో శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం ఏర్పాటుఆసిఫాబాద్అర్బన్: వర్షాల నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ కె.హరిత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూం నం.85008 44365లో సంప్రదించాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. -
‘సర్’పై కార్యకర్తలకు అవగాహన అవసరం
కాగజ్నగర్టౌన్: రాష్ట్రంలో చేపట్టే సర్ ప్రక్రియపై బీఆర్ఎస్ కార్యకర్తలకు అవగాహన అవసరమని ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్రావు అన్నారు. పట్టణంలోని వినయ్ గార్డెన్లో మంగళవారం సర్ ప్రక్రియపై అవగాహన, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పార్టీ సభ్యత్వ నమోదు ఇన్చార్జి జగన్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరై అవగాహన కల్పించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఓటర్లు ఓటుహక్కు కాపాడుకునేలా పార్టీ శ్రేణులు చైతన్యవంతంగా పనిచేయాలని పిలు పునిచ్చారు. ఎస్ఐఆర్పై గ్రామాల్లో అవగాహన క ల్పించాన్నారు. అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పోషించిన చారిత్రక పాత్రను ప్రజలకు వివరించాలని సూచించారు. బూత్స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయాలన్నారు. యువత, మహిళలు అధిక సంఖ్యలో పార్టీలో చేరేలా కృషి చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే కోనే రు కోనప్ప మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీకి ఉన్న బలాన్ని మరింత విస్తరించేందుకు సమష్టిగా కృషి చేయాలన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సర్పంచులు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అద్దె పాలన..!
ఇది పెంచికల్పేట్ మండలంలోని ఎల్కపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. ఇక్కడ 1 నుంచి 5వ తరగతి వరకు సుమారు 40 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇటీవల ఈ పాఠశాల భవనంలో అధికారులు ఎంపీడీవో కార్యాలయాలన్ని ఏర్పాటు చేసి ఇక్కడి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థులను సంజీవనగర్ పాఠశాల ఆవరణకు తరలించారు. ఇలా జిల్లాలోని కొత్త మండలాల్లో చాలా ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు లేవు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తుండంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెంచికల్పేట్: పాలనా సౌలభ్యం కోసం గత ప్రభుత్వం నూతన మండలాలను ఏర్పాటు చేసింది. అయితే ఆయాచోట్ల ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె భవనాలు, తాత్కాలిక భవనాలే దిక్కవుతున్నాయి. జిల్లాలో పెంచికల్పేట్, చింతలమానెపల్లి, లింగాపూర్ నూతన మండలాలు ఏర్పడి సుమారు తొమ్మిదేళ్లు గడిచినా నేటికీ ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించలేదు. వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తహసీల్దార్, ఎంపీడీవో, మండల సమాఖ్య, పశుసంవర్ధక, మండల విద్యావనరుల కార్యాయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ప్రజలకు తప్పని తిప్పలు..ప్రతిరోజూ ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు వివిధ రకాల పనులు నిమిత్తం మండల కేంద్రంలోని తహసీల్దార్, ఎంపీడీవో, సమాఖ్య కార్యాలయాలకు వస్తున్నారు. అద్దె, తాత్కాలిక భవనాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న నేపథ్యంలో ఒకవైపు అధికారులతో పాటు ప్రజలు సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా స్పందించి నూతనంగా ఏర్పడిన మండలాలకు అన్ని సౌకర్యాలతో పక్కా భవనాలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.అద్దె భవనాల్లో అవస్థలు..పెంచికల్పేట్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆరె సంక్షేమ సంఘం భవనంలో నిర్వహిస్తుండగా, చింతలమానెపల్లి, లింగాపూర్ కార్యాలయాలను ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగిస్తున్నారు. ఆయా మండలాల్లో ఎంపీడీవో కార్యాలయాలతోపాటు ఇతర ప్రభుత్వ కార్యాయా ల సేవలను ప్రభుత్వ బడులు, గ్రామ పంచా యితీ కార్యాలయాల్లో అందిస్తున్నారు. ఇటీవ ల పెంచికల్పేట్ ఎంపీడీవో కార్యాలయాన్ని ఎస్సీ కమ్యూనిటీ హాల్ నుంచి ఎంఈవో భవనానికి అక్కడి నుంచి ఎల్కపల్లి ప్రభుత్వ పాఠశాలకు మార్చారు. గ్రామీణ ప్రాంతాల్లో రు ణాలను అందిస్తున్న మహిళా సమాఖ్య కార్యాలయాన్ని గ్రామ పంచాయితీ కార్యాలయంలోని ఒక గదిలో కొనసాగిస్తున్నారు. భవనాలు నిర్మించాలి పెంచికల్పేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు తాత్కాలిక భవనాల్లో కొనసాగుతున్నాయి. ఆయా భవనాల్లో సరైన సౌకర్యాలు లేవు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. అధికారులు వెంటనే స్పందించి నూతన భవనాలకు నిధులు మంజూరు చేయాలి. – చప్పిడే తిరుపతి, పెంచికల్పేట్ ఇబ్బందులు పడుతున్నాం నూతన మండలాల్లో ప్రభు త్వ కార్యాలయాలకు పక్కా భవనాలు లేవు. తాత్కాలిక భవనాల్లో విధులు నిర్వహించడానికి అధికారులతోపాటు పనుల నిమిత్తం వచ్చే మేము కూడా ఇబ్బందులు పడుతున్నాం. కార్యాలయాల్లో తాగునీటీ వసతి, మరుగుదొడ్లు కూడా లేవు. భవనాల ఎదుట పడిగాపులు కాస్తూ పనులు పూర్తి చేసుకుంటున్నారు. – బానోత్ రాజేందర్, లింగాపూర్ -
హమ్మయ్యా.. వానొచ్చింది
పెంచికల్పేట్/దహెగాం/ఆసిఫాబాద్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడగా, ఇళ్ల పైకప్పులు దెబ్బతిన్నాయి. జిల్లా కేంద్రంలో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. నాలుగైదు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పెంచికల్పేట్ మండలం పోతెపల్లి గ్రామంలో విద్యుత్ పోల్స్ విరిగిపడటంతో పెను ప్రమాదం తప్పింది. కొండపల్లి గ్రామానికి చెందిన ఉష్ణబోయిన సంతోష్ ఇంటిపై కప్పు రేకులు ఎగిరిపోయి ఇంట్లోని సామగ్రి తడిసింది. అగర్గూడ గ్రామానికి చెందిన రాంటెంకి ఇంటి ఆవరణలో పిడుగుపాటుతో మేక మృతి చెందింది. దహెగాం మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయ సమీపంలో గాలిదుమారానికి చెట్టు విద్యుత్ స్తంభంపై పడడంతో స్తంభం నేలకొరిగింది. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఆదివారం అర్ధరాత్రి సైతం మోస్తారు వర్షం కురిసింది. ఉక్కపోతతో ఇబ్బందులు పడిన ప్రజలకు తేలికపాటి వర్షంతో ఉపశమనం కలిగింది. మంగళవారం నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో రైతులు సాగు పనులు ముమ్మరం చేశారు. -
క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలాదేవి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చాంబర్లో సోమవారం కలెక్టర్ కె.హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డీఎఫ్వో బాలామణితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎండీ మాట్లాడుతూ జిల్లాలో మైదానాల అభివృద్ధి, మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. జన్కాపూర్ క్రీడామైదానానికి స్థలం, వసతుల కల్పన, కౌటాల మండల కేంద్రంలోని మినీ స్టేడియం అభివృద్ధికి ప్రతిపాదనలు పంపాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ శాఖల వారీగా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అనంతరం క్రీడాశాఖ అధికారులతో కలిసి తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్ సోని బాలాదేవి జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ క్రీడామైదానం, ఆదర్శ పాఠశాల క్రీడా మైదానాన్ని పరిశీలించారు. క్రీడాపాఠశాలలో జాతీయ, రాష్ట్రస్థాయిలో సాధించిన పతకాలు, ట్రోఫీలను చూసి హర్షం వ్యక్తం చేశారు. గిరిజన బాలికలు చదువుతోపాటు క్రీడల్లో రాణించి భవిష్యత్తు నిర్మించుకోవాలని సూచించారు. 400 మీటర్ వాకింగ్ ట్రాక్, వాలీబాల్, ఫుట్బాల్, క్రీడామైదానం ప్రహరీ, ఇతర మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో స్పోర్ట్స్ డిప్యూటీ డైరక్టర్లు రవీందర్, శ్రీనివాస్, అశోక్, రవితేజ, డీవైఎస్వో అశ్వక్ అహ్మద్, డీఎస్వో శేకు, ఏటీడీవో చిరంజీవి, కోచ్లు అరవింద్, విద్యాసాగర్, తిరుమల్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ముప్పు లేకుండా.. ముందస్తు సన్నద్ధత
ఈ ఫొటోలోని మురుగు కాలువ కన్యకాపరమేశ్వరీ దేవాలయం సమీపంలోనిది. ఏటా వర్షాకాలంలో వరద ఎక్కువ కావడంతో నీరంతా రోడ్డుపైకి చేరి రాకపోకలు నిలిచిపోతాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందుగానే చర్యలు చేయిస్తున్నారు. ఇప్పటికే వరద ముంపు ఉన్న ప్రాంతాలను గుర్తించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ప్రధాన మురుగు కాలువకు లింకు ఉన్న కాలువల్లో పూడిక తొలగిస్తున్నారు. కాగజ్నగర్టౌన్: వర్షాకాలం నేపథ్యంలో కాగజ్నగర్ పట్టణంలో వరద ముంపు సమస్య తలెత్తకుండా మున్సిపల్ అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. ప్రధాన మురుగు కాలువ సుమారు ఐదు కిలోమీటర్ల మేర జేసీబీతో యుద్ధ ప్రాతిపదికన చెత్తాచెదారం తొలగింపు పనులు చేపట్టగా, ఇప్పటికే అధిక శాతం పనులు పూర్తయ్యాయి. లోతట్టు ప్రాంతాలైన ఇందిరా మార్కెట్ ఏరియా, ద్వారకానగర్, సంజీవయ్య కాలనీల గుండా వెళ్లే ప్రధాన మురుగు కాలువలో పేరుకుపోయిన పిచ్చిమొక్కలు, చెత్త తొలగించారు. రైల్వే ట్రాక్ అవతలి భాగంలోని డ్రెయినేజీలో ఉన్న పూడిక పనులు సైతం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు..కాగజ్నగర్ మున్సిపల్ చైర్ పర్సన్ షాహీన్ సుల్తానా, కమిషనర్ తిరుపతి ఆధ్వర్యంలో శానిటరీ విభాగం అధికారులు నిరంతరం పనులను పర్యవేక్షణ చేస్తున్నారు. వర్షపు నీటికి ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా ప్రవహించేలా పారిశుద్ధ్య సిబ్బంది, జేసీబీల సాయంతో డ్రెయినేజీలు శుభ్రం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను కూడా ఏర్పాటు చేసి పనుల పురోగతిని సమీక్షిస్తున్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే పనులు వర్షాలు పడకముందే పూర్తి చేస్తున్నామని చైర్పర్సన్ షాహీన్ సుల్తానా తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా.. వర్షాకాలం దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాం. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారు. ప్రత్యేక టోల్ఫ్రీ నంబర్ 08738– 239988 కు ప్రజలు సమస్యలు తెలియజేయవచ్చు. – తిరుపతి, మున్సిపల్ కమిషనర్, కాగజ్నగర్ -
క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలి
ఆసిఫాబాద్అర్బన్: ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డీఆర్వో దాసరి వేణుతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పేదవాడినైన తనకు ఆర్థికసాయం అందించాలని వాంకిడి మండలం వెల్లి గ్రామానికి చెందిన జువెల్ల బాదిరావ్ వేడుకున్నాడు. స్వాతంత్య్ర సమరయోధుడి ధ్రువపత్రం ఇప్పించాలని సిర్పూర్(టి) మండల కేంద్రానికి చెందిన హుస్సేన్ దరఖాస్తు చేసుకున్నాడు. ఆర్ఎఫ్ఓఆర్ పట్టా భూమిలో సోలార్ కనెక్షన్ మంజూరు చేయాలని కౌటాల మండలం మొగడ్దగడ్ గ్రామానికి చెందిన సుధాకర్ విన్నవించాడు. తన పట్టా భూమిలో ఇతరులు అక్రమంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని చింతలమానెపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన రౌతు విర్దు ఫిర్యాదు చేశాడు. ఆశవర్కర్గా అవకాశం కల్పించాలని లింగాపూర్ మండలం భీమానాయక్ తండాకు చెందిన సంగీత దరఖాస్తు చేసుకుంది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తనకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని బెజ్జూర్ మండలం సల్గుపల్లికి చెందిన లింగయ్య కోరాడు. దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని ఆసిఫాబాద్ మండలం గొడవెల్లికి చెందిన కార్తీక్ దరఖాస్తు చేసుకున్నాడు. కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గతంలో వచ్చిన దరఖాస్తులు పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని ఆదేశించారు. -
25న ‘చలో హైదరాబాద్’
ఆసిఫాబాద్అర్బన్: సమస్యల పరిష్కారం కోసం ఉప సర్పంచులు ఈ నెల 25న చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని వాసవీ భవన్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఉప సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లేశ్యాదవ్, కార్యదర్శి జంపన్న జానీ మాట్లాడారు. ఉప సర్పంచుల చెక్ పవర్పై వస్తున్న వార్తలను ప్రభుత్వం ఖండించాలన్నారు. ఉప సర్పంచులకు రూ.5వేలు, వార్డు సభ్యులకు రూ.3వేలు గౌరవ వేతనం చెల్లించడంతోపాటు ప్రత్యేక గుర్తింపు కల్పించడం, విధులు, అధికారాలను స్పష్టం చేయడం, పంచాయతీ పాలనలో తగిన ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని మండలాలు, గ్రామాల ఉప సర్పంచులు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం చలో హైదరాబాద్ కార్యక్రమం పోస్టర్లు ఆవిష్కరించారు. ఉప సర్పంచుల సంఘం జిల్లా ఇన్చార్జి దీపక్ ముండె, ఉప సర్పంచులు చిట్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు న్యాయం చేయాలని వినతి
ఆసిఫాబాద్అర్బన్: కెరమెరి, జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాలకు చెందిన రైతులతో కలిసి ఎమ్మెల్యే కోవ లక్ష్మి సోమవారం హైదరాబాద్లో ఫారెస్ట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ సి.సువర్ణను కలిసి సమస్యలు వివరించారు. వందలాది కుటుంబాలు 50 ఏళ్లుగా అటవీ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. అటవీశాఖ చర్యలతో సాగు భూములు కో ల్పోతే వారు రోడ్డున పడే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఇప్పటికే విత్తనాలు వేసి సాగు ప్రారంభించిన రైతుల చేలకు అధికారులు వెళ్లి ఇబ్బందులు కలిగించకుండా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు. -
ఎరువుల గండం..!
కౌటాల: జిల్లా రైతులకు యూరియా కష్టాలు తప్పేలా లేవు. గతేడాది మాదిరిగా ఈసారీ నిల్వలు అంతంత మాత్రమే ఉన్నాయి. జూన్లోనే కొరత ఉండటంతో జూలై, ఆగస్టు నెలల్లో సమస్య మరింత జఠిలమయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు 8 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశారు. ఇప్పటికే యాప్ వినియోగంపై అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.. గతంలో కేంద్ర ప్రభుత్వం పెద్దసంఖ్యలో యూరియా ర్యాక్లు పంపించేది. ప్రస్తుతం సుస్థిర వ్యవసాయం వైపు మొగ్గు చూపుతూ సరఫరాలో గతేడాది నుంచి కోత విధిస్తోంది. మే నెలాఖరు వరకు జిల్లాకు 12,190 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే దిగుమతి అయింది. ప్రస్తుతం ఉన్న నిల్వలు జూన్కు మాత్రమే సరిపోతాయి. రైతులు జూన్ నెలాఖరు నుంచి వినియోగం ప్రారంభించి జూలై, ఆగస్టులో అధికంగా వినియోగిస్తారు. వరినాట్లు ప్రారంభమైతే మరిత వినియోగిస్తారు. ఇప్పటికే పెరిగిన ‘కాంప్లెక్స్’ ధరలువానాకాలం సీజన్లో 4.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. యూరియా, డీఏపీ మినహాయించి కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఒక్కో సంచిపై రూ.400 వరకు పెరిగింది. నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి ఉంది. పత్తి, సోయా, కంది పంటలకు కనీసం ఎకరానికి అయిదారు సంచుల కాంప్లెక్స్ ఎరువులు వినియోగిస్తారు. ఒక్కో రైతుపై రూ.4 వేల వరకు అదనపు భారం పడనుంది. మహారాష్ట్రకు వెళ్తున్నాం పత్తి పంట సాగుకు ఎరువులను అధికంగా వినియోగిస్తాం. యాప్లో ఎకరానికి కేవలం రెండు బస్తాలే ఇస్తున్నారు. ప్రత్యేక వాహనాల్లో మహారాష్ట్రకు వెళ్లి యూరియా కొనుగోలు చేసుకుంటున్నాం. యాప్తోపాటు సహకార సంఘాల్లో పంపిణీ చేస్తే బాగుంటుంది. యూరియా కావాలంటే ఇతర మందులు కొనాలని డీలర్లు అంటున్నారు. జిల్లాలో ఎరువుల కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. – మహేశ్, బెజ్జూర్ సరిపడా అందిస్తాం జిల్లాలోని పంటల సాగుకు సరిపడా ఎరువులను సరఫరా చేస్తాం. ఇప్పటివరకు 8 వేల మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేశాం. యూరియా, ఇతర ఎరువుల సరఫరా విషయంలో గతంలో మాదిరిగా కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేయడం లేదు. ప్రతినెలా సరిపడా అందిస్తోంది. జిల్లాకు అవసరమైన ఎరువులు అందించాలని ప్రభుత్వానికి నివేదించాం. రైతులు ఎరువుల కోసం ఆందోళన చెందవద్దు. – వెంకటి, జిల్లా వ్యవసాయాధికారి సరిహద్దు దాటి..గతేడాది జిల్లాలో పంటల సాగుకు 60 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా.. ప్రభుత్వం 48 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసింది. యూరియా కోసం అన్నదాతలు తిప్పలు పడ్డారు. గతేడాది యూరియా సక్రమంగా వేయకపోవడంతో దిగుబడిపై ప్రభావం చూపింది. ప్రస్తుతం ఫర్టిలైజర్ యాప్లో ఎకరానికి కేవలం రెండు బస్తాల యూరియా మాత్రమే అందిస్తున్నారు. కౌలు రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సరిహద్దులోని మహారాష్ట్రకు వెళ్తున్నారు. ఆయా ఫర్టిలైజర్ దుకాణాల్లో బస్తాకు రూ.700 చెల్లించి ప్రత్యేక వాహనాల్లో కౌటా ల, బెజ్జూర్ మండలాలకు తరలిస్తున్నారు. మరోవైపు యాప్ ద్వారా విక్రయిస్తే ఎక్కువ మార్జిన్ ఉండటం లేదని కొందరు వ్యాపారులు రైతులకు యూరియాతోపాటు ఇతర ఎరువులు, పత్తి విత్తనాలు అంటగడుతున్నారు. -
నీట్కు 89.5 శాతం మంది హాజరు
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివా రం నిర్వహించిన నీట్ ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు 353 మంది విద్యార్థులకు 316(89.5 శాతం) మంది హాజరు కాగా, 37 మంది గైర్హాజరయ్యారు. రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన కాగజ్నగర్ మండలానికి ఓ విద్యార్థినిని అధికారులు అనుమతించకపోవడంతో తిరిగివెళ్లిపోయింది. కలెక్టర్ హరిత, ఎస్పీ నితిక పంత్, డీఈవో సచ్చిదానందచారి పరీక్ష తీరును పర్యవేక్షించారు. డీఎస్పీ అశోక్, సీఐ బాలాజీ వరప్రసాద్, ఎస్సైలు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ లక్ష్మీనరసింహం, ప్రిన్సిపాల్ రహీం తదితరులు పాల్గొన్నారు. -
హాజరు అంతంతే..
ఆసిఫాబాద్రూరల్: వేసవి సెలవుల అనంతరం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై ఆరురోజులైనా విద్యార్థుల హాజరు శాతం అంతంతా మాత్రంగానే ఉంది. మొదటిరోజు అమావాస్య, రెండోరోజు మంగళవారం కావడంతో కొందరు తల్లి దండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపేందుకు ఆసక్తి చూపలేదు. పైగా, జిల్లాలో ఇంకా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో విద్యార్థులను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నా రు. శనివారం జిల్లాలో 40 డిగ్రీలపైనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం నుంచి శనివారం వరకు క్రమంగా హాజరు శాతం పెరుగుతున్నా ఆశించిన స్థాయిలో లేదు. వాతావరణం చ ల్లబడితే విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని విద్యాశాఖ అధికారులు భా విస్తున్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో చాలా పాఠశాలల్లో అందరినీ ఒకే తరగతి గదిలో కూర్చోబెడుతుండడం కనిపించింది. కొత్తగా అడ్మిషన్లుజిల్లాలో మొత్తం 1,258 పాఠశాలలున్నాయి. డీఈ వో పరిధిలోని లోకల్ బాడీ స్కూళ్లు 704 ఉన్నాయి. మిగతా 520 పాఠశాలల్లో గిరిజన ఆశ్రమ, ఎస్సీ, బీసీ, ఎస్టీ, గురుకులాలున్నాయి. వీటిలో సుమారు 85వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. డీఈవో పరిధిలో 704 పాఠశాలల్లో సుమారు 31,469 మంది విద్యార్థులున్నారు. ఈ నెల 6నుంచి 19వ తేదీ వరకు నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 1,650 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. జిల్లాలో గతేడాది 41 ప్రీ ప్రైమారీ స్కూళ్లు ఉండగా, ఈ సంవత్సరం 77 స్కూళ్లు ఏర్పాటు కావడంతో వీటి సంఖ్య 118కి చేరింది. ప్రైవేట్ పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ తరగతులు ఉండటంతో చాలామంది విద్యార్థులు ప్రైవేట్ వైపు మొగ్గు చూపేవారని, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులతో విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.15నుంచి 20వ తేదీ వరకు హాజరు వివరాలుమండలం స్కూళ్లు విద్యార్థులు 15 16 17 18 19 20 కాగజ్నగర్ 101 4,436 1,090 1,848 1,945 2,354 2,565 2,698 ఆసిఫాబాద్ 78 4,279 527 1,044 1,573 1,670 1,833 1,928 బెజ్జూర్ 47 1,974 307 611 740 812 946 1,015 చింతలమానెపల్లి 40 1,854 324 575 740 812 946 1,005 దహెగాం 53 2,283 484 978 1,218 1,252 1,402 1,520 జైనూర్ 28 1,531 230 408 495 536 558 664 కెరమెరి 56 2,140 457 778 933 947 1,016 1,205 కౌటాల 39 1,994 347 614 722 780 855 958 లింగాపూర్ 17 713 116 230 292 323 343 396 పెంచికల్పేట్ 27 1,323 260 524 571 721 793 848 రెబ్బెన 58 2,201 435 914 1,056 1,157 1,226 1,358 సిర్పూర్(టి) 51 2,295 700 961 1,118 1,213 1,210 1,289 సిర్పూర్(యు) 21 1,162 173 263 289 274 334 397 తిర్యాణి 27 767 224 284 320 321 362 428 వాంకిడి 61 2,517 498 850 1,005 1,093 1,241 1,325 మొత్తం 704 31,469 6,167 10,882 13,017 14,268 15,504 17,134 హాజరుశాతం పెంచుతాం జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో తల్లిదండ్రులు పాఠశాలలకు పంపిస్తలేరు. ఉపాధ్యాయులు తమ పరిధిలోని పాఠశాలల్లో చదివే విద్యార్థులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించాం. దీంతో క్రమంగా హాజరు శాతం పెరుగుతోంది. 100శాతం హాజరు నమోదుకు కృషి చేస్తాం. – సచ్చిదానందచారి, డీఈవో -
‘ఏఐటీయూసీతోనే కార్మిక హక్కులు’
ఆసిఫాబాద్: కార్మిక హక్కుల సాధన ఏఐటీయూసీతోనే సాధ్యమవుతుందని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం అధ్యక్షు డు టి.దివాకర్ అధ్యక్షతన ఏఐటీయూసీ జిల్లా సమితి సమావేశం నిర్వహించారు. ఉపేందర్ మాట్లాడుతూ వందేళ్లు పూర్తి చేసుకున్న ఏకై క కార్మిక సంఘం ఏఐటీయూసీ అ న్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతి రేక విధానాలు అవలంబిస్తుందని, కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని మండిపడ్డారు. నాలు గు లేబర్ కోడ్లను రద్దు చేసి, 44 కార్మిక చట్టాలను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఉపాధ్యక్షుడు బి.సుధాకర్, మధుసూదన్, భాస్కర్, బాలేశ్, షకీర్ తదితరులు పాల్గొన్నారు. -
పుస్తకాల దందా..!
