Kumuram Bheem District News
-
అవగాహన ఉంటేనే కట్టడి!
● స్పర్శ్ పేరిట ‘కుష్ఠు’ అవగాహన కార్యక్రమాలు ● ఈ నెల 17 నుంచి 30 వరకు నిర్వహణ ● వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు ప్రత్యేక సర్వే జిల్లాలో వ్యాధిగ్రస్తుల వివరాలుఆసిఫాబాద్అర్బన్: అవగాహన లేక కుష్ఠు వ్యాధి క్రమంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు స్పర్శ్ పేరిట జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ‘కలిసి అవగాహన పెంచుకుందాం.. అపోహలను దూరం చేద్దాం, కుష్ఠువ్యాధి బారిన పడిన ఎవరూ వెనుకబడి పోకుండా చూసుకొందాం’ అనే నినాదంతో అధికారులు పనిచేస్తున్నారు. పోస్టర్లు, ఫ్లాష్ కార్డులు, ఇతర కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. చర్మానికి సోకే వ్యాధిమైకో బ్యాక్టీరియా లెప్రె ద్వారా చర్మం, నరాలకు సోకే అతి సాధారణ వ్యాధి కుష్ఠు. ఇంక్యూబేషన్ కాలం సగటున మూడేళ్లు పడుతుండటంతో లక్ష్యణాలు బహిర్గతమయ్యేందుకు ఆలస్యమవుతుంది. వంశపారపర్యంగా ఈ వ్యాధి సోకదు. ఆరు నుంచి 12 నెలలపాటు బహుళ ఔషధ చికిత్స ద్వారా వ్యాధిని నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. చర్మపు రంగు కంటే తక్కువ, ఎరుపు, లేదా రాగి రంగులో మచ్చలు ఉంటే వెంటనే వైద్యులు సంప్రదించాలని సూచిస్తున్నారు. కాళ్లు, చేతుల నరాల్లో వాపు, నొప్పి, తిమ్మిర్లు, ముఖం, చెవి బయట నూనె పూసినట్లు మెరుస్తున్నా, కనుబొమ్మలపై వెంట్రుకలు రాలిపోయినా, వేళ్లు స్పర్శ కోల్పోయినా ఆశ్రద్ధ చేయొద్దు. ముందుకు రాని బాధితులుజిల్లా వైద్యారోగ్యశాఖ, కుష్ఠు నిర్మూలన సంస్థ సంయుక్తంగా ఏటా బాధితుల గుర్తిపు కోసం ఇంటింటి సర్వే చేసి, మందులు పంపిణీ చేస్తున్నారు. అయితే చాలా మంది అవగాహన లేకపోవడంతో ముందుకు రావడం లేదు. వ్యాధిబారిన పడినా పరీక్షలు చేయించుకోవడం లేదు. గతేడాది చేపట్టిన సర్వే 88 మంది బాధితులను గుర్తించగా, ప్రస్తుతం చేపట్టిన సర్వే ఆరుగురికి వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. అంటువ్యాధి కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. వైద్యసిబ్బందికి సహకరించాలి జిల్లాలో ఈ నెల 30 వరకు ప్రజలకు కుష్ఠు వ్యాధిపై అవగాహన కల్పిస్తాం. ఇప్పటివరకు జిల్లాలో ఆరుగురికి వ్యాధి నిర్ధారించారు. ప్రజలు వైద్యసిబ్బందికి సహకరించి.. లక్షణాలు ఉంటే నిర్భయంగా తెలపాలి. చికిత్స ద్వారా బాధితులు పూర్తిగా కోలుకోవచ్చు. – శ్యాంలాల్, జిల్లా కుష్ఠు ప్రోగ్రాం అధికారిసంవత్సరం గుర్తించిన వ్యాధిగ్రస్తులు 2020– 21 35 2021– 22 52 2022– 23 137 2023– 24 84 2024– 25 88 -
‘జమిలి ఎన్నికలతో దేశానికి మేలు’
లింగాపూర్(ఆసిఫాబాద్): జమిలి ఎన్నికలతో ఆర్థిక భారం తగ్గి దేశానికి మేలు జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం అన్నారు. మండల కేంద్రంలోని జగదాంబా దేవి ఆలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతాయన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో మేధావులు, ఉద్యోగులు, యువకులు పాల్గొని అభిప్రాయాలు వెల్లడించాలని సూ చించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సురేశ్నాయక్, నాయకులు హిరా మన్, రవీందర్, అశోక్, మంగులాల్, సచిన్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్పీఎంలో ఎన్నికలు నిర్వహించాలి
● అసెంబ్లీలో ఎమ్మెల్యే హరీశ్బాబుకాగజ్నగర్రూరల్: సిర్పూర్ పేపర్ మిల్లు(ఎస్పీఎం)లో కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్యే హరీశ్బాబు అ న్నారు. గురువారం ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. 2018లో మిల్లు పునఃప్రారంభమైనా ఇప్పటివరకు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించలేదని తెలిపారు. ఎ న్నికలు నిర్వహించకపోవడానికి గల కారణాలను కార్మికశాఖ, లేబర్ కమిషనర్ చెప్ప డం లేదన్నారు. కార్మికులను మిల్లు యాజ మాన్యం అరిగోస పెడుతుందన్నారు. మిల్లులో క్యాంటీన్ సౌకర్యం లేదని, కారణాలు లేకుండానే సస్పెండ్ చేస్తున్నారని ఆరోపించారు. లేబర్ కమిషనర్తోపాటు మంత్రి శ్రీధర్బాబుకు పలుమార్లు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. మిల్లులో యూనియన్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలతో ఈ ఏడాది ఏడు వేల మందికిపైగా మృతి చెందారని, హైవేలపై ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. సమీపంలోని మెడికల్ కళాశాలలకు ట్రామా కేర్ సెంటర్లను అనుసంధానం చేయాలని కోరారు. -
బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్
ఆసిఫాబాద్అర్బన్: ఆసిఫాబాద్ బార్ అ సోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది రాపర్తి రవీందర్ ఎన్నికయ్యారు. జిల్ల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నికల అధికారి పీసీ జైన్, సహాయ ఎ న్నికల అధికారి నికోడే రవీందర్ పర్యవేక్షణ లో గురువారం ఎన్నికలు నిర్వహించారు. బోనగిరి సతీశ్బాబు, రాపర్తి రవీందర్ పోటీ పడ్డారు. 46 ఓట్లు పోల్ కాగా, పది ఓట్ల మెజార్టీతో రవీందర్ విజయం సాధించారు. ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికై న రవీందర్ను న్యాయవా దులు అభినందించారు. అలాగే ఉపాధ్యక్షుడిగా చంద్రకుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎం. చరణ్, సంయుక్త కార్యదర్శిగా ఎల్.నగేశ్, కోశాధికారిగా మంథెన రామకృష్ణ, గ్రంథాల యం కార్యదర్శిగా కుమారం లాల్షా, మహిళా ప్రతినిధిగా ఆర్.గాయత్రీ మధురిమ, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా కిశోర్కుమార్ ఎన్నికయ్యారు. -
30 లోపు పనులు పూర్తిచేయాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్అర్బన్: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద జిల్లాలో చేపట్టిన సీసీ రహదారులు, మురుగునీటి కాలువల నిర్మాణాలు ఈ నెల 30లోపు పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి, డీఆర్డీవో దత్తారావు, పంచాయతీరాజ్ ఈఈ ప్రభాకర్రావుతో కలిసి గురువారం జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం ముగింపునకు కేవలం నాలుగు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉందని, ఉపాధిహామీ కింద చేపట్టిన పనులు పూర్తి చేయాలన్నారు. ఎంబీ రికార్డులు సమర్పించాలని ఇంజినీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత పాటించేవిధంగా అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. ఈ సమావేశంలో ఇంజినీరింగ్శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలిఆసిఫాబాద్అర్బన్: అభివృద్ధి, సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేశ్కుమార్ అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్తో కలిసి మహిళా సంఘాలకు సంబంధించిన పలు అంశాలపై కలెక్టర్లు, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్కు హాజరైన కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడారు. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణను ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు అప్పగించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల యూనిఫాంలు కుట్టే పనిని వారికి అప్పగించి.. జూన్ 12లోగా పాఠశాలలు చేరేలా చర్యలు చేపడతామని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్, డీఆర్డీవో దత్తారావు తదితరులు పాల్గొన్నారు. -
‘పీఆర్సీ, డీఏలు ఇవ్వలేమనడం సరికాదు’
ఆసిఫాబాద్అర్బన్: ఉద్యోగులకు బకాయి పడిన నాలుగు డీఏలు, 2023 జూన్ నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీలు ఇవ్వలేని ముఖ్యమంత్రి అనడం సరికాదని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతికుమారి అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గురువారం మాట్లాడారు. డీఎ, పీఆర్సీ అడిగితే నెలనెలా వేతనాలు ఇవ్వలేమని అనడం సమంజసం కాదన్నారు. ఉద్యోగులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, వారు దాచుకున్న సొమ్ము తిరిగి చెల్లించాలని కోరుతున్నారని స్పష్టం చేశారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి ఊశన్న మాట్లాడుతూ ప్రభుత్వం సగం మంది ఉద్యోగులు, పెన్షనర్లకు మాత్రమే 1వ తేదీన వేతనాలు చెల్లిస్తుందని అన్నారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగస్వాములని, బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఇందూరావ్, కోశాధికారి రమేశ్, జిల్లా కార్యదర్శి హేమంత్ షిండే, సభ్యులు రాజు, కమలాకర్రెడ్డి, సుభాష్, జాదవ్, మహిపాల్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీడీవో కార్యాలయానికి తాళం
కాగజ్నగర్రూరల్: గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన తమకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచులు గురువారం కాగజ్నగర్ ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ఊరు– మన బడి, సీసీరోడ్లు, పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు నిర్మించామని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారులు బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశాన వాటికల కోసం రైతుల వద్ద తీసుకున్న పట్టా భూములకు బదులుగా ప్రభుత్వం నుంచి భూమి ఇస్తామని అధికారులు చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటికీ సదరు రైతులకు ప్రభుత్వ భూములు కేటాయించలేదని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రశ్నిస్తే కేసులా?
● బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కాగజ్నగర్రూరల్: ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రశ్నిస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. కాగజ్నగర్ పట్టణంలోని తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెట్టిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని, సచివాలయానికి కూడా అంబేడ్కర్ పేరు పెట్టారని గుర్తు చేశారు. 80 మంది గురుకుల విద్యార్థుల ప్రాణాలు తీసినందుకు సీఎం రేవంత్రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పదో తరగతి పరీక్షలు నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. పోలీసులు, అధికారులు, ఇన్విజిలేటర్లు ఉండగా నిందితుడు పరీక్ష కేంద్రంలోకి ఎలా వెళ్లాడని ప్రశ్నించారు. పేపర్ లీకేజీకి కారణమైన అసలు నిందితులను పట్టుకోవాలని, కేటీఆర్పై పెట్టిన అట్రాసిటీ కేసు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం మానుకోవాలని హితవు పలికారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు హయాంలో ప్రజల ఆరోగ్య పరిస్థితి ఘోరంగా ఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంతో బుధవారం ఓ యువకుడు మృతిచెందాడని పేర్కొన్నారు. బెజ్జూర్లో పాత పోలీస్స్టేషన్ స్థలాన్ని కబ్జా చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. సమావేశంలో నాయకులు లెండుగురె శ్యాంరావు, ఆవుల రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చేపల వేట
వలస బాట..ప్రాణహిత నదిలో నాటుపడవ ద్వారా చేపలు పడుతున్న మత్స్యకారులుమహారాష్ట్రలోని దేవలమర్రి గ్రామానికి చెందిన ఈ మహిళ పేరు తోకల లక్ష్మి. తన కుటుంబంతోపాటు ప్రా ణహిత తీరానికి వలస వచ్చింది. ఇక్కడే చిన్న గు డారం ఏర్పాటు చేసుకున్నారు. కుటుంబంతో కలిసి నాటుపడవలతో నదిలోకి వెళ్లి చేపలు పడుతున్నారు. పట్టిన చేపలను పరిసర ప్రాంతాల్లో విక్రయించి జీవనం సాగిస్తున్నారు.. ఇలా అనేక కుటుంబాలు ప్రాణహిత నదిలో చేపలు పడుతూ ఉపాధి పొందుతున్నాయి. పెంచికల్పేట్(సిర్పూర్): మత్స్యకార కుటుంబాలు దుర్భర స్థితిలో జీవనం సాగిస్తున్నాయి. చేపల వేట కోసం ప్రాణహిత నదిలో గుడారాలు వేసుకుని కటిక చీకటిలో పిల్లపాపలతో కాలం వెల్లదీస్తున్నాయి. ఏళ్లుగా వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి. జిల్లాలోని సిర్పూర్(టి), కౌటాల, బెజ్జూర్, పెంచికల్పేట్ మండలాలను ఆనుకుని ప్రాణహిత నది ప్రవహిస్తుంది. తలాయి నుంచి మొదలుకుని మురళీగూడ వరకు పలు ప్రాంతాల్లో చేపల వేటే ప్రధానంగా దాదాపు 60 గంగపుత్రుల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. లోనవెల్లి, తుమ్మిడిహెట్టి, బెజ్జూర్, తలాయి, మురళీగూడ గ్రామాలకు చెందిన మత్స్యకారులతోపాటు మహారాష్ట్రలోని దేవలమర్రి, వట్రా గ్రామాలకు చెందిన మత్స్యకారుల కుటుంబాలు నది తీరంలోనే ఉంటూ చేపలు పడుతున్నారు. ఆరునెలలు నదిలోనే..ప్రాణహిత నది పరీవాహక ప్రాంతంలో పదుల సంఖ్యలో గంగపుత్రుల కుటుంబాలు తాత్కాలికంగా గుడారాలను ఏర్పాటు చేసుకున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత అక్టోబర్ చివరి నుంచి జూన్ వరకు నదిలో ఇసుక మేటలపై జీవనం సాగిస్తారు. నాటు పడవల ద్వారా జెల్లా, బొచ్చె తదితర చేపలతోపాటు రొయ్యల వేట సాగిస్తున్నారు. పట్టిన చేపలు, రొయ్యలను పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలోని అహెరితోపాటు జిల్లాలోని బెజ్జూర్, కౌటాల, పెంచికల్పేట్, చింతలమానెపల్లి మండల కేంద్రాల్లో విక్రయిస్తూ వారి కుటుంబాలను పోషించుకుంటున్నారు. నాటుపడవలతో ప్రమాదంప్రాణహితలో నిరంతరం నీటి ప్రవాహం ఉంటుంది. అకాల వర్షాలు కురిసిన సమయంలో నదిలో నీటిప్రవాహం పెరుగుతుంది. నాటు పడవల ద్వారా లోతైన ప్రాంతాలకు వేటకు వెళ్తే నిత్యం ప్రమాదం పొంచి ఉంటుంది. అధునాతన వలలు లేక పాత వాటిని వినియోగిస్తుండటంతో పెద్దచేపలు చిక్కినప్పుడు వలలు తెగిపోతున్నాయి. అలాగే నదిలో పట్టిన చేపలను కొందరు మహారాష్ట్రలోని అహెరి, బెజ్జూర్, తలాయి గ్రామాల్లోని వ్యాపారులకు కిలో రూ.80 నుంచి రూ.100 విక్రయిస్తున్నారు. బయట మార్కెట్లో చేపల ధర కిలో రూ.150 కంటే ఎక్కువ పలుకుతున్నా మార్కెటింగ్ లేక శ్రమను తక్కువకే అమ్ముకుంటున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నూతన వలలు, వాహనాలు అందించి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు. ఆరునెలలు నదిలోనే.. తరతరాలుగా ప్రాణహిత నదిలోనే చేపల వేట సాగిస్తున్నాం. సుమారు ఆరు నెలలు నదిలోనే ఉంటాం. చేపలు వలకు చిక్కకున్నా వృత్తిని వదులుకోలేకపోతున్నాం. మార్కెటింగ్ లేక అనేక అవస్థలు పడుతున్నాం. అధికారులు స్పందించి మార్కెట్ ధరకు చేపలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. – పేదం ముత్తుబాయి, దేవలమర్రి ప్రాణహిత నదిలో మత్స్యకారుల దుర్భర జీవితం ఆరు నెలలపాటు అక్కడే నివాసం కటిక చీకటిలో కాలం వెల్లదీస్తున్న వైనం మార్కెటింగ్ సౌకర్యం లేక నష్టాలుఉదయం, సాయంత్రం వేటకు..చేపల వేటతో గతంలో ఆశించిన ఆదాయం ఉండేది. క్రమంగా నాటు పడవల ద్వారా చేపల వేట భారంగా మారింది. ఉదయం, సాయంత్రం వేటకు వెళ్లి చేపలు పడుతుంటారు. ప్రతిరోజూ పట్టిన 5 నుంచి 10 కిలోల చేపలను ఆయా కుటుంబాలకు చెందిన మహిళలు గ్రా మాల్లో విక్రయిస్తుంటారు. ఉపాధి కోసం ఉన్న ఊరును వదిలి కష్టపడుతూ కడుపు నింపుకుంటున్నామని వాపోతున్నారు. నది పరీవాహక ప్రాంతంలోని ఇసుక తిన్నెలపై పిల్లపాపలతో ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సరఫరాకు అవకాశం లేకపోవడంతో దీపాల వెలుగుల్లోనే జీవనం సాగిస్తున్నారు. దీనికి తోడు ఈదురుగాలులు, అకాల వర్షాలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకులు వెల్లదీస్తున్నారు. -
అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆసిఫాబాద్అర్బన్: నీతి ఆయోగ్ ఆస్పిరేషన ల్ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా తిర్యాణి మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి విద్య, వైద్యం, సంక్షేమ, గ్రామీణాభివృద్ధి, పశు సంవర్ధక, గిరిజన సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షా సమావే శం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 20 గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతిగృహా ల్లో శుద్ధమైన తాగునీరందించేందుకు ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించాలన్నారు. అవసరమై న అనుమతులు పొందాలని ఆదేశించారు. అలాగే యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని ఆసిఫాబాద్ పట్టణ సమీపంలో ఏర్పాటు చే సేందుకు స్థలం గుర్తించాలని సూచించారు. ఆరు మినీ అంగన్వాడీ మోడల్ భవన నిర్మాణ పనులు చేపట్టాలని, ఎంపిక చేసిన ఆరు పాఠశాలల్లో మరమ్మతులు, అదనపు తరగతి గదులు నిర్మించాలన్నారు. తిర్యాణి మండలంలో పాఠశాలలు, రైతువేదికలు, ప్రాథమి క ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాల్లో డిజిటల్ ఇంప్రూవ్మెంట్లో భాగంగా కంప్యూటర్లు, ప్రింటర్లు సమకూర్చాలన్నారు. అభివృద్ధి ప నులు సకాలంలో పూర్తిచేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో సీపీవో కోటయ్యనా యక్, డీటీడీవో రమాదేవి, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, పశుసంవర్ధక శాఖ అధికారి సురేష్, ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ, డీఎంహెచ్వో సీతారాం తదితరులు పాల్గొన్నారు. -
రుణాల రికవరీలో ఆదర్శం
● జిల్లాకు రాష్ట్రస్థాయి పురస్కారం ● మంత్రి సీతక్క చేతుల మీదుగా స్వీకరించిన అదనపు కలెక్టర్ ఆసిఫాబాద్: సీ్త్రనిధి(మెప్మా) రుణాల రికవరీ లో ఆదర్శంగా నిలిచిన జిల్లాకు అరుదైన గౌర వం దక్కింది. 2023– 24 ఆర్థిక సంవత్సరంలో 94 శాతం రుణాల రికవరీతో రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచిన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రత్యేక పురస్కారానికి ఎంపికై ంది. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో బుధవారం నిర్వహించిన సీ్త్రనిధి 12వ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్, సీ్త్రనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి చేతుల మీదుగా అదనపు కలెక్టర్ దీపక్ తివారి రాష్ట్రస్థాయి పురస్కా రం అందుకున్నారు. మంత్రి మాట్లాడుతూ జిల్లాలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు, మహిళా సాధికారతపై అదనపు కలెక్టర్ దీపక్ తివారి చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. సీ్త్రనిధి ఆర్ఎం శ్రీనివాస్, మె ప్మా హెడ్ మోతీరాం, సిబ్బంది పాల్గొన్నారు. -
‘ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం’
బెజ్జూర్(సిర్పూర్): రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. బెజ్జూర్ మండలంలో బుధవారం విస్తృతంగా పర్యటించారు. రాష్ట్ర ప్రజల కష్టాలు తీరాలన్నా.. రైతుల కన్నీళ్లు ఆగాలన్నా కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ ఇవ్వడం లేదన్నారు. మహిళలకు నెలకు రూ.2500, రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మండలంలోని గబ్బాయి, పాపన్పేట్, తలాయి, సోమిని, మొగవెల్లి, బారెగూడ, ముంజంపల్లి గ్రామాల్లో పర్యటించారు. రైతులు, మహిళల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కుకుడ గ్రామంలోని పలువురు యువకులకు కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ లెండుగురె శ్యాంరావు, నాయకులు కాశిపాక రాజు, సారయ్య, దుర్గం తిరుపతి, ఖాజా, షాముద్దిన్, ఆత్రం హరీశ్ తదితరులు పాల్గొన్నారు. -
● రేషన్కార్డు దారులకు ప్రభుత్వం తీపికబురు ● ఏప్రిల్ నుంచి పంపిణీకి ఏర్పాట్లు ● అక్రమ దందాలకు అడ్డుకట్ట పడే అవకాశం
జిల్లాలో ప్రజాపంపిణీ వివరాలురేషన్ దుకాణాలు 314అంత్యోదయ కార్డులు 12,948తెల్లరేషన్ కార్డులు 1,24,336ప్రతినెలా బియ్యం కోటా 2,968 మెట్రిక్ టన్నులుక్యూఆర్ కోడ్తో కార్డులుప్రజాపాలన, మీసేవ కేంద్రాల ద్వారా జిల్లాలోని అర్హులు వేలాది కొత్త రేషన్ కార్డుల కో సం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం వివి ధ స్థాయిల్లో వడబోత ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలో దాదాపు పదేళ్ల తర్వాత కొ త్త రేషన్ కార్డులను క్యూఆర్ కోడ్తో స్మార్ట్ కా ర్డుల రూపంలో అందించేందుకు రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం రేషన్ కార్డులన్నీ మహిళల పేర్లతో ఉన్నాయి. స్మార్ట్కార్డులు కూడా మహిళల ఫొటోతో పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే.. ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు..? రాయితీ బియ్యం ఎన్ని కిలోలు..? తదితర అంశాలతో కూడిన సమాచారం కనిపిస్తుంది. సన్నబియ్యం పంపిణీని ప్రారంభించనున్న నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. కౌటాల(సిర్పూర్): రాష్ట్రంలోని రేషన్కార్డు దారులకు ప్రభుత్వం ఉగాది కానుకగా సన్నబియ్యం పంపిణీ చేయనుంది. ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా దొడ్డు బియ్యం అందిస్తుండగా.. ఏప్రిల్ 1 నుంచి సన్నబియ్యం అందించనున్నారు. ఉగాది సందర్భంగా ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే అవసరమైన బియ్యం కోటా జిల్లాకు చేరింది. జిల్లాలోని 15 మండలాల్లో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రజలకు బియ్యం పంపిణీ చేసేందుకు 314 రేషన్ షాపులు ఏర్పాటు చేశారు. మొత్తం 1,37,284 ఆహార భద్రత కార్డులు ఉండగా, ఇందులో అంత్యోదయ కార్డులు 12,948, తెల్లరేషన్ కార్డులు 1,24,336 ఉన్నాయి. మరో 21 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. వీరికి ప్రతినెలా 2,968 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఆహార భద్రత కార్డుదారులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పన బియ్యం, అంత్యోదయ కార్డులదారులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోల చొప్పున సరఫరా చేస్తున్నారు. ప్రతినెలా 1 నుంచి 15 వరకు బియ్యం పంపిణీ కొనసాగుతుంది. పెరిగిన సన్నాల సాగు గత ప్రభుత్వం సైతం పేదలకు సన్నబియ్యం సరఫరా చేసే ప్రయత్నం చేసింది. రెండు, మూడు నెలలపాటు అరకొర సరఫరా చేయగా.. అందులో నూకలు, తౌడు రావడంపై విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత యథావిధిగా దొడ్డు బియ్యమే పంపిణీ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సన్నబియ్యం పంపిణీకి కసరత్తు ప్రారంభించింది. అయితే సరిపడా సన్నబియ్యం నిల్వలు అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడింది. అనంతరం రాష్ట్రంలో సన్నాల సాగు పెంచేందుకు సర్కారు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్ ప్రకటించింది. దీంతో వానాకాలం సీజన్లో గణనీయంగా సన్నవడ్ల సాగు పెరిగింది. కొనుగోలు కేంద్రాల ద్వారా సన్నవడ్లను సేకరించారు. ప్రస్తుతం లబ్ధిదారులకు సరిపడా బియ్యం అందుబాటులో ఉండడంతో ఏప్రిల్ 1 నుంచి పంపిణీ ప్రారంభిస్తామని జిల్లా పౌర సరఫరా శాఖ అధికారులు తెలిపారు. పక్కదారి పట్టకుండా.. జిల్లాలో చాలామంది సన్నబియ్యమే తింటున్నారు. దీంతో రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే దొడ్డుబియ్యం అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. జిల్లా సరిహద్దున మహారాష్ట్ర ఉండటంతో రోడ్డు, రైలు మార్గం ద్వారా రేషన్ బియ్యం తరలిపోతోంది. కొందరు డీలర్లకే బియ్యం అమ్ముకుని బదులుగా డబ్బులు, నిత్యావసర వస్తువులు తీసుకుంటున్నారు. నేరుగా డీలర్లే పెద్దమొత్తంలో రేషన్ బియ్యం సేకరించి దళారులకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దళారుల నుంచి కొందరు రైస్ మిల్లర్లు మళ్లీ రూ.26కు కేజీ చొప్పున కొని.. ఆ బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి(ఎఫ్సీఐ)కి అప్పగించేవారు. మరికొందరు మిల్లర్లు సన్నబియ్యంగా మార్చి మార్కెట్లో విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. లక్ష్యం నీరుగారుతుండటంపై ప్రభుత్వం దృష్టి సారించింది. రేషన్ దుకాణాల్లో ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. సన్నబియ్యం పంపిణీతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. -
పుట్టెడు దుఃఖంలో ‘పది’ పరీక్షకు..