కాగజ్నగర్ పట్టణంలోని ఓ ఇంగ్లిష్ మీడియం పాఠశాల స్థానికంగా ఒక బుక్స్టాల్తో ఒప్పందం కుదుర్చుకుంది. పాఠశాలలోని విద్యార్థులను అదే బుక్స్టాల్లో పుస్తకాలు కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై ప్రిన్సిపాల్ను సంప్రదిస్తే బుక్స్టాల్తో మాకు సంబంధం లేదని దాటవేస్తున్నారని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. అలాగే మార్కెట్ ఏరియాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి పుస్తకాలకు రూ.3వేలు వసూలు చేస్తున్నారని ఓ విద్యార్థి తండ్రి వాపోయాడు. జిల్లాలోని ఓ స్కూల్లో పదోతరగతి డీజీ మ్యాగ్నమ్ వర్క్బుక్స్కు రూ.2,700 తీసుకుంటున్నారు. మరో పాఠశాలలో నర్సరీ విద్యార్థికి బుక్స్కే రూ.2వేల వెచ్చించాల్సి వస్తోంది. ఇలా జిల్లాలోని కొన్ని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు పాఠ్యపుస్తకాలతో వ్యాపారం చేస్తూ నిబంధనలను నీళ్లలో తొక్కుతున్నాయి. కాగజ్నగర్టౌన్: పిల్లలకు చదువు చెప్పాల్సిన ప్రైవేటు పాఠశాలలు వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. జిల్లాలోని కొన్ని ప్రముఖ ప్రైవేటు పాఠశాలలు వర్క్బుక్స్, గైడ్లు, నోట్పుస్తకాలను కేవలం తాము చెప్పిన బుక్స్టాల్లోనే తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాయి. యూనిఫాంలు కూడా నిర్దేశించిన షాపులోనే కొనుగోలు చేయాలని ఆదేశిస్తున్నాయి. ఇలా నర్సరీ నుంచే తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయి. ప్రైవేట్ యాజమాన్యాల తీరుపై ఆరోపణలు బహిరంగ రహస్యమే అయినా చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. చర్యలు శూన్యం..విద్యాశాఖ నిబంధనల ప్రకారం పాఠశాలలు నిర్దిష్ట దుకాణాల్లోనే పుస్తకాలు, యూనిఫాం కొనాలని ఒత్తిడి చేయడం చట్ట విరుద్ధం. ఎమ్మార్పీ లేకుండా వస్తువులు అమ్మడం వినియోగదారుల చట్టం ఉల్లంఘనే అవుతుంది. ఎన్సీఈఆర్టీ, ఎస్సీఈఆర్టీ సిలబస్కు అనుగుణంగా ఉండే పుస్తకాలు ఎక్కడైనా కొనే స్వేచ్ఛ ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. ఈ విషయమై డీఈవో, లీగల్ మెట్రాలజీ అధికారులు స్పందించి బుక్స్టాల్, స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు నిబంధనలు పాటించాలి. నిబంధనలు అతిక్రమించేవారిపై చర్యలు తప్పవు. పాఠ్యపుస్తకాలు, ఇతర బుక్స్ అమ్ముతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. పాఠశాలలను తనిఖీ చేసి చర్యలు తీసుకుంటాం. – సచ్చిదానంద చారి, జిల్లా విద్యాధికారిఎమ్మార్పీ లేకుండానే అమ్మకాలుప్రైవేటు పాఠశాలలు, బుక్స్టాల్లో అమ్ముతున్న వర్క్బుక్స్పై ఎమ్మార్పీ ముద్రించకపోవడంతోపాటు ఇష్టారీతిగా రేట్లు పెట్టి అమ్ముతున్నారు. మార్కెట్లో కంటే 30 నుంచి 40 శాతం అధికంగా వసూలు చేస్తున్నారు. కొందరు ధైర్యం చేసి ప్రశ్నిస్తే అడ్మిషన్ రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలలు అడ్మిషన్ ఫీజు వసూలు చేయరాదు. 25 శాతం సీట్లు పేద పిల్లలకు ఉచితంగా కేటాయించాలి. కానీ జిల్లాలో సుమారు 110 ప్రైవేటు స్కూళ్లలో ఎక్కడా ఈ నిబంధనలు అమలు కావడం లేదు. ఫైర్సేఫ్టీ, అగ్ని ప్రమాదాల నివారణ సర్టిఫికెట్లు, బస్సుల కండీషన్ సర్టిఫికెట్లు లేకుండానే స్కూళ్లు నడుస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. -
పిల్లల రక్షణకు పోక్సో చట్టం
కెరమెరి: పిల్లల రక్షణ కోసమే పోక్సో చట్టం ఉందని, విద్యార్థినులకు చట్టాలపై అవగాహ న ఉండాలని ఆసిఫాబాద్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి సంకేత్ మిత్ర అన్నారు. మండలంలోని మోడి బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలో ఆదివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చట్టాలపై అవగాహన కల్పించారు. రా జ్యాంగం, ప్రాథమిక హక్కులు, సైబర్ నేరా లు, సోషల్ మీడియాలో తీసుకోవాల్సిన జా గ్రత్తలు, గుడ్ టచ్– బ్యాడ్ టచ్, బాల్య వివా హాల నిషేధం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూల న గురించి వివరించారు. పిల్లలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు పోక్సో చట్టం పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి వేధింపులకు గురైనా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం ప్రేందాస్, సర్పంచ్ ఆత్రం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
నీట్కు సర్వం సిద్ధం
ఆసిఫాబాద్రూరల్: నీట్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. పరీక్షకు 353మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో 250 మంది బాలికలు, 103 మంది బాలురున్నారు. ఒక్కో గదికి 30 మంది చొప్పున 15 గదులు కేటాయించారు. పరీక్ష ఆదివారం మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు ఉంటుంది. విద్యార్థులను ఉదయం 11నుంచి 1.30గంటల వరకు బయోమెట్రిక్ ద్వారా సెంటర్లోకి అనుమతిస్తారు. 28మంది ఇన్విజిలేటర్లు, ఒక పరిశీలకుడు, ఇద్దరు సీఎస్లతోపాటు సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంటుంది. విద్యార్థులకు సూచనలుపకడ్బందీగా నిర్వహిస్తాం నీట్ నిర్వహణకు అన్ని ఏర్పాటు చేశాం. 316మంది విద్యార్థులు పరీక్షకు హాజ రు కానున్నారు. నిబంధనల మేరకు విద్యార్థులను క్షుణంగా తనిఖీ చేసి బయోమెట్రిక్ హాజరు నమో దు చేసిన తర్వాతే కేంద్రంలోకి అనుమతిస్తాం. – లక్ష్మీనరసింహం, నీట్ సిటీ కోఆర్డినేటర్ -
నాన్న మాటే.. విజయానికి బాట..
నిర్మల్ ఖిల్లా: జీవితంలో తండ్రి ఇచ్చే మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అమూల్యమని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ గోమస జసింత్ జోయల్ అన్నారు. ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి డేనియల్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ తన విజయ ప్రయాణాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. నిర్మల్కు చెందిన ‘జసింత్ జోయల్‘ బీటెక్ 2020లో పూర్తిచేశారు. అనంతరం గ్రూప్–1 లక్ష్యంగా సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలోనే నిర్మల్లోని సోఫీనగర్ గురుకుల కళాశాల ప్రిన్సిపల్గా పనిచేస్తున్న తన తండ్రి డేనియల్ ఉద్యోగరీత్యా హైదరాబాద్కు బదిలీ కావడంతో ఆరేళ్లపాటు కొడుకుతోపాటు అక్కడే ఉన్నారు. గ్రూప్–1 పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ప్రతీ అంశాన్ని తండ్రితో చర్చించేవాడినని జసింత్ తెలిపారు. ఉపాధ్యాయుడైన తన తండ్రి చదువుకు సంబంధించిన అంశాలతోపాటు ఆర్థిక స్వేచ్ఛ, పొదుపు, కుటుంబ బంధాలు, జీవన విధానం వంటి విషయాలపై విలువైన సూచనలు, సలహాలు అందించేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన మార్గదర్శకత్వం, నిరంతర ప్రోత్సాహమే గ్రూప్–1లో విజయానికి బాటలు వేశాయని తెలిపారు. ప్రస్తుతం తాను కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ‘నాన్న... మీ ప్రేమ, ప్రోత్సాహం, మార్గదర్శకత్వమే మా జీవితాలకు బలమైన పునాది. థాంక్యూ డాడీ... హ్యాపీ ఫాదర్స్ డే’ అని జసింత్ జోయల్ భావోద్వేగ సందేశాన్ని ‘సాక్షి’ తో పంచుకున్నారు.. -
రాజీ మార్గమే రాజమార్గం
ఆసిఫాబాద్అర్బన్: , రాజీ మార్గమే రాజమార్గమని డిస్ట్రిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ వీరయ్య పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని సూ చించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కక్షిదారులు, అడ్వకేట్లు, పోలీస్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు, అట వీ, లీగల్ కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు. 1,488 కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోగా, ఒప్పందం ద్వారా మొత్తం రూ.44,32,639 సమకూరినట్లు ఈ సందర్భంగా వీరయ్య పేర్కొన్నారు. -
‘సర్’పై అవగాహన కల్పించాలి
ఆసిఫాబాద్: ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ (సర్) ప్రాముఖ్యతపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించా లని కలెక్టర్ కె.హరిత సూచించారు. ఈ నెల 25నుంచి జూలై 24వరకు నిర్వహించనున్న ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమం నేపథ్యంలో శనివారం ఉదయం జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్ డేవిడ్, అధికారులతో కలిసి 2కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి అంబేడ్కర్ చౌక్, వివేకానంద చౌక్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 678పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బూత్ స్థాయి అధికారులు విధిగా ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓట రుగా నమోదు చేయడంతో పాటు మార్పులు, చే ర్పులు సక్రమంగా చేపట్టాలని తెలిపారు. బీఎల్వో యాప్ ద్వారా వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, ఓటరు సవరణ కార్యక్రమం బాధ్యతాయుతమైన కార్యక్రమంగా భావించి విజయవంతం చేయాలని సూచించారు. తహసీల్దార్ రియాజ్అలీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అధికారులకు అవగాహనకెరమెరి: మండలంలోని కెస్లాగూడ రైతువేదికలో ఎన్యుమరేషన్, బీఎల్వో యాప్లపై బూత్ స్థాయి అధికారులు, ఏజెంట్లు, సూపర్వైజర్లకు కలెక్టర్ హరిత అవగాహన కల్పించారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూ చించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులకు కిట్లు అందజేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించారు. వార్డులు, వైద్యులు, సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన సేవలందించాలని, సమయపాలన పాటించాలని సూచించారు. తహసీల్దార్ నాగార్జు న, వైద్యాధికారి రియాన్ తదితరులున్నారు. -
ఆ క్షణం కళ్లల్లో ఆనందం చూశాను..
నాన్న.. జీవితాన్ని సరైన దారిలో నడిపించే మార్గదర్శి. అపజయాలు ఎదురైనా ధైర్యం చెప్పి విజయాన్ని అందించే దిక్సూచి. ఎన్ని కష్టాలు ఎదురైనా పిల్లల విజయాలే తనవిగా భావించి సంతోషిస్తాడు. బిడ్డల ఎదుగుదలలో తన కష్టాలను మెట్లుగా మలిచి ఉన్నత స్థానాలకు చేర్చి ఆనందిస్తాడు. తన భుజాలపై ఎక్కించుకుని లోకాన్ని చూపించే నాన్నకు వందనం. నేడు ఫాదర్స్ డే సందర్భంగా.. తండ్రి ప్రోత్సాహంతో ఉన్నతస్థానాలకు చేరిన వారిపై ప్రత్యేక కథనం.బెల్లంపల్లి: ‘నాన్న ప్రేమ ఎల్లలు లేనిది.. దేనితోనూ వెలకట్టలేనిది. చిన్నతనం నుంచి మొదలుకుని ఐఏఎస్ పాసయ్యే వరకు నాన్నతో నా జర్నీ ఫ్రెండ్స్లా సాగింది. నా చిన్నతనంలో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులూ నాన్న నా బెడ్ పక్కనే ఉండి సపర్యలు చేయడం నేనెప్పటికీ మర్చిపోలేను..’ అంటూ బెల్లంపల్లి సబ్ కలెక్టర్ ఐఈఎస్ఎస్డీ. మనోజ్ గుర్తు చేసుకున్నారు. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా ఆయన తన తండ్రి ఇనుకొండ వెంకటేశ్వరరావుతో ఉన్న అనుబంధాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. మా స్వస్థలం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అనంతారం గ్రామం. నాన్న ఇనుకొండ వెంకటేశ్వరరావు(రిటైర్డు పోలీసు అధికారి), అమ్మ గంగభవానీ, అక్క లక్ష్మీమౌనిక. -
మెనూ పాటించకుంటే చర్యలు
రెబ్బెన: ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా మెనూ పాటించాలని, లేని పక్షంలో ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని డీఈవో సచ్చిదానంద చారి అన్నారు. మండలంలోని వంకులం ప్రాథమికోన్నత పాఠశాలను శుక్రవారం తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులు, మధ్యా హ్న భోజనాన్ని పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. ప్రతీ పాఠశాలలో మధ్యా హ్న భోజనాలకు సంబంధించిన మెనూ ప్రదర్శించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ వేయాలన్నారు. మండలాల వారీగా ఎఫ్ఆర్ఎస్పై రివ్యూ చేసి గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ అబ్దుల్ లతీఫ్, ఎంఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
మున్సిపల్ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి
కాగజ్నగర్టౌన్: మున్సిపల్ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ అన్నారు. కాగజ్నగర్ మున్సి పాలిటీ పరిధిలో శుక్రవారం పర్యటించారు. మున్సి పల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, పన్ను వసూళ్లు, ప్రజాసేవల అమలు తీరును సమీక్షించా రు. అనంతరం మున్సిపల్ కమిషనర్ తిరుపతి, చైర్పర్సన్ షాహిన్ సుల్తానా, వార్డు కౌన్సిలర్లతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ప్రజ లకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు సమన్వయంతో పని చేయాలన్నారు. అలాగే ఎల్లగౌడ్తోటలోని చిల్డ్రన్స్ పార్క్ను సందర్శించా రు. పరిశుభ్రత, పచ్చదనం, ప్రజలకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. తొలిసారిగా వచ్చిన అదనపు కలెక్టర్ను అధికారులు, మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో డీఈ రమాదేవి, శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్, పర్యావరణ ఇంజినీర్ డి.ప్రణీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
టవర్ల నిర్మాణంతో టెలికాం సేవలు మెరుగు
ఆసిఫాబాద్: సెల్ టవర్ల నిర్మాణంతో టెలికాం సేవలు మెరుగుపడతాయని, నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శుక్రవారం అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ పనులు పూర్తి చేయాలని టెలికాం సంస్థల ప్రతినిధులకు సూచించారు. సంక్షేమ పథకాల అమల్లో డిజిటల్ సేవలు కీలకప్రాత పోషిస్తున్నందున టెలికాం సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. జిల్లాలో సెల్ టవర్ల నిర్మాణం, ఫైబర్ నెట్వర్క్ విస్తరణ పనుల పురోగతిని సమీక్షించారు. భూ సమస్యలు, అనుమతులు తదితర అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో ఏడీ ల్యాండ్ సర్వే రికార్డ్స్ వినయ్, బీఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. భూముల సర్వే వేగవంతం చేయాలిఆసిఫాబాద్: జిల్లాలో భూముల సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ హరిత అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో భూముల సర్వే పురోగతిపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నకలు లేని గిరిజన భూములు, సాదాబైనామా దరఖాస్తులు, భూ సంబంధిత పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. సాదాబైనామా దరఖాస్తులను నెలాఖరులోగా పరిశీలించి పరిష్కారం చూపాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన భూ సంబంధిత దరఖాస్తులు పరిశీలించి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్వే ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డిప్యూటీ ఇన్స్పెక్టర్లు, మండల సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
బీజేపీ భరోసా ఉద్రిక్తం
శ్రీరాంపూర్: బీజేపీ సింగరేణి భరోసా యాత్ర ఉద్రిక్తంగా మారింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, పలువురు నేతల బృందం శుక్రవారం శ్రీరాంపూర్ ఓపెన్కాస్టు గని సందర్శనకు బయల్దేరింది. పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు కే.వెంకటరమణారెడ్డి, పైడి రాకేష్రెడ్డి, పాల్వాయి హరీష్బాబు, రామారావుపటేల్, ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్రావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు మధ్యాహ్నం శ్రీరాంపూర్ బస్టాండ్కు చేరుకున్నారు. కార్మికుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి కాన్వాయ్గా శ్రీరాంపూర్ ఓపెన్కాస్టుకు బయల్దేరారు. అప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున చెక్పోస్టు వద్ద బారికేడ్లు పెట్టి రోడ్డు మూసివేశారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది వాహనాలు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. తాము ఎమ్మెల్యేమని, ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఓసీపీ సందర్శనకు అనుమతి లేదని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యేలు జీఎం, ఇతర అధికారులకు ఫోన్ చేసినా స్పందించలేదు. నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోపలికి వెళ్లేందుకు బారికేడ్లు తోయగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఎమ్మెల్యేలను బలవంతంగా పోలీసు, ఎమ్మెల్యేల వాహనాల్లో కూర్చోబెట్టి స్టేషన్కు తరలించే ప్రయత్నం చేశారు. దీంతో కార్యకర్తలు వాహనాలను అడ్డంగించారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. అనంతరం అక్కడి నుంచి ఎస్సార్పీ 3 గని సందర్శనకు వెళ్లగా అక్కడా అడ్డుకున్నారు. దీంతో నేతలు స్థానిక పీవీఆర్ గార్డెన్కు చేరుకుని మీడియాతో మాట్లాడారు. పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండించారు. రేవంత్ సర్కార్ ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. చివరికి గనుల సందర్శన లేకుండా నేతలు వెనుదిరగాల్సి వచ్చింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్గౌడ్, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, పెద్దపల్లి నియోజకవర్గం ఇన్చార్జీ గోమాస శ్రీనివాస్, మంచిర్యాల కార్పొరేషన్ ఫ్లోర్లీడర్ ముకేశ్గౌడ్, నాయకులు కందుల సంధ్యారాణి, దుర్గం అశోక్, ఎనగందుల కృష్ణమూర్తి, బీఎంఎస్ ఉపాధ్యక్షుడు నాతాడి శ్రీధర్రెడ్డి, బీజేపీ నేతలు నాగేశ్వర్రావు, రమేశ్, కుర్రె చక్రి, కిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
టేలాలు తొలగించేనా..?
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని అక్రమంగా ఏర్పాటు చేసిన టేలాల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ అంజయ్య టేలాలు తొలగించాలని యజమానులకు నోటీసులు జారీ చేశారు. జిల్లా ఆస్పత్రి ప్రహరీని ఆనుకుని డ్రెయినేజీపై నిబంధనలకు విరుద్ధంగా టేలాలు ఏర్పాటు చేశారు. తద్వారా డ్రెయినేజీలో చెత్తాచెదారం పేరుకుపోయి నీరంతా రోడ్డుపైకి చేరుతోంది. కొన్ని నెలలుగా సమస్య ఉన్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆస్పత్రి అధికారులు కలెక్టర్ హరిత దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల కలెక్టర్ డ్రెయినేజీపై ఏర్పాటు చేసిన టేలాలను పరిశీలించారు. వెంటనే వాటిని తొలగించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ఈ క్రమంలో కమిషనర్ వారం రోజుల్లోగా టేలాలు తొలగించాలని సంబంధిత యజమానులకు నోటీసులు జారీ చేశారు. యజమానులు వారి టేలాల పరిధిలోని డ్రెయినేజీ నుంచి చెత్త తొలగించారు. అయితే పూర్తిస్థాయిలో టేలాల తొలగింపు జరుగుతుందో లేదో వేచిచూడాలి. జిల్లా కేంద్రంలో 135కు పైగా టేలాలుఆస్పత్రి ప్రహరీ, జేబీఎస్, ఉర్దూ పాఠశాల, ఆర్టీసీ డిపో ప్రహరీలకు ఆనుకుని సుమారు 135 టేలాలు ఏర్పాటు చేశారు. గతంలో గ్రామ పంచాయతీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో ఈ దందా విచ్చలవిడిగా సాగింది. కొంతమంది టేలాల యజమానులు మున్సిపాలిటీకి మామూలు అద్దె చెల్లిస్తూ రూ.వేలకు ఇతరులకు అద్దెకు ఇచ్చుకున్నారు. మరికొంత మంది రెండు నుంచి మూడు టేలాల వేసుకుని అద్దెకిచ్చినట్లు తెలుస్తోంది. అధికారులు విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. వారం రోజుల్లోగా టేలాలు తొలగించాలని మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేయడం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. -
ఎఫెక్ట్
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లుకెరమెరి: గుడిసెల్లో నివాసం ఉంటూ కష్టాలతో కాలం వెల్ల దీస్తున్న కెరమెరి మండలం చిన్నుగూడ గ్రామస్తులకు ఎట్ట కేలకు ఊరట దక్కింది. శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘సమస్యల వలయంలో చిన్నుగూడ’ కథనానికి కలెక్టర్ కె.హరిత స్పందించారు. హౌసింగ్ డీఈతో సర్వే చేయించి అర్హులైన వారందరికీ ఇందిర మ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, రూ.20లక్షలతో బీటీ రోడ్డు నిర్మిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు డీఆర్డీవో దత్తారావు ‘సాక్షి’కి తెలి పారు. శుక్రవారం ఉదయమే ఎంపీడీవో అంజద్పాషా గ్రామానికి వెళ్లి స్థానికులతో సమావేశమయ్యారు. ఇళ్ల ఎదుట మిషన్ భగీరథ పైప్లైన్ పగిలి నీరు నిలువకుండా మరమ్మతులు చేయిస్తామన్నారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి హరీశ్ ఉన్నారు. -
కుమురం భీం
7పోటెత్తిన భక్తులు సరస్వతీ అమ్మవారి ఆలయానికి శుక్రవారం భక్తులు భారీగా తరలివచ్చారు. స్కూళ్లు ప్రారంభమైన నేపథ్యంలో తల్లిదండ్రులు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. నకిలీ సేవకులు..! జీజీబీ, సీడబ్ల్యూసీ నియామకాల దరఖాస్తుల్లో నకిలీ ధ్రువపత్రాలు కలకలం రేపుతున్నాయి. కొందరు తప్పుడు అనుభవ పత్రాలు జతచేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.శనివారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2026 -
నీట్ కేంద్రం వద్ద నిషేధాజ్ఞలు అమలు
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలో ఈ నెల 21న నీట్ నిర్వహించే జన్కాపూర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల, కళాశాల(జిల్లా అటవీశాఖ కా ర్యాలయం) వద్ద నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని ఎస్పీ నితిక పంత్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష నిర్వహణ సక్రమంగా కొనసాగేందుకు 163 బీఎన్ఎస్ఎస్(144 సెక్షన్) అమలు చేస్తామన్నారు. పరీక్షకు ఎలాంటి ఆటంకం లేకుండా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యార్థులను కేంద్రంలోకి అనుమతిస్తారని, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రం పరిసరాల్లో వ్యక్తులు గుంపులుగా ఉండొద్దని, సభలు సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. 500 మీటర్ల పరిధిలోని అన్ని జిరాక్స్ సెంటర్లు ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మూసి ఉంచాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్ష కేంద్రం తనిఖీఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసే నీట్ కేంద్రాన్ని శుక్రవారం ఎస్పీ నితిక పంత్ తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు, భద్రత చర్యలు, సీసీ కెమెరాల పనితీరు గురించి తెలుసుకున్నారు. డీఎస్పీ అశోక్, సీఐ బాలాజీ వర ప్రసాద్, ప్రిన్సిపాల్ రహీం తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ తొలిమెట్టు..!
కెరమెరి: ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపునకు మరోమారు ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసి(తొలిమెట్టు) కార్యక్రమాన్ని జూలై 1 నుంచి నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. జాతీయ విద్యావిధానం లక్ష్యాలకు అనుగుణంగా నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోంది. దీంతో ఈ ఏడాది గిరిజన ప్రాథమిక పాఠశాలల్లోనూ అమలు చేయాలని నిర్ణయించారు. 2026– 27 విద్యా సంవత్సరంలో కార్యక్రమం నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. విద్యార్థుల్లో మౌలిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం పెంపొందించడమే దీని ముఖ్య ఉద్దేశం. గత విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలల విద్యార్థులకు ఏఐ(అర్టిఫీషియల్ ఇంటలిజెన్స్) ద్వారా బోధన ప్రారంభించారు. 2026– 27 విద్యా సంవత్సరంలో ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయనున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్, గణితం అంశాల్లో సామర్థ్యాలు పెంచేందుకు కృషి చేయనున్నారు. షెడ్యూల్ విడుదల.. అమలు ఇలా..జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలు మొత్తం 660 ఉండగా, గిరిజన ప్రాథమిక పాఠశాలలు 334 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో సుమారు 39,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తొలిమెట్టు కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. జూలై 1 నుంచి 10 మధ్యలో బేస్లైన్ పరీక్ష, నవంబర్ 20 నుంచి 30 మధ్యలో మిడిల్ లైన్ పరీక్ష, 2027 మార్చి 7 నుంచి 17 వరకు ఎండ్ లైన్ పరీక్షలను పూర్తి చేయాల్సి ఉంటుంది. బేస్లైన్ పరీక్షల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా విద్యార్థుల అభ్యసన ప్రగతిని ఉపాధ్యాయులు పర్యవేక్షించాలి. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల ఆధారంగా మూడు బృందాలుగా ఏర్పాటు చేసి వారి స్థాయిని పెంచేలా చర్యలు తీసుకోవాలి. వర్క్బుక్లోని ప్రాక్టీస్ షీట్ల ఆధారంగా అభ్యసన ప్రగతిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 1 నుంచి 5 తరగతి వరకు విద్యార్థులకు చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలను మెరుగుపరుచుకునేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నారు. కథలు, ఆటలు, పాటలు, వివిధ కృత్యాల ఆధారంగా బోధనను మరింత ఆసక్తికరంగా మార్చనున్నారు. అభ్యసన సామర్థ్యాలను అంచనా వేస్తూ నిరంతర మూల్యాంకనం చేపట్టనున్నారు. అందరికీ చదవడం, రాయడం, గణిత నైపుణ్యాల్లో నిర్దేశిత స్థాయిని సాధించేలా చర్యలు తీసుకోనున్నారు. దీనిపై ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు గతంలోనే శిక్షణ ఇవ్వగా, వేసవి సెలవులకు ముందు గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులకు సైతం శిక్షణ అందించారు.ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు 100ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలు 560గిరిజన ప్రాథమిక పాఠశాలలు 334జిల్లా వివరాలువారంలో మూడు రోజులు తనిఖీలుఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు పకడ్బందీగా పర్యవేక్షణ చేపట్టనున్నారు. మండల విద్యాధికారులు వారంలో మూడు రోజులు ఐదారు పాఠశాలలను పరిశీలించాలి. ఎఫ్ఎల్ఎన్ ఎలా అమలవుతుందో ప్రత్యేకంగా పర్యవేక్షించాలి. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వారానికి నాలుగైదు పాఠశాలలను సందర్శించాలి. వీరితోపాటు డీఈవో, సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు, రాష్ట్రస్థాయి అధికారులు తనిఖీలు చేసి తొలిమెట్టు కార్యక్రమం అమలు తీరును తెలుసుకోవాల్సి ఉంటుంది. -
యాసంగి ‘భరోసా’ ఏమాయే..!
రెబ్బెన: వానాకాలం సాగు పనులు ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్నాయి. అయినా యాసంగి పెట్టుబడి సాయం మాత్రం పూర్తిగా అందలేదు. కేవలం రెండు దఫాల్లో రెండెకరాల వరకు మాత్రమే ఖాతాల్లో జమ చేసింది. మరోవైపు ప్రభుత్వం ఈ నెల 30 నుంచి వానాకాలం సీజన్ డబ్బులు అందిస్తామని ప్రకటించింది. దీంతో యాసంగి సాయంపై ఆశలు వదులుకోవాల్సిందేనా అని అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. రైతుభరోసా పథకం కింద ఎకరానికి సీజన్కు రూ.6వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ.12వేలు అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ గడిచిన యాసంగి సీజన్లో రెండు దఫాల్లో రూ.6వేల చొప్పున మొత్తం రూ.12వేలు మాత్రమే అందింది. జిల్లాలో 1,44,511 మంది రైతులు ఉండగా పెట్టుబడి సాయం కింద రూ.92.027 కోట్లు చెల్లించాలి. 1,35,520 మంది రైతులు మాత్రమే బ్యాంకు ఖాతాలు అందించగా ఏఈవోలు విచారణ చేపట్టి వారిలో నుంచి 1,32,854 మంది వివరాలను ట్రెజరీకి పంపించారు. ప్రభుత్వం గత యాసంగి సీజన్లో 1,32,475 మంది రైతుల ఖాతాల్లో రూ.73,84,63,218 నగదు జమ చేసింది. వ్యవసాయానికి యోగ్యమైన భూములకు మాత్రమే పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించగా, ఎలాంటి భూపరిమితిని విధించలేదు. సాగుకు యోగ్యంగా ఎన్ని ఎకరాలు ఉన్నా పెట్టుబడి సాయం అందించాలి. సీజన్ చివరి వరకు ఎదురు చూసినా నిరాశే మిగిలింది. ప్రస్తుతం వానాకాలం ప్రారంభం కావడంతో డబ్బులు ఎప్పుడు వస్తాయోనని మదనపడుతున్నారు. వానాకాలం సాగు షురూతొలకరి వర్షాలు పడటంతో జిల్లా రైతులు సాగు పనులు ప్రారంభించారు. గతేడాది మాదిరిగానే ఈసారి సైతం జిల్లాలో సుమారు 4.5 లక్షల ఎకరాల వరకు వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. 90శాతం మంది రైతులు పత్తిసాగుకు దుక్కిదున్ని సిద్ధం చేశారు. రుతుపవనాలు రాక కాస్త ఆలస్యమవుతుండగా, అయినా కొందరు విత్తనాలు విత్తుతున్నారు. ఈ సమయంలో రైతుభరోసా నగదు అందిస్తే ఉపయోగకరంగా మారనుంది. విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు ఉపయోగపడేది.వానాకాలం సాయానికి డేట్ ఫిక్స్?వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్కు సంబంధించిన రైతుభరోసా నిధుల విడుదలకు కసరత్తు చేస్తోంది. అనధికారిక సమాచారం ప్రకారం ఈ నెల 30న నగదు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర మంత్రులతో సీఎం నిర్వహించిన సమావేశంలో దీనిపై చర్చించినట్లు సమాచారం. త్వరలో ఖమ్మం జిల్లాలో నిర్వహించే బహిరంగ సభలో వానాకాలం రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని సీఎం విడుదల చేసే అవకాశం ఉంది. ఈ విషయం రైతులకు కాస్త సంతోషాన్ని కలిగించే అంశమే అయినా యాసంగికి సంబంధించిన పెట్టుబడి సాయం ఇక లేనట్టేనా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
కౌటాల: ప్రతిరోజూ యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని యోగా ఇన్స్ట్రక్టర్ దాసరి వినోద్గౌడ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో బుధవారం కౌటాల పంచాయతీ కార్యాలయంలో యోగాపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ యోగాతో మానసిక ప్రశాంతత ఉంటుందన్నారు. దైనందిన కార్యక్రమాల్లో భాగం చేసుకోవాలని సూచించారు. యోగాతో జాప్ఞకశక్తి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ డబ్బా గోపాల్, కార్యదర్శి కై లాస్, యోగా శిక్షకురాలు రోజా, నాయకులు తిరుపతి, ప్రభాకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పోస్టర్ ఆవిష్కరణ
ఆసిఫాబాద్అర్బన్: పర్యావరణ పరిరక్షణ ప్రా ధాన్యతను విద్యార్థులకు తెలియజేయడం, వారిలో బాధ్యతను పెంపొందించడమే లక్ష్యంగా తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏక్ పేడ్ మాకే నామ్– నేషనల్ స్టూడెంట్ పర్యావరణ కాంపిటేషన్– 2026 పోస్టర్ను బుధవారం జిల్లా కేంద్రంలో డీఈవో సచ్చిదానంద చారి ఆవి ష్కరించారు. ఆయన మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి తన తల్లి పేరుతో కనీసం ఒక మొక్క నాటి సంరక్షణ బాధ్యతలు స్వీకరించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో ప్లానింగ్ కోఆర్డినేటర్ లతీఫ్, క్వాలిటీ కోఆర్డి నేటర్ శ్రీనివాస్, ఐఈ సీఎంవో కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఎంఈవోలు ఆడే ప్రకాశ్, జయరాజ్, నానాజీ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాప్రభుత్వంలో సొంతింటి కల సాకారం
రెబ్బెన: ప్రజాప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారమవుతుందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. మండలంలోని గోలేటి గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు, నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీర శ్యాంనాయక్తో కలిసి హాజరయ్యారు. పూజా కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుకు నూతన వస్త్రాలు అందించారు. డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు కాలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల్ల మంగ, జిల్లా అధికార ప్రతినిధి దుర్గం రవీందర్, ఇన్చార్జి మండల అధ్యక్షుడు కిషన్గౌడ్, ఉప సర్పంచ్ దుర్గం తిరుపతి, నాయకులు బలరాం నాయక్, ఎర్రం తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు సకాలంలో అందిస్తేనే..