దహెగాం: తండ్రి చనిపోయి పుట్టెడు దుఃఖం ఉన్నా ఆ బాధను దిగమింగుకుంది.. అల్లారుముద్దుగా పెంచిన నాన్న ఇక లేడని తెలిసినా ఆయన కష్టం వృథా కావొద్దని పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరైంది ఓ విద్యార్థిని. ఈ విషాద ఘటన జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. దహెగాం మండలం చౌక గ్రామానికి చెందిన మేకల రాజయ్య(40), సత్తక్క దంపతులకు కుమార్తె అనురాధ, ఇద్దరు కుమారులు ఉన్నారు. అనురాధ మండల కేంద్రంలోని కేజీబీవీలో పదో తరగతి చదువుతోంది. రాజయ్య ఆరోగ్యం బాగా లేకపోవడంతో మంగళవారం మంచిర్యాలలోని ఆస్పత్రికి తరలించగా, బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మృతిచెందాడు. అనురాధ తండ్రి చనిపోయిన బాధను దిగమింగుకుని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణితం పరీక్షకు హాజరైంది. పరీక్ష పూర్తికాగానే కుటుంబీకులు విద్యార్థినిని ఇంటికి తీసుకెళ్లారు. తండ్రి మృతదేహాన్ని చూసి అనురాధ బోరున విలపించింది. స్వగ్రామంలో రాజయ్య అంత్యక్రియలు పూర్తిచేశారు. కొనసాగుతున్న ‘పది’ పరీక్షలు ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బుధవారం నిర్వహించిన గణితం పరీక్షకు 36 కేంద్రాల్లో 6,521 మంది విద్యార్థులకు 6,498 మంది హాజరయ్యారు. 23 మంది గైర్హాజరయ్యారని పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్ తెలిపారు. -
రాయితీపై యంత్ర పరికరాలు
● వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునరుద్ధరణ ● 50 శాతం సబ్సిడీతో మహిళా రైతులకు పనిముట్లు ● నియోజకవర్గాల వారీగా నిధులు కేటాయింపు ● దరఖాస్తులు స్వీకరిస్తున్న వ్యవసాయ శాఖఏఈవో, ఏవోలను సంప్రదించాలి వ్యవసాయ యాంత్రీ కరణ పథకంలో అర్హులైన రైతులకు రాయితీపై పరికరాలు అందజేస్తాం. సన్న, చిన్నకారు మహిళా రైతులు లబ్ధి పొందవచ్చు. క్లస్టర్ పరిధిలోని ఏఈవో, ఏవోలను సంప్రదించి దరఖాస్తులు అందజేయాలి. – శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆసిఫాబద్రూరల్: రాష్ట్రంలోని మహిళల ఆర్థికాభివృద్ధి దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే పలు పథకాల ద్వారా వారికి లబ్ధి చేకూరుస్తుండగా.. తాజాగా వ్యవసాయ పనిముట్లను సై తం రాయితీపై మహిళా రైతులకు పంపిణీ చేయాల ని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సైతం మొదలైంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.72లక్షలు మంజూరు చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు భరిస్తున్నాయి. దరఖాస్తుల స్వీకరణ షురూ గతంలో వ్యవసాయశాఖ కింద రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రాయితీపై అనేక యంత్ర పరికరాలు పంపిణీ చేసింది. సాగులో యాంత్రీకరణను ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టారు. అయితే 2016– 17 ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఈ పథకం నిలిచిపోయింది. అప్పటి నుంచి రైతులు యంత్ర పరికరాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కారు మళ్లీ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించింది. సన్న, చిన్నకారు, ఇతర వర్గాల మహిళలు ఈ పథకానికి అర్హులు. ఈ నెల 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తులను వ్యవసాయశాఖ అధికారులు ఆన్లైన్ చేస్తున్నారు. మండల, జిల్లాస్థాయిలో ప్రత్యేక కమిటీల ఆధ్వర్యంలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. మార్కెట్లో వివిధ కంపెనీలకు చెందిన యంత్ర పరికరాలను రైతులకు సరఫరా చేస్తారు. సబ్సిడీ మొత్తాన్ని వ్యవసాయశాఖ సదరు కంపెనీలకు చెల్లించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు మండలాల వారీగా పరికరాలు, నిధులు కేటాయించారు. తీవ్ర పోటీ యంత్ర పరికరాల కోసం ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే అర్హుల ఎంపిక జిల్లా వ్యవసాయశాఖకు కత్తి మీద సాములా మారనుంది. రాష్ట్రలో 2017 లోనే యాంత్రీకరణ పథకం ఆగిపోయింది. అప్పటి నుంచి రైతులు ప్రైవేట్లో యంత్ర పరికరాలు కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు అద్దె ప్రతిపాదికన వినియోగించుకుంటున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం పథకాన్ని పునరుద్ధరించడంతో తీవ్రమైన పోటీ నెలకొంది. మరోవైపు జిల్లాలో పట్టా పాసు పుస్తకాలు ఉన్న రైతులు అతి తక్కువ మంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 4.50 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు సాగు చేస్తుండగా, ఎక్కువగా పురుషులకే పట్టాలు ఉన్నాయి. రాజకీయ జోక్యం లేకుండా, పారదర్శకంగా అర్హులను ఎంపిక చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.జిల్లా వివరాలుపరికరాలు కేటాయించిన నిధులు యూనిట్లు (రూ.లక్షల్లో)ట్రాక్టర్లు 4 20 పవర్ టిల్లర్ 3 3 బ్రష్ కట్టర్లు 4 1.4 ఆపరేటెడ్ స్ప్రేయర్లు 92 0.92 పవర్ స్ప్రేయర్లు 92 8.28 రోటవేటర్లు 52 24.96 సీడ్ కం ఫర్టిలైజర్ డ్రిల్ 8 2.4 డిస్క్ హ్యారో రోటో పడ్లర్ 5 10 బండ్ ఫార్మర్ 03 0.39 పవర్ వీడర్లు 2 0.7 -
జవాబుదారీతనంతో పనులు చేయించాలి
● డీఆర్డీవో దత్తారావురెబ్బెన(ఆసిఫాబాద్): జవాబుదారీతనంతో ఉపాధిహామీ పనులు చేయించాలని డీఆర్డీవో దత్తారావు అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీ ఆవరణలో బుధవారం 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఉపాధిహామీ సామాజిక తనిఖీల్లో గుర్తించిన అంశాలను ప్రజావేదిక ద్వారా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మండలంలో ఈజీఎస్లో భాగంగా 371 పనులు చేపట్టగా.. కూలీల వేతనాల రూపంలో రూ.3.47 కోట్లు, మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.20.27 లక్షలు చెల్లించినట్లు తనిఖీ బృందం సభ్యులు తెలిపారు. పంచాయతీరాజ్ ద్వారా 78 పనులు చేపట్టగా కూలీల వేతనాలకు రూ.14.29 వేలు, మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.1.58 కోట్ల చెల్లించినట్లు గుర్తించామని వెల్లడించారు. పంచాయతీల వారీగా చేపట్టిన పనుల వివరాలను తనిఖీ బృందం వివరించగా.. చాలాచోట్ల ఈజీఎస్ సిబ్బంది పూర్తిస్థాయిలో రికార్డులు నమోదు చేయకపోవడంపై డీఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల వివరాలను తెలిపే బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, కొలతల్లో తేడాల కారణంగా కూలీలు నష్టపోవడం వంటి అంశాలు తనిఖీలో బయటపడినట్లు సభ్యులు తెలిపారు. బీపీఎంలు కూలీలకు చెల్లించాల్సిన డబ్బులను నెలల తరబడి వారి వద్దే ఉంచుకుంటున్నట్లు గుర్తించామని తెలపడంతో.. బీపీఎంలకు షాకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఆర్డీవో ఆదేశించారు. కై రిగాంలో పంచాయతీలో చేపట్టిన పనులకు సంబంధించి పత్రాలపై ఏపీవో సంతకాలు లేకుండానే రూ.2లక్షల వేతనాలను కూలీలకు చెల్లించారని తెలిపారు. దానికి ఆపరేటర్ బాధ్యత వహించి కూలీలకు చెల్లించిన మొత్తాన్ని ఆయన ద్వారా రికవరీ చేయాలని డీఆర్డీవో ఆదేశించారు. పని ప్రదేశాల్లో నీడ, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా చేపట్టని వారికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు శంకరమ్మ, శ్రీనివాస్, హెచ్ఆర్ మేనేజర్ మల్లేశ్, హ్యూమన్ రిసోర్స్పర్సన్ రజినీకాంత్, క్వాలిటీ కంట్రోల్ అధికారి రమేశ్, ఏపీవోలు రామ్మోహన్రావు, బుచ్చన్న, ఎస్ఆర్పీ తిరుపతి, ఈజీఎస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగాలి
● ఏఎస్పీ చిత్తరంజన్కెరమెరి(ఆసిఫాబాద్): విద్యార్థులు చదువుకుని ఉ న్నతస్థాయికి ఎదగాలని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నా రు. సీఐ సత్యనారాయణ, ఎస్సై గుంపుల విజయ్ తో కలిసి బుధవారం మండలంలోని లెండిగూడ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల కు పరీక్ష ప్యాడ్లు, వాటర్ బాటిళ్లు, పెన్నులు అందించారు. బిలివర్స్ అకాడమీ జీకే మెటీరియల్ పంపిణీ చేశారు. ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అ నంతరం గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా సంప్రదించాల ని సూచించారు. అపరిచిత వ్యక్తులు సంచరిస్తే స మాచారం అందించాలన్నారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయుడు క్రాంతికుమార్ ఉన్నారు. దుకాణాల్లో తనిఖీలు తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని కెరమెరి మండలం భోలాపటార్ గ్రామంలో గల దుకాణాలను బుధవారం ఏఎస్పీ చిత్తరంజన్ తనిఖీ చేశారు. 56 దేశీదారు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. లెండిగూడలో మహిళా సంఘాలు మద్య నిషేధం అమలు చేస్తుండగా, గ్రామస్తులు భోలాపటార్కు వెళ్లి మద్యం తాగుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఇందిరమ్మ ఇళ్లు వేగంగా పూర్తిచేయాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): జిల్లాలో చేపట్టిన ఇందిరమ్మ మోడల్ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. మండలంలోని నవేగాంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు పనులు చేపట్టని లబ్ధిదారులతో మాట్లాడాలని హౌసింగ్ అధికారులకు సూచించారు. నిర్మాణ దశలోని ఇళ్లను పూర్తిచేయడంపై దృష్టి సారించాలన్నారు. వర్షాకాలం ప్రారంభంలోగా లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు పూర్తిచేయాలని సూచించారు. వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మిషన్ భగీరథ నీరందని ప్రాంతాల్లో ప్రత్యామ్యాయ మార్గాల ద్వారా తాగునీటిని అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పైపులైన్ల లీకేజీ, బోరు బావుల మరమ్మతులు పూర్తిచేయాలన్నారు. ఎల్ఆర్ఎస్పై అవగాహన కల్పించాలిఅనుమతులు లేని లేఅవుట్లను క్రమబద్ధీకరణకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్పై అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 31లోగా అర్హులు ఈ పథకం సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమాల్లో డీపీవో భిక్షపతి, ఎంపీడీవో శంకరమ్మ, ఎంపీవో వాసుదేవ్, హౌసింగ్ డీఈ వేణుగోపాల్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. రుణ బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలిఆసిఫాబాద్: జిల్లాలో సీ్త్రనిధి రుణ బకాయిల వసూళ్లపై అధికారులు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఆర్డీవో దత్తారావుతో కలిసి సహాయ ప్రాజెక్టు మేనేజర్లతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సాధికారత కల్పించే లక్ష్యంతో అందించిన రుణాలను సకాలంలో తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించామని పేర్కొన్నారు. రుణగ్రహీతలతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. ప్రత్యేక ప్రణాళిక రూపొందించి గడువులోగా వందశాతం రుణాలు వసూలు చేయాలన్నారు. సమావేశంలో అదనపు డీఆర్డీవో రామకృష్ణ, రిసోర్స్ మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ దీపక్ తివారి -
ఏఐ పాఠం.. ఆసక్తికరం
తప్పు చేస్తే చెబుతోంది ఏఐ బోధన ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. 20 నిమిషాలు ఇట్టే గడిచిపోతున్నాయి. తప్పులు చేస్తే.. కంప్యూటర్ చెబుతోంది. చేసిన తప్పు రెండోసారి చేస్తలేను. తెలుగులో వాక్యాలు రాయగలుగుతున్నా. – డి.రిషిత, ఐదో తరగతి, గోయగాం ప్రాథమిక పాఠశాల కొత్తగా అనిపిస్తుంది కంప్యూటర్లతో నేర్చుకోవడం కొత్తగా అనిపిస్తుంది. అర్థమయ్యే రీతిలో ప్రశ్నలు ఉన్నాయి. త్వరగా అర్థం చేసుకుంటున్నాను. ప్రశ్నలకు జవాబు తప్పుగా రాస్తే మరో అవకాశం ఉంది. సులువుగా లెక్కలు ఎలా చేయాలనేది వివరిస్తోంది. – అదె హర్శిత, ఐదో తరగతి, ఖిరిడి ప్రాథమిక పాఠశాల కెరమెరి(ఆసిఫాబాద్): నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో ఏఐ(అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) బోధనను ప్రారంభించింది. జిల్లాలో మొదటి విడతలో నాలుగు పాఠశాలల్లో తరగతులు మొదలయ్యాయి. ప్రతిరోజూ 20 నిమిషాలపాటు తెలుగు, గణితం బోధన కొనసాగుతుంది. గతంలో పోల్చుకుంటే విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల్లో మార్పు వచ్చిందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఏఐ పాఠాలపై ఎంతో ఆసక్తితో వింటున్నారని చెబుతున్నారు. సీ గ్రేడ్ విద్యార్థులు ఆసక్తిగా చదువు కొనసాగించేందుకు ఎఫ్ఎల్ఎన్(ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ)అమలులో ఇది కీలకంగా మారింది. గతంలో గణితం ఇబ్బందిగా పడే వారు మెరుగయ్యారు. కూడికలు, తీసివేతలు చేయగలుగుతున్నారు. చిన్నచిన్న గుణకారాలు చేస్తున్నారు. గతంలో ఉపాధ్యాయులు బోర్డుపై చెప్పగా, ప్రస్తుతం రంగురంగుల బొమ్మలతో గణితం బోధన కొనసాగుతోంది. తెలుగులో సరళ, కఠిన పదాలు రాని వారు ప్రస్తుతం రాయడం, చదవడం చేస్తున్నారు. ప్రాథమిక స్థాయిలోని విద్యార్థులకు కీబోర్డు, మౌస్ అంటేనే తెలియదు. అలాంటి వారికి కంప్యూటర్, కీబోర్డు, మౌస్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. మూల్యాంకనం అనంతరం విద్యార్థి స్థాయిని నిర్ధారించి బోధన మెరుగుపరుస్తున్నారు. మొత్తం పది దశల్లో ఇప్పటికే విద్యార్థులు మూడు దశలకు చేరారు. ప్రతీ పాఠశాలలో పది మంది..చదువులో వెనుకబడిన విద్యార్థులకు కృత్రిమ మే ధా ద్వారా సులభ రీతిలో పాఠాలు బోధించేలా విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ తరగతులను ప్రవేశపెట్టింది. రెబ్బెన మండలంలోని తక్కెళ్లపల్లి ప్రాథమిక పాఠశాల, కెరమెరి మండలం గోయ గాం, వాంకిడి మండలం ఖిరిడి, బెజ్జూర్ మండలం సలుగుపల్లి ప్రైమరీ పాఠశాలలను ఎంపిక చేశారు. 3, 4, 5వ తరగతుల నుంచి పది మంది విద్యార్థులకు ఏఐ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతీ విద్యార్థికి ప్రత్యేక యూజర్ ఐడీ ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత 20 నిమిషాల పాటు ప్రశ్నలు, పాఠాలు ఉంటాయి. కృత్రిమ మేధా ద్వారా నిర్వహిస్తున్న తరగతులు సులభ రీతిలో పిల్లలు త్వరగా అర్థం చేసుకునేలా ఉన్నాయి. ముందుగా ప్రశ్నల సరళితో విద్యార్థుల సామార్థ్యాలను పరిశీలిస్తుంది. ఆ తర్వాత దానికి అనుగుణంగా పాఠాలు బోధిస్తుంది. ఖిరిడి ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్లు లేకపోవడంతో పక్కనే ఉన్న ఉన్నత పాఠశాలలోని కంప్యూటర్లను వాడుతున్నారు. అక్కడ ఐదింటిలో మూడు మాత్రమే పనిచేస్తున్నాయి. మూడు కంప్యూటర్లు, ఒక స్కూల్ ట్యాబ్ ద్వారా 20 నిమిషాలకు నలుగురి చొప్పున తరగతులు నిర్వహిస్తున్నారు. చాలాచోట్ల ప్రశ్నల సరళిని అర్థం చేసుకుంటున్నా పాఠాల బోధన ఆంగ్లంలో ఉండటంతో చిన్నారులు తికమక పడుతున్నారు. ఒక్కో విద్యార్థికి 20 నిమిషాలపాటు తరగతులు అభ్యసన సామర్థ్యాల పెంపుదలకు దోహదం జిల్లాలోని నాలుగు ప్రాథమిక పాఠశాలల్లో కృత్రిమ మేధాతో బోధన సరిపడా కంప్యూటర్లు లేవు గణిత బోధన పద్ధతులు సులభంగా అర్థం చేసుకునేలా ఉంటున్నాయి. కానీ పాఠాలు ఇంగ్లిష్లో బోధిస్తున్నాయి. సక్రమంగా అర్థం కావడం లేదు. తెలుగులో బోధిస్తే ఇంకా మేలు. త్వరగా అర్థం చేసుకోవచ్చు. కంప్యూటర్లు సరిపడా లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. – అదె సంధ్య, ఐదో తరగతి, ఖిరిడి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉపయోగం విధ్యార్థులు ఏఐ బోధనతో పాఠాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. 20 నిమిషాలు ఉత్సాహంగా చతుర్విద ప్రక్రియలు చేయగలుగుతున్నారు. తెలుగు వాక్యాలు రాయగలుగుతున్నారు. ప్రస్తుతం మూడో దశకు చేరారు. కృత్రిమ మేథా విద్యార్థులకు ఎంతో ఉపయోగం. – భరత్రావు, ఉపాధ్యాయుడు, గోయగాం కంప్యూటర్ వినియోగంపై అవగాహన ఏఐ తరగతులకు చదువులో వెనుకబడిన పది మంది విద్యార్థులను ఎంపిక చేశాం. సోమ, మంగళ, బుధ, గురు వారాల్లో ప్రతీ విద్యార్థికి 20 నిమిషాల చొప్పున తరగతులు ఉంటాయి. కంప్యూటర్ల ద్వారా తరగతులు, ప్రశ్నలు ఉండటంతో విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. కంప్యూటర్ వినియోగంపై కూడా వారికి అవగాహన వస్తుంది. – శివరాజ్, ఉపాధ్యాయుడు, ఖిరిడి ప్రాథమిక పాఠశాల -
‘పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దు’
బెజ్జూర్(సిర్పూర్): అటవీశాఖ అధికారులు పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం రైతులతో కలిసి జిల్లా అటవీశాఖ అధి కారి నీరజ్కుమార్కు వినతిపత్రం అందించా రు. ఆయన మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో ని గ్రామాల్లో తాగునీటి బోర్లు వేసుకునే అవకా శం కల్పించాలన్నారు. హక్కుపత్రాలు ఉన్న రైతులు పత్తి కట్టే తీసేందుకు ఇబ్బందులకు గురిచేయవద్దని పేర్కొన్నారు. రెవెన్యూ, అటవీ శాఖల ఆధ్వర్యంలో ఉమ్మడి సర్వే నిర్వహించి, రైతులు భూములు సాగు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. సమస్యను ఉన్నతాధికా రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని డీఎఫ్వో హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, మాజీ ఎంపీపీ డుబ్బుల నాన్నయ్య, మాజీ సర్పంచ్ విశ్వేశ్వర్, నాయకులు పారుపల్లి పోశం, ఉమామహేష్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఊరిస్తున్న గోలేటి ఓసీపీ
● ఆలస్యమవుతున్న ఏర్పాటు ప్రక్రియ ● స్జేట్– 1 అనుమతుల కోసం నిరీక్షణ ● అక్టోబర్ దాటితే మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాల్సిందే.. ● ఓపెన్ కాస్టు కోసం కార్మికులు, ప్రజల ఎదురుచూపురెబ్బెన(ఆసిఫాబాద్): ఒకప్పుడు బొగ్గు గనులు, వేలాది మంది కార్మికులతో కళకళలాడిన బెల్లంపల్లి ఏరియా ప్రస్తుతం ఒకేఒక్క ఓసీపీ(ఓపెన్ కాస్టు ప్రాజెక్టు)తో కాలాన్ని వెల్లదీస్తోంది. ఏరియాకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ప్రస్తుతం ఉన్న కై రిగూడ ఓసీపీ జీవితకాలం మరో మూడేళ్లలో పూర్తి కానుండటంతో ఏరియా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది. ఆ లోపే ఏరియాకు పునర్జీవం అందించేలా గోలేటి, ఎంవీకే ఓసీపీలను ఏర్పాటు చేయాలని సింగరేణి యాజమాన్యం ముమ్మర ప్రయత్నాలు సాగిస్తోంది. అయితే అనుమతులు సకాలంలో అందకపోవడంతో గోలేటి ఓసీపీ ఏర్పా టు ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. ఐదేళ్ల క్రిత మే ప్రక్రియ ప్రారంభించినా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అనుమతులు రాలేదు. ఏరియా అధికారులు మాత్రం ఓసీపీ ఏర్పాటుపై ఊరిస్తూనే ఉన్నారు. 15 ఏళ్ల జీవిత కాలంతో..బెల్లంపల్లి ఏరియాలో ప్రస్తుతం కై రిగూడ ఓసీపీ ఒక్కటే కొనసాగుతోంది. ఇక్కడ మరో 10 మిలియన్ టన్నుల వరకు మాత్రమే బొగ్గు నిల్వలు ఉండగా.. మరో మూడేళ్లపాటు ఈ ఓసీపీ నడుస్తుంది. ఆ లోపే గోలేటి ఓసీపీని ఏర్పాటు చేయాలని అధికారులు ముందుకు సాగుతున్నారు. సుమారు రూ.220 కోట్ల నిధులు గోలేటి ఓసీపీ కోసం ఖర్చు చేయనున్నారు. ఏరియాలో మూసివేసిన గోలేటి– 1, గోలేటి– 1ఏ భూగర్భ గనులు, బీపీఏ ఓసీపీ– 2 ఎక్స్టెన్షన్, అబ్బాపూర్ ఓసీపీ భూభాగాన్ని కలుపుకుని గోలేటి ఓసీపీని ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. గోలేటి ఓసీపీ ద్వారా 15 ఏళ్లపాటు నిరాటకంగా బొగ్గు ఉత్పత్తి చేపట్టవచ్చని యాజమాన్యం అంచనా వేయగా.. 36 మిలియన్ టన్నుల వరకు నిక్షేపాలు అందుబాటులో ఉన్నాయి. గోలేటి ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ మొదలు కాగానే.. ఎంవీకే ఓసీపీ ఏర్పాటు ప్రక్రియ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఎంవీకే ఓసీపీ జీవిత కాలం సుమారు 20 ఏళ్లు ఉంటుందని అంచనా. గోలేటి ఓసీపీతోపాటు ఎంవీకే ఓసీపీ అందుబాటులోకి వస్తే బెల్లంపల్లి ఏరియా పూర్వ వైభవం రావడం ఖాయం. 1,358.280 హెక్టార్లలో..కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో గోలేటి ఓసీపీని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు 1,358.280 హెక్టార్ల భూభాగం అవసరం ఉండగా గోలేటి– 1, గోలేటి– 1ఏ, అబ్బాపూర్ ఓసీపీ, బీపీఏ ఓసీపీ– 2 ఎక్స్టెన్షన్ల కోసం గతంలో సేకరించిన 594.071 హెక్టార్ల భూమి ప్రస్తుతం సింగరేణి అధీనంలో ఉంది. మిగిలిన 665.914 హెక్టార్లు సేకరించాల్సి ఉంది. ఇందులో 59 ఎకరాల మాత్రమే ప్రైవేటు భూమి ఉంది. మిగిలినదంతా అటవీశాఖకు చెందినది కావడంతో భూసేకరణ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ప్రైవేటు భూమి సేకరణ ప్రక్రియ కలెక్టరేట్ పరిధిలో ఉండగా త్వరలో అవార్డు కానుంది. మిగిలిన అటవీశాఖ భూసేకరణకు సంబంధించిన స్టేజ్– 1, స్టేజ్– 2 అనుమతులతోపాటు పర్యావరణ అనుమతులు రాగానే ఓసీపీ ద్వారా బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే 2026లో గోలేటి ఓసీపీ ద్వారా ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి బొగ్గు ఉత్పత్తి బెల్లంపల్లి ఏరియాలో నూతనంగా ప్రారంభించనున్న గోలేటి ఓసీపీ ద్వారా వచ్చే ఏడాది నుంచి బొగ్గు ఉత్పత్తి చేపట్టాలనే చూస్తున్నాం. అనుమతులు కోసం ప్రయత్నిస్తున్నాం. వచ్చే నెలలో స్టేజ్– 1 అనుమతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్విరాన్మెంట్, స్టేజ్– 2 అనుమతుల కోసం ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాం. పరిస్థితులు అనుకూలిస్తే వచ్చే ఏడాది నుంచి గోలేటి ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి మొదలువుతుంది. ఆ తర్వాత కొన్నేళ్లకే ఎంవీకే ఓసీపీ సైతం ఏర్పాటు అవుతుంది. – విజయభాస్కర్రెడ్డి, బెల్లంపల్లి ఏరియా జీఎం స్టేజ్ 1 అనుమతులపైనే ఆశలన్నీ..బెల్లంపల్లి ఏరియా భవిష్యత్ ఆశాదీపంగా భావిస్తున్న గోలేటి ఓసీపీకి ఇప్పటివరకు స్టేజ్–1 అనుమతులు కూడా రాకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. కొన్నేళ్లుగా స్టేజ్– 1 అనుమతులు కోసం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్టు అధికారులకు దరఖాస్తు చేసుకున్నా కిందిస్థాయి నుంచి కేంద్రం వరకు ఒక్కోస్థాయిలో జాప్యం జరుగుతోంది. ఎట్టకేలకు స్టేజ్– 1 అనుమతులకు సంబంధించిన ఫైల్ ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వద్దకు చేరింది. వచ్చే నెలలో ఈ అనుమతులు వచ్చే అవశాశం ఉందని ఏరియా అధికారులు భావిస్తున్నారు. అనుమతులు రాగానే పర్యావరణ అనుమతులతో పాటు స్టేజ్– 2 అనుమతులు సాధించేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. అయితే గోలేటి ఓసీపీ కోసం యాజమాన్యం 2022 అక్టోబర్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఒకసారి ప్రజాభిప్రాయ పూర్తయిన తర్వాత మూడేళ్లలోపు ప్రాజెక్టు ప్రారంభించని పక్షంలో మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాల్సి ఉంటుంది. దీంతో వచ్చే అక్టోబర్ లోగా స్టేజ్– 1 అనుమతులతోపాటు పర్యావరణ అనుమతులు సైతం సాధించేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. -
పోటాపోటీగా సంతల వేలం
కౌటాల(సిర్పూర్): కౌటాల వారసంత, పశువుల సంత నిర్వహణ రుసుం వసూలు చేసేందుకు మంగళవారం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీవో కోట ప్రసాద్ అధ్యక్షతన వేలం నిర్వహించారు. వ్యాపారులు పోటాపోటీగా వేలంలో పాల్గొన్నారు. కౌటాల వార సంతను రూ.7.25 లక్షలకు సదాశివపేట కాలనీకి చెందిన అనంతు ల సాయికృష్ణ దక్కించుకున్నారు. పశువుల సంత వేలం దాదాపుగా గంటకు పైగా సాగించిది. చివరికి కోయగూడ కాలనీకి చెందిన కు మురం సకారం రూ.28.45 లక్షలకు దక్కించుకున్నారు. గతేడాది నిర్వహించిన వేలంలో వారసంత రూ.4.20 లక్షలు, పశువుల సంత రూ.11 లక్షలు పలికింది. గతేడాదితో పోల్చి తే ఈసారి కౌటాల పంచాయతీకి రూ.20.37 లక్షల అదనపు ఆదాయం సమకూరింది. ఎ లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ ముత్యం రమేశ్ సమక్షంలో బందోబస్తు నిర్వహించారు. సమావేశంలో ఎస్సై మధుకర్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కుమురం మాంతయ్య, మాజీ ఎంపీపీ విశ్వనాథ్, బీజేపీ జి ల్లా కార్యదర్శి రాజేందర్గౌడ్, మండల అధ్యక్షుడు విజయ్, మాజీ సర్పంచ్ మౌనిశ్, పంచాయతీ కార్యదర్శి సాయికృష్ణ పాల్గొన్నారు. -
ఉత్తమ బోధనకు అవార్డు
కెరమెరి(ఆసిఫాబాద్): విద్యార్థుల్లో ఇంగ్లిష్ అంటే భయం పోగొట్టి.. వెనుకబడిన విద్యార్థులు సైతం చదవడం, రాయడం, మాట్లాడటంలో ప్రతిభ చూపేలా కృషి చేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్ (సీఆర్టీ) కె.ప్రవీణ్కుమార్ను అవార్డు వరించింది. ఉట్నూర్లోని పీఎంఆర్సీ భారత్ దేఖో సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం యంగ్ ఓరేటర్ క్లబ్(వైఓసీ) అ వార్డుల ప్రదానోత్సవం జరిగింది. కెరమెరి మండలం రాంజీగూడ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న సీఆర్టీ ప్రవీ ణ్కుమార్ ఉత్తమ ఇంగ్లిష్ టీచర్గా అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు. గత నెల 20న రాంజీగూడ ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా సందర్శించారు. విద్యార్థుల ఇంగ్లిష్ ప్రావీణ్యతను గుర్తించా రు. ఈ మేరకు ప్రవీణ్కుమార్ కృషిని గుర్తించి అవార్డుకు ఎంపిక చేశారు. ఏసీఎంవోలు పుర్క ఉద్దవ్, జగన్ అవార్డు ప్రదానం చేశారు. ఉమ్మడి జిల్లాలో 16 మందిని అవార్డు చేయగా, ఇందులో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన వారు నలుగురు ఉన్నారు. -
నాది ఆవేశం కాదు.. ఆవేదన
● షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చిన రావి శ్రీనివాస్కౌటాల(సిర్పూర్): ‘నాది ఆవేశం కాదని, ఆవేదన’ అని సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి రావి శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఇటీవల రావి శ్రీనివాస్కు ఇచ్చిన షోకాజ్ నోటీస్కు మంగళవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన వివరణ పత్రం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇద్దరు, ముగ్గురు నాయకులు మంత్రి సీతక్కకు తప్పుడు సమాచారం ఇస్తూ తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. సిర్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులకు జరుగుతున్న అన్యాయాన్ని తెలిపానని, నాకు వ్యక్తిగతంగా ఎవరిపైనా ఈర్షలేదని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తల నుంచి పెరుగుతున్న ఫిర్యాదుల మేరకు ఎమ్మెల్సీ దండె విఠల్కు వివరణ తెలపాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ ఇంటికి వెళ్లానని, నాకు వేరే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. ఇప్పటికై నా కొత్త, పాత నాయకుల మధ్య సమన్వయం కోసం కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు కట్టుబడి ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో కాగజ్నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్దల దేవయ్య, నాయకులు పాల్గొన్నారు. -
37.7 /21.7
గరిష్టం/కనిష్టంసంత వేలానికి వేళాయె! జిల్లాలోని మండల కేంద్రాల్లో నిర్వహించే వారసంతల నిర్వహణ గడువు మార్చి నెలతో ముగియనుంది. దీంతో జిల్లాలోని వారసంతలకు అధికారులు వేలం నిర్వహిస్తున్నారు.9లోu వాతావరణం ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి, ఉక్కపోత పెరుగుతుంది. అర్ధరాత్రి తర్వాత చల్లగా ఉంటుంది. -
అసెంబ్లీ ఆవరణలో బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
బెజ్జూర్: యాసంగి సీజన్లో పంటలు సాగుచేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు సోమవారం అసెంబ్లీ ఆవరణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు డాక్టర్ పాల్వాయి హరీష్బాబు, పాయల్ శంకర్, ధనపాల్ సూర్యనారాయణ గుప్తా, కాటేపల్లి వెంకటరమణారెడ్డి, రామారావు పటేల్ నిరసన వ్యక్తం చేశారు. పంట చేతికి వచ్చే దశలో నష్టపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయకపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారన్నారు. -
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరు తూ వీహెచ్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇస్లాంబిన్హసన్ సోమవారం కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలింకో సంస్థ ద్వారా నిర్ధారణ అయిన దివ్యాంగులకు సహాయక పరికరాలు వెంటనే ఇవ్వాలని, రాజీవ్ యువ వికాసం పథకంలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని, మూడునెలలకు ఒకసారి దివ్యాంగుల కన్వర్జెన్సీ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాజయ్య, శ్రీనివాస్, మొండయ్య, తాజ్, తదితరులు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్పై అవగాహన కల్పించాలివాంకిడి: లే అవుట్ భూముల క్రమబద్ధీకరణ ద్వారా కలిగే ప్రయోజనలపై క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అవగాహన కల్పించడంతో పాటు విస్తృతంగా ప్రచారం చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్–2020లో భాగంగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఈనెల 31లోగా క్రమబద్ధీకరణకు అవసరమైన రుసుం చెల్లిస్తే 25 శాతం మినహాయింపు ఉంటుందన్నారు. అన్ని పంచాయతీల్లో వందశాతం ఇంటిపన్ను వసూలు అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. పీహెచ్సీని సందర్శించి రికార్డులు పరిశీలించారు. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన హెడ్నర్స్కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అంతకుముందు ఎంపీడీవో కార్యాలయంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటి నమునా, జెడ్పీ పాఠశాలలో నిర్వహిస్తున్న పదోతరగతి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రియాజ్ అలీ, ఎంపీడీవో ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
కౌటాల: కాంగ్రెస్తోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకా లను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాను న్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలన్నారు. దేశ ప్రజాస్వామ్యాన్ని, రా జ్యాంగాన్ని కాపాడాలని జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ సిడాం గణపతి, మాజీ ఎంపీపీలు వి శ్వనాథ్, నానయ్య, నాయకులు తిరుపతి, రవీందర్గౌడ్, గట్టయ్య, పోశం, భీంరావ్, సోమయ్య, బండు, కుశబ్రావు తదితరులు పాల్గొన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజంక్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడలతో బంగారు భవిష్యత్ ఉంటుందని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న కౌటాల ప్రిమియర్ లీగ్ క్రికెట్ పోటీలు సోమవారం ముగిశాయి. ఫైనల్ మ్యాచ్ను ఆయన ప్రారంభించారు. మొదటి బహుమతి గేమ్ ఛేంజర్ జట్టుకు రూ.లక్ష, ద్వితీయ బహుమతి ఎస్ఎన్టీఎన్ జట్టుకు రూ. 50 వేల నగదు అందజేశారు. కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం, మాజీ జెడ్పీ చైర్మన్ సిడాం గణపతి, కౌటాల సీఐ ముత్యం రమేశ్, మాజీ ఎంపీపీలు బసర్కార్ విశ్వనాథ్, డుబ్బుల నానయ్య, ఎంపీడీవో కోట ప్రసాద్, ఎస్సై మధుకర్, నాయకులు తిరుపతి, రవీందర్గౌడ్, అజ్మత్, సత్యనారాయణగౌడ్, విలాస్గౌడ్, అశోక్, ఉమాపతి, పవిత్ర, ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ దండె విఠల్ -
ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి
ఆసిఫాబాద్అర్బన్: ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను సమన్వయంతో పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావ్తో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్కు చెందిన అజిత్ మేసీ్త్ర తాను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పశువుల పాక నిర్మించానని, బిల్లు మంజూరు చేయాలని, కౌటాల మండలం బాదంపల్లికి చెందిన కొండగుర్ల రాజ్కుమార్ దళిత బంధు పథకం కింద రైస్మిల్లు నిర్మించుకున్నానని, విద్యుత్ సౌకర్యం కల్పించాలని, కెరమెరి మండలం కేస్లాగూడకు చెందిన సిడాం గోదావరి పీఎం విశ్వకర్మ పథకంలో గోల్డ్స్మిత్ శిక్షణ పూర్తి చేశానని, రుణ సౌకర్యం కల్పించాలని కోరారు. పరిహారం ఇప్పించాలి మాది కాగజ్నగర్ మండలం వంజిరి గ్రామం. మా వ్యవసాయ భూముల్లోంచి రైల్వే లైన్ పోయింది. నష్టపరిహారం కోసం మూడు సంవత్సరాలుగా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా కలెక్టర్ చొరవచూపి మేము కోల్పోయిన వ్యవసాయ భూములకు పరిహారం ఇప్పించాలి. – లింగయ్య, నగేష్, రాజ్కుమార్, వంజిరి కలెక్టర్ వెంకటేష్ దోత్రే -
క్రీడలతో ఉజ్వల ఉజ్వల భవిష్యత్
కౌటాల: క్రీడలతో ఉజ్వల ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా కౌటాల పోలీస్ స్టేషన్ మైదానంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను ఏఎస్పీ చిత్తరంజన్, కాగజ్నగర్ డీఎస్పీ రామానుజంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటలు శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడుతూ ఐకమత్యాన్ని పెంపొందిస్తాయన్నారు.యువతకు నిత్యజీవితంలో క్రీడలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. యువత చెడు వ్యసనాలకు, బెట్టింగ్కు దూరంగా ఉండాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటే బంగారు భవిష్యత్ నాశనమవుతుందన్నారు. ఈ క్రీడాపోటీలు ఇతర జిల్లాలకు ఆదర్శంగా ఉండాలన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తితో ఆటలు ఆడాలన్నారు. మూడు రోజులపాటు నిర్వహించనున్న పోటీల్లో విజేత జట్లకు ప్రథమ బహుమతి రూ.20 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.10వేల నగదుతో పాటు బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌటాల సీఐ ముత్యం రమేశ్, కాగజ్నగర్ సీఐ రాజేంద్రప్రసాద్, కాగజ్నగర్ డివిజన్ పరిధిలోని ఎస్సైలు మధుకర్, నరేష్, ప్రవీణ్, కొమురయ్య, రాజు, సందీప్, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.క్రీడలతో అవకాశాలు..క్రీడల్లో పాల్గొని రాణించే వారికి ఆయా రంగాల్లో అవకాశాలుంటాయి. శారీరక, మానసిక పరమైన ఉపయోగాలు ఉంటాయి. ఆరోగ్య రక్షణలో క్రీడల పాత్ర ఎంతగానో ఉంటుంది. సమాజంలో గుర్తింపు వస్తుంది. గ్రామీణ యువతను ప్రోత్సహించేందుకు పోలీస్శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసి మూడు రోజుల పాటు వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నాం. మంచి స్పందన వచ్చింది.– ముత్యం రమేశ్, సీఐ, కౌటాల -
ఏదీ ‘చెత్త’శుద్ధి?
● మున్సిపాలిటీల్లో మొక్కుబడిగా పారిశుధ్య పనులు ● ఒకే వాహనంలో తడి, పొడి చెత్త.. ● జిల్లా కేంద్రంలో అలంకార ప్రాయంగా సెగ్రిగేషన్ షెడ్ ఆసిఫాబాద్/ఆసిఫాబాద్అర్బన్: రాష్ట్రంలోని ప్రతీ గ్రామం, పట్టణం పరిశుభ్రంగా ఉండాలనే సంకల్ప ంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తడి, పొడి చెత్త డంపింగ్ యార్డు ఏర్పాటు జిల్లా కేంద్రంలో కార్యరూపం దాల్చడం లేదు. ఫలితంగా పట్టణంలోని జాతీయ రహదారి పక్కన డంపింగ్ యార్డులో రూ.2.5 లక్షలతో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్ అలంకారప్రాయంగా మారింది. గ్రామాల్లో చెత్తాచెదారం లేకుండా ప్రతీకాలనీని శుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో నాలుగేళ్ల క్రితం గత ప్రభుత్వం సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మేజర్ గ్రామ పంచాయతీ స్థాయి నుంచి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయినప్పటికీ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో ఈ పథకం అమలుకావడం లేదు. కాలనీల్లో తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాల్సి ఉండగా మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది ఒకే వాహనంలో తడి, పొడి చెత్త సేకరిస్తున్నారు. 6 చెత్త సేకరణ వాహనాలుజిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో సుమారు 30 వేలకు పైగా జనాభా, 20 వార్డులు, ఆరువేలకు పైగా గృహాలున్నాయి. ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి 6 చెత్త సేకరణ వాహనాలు, 3 ట్రాక్టర్లు ఉన్నాయి. ప్రతీరోజు సుమారు 10 టన్నుల చెత్త వెలువడుతుంది. రెండు మూడు రోజులకోసారి కాలనీల్లో వాహనాల ద్వారా చెత్త సేకరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోజుల తరబడి వాహనాలు రాకపోవడంతో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. లోపిస్తున్న పారిశుధ్యంజిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో పలు కాలనీల్లో పారిశుధ్యం లోపిస్తోంది. పట్టణంలోని కొన్ని కాలనీల్లో నెలల తరబడి రోడ్లు ఊడ్వడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. గతంలో రెండు రోజులకోసారి చెత్త బండి కాలనీలకు వస్తుండగా ప్రస్తుతం నాలుగు రోజులకోసారి వస్తున్నట్లు పేర్కొంటున్నారు. నాలుగేళ్ల క్రితం పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్కు మరమ్మతు చేపట్టడంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అమలుకు నోచుకోని సెగ్రిగేషన్ షెడ్జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో సెగ్రిగేషన్ షెడ్లో వర్మీకంపోస్టు తయారీలో జాప్యం జరుగుతోంది. పట్టణంలోని జాతీయ రహదారి పక్కనే ప్రభుత్వ భూమిలో ఉన్న డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు గతంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చెత్త సేకరణకు ఇంటింటికీ రెండు వేర్వేరు డబ్బాలను పంపిణీ చేశారు. చెత్తను డబ్బాల్లో సేకరించి సెగ్రిగేషన్ ప్లాంట్కు తరలించి సేంద్రియ ఎరువుల తయారీకి ఉపయోగిస్తారు. తడి చెత్తను వర్ని కంపోస్టు ప్లాంట్లో మూడు నెలల పాటు నిల్వ ఉంచి ఎరువుగా మార్చి రైతులకు విక్రయిస్తే మున్సిపాలిటీకి అదనపు ఆదాయం సమకూరే అవకాశాలున్నాయి. సెగ్రిగేషన్ షెడ్, డంపింగ్ యార్డు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్మించగా మున్సిపాలిటీకి ప్రత్యేక డంపింగ్ యార్డు లేదు. ఇటీవలే సెగ్రిగేషన్ షెడ్ను మున్సిపాలిటీకి ఇచ్చారు. చెత్తబండి రావడం లేదు మా కాలనీకి చెత్త బండి రెగ్యులర్గా రావడం లేదు. మూడు మాసాలుగా కాలనీలో ఊడ్వడం లేదు. మిషన్ భగీరథ పైప్లైన్ పగిలిపోయి నాలుగేళ్లు కావస్తున్నా మరమ్మతు చేయడం లేదు. ఇప్పటికై నా అధికారులు తగు చర్యలు తీసుకోవాలి. – గుండ ప్రమోద్, వాసవీనగర్ సిబ్బంది కొరత ఉంది జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో సిబ్బంది కొరత ఉంది. ఇటీవలే సెగ్రిగేషన్ షెడ్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీకి ఇచ్చారు. వర్మికంపోస్టు తయారీకి అవసరమున్న మిషనరీతో పాటు తడి, పొడి చెత్త సేకరణకు ప్రత్యేక వాహనాలు అవసరం. ముఖ్యంగా ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ డంపింగ్ యార్డునే వినియోగించుకుంటున్నాం. మున్సిపాలిటీకి ప్రత్యేక డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. – భుజంగరావు, మున్సిపల్ కమిషనర్ -
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయి నెట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ మహేశ్వర్ తెలిపారు. సోమవారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీడీ తిరుపతితో కలిసి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలకు చెందిన నిశ్విత్, కార్తికేయ, మనితేజ ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి నెట్బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చారని, ఈ నెల 27 నుంచి 30 వరకు హర్యానాలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ఒకేసారి ఎన్నికలతో దేశాభివృద్ధి
ఆసిఫాబాద్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగడం వల్ల దేశాభివృద్ధి జరుగుతుందని ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ జిల్లా క న్వీనర్ అరిగెల నాగేశ్వర్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని విశ్రాంత సంఘ భవనంలో సోమవారం ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఎన్నికలు ఒకేసారి జరగడం వల్ల పాలనాపరంగా అనుకూలంగా ఉంటుందని, ఓటింగ్శాతం కూడా పెరుగుతుందన్నారు. దర్శక నిర్మాత దండనాయకుల సురేశ్ కుమార్ మాట్లాడుతూ మేధావులు, విశ్రాంత ఉద్యోగులు దేశభవిష్యత్ దృష్ట్యా ఈ విషయాన్ని సమాజంలో ప్రతిఒక్కరికి తెలిసేలా చూ డాలన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కరుణాగౌడ్, యూనిట్ అధ్యక్షుడు కే.రమేశ్, విశ్రాంత ఉద్యోగులు గుర్రాల వెంకటేశ్వర్లు, లింగయ్య, రామారావు, వెంకన్న, బాలశ్రీరాములు, సుగుణాకర్, కనకమ్మ, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు పరిహారం చెల్లించాలి
కాగజ్నగర్రూరల్: వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30 వేల పరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే హరీశ్బాబు డిమాండ్ చేశారు. మండలంలోని నజ్రూల్నగర్ విలేజ్ నం.2, 12 గ్రామాల్లో ఆదివారం పర్యటించారు. వడగళ్లవానతో నష్టపోయిన మామిడి తోటలు, మొక్కజొన్న పంటను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంట చేతికొచ్చే దశలో రైతులకు అపార నష్టం జరిగిందన్నారు. వ్యవసాయశాఖ అధికారులు పూర్తిస్థాయి సర్వే నిర్వహించి నష్టాన్ని అంచనా వేయాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రైతులెవరూ అధైర్యపడవద్దన్నారు. ప్రధానమంత్రి ఫసల్బీమా యోజన పకడ్బందీగా అమలు చేస్తే అతివృష్టి, అనావృష్టితో నష్టపోయిన రైతులను ఆదుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేయకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు బికాస్ ఘరామీ, మాజీ ఎంపీపీలు మనోహర్గౌడ్, కొప్పుల శంకర్, జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జి అమిత్ బిశ్వాస్, మాజీ ఉప సర్పంచ్ సమీర్గుప్తా, దీపక్ గెయిన్, అషుతోష్ మండల్, గోవింద్ మండల్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు -
అన్నిరంగాల్లో మహిళల విజయం
రెబ్బెన(ఆసిఫాబాద్): నేటి కాలంలో ఇంటి నుంచి ఆకాశం వరకు అన్నిరంగాల్లో మహిళలు విజయం సాధిస్తున్నారని, వారు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని సినీ నటుడు బాబుమోహన్, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ పార్లమెంట్ కోకన్వీనర్ కొలిపాక కిరణ్కుమార్ దంపతులు మండలంలోని పారిశుధ్య కార్మికులు, అంగన్వాడీ, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలకు ఆదివారం దేవులగూడలో చీరలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ.. ఇంటితోపాటు సమాజంలో అనేక బాధ్యతలు నెరవేరుస్తూనే మగవారితో సమానంగా అన్నిరంగాల్లో రాణిస్తున్నారన్నారు. భూదేవికి ఉన్నంత ఓర్పు కలిగిన మహిళలు ఆగ్రహిస్తే ఆదిపరాశక్తులుగా మారుతారని పేర్కొన్నారు. గ్రామాల్లో ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనివన్నారు. కరోనా వంటి కష్టకాలంలో ప్రాణాలు పణంగా పెట్టి సేవలందించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కృష్ణకుమారి, జిల్లా ఉపాధ్యక్షుడు గుల్బం చక్రపాణి, మండల అధ్యక్షుడు మల్రాజు రాంబాబు, జిల్లా అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్, మండల మాజీ అధ్యక్షుడు గోలెం తిరుపతి, నాయకులు నవీన్గౌడ్, ఓదెలు తదితరులు పాల్గొన్నారు. -
సంస్థాగతంగా కాంగ్రెస్ను బలోపేతం చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని రాష్ట్ర మినరల్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాదరావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన జైబాపు, జైభీమ్, జైసంవిధాన్ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దండె విఠల్తో కలిసి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దేశం కోసం సర్వం త్యాగం చేసిన గాంధీ వంటి మహనీయులను గుర్తుంచుకోవాలన్నారు. ప్రస్తుతం బీజేపీ మతతత్వ రాజకీయాలు కొనసాగిస్తోందని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్ను అవమానిస్తున్నారని పేర్కొన్నారు. కార్పొరేట్ వ్యవస్థల కోసం బీజేపీ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును కేంద్రానికి పంపించామని, తొమ్మిదో షెడ్యూల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు భాస్కర్, నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి సుగుణ, మాజీ ఎమ్మెల్యే సక్కు, జెడ్పీ మాజీ చైర్మన్ గణపతి, మాజీ ఎంపిపి బాలేశ్వర్గౌడ్, నాయకులు గుండాశ్యాం, మల్లేశ్, మునీర్, చరణ్, వసంత్రావు, అసద్, శివప్రసాద్, గోపాల్నాయక్, జావీద్, బబ్లు తదితరులు పాల్గొన్నారు. -
బెట్టింగ్.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దీనిపైనే చర్చ సాగుతోంది. అనుమతి లేని యాప్లను ప్రమోషన్ చేస్తున్న పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ విషపు వలలో చిక్కుకుని అనేకమంది ఆర్థికంగా నష్టపోతున్నారు. ఐపీఎల్ మ్యాచ్లు కూడా ప్రారంభమైన నేపథ్యంలో బెట్టి
● చాపకింద నీరులా విస్తరిస్తున్న జూదం ● బానిసలుగా మారుతున్న యువత ● ఐపీఎల్ ప్రారంభమైన నేపథ్యంలో అప్రమత్తత అవసరం ● ఏటా రూ.లక్షల్లో సాగుతున్న దందా అంతా ‘స్మార్ట్’గానే..జిల్లాలో చాలా వరకు గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. కాగజ్నగర్, ఆసిఫాబాద్, కౌటాల, తిర్యాణి, రెబ్బెన, వాంకిడి, చింతలమానెపల్లి, బెజ్జూర్, పెంచికల్పేట్ మండలాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో యువత సెల్ఫోన్లో ఆన్లైన్ బెట్టింగ్ పెడుతున్నారు. రాష్ట్రంలో నిషేధిత యాప్ల ద్వారా ఈ బెట్టింగ్ దందా నడుస్తోంది. దాదాపు 75 వెబ్సైట్లు, యాప్లు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నిషేధం ఉండటంతో ఫోన్లో ఫేక్ జీపీఎస్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని లొకేషన్ మార్చుకుంటున్నారు. హర్యానా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు లొకేషన్ మార్చి యాప్లు వినియోగిస్తున్నారు. జట్టులో ఆటగాళ్ల ఆటతీరు.. చివరిగా మ్యాచ్ గెలిచేదెవరు..? అని అనేక అంశాలపై రూ.వేల నుంచి రూ.లక్షల వరకు బెట్టింగ్ కాస్తున్నారు. యువకులతోపాటు చిరు వ్యాపారులు సైతం ఈ మోజులో పడి అప్పుల పాలవుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా సాగే ఈ బెట్టింగ్ దందా.. ఇప్పుడు జిల్లాలోని పల్లెలకు పాకడం కలవరపెడుతోంది. సెల్ఫోన్లోనే యాప్ల ద్వారా ఆడుతూ యూపీఐ ఐడీలతో డబ్బులు బదిలీ చేస్తున్నారు. తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలు సైతం అనుసంధానం చేయడం ద్వారా వారిని సైతం సమస్యల్లోకి నెడుతున్నారు.కౌటాల(సిర్పూర్): క్రికెట్ అంటే చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఆట. టీ20 ఫార్మాట్లో జరిగే ఐపీఎల్ మరింత క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ను కొందరు వ్యాపారంగా మార్చుకుంటున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభమైన నేపథ్యంలో యువత, ఉద్యోగులు, విద్యార్థులు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల సాయంతో ఇంటి నుంచే పందెం కాసేందుకు రెడీ అవుతున్నారు. గతంలో ఢిల్లీ, ముంబాయి, బెంగుళూర్, హైదరాబాద్ వంటి నగరాలకే పరిమితమైన ఈ భూతం కొన్నేళ్లుగా జిల్లాలోనూ చాపకింద నీరులా విస్తరించింది. తెలిసీతెలియక చాలా మంది ఆన్లైన్లో డబ్బులు పెట్టి అప్పుల పాలవుతున్నారు. గతంలో సంఘటనలుగతంలో క్రికెట్ బెట్టింగ్కు జిల్లా కేంద్రంతోపాటు కాగజ్నగర్కు చెందిన కొంతమంది బెట్టింగులకు పాల్పడుతూ పోలీసులకు చిక్కిన సందర్భాలు ఉన్నాయి. మూడేళ్ల క్రితం కౌటాల మండలం ముత్తంపేట గ్రామంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు బెట్టింగ్రాయుళ్లు ఔరంగబాద్కు చెందిన వ్యక్తితో ఓ వైబ్సైట్లో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా పక్కా సమాచారంతో పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేయడంతోపాటు రెండు ఫోన్లు, రూ.10,050 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాగజ్నగర్ పట్టణంలో బెట్టింగ్కు పాల్ప డిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం నుంచి ఐపీఎల్ ప్రారంభం కావడంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. కళాశాలల విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎక్కువ ఈ భూతం బారిన పడుతున్నారు. స్మార్ట్ఫోన్ల ద్వారా బెట్టింగ్కు పాల్పడుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ ఉండాలి. డబ్బు ఖర్చుపెడుతున్న తీరును అడిగి తెలుసుకోవాలి. పెద్దమొత్తంలో డబ్బులు అడిగినప్పుడు ఆరా తీయాలి. పెడదారిన వెళ్తున్నట్లు గమనిస్తే కౌన్సిలింగ్ ఇప్పించాలి. నిఘా ఉంచాం క్రికెట్ బెట్టింగ్పై నిఘా ఉంచాం. గతంలో పలువురిపై కేసులు నమోదు చేశాం. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్కి అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. పిల్లలకు అవసరం మేరకు మాత్రమే తల్లిదండ్రులు డబ్బులివ్వాలి. బెట్టింగ్పై పోలీస్శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన యాప్ల్లో బెట్టింగ్లకు పాల్పడితే పట్టుబడితే శిక్ష తప్పదు. ఎవరైనా బెట్టింగ్ పెడుతున్నట్లు తెలిస్తే పోలీసులు, డయల్ 100కు సమాచారం ఇవ్వండి. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. – డీవీ శ్రీనివాసరావు, ఎస్పీ -
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం
పెంచికల్పేట్(సిర్పూర్): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. మండలంలోని దరోగపల్లి, చేడ్వాయి, పోతెపల్లి, ఎల్కపల్లి గ్రామాల్లో ఆదివారం పర్యటించారు. రూ.88లక్షల వ్యయంతో సీసీ రోడ్లతోపాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో అంతర్గత రహదారులు నిర్మిస్తామన్నారు. అనంతరం విఠల్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో విజేత గొండ్లపేట జ ట్టుకు రూ.40వేలు, రన్నరప్ ఎల్కపల్లి జట్టు కు రూ.20వేల నగదు, ట్రోఫీ ప్రదానం చేశా రు. అంతకుముందు గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గణపతి, మాజీ జెడ్పీటీసీ రామారావు, రాంచందర్, మాజీ సర్పంచ్ చంద్రమౌళి, నాయకులు సముద్రాల రాజన్న, రాచకొండ కృష్ణ, శంకర్గౌడ్, చౌదరి శ్రీనివాస్, ఇలియాస్ తదితరులు ఉన్నారు. -
మిగిలింది వారమే..!