ఆసిఫాబాద్: జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఖరారైంది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో కలిసి నిర్వహించిన సమావేశంలో 2026– 27 సంవత్సరానికి రూ.3,546.79 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని కలెక్టర్ కె.హరిత నిర్ణయించారు. జిల్లాలో వివిధ రకాల బ్యాంకులు మొత్తం 56 ఉన్నాయి. వీటిలో 39 గ్రామీణ ప్రాంతా లు, 17 సెమీ అర్బన్ ప్రాంతాల్లో బ్రాంచీల ద్వారా రుణాలు అందిస్తున్నాయి. గతేడాది మాదిరిగానే ఈసారి వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత కల్పించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,233.47 కోట్ల రుణ లక్ష్యం కాగా, వీటిలో రూ.1,680.67కోట్ల పంట రుణాలు, రూ.359.63 కోట్ల వ్యవసాయ టర్మ్, ఇతర రుణాలు కేటాయించినా బ్యాంకర్లు పంపిణీ లక్ష్యాన్ని చేరలేదు. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు బ్యాంకు నిబంధనలతో రుణాల పంపిణీ ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా ప్రజల్లో సరైన అవగాహన లేక పోవడం, బ్యాంకర్లు కూడా క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో లక్ష్యాన్ని చేరడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 9.69 శాతం అదనం 2025– 26 ఆర్థిక సంవత్సరంలో పోల్చితే ఈసారి రుణ ప్రణాళికలో 9.69 శాతం అదనంగా నిధులు కేటాయించారు. గతేడాది రూ.3,233.47 కోట్లు కేటాయించగా ఈసారి రూ.3,546.79కోట్లు కేటాయించారు. గతేడాది 6,294 స్వయం సహాయక సంఘాలకు రూ.232.43 కోట్లు అందజేయాల్సి ఉండగా, 2,609 సంఘాలకు 157.94 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. ఈసారి 8,163 స్వయం సహాయక సంఘాలకు రూ.239.77 కోట్లు చెల్లించాలని లక్ష్యం నిర్దేశించుకోగా, ఇప్పటివరకు రూ14.69 కోట్లు(2.68 శాతం) అందజేశారు. బ్యాంకర్ల పనితీరుపై కలెక్టర్ కె.హరిత సమీక్ష సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశా రు. పీఎం ముద్ర లోన్ కింద 9,833 మందికి రూ.87.49 కోట్లు అందజేశారు. వీటిలో రూ. 50 వేల లోపు రుణాలు 5,353 మందికి రూ.11.73 కోట్లు, రూ.5 లక్షల లోపు రుణాలు 3,910 మందికి రూ.34.64 కోట్లు, రూ.10 లక్షల లోపు రుణాలు 461 మందికి రూ.27.67 కోట్లు, రూ.20 లక్షల లోపు రుణాలు 109 మందికి రూ.13.45 కోట్లు అందించారు. సెక్టా ర్ టార్గెట్ అచీవ్మెంట్ కింద ఎడ్యుకేషన్ రుణాలు 38.4 కోట్లు లక్ష్యం కాగా, కేవలం రూ.1.6 కోట్లు(4.1 శాతం) మాత్రమే అందజేశారు. హౌజింగ్ రు ణాలు రూ.78 కోట్లు లక్ష్యం కాగా, కేవలం 8.5 కో ట్లు(10.9 శాతం) అందజేయడం గమనార్హం. రైతులతోపాటు మహిళా సంఘాలు, అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు ఆశించిన పురోగతి చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్న పరిశ్రమల ఏర్పాటుకు అవసరము న్న రుణాలు ఇస్తేనే లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది. లక్ష్యం పూర్తి చేసేందుకు కృషిజిల్లాలో వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తాం. పాత వారికి తిరిగి కొత్త రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటాం. రైతులకు ఇబ్బంది లేకుండా రుణాలు పంపిణీ చేస్తాం. అవసరమైన పత్రాలతో తమ పరిధిలోని బ్యాంకులను సంప్రదించాలి. – రాజేశ్వర్ జోషి, లీడ్ బ్యాంక్ మేనేజర్జిల్లాలో 1.45 లక్షల మంది పట్టా పాస్పుస్తకాలు కలిగిన రైతులు ఉండగా, మరో 10 వేల మందికి పైగా కౌలు రైతులు ఉన్నారు. 2026– 27 సంవత్సరానికి ఖరీఫ్ సీజన్లో 4.52 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. 3.70 లక్షల ఎకరాల్లో పత్తి, 47 వేల ఎకరాల్లో వరి, 21 వేల ఎకరాల కంది, 7.5 వేల ఎకరాల్లో మక్క, 5,700 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయనున్నారు. వానాకాలం ప్రారంభం కావడంతో ఇప్పటికే రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో పంట రుణాలు సకా లంలో అందించాల్సిన అవసరం ఉంది. -
గత పాలకుల నిర్లక్ష్యంతో కుంటుపడిన అభివృద్ధి
దహెగాం: గత పాలకుల నిర్లక్ష్యంతోనే నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద బుధవారం ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పెంచికల్పేట్, దహెగాం మధ్యలో పెద్దవాగు వద్ద వంతెన, అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పనులు పూర్తయితే రెండు మండలాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాపర్తి జయలక్ష్మి, సహకార సంఘం చైర్మన్ తిరుపతిగౌడ్, వైస్ చైర్మన్ ధనుంజయ్, తహసీల్దార్ మునవార్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందించాలి కాగజ్నగర్టౌన్/పెంచికల్పేట్: అర్హులకు సంక్షేమ పథకాలు అందించాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. పెంచికల్పేట్ మండల కేంద్రంలోని రైతువేదికలో బుధవారం 40 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో సంతోష్రెడ్డి, సర్పంచులు రాంచందర్, రవీందర్, ఉస్మాన్, రాజేశ్వరి, కృష్ణవేణి పాల్గొన్నారు. -
అభ్యర్థులకు ప్రయాణ పరీక్ష
కాగజ్నగర్టౌన్: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్– 2026కు హాజరయ్యే జిల్లా అభ్యర్థులపై అదనపు భారం పడుతోంది. జిల్లాకు దూరంగా కేంద్రాలు కేటాయించడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 16 నుంచి 22వ తేదీ వరకు టెట్ జరుగనుంది. ఈ పరీక్షలు సీబీటీ విధానంలో కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు నిర్వహిస్తున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి సుమారు నాలుగు వేల మంది ఈ పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులకు వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్ వంటి దూర ప్రాంతాల్లో పరీక్ష సెంటర్లు కేటాయించారు. చాలామంది ఒక్కరోజు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలోనే నిర్వహించాలిఏటా టెట్ రాయాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఆన్లైన్ ఫీజు రూ.వెయ్యి, ప్రయాణ ఖర్చులు మరో రూ.వెయ్యి.. ఇలా అన్ని ఖర్చులు భరించుకోవాలి. ఉద్యోగం లేకనే పోటీ పరీక్షలకు హాజరవుతున్నాం. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు జిల్లాలోనే పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలి. – విద్యాసాగర్, కాగజ్నగర్ ప్రయాణాలతో ఇబ్బందివరంగల్, హైదరాబాద్ పట్టణాల్లో కేంద్రాలు కేటాయిస్తే ఇక్కడి నుంచి వెళ్లడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఉదయాన్నే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్కు వెళ్లాలి. లేదంటే ఒక్క రోజు ముందుగా ఆయా పట్టణాలకు చేరుకోవాలి. అక్కడ బంధువులు ఉంటే వారి ఇళ్లలో ఉండాలి. – సంధ్య, కాగజ్నగర్ -
అక్షరమే జీవితానికి అండ
కెరమెరి: అక్షరమే జీవితానికి అండగా నిలుస్తుంద ని, తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. కెరమెరి మండలం గోయగాం ప్రాథమిక పాఠశాలలో బుధవారం అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మా ట్, డీఈవో సచ్చిదానంద చారితో కలిసి చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. గ్రామస్తులందరూ కలిసి పాఠశాలను అభివృద్ధి చేసుకోవడంపై అభినందించారు. తన వంతుగా రూ.5వేలు విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు చైతన్యమైతేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తాగునీటి సమస్యల పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఇటీవల చుక్కా రామయ్య పాఠశాలలో సీట్లు సాధించిన పది మంది విద్యార్థులను సన్మానించారు. క్వాలిటీ కోఆర్డినేటర్ ఉప్పులేటి శ్రీనివాస్, ఎస్వో శ్రీనివాస్, ఎంఈవో ఆడే ప్రకాశ్, హెచ్ఎంలు మహేశ్వర్, కడేర్ల రంగయ్య, సర్పంచ్ ఆనంద్రావు తదితరులు పాల్గొన్నారు. విస్తృత ప్రచారం చేయాలి ఆసిఫాబాద్: జిల్లాలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణపై జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు నిర్వహించే కార్యక్రమాలపై దినపత్రికలు, ప్రసార సాధనాలతో ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీపీఆర్వో సంపత్ కుమార్, జిల్లా మీడియా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.ప్రతిఒక్కరూ బీమా చేసుకోవాలిఆసిఫాబాద్: జిల్లాలో అర్హులైన ప్రతిఒక్కరూ బీమా చేసుకోవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బీమాదారుల కుటుంబాలకు బుధవారం చెక్కులు పంపిణీ చేశారు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ మంచిర్యాల బ్రాంచ్లో పీఎం జీవన్జ్యోతి బీమా యోజన చేయించుకున్న బెజ్జూర్ మండలం మొగవెల్లి గ్రామానికి చెందిన సీహెచ్ లక్ష్మి మృతి చెందగా కుటుంబ సభ్యురాలు పెంటుబాయికి రూ.2 లక్షల చెక్కు అందజేశారు, రాయల్ సుందరం పథకంలో రూ.565 ప్రీమియం చెల్లించి బీమా చేసుకున్న అదే గ్రామానికి చెందిన కనక కమల పాముకాటుతో మృతి చెందగా, ఆమె కుమారుడు సుధాకర్కు రూ.10 లక్షల బీమా చెక్కు అందించారు. కార్యక్రమంలో తపాలాశాఖ సీనియర్ మేనేజర్ కొట్టే శ్రీనివాస్, మేనేజర్ సాగర్, రాయల్ సుందరం కంపెనీ రీజినల్ మేనేజర్ ధన్రాజ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
దంచికొడుతున్న ‘మృగశిర’ ఎండలు
కౌటాల: వర్షాకాలం సీజన్ ప్రారంభమై 15 రోజులు గడిచింది. అయినా మృగశిర కార్తెలో ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి మాదిరిగానే పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచే వేడి, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. బుధవారం దహెగాం మండలం కుంచవెల్లిలో అత్యధికంగా 43.3 డిగ్రీల సెల్సియస్గా పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా, బెజ్జూర్ 43.3, సిర్పూర్(టి) 43.2, తిర్యాణి 43.0, గోలేటి 42.7, రెబ్బెన 42.6, వాంకిడిలో 42.2 డిగ్రీలు నమోదైంది. జిల్లాలోని 15 మండలాలు అలర్ట్ జోన్లో ఉన్నాయి. ఎండలకు విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండగా, వానలు లేక సాగు పనులు జోరందుకోవడం లేదు. భారీ వర్షాల కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. -
దేవుడ్పల్లి.. ‘పోడు’ లొల్లి..!
కెరమెరి మండలం సుర్దాపూర్ గ్రామానికి చెందిన రైతు బామ్నె రాము 40 ఏళుగా సాగు చేస్తున్నాడు. ఆయనకు అటవీ ప్రాంతంలో వివాదాస్పద మూడెకరాల భూమి ఉంది. రెండు రోజుల క్రితం అటవీ అధికారులు సాగు పనులను అడ్డుకున్నారు. జీవనాధారమైన భూమిని లాక్కుంటే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కెరమెరి రేంజ్ పరిధిలో 70 మంది గిరిజనేతర రైతులందరిదీ ఇదే పరిస్థితి.. కెరమెరి: వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో జిల్లాలో సాగు భూముల లొల్లి మొదలైంది. అటవీశాఖ అధికారులు, పోడు రైతుల మధ్య ఘర్షణ కొనసాగుతోంది. అటవీ భూముల్లో ప్లాంటేషన్ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపడుతుండగా, ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని అన్నదాతలు మండిపడుతున్నారు. కెరమెరి అటవీ రేంజ్ పరిధిలోని గోయగాం సెక్షన్ దేవుడ్పల్లి బీట్లో 450 హెక్టర్ల విస్తీర్ణంలో అటవీ భూమి ఉంది. ఇందులో 70 శాతం సాగులోనే ఉంది. ఇందులో 100 హెక్టార్ల(సుమారు 250 ఎకరాలు)ను ఆధీనంలోకి తీసుకుని ప్లాంటేషన్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఈ భూమిపై ఆధారపడి కెరమెరి మండలం సుర్దాపూర్, ధనోరా, సావర్ఖేడా గ్రామాలకు చెందిన సమారు 70 మంది గిరిజనేతర రైతుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. టైగర్ కారిడార్ ప్రాంతంకెరమెరి మండలం దేవుడ్పల్లిలోని 67 కంపార్ట్మెంట్ అంతా టైగర్ కారిడార్ పరిధిలోకి వస్తుంది. గతేడాది పెద్దపులి సంచరించగా, చిరుత, ఇతర వన్యప్రాణుల కదలికలు కూడా ఉన్నాయి. తడోబా ప్రాంతానికి కనెక్టివిటీ ఉండటంతో పెద్దపులుల రాకపోకలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. 2016 లో కూడా రైతులు, అటవీ అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. విత్తనాలు వేసే సమయంలో సాగు పనులను అడ్డుకున్నారు. రైతులు అప్పటి అటవీ శాఖ మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఉన్నతాధికారులతో చర్చించి సమస్యను తాత్కాలికంగా పరిష్కరించారు. మళ్లీ ఇప్పుడు అధికారుల చర్యలతో వివాదం తెరపైకి వచ్చింది. భూములన్నీ రిజర్వ్ ఫారెస్టువే.. దేవుడ్పల్లి బీట్ పరిధిలో గిరిజనేతర రైతులు సాగు చేస్తున్న భూములన్నీ రిజర్వ్ ఫారెస్టుకు చెందినవి.. రైతులకు ఎలాంటి పట్టాలు లేవు. గిరిజనులై ఉండి, అటవీ హక్కు పట్టాలు ఉంటే సాగు చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడుతున్నాం. – మజారొద్దీన్, ఎఫ్ఆర్వో, కెరమెరి ప్రత్యామ్నాయం చూపాలి 25 ఏళ్లుగా ధనోరా సమీపంలో నాలుగెకరాల భూమి సాగు చేస్తున్నా. ఏటా వడ్డీలకు అప్పులు తెచ్చి పంట లు పండిస్తూ బతుకుతు న్నా. అధికారులు ఈ భూమిని లాక్కుంటే ప్రత్యామ్నాయంగా మరోచోట భూమి అందించి ఆదుకోవాలి. – షేక్ ఫరూక్, రైతు, ధనోరా ఇరువర్గాల మధ్య వాగ్వాదంస్థానిక ఎఫ్ఆర్వో మజారొద్దీన్ సిబ్బందితో కలిసి సోమవారం ధనోరా, సుర్దాపూర్ గ్రామాల మధ్య సాగు చేస్తున్న భూములోకి వెళ్లారు. రైతులు మూకుమ్మడి వచ్చి అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎంత నచ్చజెప్పినా రైతులు ససేమిరా అనడంతో అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. మళ్లీ మంగళవారం వెళ్లినా రైతులు అడ్డుకున్నారు. సాగు భూముల్లోకి వాహనంలో వెళ్లేందుకు ప్రయత్నించగా దారి మధ్యలో రాళ్లు వేశారు. ఓ దశలో సహనం కోల్పోయి రాళ్లదాడికి ప్రయత్నించగా, వాంకిడి సీఐ వేణుగోపాల్, కెరమెరి ఎస్సై సుధాకర్ ఘటనాస్థలికి చేరుకుని రైతులను సముదాయించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని జిల్లా అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. -
గనులపై కోల్వార్!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బొగ్గు గనులపై రాజకీయం వేడెక్కింది. కొద్ది రోజులుగా బొగ్గు గనులు కేంద్రంగా కార్మిక వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు నువ్వా? నేనా? అన్నట్లుగా పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రాజకీయ ప్రముఖులు పర్యటిస్తున్న క్రమంలో నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో మాటల యుద్ధం పెరుగుతోంది. రెండురోజులుగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘బాయి బాట’ పేరిట జిల్లాలోని బొగ్గు గనులను సందర్శిస్తున్నారు. కాసిపేట, శ్రీరాంపూర్తో పాటు స్థానిక కార్మికులను కలుస్తూ పలు సమస్యలు తెలుసుకుంటున్నారు. కార్మికుల వసతుల నుంచి సంస్థ విధానాలపై తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. కవిత హెచ్ఎంఎస్కు గౌరవాధ్యక్షురాలిగా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ‘బాయి బాట’తో కార్మిక లోకానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్పైనా విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో కవిత టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా పనిచేయగా, తాజాగా కొత్త రాజకీయ పార్టీతో ఇక్కడి నుంచే రాజకీయాలు చేస్తామని ప్రకటించారు. డిప్యూటీ సీఎం, మంత్రుల టూర్ఇటీవలే జిల్లాకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమా ర్కతో పాటు మంత్రులు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొ న్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్తో, సింగరే ణి ప్రాంత ఎమ్మెల్యేలు పర్యటించారు. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న సింగరేణి కార్మికుల వారసులకు సంస్థలో కారుణ్య నియామకాలు ఇచ్చారు. ఒకేరోజు జిల్లా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసి 335మందికి నియామక పత్రాలు ఇచ్చారు. డిప్యూటీ సీఎంతోపాటు మంత్రి శ్రీధర్బాబు, స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు నివాసంలోనే బస చేశారు. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్టుపై ఓపెన్ హౌస్ నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలపై బొగ్గు వెలికితీత నుంచి ఉత్పత్తి, రవాణా వరకు మీడియా సమక్షంలోనే అధికారులతో వివరించారు. రాజకీయ జోక్యం.. కార్మికుల బేజారుస్వతంత్ర ప్రతిపత్తి గల సింగరేణి కంపెనీలో మితి మీరిన రాజకీయ జోక్యం ఇప్పటికే సంస్థ పని తీరు పై ప్రతికూల ప్రభావం చూపుతోందనే విమర్శలు న్నాయి. కంపెనీలో కార్మికుడికి క్వార్టర్ కేటాయింపు నుంచి డిప్యుటేషన్, బదిలీ లాంటి చిన్న పనుల నుంచి మెడికల్బోర్డు ఏర్పాటు, నూతన నియామకాలు, టెండర్లు, సంస్థ లావాదేవీల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయాలు ప్రభావితం చేయడంతో కార్మిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక గత, ప్రస్తుత ప్రభుత్వాలు సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు విద్యుత్ సంస్థ నుంచే కాకుండా సర్కా రు నుంచి వచ్చే మొత్తాన్ని సకాలంలో చెల్లించకపోవడంతోనూ సంస్థ పరిస్థితి రోజురోజుకూ ఇబ్బంది గా మారింది. ఓ వైపు బొగ్గుకు తగ్గుతున్న డిమాండ్, భూగర్భ గనుల్లో నష్టాలు, ఓపెన్కాస్టుల్లో ప్రైవేట్ కాంట్రాక్టర్ల తీరుతో సంస్థకు ఇటీవల ఆశించిన తీరులో లాభాలు రావడం లేదు. ఇటీవల జిల్లా పర్యట నలో డిప్యూటీ సీఎం కూడా సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండబోదని ప్రకటించారు. స్వయం ప్రతిపత్తి సంస్థ హోదాను కాపాడుతామని హామీ ఇచ్చారు. అయితే, ఇప్పటికే కంపెనీలో కార్మికులకు మేలు చేస్తున్నామనే పేరుతో అన్ని రాజకీయ పార్టీలు సంస్థను ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏ మేరకు సంస్థ తన స్వతంత్రను నిలబెట్టుకుంటుందనేది కార్మిక వర్గాల్లో పెద్దప్రశ్నగా మిగిలింది.ఆరోపణలు, విమర్శనాస్త్రాలు సంస్థలో 40లక్షల టన్నుల బొగ్గు నిల్వలు మాయమయ్యాని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపణలు చేశారు. దీంతో కంపెనీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే దీనిపై సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. ఇక జైపూర్ థర్మల్ప్లాంట్లో 800 మెగావాట్ల యూనిట్ పనుల్లో అవినీతి జరిగిందని విమర్శించారు. ఈ రెండింటిపై కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్రెడ్డికి లేఖ రాయగా, ఆయన స్పందించారు. దీంతో జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు అధికార పార్టీకి చెందిన కోల్ బెల్ట్ పరిధి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ ఆరోపణల్ని తిప్పి కొట్టే ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా ఇటీవల టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంచిర్యాలకు వచ్చి మాజీ ఎమ్మెల్యేలు దివాకర్రావు, చిన్నయ్య, కార్మిక నాయకుడు రాజిరెడ్డి, ఇతర నాయకులతో కలిసి ప్రెస్మీట్ నిర్వహించి బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించకుండా జాప్యం చేస్తున్నారని, కార్మికులకు నష్టం చేస్తున్నారని ఆరోపించారు. -
‘సర్’పై బూత్స్థాయి అధికారులకు శిక్షణ
కాగజ్నగర్టౌన్: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ – 2026లో భాగంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించేందుకు మండలంలోని వంజీరి రైతువేదికలో మంగళవారం బూత్స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఓటరు జాబితాను పూర్తిస్థాయిలో పరిశీలించి ఎలాంటి పొరపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువత పేర్ల చేర్పు, మరణించిన వారి పేర్ల తొలగింపు, సవరణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఇంటింటి సర్వే నిర్వహించే సమయంలో పాటించాల్సిన నిబంధనలను వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు మల్లెపూల మధుకర్, రామ్మోహన్, బూత్స్థాయి అధికారులు, సూపర్వైజర్లు, బూత్ లెవల్ ఏజెంట్లు పాల్గొన్నారు. -
అర్హులందరికీ బ్యాంకు రుణాలు
ఆసిఫాబాద్: జిల్లాలో అర్హులందరికీ బ్యాంకు రుణాలు అందిస్తామని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం 2025– 26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక రుణాల ప్రగతిపై బ్యాంకు, ఇతర శాఖల అధికారులతో జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహంచారు. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ రాజేశ్వర్ జోషి హాజరయ్యారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 6,294 స్వయం సహాయక సంఘాలకు రూ.411 కోట్లు రుణ లక్ష్యం కాగా, 2,609 సంఘాలకు మాత్రమే రుణాలు అందించడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన సంఘాలకు వెంటనే రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. మహిళలు, వ్యాపారం చేసుకునే వారికి పీఎంఈజీపీ, పీఎం ఉపాధి కల్పన పథకం కింద చేతి వృత్తుల వారికి, అర్హులైన యువతకు రుణాలు అందించాలన్నారు. పరిశ్రమలు, డెయిరీలు, గొర్రెల పెంపకం, చేనేత, మత్స్య పరిశ్రమల స్థాపనతోపాటు వ్యవసాయ రంగం, విద్యారుణాలు, గృహ నిర్మాణ రుణాలు అందించి ప్రోత్సహించాలన్నారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు మాట్లాడుతూ నూతన రుణ ప్రణాళిక 2026–27 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకర్లు ధనికులు, వ్యాపారవేత్తలకే కాకుండా గ్రామీణ ప్రజలు, సామాన్యులకు రుణాలందించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ సందర్భంగా 2026– 27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,545.80 కోట్ల రుణ ప్రణాళికను ఆమోదించారు. ఇందులో అత్యధికంగా వ్యవసాయ రంగానికి రూ.2,642 కోట్లు కేటాయించారు. సమావేశంలో ఎల్డీఎం హరిప్రసాద్, ఏడీసీసీ బ్యాంకు డీజీఎం ఏ.భాస్కర్రెడ్డి, వివిధ బ్యాంకుల అధికారులు, మేనేజర్లు, సెక్టార్ అధికారులు, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు. -
జూన్ 1 నుంచి 15 వరకు వర్షపాతం(మి.మీ.)
మండలం కురవాల్సింది కురిసింది లోటు/అధికం శాతం గతేడాది వర్షం జైనూర్ 77.2 52.4 – 32 34.8 సిర్పూర్(యు) 69.1 93.7 +36 33.6 లింగాపూర్ 70.6 60.4 – 14 79.3 తిర్యాణి 66.9 58.9 –12 37.8 రెబ్బెన 56.4 38.1 –32 61.0 ఆసిఫాబాద్ 73.2 42.3 –42 69.4 కెరమెరి 52.1 99.7 +91 87.4 వాంకిడి 74.0 13.5 –82 155.3 కాగజ్నగర్ 64.0 13.1 –80 82.8 సిర్పూర్(టి) 66.8 47.6 –29 55.0 కౌటాల 72.9 42.6 –42 32.4 చింతలమానెపల్లి 74.8 12.7 –83 12.1 బెజ్జూర్ 84.3 14.1 –83 18.6 పెంచికల్పేట్ 74.6 39.1 –48 7.7 దహెగాం 82.9 25.7 –69 5.9 -
సాగు సాగక!