● జిల్లాలో 743 సీసీరోడ్ల నిర్మాణానికి నిధులు.. ● అదనంగా 344 రోడ్లకు అధికారుల ప్రతిపాదనలు ● మార్చి 31 వరకే గడువుమండలాల వారీగా నిధులు ఇలా..బెజ్జూర్(సిర్పూర్): రాష్ట్రంలోనే మారుమూల ప్రాంతమైన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంత మట్టి రోడ్ల రూపురేఖలు మారుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జిల్లాలోని రోడ్ల నిర్మాణానికి ఇప్పటివరకు రూ.31 కోట్లు మంజూరు కాగా, మరో రూ.17 కోట్ల నిధులకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఒకటి, రెండు రోజుల్లో నిధులు మంజూరవుతాయని అధికారులు చెబుతున్నారు. మరో వారం మాత్రమే గడువు మిగిలి ఉండగా.. శరవేగంగా పనులు పూర్త య్యేలా అధికారులు చర్యలు చేపట్టారు. నిధులు ఇలా..జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అనేక గ్రామాల్లో మట్టిరోడ్లు ఉండటంతో ప్రజలు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది జిల్లాకు 610 రోడ్ల నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో దాదాపు 500 రోడ్లు పూర్తయ్యాయి. ప్రస్తుత 2024– 25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 743 సీసీ రోడ్ల నిర్మాణానికి దాదాపు రూ.31 కోట్లు మంజూరయ్యాయి. అదనంగా మరో 344 సీసీరోడ్లకు రూ.17 కోట్ల కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో మారుమూల గ్రామాల మట్టి రోడ్లకు మహర్దశ పట్టనుంది. 31లోగా పూర్తి చేస్తాం జిల్లాలోని 15 మండలాల్లో సీసీరోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 743 రోడ్లకు నిధులు మంజూరయ్యాయి. మరో 344 రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం. త్వరలో వాటికి కూడా నిధులు మంజూరవుతాయి. మార్చి 31 లోపు పనులను పూర్తి చేస్తాం. దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. – ప్రభాకర్, జిల్లా పంచాయతీరాజ్ ఈఈమండలం రోడ్లు నిధులు(రూ.లలో) ఆసిఫాబాద్ 95 3.34 కోట్లు జైనూర్ 114 రూ.4.41 కోట్లు కెరమెరి 113 రూ.3.75 కోట్లు లింగాపూర్ 81 రూ.3.85 కోట్లు రెబ్బెన 44 రూ.1.59 కోట్లు సిర్పూర్(యూ) 53 రూ.1.76 కోట్లు తిర్యాణి 38 రూ.1.48 కోట్లు వాంకిడి 49 రూ.2.32 కోట్లు బెజ్జూర్ 24 రూ.1.20 కోట్లు చింతలమానెపల్లి 20 రూ.కోటి దహెగాం 34 రూ.1.75 కోట్లు కాగజ్నగర్ 22 రూ.1.17 కోట్లు కౌటాల 15 రూ.75 కోట్లు పెంచికల్పేట్ 18 రూ.90 కోట్లు సిర్పూర్(టి) 23 రూ.1.18 కోట్లు -
ఆగని ఇసుక అక్రమ రవాణా
దహెగాం(సిర్పూర్): ‘మండలంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. అధికారులు నిఘా పెట్టి దందాను అరికట్టాలి..’ ఆరు రోజుల క్రితం దహెగాం మండలానికి వచ్చిన సబ్కలెక్టర్ శ్రద్ధా శుక్లా చెప్పిన మాటలివి.. అయినా కొందరు అక్రమార్కులు అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తున్నారు. సీసీరోడ్ల నిర్మా ణం పేరుతో ఇష్టారీతిన తరలిస్తున్నారు. సెల వు రోజు కావడంతో అధికారుల దృష్టి నుంచి తప్పించుకోవచ్చనే ఉద్దేశంతో ఆదివారం కొందరు సమీపంలోని పెద్దవాగు నుంచి పట్టపగ లే ఇసుక తరలించారు. వాగుల నుంచి ని త్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లు నడుస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. -
తాగునీటి కోసం రోడ్డెక్కిన గ్రామస్తులు
లింగాపూర్(ఆసిఫాబాద్): మండలంలోని కొత్తపల్లి గ్రామస్తులు ఆదివారం తాగునీటి కోసం రోడ్డెక్కారు. పదిరోజులుగా మిషన్ భగీరథ, పంచాయతీ బోరు నుంచి తాగునీరందడం లేదని ఖాళీ బిందెలు, డబ్బాలతో నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ పది రోజులుగా స్నానం చేసేందుకు, తాగేందుకు గుక్కెడు నీరందడం లేదన్నారు. బోర్వెల్కు మరమ్మతులు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి నీటి సమస్య పరిష్కరించాలని, లేనిపక్షంలో ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఆడే సురేశ్నాయక్, మహిళలు పాల్గొన్నారు. -
ఆర్థికాభివృద్ధికి అనేక అవకాశాలు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేరెబ్బెన(ఆసిఫాబాద్): మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తోందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పేర్కొన్నారు. శనివారం మండలంలోని సింగల్గూడ గ్రామంలో ఇందిరమ్మ మహిళాశక్తి పథకం కింద ఏర్పాటు చేసిన చేపల పెంపకం కేంద్రాన్ని అదనపు కలెక్టర్ దీపక్ తివా రీతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. చేపల పెంపకం ద్వారా మ రింత ఆదాయాన్ని పొందవచ్చని, సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసుకోవచ్చని పేర్కొన్నా రు. ఈ కేంద్రాన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా మండలాల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచించా రు. పుట్టగొడుగుల పెంపకంపై ఆసక్తి ఉన్న మ హిళా సంఘాల సభ్యులకు హైదరాబాద్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి రామకృష్ణ, తహసీల్దార్ రామ్మోహన్రావు, మండల సమాఖ్య అధ్యక్షురాలు అమృత, ఏపీఎం వెంకటరమణ, సీసీలు పాల్గొన్నారు. ఇఫ్తార్ విందుకు హాజరు ఆసిఫాబాద్: రంజాన్ను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్లో శనివారం రాత్రి మైనార్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎమ్మెల్సీ దండె విఠల్, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ఏఎస్బీ చిత్తరంజన్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి రమాదేవి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సంఘాల ప్రతినిధులు కలెక్టర్, అదనపు కలెక్టర్తో పాటు అధికారులను శాలువాలతో సన్మానించారు. కలెక్టర్, అధికారులు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీ నాయకులు అబ్దుల్లా, అలీబిన్ అహ్మద్, అబుల్ ఫయాజ్, మీర్ సాబీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం
ఆసిఫాబాద్అర్బన్: అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్రావ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని వడ్డెపల్లి గార్డెన్స్లో జైబాపు, జైభీమ్, జైసంవిధాన్, జైభారత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. రాజ్యాంగాన్ని మారుస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేపదే మాట్లాడటం సరికాదని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న రాజ్యాంగ మార్పు భావనను ఖండించడంతో పాటు దాని అవసరాన్ని ప్రజలకు తెలియజేయడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవర్తి అనిల్కుమార్ హాజరు కానున్నట్లు తెలిపారు. కో ఆర్డినేటర్గా బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి దుర్గం భాస్కర్ వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. మాజీ ఎంపీపీ బాలేశ్వర్గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండా శ్యాం, మండలాధ్యక్షుడు చరణ్, నాయకులు ఖలీం, మారుతీపటేల్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు జాతీయ పురస్కార వేడుకలు
ఆసిఫాబాద్అర్బన్: జాతీయ పురస్కార వేడుకలను ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రేమలాగార్డెన్లో ని ర్వహించనున్నట్లు సినీ దర్శక, నిర్మాత డీ సురేశ్బా బు తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని శ్రీచైత న్య కళాశాలలో విలేకరులతో మాట్లాడారు. నవజ్యో తి సాంస్కృతిక సంస్థ ఆవిర్భవించి 50 ఏళ్లు, డై లా గ్ కింగ్ సాయికుమార్ సినీ జీవితం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. భారత కల్చరల్ అకాడమీ, ఆదివాసీ సాంస్కృతిక పరిషత్, ఓంసాయి తేజ ఆర్ట్స్, నవజ్యోతి సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాయికుయార్, మాజీ ఐఏఎస్ పార్థసారధి, హాస్యనటుడు బాబుమోహన్, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి, నిర్మాతలు రాహుల్యాదవ్, విజయ్కుమార్ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా 200 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ని ర్వహించనున్నట్లు తెలిపారు. కళాకారులంతా విజ యవంతం చేయాలని కోరారు. ఆయా సంఘాల ప్రతనిధులు సిడాం అర్జుమాస్టర్, ధర్మపురి వెంకటేశ్వర్లు, సాయిని రాజశేఖర్, ముప్పా శేఖర్, రాధాకృష్ణాచారి, బాపూరావ్, మధు హనుమాండ్ల ఉన్నారు. -
పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా నలుమూలల నుంచి వివిధ పనుల కోసం జిల్లా కేంద్రానికి వచ్చేవారి సౌకర్యార్థం పబ్లిక్ టాయిలెట్స్ ని ర్మించాలని డీవైఎఫ్ఐ, టీఏజీఎస్ ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ కమిషనర్ భుజంగ్రావ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు టీకానంద్, కార్తిక్, మాలాశ్రీ మాట్లాడుతూ.. పబ్లిక్ టాయిలె ట్స్ లేక అత్యవసర సమయాల్లో జనం అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. జన్కాపూర్, ఆసిఫాబాద్ బస్టాండ్ సమీపంలో ఓపెన్ జి మ్లు ఏర్పాటు చేయాలని కోరారు. వాహనాల కోసం పార్కింగ్ స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన కమిషనర్ త్వరలో బస్టాండ్ సమీపంలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మిస్తామని, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేస్తామని, వాహనాల పార్కింగ్కు స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. -
‘భగీరథ’ ద్వారా శుద్ధజలం
ఆసిఫాబాద్రూరల్: మిషన్ భగీరథ ద్వారా మారుమూల ప్రాంతాలకు శుద్ధజలం అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. శనివారం మండలంలోని తుంపెల్లి గ్రామానికి మిషన్ భగీరథ ద్వా రా సరఫరా చేస్తున్న నీటిని అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవిలో ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాల ని సూచించారు. ఎక్కడైనా పైపులైన్ లీకేజీలుంటే వెంటనే మరమ్మతు చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని, ఇందుకు మిషన్ భగీరథ ఇంజినీర్లు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. వేసవిలో బావులు, బోర్లు అడుగంటితే ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట డీపీవో భిక్షపతి, ఎంపీవో మౌనిక తదితరులు పాల్గొన్నారు. -
● చాలాచోట్ల ప్రారంభించని పనులు ● వ్యవసాయ పనుల్లో లబ్ధిదారులు ● పంట డబ్బులకు ఎదురుచూపు ● నిర్మాణ దశలోనే నమూనా ఇళ్లు ● సర్కారు లక్ష్యం నెరవేరని వైనం
లింగాపూర్ మండల కేంద్రంలో ఇంటి నిర్మాణానికి ముగ్గు పోస్తున్న అధికారులుచేతిలో పైసలు లేకనే.. మా లాంటి పేదోళ్లకు ఇల్లు మంజూరైనందుకు సంతోషమే. కానీ.. ఇల్లు కట్టాలంటే ఇప్పుడు చేతిలో పైసలు లేవు. సార్లు ముగ్గుపోసి పది రోజులైంది. సర్కారోళ్లే గుత్తెదారుతోని నిర్మించి ఇస్తే బాగుండేది. – జైతుబాయి, మేతుగూడ, లింగాపూర్ మండలం త్వరలో పనులు ప్రారంభిస్తాం ఇప్పటివరకు జిల్లాలో 450 ఇళ్లకు మార్కింగ్ ఇ చ్చాం. పనులు తొందర గా ప్రారంభించేలా చూ స్తాం. లబ్ధిదారులకు దశలవారీగా బిల్లులు చెల్లి స్తాం. లింగాపూర్లో నీటి సమస్యతో నమూనా ఇంటి నిర్మాణం ప్రారంభించలేదు. – వేణుగోపాల్, హౌసింగ్ డీఈ కెరమెరి(ఆసిఫాబాద్): జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్(టి) నియోజకవర్గాలకు 3,500 చొప్పున ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు కేటా యించింది. తొలుత మాడల్ గ్రామాల్లో అర్హులకు ఇళ్లు మంజూరు చేసింది. మొదటి విడతలో జిల్లాలోని 15 మండలాల్లోని ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో 1,861 గృహ నిర్మాణాలు ప్రారంభించాల్సి ఉండగా, ఇప్పటివరకు 450కి మాత్రమే మార్కింగ్ ఇచ్చినట్లు హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇచ్చి గత నెలలో ముగ్గులు పోసినా చాలా ప్రాంతాల్లో ఇంకా పనులు ప్రారంభించలేదు. ఎంపీడీవోల పర్యవేక్షణలో గ్రామపంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారులు పనులు ప్రారంభించేలా చూడాలి. కానీ.. వారికి అధికారులు అవగాహన కల్పిస్తున్నా నిర్మాణాలపై ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులతోనే.. జిల్లాలోని కెరమెరి, జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్, తిర్యాణి తదితర మండలాల్లో లబ్ధిదారులంతా నిరుపేద గిరిజన ఆదివాసీలే. వీరంతా వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈ ఏడాది అనుకున్న స్థాయిలో పంటల దిగుబడి కూడా రాలేదు. దీంతో చేతిలో డబ్బులు లేక అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో రూ.లక్షల పెట్టుబడి పెట్టి ఇంటి నిర్మాణం చేపట్టే స్తోమత లేక చాలా మంది మిన్నకుండిపోతున్నారు. అప్పోసప్పో చేసి ఇంటిని నిర్మించుకుంటే ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తుందో.. లేదోననే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఇందిరమ్మ నమూనా ఇంటిని నిర్మించాలని ప్రభుత్వ ఆదేశించినా చాలా చోట్ల అధికారులు పనులు ప్రారంభించలేదు. జిల్లాలో ఇళ్ల మంజూరు ఇలా.. మండలం గ్రామం మంజూరైన ఇళ్లు కెరమెరి కొఠారి 108 జైనూర్ మార్లవాయి 52 సిర్పూర్(యు) ఫులారా 284 లింగాపూర్ జాముల్ధర 185 తిర్యాణి రోంపల్లి 102 ఆసిఫాబాద్ గోవింద్పూర్ 119 వాంకిడి జైత్పూర్ 104 రెబ్బెన పోసిగాం 71 కాగజ్నగర్ మాలిని 163 సిర్పూర్(టి) మోదిపల్లి 154 కౌటాల నాగాపల్లి 191 చింతలమానెపల్లి బాబాపూర్ 160 బెజ్జూర్ షుష్మిరా 22 పెంచికల్పేట్ లోద్పల్లి 122 దహెగాం దిగడ 24విడతల వారీగా బిల్లులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.5లక్షల సాయం అందించనుంది. ఆయా నిర్మాణ దశల్లో బిల్లులు చెల్లించేందుకు నిర్ణయించింది. బేస్మెంట్ దశలో రూ.లక్ష, లెంటల్ లెవల్ వరకు రూ.లక్ష, స్లాబ్ లెవల్ వరకు రూ.2 లక్షలు, మొత్తం పనులు పూర్తయ్యాక రూ.లక్ష అందించనుంది. కాగా, ఇళ్ల కోసం ముగ్గులు పోసి నెల అవుతున్నా 90 శాతం గ్రామాల్లో ఇంకా పనులు ముందుకు సాగడం లేదు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 30 మంది లబ్ధిదారులు మాత్రమే పిల్లర్ గుంతలు తవ్వించినట్లు సమాచారం. పంచాయతీ కార్యదర్శలు వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణాల ఫొటోలు తీసి ఎప్పటికప్పుడు యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. దీని ఆధారంగానే లబ్ధిదారులకు బిల్లులు వచ్చే అవకాశముంది. -
‘సీతక్కకు క్షమాపణ చెప్పాలి’
ఆసిఫాబాద్అర్బన్: మంత్రి సీతక్కను కించపరిచేలా మాట్లాడిన సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి రావి శ్రీనివాస్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివాసీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అగ్రవర్ణ అహంకారంతో శ్రీనివాస్ వ్యవహరించడం సరైన పద్ధతి కాదని, మంత్రి సీతక్కకు క్షమాపణ చెప్పకుంటే రానున్న రోజు ల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. శ్రీనివాస్పై పోలీస్స్టేషన్లో ఫి ర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట జెడ్పీ మాజీ చైర్మన్ గణపతి, జైనూర్ ఏఎంసీ చైర్మన్ విశ్వనాథ్, నాయకులు గుండా శ్యాం, చరణ్, వంత్రావ్, సుధాకర్, మారుతీపటేల్ తదితరులున్నారు. -
పోడు రైతులకు అండగా ఉంటాం
చింతలమానెపల్లి: పోడు రైతులకు అండగా ఉంటామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం పేర్కొన్నారు. శనివారం మండలకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. మండలంలోని దిందా, కోర్సిని, గంగాపూర్, గూడెం, ఖర్జెల్లి, బూరెపల్లి, అంబగట్ట గ్రామాల్లో 70 ఏళ్లకు పైగా రైతులు పోడు సాగు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం సాగు పనులకు వెళ్లిన రైతులను అటవీ అధికారులు అడ్డుకుని కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇన్చార్జి మంత్రి సీతక్కకు తెలిపి పోడు సమస్య పరిష్కరించి ఎన్నికల హామీని నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. పార్టీ జిల్లా కార్యదర్శి బండి రాజేందర్గౌడ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఎల్ములె మల్లయ్య, నాయకులు డోకె రామన్న, కుంచాల విజయ్, తిరుపతిగౌడ్, జగదీశ్ తివారి, ఒడీల శంకర్ ఉన్నారు. -
జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలి
ఆసిఫాబాద్అర్బన్/ఆసిఫాబాద్రూరల్: తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ నాలెడ్జ్ సెంటర్ ద్వారా శిక్షణ పొందిన అభ్యర్థులు జీవతంలో ఉన్నతస్థాయికి ఎదగాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జన్కాపూర్లోని పాత కలెక్టరేట్ భవనంలో గల టాస్క్ కేంద్రంలో 40 రోజుల కంప్యూటర్ శిక్షణ పొందిన అభ్యర్థులకు శుక్రవారం డీఆర్డీవో దత్తారావుతో కలిసి సర్టిఫికెట్లు అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ 40 రోజులపాటు కంప్యూటర్ శిక్షణ, టైపింగ్ మెలకువలు నేర్పించినట్లు తెలిపారు. ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. శిక్షణ కేంద్రం సమన్వయకర్త సాయికుమార్, శిక్షకులు పాల్గొన్నారు. -
ఎల్ఆర్ఎస్ వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్: ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ అన్నారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం ఎల్ఆర్ఎస్పై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 31లోగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారికి 25 శాతం సబ్సి డీ ఉంటుందని తెలిపారు. ఎల్ఆర్ఎస్పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ డేవిడ్ వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీల్లో ఎల్ఆర్ఎస్– 2002 పథకం కింద 3,499 దరఖాస్తులు వచ్చాయన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి 2,993 మందిని అర్హులుగా గుర్తించామని తెలిపారు. ఇందులో ఇప్పటివరకు 116 దరఖాస్తుదారులు ఫీజు చెల్లించారన్నారు. గ్రామ పంచాయతీల్లో 3,665 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు రాగా 2,299 అర్హత ఉన్నవిగా గుర్తించామని తెలిపారు. వీరిలో 229 మంది ఫీజు చెల్లించారన్నారు. సమావేశంలో డీపీవో భిక్షపతి, టౌన్ప్లానింగ్ అధికారి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. -
కానిస్టేబుల్కు అభినందన
ఆసిఫాబాద్అర్బన్: ఇటీవల హర్యానాలో నిర్వహించిన 73వ ఆల్ ఇండియా పోలీసు స్పోర్ట్స్ మీట్లో సెపక్ తక్రా చాంపియన్షిప్లో రాష్ట్ర పోలీసు జట్టు తరఫున పాల్గొని కాంస్య పతకం సాధించిన ఆసిఫాబాద్ స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ పొట్ట గోపిని శుక్రవారం జిల్లా కేంద్రంలో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అభినందించారు. శాలువాతో ఘనంగా సత్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ చూపి పోలీసుశాఖకు పేరు తీసుకురావడం గొప్ప విషయమన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్ఐ అడ్మిన్ పెద్దన్న, సీసీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ పరీక్షలు షురూ
ఆసిఫాబాద్రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 36 పరీక్ష కేంద్రాల్లో తొలిరోజు లాంగ్వేజ్ పరీక్షకు 6,560 మంది విద్యార్థులకు 6,531 మంది హాజరు కాగా, 29 మంది గైర్హాజరయ్యారని జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్బాబు తెలిపారు. 99.5 శాతం హాజరు నమోదైందని పేర్కొన్నారు. జన్కాపూర్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సందర్శించారు. విద్యార్థుల హాజరు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారులు, సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థానిక సోషల్ వెల్ఫేర్ స్కూల్ను ఎస్సీ శ్రీనివాసరావు తనిఖీ చేశారు. అలాగే జిల్లాకేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్ డేవిడ్, పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్బాబు, ఆర్డీవో లోకేశ్వర్రావు పర్యవేక్షించారు. వాంకిడి, కెరమెరి, ఈజ్గాంలోని పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి.ప్రయాణమే ‘పరీక్ష’ దహెగాం: సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు పదో తరగతి విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. దహెగాం మండలంలోని ఇట్యాల జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మండల కేంద్రంలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 గంటలకు పరీక్షలు ప్రా రంభమవుతుండగా ఆ సమయంలో కా గజ్నగర్, మంచిర్యాల రూట్లో బస్సు సర్వీసులు లేవు. దీంతో విద్యార్థులు శుక్రవారం తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవే ట్ ఆటోలో ఇలా వేలాడుతూ కేంద్రానికి చేరుకున్నారు. పరీక్షలు పూర్తయ్యే వరకు బస్సులు నడిపించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.విద్యార్థులకు కౌన్సెలింగ్ సిర్పూర్(టి): మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట శుక్రవారం ఎస్సై కమలాకర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ద్విచక్ర వాహనాలపై పదో తరగతి పరీక్షకు వెళ్లిన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలకు వెళ్లేందుకు మైనర్ విద్యార్థులకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలు జరిగితే పిల్లలతోపాటు ఇతరులకు నష్టం జరుగుతుందన్నారు. అనంతరం డ్రైవింగ్ లైసెన్స్లు లేనివారికి జరిమానా విధించారు. తొలిరోజు 99.5 శాతం హాజరు పలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ, అధికారులు -
రుణాల పంపిణీలో భేష్
తిర్యాణి(ఆసిఫాబాద్): స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణా ల చెల్లింపుల్లో జిల్లా అధికారులు ఆదర్శంగా నిలిచారు. ఆర్థిక సంవత్సరం ముగియక ముందే లక్ష్యాన్ని అధిగమించి రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచారు. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు చేస్తోంది. అవసరాల మేరకు వారికి తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాలతోపాతోపాటు సీ్త్రనిధి రుణాలు అందజేస్తున్నారు. మహిళలు ప్రతినెలా ఈఎంఐ రూపంలో తిరిగి బ్యాంకులకు చెల్లిస్తుంటారు. 4,046 సంఘాలకు రుణాలుస్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 2024– 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.221.73 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో తొమ్మిది రోజుల సమయం ఉండగానే అధికారులు లక్ష్యం చేరుకున్నారు. జిల్లాలో 4,046 మహిళా సంఘాలకు రూ.230.18 కోట్ల రుణాలు అందించి లక్ష్యం అధిగమించారు. మరోవైపు సీ్త్రనిధి ద్వారా రూ.25 కోట్ల రుణాలు అందించాలనే లక్ష్యం ఉండగా.. ఇప్పటివరకు రూ.24 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. జిల్లాలో అత్యధికంగా రెబ్బెన మండలంలో బ్యాంకు లింకేజీ ద్వారా రూ.12.15 కోట్ల రుణ లక్ష్యానికి 282 మహిళా సంఘాలకు రూ.22.10 కోట్ల రుణాలు అందించి మొదటిస్థానంలో నిలిచారు. అలాగే అత్యల్పంగా లింగాపూర్ మండలంలో రూ.9.70 కోట్ల రుణ లక్ష్యానికి 186 సంఘాలకు కేవలం రూ.6.38 కోట్లు మాత్రమే చెల్లించి జిల్లాలో చివరిస్థానంలో నిలిచింది. రికవరీ ఇలా..బ్యాంకు లింకేజీ ద్వారా అందించిన రుణాల్లో దాదాపు రూ.58 కోట్ల వరకు మొండి బకాయిలు ఉన్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. సీ్త్రనిధి రుణాల్లో ఈ ఏడాదిలో రూ.42 కోట్లు రికవరీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.28 కోట్ల రుణాలు రికవరీ చేశారు. రుణాల ఇవ్వడంతోపాటు రికవరీ కోసం క్షేత్రస్థాయిలో ఐకేపీ సిబ్బంది నిత్యం స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రుణాలు సకాలంలో చెల్లించడం ద్వారా కలిగే ప్రయోజనాలను సభ్యులకు వివరిస్తున్నారు. సద్వినియోగం చేసుకోవాలి 2024– 25 ఆర్థిక సంవత్సరంలో మహిళ సంఘాల సభ్యులకు రూ.221.73 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటివరకు రూ.230.18 కోట్ల రుణాలు సంఘాలకు అందజేశాం. సీ్త్రనిధి ద్వారా రూ.25 కోట్ల రుణ లక్ష్యంలో రూ.24 కోట్లు పంపిణీ చేశాం. లోన్ రికవరీ కోసం క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నాం. సభ్యులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి. – దత్తారావు, డీఆర్డీవోమండలాల వారీగా రుణ పంపిణీ వివరాలుమండలం మహిళా లక్ష్యం అందించిన మొత్తం సంఘాలు (రూ.కోట్లలో) (రూ.కోట్లలో) ఆసిఫాబాద్ 394 23.92 22.46 బెజ్జూర్ 207 12.33 11.91 దహెగాం 208 11.71 11.85 జైనూర్ 337 22.33 18.46 కాగజ్నగర్ 338 23.17 24.68 రెబ్బెన 282 12.15 22.10 సిర్పూర్(యూ) 237 11.69 8.66 సిర్పూర్(టి) 228 13.01 15.20 వాంకిడి 342 18.19 21.74 తిర్యాణి 278 11.96 12.84 పెంచికల్పేట్ 115 5.87 6.14 లింగాపూర్ 186 9.70 6.38 కౌటాల 221 13.54 15.45 కెరమెరి 423 14.44 18.52 చింతలమానెపల్లి 250 17.66 13.72 రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిన జిల్లా స్వయం సహాయక సంఘాలకు లక్ష్యానికి మించి రుణాలు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.230.18 కోట్లు సీ్త్రనిధి ద్వారా మరో రూ.24 కోట్ల చెల్లింపులు -
గాలివాన బీభత్సం
● జిల్లాలో పలు ప్రాంతాల్లో వడగళ్లు ● ఈదురుగాలులకు నేలకూలిన చెట్లు ● విరిగిపడిన స్తంభాలు.. నిలిచిన విద్యుత్ సరఫరా ● ఇళ్ల రేకులు ఎగిరిపోవడంతో నష్టం ● కాగజ్నగర్లో గోడ కూలి వృద్ధుడు మృతికౌటాల/తిర్యాణి/కాగజ్నగర్రూరల్: జిల్లాలో శుక్రవారం గాలివాన బీభత్సం సృష్టించింది. వడగండ్లు పడటంతోపాటు భారీగా ఈదురుగాలులు వీయడంతో చెట్లు విరిగిపడ్డాయి. కాగజ్నగర్ ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. స్థానిక పోచమ్మ గుడి వద్ద 150 ఏళ్ల భారీ మర్రి చెట్టు నేలకొరిగింది. కాగజ్నగర్ మండలంలోని బురదగూడ సమీపంలో రహదారిపై విద్యుత్ తీగలు పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగజ్నగర్ రూరల్ ఎస్సై సందీప్కుమార్ ఘటనస్థలికి చేరుకుని సిబ్బందితో కలిసి విద్యుత్ తీగలను పైకెత్తి పట్టుకుని వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు. పట్టణంలోని నౌగాంబస్తీలో ఇంటి గోడ కూలి దావులత్(65) అనే వృద్ధుడు మృతి చెందాడు. మండలంలోని ఈజ్గాం శివాలయం ఆవరణలోని షెడ్డు కూలిపోయింది. ఈజ్గాం, సీతానగర్, నామానగర్, జంబుగ తదితర గ్రామాల్లో ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి. కాగజ్నగర్– పెంచికల్పేట్ రహదారిలో చెట్లు నేలకూలడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. స్తంభాలపై చెట్లు పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. ● కౌటాల మండలంలో గాలివానతో కౌటాల– కాగజ్నగర్ ప్రధాన రహదారిపై కుమురంభీం చౌరస్తా వద్ద చెట్టు పడింది. సదాశివపేట కాలనీలో కౌటాల– బెజ్జూర్ ప్రధాన రహదారిపై చెట్టు విరిగిపడింది. కౌటాల పంచాయతీ కార్యదర్శి సాయికృష్ణ జేసీబీతో చెట్లను తొలగించి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. కనికి గ్రామంలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ● చింతలమానెపల్లి మండలంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులతో వర్షం కురిసింది. గూడెం– కర్జెల్లి రోడ్డు బురదమయంగా మారింది. విద్యుత్ తీగలు తెగిపడి విద్యుత్ నిలిచిపోవడంతో గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. ● దహెగాం మండలంలో వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మిర్చి తోటల్లో పంట నేలరాలింది. మామిడి తోటల్లో కాయలు రాలిపడటంతో రైతులకు నష్టం వాటిల్లింది. ● తిర్యాణి మండలంలోని అటవీప్రాంతంలో భారీ వర్షానికి గుండాల జలపాతం ఉప్పొంగింది. జలకళను సంతరించుకుంది. గాలులకు చెట్లు కూలడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. రెబ్బెనలో భారీ నష్టంరెబ్బెన: మండలంలో ఈదురుగాలులు, వడగండ్ల వానతో తీవ్ర నష్టం వాటిల్లింది. రెబ్బెన, గోలేటి, వరదలగూడ, గొల్లగూడ, నంబాల తదితర గ్రామాల్లో బలమైన ఈదురు గాలుల ధాటికి చెట్లు నేలకొరిగాయి. పదుల సంఖ్యలో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. మండల కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్ ఆవరణలో ఉన్న షెడ్డు, గొల్లగూడ గ్రామానికి వెళ్లే దారిలో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక షెడ్లు నామరూపాలు లేకుండా దెబ్బతిన్నాయి. మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం పక్కన రోడ్డుపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. గోలేటి టౌన్షిప్లో సింగరేణి సబ్ స్టేషన్ సమీపంలో భారీ నీలగిరి వృక్షం విరిగి విద్యుత్ తీగలపై పడింది. కార్మిక కాలనీల్లోనూ చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడటంతో విద్యుత్ సరాఫరా నిలిచిపోయింది. వరదలగూడ గ్రామానికి చెందిన కోడిపుంజుల సంతోష్ ఇంటిపై చెట్టు కొమ్మలు విరిగిపడి ఇల్లు ధ్వంసమైంది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అదే గ్రామానికి చెందిన దేనవేణి తిరుపతి, మంత్రి తిరుపతి, పోగుల రమేశ్, అప్పాల రవి, గోగారం రాజేశ్తోపాటు పలువురి ఇళ్ల ఎదుట వేసిన రేకుల షెడ్ల పైకప్పు రేకులు ఎగిరి దూరంగా పడ్డాయి. మండల కేంద్రానికి చెందిన సత్రపు సత్తయ్య ఇంటి ఎదుట నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనంపై చెట్టు విరిగి పడ్డాయి. బైక్ తీవ్రంగా దెబ్బతింది. ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన దుకాణాల ఎదుట రేకులు లేచిపోయాయి. -
22, 23న ఇందిర ఫెల్లోషిప్ బూట్ క్యాంప్
ఆసిఫాబాద్: లింగాపూర్ మండలం చోర్పల్లిలో ఈ నెల 22, 23 తేదీల్లో ఇందిర ఫెల్లోషిప్ తెలంగాణ రాష్ట్ర బూట్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు శక్తి అభియాన్ ఇందిర ఫెల్లోషిప్ ఆదిలాబాద్ లోక్సభ కోఆర్డినేటర్, పార్లమెంట్ ఇన్చార్జి ఆత్రం సుగుణ తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో గురువారం పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఫెల్లోషిప్ బ్యూట్ క్యాంప్నకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క హాజరవుతారని తెలి పారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జ్ఞాపకార్థం రాజకీయాలు, పాలనతో సహా వివిధ రంగాల్లో మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యం కల్పించేందుకు కాంగ్రెస్ ఇందిర ఫెల్లోషిప్ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. మహిళలను రాజకీయాల్లోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇందిర ఫెల్లోషిప్ సభ్యులు దుర్గం కళావతి, యశోద, ఇందిర, ప్రతిభ, విజయ, రాజేశ్వరి, పద్మ, శంకరమ్మ, రేణుక, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండ శ్యాం, నాయకులు సుధాకర్, భీమ్రావు, తిరుపతి, గంగారాం, సురేశ్ పాల్గొన్నారు. -
ఓటరు జాబితా రూపకల్పనకు సహకరించాలి
ఆసిఫాబాద్అర్బన్: స్పష్టమైన ఓటరు జాబితా రూపకల్పనకు జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 19 వరకు ఆన్లైన్లో సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల నుంచి 6, 7, 8 ఫారాల దరఖాస్తులు 5,481 వచ్చాయని తెలిపారు. 4,559 దరఖాస్తులను పరిష్కరించి ఆన్లైన్లో నమోదు చేశామన్నారు. వివరాలు సక్రమంగా లేకపోవడంతో 369 దరఖాస్తులు తిరస్కరించామని పేర్కొన్నారు. మరో 553 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత పరిష్కరిస్తామని తెలిపారు. రాజకీయ పార్టీలు జాబితాను బూత్స్థాయి ఏజెంట్లకు అందించాలని సూచించారు. అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం
● నేటి నుంచి ఏప్రిల్ 2 వరకు.. ● హాజరు కానున్న 6,421 మంది విద్యార్థులుఆసిఫాబాద్రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 2 వరకు జిల్లాలోని 36 కేంద్రాల్లో 6,421 మంది విదార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో బాలురు 2,894 మంది, బాలికలు 3,527 మంది ఉన్నారు. కాగా, పదో తరగతి వార్షిక పరీక్షలు తొలిసారి సీసీ కెమెరాల నిఘాలో జరగనున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం 36 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 36 డిపార్ట్మెంట్ అధికారులు, 36 మంది సీ సెంటర్ కస్టోడియన్లు, 432 మంది ఇన్విజిలేటర్లు, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నియమించారు. పోలీస్ స్టేషన్ దూరంగా ఉన్నట్లు గుర్తించిన మోడీ, మహాగావ్, గంగాపూర్ పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక కస్టోడియన్లను ఏర్పాటు చేశారు. ప్రతీ సెంటర్ వద్ద ఇద్దరు పోలీస్ సిబ్బంది, ఒకరు వైద్యసిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. ఐదు నిమిషాల మినహాయింపుకాగజ్నగర్లో 9 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఆసిఫాబాద్లో 5, కెరమెరి 3, సిర్పూర్(టి) 3, రెబ్బెన 3, జైనూర్ 2, వాంకిడి 2, కౌటాలలో 2, దహెగాం 2, బెజ్జూర్ 2, తిర్యాణి, పెంచికల్పేట్, చింతలమానెపల్లి మండలాల్లో ఒకటి చొప్పున సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. నిర్ణీత సమయం కంటే ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసిఉంచాలని సూచించారు.జిల్లా కేంద్రంలో హాల్టికెట్ నంబర్లు వేస్తున్న సిబ్బందినిర్భయంగా రాయాలి విద్యార్థి జీవితంలో పదో తరగతి పరీక్షలు కీలకమైనవి. ఆందోళనకు గురికాకుండా విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాయాలి. 30 నిమిషాలు ముందుగానే కేంద్రాలకు చేరుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి. – యాదయ్య, డీఈవో -
రైతుల చేతిలో నాలుగు ఎకరాల్లోపే..
ఉమ్మడి జిల్లాలో భూ కమతాల సగటు చూస్తే గతేడాది, తాజా సర్వే ప్రకారం యధావిధిగా ఉన్నాయి. అంటే భూమి చేతులు మారుతున్నప్పటికీ రైతుల వద్ద ఉన్న భూమి అలాగే కొనసాగుతోంది. గత ఆర్థిక సర్వేలోనూ ఉమ్మడి జిల్లాల్లో సగటు కమతం ఆదిలాబాద్ జిల్లాలో గరిష్టం 3.78ఎకరాలు ఉండగా, కనిష్టంగా మంచిర్యాలలో 2.29ఎకరాలు ఉంది. ఈ జిల్లాలో జనాభా తక్కువ, భూ లభ్యత ఎక్కువ కావడంతో సగటులో ఎక్కువ వస్తోంది. జిల్లాలో సగటు భూ కమతాలు (ఎకరాల్లో)ఆదిలాబాద్ 3.78ఆసిఫాబాద్ 1.39నిర్మల్ 2.47మంచిర్యాల 2.29 -
జాబ్మేళాకు విశేష స్పందన
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఫాక్స్కాన్ సంస్థ మెగా జాబ్మేళాకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడారు. పదో తరగ తి, ఇంటర్, పాలిటెక్నిక్, డిగ్రీ పూర్తి చేసిన ని రుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని యు వతకు మెరుగైన జీవితం కల్పించాలనే ఉద్దేశంతో జాబ్మేళా నిర్వహించామని తెలిపా రు. జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అలీబిన్ అహ్మద్, గంధం శ్రీనివాస్, ఫాక్స్కాన్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
సహాయ ఉపకరణాలు వినియోగించుకోవాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్రూరల్: దివ్యాంగ విద్యార్థులు సహాయ ఉపకరణాలను వినియోగించుకోవా లని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం అలింకో సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, స్టడీ చైర్లు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ అలింకో సంస్థ జిల్లాలోని అన్ని పాఠశాలలను సందర్శించి 136 మంది దివ్యాంగులను గుర్తించిందన్నారు. వీరికి అవసరమైన సహాయ ఉపకరణాలు అందించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అంగవైకల్యం కలిగిన వారు తమ పనులు స్వయంగా చేసుకోవడానికి ఈ ఉపకరణాలు దోహదపడతాయని తెలిపారు. దివ్యాంగులపై చిన్నచూపు చూడకుండా వారిని గౌరవించాలని సూచించారు. కార్యక్రమంలో అలింకో సంస్థ ఫైనాన్షియల్ అధికారి దేవాజీ, పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్బాబు, ఎంఈవో సుభాష్, జిల్లా సైన్స్ అధికారి మధుకర్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాయాలి
కెరమెరి: పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలు నిర్భయంగా రాయాలని ఏసీఎంవో (జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి) పుర్క ఉద్దవ్ అన్నారు. మండలంలోని అనార్పల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలను బుధవారం సందర్శించారు. పదో తరగతి విద్యార్థులకు హాల్టిక్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధిస్తే పెద్ద కళాశాలల్లో ఉచితంగా సీటు వచ్చే ఆస్కారం ఉందన్నారు. పరీక్షలు పూర్తయ్యే వరకు రాత్రి, పగలు చదవాలని, పక్కా ప్రణాళికతో చదివితే విజయం సొంతమవుతుందని పేర్కొన్నారు. అనంతరం అనార్పల్లి, జైరాంగూడ ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం రాము, ఎస్సీఆర్పీ నరేశ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
ఎల్ఆర్ఎస్ రుసుం వసూలుపై ప్రత్యేక దృష్టి
● అదనపు కలెక్టర్ దీపక్ తివారిఆసిఫాబాద్అర్బన్: లేఅవుట్ భూముల క్రమబద్ధీకరణలో భాగంగా ఎల్ఆర్ఎస్–2020 పథకంలో దరఖాస్తుదారుల నుంచి రుసుం వసూలుపై దృష్టి సా రించాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో బుధవారం మున్సిపల్ కమిషనర్ భుజంగ్రావు, పట్టణ ప్రణాళిక అధికారి యశ్వంత్కుమార్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించా రు. రుసుం చెల్లింపు ప్రక్రియలో జాప్యం జరగకుండా పర్యవేక్షించాలన్నారు. 25 రాయితీని వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పట్టణంలోని పలు లేఅవుట్లను పరిశీలించా రు. సమావేశంలో ఎంపీడీవో సత్యనారాయణ, పీటీఎస్ కార్యదర్శి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ‘బేటీ బచావో– బేటీ పడావో’ అమలుకు కార్యాచరణ రూపొందించాలి వచ్చే ఆర్థిక సంవత్సరంలో బేటీ బచావో– బేటీ పడావో కార్యక్రమాల అమలుకు కార్యాచరణ రూపొందించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2025 –26 ఆర్థిక సంవత్సరంలో బేటీ పడావో– బేటీ బచావో కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. ప్రతీ పంచాయతీలో బాలసభలు నిర్వహించాలని, వి ద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల్లో బా లికల విద్య ప్రాముఖ్యతను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మానసిక నిపుణులతో భవిష్యత్తుపై కౌన్సెలింగ్, కెరీర్ గైడె న్స్ గురించి వివరించాలని, లైంగిక దాడులు జరుగకుండా ఆత్మ రక్షణ కోసం కరాటే శిక్షణ ఇప్పించాలన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి భా స్కర్, డీఎంహెచ్వో సీతారాం, డీఎల్పీవో ఉమర్ హుస్సేన్, జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేశ్, సీడీపీవో రేణుక, జిల్లా మహిళా సాధికారత సమన్వయ కర్త శారద, సభ్యులు మమత, రాణి, సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
ఒత్తిడికి లోనుకావొద్దు
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, విద్యార్థులు ఒత్తిడికి లోనుకావొద్దని జిల్లా విద్యాధికారి యాదయ్య అన్నారు. నిర్భయంగా పరీక్షలు రాస్తేనే ఉత్తమ మార్కులు సాధించే అవకాశం ఉంటుందన్నారు. గతంతో పోలిస్తే పరీక్షల తీరులో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయని, విద్యార్థులు వీటిని గుర్తించాలని సూచించారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలో ఏర్పాట్లపై బుధవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సాక్షి: మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి వసతులు కల్పించారు?డీఈవో: వేసవి నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమయ్యాం. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు వేడి, ఉక్కపోతతో ఇబ్బందులు లేకుండా ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నాం. ప్రతీ కేంద్రం వద్ద వైద్యసిబ్బంది ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులతో సిద్ధంగా ఉంటారు. సాక్షి: జిల్లాలో ఎంతమంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.. ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు?డీఈవో: జిల్లాలోని 172 ఉన్నత పాఠశాలల్లో మొత్తం 6,421 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. ఇందులో బాలురు 2,908 మంది, బాలికలు 3513 మంది ఉన్నారు. వీరి కోసం జిల్లావ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెట్లు 36 మంది, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు 36 మంది, సీ సెంటర్ కస్టోడియన్లు ముగ్గురు, ఇన్విజిలేటర్లు 432 మందిని నియమించాం. అలాగే మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పర్యవేక్షించనున్నాయి. సాక్షి: గతేడాది ఫలితాల్లో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రాష్ట్రంలో 30వ స్థానంలో నిలిచింది.. ఈ ఏడాది మెరుగైన ఫలితాలకు ఎలాంటి చర్యలు చేపట్టారు?డీఈవో: కొన్నేళ్లుగా పదో తరగతి వార్షిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు. ఈ సారి మాత్రం ఉత్తమ ఫలితాలు సాధనకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్నాం. డిసెంబర్లోనే సిలబస్ పూర్తి చేయించి.. విద్యార్థులతో రివిజన్ చేయించాం. 45 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు చేసి రోజూ పరీక్షలు నిర్వహిస్తూ ఫలితాలు విశ్లేషించాం. ఉదయం, సాయంత్రం స్పెషల్ క్లాస్లు నిర్వహించాం. పరీక్షల భయం పోగొట్టేందుకు ప్రేరణ తరగతులు సైతం ఏర్పాటు చేశారు. ఈ ఏడాది రాష్ట్రంలో జిల్లా టాప్ 10లో ఉంటుందని ఆశాభావంతో ఉన్నాం. సాక్షి: విద్యార్థులకు మీరిచ్చే సలహాలు, సూచనలు..డీఈవో: విద్యార్థులు తమ కేంద్రాన్ని ఒకరోజు ముందుగానే చూసుకోవాలి. సెల్ఫోన్లు, టీవీలకు పూర్తిగా దూరంగా ఉండాలి. సమయాన్ని వృథా చేయొద్దు. సరిపడా నిద్ర ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులు పరీక్షలు పూర్తయ్యే వరకు పిల్లలకు సహకరించాలి. ‘పది’ విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాయాలి జిల్లాలో 36 కేంద్రాలు ఏర్పాటు ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఈవో యాదయ్యసాక్షి: ఈ విద్యా సంవత్సరంలో పరీక్ష విధానంలో వచ్చిన మార్పులు ఏంటి?డీఈవో: 2024– 25 విద్యా సంవత్సరంలో విద్యాశాఖ కొత్త నిర్ణయాలు అమలు చేయనుంది. ప్రతీ కేంద్రం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. విద్యార్థులకు 24 పేజీలతో కూడిన జవాబు పత్రం(అన్సర్షీట్) ఇస్తారు. గతంలో నాలుగు పేజీలతో కూడిన బుక్లెట్ ఇచ్చేవారు. నాలుగు పేజీలు రాసిన తర్వాత విద్యార్థులు అవసరానికి అనుగుణంగా రెండు పేజీలతో కూడిన జవాబు పత్రాలు ఇచ్చేవారు. పిల్ల ల సమయం వృథా కాకుండా ఈసారి 24 పేజీలతో బుక్లెట్ అందజేస్తున్నాం.సాక్షి: పరీక్షల సమయంలో ఎలాంటి మినహాయింపులు ఉన్నాయి?డీఈవో: పరీక్ష సమయం కంటే 30 నిమి షాలు ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకో వాలి. ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుండగా, విద్యార్థులను ఉ దయం 8:30 నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిర్ణీత సమయంలో ఐదు నిమి షాలు సడలింపు ఇచ్చారు. ఉదయం 9:35గంటల తర్వాత అనుమతి ఉండదు. -
● ‘ప్రాణహిత– చేవెళ్ల’కు రూ.32.2 కోట్లు మాత్రమే.. ● మిగతా ప్రాజెక్టులకు అరకొర నిధులు ● విద్యారంగం కేటాయింపులపై విద్యార్థి సంఘాల అసంతృప్తి ● సంక్షేమ పథకాల కొనసాగింపుపైనే ప్రభుత్వం దృష్టి ● ఇందిరా గిరి జల వికాసం పథకం ద్వారా పోడు రైతులకు లబ్ధి
ఆసిఫాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 2025– 26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. గతేడాది మాదిరి ఈసారి కూడా అరకొర నిధులే కేటాయించారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిన ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క.. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, కాల్వల నిర్మాణంపై మాత్రం దృష్టి సారించలేదు. ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి అధికారులు ప్రతిపాదనలు పంపించినా ఆశించిన కేటాయింపులు జరగలేదు. ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంక్షేమ పథకాల ద్వారా మేలు జరగనుంది. గిరిజన జనాభా అధికంగా ఉండటంతో పోడు రైతులకు పంపు సెట్లు అందించేందుకు ప్రవేశపెట్టిన ఇందిరా గిరి జల వికాసం పథకం ప్రయోజనకరంగా మారనుంది. కేటాయింపులు ఇలా.. రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం ఎకరాకు రూ.12 వేలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు రుణమాఫీ కింద జిల్లాలో 51,523 మంది రైతులకు రూ.465.84 కోట్లు అందించారు. అభయహస్తం ఆరు గ్యారంటీ పథకాలు కొనసాగిస్తున్నట్లు ప్రకటించినా స్పష్టమైన బడ్జెట్ కేటాయింపులు లేవు. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో ప్రతిరోజూ సుమారు 26 వేల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నట్లు అంచనా.. ఉచిత వంటగ్యాస్ పథకం కింద జిల్లాలో 73 వేల మందికి రూ.500కే గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. గృహజ్యోతి పథకం కింద జిల్లాలో 69,636 మందికి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతినెలా రూ.2,146 కోట్లు చెల్లిస్తోంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కింద ఆసిఫాబాద్ నియోజకవర్గంలో సమీకృత గురుకుల పాఠశాల ఏర్పాటు చేయనున్నారు. విద్యారంగానికి కనీసం 15 శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా, తాజా బడ్జెట్లో 7.57 శాతం నిధులు కేటాయించడంపై విద్యార్థి సంఘాలు పెదవి విరుస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టులకు రూ.63.29 కోట్లు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో రూ.63.29 కోట్లు కేటాయించారు. కుమురంభీం ప్రాజెక్టుకు రూ.24.44 కోట్లు(కేంద్ర, రాష్ట్ర పథకాలు కలిపి), వట్టివాగు ప్రాజెక్టు రూ.4.75, జగన్నాథ్పూర్ ప్రాజెక్టు రూ.10.70 కోట్లు, ఎర్రవాగు ప్రాజెక్టు(పీపీరావు)కు రూ.1.2 కోట్లు కేటాయించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన హామీల్లో ఒక్కటైన ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి బడ్జెట్లో కేవలం రూ.32.2 కోట్లు మాత్రమే కేటాయించారు. అరకొర నిధులతో పనులు ముందుకు సాగ డం అనుమానమే.. ఆశించిన నిధులు కేటాయించకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వ్యవ‘సాయం’ కొనసాగింపు వ్యవసాయ రంగానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.24,439 కోట్లు కేటాయించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు జిల్లాలో 1.10 లక్షల మంది రైతుభరోసా పథకం కింద లబ్ధి పొందనున్నారు. రైతుబీమా పథకం కింద గతేడాది జిల్లాలో 215 మంది రైతుల కుటుంబాలకు రూ.10.75 కోట్లు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేసేలా రైతులకు పోత్సాహం అందించనున్నారు. రైతులకు టన్నుకు రూ.2 వేలు అదనంగా చెల్లించనున్నారు. పౌరసరఫరాల శాఖకు రాష్ట్ర బడ్జెట్లో రూ.5,734 కోట్లు కేటాయించగా, చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు ఉచిత బియ్యం పంపిణీ కొనసాగనుంది. ఇందులో జిల్లాలో 1,39,782 మంది లబ్ధిదారులు ఉన్నారు.వట్టివాగు ప్రాజెక్టు (ఫైల్) -
కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
● కలెక్టరేట్లోకి వెళ్లకుండా అధికారులు, సిబ్బందిని అడ్డుకున్న ఆశవర్కర్లుఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట బుధవారం తెలంగాణ ఆశ వర్కర్స్ యూని యన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆశవర్కర్లు చేపట్టిన ధర్నా, కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. ఉదయం 9 గంటలకే ఆశవర్కర్లు కలెక్టరేట్ వద్దకు చేరుకుని ప్రధాన దారికి రెండు వైపులా బైఠాయించారు. అధికారులు, సిబ్బందిని లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో పోలీసులు, ఆశవర్కర్లకు మధ్య తోపులాట జరిగింది. ఏఎస్పీ చిత్తరంజన్ ఆందోళన చేస్తున్న వారిని సముదాయించి సిబ్బందిని లోపలికి పంపించారు. అదనపు కలెక్టర్ కలెక్టరేట్కు కార్యాలయానికి వస్తుండగా ఆశలు అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు చెదరగొట్టారు. ఎండలోనూ మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా కొనసాగిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. సీఐటీయూ నాయకులు రాజేందర్, శ్రీనివాస్ మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకుంటే మరో 106 రోజుల పోరాటం తప్పదని హెచ్చరించారు. అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాల్లో చర్చ జరిపి పరిష్కారానికి ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు. ఆశలకు రూ.18వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వడంతోపాటు పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రమాదబీమా కింద రూ.50 లక్షలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, కమిటీ సభ్యులు కృష్ణమాచారి, నాయకులు నగేశ్, స్వరూప, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ను కలిసిన డీఎం
ముగిసిన 48 గంటల ధర్నాఆసిఫాబాద్: గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి న హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తున్న 48 గంటల ధర్నా కార్యక్రమం మంగళవారం ముగిసింది. సీఐటీయూ జిల్లా నా యకులు మాట్ల రాజు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్లకు ప్రతినెలా వేతనాలు 1వ తేదీనే చెల్లించాలని, గ్రాట్యుటీ వర్తింపజేసి ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపర్చిన రూ.18 వేల వేతనం, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, మినీ అంగన్వాడీ టీచర్లు 10 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం ప్రతి ని ధులు త్రివేణి, గంగామణి, అరుణ, స్వరూ ప, రాజేశ్వరి, కమల, అంజలి, మల్లేశ్వరి, అంగన్వాడీ టీచర్లు, హె ల్పర్లు పాల్గొన్నారు. ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్గా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కేవీ రాజశేఖర్ మంగళవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ డీవీ శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా రవాణాశాఖ అధికారి రాంచందర్ను కలిశారు. -
పెండింగ్ పనులు పూర్తి చేయాలి
● అసెంబ్లీలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆసిఫాబాద్అర్బన్: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం శాసనసభలో జీరో అవర్లో ఆసిఫాబాద్ నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడారు. ఆసిఫాబాద్ మండలంలోని గుండి వాగుపై వంతెన పనులు కొన్నేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయని, జాప్యంతో అంచనాలు పెరిగాయని తెలిపారు. రానున్న వర్షాకాలం ప్రారంభం నాటికి బ్రిడ్జి పనులు పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కెరమెరి మండలం లక్మాపూర్ వంతెన పూర్తి చేయడంతో పాటు, ఆదిలాబాద్కు వెళ్లే ప్రధాన రహదారిని విస్తరించాలని అన్నారు. -
అర్హత పోటీలకు బయల్దేరిన జిల్లా విద్యార్థులు
ఆసిఫాబాద్రూరల్: హైదరాబాద్లోని వాటర్ స్పోర్ట్స్ అకాడమీ స్కూల్ అర్హత పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి 18 మంది బాలబాలికలను ఎంపిక చేసినట్లు డీటీడీవో రమాదేవి, డీఎస్వో మీనారెడ్డి తెలిపారు. విద్యార్థులు మంగళవారం ప్రత్యేక వాహనంలో హైదరాబాద్కు బయల్దేరి వెళ్లారు. మార్చి 19న హైదరాబాద్లోని బోయిన్పల్లి వాటర్ స్పోర్ట్ అకాడమీ స్కూల్లో అర్హత క్రీడాపోటీలు ఉంటాయని డీటీడీవో తెలిపారు. ఐదో తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించే అర్హత పోటీలకు జిల్లా నుంచి 11 మంది బాలురు, ఏడుగురు బాలికలను పంపించామని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన వారు వాటర్ స్పోర్ట్స్ అకాడమీకి ఎంపికవుతారని తెలిపారు. కార్యక్రమంలో కోచ్లు విద్యాసాగర్, అరవింద్, హెచ్ఎం జంగు, వార్డెన్ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. -
బాధితులకు సత్వర సహాయం అందించాలి
ఆసిఫాబాద్అర్బన్: సఖి కేంద్రానికి వచ్చే బాధితుల కు సత్వర సహాయం అందించేందుకు నిర్వాహకులు కృషి చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురా లు ఈశ్వరీబాయి అన్నారు. జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రాన్ని మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశా రు. రిజిస్టర్లు పరిశీలించి, కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సఖి కేంద్రం ద్వారా మహిళలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం మా ట్లాడుతూ సఖి కేంద్రం ద్వారా అందుతున్న సేవల పై ప్రతీ మండలంలో అవగాహన కల్పించాలన్నా రు. బాధిత మహిళల రక్షణ, వారి సమస్యల పరి ష్కారం కోసం నిత్యం అందుబాటులో ఉండాలన్నా రు. అనంతరం సిబ్బందిని ఈశ్వరీబాయిని శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జీసీడీవో శకుంతల, సిబ్బంది మమత, సుమలత, రమేశ్, సత్యశీల తదితరులు పాల్గొన్నారు. -
భగీరథ పైపులైన్ పునరుద్ధరణ
● నెల రోజుల తర్వాత 64 గ్రామాలకు తాగునీరుదహెగాం(సిర్పూర్): కాగజ్నగర్ మండలం అందవెల్లి సమీపంలోని పెద్దవాగు వంతెన వద్ద అధికారులు ఎట్టకేలకు మిషన్ భగీరథ పైపులైన్ పునరుద్ధరించారు. దాదాపు నెల రో జుల తర్వాత 64 గ్రామాలకు తాగునీటి సరఫరాకు మార్గం సుగమమైంది. అందవెల్లి పెద్దవాగు వంతె న అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు నెల రోజుల క్రి తం ప్రారంభించారు. ఈ క్రమంలో వంతెన పైనుంచి ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైప్లైన్ తొలగించారు. దహెగాం, కాగజ్నగర్, భీమిని, కన్నెపల్లి మండలాల్లోని 64 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఈ నెల 14న ‘సాక్షి’లో ‘నెల రోజులుగా భగీరథ బంద్, మళ్లీ ఈ నెల 16న ‘మిషన్ భగీరథ నీళ్లు వచ్చేదెప్పుడు..?’ అంటూ వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. ఎట్టకేలకు మిషన్ భగీరథ అధికారులు స్పందించారు. మంగళవారం పైపులైన్కు మరమ్మతులు చేపట్టి పూర్తి చేశారు. రాత్రి వరకు భగీరథ తాగునీటి సరఫరాను పునరుద్ధరించామని ఏఈ సాయికృష్ణ తెలిపారు. ఎఫెక్ట్ -