వాన లేక.. దహెగాం: మృగశిర కార్తె ప్రవేశించి పది రోజులు కావొస్తున్నా నేటికీ జిల్లాలో భారీ వర్షాలు కురవలేదు. రైతులు పత్తి విత్తనాలు విత్తుకోవడానికి చేలు దుక్కి దున్ని సిద్ధం చేసుకుంటున్నా కనీసం మట్టిపెల్లలు కరగకపోవడంతో సాగు పనులు ఆలస్యమవుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయా లేదా అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గతేడాది జూన్ 15 నాటికి 51.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈసారి ఇప్పటివరకు 70.7 మి.మీ.ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 43.5 మి.మీ. మాత్రమే కురిసింది. అంటే 38 శాతం లోటు ఉంది. సిర్పూర్(యు), కెరమెరి మండలాల్లో మాత్రమే అధిక వర్షపాతం నమోదు కాగా, మిగతా 13 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. 4.50 లక్షల ఎకరాల్లో సాగుజిల్లావ్యాప్తంగా వానాకాలం సీజన్లో 4.50 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో ప్రధానంగా 3.70 లక్షల ఎకరాల్లో పత్తి, 50 వేల ఎకరాల్లో వరి సాగు ఉండనుంది. మిగతా 30 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నాయి. గతేడాది ఖరీఫ్ ఆరంభంలో మోస్తరు వర్షాలు కురవడంతో జూన్ మొదటి వారంలోనే పత్తి విత్తనాలు విత్తుకున్నారు. వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ట్రాక్టర్తో కల్టివేటర్ కొడుతుండగా, వర్షాలు లేని ప్రాంతాల్లో దుక్కులు దున్నుతున్నారు. మరోవైపు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పనులు చేయలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. ప్రతిరోజూ మబ్బులతో గాలిదుమారం వీస్తోందే గానీ వర్షం మాత్రం పడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుణుడి కోసంగతేడాది మే చివరి వారం, జూన్ మొదటి వారంలో వర్షాలు కురిశాయి. కానీ ఈసారి మే నెలలో ఆశించి న స్థాయిలో వర్షాలు పడలేదు. చిరుజల్లులకే విత్తనాలు విత్తితే నష్టపోవాల్సి వస్తుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. గతంలో కూడా తొలకరి వర్షాలకే విత్తనాలు విత్తగా, వరుణుడు ముఖం చాటేయడంతో విత్తనాలు మాడిపోయి అన్నదాతలు నష్టాలను చవిచూశారు. ఒకటికి రెండుసార్లు విత్తనాలు వేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. భూమి 2 నుంచి 3 ఫీట్ల లోతు వరకు తడిసిన తర్వాతనే విత్తనాలు విత్తుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.ఈ ఫొటోలో ట్రాక్టర్ పక్కన నిలబడ్డ రైతు పేరు రత్నం మధుకర్. ఈ సీజన్లో 20 ఎకరాల్లో పత్తి సాగు చేయడానికి భూమిని ట్రాక్టర్తో దుక్కి దున్ని సిద్ధం చేస్తున్నాడు. ఆదివారం రాత్రి బొర్లకుంట శివారులో మోస్తరు వర్షం కురిసింది. దీంతో కల్టివేటర్ కొట్టిస్తున్నాడు. ఇప్పటివరకు భారీ వర్షాలేవీ కురవలేదని, వరుణుడి రాక కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొంటున్నాడు. ఇలా.. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ రైతులు చేలు సిద్ధం చేసి భారీ వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.చేతిలో మట్టిపెల్ల పట్టుకుని చూపిస్తున్న ఈ రైతు పేరు జాటోత్ గోపాల్. దహెగాం మండలం కల్వాడ గ్రామం. ఈ సీజన్లో సొంతంగా ఉన్న ఐదెకరాలే కాకుండా, మరో పదెకరాలను రూ.1.50 లక్షలకు కౌలుకు తీసుకున్నాడు. పత్తి సాగుకు కౌలుకు తీసుకున్న భూమిని దుక్కి దున్నించినా సరైన వర్షం లేక ఇంకా మట్టిపెల్ల లు కూడా కరగలేదు. గతేడాది జూన్ 10 నాటికే వర్షాలు కురవడంతో పత్తి విత్తనాలు పెట్టానని చెబుతున్నాడు. -
‘ప్రాణహిత’ పూర్తికాకపోవడం దురదృష్టకరం
కౌటాల: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ప్రాణహిత ప్రాజెక్టు ఆ తర్వాత పలువురు సీఎంలు మారినా పూర్తికాకపోవడం దురదృష్టకరమని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం రేవంత్రెడ్డి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి సమీపంలోని ప్రాణహిత నదిని మంగళవారం సందర్శించి.. స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ముఖ్యమంత్రి పూటకో మాట మాట్లాడటం మానుకుని, రైతులపై ప్రేమ ఉంటే ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సాగు నీరందక ఈ ప్రాంత రైతులు వెనుకబడ్డారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బోడ జనార్దన్, నియోజకవర్గ ఇన్చార్జి కావేటి సబిత మనోహర్, మండల ఇన్చార్జి అనిల్ పాల్గొన్నారు. ఎస్పీఎంలో స్థానికులకే అవకాశం కల్పించాలికాగజ్నగర్టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లులో స్థానికులకే అవకాశం కల్పించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. బాయిబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం కాగజ్నగర్ పట్టణానికి చేరుకోగా, చెక్పోస్ట్ వద్ద సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి కావేటి సబిత పుష్పగుచ్ఛం, హారతితో స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. పట్టణంలోని ఎస్పీఎం కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించారు. ఆమె మాట్లాడుతూ మిల్లులో స్థానికులకు 95 శాతం ఉద్యోగావకాశాలు కల్పించి మిగితా 5 శాతం ఇతర ప్రాంతాల వారికి ఇవ్వాలన్నారు. యాజమాన్యం హైకోర్టులో పెట్టిన కేసును వెనక్కి తీసుకుని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం మాజీ మంత్రి బోడ జనార్దన్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ తరఫున కార్మిక గుర్తిపుం సంఘం ఎన్నికలు నిర్వహించేలా హైకోర్టులో న్యాయవాదిని నియమించామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కావేటి మనోహర్, శ్రీనివాస్, హెచ్ఎంఎస్ నాయకులు, ఎస్పీఎం కార్మికులు పాల్గొన్నారు. -
కుమురం భీం
7ఉపాధిలో మహిళల జోష్ జిల్లాలో ఉపాధిహామీ పథకంలో మహిళా కూలీలు సత్తా చాటుతున్నారు. పనులకు వచ్చే వారిలో పురుషులతో పోల్చితే మహిళలే అధికంగా ఉంటున్నారు. 9లోu ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. ఉక్కపోత పెరుగుతుంది. సాయంత్రం అక్కడక్కడ జల్లులు కురుస్తాయి. ‘కడెం’కు రక్షణగా ట్రాష్రాక్ కడెం ప్రాజెక్టు ప్రధాన కాలువకు రక్షణగా ప్ర భుత్వం ట్రాష్రాక్ నిర్మాణం చేపట్టింది. వరదలకు కొట్టుకువచ్చే కట్టెలు, చెత్తను అడ్డుకునే వీలు కలగనుంది. 8లోu బుధవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 2026 -
ప్రభుత్వ స్థలాన్ని క్రమబద్ధీకరించాలి
రెబ్బెన: మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలాన్ని క్రమబద్ధీకరించి, న్యాయం చేయాలని చిరువ్యాపారులు కోరారు. మండల కేంద్రంలోని చిరు వ్యాపారులు, దుకాణాదారులు సోమవారం స్వచ్ఛందంగా ఒకపూట బంద్ పాటించారు. అలాగే కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీర శ్యాంనాయక్తో కలిసి కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, మండల కేంద్రంలో తహసీల్దార్ సూర్య ప్రకాశ్కు వినతి పత్రాలు అందించారు. వారు మట్లాడుతూ దా దాపు 60 ఏళ్లుగా మండల కేంద్రంలోని ప్రభుత్వ రెవెన్యూ భూమిలో చిన్న షాపులు, హోటళ్లు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నామని తెలిపారు. స్థలం రైల్వే భూమి అంటూ అధికారులు నోటీసులు జారీ చేశారని తెలి పారు. రైల్వే, రెవెన్యూ జాయింట్ సర్వేలో 38 ఎకరాలు రైల్వే భూమి పోగా, మరో 7.26 ఎకరాలు ప్రభుత్వ మిగులు భూమి ఉన్నట్లు తేలిందన్నారు. మిగులు భూమిని క్రమబద్ధీకరించి ఆదుకోవాలని కోరారు. -
మూత‘బడికి కొత్త కళ’
ఆసిఫాబాద్ పట్టణ పరిధిలోని హీరాపూర్ మండల పరిషత్ పాఠశాలలో విద్యార్థులు లేరని ఏడేళ్ల క్రితం మూసివేశారు. అప్పటి నుంచి చిన్నారులు వాగు మార్గం గుండా మూడు కిలోమీటర్ల దూరంలోని బెస్తవాడ మండల పరిషత్ పాఠశాలకు వెళ్తున్నారు. గ్రామస్తుల విన్నపం మేరకు వార్డు కౌన్సిలర్ సాలంబీన్ అహ్మద్ మూతపడిన పాఠశాలకు పెయిటింగ్ వేయించి డోర్లు, కిటికీలకు మరమ్మతులు చేయించారు. సోమవారం పాఠశాలను మున్సిపల్ చైర్మన్ ఆకాశ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్తో కలిసి డీఈవో సచ్చిదానంద చారి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అహ్మద్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్, ఎంఈవో సుభాశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెరీర్ గైడెన్స్, ప్లేస్మెంట్ సెల్ ఆ ధ్వర్యంలో సోమవారం పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రిన్సి పాల్ శ్రీదేవి మాట్లాడుతూ ఇంటర్ ఉత్తీర్ణులై న విద్యార్థులకు పోటీ పరీక్షలపై అవగాహన కలిగిస్తామన్నారు. పోలీస్, ఫారెస్ట్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు రానున్నందున విద్యార్థులకు నెల రోజులపాటు నిష్ణాతులైన అధ్యాపకులతో ఉచిత శిక్షణ అందిస్తామని తెలిపారు. కెరీర్ గైడెన్స్ సెల్ ఇన్చా ర్జి డాక్టర్ లక్ష్మీనరసింహం మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో అత్యంత కీలకమైన జనరల్ స్టడీస్తోపాటు జనరల్ ఇంగ్లిష్, ఆర్థమెటిక్స్ రిజనీంగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. దాదాపు 200 మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ జనార్దన్, క్యూసీ కోఆర్డినేటర్ శారద, అధ్యాపకులు రాజేశ్వర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ దత్తాత్రేయ, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
పూలిచ్చి..ఆహ్వానించి..
ఆసిఫాబాద్రూరల్: సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు సోమవారం పునఃప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బడులను వెల్కం బోర్డులు, బెలూన్లు, మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. చాలాచోట్ల పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ చేశారు. అమావాస్య, బంధువుల ఇంటికి వెళ్లిన చిన్నారులు రాకపోవడం, తదితర కారణాలతో తొలిరోజు ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు అంతంతే నమోదైంది. జిల్లాలో మొత్తం 772 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 32,427 మంది విద్యార్థులకు కేవలం 6,167 మంది హాజరు కాగా, 26,260 మంది గైర్హాజరయ్యారు. కాగజ్నగర్, సిర్పూర్(టి), దహెగాం, కెరమెరి, తిర్యాణి మండలాల్లో 20 శాతం నుంచి 30శాతం హాజరు నమోదైంది. మిగిలిన మండలాల్లో 20శాతం మంది కూడా పాఠశాలలకు రాకపోవడం గమనార్హం. ఆసిఫాబాద్ మండలం బూర్గుడలోని పాఠశాలలో కేవలం నలుగురు విద్యార్థులు బడికి రాగా, ఐదుగురు ఉపాధ్యాయులు హాజరయ్యారు. రోజులు గడిచే కొద్దీ హాజరు పెరుగుతుందని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేశారు. -
వేగంగా ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం
ఆసిఫాబాద్అర్బన్: ప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరి స్తామని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్, డీఆర్వో దాసరి వేణుతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని కౌటాల మండలం మొగడ్దగడ్ గ్రామానికి చెందిన దరఖాస్తు చేసుకున్నాడు. రైతుబీమా మంజూ రు చేయాలని రెబ్బెన మండలం నవేగాంకు చెందిన శకుంతల వి న్నవించింది. దివ్యాంగుడినైన తనకు ఎలక్ట్రికల్ ట్రై సైకిల్ ఇప్పించాలని కాగజ్నగర్ పట్టణం పోచమ్మ బస్తీకి చెందిన రాజేశ్వర్ కో రాడు. ప్రభుత్వం ఇచ్చిన లావుణి పట్టా భూమి సాగుకు అటవీ శాఖ అడ్డుపడుతుందని, న్యాయం చేయాలని దహెగాం మండలం ఐనం గ్రామానికి చెందిన దుర్గాగౌడ్ కోరాడు. దహెగాం మండలం ఐనం గ్రామంలో వంగిన విద్యుత్ స్తంభాలను సరిచేయాలని సర్పంచ్ ప్రశాంత్ దరఖాస్తు అందించారు. రెబ్బెన మండలం కై రిగాం పంచాయతీ పరిధిలోని ఎడవెల్లి గ్రామానికి చెందిన రైతులు తమ పంట పొలాలకు వట్టివాగు నీరందించాలని విన్నవించారు. గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి సీటు ఇప్పించాలని కౌటాల మండలం బాలెపల్లికి చెందిన సాయిప్రసాద్ అర్జీ అందించాడు. బ్యాంకు రుణం మంజూరు చేయాలని దహెగాం మండలం కొత్మీర్కు చెందిన రెడ్డి రాజయ్య వేడుకున్నాడు. పెరాలసిస్తో పనిచేయలేకపోతున్నా తొమ్మిది సంవత్సరాల క్రితం పెరాలసిస్ రావడంతో ఏ పని చేసుకోలేకపోతున్నాను. మాది పేద కుటుంబం కావడంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. పింఛన్ మంజూరు చేస్తే ఇతరులపై ఆధారపడకుండా ఆసరాగా ఉంటుంది. – పప్పు మండల్, రవీంద్రనగర్ -
భీం స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటం
ఆసిఫాబాద్: ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేసి కుమురంభీం స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పో రాడాలని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. భీం పోరాట పటిమతోనే జిల్లా కేంద్రంలో తొలి పార్టీ కార్యాల యం ప్రారంభించామని తెలిపారు. కొత్త పార్టీ ఆవి ర్భావం తర్వాత తొలిసారి సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చారు. పట్టణంలో పార్టీ జెండా ఆవిష్కరించి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతకు మందు ఫారెస్ట్ చెక్పోస్టు నుంచి డప్పుచప్పుళ్లతో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్, కుమురంభీం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూరియా యాప్ తొలగించి, రైతులకు ఎకరాకు మూడు బస్తాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ తరుగు పేరుతో రైతుల నుంచి రూ.1200 కోట్లు కొట్టేసిందని ఆరోపించా రు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నకిలీ విత్తన వ్యా పారులపై పీడీ యాక్టు నమోదు చేయాలన్నారు. ఏటా ఖరీఫ్ ప్రారంభంలో పోడు రైతుల వద్దకు పోలీసులు వస్తున్నారని, వారి పొట్ట కొట్టొద్దన్నారు. గిరిజన కార్పొరేషన్లో రిక్రూట్మెంట్ లేక నిర్వీర్యమవుతుందని, వెంటనే రిక్రూట్మెంట్ చేపట్టాలని డిమాండ్ చేశారు. 1/70 యాక్టు అమలు చేస్తూ 1970కి ముందు ఏజెన్సీలో వారసత్వంగా సంక్రమించిన భూమికి క్రయవిక్రయాలు జరుపుకొనేలా వెసులుబాటు కల్పించాలన్నారు. తెలంగాణపై ఆంధ్ర పాలకులు దాడి చేస్తే అడ్డుకునే ఏకై క పార్టీ తమ టీఆర్ఎస్ అని అన్నారు. పార్టీ కార్యాల యం ప్రజల సమస్యల పరిష్కారానికి కేంద్రంగా మారాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బోడ జనార్దన్, జిల్లా అధ్యక్షుడు వినోద్, కాగజ్నగర్ ఇన్చార్జి సబిత, నాయకులు మహోర్క ర్ అశోక్, రాంప్రసాద్, రియాజ్ పాల్గొన్నారు.పార్టీ కార్యాలయంలో కవిత, టీఆర్ఎస్ నాయకులు -
రైతుల సమస్యల పరిష్కారానికి కృషి
కాగజ్నగర్టౌన్: రైతులకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. మండలంలోని వంజీరి రైతు వేదికలో సోమవారం రైతులకు జీవిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విత్తనాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంచుకుని అధిక దిగుబడులు సాధించాలన్నారు. పంట మార్పిడి పాటించాలని సూచించారు. ఈ ఏడాది కౌటాల, కాగజ్నగర్ కొనుగోలు కేంద్రాల్లో లక్ష బస్తాల మక్కలు సేకరిచినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏడీఏ మనోహర్, ఏవో రామకృష్ణ, స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ పద్మాకర్, సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ భరత్, పీఏసీఎస్ చైర్మన్ ఉమామహేశ్వర్రావు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలిసంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకో వాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం 239 మందికి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ మధుకర్, కౌన్సిలర్లు, సర్పంచులు గజ్జి లింగయ్య, కుందారపు సుమన్, రాజేందర్, ప్రకాశ్, కోట వేణు, నాయకులు పాల్గొన్నారు. -
అంకితభావంతో విధులు నిర్వహించాలి
కాగజ్నగర్టౌన్: పోలీసులు అంకితభావంతో వి ధులు నిర్వహించాలని ఎస్పీ నితిక పంత్ అన్నారు. కాగజ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ను సోమవారం తనిఖీ చేశారు. లాకప్ రూమ్, రిసెప్షన్, బెల్ ఆఫ్ ఆరమ్స్ రూమ్, స్టోర్ రూమ్లను తనిఖీ చేశారు. రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, స్టేషన్ హాజరు, రిజిస్టర్ పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల నివారణపై దృష్టి సారించాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. డీఎస్పీ వహీదుద్దీన్, ఎస్సై సందీప్, సిబ్బంది పాల్గొన్నారు. చట్ట పరిధిలో ఫిర్యాదులు పరిష్కరించాలిఆసిఫాబాద్అర్బన్: చట్ట పరిధిలో ప్రజల ఫిర్యాదులు పరిష్కరించాలని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదుదారుల సమస్యలు విన్నారు. త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి మొత్తం 13 ఫిర్యాదులు స్వీకరించారు. పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి అవసరమైన సూచనలు చేశారు. -
‘నీట్’ విద్యార్థులకు ఇబ్బందులు రానీయొద్దు
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో పకడ్బందీగా నీట్ నిర్వహించాలని, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రానీయొద్దని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నీట్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 353 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. ఈ నెల 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష కొనసాగనుండగా, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యార్థులను కేంద్రంలోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. రెండు పాస్ ఫొటోలు, అడ్మిట్ కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో వేణు, డీఎస్పీ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
యోగాతో మానసిక ప్రశాంతత
ఆసిఫాబాద్అర్బన్: యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని జనరల్ ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ రవీందర్కుమార్ అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి నుంచి యోగా రన్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ యోగాకు కొంత సమయం కేటాయించాలన్నారు. తద్వారా మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి వ్యాధులను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఒక గొప్ప సాధనమన్నారు. కార్యక్రమంలో సీనియర్ నర్సింగ్ అధికారి విజయమ్మ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్, నాయకులు మారుతి, ఆయుష్ సిబ్బంది సుజాత, శిల్పా తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ వాడకుండా వంటల పోటీలు
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని సర్సిల్క్ కాలనీలో బీజేపీ మహిళా మోర్చ ఆధ్వర్యంలో ఆదివారం గ్యాస్, వంటనూనె వినియోగంచకుండా వంటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు హాజరై మాట్లాడారు. విదేశీ మారకద్రవ్యాన్ని పొదుపు చేయడానికి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు గ్యాస్, వంట నూనెను ఉపయోగించకుండా వంటలు చేయడం సంతోషకరమన్నారు. నరేంద్ర మోడీ మహిళా సాధికారత కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. పీఎం జన్ధన్, స్వనిధి పథకాలతో మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. వంటల పోటీలో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మహిళా మోర్చ నాయకులు మంజుల, కౌన్సిలర్ గజ్జెల లావణ్య, స్రవంతి, సామాజిక సేవకులు స్వాతి, అన్నపూర్ణ, సరోజ, సత్తమ్మ మహిళలు పాల్గొన్నారు. -
మంచిర్యాల అభివృద్ధి రాష్ట్రానికే మోడల్
మంచిర్యాలటౌన్: మంచిర్యాలలో జరుగుతున్న అభివృద్ధి రాష్ట్రానికే ఒక మోడల్ అవుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు నివాసంలో ఆదివారం చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, మేయర్ దర్ని మధుకర్తో కలిసి మాట్లాడారు. మంచిర్యాల పట్టణ ప్రగతిపై ప్రశంసలు కురిపిస్తూనే స్థానిక ఎమ్మెల్యే సంకల్పం, నిబద్ధత వల్లే అద్భుతమైన అభివృద్ధి సాధ్యమైందని కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా మంచిర్యాల మోడల్ను అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులను, కమిషనర్లను ఇక్కడికి పంపించి, ఈ అభివృద్ధిని ఒక మోడల్గా చూసి స్ఫూర్తి పొందేలా చేయాలని మంత్రి శ్రీధర్బాబుతో చర్చించానన్నారు. ఇక్కడి 50 పడకల ఆస్పత్రి, ఆర్కిటెక్చర్, విశాలమైన వరండాలు, గాలి వెలుతురు వచ్చేలా కట్టిన విధానం నచ్చి, పరిశీలనకు మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంట్ వారిని ఇక్కడికి పంపించామన్నారు. తాను ఆదిలాబాద్ నుంచి పాతయాత్ర చేపట్టిన సమయంలో ప్రేమ్సాగర్రావు, కొక్కిరాల సురేఖ, శ్రీధర్బాబు తన వెనకుండి ముందుకు నడిపించారన్నారు. -
ఎస్పీఎంలో గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలి
కాగజ్నగర్టౌన్: ఎస్పీఎంలో గుర్తింపు సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్.త్రివేణి డిమాండ్ చేశారు. ఆదివారం మిల్లు గేటు ముందు కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్ష శిబిరాన్ని ఆమె సందర్శించి మద్దతు తెలిపారు. ఆమె మాట్లాడుతూ 26 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న కార్మికులను యాజమాన్యం, నాయకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్మికులకు సీఐటీయూ అండగా నిలుస్తుందని తెలిపారు. యాజమాన్యం కోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకొని ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పద్మ, స్వరూప, యూ నియన్ జిల్లా నాయకులు లక్ష్మి, పంచశీల, సరస్వతి, రజిని, కార్మికులు పాల్గొన్నారు. -
గాలివాన బీభత్సం
సిర్పూర్(టి): మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. మండలకేంద్రంతో పలు గ్రామాల్లో రెండు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ప్రధాన రహదారుల్లో ఉన్న భారీ వృక్షాలు నేలకొరిగాయి. కొన్నిచోట్ల ఇళ్లపై చెట్లు విరిగిపడ్డాయి. కొన్ని ఇళ్లు పూర్తిస్థాయిలో ధ్వంసం కావడంతో తీవ్రంగా నష్టపోయారు. రోడ్లపై చెట్లు విరిగి పడటంతో సిర్పూర్(టి) –కాగజ్నగర్, సిర్పూర్(టి) –కౌటాల ప్రధాన రహదారుల గుండా ప్రయాణాలు సాగించే ప్రయాణికులు, వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంకట్రావ్పేట గ్రామ సమీపంలో చెట్లు విరిగి రోడ్డుపై పడిపోవడంతో వాహనాలు గంటపాటు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. గత రెండురోజులుగా మండలంలోని ప్రజలు విద్యుత్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఎస్సై సాగర్ ఆధ్వర్యంలో పోలీసులు రహదారులపై విరిగి పడ్డ చెట్లను తొలగించారు.సిర్పూర్(టి) –కాగజ్నగర్ రోడ్డుపై పడిన చెట్టుగాలివానకు పడిపోయిన విద్యుత్ స్తంభం -
పారదర్శకంగా ఓటర్ మ్యాపింగ్