మొక్కల సంరక్షణలో అలసత్వం వద్దు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్రూరల్: నర్సరీల్లో పెంచుతున్న మొక్కల సంరక్షణలో సిబ్బంది అలసత్వం ప్రదర్శించొద్దని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని బూర్గుడ గ్రామ పంచాయతీలోని నర్సరీని మంగళవారం పరిశీలించారు. పంచాయతీ నిర్వహణ రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వేసవి నేపథ్యంలో మొక్కల పెంపకంపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రతిరోజూ నీటిని అందించాలన్నారు. విత్తనాలు మొలకెత్తకపోవడంతో రెండు రోజుల్లో నివేదిక అందించాలని ఏపీవోను ఆదేశించారు. అనంతరం గ్రామ పంచాయతీ పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం 25 శాతం రాయితీ ప్రకటించిందని తెలిపారు. పంచాయతీలో 78 మంది దరఖాస్తుదారుల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఆన్లైన్ ద్వారా నగదు చెల్లించారని తెలిపారు. కార్యక్రమంలో డీఎల్పీవో ఉమర్, ఎంపీవో మౌనిక, ఏపీవో చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి శ్రీలత, కారోబార్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
రంగనాయక ఆలయానికి నిధులు కేటాయించాలి
● ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబుకౌటాల/బెజ్జూర్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం తెలంగాణ ధార్మిక, ధర్మాదాయ బిల్లుపై సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు మాట్లాడారు. బెజ్జూర్ మండల కేంద్రంలోని అతిపురాతన రంగనాయక ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. శేష పాన్పుపై నిద్రిస్తున్న శ్రీరంగనాయక స్వామి విగ్రహం మహా అద్భుతంగా ఉంటుందని తెలిపారు. ఈజ్గాం శివమల్లన్న ఆలయ కమిటీలో స్థానికులకు అవకాశం కల్పించాలన్నారు. బాసర ఆలయంలో భక్తులకు సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాగే ఆరోగ్య శ్రీ బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, కాళేశ్వరం జోన్లో కొత్త సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించాలని ఆయన కోరారు. -
● జిల్లాలో అసంపూర్తిగా సాగునీటి ప్రాజెక్టులు ● వంతెనలు లేక రాకపోకలకు అవస్థలు ● ఏళ్లు గడుస్తున్నా మెరుగుపడని వైద్యం ● నిధుల కేటాయింపుపైనే ప్రజల ఆశలు ● నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికశాఖ మంత్రి
పేరుకే ఆస్పత్రి అప్గ్రేడ్జిల్లా కేంద్రంలో నూతన ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటు చేయడంతో స్థానిక 50 పడకల ఆస్పత్రిని 330 పడకలకు అప్గ్రేడ్ చేశారు. అయినా వసతులు మెరుగుపడటం పడకపోవడంతో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలందడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్కే వెళ్లాల్సి వస్తోంది. ముఖ్యంగా గైనకాలజిస్టు లేకపోవడం సిజేరియన్ కాన్పులు జరగడం లేదు. ఈ నెల 9న ఆసిఫాబాద్ మండలానికి చెందిన ఓ గర్భిణిని మంచిర్యాలకు రెఫర్ చేయగా.. 108 వాహనంలో తరలిస్తుండగానే మార్గమధ్యలో కవలలకు జన్మనిచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రి కేవలం రెఫరల్ కేంద్రంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ని యామకం జరగలేదు. కాంట్రాక్టు వైద్యులతో కాలం వెల్లదీస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథ కం బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయి.కంకర తేలిన ఆసిఫాబాద్ మండలం యాపల్పట్టి గ్రామానికి వెళ్లే రహదారిప్రజలకు అభివృద్ధి ఫలాలు కాస్త చేరువైనా.. అనుకున్న రీతిలో మౌలిక వసతులు మెరుగుపడలేదు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సరిపడా నిధులు విడుదల చేయకపోవడంతో యాసంగికి నీళ్లందక పంట పొలాలు బీళ్లుగా మిగులుతున్నాయి. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ వంటి కాలేజీలు లేక స్థానిక విద్యార్థులు సాంకేతిక విద్యకు దూరమవుతున్నారు. ఇటీవల ఆసిఫాబాద్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల మంజూరైనా.. సిర్పూర్ నియోజకవర్గానికి కేటాయించలేదు. దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని జిల్లావాసులు కోరుతున్నారు. ఆసిఫాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో బుధవారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. జిల్లా ప్రజలు కాంగ్రెస్ సర్కారు బడ్జెట్పై భారీ ఆశలు పెట్టుకున్నారు. గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రభుత్వం ఆరు గ్యారంటీలకే ప్రాధాన్యతనిచ్చింది. ముఖ్యంగా రహదారులు, విద్య, వైద్యం, సాగునీటి ప్రాజెక్టులకు ఆశించిన నిధులు కేటాయించకపోవడంపై జిల్లా ప్రజలు, రైతులు అసంతృప్తితో ఉన్నారు. రాకపోకలకు తంటాలుగతేడాది జిల్లాలోని 76 చోట్ల ప్రధాన వంతెనల నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నుంచి ఒక్కపైసా మంజూరు కాలేదు. రహదారుల పరిస్థితి కూడా అధ్వానంగా మారింది. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లపై గుంతలు పడ్డాయి. వర్షాకాలంలో మరీ అధ్వానంగా మారి రాకపోకలకు ప్రజలు తంటాలు పడుతున్నారు. జిల్లాలో సుమారు 400కు పైగా గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. జిల్లా కేంద్రానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండి బ్రిడ్జి నిర్మాణం ముందుకు సాగడం లేదు. 15 ఏళ్లుగా పిల్లర్ల దశలోనే మగ్గుతోంది. రూ.2.5 కోట్లతో ప్రారంభమైన అంచనా వ్యయం ప్రస్తుతం రూ.14.40 కోట్లకు పెరిగింది. అలాగే లక్మాపూర్ బ్రిడ్జి అసంపూర్తిగా ఉంది. జిల్లా కేంద్రం నుంచి ఉట్నూర్ ఆర్అండ్బీ రహదారి గుంతలమయంగా మారింది. రీ బీటీ చేయాలని ప్రతిపాదనలు పంపుతున్నా నిధులు కేటాయించడం లేదు. కుమురంభీం ప్రాజెక్టునిధులు కేటాయిస్తేనే.. సాగునీరుజిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటా యింపు లేకపోవడంతో అలంకారప్రాయంగా మారాయి. జగన్నాథ్పూర్, కుమురంభీం(అడ) ప్రాజెక్టుల నిర్మాణ పనులన్నీ పూర్తి కావడానికి సుమారు రూ.250 కోట్లు అవసరమవుతాయని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. గత బడ్జెట్లో కాంగ్రెస్ సర్కారు కుమురంభీం ప్రాజెక్టుకు రూ.7.95 కోట్లు, జగన్నాథపూర్ ప్రాజెక్టుకు రూ.12.32 కోట్లు, వట్టివాగు ప్రాజెక్టుకు రూ. 2.59 కోట్లు, ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్టుకు రూ. 15.60 లక్షలు, పీపీరావు సాగర్కు రూ.2.34 కో ట్లు కేటాయించింది. ఇందులో చాలా వరకు నిధులు ఖర్చు చేయలేదని తెలుస్తోంది. అడ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా 53 వేల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది. కాల్వలు అసంపూర్తిగా ఉండటంతో కనీసం 10వేల ఎకరాలకు కూడా సాగునీరందడం లే దు. ప్రాజెక్టు కట్ట బీటలు తేలి మూడేళ్లవుతు న్నా ఇప్పటివరకు ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదు. ఇటీవల హైదరాబాద్ నుంచి ఇరిగేషన్ ఈఎన్సీ ప్రాజెక్టు సందర్శించి కాంక్రీ ట్ పోర్షన్ కట్టాలని సూచించారు. మరమ్మతులకు సుమారు రూ.30 కోట్లు అవసరం ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆసిఫాబాద్ మండలంలోని వట్టివాగు ప్రాజెక్టు ఆధునికీకరణ కోసం ఆరేళ్లక్రితం రూ.27.76 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయినా నిధులు కేటాయించలేదు. కుమురంభీం ప్రాజెక్టు నిర్వహణకు ఏటా రూ.20 లక్షలు, వట్టివాగు ప్రాజెక్టు నిర్వహణకు ఏటా రూ.6 లక్షలు మాత్రమే మంజూరు చేస్తున్నారు. 20 ఏళ్లక్రితం ప్రారంభించిన జగన్నాథ్పూర్ ప్రాజెక్టు పరిస్థితి ఎక్కడ వేసినగొంగళి అక్కడే ఉంది. ప్రాజెక్టులో ముంపునకు గురైన రైతులకు నేటికీ నష్టపరిహారం అందలేదు. నిధులు కేటాయించక పోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. రాష్ట్రంలోనే నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టుల్లో ఇది ఒక్కటి. -
ఫిర్యాదుదారుల సమస్యలు త్వరగా పరిష్కరించాలి
ఆసిఫాబాద్అర్బన్: ప్రజావాణిలో భాగంగా వచ్చి న ఫిర్యాదులను చట్టపరిధిలో త్వరగా పరిష్కరించాలని ఎస్పీ డీవీ. శ్రీనివాసరావ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీ సు కార్యాలయంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీ కరించారు. సంబంధి త ఎస్సై, సీఐలతో ఫోన్లో మాట్లాడి సమస్య పరి ష్కారానికి పలు సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పోలీ సు సేవలను వినియోగించుకోవాలని సూచించా రు. శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ పని చేస్తోందన్నారు. బాధితులకు అండగా భరోసా సెంటర్ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని బాధిత మహిళలకు, చిన్నారులకు భరోసా సెంటర్ అండగా నిలుస్తోందని ఎస్పీ డీవీ. శ్రీనివాసరావ్ అన్నారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ ద్వారా వచ్చిన విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ని బాధిత మహిళలు ఆరుగురికి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భరోసా సెంటర్ ద్వారా పోలీసు, వైద్య, న్యాయ సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా బాధితులు ఉంటే 8712670561 లేదా డయల్ 100 నంబర్లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో భరోసా సెంటర్ ఇన్చార్జి ఎస్సై తిరుమల, తదితరులు పాల్గొన్నారు. -
● నిధులు లేక నీరసిస్తున్న గ్రామాలు.. ● ‘ప్రత్యేక’ పాలనలో సమస్యల తిష్ట ● చిన్న పనులకు సొంత డబ్బులు పెడుతున్న కార్యదర్శులు ● బిల్లులు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్న వైనం..
వాంకిడి మండలం సోనాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మచ్చగూడ (మహగవ్)కు మిషన్ భగీరథ నీరు సరఫరా కావడంలేదు. దీంతో గ్రామస్తులు బావి నీటిపై ఆధారపడి జీవిస్తున్నారు. మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలంటే లక్ష వరకు ఖర్చవుతుంది. నిధులు లేక చేయడం లేదు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో దిక్కు తోచని స్థితిలో గ్రామస్తులు ఉన్నారు. సిర్పూర్ మండల కేంద్రంలోని అంగడిబజర్ ఏరియాలో పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో డ్రెయినేజీ చెత్తాచెదారంతో కంపు కొడుతోంది. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు రాకపోవడంతో జీపీ ట్రాక్టర్కు డీజిల్ పోయలేని పరిస్థితిలో అధికారులు ఉండడంతో ఎక్కడిచెత్త అక్కడే పేరుకుపోతోంది. బెజ్జూర్: జిల్లాలోని గ్రామ పంచాయతీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రత్యేక అధికారు ల పాలనలో సమస్యలు తిష్ట వేశాయి. పనుల నిర్వహణకు కార్యదర్శులు లక్షల్లో అప్పులు తెచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. బిల్లులు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. అయినా నిధుల కొరత కారణంగా గ్రామాల్లో సమస్యలు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. ఇంతకాలం అప్పులు తెచ్చి పనులు చేపట్టాం.. ఇప్పటి నుంచి మావల్ల కాదని వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తమ ఆవేదన వెలిబుచ్చుతున్నారు. గ్రామాల్లో వీధిదీపాలు వెలగకపోయినా, ట్రాక్టర్లలో డీజిల్ లేకపోయినా, మోటారు మరమ్మతులకు వచ్చినా, పైపులైను లీకేజీలు, వాటర్ పైప్లైన్ లీకేజీ నిర్మాణాలు కార్యదర్శులు చేపట్టాల్సి ఉంటోంది. లేదంటే వాటి ఫలితం ప్రజలు అనుభవించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతకాలం కార్యదర్శులు సొంతంగా ఖర్చు చేసినవి తిరిగి రాకపోగా, నగదు చెల్లించకుండా సామగ్రిని షాపు నిర్వాహకులు ఇచ్చేందుకు నిరాకరిస్తుండడంతో పనులన్నీ నిలిచిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. నిధుల కొరత..ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావాల్సి ఉంది. పంచాయతీల్లో పాలకవర్గాలు లేనందున నిధులు విడుదల చేయలేమంటూ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఉంటే కేంద్రం నిధులు సక్రమంగా విడుదలై ఉండేవి. కానీ ఆవేం లేకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలనలో సమస్యలు పేరుకుపోతున్నాయి. ఒక్కో అధికారికి మూడు పంచాయతీల బాధ్యతలను అప్పగించడంతో వారు చుట్టపుచూపుగా గ్రామాలకు వచ్చి వెళ్తున్నారు. దీంతో పంచాయతీల పాలన అస్తవ్యస్తంగా మారిపోయింది. అప్పుల పాలవుతున్న కార్యదర్శులు జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉండగా 1,102 గ్రామాలు ఉన్నాయి 320 మంది కార్యదర్శులు ఉన్నారు. 130 మంది గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు ఉన్నారు. ప్రభుత్వం గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవడంతో డ్రెయినేజీల నిర్మాణం, మంచినీటి పైపులైన్లు, రోడ్లతో పాటు కొన్ని గ్రామాల్లో వీధిలైట్ల మరమ్మతులు కూడా చేపట్టకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పంచాయతీల పాలన మొక్కుబడిగా సాగుతోంది. పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉండగా, ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో పల్లెల్లో సమస్యలు పేరుకు పోతుడడంతో చేసేదేమీ లేక అప్పులు చేసి పైపులైన్ల లీకేజీలు, బోర్ల మరమ్మతు చేయిస్తున్నారు. సమస్యలపై పంచాయతీరాజ్ జిల్లా అధికారి భిక్షపతి గౌడ్ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.పడకేసిన ప్రత్యేక ప్రాలన..దెబ్బతిన్న రోడ్లు, మంచినీటి పైపులైన్లు, వీధిలైట్ల మరమ్మతులు, నూతన అభివృద్ధి పనులను చేపట్టకపోవడంతో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. సర్పంచు ల పదవీకాలం ముగిసి 13 నెలలు గడిచినా ఇంతవరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం లేదు. దీంతో పంచాయతీల్లో పర్యవేక్షణ కొరవడింది. ఫలితంగా స్థానికంగా పంచాయతీ కార్యదర్శులపైనే భారం పడుతోంది. అభివృద్ధి పనులు పడకేశాయి. మరమ్మత్తులు అటకెక్కాయి. ఎప్పుడు చూసినా గ్రామ పంచాయతీ కార్యాలయాలకు తాళాలే దర్శనమిస్తున్నాయి. -
ఒత్తిడిని జయించి ఉత్తమ ఫలితాలు సాధించాలి
వాంకిడి/కెరమెరి: పదో తరగతి విద్యార్థులు ఒత్తిడిని జయించి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఏఎస్పీ చిత్తరంజన్ సూచించారు. సోమవారం వాంకిడి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కెరమెరి మండలంలోని మోడి, హటి ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా 768 మందికి పరీక్ష ప్యాడ్లు, వాటర్ బాటిళ్లు, 2500 మందికి పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృషి, పట్టుదల, సమయ పాల న విజయానికి ముఖ్య సూత్రాలన్నారు. అ లాంటి పట్టుదలతోనే తాను ఈస్థాయికి చేరుకోగలిగానని, మీరంతా కూడా ఉన్నత శిఖరా లకు చేరుకునేలా కష్టపడాలని సూచించారు. పరీక్షలు రాసే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, ఎస్సై ప్రశాంత్, ఎంఈవో శివచరణ్ కుమార్, హెచ్ఎం నటరాజ్, తదితరులు పాల్గొన్నారు. -
హామీలు అమలు చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: అంగన్వాడీ టీచర్స్, హెల్పర్లకు గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి త్రివేణి డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట 48 గంటల ధర్నా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాల ద్వారా ఐసీడీఎస్ను నిర్వీర్యం చేయాలని భావిస్తోందన్నారు. ఇందులో భాగంగానే నూతన జాతీయ విధానం చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ఇది అమలైతే ఐసీడీఎస్లో అనేక మార్పులు జరుగుతాయన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను తిప్పికొట్టాలంటే పోరాటం తప్ప మరో మార్గం లేదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజేందర్, శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు కృష్ణమాచారి, అంగన్వాడీ యూనియన్ నాయకులు వనిత, రాజేశ్వరి, అంజలి, మల్లేశ్వరి, షీలా, జయప్రద, జ్యోతి, జయ, తదితరులు పాల్గొన్నారు. -
ఎన్ఆర్హెచ్సీ జిల్లా కమిటీ ఎన్నిక
కెరమెరి: మానవ హక్కుల జిల్లా కమిటీని సోమవారం మండల కేంద్రంలో ఎన్నుకున్న ట్లు ఎన్ఆర్హెచ్సీ చైర్మన్ రాథోడ్ రమేశ్ తెలి పారు. జిల్లా వైస్ చైర్మన్లుగా రాథోడ్ గోపాల్, పెందోర్ శ్రీనివాస్, లీగల్ అడ్వైజర్గా జాదవ్ ఆకాశ్, జనరల్ సెక్రెటరీగా అలుగొట్టు నవీన్కుమార్, కెరమెరి మండల వైస్ చైర్మన్గా రాథోడ్ అర్జున్ ఎన్నికయ్యారు. ఈ మేరకు వారికి నియామకపత్రాలు అందజేశారు. ఆర్టీసీ డీఎంగా రాజశేఖర్ బాధ్యతల స్వీకరణ ఆసిఫాబాద్అర్బన్: ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్గా కేవీ రాజశేఖర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లోని కూకట్పల్లి డిపోలో మెకానికల్ ఫోర్మెన్గా విధులు నిర్వహిస్తున్న ఆయన ప్రమోషన్పై డీఎంగా బదిలీపై వచ్చారు. గతంలో ఇక్కడ డీఎంగా పని చేసిన విశ్వనాథ్ బోధన్ డిపోకు బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది నూతన డీఎంను సన్మానించారు. -
ప్రాణహిత ప్రాణం తీయొద్దు
కౌటాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టు ప్రాణం తీయొద్దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం అన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గం చుట్టూ నదులున్నా ప్రయోజనం లేదన్నారు. రైతుల కోసం 16 ఏళ్ల క్రితం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రారంభించిన ప్రాణహిత ప్రాజెక్టును మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరానికి తరలించి నవ్వుల పాలు చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం సిర్పూర్ నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించలేకపోతోందన్నారు. ఈ వేసవిలో ప్రాణహిత ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేకపోవడం దారుణమన్నారు. ప్రాజెక్టును నిర్మిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి 60 శాతం నిధులు మంజూరు చేయిస్తామన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి బండి రాజేందర్గౌడ్, మండలాధ్యక్షుడు కుంచాల విజయ్, నాయకులు రవి, చందు, అశోక్, సత్తయ్య, ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి
● కలెక్టర్ వెంకటేష్ దోత్రేఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి సమస్యల పరిష్కారం కోసం వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్తో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామానికి చెందిన దుర్గం మల్లయ్య తాను పుట్టుకతో దివ్యాంగుడినని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు. వాంకిడి మండల కేంద్రానికి చెందిన ఎర్ర లక్మీకాంత్ తనకు గిరి వికాసం పథకంలో మంజూరైన బోరుకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరుతూ అర్జీ సమర్పించాడు. ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్కు చెందిన గైని మొగిలి తాను చేస్తున్న పోడు భూమిని సర్వే నిర్వహించి పట్టా మంజూరు చేయాలని వేడుకున్నాడు. బెజ్జూర్ మండలం కుకుడ గ్రామానికి చెందిన యెరుగు రమేశ్ తమ గ్రామంలో గల మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాల భవన మరమ్మతులు చేపట్టాలని కోరాడు. కాగజ్నగర్ పట్టణానికి చెందిన ఓంకార్ అభిలాష్ తన తండ్రి పేరిట దహెగాం మండలం కమ్మర్పల్లి శివారులో ఉన్న లావుని పట్టా భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించుకున్నారని, ఈ విషయమై తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. హన్మకొండ జిల్లాకు చెందిన మీర్సలీం అలీ తనకు కౌటాల మండలం మొగడ్దగడ్ గ్రామ శివారులో ఉన్న పట్టా భూములకు పట్టాదారు పాస్తు పుస్తకాలు జారీ చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. రెబ్బెన మండలం పాసిగాం గ్రామానికి చెందిన శాంతాబాయి తనకు గల పట్టాభూమి ధరణి పోర్టల్లో మిస్సింగ్ అయినందున తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆధార్కార్డు ఇప్పించండి నేను కొన్ని సంవత్సరాలు గా రెబ్బెన మండలంలో ని వాసం ఉంటున్నా. నాకు మాత్రం ఆధార్కార్డు ఇచ్చా రు. ప్రస్తుతం నాకు ఐదుగు రు పిల్లలు ఉన్నారు. వారికి ఎక్కడికి వెళ్లినా ఆధార్కార్డు ఇవ్వడం లేదు. దీంతో పాఠశాలలకు వెళ్లలేక ఇంటికే పరిమితం కావాల్సి వస్తోంది. ఇప్పటికై నా చిన్నారుల విద్యాభ్యాసం దృష్టిలో ఉంచుచుని ఆధార్కార్డు మంజూరు చేయాలి. – బికె.సింగ్, రెబ్బెన -
‘జగదీశ్రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలి’
ఆసిఫాభాద్అర్బన్: స్పీకర్ గడ్డం ప్రసాద్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మె ల్యే జగదీశ్రెడ్డి సభ్యత్వం రద్దుచేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీరా శ్యాంనాయక్ డిమాండ్ చేశారు. సో మవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ట్లాడుతు ప్రజాప్రతినిధులు ప్రజలకు రోల్ మోడల్గా నిలవాలని, ఇలా సభాపతి పై అ నుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నా రు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్న సీఎం రేవంత్రెడ్డిపై అనవసరమైన ఆరోపణ లు చేస్తే సహించేది లేదన్నారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు. సమావేశంలో నా యకులు తిరుపతి, రమేశ్, పరశురాం, ముర ళి, బాలేష్, అన్నారావ్, రవినాయక్, రవీందర్, నిజాం, జక్కన్న, సత్తన్న, శంకర్నాయక్, దుర్గం సోమయ్య, మధు పాల్గొన్నారు. -
కొత్త అధ్యాపకులొచ్చారు..