ఆసిఫాబాద్: బోగస్ ఓటర్లకు చెక్ పెట్టడంతో పాటు ఒకరికి ఒక్కచోట మాత్రమే ఓటుహక్కు ఉండేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. రాబోయే ఎన్నికలకు ఓట రు జాబితాను పారదర్శకంగా తయారు చేసేందుకు జిల్లాలో ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ చేపడుతున్నా రు. అనర్హులను తొలగించి అర్హులతో కూడిన కొత్త ఓటరు జాబితా రూపొందించేలా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)కు కేంద్రం సిద్ధమైంది. 2002లో జరిగిన సమగ్ర సర్వే ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకొని ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ చేపడుతోంది. ఈ ప్రకియ జల్లాలో జనవరి 31న ప్రారంభం కాగా, బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి పాత జాబితా ప్రకారం ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలో 4,57,018 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 3,76,625 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తయ్యింది. 100 శాతం పూర్తయ్యేలా చర్యలు..జిల్లాలో ఇప్పటి వరకు 82.41 శాతం మ్యాపింగ్ ప్ర క్రియ పూర్తయ్యింది. ఈ ప్రక్రియ వేగవంతం చే యాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టర్ హరిత జిల్లాలోని అధికారులతో ఇప్పటికే ప లుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ నెలాఖరులోగా 100శాతం ప్రక్రియ పూర్తయ్యేలా చ ర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియలో ఆధార్, భద్రతా పరిశీలన, చిరునామాలు, బయోమెట్రిక్ సరి చూసుకోవడం, ఓటర్ల స్థలానుసారం మ్యాప్ తయారీ వంటి కీలక దశలు చేపట్టనున్నారు. జియో ట్యాగింగ్, డిజిటల్ ఫారాలు, ఫొటో వ్యాలిడేషన్ ద్వారా డేటా సేకరిస్తున్నారు. నాణ్యమైన ఓటర్ల డేటా బేస్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అక్టోబర్ 1న తుది జాబితా..సర్ ప్రక్రియ ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుంది. తొలి విడతలో భాగంగా ఈ నెల 15 నుంచి 24 వరకు ఓటర్ల జాబితా తయారీ, సిబ్బందికి శిక్షణ, జాబితా ముద్రణ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ప్రత్యేక సర్వే చేపట్టనున్నారు. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపడతారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా సిద్ధం చేస్తారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, క్లెయింలు స్వీకరిస్తారు. వచ్చిన దరఖాస్తులను సెప్టెంబర్ 28లోపు పరిష్కరించి, అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా అధికారికంగా ప్రకటించనున్నారు. గందరగోళం లేకుండా..ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయితే ఎన్నికల ని ర్వహణలో పారదర్శకత పెరుగుతుంది. సమగ్ర మ్యాపింగ్ కారణంగా పోలింగ్ కేంద్రాల వద్ద ప్లా నింగ్, సిబ్బంది నియామకం, వాహనాల ఏర్పాట్లు వంటివి మరింత సక్రమంగా చేసే అవకాశం ఉంటుంది. 2002లో పేరు, తల్లిదండ్రుల పేర్లు ఉంటే ప్రత్యేక రుజువులు చూపాల్సిన అవసరం లేదు. బీ ఎల్వోలకు అవసరమున్న డాక్యుమెంట్లు చూపాల్సి ఉంటుంది. ఓటర్లకు చిరునామా గుర్తింపులో అవరోధాలు తొలగిపోతాయి. బీఎల్వోలు గడపగడపకు వెళ్లి వివరాలు సేకరించడంతో పాటు జియో ట్యాగ్ ఫొటోలు, ఆధార్తో నమోదు చేస్తున్నారు. 18 ఏళ్లు నిండిన యువతీయువకులు కొత్తగా ఓటరు నమోదు చేసుకోవడంతో పాటు ఓటింగ్ రోజున ఎలాంటి గందరగోళం లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగే అవకాశాలున్నాయి.గుర్తింపు కార్డు సమర్పించాలి మ్యాపింగ్, ఓటరు నిర్ధారణ వంటి సమస్యలుంటే 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి సమర్పించాలి. ఆధార్ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్లైసెన్స్, పాన్కార్డు, పింఛన్ కార్డుతో పాటు ఇతర గుర్తింపు కార్డుల్లో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. – లోకేశ్వర్ రావు, ఆర్డీవో -
డీడీఎన్ సంఘం డివిజన్ స్థాయి కమిటీ
ఆసిఫాబాద్అర్బన్: ఆసిఫాబాద్ డీడీఎన్ సంఘం డివిజన్ స్థాయి నూతన కార్యవర్గాన్ని ఆ దివారం జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ హనుమాన్ ఆలయం ఆవరణలో సంఘం రాష్ట్ర ఉ పాధ్యక్షుడు గంగు సత్యనారాయణశర్మ, జిల్లా అధ్యక్షుడు ఒజ్జల శిరీష్శర్మల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డివిజన్ అధ్యక్షుడిగా జంబోజు తిరుపతిచారి, కార్యదర్శిగా జాదవ్ ధన్రాజ్, కోశాధికారిగా అభయ్కుమార్ ఆచార్యలను ఎన్నుకున్నారు. నాయకులు సుబ్బా మహేశ్, ఇందారపు శంకర్, డిల్లీ విజయ్కుమార్, మురళీధర్, సతీశ్, కులకర్ణి, సత్యనారాయణ, శేఖర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
● నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం ● మొదటిరోజు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ అందజేత ● బడిబాట ద్వారా 928 ప్రవేశాలు
ఆసిఫాబాద్రూరల్: వేసవి సెలవుల్లో ఆడిపాడిన పిల్లలు బడిబాట పట్టనున్నారు. నెలన్నర రోజులుగా మూతపడిన పాఠశాలలు సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాటు పూర్తి చేసింది. పాఠశాలల్లోని తరగతి గదులు శుభ్రం చేయించి సిద్ధం చేశారు. మొదటి రోజు పిల్లలకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ ఇవ్వనున్నారు. జిల్లాలో 118 ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేయడంతో గతం కంటే ఈసారి అడ్మిషన్ల సంఖ్య పెరుగుతుందని సంబంధిత అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా అధికారులు జిల్లాలో 928 మంది బడీడు పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించారు. జిల్లాలో ఇదీ పరిస్థితి..జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,258 పాఠశాలలు ఉండగా డీఈవో పరిధిలో 738 పాఠశాలలు ఉన్నాయి. మిగితా 520 పాఠశాలలు గిరిజన ఆశ్రమ, ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు ఉన్నాయి. వీటిలో సుమా రు 86 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నా రు. డీఈవో పరిధిలో 738 పాఠశాలల్లో సుమారు 39,249 మంది విద్యార్థులు చదువుతుండగా 2,072 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. జి ల్లాకు 1,48,880 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా 86శాతం 90,320 పుస్తకాలు వచ్చాయి. అయితే 2, 3,7వ తరగతులకు చెందిన ఇంగ్లిష్, 6, 7వ తరగతులకు చెందిన హిందీ పుస్తకాలు రాలేదు. యూనిఫాంకు సంబంధించి ఈ ఏడాది రంగులో మార్పు చేయడంతో ఇంకా యూనిఫాం కుట్టే పనులు కొనసాగుతున్నాయి. దీంతో మరో నెల రోజుల పాటు పాత యూనిఫాంలే విద్యార్థులు ధరించాల్సి ఉంటుంది. జిల్లాకు దక్కని ‘అల్పాహారం’..రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పేద విద్యార్థులకు ఉదయం వేళ బ్రేక్ఫాస్ట్ పథకా న్ని నేటి నుంచి అమలు చేయనుంది. తొలి విడతలో 8 జిల్లాల్లోని 1,269 పాఠశాలలు, 13 కళాశాలల్లో మాత్రమే అమలు చేయనున్నారు. అందులో కు మురం భీం జిల్లాకు అవకాశం రాలేదు. వికారాబా ద్, నారాయణ పేట, సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్, హనుమకొండ, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో నేటి నుంచి అల్పాహారం అందించనున్నారు. మిగితా జిల్లాల్లో రెండో విడతలో అందిస్తామని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.నాణ్యమైన విద్య అందిస్తాం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కు నాణ్యమైన విద్య అందిస్తాం. ఉపాధ్యాయుల కు ఎఫ్ఆర్ఎస్ హాజరుతో డుమ్మాలకు అవకాశం లేదు. ప్రాథమిక స్థాయి నుంచి విద్య సామర్థ్యాలు పెంచేలా కార్యాచరణ తయారు చేస్తున్నాం. – సచ్చిదానంద, డీఈవో కెరమెరి: బుడిబుడినడకలు వేస్తూ నేటి నుంచి చి న్నారులు అంగన్వాడీలకు వెళ్లనున్నారు. మే 1 నుంచి 30 వరకు వేసవి సెలవులు ప్రకటించిన ప్ర భుత్వం.. మండుతున్న ఎండల దృష్ట్యా మరో 14 రోజులు పెంచింది. దీంతో సోమవారం అంగన్వాడీ కేంద్రాలు పునఃప్రారంభం కానున్నాయి. సె లవుల్లో పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు, కిశోరబాలికలకు ఇళ్లకు వెళ్లి సరుకులు అందజేశారు. సమస్యల్లో అంగన్వాడీ కేంద్రాలు..జిల్లాలోని అనేక అంగన్వాడీ కేంద్రాలు సమస్యల్లో మగ్గుతున్నాయి. చాలా కేంద్రాలు అద్దె భవనాలు, ఇరుకు గదుల్లో కొనసాగుతున్నాయి. అద్దె భవనాల్లో అరకొర వసతులు ఉన్నాయి. మరికొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్నాయి. కొన్ని కేంద్రాల్లో విద్యుత్ సదుపాయం లేదు. ఏటా ఇబ్బందులు పడుతున్నా అధికారులు కేంద్రాలపై చిన్నచూపు చూస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కాగా ఈ విద్యా సంవత్సరం నుంచి పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. చిన్నారులకు ఆరోగ్యలక్ష్మి పథకం కింద ఉప్మా లేదా కిచిడి మిక్స్ టిఫిన్గా అందించనున్నారు. చిన్నారులకు ప్రీస్కూల్ కిట్ అందించనున్నారు. రెండు జతల యూనిఫాంలు ఆయా కేంద్రాలకు చేరడంతో నేటి నుంచి పంపిణీ చేయనున్నారు. సిబ్బంది కొరత..జిల్లాలోని అనేక అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత ఉంది. చాలా చోట్ల ఆయాలు, అంగన్వాడీలు లేక సమీప కార్యకర్తలకు ఇన్చార్జీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో రెండు కేంద్రాలను నిర్వహించడం వారికి ఇబ్బందిగా మారింది. ఇన్చార్జీలు ఉన్న చోట కేవలం సరుకులు పంపిణీకే పరిమితమవుతున్నారు. చిన్నారులకు అందాల్సిన ప్రీస్కూల్ కార్యక్రమాలు కొనసాగడం లేదు. కొన్ని ప్రాంతాల్లోని కేంద్రాలు అంగన్వాడీలు, ఆయాలు లేక మూతబడి ఉంటున్నాయి.అంగన్‘బడు’లు సైతం ప్రారంభం -
విద్యార్థులకు కెరీర్ గైడెన్స్
కాగజ్నగర్టౌన్: డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఉద్యో గం ఎలా సాధించాలి..? పోటీ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి..? ఉన్నత విద్యకు ఏ మార్గాలు ఎంచుకోవాలి..? అనే సందింగ్ధంలో ఉండే విద్యార్థుల కు కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల దారి చూపుతోంది. కళాశాలలో కేవలం పాఠ్యాంశాలకే పరిమి తం కాకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంకింగ్, రైల్వే, పోలీస్, ఫారెస్ట్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, గ్రూప్స్ వంటి వివిధ పోటీ పరీక్షల కు అవసరమైన అంశాలపై కెరీర్ గైడెన్స్ సెల్ ద్వా రా ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 15 నుంచి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించనున్నారు. 2019 నుంచి పోటీ పరీక్షలపై శిక్షణ..కాగజ్నగర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2019 నుంచి డిగ్రీ చదువుకునే విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో నిపుణులతో ఉద్యోగాలు సాధించేందుకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుండడంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. శిక్షణలో భాగంగా పోటీ పరీక్షలకు ప్ర త్యేక తరగతులు, వారానికోసారి మాక్ టెస్ట్, వ్యక్తి త్వ వికాస శిక్షణ, ఇంటర్వ్యూ నైపుణ్యాలపై మార్గదర్శనం, కెరీర్ కౌన్సెలింగ్, ఉన్నత విద్య అవకాశాలపై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో విద్యార్థులు డిగ్రీలో ఉండగానే పోలీస్, అగ్నివీర్, ఆర్మీ, ఫారెస్ట్బీట్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలు పొందుతున్నారు. అగ్నివీర్కు ఎంపిక మాది రెబ్బెన మండలంలో ని ఖైరిగూడ గ్రామం. కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్న. ఈ నెల 2న అగ్నివీర్కు ఎంపికై నట్లు కాల్లెటర్ వచ్చింది. ఈ నెల 10న సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరయ్యాను. డిగ్రీ ఫైనల్ఇయర్లోనే ఉద్యోగం రావడం ఎంతో సంతోషంగా ఉంది. – కమినవేని సతీశ్, అగ్నివీర్ వ్యవసాయ కుటుంబం నుంచి.. మాది వేంపల్లి గ్రామం. మా తల్లిదండ్రులు మాండోరె నారాయణ –భాగ్యలు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. దేశ సేవ చేసేందుకు అగ్నివీర్గా నాకు అవకాశం వచ్చింది. నేను కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే శిక్షణ తీసుకున్న. – మాండోరె శంకర్, అగ్నివీర్ కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల -
‘బాయిబాట పోరాటం మరింత ఉధృతం’
రెబ్బెన: సింగరేణి పరిరక్షణ కోసం బాయిబాట పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్ఎంఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు పత్తెం రాజాబాబు అన్నారు. ఆదివారం గోలేటి టౌన్షిప్లోని హెచ్ఎంఎస్ యూనియన్ కార్యాలయంలో బెల్లంపల్లి ఏరియా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి పరిరక్షణ కోసం హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు క ల్వకుంట్ల కవిత, యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ హైమద్లు పోరాటాలను ఉధృతం చేస్తున్నారన్నారు. కొత్త గనుల ఏర్పాటు లేక సింగరేణి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని పేర్కొన్నారు. కొత్త గనులను ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని సూచించారు. మెడికల్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని, మారుపేర్ల సమస్యను పరిష్కరించాలన్నారు. మందమర్రి ఏరియాలోని కాసిపేట గని వద్ద నేటి బాయిబాట కార్యక్రమానికి హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరవుతారని తెలిపారు. ఏరియాలోని హెచ్ఎంఎస్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు అధిక సంఖ్యలో హాజరై బాయిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో బ్రాంచి కార్యదర్శి శివారెడ్డి, సెంట్రల్ నాయకులు ఎండీ ఓజియార్, ఏరియా ఆర్గనైజర్ ఎస్కే ఇనూస్, కిష్టస్వామి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యం
తిర్యాణి: ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని ఎస్పీ నితిక పంత్ పేర్కొన్నారు. ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక పోలీస్స్టేషన్లో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గిరిజనులకు రోటరీ క్లబ్ సహకారంతో 87 సోలార్ లైట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతా ల్లోని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు గాను సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యుత్ సౌక్యరాలు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో సోలార్ లైట్లు ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్ ఆదాకు కూడా సోలార్ శక్తి దోహదపడుతుందని పేర్కొన్నారు. పోలీస్శాఖ చట్టాల అమలు, శాంతి భద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా ప్రజల సంక్షేమం, సామాజిక అభివృద్దికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోందని వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీ అశోక్, రోటరీ క్లబ్ ప్రతినిధులు డాక్టర్ అనితారెడ్డి, వెంకటేశ్వరి, రెబ్బెన సీఐ సంజయ్, ఎస్సై సుబ్బారావు, సురేశ్ తదితరులున్నారు. -
టూరిజం బాగుండాలని..
తిర్యాణి: వానాకాలంలో జిల్లాలోని మారుమూల మండలమైన తిర్యాణిలో ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. చుట్టూ పెద్దపెద్ద గుట్టల నుంచి కిందికి పాల నురగలా జాలువారే జలపాతాలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. మండలంలోని చింతలమాదర, గుండాల, ఉల్లిపిట్ట జలపాతాలుండగా జూన్ చివరి వారం నుంచి సెప్టెంబర్ రెండోవారం వరకు పర్యాటకుల రద్దీ భారీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో గుండాల జలపాతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఎకో టూరిజం ద్వారా ‘హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ (గ్రాండ్ ఫార్మా) అనే స్వచ్ఛంద సంస్థ ముందుకువచ్చి సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి చేస్తోంది. గుండాల జలపాతం వద్ద దాదాపు వంద అడుగుల ఎత్తు నుంచి నీళ్లు కిందికి దూకుతుండగా దీనిని బాహుబలి జలపాతంగా కూడా పిలుస్తుంటారు. పర్యాటకులకు బర్డ్వాక్ సౌకర్యం దూర ప్రాంతాల నుంచి జలపాతం సందర్శనకు వచ్చే పర్యాటకులు రెండోరోజు ఉదయం సమీప అటవీ ప్రాంతంలో గైడ్స్తో కలిసి బర్డ్వాక్ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రాదాయాలు, వారు దేవుళ్లను పూజించే విధానం, వారు తినే ఆహార పదార్ధాలు, అడవుల్లో దొరికే ఔషధ మొక్కలపై అవగాహన కల్పించనున్నారు. ఇందుకు దాదాపు మూడు కిలోమీటర్ల పాటు అడవిలో ప్రయాణించాల్సి ఉంటుంది. త్వరలోనే సఫారీ వాహనం ద్వారా అడవిలో పర్యటించేందుకు అవసరమైన ఏర్పాటు చేస్తున్నట్లు స్వచ్చంధ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అన్నీ బాగున్నా.. సరైన రోడ్డే లేదు టూరిజం దిశగా అభివృద్ధి బాగానే ఉన్నా పర్యాట కులు వచ్చేందుకు గుండాల గ్రామానికి సరైన రోడ్డు లేదు. ఈ గ్రామానికి రావాలంటే తిర్యాణి మండల కేంద్రానికి చేరుకుని 10కిలో మీటర్ల దూరంలోని రొంపెల్లి వరకు వాహనాల్లో వెళ్లి అక్కడి నుంచి దాదాపు ఆరు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. అలాగే, మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం నుంచి కూడా వయా ఉట్ల గ్రామం మీదుగా జలపాతానికి చేరుకోవచ్చు. కానీ, ఈ రోడ్డు కూడా అధ్వానంగా ఉండడంతో ద్విచక్ర వాహనాలపై అతికష్టంగా వెళ్లాల్సి ఉంటుంది. కాగా, దండేపల్లి నుంచి గుండాల వరకు దాదాపు 12కిలో మీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే రూ.25కోట్లు మంజూరు చేసినప్పటికీ పనులు ఇంకా ప్రారంభించలేదు. తిర్యాణి మండలంలోని రొంపెల్లి నుంచి గుండాలకు, దండేపల్లి నుంచి గుండాలకు రోడ్డు సౌకర్యం కల్పించి పర్యాటక అభివృద్ధికి కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
కరుణించని వరుణుడు!
● రుతుపవనాల రాకలో ఆలస్యం! ● వర్షాల కోసం కర్షకుల నిరీక్షణ ● పత్తి రైతుల్లో మొదలైన ఆందోళనవాంకిడి: ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో ఆకాశం నల్లబడుతున్నా చినుకులు మాత్రం నేలను తాకడం లేదు. జిల్లాలో ఏటా మృగశిర కార్తె నుంచే వర్షాలు ప్రారంభమయ్యేవి. కానీ, ఈసారి ఎల్నినో ప్రభావం తీవ్ర రూపం దాల్చగా సరిపడా వర్షాలు కురవడం లేదు. అక్కడక్కడా స్వల్పంగా చినుకులు పడుతూ.. కమ్ముకున్న కారు మబ్బులు కనుమరుగై క్షణాల్లో ఆకాశం తెల్లబడుతోంది. జిల్లాలో ప్రధాన ఆర్థిక వనరు వ్యవసాయమే కాగా, అత్యధికంగా రైతులు పత్తి పంటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మే చివరి వారం నుంచే రైతులు దుక్కులు దున్ని విత్తనాలు వేసేందుకు సిద్ధం చేశారు. మరో వైపు స్వల్పంగా వర్షాలు కురిసిన ప్రాంతాల్లో రైతులు తొందరపడి ఇప్పటికే విత్తనాలు వేస్తున్నారు. కాగా, విత్తనాలు విత్తేందుకు సరిపడా వర్షాలు కురవలేదని అధికారులు చెబుతున్నారు. ఎల్నినో ప్రభావంతో రుతుపవనాల రాక ఆలస్యమవుతోందని, దీంతో ఈ ఏడాది వర్షపాతం సాధారణంగానే ఉండే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు, అధికారులు హెచ్చరిస్తున్నారు. 4.52 లక్షల ఎకరాల్లో సాగు జిల్లాలో 4.52 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా అత్యధికంగా 3.70 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ప త్తి తర్వాత వరి, కంది, కూరగాయలు, ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఈ ఏడాది వర్షాలు సాధారణ స్థాయిలోనే ఉంటాయని శాస్త్రవేత్తలు సూచిస్తుండగా రైతులు పంట మార్పిడి విధానం పాటించడం మేలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్లో ఎల్నినో ప్రభావం అధికంగా ఉండి వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని సూచిస్తున్నారు. రైతులు నీటి ఆవశ్యకత తక్కువగా ఉండే పంటలకు మొగ్గు చూపాలని ప్రభుత్వాలూ సూచిస్తున్నాయి. ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంతో అధికారులు, శాస్త్రవేత్తలు సాగులో మెళకువలు, శాసీ్త్రయ విధానం, ఎరువు ల వాడకం, తక్కువ వర్షపాతంలో సాగయ్యే పంటలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. ఇప్పటివరకు తేలికపాటి వర్షాలే.. రైతులు విత్తనాలు వేసేందుకు తొందరపడొద్దు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు తేలికపాటి వర్షాలు మాత్రమే కురిశాయి. విత్తనం వేయాలంటే కనీసం 50–100 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదు కావా లని అధికారులు చెబుతున్నారు. కానీ, ప్రతీరోజు కారుమబ్బులు కమ్ముకుంటుండటంతో వర్షాలు కురుస్తాయనే నమ్మకంతో విత్తనాలు నాటేస్తున్నారు. అధికశాతం రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తుంటే.. తేలికపాటి చిరుజల్లులు కురిసిన మండలాల ప్రజలు విత్తనాలు నాటేస్తున్నారు. అధికారులు మాత్రం సరిపడా వర్షాల కోసం ఎదురుచూడాలని సూచిస్తున్నారు. ఎల్నినో ప్రభావం రుతుపవనాలపై పడుతున్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఎక్కువగా సాగునీటి అవసరమున్న వరి, చెరుకు లాంటి పంటలకు బదులుగా ఇతర పంటలు వేసుకుంటే మంచిదని చెబుతున్నారు. తొందరపడి విత్తనాలు వేయొద్దు సరిపడా వర్షాలు కురవలేదు. రైతులు తొందరపడి విత్తనాలు విత్తుకోవద్దు. సగటున 50–100 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదయ్యాక విత్తనాలు వేయాలి. తొందరపడి వేస్తే మొలకెత్తిన మొక్కలు ఎండిపోతాయి. తద్వారా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. జిల్లాలో ఖరీఫ్నకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలి. నకిలీ విత్తనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. – జాడి మిలింద్కుమార్, ఏడీఏ జిల్లాలో వానాకాలం సాగు అంచనాసాగు విస్తీర్ణం: 4.52 లక్షల ఎకరాలు పత్తి సాగు: 3.70 లక్షల ఎకరాలు కావాల్సిన విత్తనాలు: 7,41,826 ప్యాకెట్లు యూరియా... : 60,583 మెట్రిక్ టన్నులు డీఏపీ.. : 22,608 మెట్రిక్ టన్నులు నానో యూరియా: 3.70 లక్షల లీటర్లు -
‘ఇందిరమ్మ’పై ఆశలు
కెరమెరి: మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాని అర్హులు రెండో విడతపై గంపెడాశలు పెట్టుకున్నారు. రెండో విడతలో ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించడంతో సంబురపడుతున్నారు. త్వరలో అధికారులు గ్రామాల్లో సర్వే ప్రారంభించనున్నారు. గతంలోనే దరఖాస్తుదారుల పూర్తి వివరాలు సేకరించిన అధికారులు తాజాగా మళ్లీ ఆరా తీయనున్నారు. నియోజకవర్గానికి 2వేల చొప్పున.. జిల్లాలో రెండు నియోజకవర్గాలుండగా ప్రభుత్వం సిర్పూర్(టి) నియోజకవర్గానికి 1,500, ఆసిఫాబా ద్కు 1,500 ఇళ్లు మంజూరు చేసింది. అదనంగా పా త ఇందిరమ్మ ఇళ్ల మరమ్మతుకు అనుమతించింది. ఒక్కో నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున వెయ్యి మంజూరు చేసింది. మరమ్మతుల పరిస్థితులను పరిశీలించి ఒక్కో ఇంటికి రూ.2లక్షలు మంజూరు చేయనుంది. బీఆర్ఎస్ ప్రభుత్వానికంటే ముందు న్న ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నవారే ఇందుకు అర్హులు. ఆ ఇంటికి రేకులు, లేదా పెంకులు వేసి ఉండాలి. వాటిని తీసేసి స్లాబు వేస్తారు. కానీ, గోడలు గట్టిగా ఉండాలి. లబ్ధిదారు ని అనుమతితో మరమ్మతులు చేస్తారు. మొదటి విడతలో జిల్లాకు 8,850 ఇందిరమ్మ గృహాలు మంజూరు కాగా, 758 నిర్మాణాలు పూర్తయ్యాయి. 2,600 వరకు స్లాబ్ దశలో ఉండగా, మిగతావి వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వారంరోజుల్లో మండలాలవారీగా.. నియోజకవర్గాల వారీగా ఇళ్లు మంజూరు కాగా, మండలాలు, గ్రామపంచాయతీల వారీగా ఇంకా కేటాయించలేదు. మరో వారంరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తర్వాత ఇరిగేషన్, వ్యవసాయ, వెటర్నరీ, విద్య తదితర శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించనున్నారు. సర్వేకు ఎంపికై న అధికారులకు ప్రత్యేక లాగిన్ ఇస్తారు. వారు జాబితాలోని దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్లి ప్రత్యేక యాప్లో వివరాలు నమోదు చేస్తారు. నమోదు చేసిన వివరాలు ఎంపీడీవో లాగిన్కు వెళ్తే అక్కడి నుంచి హౌసింగ్ సంస్థకు అనంతరం పీడీ, కలెక్టర్కు పంపిస్తారు. గతంలో వచ్చిన దరఖాస్తులను ఎల్–1, ఎల్–2, ఎల్–3గా విభజించారు. పూరిగుడిసె ఉన్నవారికే ప్రాధాన్యం జిల్లాలో 65 పీవీటీజీ (ఆదిమ గిరిజనులు)లకు చెందిన గ్రామపంచాయతీలున్నాయి. వీటిలో సుమారు 5,123 మంది కుటుంబాలున్నాయి. ఇప్పటికే మొదటివిడతలో 2,167 కుటుంబాలకు పీఎం జన్మన్, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. మరో 1,931 మంది ఆదిమ గిరిజనుల జాబితాను అధికారులు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించారు. కాగా, ఇటీవల కెరమెరి మండంలోని కొత్తగూడ గ్రామాని కి ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి మరో 21వేల ఇళ్లను గిరిజనులకు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు స్పష్టత రాలేదు. రెండో విడతలో మంజూరైన ఇంది రమ్మ ఇళ్లను పూరి గుడిసె ఉన్నవారికే మొదటి ప్రా ధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శులు పూరి గుడిసెల వివరాలు సేకరిస్తున్నారు. త్వరలో సర్వే ప్రారంభిస్తాం జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు రెండో విడతలో 4వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో వెయ్యి పాత గృహాలకు మరమ్మతులు చేయనున్నాం. పీవీటీజీలందరికీ ఇళ్లు మంజూరయ్యేలా చూస్తాం. త్వరలో గెజిటెడ్ అధికారుల ఆధ్వర్యంలో సర్వే ప్రారంభిస్తాం. పూరి గుడిసెలున్నవారికి ప్రాధాన్యం ఇస్తాం. అధికారులు సర్వే చేశాక ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించి ఇళ్లు మంజూరు చేస్తాం. – వేణుగోపాల్, హౌసింగ్ డీఈ కెరమెరి మండలం చిన్నుగూడ గ్రామానికి చెందిన ఈ కొలాం మహిళ పేరు మడావి లక్ష్మి. భర్త రెండేళ్ల క్రితమే ఈమెను వదిలి వెళ్లాడు. కూలీ పనులకు వెళ్లి ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది. శుక్రవారం వీచిన గాలివానకు ఈమె నివాసముండే షెడ్డు రేకులు లేచిపోగా నిరాశ్రయురాలైంది. వాస్తవంగా ఈమెకు పీఎం జన్మన్ లేదా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావాల్సి ఉంది. కానీ, ఈ గ్రామానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు. -
సైకిల్ యాత్రికుడికి ఎమ్మెల్యే అభినందన
రెబ్బెన: మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13జిల్లాల మీదుగా 17రోజులపాటు నిర్వహించిన వెయ్యి కిలోమీటర్ల సైకిల్ యాత్రకు గుర్తింపుగా గోలేటికి చెందిన ఓరగంటి రంజిత్కుమార్ ఇండియన్ వరల్డ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికెట్లు అందుకున్నారు. ఈ సందర్భంగా రంజిత్ను ఎమ్మెల్యే కోవ లక్ష్మి తన నివాసంలో శనివారం అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు యువత ముందుకురావడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. యువతలో చైతన్యం తీసుకురావాలనే సంకల్పంతో వెయ్యి కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువతను సానుకూల దిశగా నడిపించడమే కాకుండా సమాజానికి మంచి సందేశాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతతో పనిచేస్తూ యువతకు ఆదర్శంగా నిలిచిన రంజిత్ సేవలను ఎమ్మెల్యే ప్రశంసించారు. భవిష్యత్లోనూ ఇలాంటి సామాజిక అవగాహన కార్యక్రమాలు మరిన్ని చేపట్టి యువతలో చైతన్యం తేవాలని సూచించారు. కార్య క్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
16న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలు
కాగజ్నగర్టౌన్: ఈ నెల 16న పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రథమ మ హాసభలు నిర్వహించనున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్కుమార్ తెలిపారు. మండలంలోని చింతగూడ గ్రామంలో ఉపాధిహామీ పనులకు వెళ్లిన కూలీలను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేసి ఉపాధిహామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కొత్త చట్టం అమలుతో గ్రామీణ ప్రాంతాల్లో పనులు తగ్గి వ్యవసాయ కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మహాసభలకు ఉపాధిహామీ కూలీలు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. -
26 మంది మహిళలకు శిక్షణ
గుండాలకు వచ్చి వసతిగృహాల్లో బస చేసే పర్యాటకులకు కావాల్సిన ఆహార పదార్థాల తయారీతోపాటు వివిధ అంశాలపై హైదరాబాద్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ (నీతం) అనే సంస్థతో సెర్ప్ సహకారంతో 15రోజుల పాటు గుండాల, మంగి గ్రామాల్లోని 18–60 ఏళ్ల మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అంతకుముందు గుండాల గ్రామంలోని మరో 10మంది యువకులకు టూరిస్టులను ఎలా గైడ్ చేయాలనే అంశపై కూడా ట్రైనింగ్ ఇచ్చారు. పర్యాటకుల వసతి కోసం ఆదివాసీ ఇళ్లను తలిపించేలా ఏడు గృహాలతో పాటు కిచెన్, హాల్ నిర్మాణం చేపట్టారు. కాగా, పర్యాటకుల నుంచి వసూలు చేసిన రుసుం నుంచి శిక్షణ పొందిన సిబ్బందికి వేతనాలు అందించడంతో పాటు మిగతా డబ్బులను ఇప్పటికే ఏర్పాటు చేసిన విలేజ్ డెవలప్మెంట్ కమిటీ బ్యాంక్ ఖాతాలో జమ చేసి గ్రామావసరాల కోసం వినియోగించనున్నారు. తద్వారా 30 కుటుంబాలకు ప్రత్యక్షంగా, దుకాణాల ఏర్పాటు, అడవి ఫలాల అమ్మకం ద్వారా మరో 30కుటుంబాలకు పరోక్షంగా ఉపాధి లభించనుంది. -
వాతావరణం
ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. వాతావరణం చల్ల బడుతుంది. వర్షం కురిసే అవకాశముంది. ‘ప్రధాని చొరవతోనే ప్రజాసంక్షేమం’కాగజ్నగర్టౌన్: ప్రధాని నరేంద్రమోదీ చొ రవతోనే రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే పాల్వా యి హరీశ్బాబు పేర్కొన్నారు. దేశంలో 12 ఏళ్ల పాలనలో మోదీ పూర్తిగా ప్రజాసేవకు అంకితమయ్యారని తెలిపారు. శనివారం ప ట్టణంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ దేశాన్ని అత్యధి క సంవత్సరాలు పాలించిన ఘనత సాధించి రికార్డు సృష్టించారని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్యోజన, కిసాన్ సమ్మాన్ నిఽధి, ఉ జ్వల యోజన, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాలతో అర్హులైన ప్రతీ ఒక్కరికి కేంద్ర ప్ర భుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు. పుష్కర కాలంలో గ్రామీణ స డక్ యోజన కింద జాతీయ రహదారుల ని ర్మాణం పూర్తి చేసుకున్నట్లు చెప్పారు. పైసలు లేని ప్రజాపాలనతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దండగగా మారిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలను వి మర్శించడమే పనిగా పెట్టుకున్న సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. ఆర్మీకి విద్యార్థుల ఎంపిక కాగజ్నగర్టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డి గ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతు న్న విద్యార్థులు మాండోరె శంకర్, గౌత్రే క ల్యాణ్, కమినవేని సతీశ్ ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్గా ఎంపికై నట్లు ప్రిన్సిపల్ శ్రీదేవి, కెరీర్ గైడెన్స్ సెల్ ఇన్చార్జి డాక్టర్ లక్ష్మీనరసింహులు శనివారం ఓ ప్రకటనలో తెలిపా రు. గతేడాది ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ నియామకాల ఎంపిక పక్రియలో పాల్గొని రాత పరీక్ష, శారీరక పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ఇటీవల నియామక ఉత్తర్వులు అందుకున్నట్లు పేర్కొన్నారు. వీరిని కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. -
జైనూర్ ఆస్పత్రిని ఉన్నతీకరించాలని మంత్రికి వినతి
కెరమెరి(జైనూర్): జైనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని 40 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహను డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ కోరారు. శుక్రవారం హైదరాబాద్లో మంత్రిని కలిశారు. శాలువాతో సన్మానించి వినతిపత్రం అందించారు. జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్, తిర్యాణి, కెరమెరి, నార్నూర్ మండలాల ఆదివాసీలకు జైనూర్ ఆస్పత్రి ప్రధాన వైద్య కేంద్రంగా సేవలందిస్తోందని తెలిపారు. ఆస్పత్రిలో పడకలు, వైద్యులు, నర్సులు, వైద్య పరికరాల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గర్భిణులు, బాలింతలు వైద్య పరీక్షలకు దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సుగుణ పేర్కొన్నారు. ఆమె వెంట మార్లావాయి సర్పంచ్ ప్రతిభ ఉన్నారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పనకు కృషి కాగజ్నగర్టౌన్: మహిళలకు స్వ యం ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ కొత్తపల్లి అనిత పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని వెంకటేశ్వర ఆప్టికల్ హాల్లో కొత్తపల్లి వెంకటలక్ష్మీచంద్ర య్య మెమోరియల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదగా లని, తమ కాళ్లమీద తాము నిలబడేలా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు పే ర్కొన్నారు. రెండు నెలల శిక్షణలో ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసాపత్రం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సమాజంలో ఉన్నత స్థాయిలో నిలవాలని ఆకాంక్షించారు. వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, వార్డ్ ఆఫీసర్ సుజాత, ఆర్పీ మాధవి, ఇన్స్ట్రక్టర్ సవిత, వినోద, నాగమణి, శ్రీనివాస్ వసంత్, మహిళలు పాల్గొన్నారు. తుడుందెబ్బ బహిరంగ సభ విజయవంతం చేయాలి ఆసిఫాబాద్అర్బన్: జూలై 31న కుమ్రంభీం పోరుగడ్డలో లక్ష మందితో నిర్వహించనున్న తు డుందెబ్బ బహిరంగ సభను విజయవంతం చేయాలని తు డుందెబ్బ జాతీయ అధ్యక్షుడు కో ట్నాక విజయ్, రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని గోండువాన రాయిసెంటర్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే లంబాడాల వలసలపై జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటు చేయాలని, ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఐటీడీఏల ద్వారానే షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వకుండా అడవికి దూరం చేస్తున్నారని ఆరోపించారు. ఆదివాసీల సమస్యలపై చర్యలు జరిపి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జూలై 1నుంచి డిసెంబర్ 30వరకు పోరాట కార్యాచరణ రూపొందించి ఉద్యమాలను ఉధృత్తం చేస్తామని హెచ్చరించారు. రాంజ్గోండ్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు మడావి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్, జిల్లా సర్మేడి అధ్యక్షుడు మోతీరాం, తుడుందెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి జంగు పాల్గొన్నారు. -
కుమురం భీం
7ఇన్స్ట్రక్టర్ పోస్టులకు డిమాండ్ ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్ పోస్టుల కోసం నిరుద్యోగులు పోటీ పడుతున్నారు. లోకల్ అభ్యర్థులతోపాటు నాన్ లోకల్ వారు కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. సర్కారు బడికి కొత్త అ‘డ్రెస్’ ప్రభుత్వ పాఠశాలల్లోని 1నుంచి 12తరగతుల విద్యార్థుల యూనిఫాం మారింది. ఈ విద్యాసంవత్సరం నుంచే కొత్త యూనిఫాంఅమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. వాతావరణం చల్ల బడుతుంది. వర్షం కురిసే అవకాశముంది.శనివారం శ్రీ 13 శ్రీ జూన్ శ్రీ 2026 -
విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తాం
ఆసిఫాబాద్రూరల్: విద్యుత్ వినియోగదారుల స మస్యలు పరిష్కరిస్తామని వినియోగదారుల చైర్ ప ర్సన్ జయవంతరావు పేర్కొన్నారు. మండలంలోని బూర్గుడ సబ్స్టేషన్లో శుక్రవారం విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ఆసిఫాబాద్, వాంకిడి, రెబ్బెన మండలా ల నుంచి వివిధ సమస్యలపై వినియోగదారులు దరఖాస్తులు అందజేశారు. సమస్యలు త్వరగా పరి ష్కరిస్తామని సంబంధిత అధికారులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఫైనాన్స్ మెంబర్ సత్యనారాయణ, ఎస్ఈ ఉత్తమ్ జాడే, ఏవో దేవిదాస్, డీఈ వీరేశ్, నాగరాజ్ ఉన్నారు. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
ఆసిఫాబాద్అర్బన్: పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం సీఐటీ యూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. గ్రామాల పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణకు కీలక సేవలందిస్తున్నా ఉద్యోగ భద్రత, కనీస వేతనం అమలు, పీఎఫ్, ఈఎస్ఐ, బీమా తదితర సదుపాయాలు లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించి, నాలుగు నెలల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. జీవో 51ని సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి పాత కేటగిరీలను కొనసాగించాలన్నారు. కారో బార్, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక హోదా, కార్మికులందరికీ రూ.10 లక్షల బీమా సౌకర్యం కలించాలని, ప్ర మాద మరణాలకు రూ.20లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కె.హరితకు వినతిపత్రం అందజేశారు. నాయకులు కృష్ణమాచారి, మోరేశ్వర్, పెరిక శ్రీకాంత్, శంకర్, నగేశ్, పుష్పలత, రమేశ్, భాగ్య, రాజమ్మ, లక్ష్మి, భార్గవ్, వసంత్, అజిత్ఖాన్, మారుతి తదితరులున్నారు. -
కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష
కాగజ్నగర్టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లులో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కార్మికులు చేపట్టిన రిలే నిరహార దీక్ష 24వ రోజుకు చేరింది. శుక్రవారం వీరికి ప్రజాసంఘాల నాయకులు మద్దతు తె లిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మి ల్లు కార్మికులకు తమ ప్రతినిధులను ఎన్నుకునే ప్ర జాస్వామ్య హక్కు ఉందని తెలిపారు. ఎన్నికలు ని ర్వహించకపోవడమంటే కార్మికుల హక్కులను కా లరాయడమేనని పేర్కొన్నారు. యాజమాన్యం స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించి, గు ర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్మికశాఖ అధికారులు జోక్యం చేసుకుని ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు ప్రజాసంఘాల మద్దతు ఉంటుందని తెలిపా రు. సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు త్రివేణి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు రాజేందర్, ముంజం శ్రీనివాస్, కార్మికులు పాల్గొన్నారు. -
మేకల పంపిణీలో చేతివాటం?
తిర్యాణి: ఆదివాసీల్లోని నిరుపేదలకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్జీవో ఆధ్వర్యంలో ‘తెలంగాణ సమ్మెళిత జీవనోపాధి’ కార్యక్రమానికి సెర్ప్ ద్వారా శ్రీకారం చుట్టింది. ఇందుకు జిల్లాలోని తిర్యాణి, లింగాపూర్ మండలాలను ఎంపిక చేసింది. తిర్యాణి మండలానికి దాదాపు రూ.4కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఒక్కో లబ్ధిదారుకు దాదాపు రూ.35వేల విలువైన లైవ్వుడ్, ఇతర సామగ్రి అందజేయాల్సి ఉంది. మొదటి విడతలో భాగంగా శుక్రవారం మండలంలోని దానాపూర్లో ఒక్కో లబ్ధిదారుకు రూ.24,800 విలువైన నాలుగు మేకపిల్లలు పంపిణీ చేశారు. అయితే, సదరు ఎన్జీవో సిబ్బంది, విక్రయదారులు కుమ్మకై ్క లబ్ధిదారులను మోసం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దానాపూర్లో పంపిణీ చేసిన మేకలు మహారాష్ట్రకు చెందినవి కావడం, అవి చిన్నగా ఉండటంతో వాటి ధర బహిరంగ మార్కెట్లో రూ.3వేల నుంచి రూ.4వేల మధ్య ఉంటుందని లబ్ధిదారులు చెబుతున్నారు. కానీ, రూ.6,200 చొప్పున కొనుగోలు చేసినట్లు చెబుతుండడంతో లబ్ధిదారుల్లో అసంతృప్తి నెలకొంది. మహారాష్ట్ర మేకలు జిల్లా వాతావారణాన్ని తట్టుకోవడం సాధ్యం కాదని, స్థానికంగా లభించే మేకలు ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు. కాగా, మేకల కొనుగోలులో వెట్నరరీ వైద్యులను భాగస్వాములను చేయకపోవడంతో సదరు సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లు సమాచారం. -
ఖరీఫ్ సాగుడెలా?
దహెగాం: ఖరీఫ్ సాగుకు పెట్టుబడి డబ్బులు లేక జిల్లాలోని చాలామంది రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించగా ఇప్పటికీ డబ్బులు అందక అవస్థలు పడుతున్నారు. కొనుగోళ్ల సమయంలోనూ తూకం, ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం జరిగింది. తీరా పంట అమ్ముకుని డబ్బులు పడ్డాయో.. లేదోనని నిత్యం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ నిరాశతో వెనుదిరుగుతున్నారు. 14,981 ఎకరాల్లో జొన్న సాగు జిల్లాలో ఏజెన్సీ మండలాలైన జైనూర్, కెరమెరి, సిర్పూర్(యు), లింగాపూర్, నార్నూర్ తదితర మండలాల్లో యాసంగిలో 14,981 ఎకరాల్లో జొన్న సాగు చేశారు. పంట చేతికి రాగానే జైనూర్, కెరమెరి మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం 801 మంది రైతుల నుంచి 26,989 క్వింటాళ్లు కొనుగోలు చేసింది. రూ.9.98 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా నేటికీ ఒక్క పైసా రైతుల ఖాతాల్లో జమ కాలేదు. 9,100 ఎకరాల్లో మొక్కజొన్న..జిల్లాలో 9,100 ఎకరాల్లో రైతులు మొక్క జొన్న సాగు చేసినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. పంట చేతికందడంతో జైనూర్, కాగజ్నగర్, కౌటా ల మండలాల్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,508 మంది రైతుల నుంచి 65,466 క్వింటాళ్ల మొక్కజొన్న కోనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి రూ.15.71కోట్లకు రైతుల ఖాతాల్లో రూ.2.83 కోట్లు మాత్రమే జమైనట్లు అధికారులు తెలిపారు. మిగతా రూ.12.88 కోట్లు ఇంకా విడుదల కావాల్సి ఉంది. 23వేల ఎకరాల్లో వరి..జిల్లాలో పత్తి తరువాతి స్థానంలో వరి సాగవుతోంది. యాసంగిలో 23వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. 69వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, మే లో సొసైటీ, ఐకేపీ ద్వారా జిల్లాలో 40 కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు 14,875 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఇందులో సన్నరకం 1,951 మెట్రిక్ ట న్నులు, దొడ్డు రకం 12,924 మెట్రి క్ టన్నులు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. 1,557 మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.19.72 కోట్లు కాగా, 397 మంది రైతుల ఖాతాల్లో రూ.4.77 కోట్లు జమయ్యాయి. ఇంకా 1,160 మంది రైతులకు రూ.14.95 కోట్లు జమ కావాల్సి ఉంది. కొనుగోళ్లు, ధాన్యం తరలింపులో జాప్యం జరిగి రైతులు అకాల వర్షాలకు పంటలను కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాము ధాన్యం విక్రయించి రెండు, మూడు వారాలైనా డబ్బులు ఖాతాల్లో జమ కాలేదని రైతులు వాపోతున్నారు. మృగశిర కార్తె ప్రవేశించి ఖరీఫ్ పనులు ప్రారంభమైన నేపథ్యంలో పెట్టుబడికి చేతిలో డబ్బులు లేక ఆందోళన చెందుతున్నారు. -
ముగిసిన బాక్సింగ్ శిక్షణ
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని సర్సిల్క్ కా లనీలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాక్సింగ్ సమ్మర్ కోచింగ్ శుక్రవారం ముగిసింది. మే1 నుంచి జూన్ 12 వరకు నిర్వహించిన కోచింగ్ శిబిరానికి బాలబాలికలు హాజరై బాక్సింగ్లో ప్రాథమిక నైపుణ్యాలు నేర్చుకున్నట్లు బాక్సింగ్ అసోసియేష న్ జిల్లా అధ్యక్షుడు వేముర్ల మధు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిబి రంలో నేర్చుకున్న నైపుణ్యాలు మరింత మెరుగుపర్చుకుని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పో టీల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. శిబిరాన్ని విజయవంతంగా కొనసాగించేందుకు సహకరించిన వా రిని అభినందించారు. కార్యక్రమంలో చైర్మన్ జయేందర్, శివకుమార్, మధురై శేఖర్, అశ్వక్హైమద్, కోనేరు శ్రీకాంత్, రాకేశ్, సాయికుమార్, శివ, వంశీ, క్రీడాకారులు పాల్గొన్నారు. -
28న జాతీయ పల్స్ పోలియో
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో ఈ నెల 28న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం, జూలై 13న జాతీయ నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేపడుతున్నట్లు కలెక్టర్ కె.హరిత తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం జాతీయ పల్స్ పోలియో, జాతీయ నులిపురుగుల నివారణ దినం ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ పల్స్ పోలియో దినం సందర్భంగా ఈ నెల 28న ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో వాక్సిన్(పోలియో చుక్కలు) వేయించాలన్నారు. 46,516 మంది ఐదేళ్లలోపు చిన్నారుల కోసం జిల్లావ్యాప్తంగా 670 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 28న చుక్కలు వేయించుకోలేని వారికి 29, 30వ తేదీల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది నేరుగా ఇంటికి వెళ్లి వేస్తారన్నారు. జూలై 13న జాతీయ నులిపురుగుల నివారణ దినాన్ని పురస్కరించుకుని 1 నుంచి 19 ఏళ్లలోపు 1,67,702 మంది పిల్లలు, యువతకు అల్బెండజోల్ మాత్రలు అందించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా నివారణ మాత్రలు పంపిణీ చేస్తామని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎస్హెచ్జీ మహిళా స్వయం సహాయక సంఘాల మహిళల సహకారం తీసుకోవాలని ఆదేశించారు. డీఆర్వో దాసరి వేణు, డీఎంహెచ్వో సీతారాం, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించాలిఆసిఫాబాద్అర్బన్: రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం ఎల్ 1 జాబితాలో ఉన్న వారి ఇళ్లను, సామాజిక, ఆర్థిక స్థితిగతులను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్తో కలిసి గురువారం ఎంపీడీవోలు, సెర్ప్ ఏపీఎం, ఈజీఎస్ ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం, ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పంచాయతీ భవనాలు, పాఠశాలల ప్రహరీల నిర్మాణంపై చర్చించారు. అధికారులు సమన్వయంతో పని చేస్తూ నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. డీఆర్డీవో దత్తారావు, పీడీ ప్రకాష్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్వ్యూలకే పరిమితం!
తిర్యాణి: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గతేడాది మే నెలలో ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం అనే పథకానికి శ్రీకారం చుట్టింది. ఏడాది కాలం గడిచినా నేటికీ దరఖాస్తు చేసుకున్న వారికి రుణాలు అందించలేదు. దరఖాస్తుదారులకు కేవలం ఇంటర్వ్యూలు నిర్వహించడం వరకే అధికారులు పరిమితమయ్యారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనార్టీలకు రూ.50 వేల నుంచి మొదలుకుని రూ.4 లక్షల వరకు వివిధ రకాల యూనిట్ల కొనుగోలు కోసం బ్యాంకు లింకేజీతో కూడిన రుణాలను అందించాల్సి ఉంది. అలాగే రూ.50 వేల యూనిట్కు వంద శాతం సబ్సిడీ, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల రుణాలకు 80 శాతం సబ్సిడీ, రూ.2 లక్షల పైనుంచి రూ.4 లక్షల యూనిట్ల కోసం 70 శాతం సబ్సిడీని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రేషన్కార్డు కలిగిన నిరుపేద కుటుంబంలోని ఒక్కరికి మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆన్లైన్తోపాటు ఆఫ్లైన్ పద్ధతిలోనూ దరఖాస్తులు స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు యువ వికాసం పథకం రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో 29,756 దరఖాస్తులురాజీవ్ యువ వికాసం పథకం కోసం జిల్లాలో వివిధ వర్గాలకు చెందిన 29,756 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే లబ్ధిదారుల ఎంపిక కోసం మండలాల వారీగా రుణ లక్ష్యాలను ఖరారు చేశారు. అధికారులు సంబంధిత బ్యాంకు సిబ్బందితో కలిసి దరఖాస్తుదారులకు గతేడాదిలోనే ఇంటర్వ్యూలను సైతం నిర్వహించారు. దీంతో లబ్ధిదారులలో ఆశలు మొదలయ్యాయి. ఇందుకు అనుగుణంగానే ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయిన 2025 జూన్ 2 నుంచి ప్రారంభిస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటన కూడా చేసింది. కానీ సంవత్సర కాలం దాటిపోయినా పథకం ప్రారంభానికి నోచుకోకపోవడంతో దరఖాస్తుదారుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ ఏడాది 2026– 27 ఆర్థిక బడ్జెట్లో సైతం రాజీవ్ యువ వికాసం పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5,800 కోట్ల నిధులు కేటాయించింది. అయినా లబ్ధిదారులకు రుణాల పంపిణీ చేయడం లేదు. పథకాన్ని వెంటనే ప్రారంభించి అర్హులైన వారందరికీ రుణాలు అందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఆటో కోసం దరఖాస్తు ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకంలో నేను ఆటో కోసం దరఖాస్తు చేసుకున్నాను. గతేడాది జూన్ 2 నుంచే రుణాలను అందిస్తామని చెప్పారు. కానీ నేటికీ వాటికి సంబంధించిన వివరాలు ఎవరిని అడిగినా చెప్పడం లేదు. ప్రభుత్వం లోన్ ఇప్పిస్తే స్వయం ఉపాధి పొందుతా. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంటర్ పూర్తి చేసిన నాకు ఉద్యోగం దొరకకపోవడంతో ప్రైవేటు డ్రైవర్గా కాలం వెల్లదీస్తున్నాను. – మహదేవుని పవన్, గోలేటి, మం.రెబ్బెన మోసం చేయడం సరికాదు యువ వికాసం పేరిట రుణాలను ఇప్పిస్తామని చెప్పి దరఖాస్తులను తీసుకున్నారు. ఇప్పుడు రుణాలు ఇవ్వకుండా మోసం చేస్తూ కాలం గడపడం సరికాదు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను దారి మళ్లించడానికే ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. నిరుద్యోగులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాలయాపన చేయకుండా వెంటనే అర్హులైన నిరుద్యోగులందరికీ బేషరతుగా రుణాలు అందజేయాలి. – ఇగురపు సంజీవ్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి -
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
వాంకిడి: ప్రజలు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ అశోక్ అన్నారు. మండలంలోని బనార్కొసార, చిన్న వాంకిడి గ్రామాల్లో గురువారం డాగ్ స్క్వాడ్తో విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై పలు విషయాలపై అవగాహన కల్పించారు. గంజాయి విక్రయం, వినియోగంపై జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గంజాయి వాడకం, చెట్ల పెంపకం జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. యువత చదువు, క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. మత్తు పదార్థాల జోలికి వెళ్లి జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. కార్యక్రమంలో సీఐ వేణుగోపాల్, ఎస్సై మహేందర్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎక్కడి పనులు అక్కడే..!