● జిల్లాలో 47 మంది నియామకం ● అతిథి అధ్యాపకులు ఇంటికి ఆసిఫాబాద్రూరల్: జిల్లాలోని 11 ప్రభుత్వ జూని యర్ కళాశాలలకు 47 మంది జూనియర్ లెక్చర ర్లు వచ్చారు. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో బోధన కష్టాలు తీరనున్నాయి. నూతన అధ్యాపకుల భర్తీతో ఇంటర్ విద్య మరింత బలోపేతం కానుంది. కొన్నేళ్ల నుంచి ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకుల ఖాళీల కొరతతో అతిథి ఒప్పంద అధ్యాపకులతో విద్యను అందించారు. ఎట్టకేలకు 13 సంవత్సరాల తర్వాత జిల్లాకు వచ్చిన 47 మంది కొత్త అధ్యాపకులు ఈనెల 13న విధుల్లో చేరారు. కళాశాలల వారీగా కేటాయింపు ఇలా...జిల్లా వ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు 47 మంది జూనియర్ లెక్చరర్లు వి ధుల్లో చేరారు. బెజ్జూర్కు ఇంగ్లిష్, ఆర్థిక శాస్త్రం, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయ న శాస్త్రం అధ్యాపకులను కేటాయించారు. దహెగాంకు ఇంగ్లిష్, హిందీ, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, జైనూర్కు ఆర్థిక శాస్త్రం, జంతుశాస్త్రం, భౌతిక శాస్త్రం, గణితం, రసాయన శాస్త్రం, కెరమెరికి గణితం, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, భౌతిక శాస్త్రం, కౌటాలకు ఆర్థికశాస్త్రం, గణితం, వృక్షశాస్త్రం, భౌతిక శాస్త్రం, రెబ్బెనకు హింది, వృక్ష శాస్త్రం, రసాయన శాస్త్రం, సిర్పూర్ (టీ)కి ఇంగ్లిష్, పౌరశాస్త్రం, జంతుశాస్త్రం, కాగజ్నగర్కు ఇంగ్లిష్, ఉర్దూ, ఆర్థికశాస్త్రం, గణితం, రసాయన శాస్త్రం, తిర్యాణికి కామర్స్, వృక్షశాస్త్రం, వాంకిడికి ఆర్థిక శాస్త్రం, హిందీ, గణితం, వృక్షశాస్త్రం, ఆసిఫాబాద్ కళాశాలకు ఉర్దూ, అర్ధశాస్త్రం, చరిత్ర, పౌర శాస్త్రం, హిందీ, ఆర్థికశాస్త్రం అధ్యాపకులను కేటాయించారు. అతిథి అధ్యాపకుల పరిస్థితి ఏమిటి?ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 46 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 186 మంది అతిథి అధ్యాపకులు పది సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జూనియర్ కళాశాలల్లో అధ్యాపకు ల పోస్టులను భర్తీ చేయడంతో అతిఽథి అధ్యాపకుల కొలువులకు ఎసరొచ్చింది. 2014 నుంచి అతిథి అధ్యాపకులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కొత్త లెక్చరర్ల ని యామకంతో వారికి ఇబ్బందికరంగా మారింది. తమ సర్వీస్ ప్రాతిపదిక చేసుకుని ప్రభుత్వ కళాశాలల్లో అలాగే కొనసాగించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అతిథి అధ్యాపకులకు ఎంటీఎస్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టడంతో పాటు పలు సందర్భాల్లో హామీ ఇచ్చిందని గుర్తుచేస్తున్నా రు. నూతన నియామకంతో అతిఽథి అధ్యాపకులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నిర్ణయంపైనే అతిథి అధ్యాపకుల కుటుంబాల పరిస్థితి ఆధారపడి ఉంది. ఇంటర్ విద్య మరింత బలోపేతం.. అధ్యాపక పోస్టుల భర్తీతో జిల్లాకు 47 మంది కొత్త లెక్చరర్లు వచ్చారు. దీంతో జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మరింత నా ణ్యమైన విద్య అందనుంది. ప్రభుత్వ కళాశాలల్లో అన్ని వసతులతో కూడిన విద్య అందిస్తాం. – కళ్యాణి, డీఐఈవో -
మార్చిలోనే.. మంటలు
కౌటాల: జిల్లాలో సూరీడు సుర్రుమంటున్నాడు. నాలుగు రోజులుగా నిప్పులు కక్కుతున్నాడు. అధికారిక రికార్డుల ప్రకారం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. వడగాలులతో సామాన్య ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా పెరిగిన వేసవి ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. గాలిలో తేమశాతం తగ్గిపోవడంతో ఉదయం 9 గంటల నుంచే జనం చెమటతో తడిసిపోతున్నారు. అధిక వేడికి తోడు వడగాలులు వీస్తుండడంతో జనం ఇళ్లలోనే ఉడికిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు పెరగడం గమనించాల్సిన అంశం. పెరిగిన ఉష్ణోగ్రతలతో పిల్లలు, పెద్దలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ‘సన్’ డే..జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి ఉదయం 10 దాటితే ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి మొదలవుతున్న వేడి సెగలు రాత్రి ఏడుగంటల వరకు తగ్గడం లేదు. గంట గంటకు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉపాధి హామి పనులు కూడా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో వేసవి వేడిమి పెరగడం నిత్య శ్రమజీవులకు గుదిబండగా మారింది. మధ్యాహ్నం వేళ అంతా కార్యాలయాలు, ఇళ్లకే పరిమితం అవుతుండడంతో రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఆదివారం రెబ్బెనలో 41.8, తిర్యాణిలో 41.7, ఆసిఫాబాద్లో 41.6, కెరమెరిలో 41.5, కౌటాల, కెరమెరి, సిర్పూర్(టి)లో 41.3, కాగజ్నగర్లో 40.8, వాంకిడిలో 40.5, పెంచికల్పేట్లో 40.4, చింతలమానెపల్లిలో 40.2, బెజ్జూర్లో 40.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సిర్పూర్(యు), లింగాపూర్, దహెగాం మండలాలు పరిశీలన జోన్లో ఉండగా మిగతా 12 మండలాలు అలెర్ట్ జోన్లో ఉన్నాయి. మరింత మంటలే..!అడవుల జిల్లాగా పేరొందిన ఉమ్మడి ఆదిలాబాద్లో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుకావ డం కలవరపరుస్తోంది. గతేడాదితో పోల్చితే వేసవి ఉష్ణోగ్రతలు పెరిగాయి. మార్చి రెండో వారంలోనే ఎన్నడూ లేని విధంగా ఎండలు మండుతున్నాయి. ఇప్పుడే భానుడి ప్రతాపం ఇలా ఉంటే మే నెలలో ఎలా ఉంటుందోనని జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ విభాగం ముందే చెప్పినట్లు ఈ వేసవి నిప్పుల కొలిమిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వాతావరణంలో నెలకొంటున్న మార్పుల వల్ల ఈ పరిస్థితి కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. జాగ్రత్తలు పాటించాలి ప్రజలు వేసవి కాలంలో తగిన జాగ్రత్తలు పాటించకుంటే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది. ఉదయం 11 నుంచి మూడు గంటల మధ్య కిరణాల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఉపాధి హామీ కూలీలు, రైతులు ఉదయం 10 గంటలలోపే పనులు ముగించుకుని ఇంటికి వెళ్లాలి. వేసవిలో చెమట రూపంలో నీరు ఎక్కువగా బయటకు పోతుంది. ప్రతిఒక్కరూ రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీరు తాగాలి. ఎండకు అస్వస్థతకు గురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ నవత, మెడికల్ ఆఫీసర్, కౌటాలనిర్మానుష్యంగా కౌటాల–తలోడి రోడ్డునాలుగు రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలుతేదీ ప్రాంతం ఉష్ణోగ్రతలు 13న రెబ్బెన 40.8 14న గిన్నెధరి 40.4 15న ఆసిఫాబాద్ 42.4 16న రెబ్బెన 41.8 నాలుగు రోజులుగా సుర్రుమంటున్న సూరీడు వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి రెబ్బెనలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు -
● అయోమయంలో అన్నదాతలు ● నాలుగో విడతలోనూ పేరు రాకపోవడంతో ఆవేదన ● వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ రైతుల ప్రదక్షిణ ● ప్రభుత్వం నుంచి స్పష్టత కరువు
ఈ రైతు పేరు చెన్నుపాటి ప్రభాకర్రావు. రెబ్బెన మండల కేంద్రానికి చెందిన ఇతను స్థానిక తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 2023 జూన్లో రూ.2 లక్షల పంట రుణం తీసుకున్నాడు. 2024 ఆగస్టులో రుణాన్ని రెన్యూవల్ చేసుకోగా అతని పేరుపై రూ.1.94 లక్షల రుణం మాత్రమే ఉంది. రుణమాఫీకి అన్నీ రకాలుగా అర్హుడిగానే ఉన్నా రుణమాఫీ కాలేదని వాపోతున్నాడు. మరో జాబితాను ప్రకటించి రుణమాఫీ చేయాలని కోరుతున్నాడు. వీరే కాకుండా జిల్లా వ్యాప్తంగా అర్హులైనా రుణమాఫీ కాని రైతులు చాలా మంది ఉన్నారు. రుణమాఫీ కాక బయట వడ్డీలకు అప్పులు తీసుకుని బ్యాంకుల్లో రుణాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాంకిడి(ఆసిఫాబాద్): నాలుగు విడతలుగా రైతుల రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం మళ్లీ ఐదో విడత మాఫీ ప్రక్రియ చేపడుతుందా? లేదా? అనే విషయంపై మాఫీ కానీ రైతుల్లో సందిగ్ధం నెలకొంది. జిల్లాలోని సుమారు 25 నుంచి 30 శాతం రైతుల పంట రుణాలు మాఫీ కాలేదని సమాచారం. అయి తే ప్రభుత్వం నుంచి ఐదో విడతపై ఎలాంటి స్పష్ట త లేకపోవడంతో అన్నదాతల్లో అయోమయం నెలకొంది. రూ.2లక్షల లోపు రుణాన్ని మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రెండు లక్షల పైన ఉన్న మొత్తాన్ని రైతులు అప్పులు చేసి మరీ బ్యాంకులకు చెల్లించారు. కానీ నాలుగో విడత ముగిసి మూడు నె లలు కావస్తున్నా ఎలాంటి స్పష్టత రాకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ‘మాకెప్పుడు రు ణమాఫీ’ అంటూ వ్యవసాయ కార్యాలయాలు, పీఏ సీఎస్లు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హులైన రైతుల రుణాలు మాఫీ చేయాలని కోరుతున్నారు. అప్పులు చేసి చెల్లించారు..రాష్ట్ర ప్రభుత్వం రూ.2లక్షల లోపు పంట రుణాలు ఉన్న వారికి మాత్రమే మాఫీ చేయడం జరుగుతుందని, ఆ పైన ఉన్న మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించాలని చెప్పడంతో రూ.2లక్షల పైన రుణాలు ఉన్న రైతులు అప్పులు చేసీ మరీ పైన ఉన్న మొత్తాన్ని చెల్లించారు. కానీ చాలా మంది రైతులకు మాఫీ కాలేదు. మొదటి విడతలో రూ.లక్షలోపు. రెండో విడతలో రూ.లక్షన్నర లోపు, మూడో విడతలో రూ.రెండు లక్షల లోపు రుణాలు ఉన్నవారికి మాఫీ చేశారు. వివిధ కారణాలతో మాఫీ కానీ రైతుల నుంచి రైతు వేదికల్లో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. రేషన్ కార్డు లేకపోవడం, బ్యాంకు ఖాత లాక్ పడి ఉండటం, ఆధార్ కార్డులో పట్టా పాస్పుస్తకంలో పేర్లు వేరుగా, తప్పుగా ఉండటం, ఫోన్ నంబర్లు సరిపోలకపోవడం వంటి కారణాలతో రుణమాఫీకి నోచుకోని రైతుల నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరించారు. రైతుల డిమాండ్ మేరకు ప్రభుత్వం నాలుగో విడతలోనూ మాఫీ ప్రక్రియ చేపట్టింది. కానీ అందులో కూడా చాలా మంది అర్హులైన రైతులకు రుణమాఫీ వర్తించలేదు. ఎక్కువగా రేషన్ కార్డు లేకుండా రూ.2 లక్షల లోపు రుణం కలిగి ఉన్న వారికి మాత్రమే మాఫీ జరిగింది. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 30 శాతం రైతులకు మాఫీ వర్తించ లేదని తెలుస్తోంది. నాలుగో విడతలో అత్యధికంగా రేషన్ కార్డు లేని వారిని మాత్రమే పరిగణలోకి తీసుకుని రుణమాఫీ చేశారు. అనేక కారణాలతో చివరి విడత తరువాత దరఖాస్తు చేసుకున్న చాలా వంది రైతులు చేసిన అప్పులు తీర్చలేక, బ్యాంకులో వడ్డీ పెరిగిపోతుందని ఆందోళనకు గురవుతున్నారు. విడతల వారీగా మంజూరు..రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చి న హామీ మేరకు నాలుగు విడతల్లో 51,583 మంది రైతులకు రూ.465,36,95,472 రుణాలు మాఫీ చేసింది. మొదటి విడతలో 21,776 మంది రైతుల కు గానూ రూ.123.77 కోట్లు, రెండవ విడతలో 14,410 మంది రైతులకు గానూ రూ.150.80 కోట్లు, మూడో విడతలో 11,733 రైతులకు గానూ రూ.154.08 కోట్లు, నాలుగో విడతలో 3,664 మంది రైతులకు గానూ రూ. 36.70 కోట్లు మాఫీ చేసింది. మూడో విడతలో పేర్లు రాణి రైతులకు నాలుగో విడతలో పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిగినట్లు ప్రభుత్వం పేర్కొంటున్నప్పటికీ ఇంకా చాలామంది రైతులు మరో జాబితాపై ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్నాం.. అన్ని అర్హతలు ఉన్నా రుణమాఫీ కాలేదు. నా కుటుంబంలోని నలుగురి పేరున బ్యాంకులో రూ.2.40 లక్షల పంట రుణం తీసుకున్నా. కనీసం నాలుగో విడతలోనైనా మాఫీ అవుతుందనుకున్నా. కానీ కాలేదు. రైతు వేదికలో దరఖాస్తు చేసుకున్నా ఎలాంటి ఫలితం లేదు. కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. – కాటేల కళ, దహెగాంఎలాంటి సూచనలు రాలేదు మొదటి విడతలో రూ.లక్ష లోపు, రెండో విడతలో రూ.1.50 లక్షల లోపు, మూడో విడతలో రూ.2లక్షలలోపు రైతుల రుణాలు ప్రభుత్వం మాఫీ చేసింది. వివిధ కారణాలతో మూడో విడతలోనూ మాఫీ కాని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి నాలుగో విడతలో రూ.2లక్షల లోపు రుణాలను మాఫీ చేశాం. మరో జాబితాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. – శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి -
‘స్పీకర్పై వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధం’
ఆసిఫాబాద్అర్బన్: స్పీకర్ గడ్డం ప్రసాద్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్రెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్రా వ్ అన్నారు. ఇందుకు నిరసనగా ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ శ్రేణులతో కలిసి జగదీశ్రెడ్డి, కేటీఆర్ దిష్టిబొమ్మలను దహ నం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభాపతిపై ఇష్టం వచ్చిన ట్లు మాట్లాడడం సరికాదన్నారు. బీఆర్ఎస్ నాయకులు అగ్రకుల అహ ంకారంతోనే మాట్లాడుతున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నా యకులు బాలేశ్వర్గౌడ్, చరణ్, గుండాశ్యాం, అసద్, మారుతీపటేల్, రూప్నార్ రమేష్, గోపాల్నాయక్, శివప్రసాద్ పాల్గొన్నారు. -
ఎన్హెచ్ఆర్సీ చైర్మన్గా రాథోడ్ రమేశ్
కెరమెరి: జాతీయ మా నవ హక్కుల కమిష న్ (ఎన్హెచ్ఆర్సీ) కుమురంభీం జిల్లా చై ర్మన్గా కెరమెరి మండలానికి చెందిన రమేశ్ రాథోడ్ నియామకమయ్యారు. ఈ మేరకు ఆ కమిషన్ నేషనల్ చైర్మన్ బీ శ్రీనివాస్రెడ్డి ఆదివారం ని యామక పత్రాన్ని విడదల చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అవినీతి, అక్రమాలు బహిర్గ తం చేయడంతో పాటు మానవహక్కుల ఉల్లంఘనలు నిరోధించడానికి కృషి చేస్తానని, ప్రజల కు నిస్వార్థంగా సేవచేస్తానని, తనపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతలు తూచా తప్పకుండా నిర్వహిస్తానని రమేశ్ పేర్కొన్నారు. -
● అయోమయంలో అన్నదాతలు ● నాలుగో విడతలోనూ పేరు రాకపోవడంతో ఆవేదన ● వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ రైతుల ప్రదక్షిణ ● ప్రభుత్వం నుంచి స్పష్టత కరువు
ఈ రైతు పేరు చెన్నుపాటి ప్రభాకర్రావు. రెబ్బెన మండల కేంద్రానికి చెందిన ఇతను స్థానిక తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 2023 జూన్లో రూ.2 లక్షల పంట రుణం తీసుకున్నాడు. 2024 ఆగస్టులో రుణాన్ని రెన్యూవల్ చేసుకోగా అతని పేరుపై రూ.1.94 లక్షల రుణం మాత్రమే ఉంది. రుణమాఫీకి అన్నీ రకాలుగా అర్హుడిగానే ఉన్నా రుణమాఫీ కాలేదని వాపోతున్నాడు. మరో జాబితాను ప్రకటించి రుణమాఫీ చేయాలని కోరుతున్నాడు. వీరే కాకుండా జిల్లా వ్యాప్తంగా అర్హులైనా రుణమాఫీ కాని రైతులు చాలా మంది ఉన్నారు. రుణమాఫీ కాక బయట వడ్డీలకు అప్పులు తీసుకుని బ్యాంకుల్లో రుణాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాంకిడి(ఆసిఫాబాద్): నాలుగు విడతలుగా రైతుల రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం మళ్లీ ఐదో విడత మాఫీ ప్రక్రియ చేపడుతుందా? లేదా? అనే విషయంపై మాఫీ కానీ రైతుల్లో సందిగ్ధం నెలకొంది. జిల్లాలోని సుమారు 25 నుంచి 30 శాతం రైతుల పంట రుణాలు మాఫీ కాలేదని సమాచారం. అయి తే ప్రభుత్వం నుంచి ఐదో విడతపై ఎలాంటి స్పష్ట త లేకపోవడంతో అన్నదాతల్లో అయోమయం నెలకొంది. రూ.2లక్షల లోపు రుణాన్ని మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రెండు లక్షల పైన ఉన్న మొత్తాన్ని రైతులు అప్పులు చేసి మరీ బ్యాంకులకు చెల్లించారు. కానీ నాలుగో విడత ముగిసి మూడు నె లలు కావస్తున్నా ఎలాంటి స్పష్టత రాకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ‘మాకెప్పుడు రు ణమాఫీ’ అంటూ వ్యవసాయ కార్యాలయాలు, పీఏ సీఎస్లు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హులైన రైతుల రుణాలు మాఫీ చేయాలని కోరుతున్నారు. అప్పులు చేసి చెల్లించారు..రాష్ట్ర ప్రభుత్వం రూ.2లక్షల లోపు పంట రుణాలు ఉన్న వారికి మాత్రమే మాఫీ చేయడం జరుగుతుందని, ఆ పైన ఉన్న మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించాలని చెప్పడంతో రూ.2లక్షల పైన రుణాలు ఉన్న రైతులు అప్పులు చేసీ మరీ పైన ఉన్న మొత్తాన్ని చెల్లించారు. కానీ చాలా మంది రైతులకు మాఫీ కాలేదు. మొదటి విడతలో రూ.లక్షలోపు. రెండో విడతలో రూ.లక్షన్నర లోపు, మూడో విడతలో రూ.రెండు లక్షల లోపు రుణాలు ఉన్నవారికి మాఫీ చేశారు. వివిధ కారణాలతో మాఫీ కానీ రైతుల నుంచి రైతు వేదికల్లో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. రేషన్ కార్డు లేకపోవడం, బ్యాంకు ఖాత లాక్ పడి ఉండటం, ఆధార్ కార్డులో పట్టా పాస్పుస్తకంలో పేర్లు వేరుగా, తప్పుగా ఉండటం, ఫోన్ నంబర్లు సరిపోలకపోవడం వంటి కారణాలతో రుణమాఫీకి నోచుకోని రైతుల నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరించారు. రైతుల డిమాండ్ మేరకు ప్రభుత్వం నాలుగో విడతలోనూ మాఫీ ప్రక్రియ చేపట్టింది. కానీ అందులో కూడా చాలా మంది అర్హులైన రైతులకు రుణమాఫీ వర్తించలేదు. ఎక్కువగా రేషన్ కార్డు లేకుండా రూ.2 లక్షల లోపు రుణం కలిగి ఉన్న వారికి మాత్రమే మాఫీ జరిగింది. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 30 శాతం రైతులకు మాఫీ వర్తించ లేదని తెలుస్తోంది. నాలుగో విడతలో అత్యధికంగా రేషన్ కార్డు లేని వారిని మాత్రమే పరిగణలోకి తీసుకుని రుణమాఫీ చేశారు. అనేక కారణాలతో చివరి విడత తరువాత దరఖాస్తు చేసుకున్న చాలా వంది రైతులు చేసిన అప్పులు తీర్చలేక, బ్యాంకులో వడ్డీ పెరిగిపోతుందని ఆందోళనకు గురవుతున్నారు. విడతల వారీగా మంజూరు..రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చి న హామీ మేరకు నాలుగు విడతల్లో 51,583 మంది రైతులకు రూ.465,36,95,472 రుణాలు మాఫీ చేసింది. మొదటి విడతలో 21,776 మంది రైతుల కు గానూ రూ.123.77 కోట్లు, రెండవ విడతలో 14,410 మంది రైతులకు గానూ రూ.150.80 కోట్లు, మూడో విడతలో 11,733 రైతులకు గానూ రూ.154.08 కోట్లు, నాలుగో విడతలో 3,664 మంది రైతులకు గానూ రూ. 36.70 కోట్లు మాఫీ చేసింది. మూడో విడతలో పేర్లు రాణి రైతులకు నాలుగో విడతలో పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిగినట్లు ప్రభుత్వం పేర్కొంటున్నప్పటికీ ఇంకా చాలామంది రైతులు మరో జాబితాపై ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్నాం.. అన్ని అర్హతలు ఉన్నా రుణమాఫీ కాలేదు. నా కుటుంబంలోని నలుగురి పేరున బ్యాంకులో రూ.2.40 లక్షల పంట రుణం తీసుకున్నా. కనీసం నాలుగో విడతలోనైనా మాఫీ అవుతుందనుకున్నా. కానీ కాలేదు. రైతు వేదికలో దరఖాస్తు చేసుకున్నా ఎలాంటి ఫలితం లేదు. కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. – కాటేల కళ, దహెగాంఎలాంటి సూచనలు రాలేదు మొదటి విడతలో రూ.లక్ష లోపు, రెండో విడతలో రూ.1.50 లక్షల లోపు, మూడో విడతలో రూ.2లక్షలలోపు రైతుల రుణాలు ప్రభుత్వం మాఫీ చేసింది. వివిధ కారణాలతో మూడో విడతలోనూ మాఫీ కాని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి నాలుగో విడతలో రూ.2లక్షల లోపు రుణాలను మాఫీ చేశాం. మరో జాబితాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. – శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి -
23న భీం అవార్డు ప్రదానోత్సవం
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రేమలా గార్డెన్లో ఈనెల 23న నిర్వహించనున్న కుమురంభీం జాతీయ అవార్డు ప్రదానోత్సవాన్ని విజయవంతం చేయాలని నవజ్యోతి సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు ధర్మపురి వెంకటేశ్వర్లు కోరారు. ప్రముఖ సినీ నటుడు సాయికుమార్కు ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. స్వర్ణోత్సవాల నేపథ్యంలో కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న నవజ్యోతి సంస్థ ఏర్పాట్లపై సన్నద్ధ సమావేశాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలోని సాయిబాబా ఆలయ ఆవరణలో నిర్వహించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి సాయిని రాజశేఖర్, కార్యనిర్వాహక అ ధ్యక్షుడు రామారావ్, ప్రతినిధులు చంద్రశేఖ ర్, రాధాకృష్ణాచారి, రమేశ్, సత్యనారాయణ, వెంకట్రావ్, శ్రీనివాస్, విజయ్కుమార్, గుండ వెంకన్న, సిడాం అర్జుమాస్టర్, సుధాకర్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. -
‘పెండింగ్ వేతనాలు చెల్లించాలి’
ఆసిఫాబాద్రూరల్: పెండింగ్లో ఉన్న వేతనా లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గిరిజన ఆ శ్రమ పాఠశాలలో పనిచేస్తున్న వర్కర్లు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నాకు ఆదివారం వి ద్యార్థి, యువజన సంఘాల నాయకులు మ ద్దతు తెలిపారు. ఈ సందర్భంగా హాస్టల్ డైలీ వెజ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని వర్కర్లు సమ్మె చేస్తుంటే అధి కారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. వెంటనే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని, జీవో 64 నిలిపి వేయాలని, 2014 నాటికి ఐదేళ్లు పూర్తయిన వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘం నాయకులు శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సాయికృష్ణ, వివిధ సంఘాల నాయకులు పద్మ, దినకర్, రాజేందర్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల్లో విజయ దుందుభి మోగాలి
● పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఆసిఫాబాద్అర్బన్: ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టిన విధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్ర ంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం సన్మాన కార్యక్రమానికి సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబుతో కలిసి హా జరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర పథకాలను గడపగడపకూ అందేలా చూడాలన్నారు. కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలన్నారు. జిల్లాలో వనరులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు. అనంతరం ఎమ్మెల్సీ అంజిరెడ్డిని శాలువాలతో సత్కరించారు. నాగేశ్వర్రావ్, కొత్తపల్లి శ్రీనివాస్, గోనె శ్యాంసుందర్రావ్, కోట్నాక విజయ్, అరిగెల మల్లికార్జున్, బోనగిరి సతీశ్బాబు, సెర్ల మురళి, మల్లారెడ్డి, రఘునాథ్, సొల్లు లక్ష్మి, కృష్ణకుమారి, సతీశ్, మాటూరి జయరాజ్, ప్రసాద్గౌడ్ పాల్గొన్నారు. -
వన్య ప్రాణుల వేట
● ఎండల తీవ్రతతో అడవుల నుంచి మైదానాల్లోకి మూగజీవులు ● విద్యుత్ తీగలు అమర్చి హతమారుస్తున్న వేటగాళ్లు ● పెద్దపులికి పొంచి ఉన్న ప్రమాదం ● కట్టడి చేయడంలో అటవీశాఖ అధికారుల వైఫల్యంఇటీవలి సంఘటనలు.. ● ఈనెల 2న నందిగామ వద్ద అడవి జంతువులను హతమార్చేందుకు విద్యుత్ తీగలను అమర్చిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీ సుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ● ఈ నెల 14న అగర్గూడ బీట్లో నీలుగాయిని వేటాడిన నలుగురు వ్యక్తులపైన కేసు నమోదు చేసి వేటాడటానికి ఉపయోగించిన విద్యుత్ తీగలు, గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు. ● ఈనెల 15న రాత్రి లోడుపల్లిలో చుక్కల దుప్పిని హతమార్చిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దుప్పి చర్మం స్వాధీనం చేసుకున్నారు ● వారం రోజుల కిత్రం కౌటాల మండల కేంద్రంలోని కంకాలమ్మ ఆలయం వద్ద ఉన్న ఓవర్హెడ్ ట్యాంక్ వద్దకు దప్పిక తీర్చుకునేందుకు వచ్చిన జింకను వేటగాళ్లు ఉచ్చులు అమర్చి హతమార్చారు.పెంచికల్పేట్: వన్యప్రాణులకు ఆవాసంగా ఉన్న జిల్లాలో మూగజీవాల వేట యధేచ్ఛగా కొనసాగుతోంది. అటవీశాఖ అధికారులు అడపాదడపా దాడులు నిర్వహించి వేటగాళ్లపైన కేసులు నమోదు చేస్తున్నా వారి తీరుమారడం లేదు. జిల్లాలో 6,04,172 ఎకరాల్లో దట్టమైన అటవీ విస్తీర్ణం ఉంది. ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్ల పరిధిలో అనేక రకాల వన్యప్రాణులు ఆవాసంగా మార్చుకుని జీవనం సాగిస్తున్నాయి. ఇటీవల మండుతున్న ఎండలకు అటవీ ప్రాంతాల్లో నీటి వనరులు ఎండిపోవడంతో వన్యప్రాణులు వనం నుంచి మైదాన ప్రాంతాల్లోకి వస్తున్నాయి.. గ్రామ సమీపాల్లోని చెరువులు, నీటి కుంటలు, సెలయేర్ల వైపు పరుగులు పెడుతున్నాయి. దీంతో వేటగాళ్ల కన్ను వన్యప్రాణులపై పడింది. దీంతో విద్యుత్ తీగలు, ఉచ్చులు అమర్చి వాటిని హతమారుస్తున్నారు. వాటి మాంసాన్ని విక్రయిస్తూ వేటనే వృత్తిగా ఎంచుకున్నారు. పెంచికల్పేట్ రేంజ్లో మూడు రోజుల్లో మండలంలోని అగర్గూడ బీట్లో నీలుగాయిని, లోడుపల్లి వద్ద చుక్కల దుప్పిని వేటగాళ్లు హతమార్చారు. కాగజ్నగర్ డివిజన్ పరిధిలో..కాగజ్నగర్ డివిజన్ పరిధిలోని పెంచికల్పేట్, బెజ్జూర్, సిర్పూర్(టి), కాగజ్నగర్, కౌటాల రేంజ్ ల పరిధిని ఆనుకుని ప్రాణహిత, పెద్దవాగు ప్రవహిస్తున్నాయి. దీంతో వేసవిలో సైతం వన్యప్రాణులు ఆయా రేంజ్ల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో ఆవా సం ఏర్పాటు చేసుకున్నాయి. అటవీ ప్రాంతంలో పెద్దపులులు, చిరుత పులులు, ఎలుగుబంట్లు, చు క్కల దుప్పులు, జింకలు, నీలుగాయిలు, మెకాలు, సాంబార్లు, కొండగొర్రెలతో పాటు అనేక రకాల ప్రాణులు ఆవాసంగా మార్చుకుని సంతతి వృద్ధి చేసుకుంటున్నాయి. అధికారులు అటవీ ప్రాంతాల్లో గడ్డి క్షేత్రాల పెంపకం చేపడుతుండడంతో సహజంగానే శాఖాహార జంతువుల సంఖ్య పెరిగింది. గ్రామాల వైపు పరుగులు..ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో అడవుల్లోని సహజ నీటి వనరుల్లో నీటి లభ్యత తగ్గిపోయింది. వనం నుంచి వచ్చిన ప్రాణులు గ్రామాల సమీపంలో ఉన్న వనరుల వద్ద దాహం తీర్చుకుంటున్నాయి. ఎల్లూర్ సమీపంలోని బొక్కివాగు ప్రాజెక్టు, లోడుపల్లి సమీపంలోని ప్రాణహిత కెనాల్, అగర్గూడ సమీపంలోని పెద్దవాగు వైపు వస్తున్నాయి. దీంతో వేటగాళ్లు ముఠాగా ఏర్పడి విద్యుత్ తీగలు, ఉచ్చులు, కుక్కలతో దాడులు చేసి సులువుగా హతమారుస్తున్నారు. కేసుల నమోదుతో సరి..వన్యప్రాణులను వేటాడుతున్న వేటగాళ్లపై అటవీశాఖ అధికారులు అడపాదడపా కేసులు నమోదు చేస్తున్నా వేట నిరంతరం సాగుతూనే ఉంది. అటవీ ప్రాంతంలో నీటి వసతి కల్పించి వన్యప్రాణులకు రక్షణ కల్పించాల్సిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో నీటి కొరకు బయటికి వస్తున్న వన్యప్రాణులను వేటగాళ్లు సులువుగా హతమారుస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు వన్యప్రాణుల సంరక్షణకు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. సంరక్షణకు చర్యలు ఎండలు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో వన్యప్రాణులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. సహజ వనరులను అభివృద్ధి చేస్తున్నాం. నీరు లభించే ప్రాంతాల్లో చెలిమెలు ఏర్పాటు చేస్తున్నాం. అడవుల్లో సోలార్ పంపు సెట్ల ద్వారా నీటిని నింపుతున్నాం. క్షేత్రస్థాయిలో సిబ్బందికి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నాం. వన్యప్రాణులను వేటాడే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తాం. వన్యప్రాణుల సంరక్షణకు ప్రతిఒక్కరూ సహకరించాలి. – సుశాంత్ బొగాడే, ఎఫ్డీవో, కాగజ్నగర్ పులికి పొంచి ఉన్న ప్రమాదం..పెంచికల్పేట్, బెజ్జూర్, సిర్పూర్(టి), దహేగాం మండలాల్లోని అటవీ ప్రాంతంలో పెద్దపులులు ఆవాసంగా ఏర్పాటు చేసుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో శాఖాహార జంతువులు ఎక్కువగా ఉండడంతో పాటు నీటి వసతిని ఆధారంగా చేసుకుని స్థిరనివా సంగా మార్చుకున్నాయి. గ్రామాల సమీ పంలో ఉన్న విద్యుత్ తీగలతో వేటగాళ్లు వేటకు ఉపక్రమిస్తుండటంతో పెద్దపులికి ముప్పు తప్పేలా లేదు. ఆహారం కొరకు అడవి నుంచి బయటికి వచ్చే క్రమంలో పెద్దపులులు విద్యుత్ తీగలతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. -