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు ఈ నెల 15న పునఃప్రారంభం కానున్నాయి. అయితే కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థులకు పాత సమస్యలే స్వాగతం పలకనున్నాయి. జిల్లాలోని చాలా బడుల్లో ఇంకా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహరీలు, వంట గదుల నిర్మాణాలు పూర్తికాలేదు. పాత మరుగుదొడ్లు, తరగతి గదులు, వంటశాలలకు మరమ్మతులూ చేపట్టలేదు. సోమవారం బడులకు వచ్చే విద్యార్థులకు ఇక్కట్లు ఎదురుకానున్నాయి. ప్రహరీలు సైతం లేకపోవడంతో పిల్లల రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. గురువారం జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. పూర్తికాని మరుగుదొడ్లుజిల్లాలో 738 ప్రభుత్వ పాఠశాలు(స్థానిక సంస్థలు) ఉండగా, 2,072 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. సుమారు 39 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గిరిజన ప్రాథమిక పాఠశాలలు 334, ఆశ్రమ ఉన్నత పాఠశాలలు 46 ఉండగా, 13,126 మంది ఉన్నారు. ఆయా పాఠశాలల భవనాలు చాలాచోట్ల శిథిలావస్థకు చేరాయి. అదనపు తరగతి గదుల అసంపూర్తిగా ఉన్నాయి. ముఖ్యంగా అత్యంత కీలకమైన మరుగుదొడ్ల పనులు కూడా పూర్తి చేయలేదు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 459 పాఠశాలల్లో అదనంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మా ణానికి నిధులు మంజూరు కాగా, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు. ఇప్పటివరకు 218 పూర్తి కాగా మరో 241 నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఇందులో సీఎస్ఆర్ నిధులతో పాఠశాలల్లో బాలికలకు 25, బాలురకు 157 టాయిలెట్ల నిర్మాణం చేపట్టారు. ఒక్కోదానికి రూ.58 వేల చొప్పున నిధులు విడుదలయ్యాయి. ఈ పనుల్లో కొన్ని పూర్తి కాగా మరికొన్ని ప్రారంభమే కాలేదు. ఉపాధిహామీ పథకం కింద రెండు దశల్లో 277 పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మాణం కోసం రూ.2 లక్షల చొప్పున కేటాయించారు. స్థలం లేని 13 పాఠశాలలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్ల నిర్మాణం చేపట్టారు. కనీస వసతులు కరువుమరమ్మతులు లేక.. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు జిల్లాలోని వివిధ పాఠశాలల్లో ప్రస్తుతం మరుగుదొడ్ల నిర్మాణ పనులు 60 శాతం పూర్తికాగా, మిగితా పనులు కొనసాగుతున్నాయి. పిల్లలు ఎక్కవగా ఉన్న పాఠశాలల్లో అదనంగా నిర్మిస్తాం. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతాం. – సచ్చిదానంద చారి, డీఈవో -
మండలాలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని డిపో నుంచి మండలాలకు పాఠ్యపుస్తకాలు పంపి ణీ చేస్తున్నట్లు జిల్లా నోడల్ అధికారి సుభాష్ తెలిపారు. గురువారం స్థానిక మోడల్ స్కూల్లోని డిపోను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 15న ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా, అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు సకాలంలో చే రేలా ఎంఈవోలు చర్యలు తీసుకోవాలని సూ చించారు. ఇప్పటివరకు జిల్లాకు పార్ట్– 1కు సంబంధించిన 90,880 పుస్తకాలు వచ్చాయ ని తెలిపారు. డిపో మేనేజర్ ప్రకాశ్, సీఆర్పీ నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు కోసం గ్రామస్తుల రాస్తారోకో
వాంకిడి: నాలుగు వరుసల జాతీయ రహదారి– 363 నిర్మాణ సమయంలో భారీ వాహనాల రాకపోకలతో తమ గ్రామ రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని.. తిరిగి నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన కంపెనీ వారు ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని మండలంలోని సోనాపూర్ గ్రామస్తులు గురువారం ఆందోళనకు దిగారు. గణేష్పూర్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి కంపెనీ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. 2021లో హైవే నిర్మాణానికి గ్రామం మీదుగా భారీ వాహనాలతో మట్టిని తరలించడంతో బీటీ రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని వాపోయారు. తక్షణమే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అలాగే గణేష్పూర్ వద్ద బస్టాండ్ నిర్మించాలని, సర్వీస్ రోడ్డు, సైడ్ డ్రెయిన్ పనలు పూర్తి చేయాలని కోరారు. -
అనధికార దత్తత చట్టరీత్యా నేరం
ఆసిఫాబాద్అర్బన్: పిల్లలు లేని దంపతులు కేంద్ర దత్తత వనరుల ప్రాధికార సంస్థ(సీఏఆర్ఏ) మార్గదర్శకాల ప్రకారం దత్తత తీసుకోవాలని, మధ్యవర్తుల ద్వారా, అనధికార దత్తత చట్టరీత్యా నేరమని కలెక్టర్ కె.హరిత అన్నారు. కాగజ్నగర్ మండలం చింతగూడకు చెందిన దుర్గం లింగయ్య, రేణుక దంపతులకు చట్టబద్ధమైన రిలేటీవ్ అడప్షన్ ప్రక్రియ పూర్తయినందున జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం మహిళాశిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో అడాప్షన్ ఆర్డర్ ప్రతిని అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ చిన్నారికి సురక్షితమైన కుటుంబ వాతావరణంలో పెరిగే హక్కు ఉందని, దత్తత ప్రక్రియ ద్వారా పిల్లలకు ప్రేమ, భద్రత, విద్య, మంచి భవిష్యత్తు కల్పించే అవకాశం ఉందని తెలిపారు. దత్తత ప్రక్రియలో పారదర్శకత, చట్టబద్ధత, పిల్లల సంక్షేమమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధానాలు తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. దత్తత తీసుకోవాలనుకునే దంపతులు మహిళాశిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని జిల్లా బాలల సంరక్షణ విభాగాన్ని సంప్రదించాలని కోరారు. సంబంధిత అధికారులు నిబంధనలు, అవసరమైన పత్రాలు, చట్టబద్ధ ప్రక్రియలపై సమాచారం అందించి సహకరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి స్వరూపారాణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేశ్, ప్రొటెక్షన్ అధికారి శ్రావణ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. పునఃప్రారంభానికి చర్యలు తీసుకోవాలి కాగజ్నగర్టౌన్: పట్టణంలోని కాపువాడలో మూతపడిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని కలెక్టర్ కె.హరిత, విద్యాశాఖ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ పదేళ్లుగా మూతపడిన ప్రభుత్వ పాఠశాలలో వసతులు కల్పించి తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈవో వాసాల ప్రభాకర్, అధికారులు పాల్గొన్నారు. -
అడ్డగోలుగా ర్యాంపులు
ఆసిఫాబాద్ పట్టణంలో 20 వార్డు ఉన్నాయి. 6,512 కుటుంబాలు, 20 వేల వరకు జనాభా ఉంది. 120 మంది పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు. గతేడాది పైకాజీనగర్, బజార్వాడీ, రవిచంద్ర కాలనీ, తదితర కాలనీల ప్రజలు వరద నీటితో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా పట్టణంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా ఇళ్ల ఎదుట అక్రమంగా ర్యాంపులు నిర్మించారు. తద్వారా డ్రెయినేజీల్లో పూడిక తీయడం కష్టంగా మారింది. చిన్నపాటి వర్షం పడినా రోడ్లపైకి వర్షపు నీరు చేరుతోంది. మరోవైపు ఎప్పటికప్పుడు పూడిక తీయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పైకాజీనగర్, బ్రాహ్మణవాడ, బజార్వాడీ రహమత్నగర్, రవిచంద్ర కాలనీ, హడ్కో కాలనీలకు వరద ముప్పు పొంచి ఉంది. పట్టణం నడిబొడ్డున ఉన్న ఓపెన్ ప్లాట్లు దోమలకు ఆవాసాలుగా మారాయి. పిచ్చిమొక్కలు పెరిగి విష సర్పాలు ఇళ్ల మధ్యే తిరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పట్టణంలో రెండు ట్రాక్టర్లు, ఐదు ట్రాలీ ఆటోలతో చెత్త సేకరిస్తున్నామని, త్వరలో మరో రెండు ట్రాక్టర్లు అద్దెకు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. -
ఉత్పత్తి సాధనకు యంత్రాలు కీలకం
రెబ్బెన: గనుల నిర్వహణ, అధిక బొగ్గు ఉత్పత్తి సాధనకు ఆధునిక సాంకేతికత కలిగిన యంత్రాలు ఎంతో కీలకమని జీఎం శ్రీ రమేశ్ అన్నారు. బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీలో బుధవారం నూతన క్రేన్కు పూజలు చేసి ప్రారంభించారు. జీఎం మాట్లాడుతూ యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తూ అధిక ఉత్పత్తి సాధించాలని సూచించారు. ఉత్పాదకత పెంపు, నిర్వహణ పనుల్లో వేగం, భద్రత ప్రమాణాల మెరుగుదల లక్ష్యంగా సంస్థ ఆధునిక యంత్రాలను అందుబాటులోకి తీసుకువస్తోందని తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన క్రేన్ 12 టన్నుల సామర్థ్యంతో పనిచేస్తుందని, భారీ యంత్రాల మరమ్మతు, విడిభాగాల తరలింపు, నిర్వహణ పనులు సులభతరంగా జరుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, ప్రాజెక్టు అధికారి నరేందర్, ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, ఇన్చార్జి ఎస్వోటూజీఎం ఉమాకాంత్, ప్రాజెక్టు ఇంజినీర్ వీరన్న, డీజీఎం పర్సనల్ కిరణ్బాబు, సేఫ్టీ అధికారి మధుసూదన్, మేనేజర్ శంకర్, ఫిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలి
ఆసిఫాబాద్రూరల్: ప్రతిఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని ఎస్పీ నితిక పంత్ అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపే సమయంలో సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించారు. ఏటా రోడ్డు ప్రమాదాల్లో యువత అధికంగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ట్రిపుల్ రైడింగ్, మద్యం తాగి, మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని కోరారు. అనంతరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన దృశ్యాలకు స్క్రీన్పై ప్రదర్శించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చిత్తరంజన్, డీఎస్పీ అశోక్, ప్రిన్సిపాల్ ప్రియదర్శిని, సీఐలు బాలాజీ వరప్రసాద్, సతీశ్ పాల్గొన్నారు. -
భీం చరిత్ర స్ఫూర్తిదాయకం
కెరమెరి: పోరాటయోధుడు కుమురం భీం చరిత్ర అందరికీ స్ఫూర్తిదాయకమని శిక్షణ ఐఏఎస్లు హరిప్రసాద్, సాయి సురేశ్, సాయి శివాణి, శ్రీకాంత్రెడ్డి, సచిన్ బజవర గొట్టు, పారస్కుమార్ అన్నారు. మండలంలోని జోడేఘాట్ను బుధవారం సందర్శించారు. భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాధిపై పూలు చల్లి పూజలు చేశారు. అనంతరం భీం మ్యూజియాన్ని సందర్శించారు. గుప్పాడీ చేస్తున్న నృత్యాలు, ఆదివాసీలు ఆయుధాలు, ఆభరణలు, ఫొటో గ్యాలరీ, దేవతల ప్రతిమలను పరిశీలించారు. భీం పోరాటంతో ఆదివాసీలకు ప్రత్యేక చట్టాలు, హక్కులు అందించారని తెలిపారు. కార్యక్రమంలో ఏపీవో భాస్కర్, క్యూరేటర్ దుందేరావు, హెచ్ఎం మోతీరాం తదితరులు పాల్గొన్నారు. -
తేలని ‘గుర్తింపు’ ఎన్నికల వివాదం
కాగజ్నగర్టౌన్: ఎస్పీఎం గుర్తింపు ఎన్నికల వివాదం ఎటూ తేలడం లేదు. స్పష్టమైన పరిష్కారం లేకుండానే ఇరువర్గాల మధ్య సమావేశం ముగిసింది. మిల్లులో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని 22 రోజులుగా కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు, ఎస్పీఎం ప్రతినిధులతో హైదరాబాద్లోని రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ చంద్రశేఖర్, రాజేంద్రప్రసాద్ సమక్షంలో సమావేశం నిర్వహించారు. కార్మిక సంఘాల నాయకులు వాదనలు వినిపించారు. ప్రజాస్వామ్య హక్కులు గౌరవిస్తూ వెంటనే వెరిఫికేషన్ ఎన్నికలు నిర్వహించాని కోరారు. ఎస్పీఎం ప్రతినిధులు మాట్లాడుతూ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహణ ప్రక్రియ కోర్టు పరిధిలో ఉందని, తీర్పుకు అనుగుణంగా చర్యలు చేపడుతామని వివరించారు. సమావేశంలో జేఏసీ నాయకులు సిర్పూర్ పేపర్ మిల్లు మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు మల్లికార్జున్, మాజీ కార్మికశాఖ మంత్రి పెద్దిరెడ్డి, ఎస్పీఎం ప్రతినిధులు శేషగోపాల్, ఎంఎస్ గిరి, కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
సరిపడా పారిశుద్ధ్య సిబ్బంది లేక..
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా 70 వేలకు పైగా జనాభా ఉంది. ఈ స్థాయిలో జనాభా ఉన్నా అవసరమైన స్థాయిలో పారిశుద్ధ్య సిబ్బంది లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. పారిశుద్ధ్య విభాగంలో 136 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా అందులో కేవలం 20 మంది మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ముగ్గురు జవాన్లు, తొమ్మిది మంది మహిళా కార్మికులు పారిశుద్ధ్య విధులు నిర్వర్తిస్తుండగా ఔటర్ సోర్సింగ్ సిబ్బంది 116 మంది ఉన్నారు. చెత్త సేకరణకు ప్రతిరోజూ నాలుగు ట్రాక్టర్లలో 30 మంది, 12 ఆటో ట్రాలీల్లో 12 మంది చెత్త సేకరణకు వెళ్తున్నారు. మిగిలిన వారిలో 50 మంది మహిళలు వీధులను శుభ్రం చేస్తున్నారు. మరో 24 మందిలో పది మంది కార్యాలయంలోనే వివిధ విభాగాల్లో పని చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతీ 10వేల జనాభాకు కనీసం 29 మంది శానిటేషన్ కార్మికులు ఉండాలి. ఆ లెక్కన పట్టణానికి దాదాపు190 మందికి పైగా అవసరం. కానీ ప్రస్తుతం సిబ్బంది సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగడం లేదు. కొన్ని కాలనీల్లో చెత్త సేకరణ ఆలస్యమవుతుండగా, మరిన్ని ప్రాంతాల్లో డ్రెయినేజీలు శుభ్రం కాక నెలల తరబడి పూడిక పేరుకుపోయింది. పేరుకుపోయిన పూడిక పట్టణంలోని పలు సంజీవయ్య కాలనీ, ఇర్ఫాన్నగర్, కాపువాడ, ఓల్డ్ కాలనీ, ద్వారకానగర్, బాలాజీనగర్, కౌసర్నగర్ లోతట్టు ప్రాంతాల్లో డ్రైయినేజీల్లో పూడిక పేరుకుపోయింది. చాలాచోట్ల మురుగునీటి కాలువల్లో చెత్తా చెదారం, ప్లాస్టిక్ వర్థ్యాల కారణంగా నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతోంది. భారీ వర్షాలు కురిస్తే కాలనీల్లోకి నీరు చేరే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
‘గెలిచిన సంఘాల వైఫల్యంతోనే కష్టాలు’
రెబ్బెన: సింగరేణిలో గెలిచిన సంఘాల వైఫల్యంతోనే కార్మికులకు కష్టాలు మొదలయ్యాయని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ హైమద్ విమర్శించారు. బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీలో బుధవారం నిర్వహించిన హెచ్ఎంఎస్ గేట్ మీటింగ్కు హాజరై మాట్లాడారు. 14 నెలలుగా మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో అనేక మంది కార్మికులు అనారోగ్య సమస్యలతో విధులు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కార్మి కుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతినెలా కనీ సం రెండుసార్లు సమావేశాలు నిర్వహించాలని డి మాండ్ చేశారు. రాజకీయ జోక్యం లేకుండా పాత విధానంలోనే నియామక పత్రాలు అందించాలన్నారు. ఏఐటీయూసీ నాయకత్వం యాజమాన్యానికి ఒంటరిగా సమ్మె నోటీసు ఇవ్వడం కార్మికులను మోసం చేయడమేనని స్పష్టం చేశారు. కార్మిక సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే అన్ని సంఘాలను కలుపుకొని పోవాలని హితవు పలికారు. ఏరియా ఉపాధ్యక్షుడు పత్తెం రాజాబాబు, బ్రాంచి కార్యదర్శి శివారెడ్డి, ఫిట్ కార్యదర్శి దుర్గం వెంకటేశ్, అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి కుమార్గౌడ్, ఏరియా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎస్కే ఇనూస్ పాల్గొన్నారు. -
అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి
కాగజ్నగర్టౌన్: ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను జిల్లాలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు వినియోగించుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ మదిరే అశోక్ అన్నారు. పట్టణంలోని ఎస్పీఎం క్లబ్లో పారిశ్రామిక వేత్తలు, పరిశ్రమల నిర్వాహకులకు బుధవారం ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టార్టప్ ఇండియా పథకంలో కార్యాచరణ, నిధుల కల్పన, స్థానిక ఉపాధి, ఆర్థిక అభివృద్ధి అంశాలను వివరించారు. జిల్లాలో గుర్తించిన వివిధ ఉత్పత్తులకు మార్కెట్ లభ్యత, నిధుల సదుపాయం, ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి తెలియజేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ఆర్థిక అభివృద్ధిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సోలార్ వ్యవస్థ, పవర్ ఫ్యాక్టర్ సమస్యలు, ఉత్పత్తుల నాణ్యత వంటి అంశాలపై దృష్టి సారించాని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అందిస్తున్న పథకాలు, రాయితీలను వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమంలో డీపీ ఐఐటీ ప్రతినిధి గౌతమ్, ఓడీసీపీ ప్రతినిధి హర్మన్ ప్రీత్ సింగ్, తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ప్రతినిధి ప్రణయ్, రిచ్ ప్రతినిధి కిశోర్ కుమార్, గ్రీన్టెక్ సోలార్ సంస్థ ప్రతినిధి జగన్మోహన్, ఏబీబీ ప్రతినిధి యోగేశ్వర్, చంద్రకాంత్ పాల్గొన్నారు. -
వెల్కమ్ పోలీస్ బాస్
సాక్షి,ఆదిలాబాద్/ఆదిలాబాద్టౌన్: రాష్ట్ర పోలీస్ బాస్ మంగళవారం రాత్రి ఆదిలాబాద్కు విచ్చేశారు. డీజీపీ సీవీ ఆనంద్కు కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. వారి వెంట ఉమెన్ సేఫ్టీ, సీఐడీ డీజీ చారుసిన్హా ఉన్నారు. వీరు బుధవారం ఆదిలా బాద్ జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. బెల్లంపల్లిలో ఏడాదిపాటు అదనపు ఎస్పీగా.. డీజీపీ సీవీ ఆనంద్ తన కెరీర్ ప్రారంభంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లిలో ఆపరేషన్స్ అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (అడిషన ల్ ఎస్పీ)గా ఏడాది పాటు పనిచేశారు. నక్సలైట్లపై కూంబింగ్ ఆపరేషన్లకు స్వయంగా నాయకత్వం వహించారు. డీజీపీగా మే 1న బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలిసారిగా జిల్లాకు విచ్చేశారు. నేటి పర్యటన ఇలా.. డీజీపీ ఉదయం జిల్లా పోలీసు అధికారులతో క్రైమ్ రివ్యూ సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం కలెక్టరేట్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చేరుకుంటారు. ప్రజాపాలనలో భాగంగా నిర్వహించే గ్రామసభలో పాల్గొంటారు. వీటితో పాటు పలు ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొననున్నారు. -
దిందాలో ‘పోడు’ ఉద్రిక్తత
చింతలమానెపల్లి: మండలంలోని దిందా అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఖర్జెల్లి రేంజ్ పరిధిలోని దిందా అటవీ ప్రాంతంలో ఎఫ్ఆర్వో సుభాష్ ఆధ్వర్యంలో మంగళవారం ట్రాక్టర్లతో చదును పనులు చేపట్టగా, దిందా గ్రామానికి చెందిన పలువురు పోడు రైతులు అడ్డుకున్నారు. ఏళ్లుగా సాగు చేస్తున్న తమ భూములను అటవీ శాఖ స్వాధీనం చేసుకుందని ఆరోపించారు. మహిళలు, రైతులు ట్రాక్టర్లకు అడ్డుగా బైఠాయించారు. దీంతో అటవీ సిబ్బంది ఉన్నతాధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. చింతలమానెపల్లి ఎస్సై కమలాకర్, కౌటాల సీఐ సంతోష్ కుమార్ ఘటనా స్థలికి చేరుకున్నారు. సముదాయించినా వినకపోవడంతో అటవీశాఖ వాహనాల్లో కాగజ్నగర్ డివిజన్ కార్యాలయానికి తరలించారు. అవగాహన కల్పించిన అనంతరం రాత్రి వరకు వారిని వదిలిపెట్టారు. కాగా, డీఎస్పీ వహీదుద్దీన్ దిందాలోని ఘటనాస్థలిని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ‘పోడు’ సాగుపై అటవీశాఖ ప్రత్యేక దృష్టి – ఎఫ్డీవో అప్పయ్య కాగజ్నగర్టౌన్: అడవుల సంరక్షణ చర్యల్లో భాగంగా పోడు సాగుపై అటవీశాఖ ప్రత్యేక దృష్టి సారించిందని ఎఫ్డీవో అప్పయ్య తెలిపారు. ఖర్జెల్లి అటవీ డివిజన్ పరిధిలోని దిందా గ్రామ పంచాయతీలో పోడు వ్యవసాయం చేస్తున్న 25 మంది పోడు రైతులను మంగళవారం కాగజ్నగర్ డివిజన్ కార్యాలయానికి తీసుకువచ్చారు. వారికి పోడు వ్యవసాయం, చట్టపరమైన నిబంధనలపై అవగాహన కల్పించారు. ఎఫ్డీవో అప్పయ్య మాట్లాడుతూ దిందా ఫారెస్ట్లో 1600 ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైందని, ఒక్కో కుటుంబం 30 నుంచి 50 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని తెలిపారు. ఆక్రమణలు అడ్డుకునేందుకు ఫారెస్ట్ను ఆనుకుని ఉన్న 800 ఎకరాల ఫారెస్ట్ భూముల్లో ట్రెంచ్లు ఏర్పాటు చేసి ప్లాంటేషన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటూనే, కొత్తగా అడవులను ఆక్రమించే ప్రయత్నాలను అడ్డుకుంటామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్వో సుభాష్, బండెపల్లి పోడు రైతులు దన్నూరి లక్ష్మయ్య, హన్మంతు, బక్కయ్య, అంకులు, డోకె అంకులు, సురేష్, తిరుపతి, కమలాబాయి, సుజాత తదితరులు పాల్గొన్నారు. -
విధుల్లో అలసత్వం వహిస్తే సహించం
ఆసిఫాబాద్: వైద్యాధికారులు, సిబ్బంది విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే సహించమని కలెక్టర్ కె.హరిత హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అదన పు కలెక్టర్ యువరాజ్ మర్మాట్తో కలిసి మంగళవారం జిల్లాలోని పీహెచ్సీ, సీహెచ్సీల వైద్యాధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలందించా లన్నారు. వైద్యులు, హెల్త్ సూపర్వైజర్లు, క్షేత్ర స్థాయి సిబ్బంది సమయపాలన పాటించాలని సూ చించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా ప్రతిఒక్కరూ హాజరు నమోదు చేసుకోవాలన్నారు. సిబ్బంది హాజరు, పనితీరును యాప్లో ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మందులు, టీకాలు సకాలంలో అందేలా చూడాలన్నారు. రోగులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్వో సీతారాం, డిప్యూటీ డీఎంహెచ్వో నాగేంద్ర, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వృత్తి విద్యా కోర్సులతో ఉపాధి అవకాశాలుఆసిఫాబాద్: వృత్తి విద్యా కోర్సులతో ఉపాధి అవకా శాలు లభిస్తాయని కలెక్టర్ కె.హరిత అన్నారు. జై నూర్ మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో మంగళవారం జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు మూడు నెలలపాటు హైదరాబాద్లో ఉచితంగా శిక్షణ ఇస్తారని తెలిపారు. ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పి స్తారని, ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియో గం చేసుకోవాలని కోరారు. అసిస్టెంట్ ఎలక్ట్రీషియ న్, ఫాల్స్ సీలింగ్ టెక్నీషియన్, వెల్డింగ్, ఫాబ్రికేష న్, బైక్ రిపేరింగ్, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటీవ్(బాలికలు), ఎలక్ట్రికల్ హోం అప్లయన్సెస్ రిపేరింగ్, ఏసీ రిపేరింగ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారని తెలిపారు. ఫౌండేషన్ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
పేదోడికి కూరగాయాలు
దహెగాం: రోజురోజుకూ పెరుగుతున్న కూరగాయల ధరలు పేదలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మంగళవారం నిర్వహించిన వారసంతల్లో నిత్యావసరమైన టమాటా, పచ్చిమిర్చి ధరలు చుక్కలన్నంటాయి. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు పోషకాహారం కొనుగోలుకు ఇబ్బందులు పడుతున్నాయి. వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, రవాణా ఖర్చుల పెరుగుదల, నిల్వ సదుపాయాల కొరత తదితర అనేక కారణాలతో రేట్లకు రెక్కలు వస్తున్నాయి. స్థానిక రైతులు పండించడపోవడంతో వారసంతలకు సరఫరా తగ్గుతుంది. ఆగస్టు వరకు కూరగాయల ధరలు తగ్గే అవకాశాలు కనిపించడం లేదని పలువురు పేర్కొంటున్నారు. -
సహాయక వేదికగా భరోసా కేంద్రం
ఆసిఫాబాద్అర్బన్: వేధింపులు, హింస, లైంగిక దాడులు, గృహ హింస వంటి కేసుల్లో బాధితులకు భరోసా కేంద్రం ఒక సహాయక వేదికగా పనిచేయాలని ఎస్పీ నితిక పంత్ సూచించారు. జిల్లా కేంద్రంలోని భరోసా సెంటర్ను మంగళవారం తనిఖీ చేశారు. నమోదైన కేసులు, కౌన్సెలింగ్ సేవలు, బాధితులకు సహాయ చర్యలు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఇన్చార్జి ఎస్సై దివ్యతోపాటు సిబ్బందికి సూచనలు చేశారు. బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు ప్రతీ కేసులో సున్నితంగా వ్యవహరిస్తూ బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. మహిళలు, బాలికలు ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా పోలీసులు, భరోసా కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. ఫిర్యాదులపై వేగంగా స్పందించి అవసరైమన సహకారం అందిస్తామని పేర్కొన్నారు. -
కుమురం భీం
7చినుకు పడితే కరెంట్ కట్! తిర్యాణి మండలంలో చిన్న గాలివానకు వి ద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటం సర్వసాధారణంగా మారింది. నిత్యం అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నారు. 9లోu ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. వేడి, ఉక్కపోత కొనసాగుతుంది. మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడ వర్షం కురుస్తుంది. వీడని ‘అన్న’బంధం! బాసర వద్ద పుణ్యస్నానమాచరించేందుకు గోదావరి నదిలోకి దిగిన ముగ్గురు అన్నదమ్ములు నీట మునిగి మృత్యువాత పడ్డారు. కుటుంబ సభ్యుల రోదన్నలు మిన్నంటాయి.బుధవారం శ్రీ 10 శ్రీ జూన్ శ్రీ 2026 -
‘దామిని’తో తప్పును ముప్పు
ఐఎండీ(భారత వాతావరణ శాఖ) 88శాతం కచ్చితత్వంతో జిల్లాల వారీగా ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తోంది. అధికశాతం నిరక్షరాస్యులే కావడంతో గుర్తించలేకపోతున్నారు. దామిని యాప్ సమాచారాన్ని లోకల్ వాట్సాప్ గ్రూపుల ద్వారా రైతులు, కూలీలకు చేరవేయాల్సి ఉంది. యాప్ వాడే వ్యక్తికి 20నుంచి 40 కిలోమీటర్ల దూరంలోనూ అప్రమత్తం చేస్తుంది. స్మార్ట్ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘దామిని’ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. 7, 14, 21 నిమిషాల ముందు హెచ్చరికలు జారీ చేస్తుంది. రిజిష్టర్ చేసుకుంటే చదువురాని వారు సైతం సులువుగా అప్రమత్తం అయ్యేలా ఆలారం మోగుతుంది. తెలంగాణ విపత్తు నిర్వహణ శాఖ ముందు రోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలోనూ అప్రమత్తం చేస్తుంది. ప్రజల మొబైళ్లకు సందేశాలు పంపుతుంది. జిల్లా వ్యవసాయ, ప్రణాళిక శాఖ, కృషి విజ్ఞాన కేంద్రాలు, దినపత్రికల్లో వచ్చే వాతావరణ సూచనలు పాటిస్తే ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/కౌటాల: తొలకరి వానలతో ఉమ్మడి జిల్లా ప్రజలకు పిడుగుల దడ మొదలైంది. ఉరుములు, మెరుపులు, శబ్దాలతో భయం వెంటాడుతోంది. ఏటా ఉమ్మడి జిల్లాలో వానాకా లం ఆరంభం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పిడుగుల వానలు కురుస్తున్నాయి. సీజన్ ముగిసే వరకు పదుల సంఖ్యలో పిడుగుపాటు మరణాలు సంభవిస్తున్నాయి. మూగజీవాలు, ఆస్తులకు నష్టం వాటిల్లుతోంది. చనిపోతున్న వారిలో గిరిజనులు, పేద, మధ్య తరగతికి చెందిన వారే అధికంగా ఉంటున్నా రు. ఒక్కోసారి ఒకే కుటుంబం నుంచి ఇద్దరు, ముగ్గురు ప్రమాదం బారిన పడుతున్నారు. స్థానిక రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ అధికారి ధ్రువీకరణతో జిల్లా కలెక్టర్ ద్వారా బాధిత కుటుంబాలు రూ.6లక్షలు పొందవచ్చు. రైతుబీమా ఉంటే మరో రూ.5లక్షల సాయం అందుతుంది. అయితే బాధిత కుటుంబాలకు పరిహారం అందడంలో జాప్యం జరుగుతోంది. వానాకాలంలో తీవ్రత ఎక్కువప్రధానంగా వానాకాలం సీజన్ ప్రారంభంలో పిడుగుల తీవ్రత ఎక్కువ ఉంటుంది. సాధారణంగా మేఘాలు రెండు ఒకదానిని మరొకటి తాకినప్పుడు విద్యుత్ శక్తి వెలువడుతుంది. ఇది భూమి వైపు ప్రయాణించే సమయంలో లోహాలు, చెట్లు, ఎత్తయిన కట్టడాలు ఆకర్షిస్తాయి. తొలకరి వర్షాల సమయంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండే రైతులు, కూలీలు ఎక్కువగా పిడుగుపాటుకు గురవుతున్నారు. ప్రాణహానితోపాటు తీవ్ర గాయాలపాలవుతున్నారు. మూగజీవాలు సైతం ఊపిరి విడుస్తున్నాయి. మరికొన్ని సమయాల్లో సెల్టవర్లు, విద్యుత్ ఉపకరణాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. గాల్లో కలుస్తున్న ప్రాణాలుజాగ్రత్తలే రక్ష -
‘పోడు’ సమస్యలు పరిష్కరించండి
కాగజ్నగర్టౌన్: సిర్పూర్ నియోజకవర్గంలో ని పోడు రైతుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు కోరారు. ఈ మేరకు హైదరాబాద్లోని అరణ్యభవన్లో మంగళవారం ఇన్చార్జి పీసీసీఎఫ్ వినయ్కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చింతలమానెపల్లి మండలం దిందా, కర్జెల్లి, బెజ్జూర్ మండలం పాపన్పేట్, పెంచికల్పేట్ మండలం దరోగపల్లి తదితర గ్రామాల్లో అటవీ అధికారులు పోడు రైతులపై దౌర్జన్యం చేస్తున్నారని తెలి పారు. వెంటనే పోడు భూముల స్వాధీన ప్ర క్రియ నిలిపివేయాలని కోరారు. సానుకూలంగా స్పందించి డీఎఫ్వోకు ఆదేశాలు ఇస్తామ ని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఎల్ల్ములే మల్లయ్య, డబ్బుల మురళి, తుకారాం, చౌదరి నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
చకచకా ‘శక్తి భవనం’
ఆసిఫాబాద్అర్బన్: మహిళల సమగ్ర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా మహిళా సంఘాల సభ్యులను అన్ని విధాలుగా ప్రో త్సహిస్తోంది. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేస్తోంది. తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాల మంజూరు, మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, సమాఖ్యను వ్యాపారాల్లో ప్రోత్సహించ డం వంటి చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో మహిళా సంఘా కోసం రూ.6 కోట్ల వ్యయంతో ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మి స్తోంది. సమన్వయ కర్తలు, సభ్యులకు శిక్షణ, జిల్లాస్థాయి సమావేశాల నిర్వహణకు ఈ భవనం వేదికగా నిలువనుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులు ఇప్పటికే 80 శాతం పూర్తయ్యాయి. ఇటీవల కలెక్టర్ కె.హరిత అధికారులతో కలిసి పనులు పరిశీలించారు. గడువులోగా పనులను పూర్తి చేయాలని ఇంజినీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షించాలని సూచించారు. నైపుణ్య శిక్షణ, సమావేశాల నిర్వహణజిల్లా కేంద్రంలో గ్రామ, మండల స్థాయి మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రాథమిక సభ్యులతో జిల్లాస్థాయి సమావేశాలకు ఇందిరా మహిళా శక్తి భవనాన్ని వినియోగించనున్నారు. విస్తృత సమావేశాలకు విశాలమైన హాల్తోపాటు సభ్యులకు శిక్షణ ఇచ్చేందుకు సైతం ప్రత్యేక హాళ్లు నిర్మిస్తున్నారు. జిల్లా సమాఖ్య కార్యకలాపాలను సైతం ఇక్కడి నుంచే నిర్వహించనున్నారు. వీటితోపాటు సభ్యులు తయారు చేసే ఉత్పత్తులు విక్రయించుకునే సౌలభ్యం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. వీవోఏలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నైసుణ్య శిక్షణ కార్యక్రమాలను సైతం ఇక్కడే నిర్వహించనున్నారు. ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఇందిర మహిళా శక్తి భవనం కేంద్రంగా మారనుంది. 8,236 మహిళా సంఘాలుజిల్లా వ్యాప్తంగా 8,236 మహిళా స్వయం సహాయ క సంఘాలు ఉండగా, ఇందులో 94,569 మంది స భ్యులుగా కొనసాగుతున్నాయి. మహిళలు బ్యాంకు లింకేజీ రుణాలు, సీ్త్రనిధి, ఇందిరా మహిళా శక్తి రుణాలతో స్వయం ఉపాధి పొందుతున్నారు. మ రింత ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా ఇందిరా మహిళా శక్తి భవనాలను వేదికలుగా ప్రభుత్వం తీర్చిదిద్దనుంది. నిపుణులతో పలు రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఆయా రంగాల్లో రాణిస్తున్న మహిళలు తమ అనుభవాలను తోటివారితో పంచుకునేందుకు వీలుగా నిత్యం సమావేశాలు నిర్వహించనున్నారు. మహిళలకు ప్రయోజనం జిల్లా కేంద్రంలో ఇందిర మహిళా శక్తి భవన నిర్మాణంతో మహిళా సంఘాల సభ్యులకు ప్రయోజనం చేకూరనుంది. సమావేశాల నిర్వహణ, వృత్తి నైపుణ్య శిక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి. – శ్రీలక్ష్మి, మహిళా సంఘం నిర్వాహకురాలు, ఆసిఫాబాద్ మూడు నెలల్లో పూర్తి మహిళా సంఘాల సభ్యుల సౌలభ్యం కోసం జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనం పనులు మూడు నెలల్లో పూర్తి చేస్తాం. వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నాం. – దత్తారావు, డీఆర్డీవో -
సర్కారు బడులను చక్కదిద్దుతా
ఆసిఫాబాద్రూరల్: ‘విద్యతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కానీ తక్కువ అక్షరాస్యతతో జిల్లా చదువులో వెనుకబడింది. చదువు ప్రాముఖ్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాం. సర్కారు బడులను తీర్చిదిద్ది చిన్నారులకు మెరుగైన విద్యనందించడమే లక్ష్యంగా పని చేస్తాం..’అని నూతన జిల్లా విద్యాధికారి సచ్చిదానంద చారి అన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు నిత్యం పర్యవేక్షిస్తూ.. విద్యాశాఖను బలోపేతం చేస్తామన్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ.. విద్యార్థుల హాజరు మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సోమవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరాలు వెల్లడించారు. సాక్షి: వెనుకబడిన జిల్లాలో విద్యారంగాన్ని బలోపే తం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? డీఈవో: జిల్లాలో 738 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా యి. 2,072 మంది ఉపాధ్యాయులు ఉండగా, 39,249 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఉపాధ్యాయుల హాజరును ప్రతిరోజూ పర్యవేక్షిస్తూ గైర్హాజరు కాకుండా చూస్తా. విద్యార్థుల సంఖ్యకు అ నుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి నాణ్యమైన విద్యనందిస్తాం. ప్రాథమిక విద్యను బ లోపేతం చేస్తాం. 24 గంటలపాటు అందుబాటులో ఉంటాను. క్షేత్రస్థాయిలో పాఠశాలలను రోజు వారీగా తనిఖీ చేస్తూ విద్యార్థుల్లో చదివే నైపుణ్యాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. సాక్షి: 2026– 27 విద్యా సంవత్సరంలో ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తారు? డీఈవో: ఈ నెల 6 నుంచి బడిబాట కార్యక్ర మం ప్రారంభమైంది. 15వ తేదీ నుంచి పాఠశాలలు పు నఃప్రారంభం కానున్నాయి. బడీడు పిల్లలను ప్రభు త్వ పాఠశాలల్లోనే చేర్పించేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారు. తమ పరిధిలోని పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు ఇంటింటికీ తిరుగుతూ సౌకర్యాలు, ఉచిత విద్య, మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, యూనిఫాంతోపాటు ఈ విద్యా సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉదయం పూట స్నాక్స్ గురించి వివరిస్తున్నారు. బడిబాటలో ఇప్పటివరకు 754 మందికి నూతన అడ్మిషన్లు ఇచ్చాం. గతేడాది కంటే ఈ సంవత్సరం 10 శాతం ప్రవేశాల సంఖ్య పెంచుతాం. సర్కారు బడిలో మెరుగైన విద్య అందుతుందనే నమ్మకం తల్లిదండ్రుల్లో కలి గించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాం. తల్లి దండ్రులు సైతం అడ్మిషన్లు పూర్తయిన తర్వాత వా రంలో ఒకరోజు పాఠశాలకు వెళ్లి తమ పిల్లల అభ్యసన సామర్థ్యాల గురించి తెలుసుకోవాలి. తద్వారా ఉపాధ్యాయుల్లో బాధ్యత పెరుగుతుంది. సాక్షి: విద్యార్థులకు అందించేందుకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫాం సిద్ధంగా ఉన్నాయా? డీఈవో: జిల్లా కేంద్రం నుంచి అన్ని మండలాలకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ తరలించాం. జిల్లాకు 1,48,880 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా, 90,320 పుస్తకాలు వచ్చాయి. యూనిఫాం స్టిచ్చింగ్ కొనసాగుతుండగా, 50 శాతం పూర్తయ్యింది. జూ న్ 15న పాఠశాలల పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందిస్తాం. అలాగే జిల్లాలో రెండు విడతల్లో 212 పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించాం. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులను పూర్వ ప్రాథమిక విద్య కోసం ప్రభు త్వ పాఠశాలల్లో చేర్పించాలి. సాక్షి: ప్రైవేట్ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజు వసూలు, పుస్తకాలు, డ్రెస్సులు అమ్ముతున్నారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు..? డీఈవో: జిల్లాలో మొత్తం 115 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఆయా స్కూళ్ల యాజమాన్యాలు ప్రభు త్వ నిబంధనలను పాటించాలి. అధిక ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. స్కూళ్లలో పుస్తకాలు, యూనిఫాం పేరుతో వ్యాపారం చేస్తే ఉపేక్షించేది లేదు. -
మైనర్లు వాహనాలు నడపొద్దు
పెంచికల్పేట్: మైనర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపొద్దని కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ అన్నారు. మండలంలోని చేడ్వా యి గ్రామంలో సోమవారం నిర్వహించిన గ్రామసభలో మాట్లాడారు. తల్లిదండ్రులు ఎ దిగే పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు వివరాలు చెప్పొద్దని సూచించారు. వాట్సాప్ గ్రూ పుల్లో రాజకీయ పార్టీలు, వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, వివాదాస్పద పోస్టులు పెట్టడం ద్వారా సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని కోరారు. గ్రామాల్లో గంజాయి, నకిలీ విత్తనాల విక్రయాలు, వినియోగం గురించి తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో సీఐ కుమారస్వామి, ఎస్సై అనిల్కుమార్, సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ నానాజీ, వార్డు సభ్యులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్రజావాణికి వినతుల వెల్లువ
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాని కి వినతులు వెల్లువెత్తాయి. అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, డీఆర్వో దాసరి వేణుతో కలిసి కలెక్టర్ కె.హరిత వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా పరిష్కరిస్తామన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని రెబ్బెన మండల కేంద్రానికి చెందిన కౌశిక్, కల్యాణ్, తుంగెడ గ్రామానికి చెందిన సంధ్య వేర్వేరుగా అర్జీలు అందించారు. వ్యవసాయ భూమిని కౌలుకు ఇస్తే కబ్జా చేశారని, తిరిగి తనకు ఇప్పించాలని సిర్పూర్(టి) మండలం కొమ్ముగూడకు చెందిన దుర్గం హుక్టూ విన్నవించాడు. తన భర్త మరణించిన నేపథ్యంలో ఎల్ఐసీ బీమా డబ్బులు ఇప్పించా లని కాగజ్నగర్ మండలం నజ్రూల్నగర్కు చెందిన కవిత మండల్ వేడుకుంది. ఆసరా పింఛన్ డబ్బులు బ్యాంకు ద్వారా ఇప్పించాలని ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామానికి చెందిన నవీన్ దరఖాస్తు చేసుకున్నాడు. తన భూమిలో అక్రమంగా ఇల్లు నిర్మిస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కాగజ్నగర్ మండలం అంకుసాపూర్ గ్రామానికి చెంది న పెరుగు కమలాబాయి అర్జీ చేసుకుంది. రెండు నెలలుగా నిలిచిపోయిన ఆసరా పింఛన్ను వెంటనే పునరుద్ధరించాలని చింతలమానెపల్లి మండలం కర్జెల్లి గ్రామానికి చెందిన శంకరయ్య కోరాడు. ఉపాధి కల్పించాలని బెజ్జూర్ మండలం రెబ్బెనకు చెందిన మల్లేశ్ దరఖాస్తు చేసుకున్నాడు.గుడిసెల్లో ఉంటున్నాం.. ఇళ్లు ఇవ్వండి కెరమెరి మండలం కేస్లాగూడ, చిన్నుగూడ గ్రామాల్లో 26 ఆదివాసీ కుటుంబాలకు చెందిన వాళ్లం గుడిసెల్లో బతుకు వెల్లదీస్తున్నాం. కాలమేదైనా ఇబ్బందులు తప్పడం లేదు. పలుమార్లు అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కావడం లేదు. పీఎం జన్మన్, ఇందిరమ్మ ఇళ్ల పథకాల ద్వారా సొంతిళ్లు మంజూరు చేయాలి. – కేస్లాగూడ, చిన్నుగూడ గ్రామస్తులు, మం.కెరమెరి మృతదేహాలు పాతిపెట్టడం ఆపాలి జిల్లా కేంద్రంలోని సిద్ధివి నాయక కాలనీ(10 వార్డు)ని ఆనుకుని ఉన్న స్థలంలో అనధికారికంగా మృతదేహాలను పాతిపెట్ట డం ఆపాలి. ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం. కాలనీ గుండా మృతదేహాలను తీసుకెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. – సిద్ధివినాయక కాలనీవాసులు, ఆసిఫాబాద్ -
కార్మికశాఖ మంత్రితో ఎమ్మెల్యే హరీశ్బాబు భేటీ
కాగజ్నగర్టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకుని సరైన మార్గం చూపాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లోని సచివాలయంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిశారు. ఎస్పీఎం కార్మికుల ఆందోళనల గురించి వివరించారు. 20 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా గుర్తింపు సంఘం ఎన్నికల గురించి పట్టించుకోకపోవడంతో కార్మికుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్ గంగాధర్ను పిలిపించి పరిస్థితిపై సమీక్షించారు. కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 10న కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరిచందన ఆధ్వర్యంలో కార్మిక సంఘాల ప్రతినిధులు, ఎస్పీఎం యాజమాన్యంతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. -
అన్నదాతకు చల్లని కబురు
ఆసిఫాబాద్: అన్నదాతలకు చల్లని కబురు అందిస్తూ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. త్వరలో రాష్ట్రమంతటా విస్తరించనున్నాయి. దీని ప్రభావంతో జిల్లాలోని పలుచోట్ల సోమవారం ఈదురుగాలులతో తేలికపాటి వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉన్నప్పటికీ సాయంత్రం వాతావరణం మబ్బులతో ఒక్కసారి చల్లబడింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి చేరడంతో రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే దుక్కి దున్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఎరువులు, విత్తనాలు సమకూర్చుకుంటున్నారు. వారం రోజులుగా ఎరువులు, విత్తనాల దుకాణాలు రైతులతో సందడిగా కనిపిస్తున్నాయి. వర్షం రాగానే విత్తనాలు విత్తేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 2026– 27 సంవత్సరానికి ఖరీఫ్ సీజన్లో 4.52 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో 3.70 లక్షల ఎకరాల్లో పత్తి, 47 వేల ఎకరాల్లో వరి, 21 వేల ఎకరాల కంది, 7,500 ఎకరాల్లో మక్క, 5,700 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయనున్నారు. మొబైల్ యాప్ ద్వారా యూరియా పంపిణీ చేస్తున్నారు. వారం రోజులుగా జిల్లాలో సాధారణ వర్షపాతం 18.4 మిల్లీమీటరు నమోదు కావాల్సి ఉండగా, 15.7 మిల్లీమీటర్లు కురిసింది. మొత్తం 15 మండలాల్లో 4 మండలాల్లో సాధారణం కంటే కాస్త అధికంగా వర్షం కురవగా, రెండు మండలాల్లో మాత్రం సాధారణ వర్షపాతం నమోదైంది. మరో తొమ్మిది మండలాల్లో వర్షాలు కురవలేదు.కాగజ్నగర్ మండలంలో వర్షంకాగజ్నగర్రూరల్: మండలంలో సోమవా రం సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములతో మోస్తారు వర్షం ఉరుములతో కురిసింది. గాలుల ధాటికి భట్టుపల్లి గ్రామ పంచాయతీలోని మద్దెల జ్యోతి ఇంటి పైకప్పు రేకులు గాలికి ఎగిరిపోయాయి. వర్షానికి ఇంటి గోడ పూర్తిగా కూలింది. ఇంట్లో జ్యోతితో పాటు ముగ్గురు కుటుంబ సభ్యులు ఉండగా వారికి ఎలాంటి గాయాలు కాలేదు. తలదాచుకునేందుకు నీడలేకుండా పోవడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. అలాగే నా మానగర్ వద్ద తాటిచెట్టుపై పిడుగుపడి మంటలు చెలరేగాయి. -
పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లుగా పని చేస్తున్న ఉద్యోగులకు ఆరు నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ యూనియన్(ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో వినతిపత్రం అందించారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షు డు ఆత్మకూరి చిరంజీవి మాట్లాడుతూ గతేడా ది నవంబర్ 12 నుంచి కెరమెరి పీహెచ్సీ పరిధిలోని మోడి, దేవాపూర్ సబ్ సెంటర్లు, అడ పీహెచ్సీ పరిధిలోని చిర్రకుంట, గుండి సబ్ సెంటర్లలో ఎంఎల్హెచ్పీలుగా పనిచేస్తున్న వారికి వేతనాలు అందక కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. కార్యక్రమంలో సిబ్బంది రవీనా, ప్రత్యూష, స్నేహ, అనూష తదితరులు పాల్గొన్నారు. -
తొలగని సందిగ్ధం!
కాగజ్నగర్టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లులో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు నిర్వహణపై సందిగ్ధంతొలగడం లేదు. కార్మిక సంఘాలు 21 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాయి. యాజ మాన్యం నుంచి స్పందన లేకపోవడంతో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు, భారీ బహిరంగ సభ నిర్వహణకు జేఏసీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. ఎస్పీఎంలో 2014 నుంచి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు జరగడం లేదు. 2018లో నిర్వహించాల్సి ఉన్నా యాజమాన్యం వివిధ కారణాలను సాకుగా చూపుతూ వాయిదా వేస్తోంది. ప్రస్తుతం మిల్లులో 373 మంది పర్మినెంట్ కార్మికులు, 600 మంది కాంట్రాక్ట్ కార్మికులు, 800 మంది జాబ్ కార్మికులు, ఏసీఎస్ కంట్రోల్ సిస్టంలో 415 మంది పని చేస్తున్నారు. మొత్తం 1,900 మందికి పైగా కార్మికులు ఉన్నారు. కార్మిక సమస్యలపై పట్టింపేది..?2014లో మూతపడిన మిల్లును 2018లో జేకే పేపర్ మిల్లు యాజమాన్యం టేకోవర్ చేసుకుని 1,050 మంది కార్మికులతో ఉత్పత్తి ప్రారంభించింది. అయితే కార్మికుల హక్కుల విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇంత పెద్దసంఖ్యలో కార్మికులు ఉన్నా ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు సంఘం లేకపోవడంతో కార్మికుల సమస్యలు పట్టించుకునేవారు కరువయ్యారు. వేతన సవరణ, బోనస్, పీఎఫ్, ఈఎస్ఐ వంటి అంశాలపై మిల్లు ప్రతినిధులను నేరుగా అడిగే అవకాశం లేకుండా పోయింది. రెండేళ్లకు ఒక్కసారి నిర్వహించాల్సిన గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తుందని కార్మికులు వాపోతున్నారు. కోర్టు పరిధిలో వివాదంప్రస్తుతం గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ వివాదం హైకోర్టు పరిధిలో ఉంది. ఈ వివాదం తొలగితే తప్ప ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం మిల్లులోని అన్ని కార్మిక సంఘాలు కలిసి ఐక్యమై జేఏసీగా ఏర్పడి ఎస్పీఎం గేటు ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. పరిశ్రమ విస్తరణ, ఉత్పత్తి పెంపుపై దృష్టి సారిస్తున్న యాజమాన్యం కార్మికుల ప్రజాస్వామ్య హక్కుల అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.కాగజ్నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లుఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఎస్పీఎంలో గుర్తింపు సంఘం ఎన్నికలను యాజమాన్యం నిర్వహించకుండా జాప్యం చేస్తుంది. ఎన్నికలను అడ్డుకునేందుకు కోర్టులో కేసు వేసింది. ఆ కేసును వాపసు తీసుకుని ఎన్నికలు నిర్వహించాలి. రానున్న రోజుల్లో ఎస్పీఎం గేటు ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. – వెంకటేశం, కార్మిక సంఘం నాయకుడు -
పరిశుభ్రతతో ఆరోగ్యం
ఆసిఫాబాద్: వర్షాకాలంలో పరసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రత్యేక వార్డు సభలకు వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్తో కలిసి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. డ్రెయినేజీల్లో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలతో నీరు నిలిస్తే దోమలు వ్యాప్తి చెందే ప్రమాదముందని పేర్కొన్నారు. సమస్యలుంటే ప్రజలు కౌన్సిలర్ల దృష్టికి తేవాలని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో కౌన్సిలర్లు బాలకృష్ణ, దూడల లక్ష్మి, మున్సిపల్ మేనేజర్ సర్వర్, ట్రాన్స్కో ఏఈ లక్ష్మీరాజం, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజాపాలనతో ఇంటింటికీ సంక్షేమం
కాగజ్నగర్టౌన్: నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రజాపాలనతో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. పట్టణంలోని 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 వార్డుల్లో సోమవారం వార్డు సభలు నిర్వహించారు. 15, 16 వార్డుల్లో నిర్వహించిన సభలకు ఎమ్మెల్సీ దండె విఠల్, మున్సిపల్ చైర్పర్సన్ షాహిన్ సుల్తానా హాజరయ్యారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ ఫలాలను మరింత చేరువ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వేదికగా మారిందన్నా రు. ముఖ్యంగా మహిళలు, యువత, రైతులు, వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నా రు. వార్డుల వారీగా తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాలపై వచ్చిన వినతులను పరిశీలించి పరిష్కారా నికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, మెప్మా అధికారులు మోతిరాం, సిబ్బంది పాల్గొన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి
మిల్లు పునః ప్రారంభం నుంచీ స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా ఇతర రాష్ట్రాల వారికి ఎక్కువ వేతనాలు ఇస్తున్నారు. దేవాపూర్, ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీల్లో కార్మిక సంఘాల ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎస్పీఎంలో ఎందుకు నిర్వహించడంలేదు..? గుర్తింపు యూనియన్ వస్తే యాజమాన్యం చేస్తున్న అక్రమాలు, దుర్మార్గాలు బయటపడుతాయనే భయంతోనే ఎన్నికలను అడ్డుకుంటున్నారు. కార్మికుల నిరాహార దీక్షలు, మిల్లులో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. – డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
కెరమెరి: గిరిజన హాస్టళ్లలో పని చేస్తున్న దినసరి, ఔట్సోర్సింగ్ వర్కర్ల సమస్యలు పరి ష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు పుష్ప, జిల్లా సంయుక్త కార్యదర్శి కృష్ణమాచారి డిమాండ్ చేశారు. మండలంలోని హట్టి బేస్ క్యాంపులోని కుమురంభీం విగ్రహానికి ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కమి టీ సమావేశంలో మాట్లాడారు. గతంలో జరి గిన 44 రోజుల సమ్మెలో గిరిజన శాఖ మంత్రి పాల్గొని పలు హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. వర్కర్లకు టైంస్కేల్, ఐదేళ్ల సర్వీసు ఉన్నవారిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. నాయకులు సురేఖ, సంపత్, బిజులాబాయి, లక్ష్మీబాయి, జారుబాయి, లలిత తదితరులు పాల్గొన్నారు. -
● గృహ అవసరాల సిలిండర్పై రూ.29 పెంపు ● మూడు నెలల్లో రెండుసార్లు పెరుగుదల ● ఆదివారం నుంచే అమల్లోకి కొత్త రేట్లు ● జిల్లా ప్రజలపై రూ.27లక్షల అదనపు భారం
ఆసిఫాబాద్: గ్యాస్ సిలిండర్ల ధర మరోసారి పెరి గింది. ప్రతీ సిలిండర్పై రూ.29 పెంచినట్లు ప్రకటించారు. కొత్త ధరలు ఆదివారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం, హార్మోజ్ జలసంధి వద్ద ఆంక్షలు కొనసాగుతుండటంతో ఇంధనం సరఫరాలో అంతరాలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రభావంతో ఇప్పటికే పెట్రో, వంట నూనెల ధరలు మండుతున్నాయి. వంటనూనెలు లీటర్కు రూ.10 వరకు పెరిగాయి. మూడు నెలలతో పోలిస్తే ప్రముఖ బ్రాండ్ల వంట నూనెలు హోల్సేల్ మార్కెట్లో లీటర్కు రూ.161 నుంచి రూ.171 వరకు చేరాయి. ఈ పెంపు జిల్లాలోని పేద, మధ్య తరగతి కుటుంబాలతోపాటు గిరిజనులకు మోయలేని భారంగా మారింది. జిల్లా ప్రజలపై అదనపు భారంజిల్లాలో 12 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా, సుమారు 1.40 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 1.15 లక్షల సింగిల్ సిలిండర్ కనెక్షన్లు, 28 వేలు డబుల్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి. వీటితో పాటు 30 వేల కు పైగా ఉజ్వల కనెక్షన్లు, 23,319 దీపం కనెక్షన్లు, 69,371 జనరల్ కనెక్షన్లు, 600 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతినెలా సుమారు 80 వేల సబ్సిడీ సిలిండర్లు, 15 వేల ఉజ్వల సిలిండర్లు వినియోగిస్తున్నారు. మూడు నెలల క్రితం గృహ వినియోగ 14.2 కేజీల సిలిండర్ ధర రూ.60 పెరగడంతో రూ.982 కు చేరింది. తాజాగా మరోసారి రూ.29 పెంచడంతో రూ.1011కు చేరింది. దీంతో జిల్లా ప్రజలపై ప్రతినెలా సుమారు రూ.27 లక్షల అదనపు భారం పడుతుంది. నిలకడ లేకుండా..గతంలో గ్యాస్ ధరలు నిలకడగా ఉండేవి. కానీ రెండేళ్లుగా ఒడిదొడులకు లోనవుతున్నాయి. 2022 మా ర్చిలో జిల్లా కేంద్రంలో గ్యాస్ సిలిండడర్ ధర రూ. 875 ఉండగా 2023 జనవరిలో రూ.976కు చేరింది. ఏప్రిల్లో సిలిండర్పై రూ.50 పెంచారు. జూన్లో మళ్లీ సిలిండర్పై రూ.50 పెంచడంతో రూ.1019 నుంచి రూ.1072కి చేరింది. గత ఆగస్టులో వంట గ్యాస్ రూ.1172 ధర ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఒక్కో సిలిండర్పై రూ.200 తగ్గిస్తూ ఊరట కలిగించింది. మరోసారి 2024 మార్చిలో సిలిండర్పై రూ. 100 తగ్గించింది. మళ్లీ గతేడాది సిలిండర్పై రూ.50 పెంచడంతో జిల్లాలో సిలిండర్ ధర రూ.922కు చేరింది. గత మార్చి 7న సిలిండర్పై రూ.60 పెరిగి రూ.982కు చేరింది. తాజాగా సిలిండర్పై రూ.29 పెంచడంతో రూ.1011 చేరింది. అంతేకాక డెలివరీ బాయ్స్ రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తుండటంతో వినియోగదారులు ఒక్కో సిలిండర్కు రూ.1061 చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. టిఫిన్, టీ రేట్లకు రెక్కలుగృహ అవసరాల సిలిండర్తోపాటు వాణిజ్య సిలిండర్ల ధరల్లో కూడా నిలకడ ఉండటం లేదు. గత మార్చి 7న కమర్షియల్ 19 కేజీల సిలిండర్ ధర రూ.115 పెరగడంతో రూ.2,144కు చేరింది. కమర్షి యల్ సిలిండర్ ధర పెరగడంతో జిల్లా కేంద్రంలోని హోటళ్ల యజమానులు సైతం అమాంతం రేట్లు పెంచారు. ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా వంటి టిఫిన్లపై అదనంగా రూ.10 పెంచారు. ప్లేట్ ధర రూ.40 ఉండగా ప్రస్తుతం రూ.50కి చేరింది. అలాగే టీ సైతం రూ.10 నుంచి రూ.13కి పెంచి అమ్ముతున్నారు. -
నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు
కాగజ్నగర్టౌన్: వాహనదారులు నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటా మని డీఎస్పీ వహీదుద్దీన్ అన్నారు. పట్టణంలో ఆదివారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్ర మం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు సరైన పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రజల భద్రత కో సం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా సమాచారం అందించాలన్నారు. అ నంతరం సరైన పత్రాలు లేని 40 వాహనాల ను స్వాధీనం చేసుకున్నారు. సీఐ ప్రేమ్కుమార్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.