పట్టుదలతో చదివి.. కొలువులు సాధించి
● నాలుగు ఉద్యోగాలు సాధించిన యువకుడు ● ఆదర్శంగా నిలుస్తున్న సాయిరాంగౌడ్ కౌటాల: ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకే ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో ఏకంగా నాలుగు ఉద్యోగాలు సాధించి సత్తా చాటాడు ఆ పేదింటి యువకుడు.. ప్రభుత్వ ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా నిలవాలని భావించాడు కౌటాల మండలం తలోడి గ్రామానికి చెందిన మండల సాయిరాంగౌడ్. ఇప్పటి వరకు నాలుగు ఉద్యోగాలు సాధించి ఔరా అని పించాడు. మండల రాజేశంగౌడ్– తారక్క దంపతుల కుమారుడు సాయిరాంగౌడ్ హైదరాబాద్లో బీటెక్ పూర్తి చేశాడు. తల్లి గృహిణి కాగా తండ్రి వృత్తిరీత్యా గీత కార్మికుడు. తల్లిదండ్రుల కష్టాలను చూసి భవిష్యత్లో మంచి ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో తొలి ప్రయత్నంలోనే గ్రామ పంచాయతీ కార్యదర్శిగా కొలువు సాధించి ప్రస్తుతం బెజ్జూర్ మండలం మొగవెల్లి గ్రామ పంచాయతీలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. సివిల్స్కు సన్నద్ధమవుతున్న క్రమంలో గతేడాది గ్రూప్–4 ప్రకటన వెలువడగా అందులో ఉత్తీర్ణత సాధించి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించాడు. ఈ నెల 11న వెలువడిన గ్రూప్–2 ఫలితాల్లో 388 మార్కులతో రాష్ట్రస్థాయిలో 191వ ర్యాంకు సాధించాడు. శుక్రవారం ప్రకటించిన గ్రూప్–3 ఫలితాల్లో సైతం రాష్ట్రస్థాయిలో 349 ర్యాంక్ను సాధించాడు. గ్రూప్–1 మెయిన్స్లో 436 మార్కులు సాధించానని, సివిల్స్ సాధించాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నాడు. సాయిరాంగౌడ్ను కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. -
రేషన్ దొంగలు
రూటు మార్చినగుండాయిపేట వద్ద వార్ధానది కౌటాల: పేదల కడుపు నింపాల్సిన బియ్యం అక్రమార్కుల జేబులు నింపుతున్నాయి. ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్న చందంగా.. ఇందులో అందరికీ వాటాలు ఉండడంతో రాయితీ బియ్యం పొరుగున ఉన్న మహారాష్ట్రలోని ఆయా గ్రామాలకు తరలించడం నిత్యకృత్యంగా మారింది. దళారులతో పాటు రేషన్ డీలర్లు సైతం లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యం కొనుగోలు చేసి దందాను కొనసాగిస్తున్నారు. జిల్లాలో పీడీఎస్ బియ్యం దందాను అరికట్టేందుకు అధికారులు, పోలీసుశాఖ చేస్తున్న ప్రయత్నాలకు రేషన్ దుకాణాల డీలర్లే గండికొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దందాకు లోపాయికారిగా డీలర్లే సహకరిస్తుండడంతో జిల్లాలో పీడీఎస్ బియ్యం దందా బహిరంగంగానే కొనసాగుతోందనే విమర్శ వినిపిస్తోంది. అనేక మంది లబ్ధిదారులకు దుకాణాల వద్దే రేషన్ డీలర్లు నేరుగా కిలోకు రూ.16 నుంచి రూ.18 వరకు చెల్లిస్తున్నారు. 15 నుంచి 20 క్వింటాళ్ల వరకు పోగు చేసి మహారాష్ట్రలో రూ.26 నుంచి రూ.30 వరకు విక్రయిస్తున్నారు. ఇక్కడ పాలిష్ చేసి, ప్యాక్ చేసి ఇతర ప్రాంతాలకు అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల రేషన్ దందాపై పోలీస్శాఖ ఉక్కుపాదం మోపడంతో అక్రమార్కులు దందా రూట్ మార్చినట్లు తెలుస్తోంది. రైస్ మిల్లులకు తరలింపు?జిల్లాలో చాలా మంది ప్రజలు సన్న బియ్యం తింటుండగా ప్రభుత్వం దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుండడంతో చాలామంది వాటిని తినడానికి ఇష్టపడడం లేదు. రేషన్ దుకాణాల్లో విక్రయించి వాటి బదులు డబ్బులు, నిత్యావసర వస్తువులు తీసుకుంటున్నారు. దీంతో నేరుగా డీలర్లే పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని దళారులకు విక్రయిస్తున్నారు. రేషన్ డీలర్ల వద్ద నుంచి కొనుగోలు చేసిన పీడీఎస్ బియ్యాన్ని దళారుల నుంచి జిల్లాలోని కొందరు రైస్ మిల్లర్లు కేజీకి రూ.26 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. అర్థరాత్రి, తెల్లవారు జామున టాటా ఏసీట్రాలీ, డీసీఎం వ్యాన్లలో గుట్టుచప్పుడు కాకుండా రైస్ మిల్లర్లు చెప్పిన రహస్య ప్రదేశాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బియ్యాన్ని మిల్లర్లు మహారాష్ట్రకు తరలించడంతో పాటు రీసైక్లింగ్ చేసి తిరిగి సివిల్ సప్లై గోడౌన్లకు పంపిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా కట్టడి చేయాల్సిన సివిల్ సప్లై శాఖలోని ఒకరిద్దరు అధికారులే ఈ దందాను ముందుండి నడిపిస్తున్నారనే విమర్శలున్నాయి. చౌకధరల దుకాణాల ద్వారా ఇస్తున్న బియ్యం పక్కదారి పట్టకుండా లబ్ధిదారులకే అందేలా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ప్రభుత్వం వేలిముద్రల నిబంధన ప్రవేశపెట్టినా.. అక్రమ దందా మాత్రం ఆగడం లేదు. లబ్ధిదారులతో రేషన్ దుకాణాల్లో వేలిముద్రలు వేయించి నేరుగా అక్కడి నుంచే పీడీఎస్ బియ్యం బొలెరో వాహనాల్లో మహారాష్ట్రకు తరలిస్తున్నారు. గతంలో లబ్ధిదారులు ఇళ్ల వద్దకు వెళ్లి ఏజెంట్లు బియ్యం సేకరించేవారు. కానీ ఈ దందా విస్తరించిన క్రమంలో నేరుగా రేషన్ దుకాణాల నుంచే సేకరించే స్థాయికి చేరుకుంది. పీడీయాక్టు నమోదు చేస్తాం రాయితీ బియ్యం అక్రమంగా రవాణా చేస్తే పీడీయాక్ట్ నమోదు చేస్తాం. అసాంఘిక కార్యకలాపాలు, ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై ఉక్కుపాదం మోపాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించాం. 2024 నుంచి జిల్లాలో ఇప్పటి వరకు 124 కేసుల్లో 1,594 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నాం. 214 మందిని రిమాండ్కు తరలించాం. తాజాగా హుడ్కిలి చెక్పోస్టు వద్ద 208 క్వింటాళ్ల రాయితీ బియ్యం పట్టుకుని 12 మందిని రిమాండ్కు తరలించాం. – డీవీ శ్రీనివాసరావు, ఎస్పీ రోడ్డు, రైలుమార్గంపై అధికారుల నిఘా తరచూ పట్టుబడుతున్న వైనం జలమార్గాన్ని ఎంచుకున్న అక్రమార్కులు.. రైస్ మిల్లులకు బియ్యం తరలింపుజిల్లా వివరాలుప్రతీనెల పంపిణీ చేస్తున్న బియ్యం 3వేల మెట్రిక్ టన్నులుఆహార భద్రత కార్డులు 1,39,784అన్నపూర్ణ కార్డులు 21అంత్యోదయ కార్డులు 13,024 నాటు పడవల్లో..జిల్లా పోలీసు యంత్రాంగం బియ్యం దందాపై ఉక్కుపాదం మోపుతోంది. రేషన్ బియ్యం అక్రమ దందాను అడ్డుకునేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సరిహద్దులో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రోడ్డు మార్గంలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకుంటున్నారు. ఇటీవల పోలీసులు సిర్పూర్(టి) మండలం హుడ్కిలి వద్ద వాహనాల్లో మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 208 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు. దీంతో రోడ్డు మార్గంలో పీడీఎస్ బియ్యం మహారాష్ట్రకు తరలించడం కష్టమని భావించిన అక్రమార్కులు పోలీసులకు చిక్కకుండా దందాలో రూట్ మార్చారు. జిల్లా సరిహద్దు గ్రామాల నుంచి వార్ధా, ప్రాణహిత, పెన్గంగా నదుల్లో నాటు పడవల్లో ప్రమాదకరంగా మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాలకు తరలిస్తున్నారు. రేషన్ బియ్యాన్ని సంచుల్లో మూటలు కట్టి రాత్రి సమయాల్లో జలమార్గం ద్వారా మహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని కౌటాల మండలం ప్రాణహిత నదికి సరిహద్దు గ్రామాలు తుమ్మిడిహెట్టి, రణవెల్లి, బూరపెల్లి, కోర్సిని, వార్ధా నది సరిహద్దు గ్రామాలు గుండాయిపేట, వీర్ధండి, తాటిపల్లి, లోనవెల్లి, సాండ్గాం గ్రామాల మీదుగా నది మార్గన తరలించి సొమ్ము చేసుకుంటూ అధికారులకు సవాళ్లు విసురుతున్నారు. కొందరు అక్రమార్కులు రైలు మార్గన సైతం మహారాష్ట్రకు బియ్యం తరలిస్తూ దందా చేస్తున్నారు. -
ఏఐ బోధన సద్వినియోగం చేసుకోవాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): కృత్రిమ మేధ(ఆర్టిఫిషియ ల్ ఇంటిలిజెన్స్)తో కూడిన విద్యా బోధనను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శనివారం మండలంలోని తక్కళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ విద్యాబోధనను ప్రారంభించారు. ఈ సందర్భంగా పదోతరగతి విద్యార్థులకు బోధనను అందించే కంప్యూటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తొలి విడతగా చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం 4 పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ల్యాబ్లను రాష్ట్ర ప్రభుత్వం, ఏక్ స్టెప్ ఫౌండేషన్ల సహకారంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో మరికొన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. భాష, గణిత సామర్థ్యాల సాధనను పెంపొందించేందుకు ఈ విద్యాబోధన ఎంతగానో దోహదపడుతుందన్నారు. కృత్రిమ మేధస్సును విద్యారంగంలో అమలు చేయడం విప్లవాత్మకమైన ఆలోచన అన్నారు. ప్రాథమిక స్థాయిలో భాష, గణితంలలో అభ్యాసన సామర్ాధ్యలతో పాటు కృత్రిమ మేధ సాయంతో ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విద్యార్థుల్లో మెరుగైన సామర్ాధ్యలను సాధించడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపించాలన్నారు. తక్కళ్లపల్లి పాఠశాలలో మార్పులు తీసుకువచ్చిన ప్రధానోపాధ్యాయుడితో పాటు ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామ్మోహన్రావు, ఎంపీడీవో శంకరమ్మ, సమన్వయ కర్త శ్రీనివాస్, హెచ్ఎం మహేశ్వర్, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం శంకరమ్మ, తదితరులు పాల్గొన్నారు. ఏఐతో మరింత నైపుణ్యంకెరమెరి(ఆసిఫాబాద్): ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్)తో విద్యార్థులు మరింత నైపుణ్యం సాధిస్తారని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం గోయగాం ఉన్నత పాఠశాలలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ఏఐ విద్యాబోధన కేంద్రాన్ని ప్రారంభించారు. తెలుగు, గణితం, ఆంగ్లంలో ఏఐ బోధనను పరిశీలించారు. ఈ సందర్భంగా అమ్మ ఆదర్శ పాఠశాల సభ్యులతో పాటు పోషకులకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగు, గణితం, ఆంగ్లంలో వెనుకబడిన విద్యార్థులను ఎంపిక చేసి వారికి సులభంగా అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేసేందుకు ఏఐ పద్ధతిని అవలంబిస్తున్నామన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం రానున్న రోజుల్లో ప్రతీ పాఠశాలకు చేరుతుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులకు సద్వినియోగం చేయాలని, ప్రతీరోజు పిల్లలను బడికి పంపించాలని పోషకులను కోరారు. అనంతరం ఝరి ఉన్నత పాఠశాలను సందర్శించి అక్కడ జరుగుతున్న పెయింటింగ్ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈవో ఆడే ప్రకాశ్, ఝరి హెచ్ఎం భరత్కుమార్, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ వెంకటేష్ దోత్రే -
‘అంగన్వాడీల ధర్నా విజయవంతం చేయాలి’
ఆసిఫాబాద్అర్బన్: అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని ఈనెల 17, 18 తేదీల్లో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న 48 గంటల ధర్నా విజయవంతం చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి త్రివేణి పిలుపునిచ్చారు. ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసే పీఎంశ్రీ పథకాన్ని, మొబైల్ అంగన్వాడీ సెంటర్ను వెంటనే రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన జాతీయ విద్యావిధానం చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా ఆపాలని, అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని శనివారం జిల్లా కేంద్రంలో ఐసీడీఎస్ పీడీ భాస్కర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఐసీడీఎస్ను ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని, పేద ప్రజలతో పాటు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్లకు నష్టం వాటిల్లే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు వనిత, సువర్ణ, వినోద, అంజలి, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. -
మిషన్ భగీరథ నీళ్లు వచ్చేదెప్పుడు?
దహెగాం: కాగజ్నగర్ మండలం అందవెల్లి పెద్దవా గుపై కూలిన వంతెన స్థానంలో మరోవంతెన ని ర్మించారు. అప్రోచ్ రోడ్డు పనులు ప్రారంభించి నెల రోజులు కావస్తోంది. భగీరథ పైప్లైన్ కనెక్షన్ తొలగించి కూడా నెల దాటింది. అప్పటి నుంచి దహెగాం, భీమిని, కన్నెపల్లి మండలాల్లోని 64 గ్రామాల కు భగీరథ నీటి సరఫరా నిలిచి పోయింది. అప్రోచ్ రోడ్డు పనులు పూర్తయి వారంరోజులు కావస్తోంది. ప్రస్తుతం రివిట్మెంట్ పనులు కొనసాగుతుండగా అందుకు వాడే బండరాళ్లను రోడ్డుపై పైప్లైన్కు అడ్డుగా వేయడంతో పనులు చేయలేక పోతున్నామ ని భగీరథ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో నాలుగు మండలాల్లోని 64 గ్రామాల ప్రజలు తాగు నీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఆర్అండ్బీ అధి కారులు పనులు పూర్తి చేయలేక పోవడంతో తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని పలువురు వాపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి భగీరథ పైప్లైన్ వేయడానికి అడ్డుగా ఉన్న బండరాళ్లను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
వన్యప్రాణుల వేటగాళ్ల అరెస్ట్
పెంచికల్పేట్: మండలంలోని అగర్గూడ అటవీ ప్రాంతంలో నీలుగాయిని హతమార్చి న నలుగురిని అరెస్ట్ చేసినట్లు పెంచికల్పేట్ డిప్యూటీ రేంజ్ అధికారి జమీల్ శనివారం తెలిపారు. శుక్రవారం రాత్రి కొమ్ముగూడ–అగర్గూడ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కని పించడంతో అదుపులోకి తీసుకుని రేంజ్ కార్యాలయానికి తరలించి విచారించగా అగర్గూడ బీట్ పరిధిలో విద్యుత్ తీగలను అమర్చి నీలుగా యిని హతమార్చినట్లు అగీకరించారన్నారు. సంఘటన స్థలానికి తీసుకెళ్లి వేటాడటానికి ఉపయోగించిన తీగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నీలుగాయిని వేటాడిన పెంచికల్పేట్కు చెందిన అప్పాజి శ్రీనివాస్, అప్పాజి వెంకటేశ్, మేకల ర మేశ్, ఒడ్డుగూడకు చెందిన బీంకరి తిరుపతిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు వెల్లడించారు. ఆయన వెంట బీట్ అధికారులు సతీశ్, సంగదీప్, మహేష్, దినేష్, సిబ్బంది ఉన్నారు. -
‘మధ్యవర్తుల వ్యవస్థపై చర్యలు తీసుకోవాలి’
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కా ర్యాలయంలో కొనసాగుతున్న మధ్యవర్తి వ్యవస్థపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ, టీఏజీఎస్ నాయకులు శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఏవో మధుకర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీఏజీఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలశ్రీ, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్ మాట్లాడుతూ జిల్లాలో వాహనాల రిజిస్ట్రేషన్లు, లైసెన్స్ల కోసం ఆన్లైన్లో అప్లై చేసుకుని ఆర్టీవో కార్యాలయానికి వెళ్తే మధ్యవర్తులతో రావాలని వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వేరే అవకాశం లేక తప్పని పరిస్థితుల్లో మధ్యవర్తులతోనే పనులు చేయించుకోవాల్సి వ స్తోందన్నారు. అమాయకులను ఆసరా చేసుకుని అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారన్నారు. కా ర్యాలయంలో ఏ వాహనానికి ఎంత చలాన్ చెల్లించాలో ధరల పట్టిక కూడా పెట్టడం లేదన్నారు. -
31లోగా ఎల్ఆర్ఎస్ రుసుం చెల్లిస్తే 25 శాతం రాయితీ
ఆసిఫాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఎల్ఆర్ఎస్ రుసుం ఈ నెల 31లోగా చెల్లిస్తే 25 శాతం రాయితీ వర్తిస్తుందని జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్ అన్నారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చే సిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దరఖాస్తుదారులకు వివరాలందించేందుకు కాల్సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. దరఖా స్తుదారులు lrs.telangana.gov.in ద్వారా వివరాలు తెలుసుకోవచ్చన్నారు. సందేహాలు నివృత్తి చేసుకునేందుకు కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు. సమావేశంలో జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
సీఎం దిష్టిబొమ్మ దహనం
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆదేశాల మేరకు శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. వారు మాట్లాడుతూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్రెడ్డిని శాసనసభ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెన్షన్ వేటు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు అలీబిన్ అహ్మద్, సంజీవ్కుమార్, పెంటు, అజయ్కుమార్, మల్లేశ్, నిసార్, రాజు, తుకారాం, శ్రీధర్, భీమేశ్, వినోద్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
మేలుకో.. తెలుసుకో..
రెండేళ్ల క్రితం తాండూరు మండలం కాసిపేటకు చెందిన కస్తూరి శివకృష్ణ జిల్లా కేంద్రంలోని ఓ షోరూంలో బైక్ కొనుగోలు చేశాడు. ఆ బైక్ బ్యాటరీ రెండేళ్ల వారంటీ ఉండగా.. ఏడాదికే పాడైంది. దీనిపై షోరూం వాళ్లను అడిగితే కి.మీ. సాకు చూపిస్తూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసి షోరూంపై న్యాయపోరాటం చేస్తున్నాడు. మంచిర్యాలకు చెందిన వెంకటేశ్ ఆన్లైన్ ఉత్పత్తుల కంపెనీపై ఫిర్యాదు చేశాడు. తనకు నాసిరకం వస్తువు అంటగట్టారని ఆ కంపెనీపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వినియోగదారులు నాణ్యమైన సేవలు పొందడంలో చాలా చోట్ల మోసపోతూనే ఉన్నారు. డబ్బులు చెల్లించి కంపెనీ ఉత్పత్తుల పేర్లు, బరువు, నాణ్యత, కల్తీ, ఉత్పత్తుల్లో మోసాలతోపాటు నిబంధనల మేరకు సర్వీస్ అంద డం లేదు. నిత్యం వినియోగించే ఉప్పు, పప్పు నుంచి తినే తిండే, తాగే నీళ్లు, విలువైన వస్తువులు మా ర్కెట్లో జరిగే ప్రతీ లావాదేవీలు, పౌరసేవల్లో మో సం, నిర్లక్ష్యం తప్పడం లేదు. వస్తువులు, సరుకులు కొనుగోలు చేసే సమయంలో అవగాహన లోపం, సేవలు పొందడం తెలియక చాలామంది వినియోగదారులు మోసపోతున్నారు. చాలా సంస్థలు నాసిరకం వస్తువులు, సరుకులు తయారు చేసి వినియోగదారులకు అంటగడుతున్నాయి. వినియోగ దారుల ప్రయోజనాలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నాయి. దీనిని నివారించేందుకు కేంద్రం ప్ర త్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. ఇదివరకు ఏ వస్తువునైనా షాపులోకి వెళ్లి నేరుగా కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం చాలా మంది ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. దీంతో మోసాలు సైతం మరింతగా పెరిగిపోతున్నాయి. హక్కులను మరింతగా రక్షించేందుకు కన్జూమర్ కమిషన్ కీలకపాత్ర పోషిస్తుంది. వేల కేసుల పరిష్కారానికి చొరవ చూపింది. నష్టపోయినదానికంటే అధికంగా పరిహారం అందించి బాధితులకు అండగా నిలిచింది. జిల్లాలో పలువురు విని యోగదారుల హక్కులపై పోరాటం చేస్తున్నారు. ఆయా సంబంధిత శాఖ అధికారులు నిత్యం తనిఖీలు చేస్తూ.. పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నా చూసీచూడనట్లుగా వదిలేయడంతో వినియోగదారులకు నష్టం జరుగుతోంది. అవగాహనే శ్రీరామ రక్ష..ప్రజల శ్రేయస్సు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకొచ్చినా అవగాహన లేమితో అవి మెరుగైన ఫలితాలను సాధించడం లేదు. ప్ర స్తుత సాంకేతిక యుగంలోనూ ఎందరో వినియోగదారులకు తమ హక్కులపై సరైన చైతన్యం లేకుండా పోయింది. తమకు జరిగిన అన్యాయంపై కనీ సం ఫిర్యాదు సైతం చేయకుండా పోతున్నారు. న చ్చిన వస్తువుల సేవలు ఎంచుకోవడంతో పాటు వా టి నాణ్యత, పనితీరు గురించి తెలుసుకోవడం, అ భిప్రాయం తెలియజేయడం తదితర హక్కులు విని యోగదారులకు ఉంటాయి. వస్తుసేవల విషయంలో సమస్య తలెత్తితే వాటి విలువ ఆధారంగా జిల్లా, రాష్ట్ర, జాతీయ కమిషన్లను ఆశ్రయించవచ్చు. వస్తువు చిన్నదైనా.. పెద్దదైనా.. మోసాలే తయారీ, తూకం, నాణ్యత, ధరల్లో మాయాజాలం సేవల్లో వినియోగదారులకు తప్పని తిప్పలు నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంమంచిర్యాలకు చెందిన శ్రవణ్కుమార్ సినిమా థియేటర్లో నిబంధనలకు విరుద్ధంగా వాహనాల పార్కింగ్ ఫీజులు తీసుకుంటున్నారని వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేశాడు. థియేటర్ లోపల తినుబండారాలు, శీతల పానీయాలను ఎమ్మార్పీ కన్నా ఎక్కువకు విక్రయిస్తున్నాడని ఫిర్యాదు చేశాడు. ఈ రెండూ ప్రస్తుతం విచారణలో ఉన్నాయి.హక్కులు, బాధ్యతలు ఉన్నాయి వినియోగదారులకు నాణ్యమైన సేవలు పొందే హక్కులు ఉన్నాయి. అదే సమయంలో బాధ్యతలు ఉన్నాయి. ప్రతీ ఒక్కరు తమ హక్కులు పొందేలా అవగాహన ఉండాలి. మా సంస్థ తరఫున మోసపోయిన వినియోగదారులకు మద్దతుగా నిలుస్తున్నాం. –టి.చేతన సోనీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వినియోగదారుల హక్కుల సంస్థప్రశ్నిస్తేనే న్యాయంవినియోగదారుల సంరక్షణ చట్టం ప్రకారం తయారీ, నాణ్యత, తూకం, ప్రామాణిక ముద్ర, గడువు, ధర, జీఎస్టీ, తదితరాలు కచ్చితంగా ఉండాలి. చెల్లించిన ధరకు సేవలు పొందాలి. కానీ ఎక్కడైనా సేవల్లో అంతరాయం ఏర్పడితే కొందరే ప్రశ్నిస్తున్నారు. న్యాయం కోసం పోరాడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలోనే వినియోగదారుల వివాదాల పరిష్కారానికి కమిషన్ ఉంది. 2024లో మొత్తం 163 ఫిర్యాదులు రాగా, ఇందులో 29 పరిష్కరించగా, మరో 134 పెండింగ్లో ఉన్నాయి. కొన్ని కేసుల్లో ఆయా కంపెనీల, తయారీదారులపైనా జరిమానాలు విధించారు. ప్రస్తుతం వినియోగదారులు ఆన్లైన్లోనూ సెంటర్ అండర్ కన్జూమర్ కోఆర్డినేషన్ కౌన్సిల్ (సీసీసీ), ఈ జాగృతి వెబ్సైట్, హెల్ప్లైన్ 1915కు కాల్ చేయెచ్చు. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలని నిరసన
ఆసిఫాబాద్రూరల్: పెండింగ్ వేతనాలు చె ల్లించాలని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట శుక్రవారం గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న వర్కర్లు సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి దినకర్ మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న వర్కర్లకు ఏడు నెలలుగా వేతనాలు రావడం లేదన్నారు. హోలీ పండు గ రోజు సైతం సమ్మె చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆశ్రమ పాఠశాల వర్కర్లు రాము, పద్మ, పుష్పలత తదితరులు పాల్గొన్నారు. -
ఏఐ బోధనకు సిద్ధం
● జిల్లాలో నాలుగు పాఠశాలలు ఎంపిక ● ఒక్కో పాఠశాలలో పది మంది విద్యార్థులకు బోధన ● కనీస సామర్థ్యాల పెంపే లక్ష్యం ● నేటి నుంచి తరగతులు ప్రారంభంజిల్లాలో ఎంపికై న పాఠశాలలుకెరమెరి(ఆసిఫాబాద్): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలు పెంచేందుందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందు కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీ సాయం తీసుకునేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మొదటి విడతలో నాలుగు ప్రాథమిక పాఠశాలల్లో ఏఐ పాఠాలు బోధించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే విద్యాశాఖ 1 నుంచి ఐదో తరగతి వరకు ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ(ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమం అమలు చేస్తోంది. ఉపాధ్యాయులకు శిక్షణ అందించడంతోపాటు టీచింగ్, లర్నింగ్, పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్స్, హ్యాండ్బుక్స్ ముద్రించి సరఫరా చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ ఏఐ ద్వారా ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాం మరింత మెరుగ్గా అమలు చేయనున్నారు. నేటి నుంచి ప్రారంభం..ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం పెరిగింది. అన్నిరంగాల్లో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. ఈ సాంకేతికత సాయంతో ప్రాథమిక విద్య మరింత బలోపేతం కానుంది. పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలోని నాలుగు ప్రాథమిక పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. శనివారం నుంచి ఎంపిక చేసిన పాఠశాలల్లో ఏఐ కార్యక్రమాలు చేపట్టనున్నారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రేతోపాటు అదనపు కలెక్టర్లు, అధికారులు ఆయా పాఠశాలల్లో ఏఐ బోధనను అధికారికంగా ప్రారంభించనున్నారు. పది మంది విద్యార్థులు ఎంపిక..ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు ఆశించిన స్థాయిలో అభ్యనన సామర్థ్యాలు, చతుర్విద ప్రక్రియల్లో వెనుకబడుతున్నారు. ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నా ఫలితాలు మెరుగుపడడం లేదు. ఈ నేపథ్యంలో 3, 4, 5 తరగతుల విద్యార్థుల్లో సీ గ్రేడ్లో ఉన్న సామార్థ్యాలను మెరుగుపర్చడం కోసం చర్యలు చేపట్టారు. జిల్లాలోని తక్కెళ్లపల్లి, గోయగాం, ఖిరిడి, సలుగుపల్లి ప్రాథమిక పాఠశాలల నుంచి పది మంది చొప్పున విద్యార్థులను ఎంపిక చేశారు. ఆయా స్కూళ్లలో వెనుకబడిన విద్యార్థులను ఏఐ పాఠాల కోసం సంసిద్ధం చేశారు. ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులు సమీప ఉన్నత పాఠశాలల్లోని కంప్యూటర్లను వినియోగించనున్నారు. బోధన ఇలా..ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా పిల్లలను ఆకట్టుకునేలా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధన సాగనుంది. 3, 4, 5 తరగతుల నుంచి ఎంపిక చేసిన విద్యార్థుల నుంచి ఐదుగురి చొప్పున ఒక బ్యాచ్ను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బ్యాచ్కు తెలుగువాచకం, గణితం అభ్యాసాలపై 20 నిమిశాల వ్యవధిలో ఏఐ పాఠాలు బోధించనున్నారు. సదరు విద్యార్థి పాఠ్యాంశం అర్థం చేసుకుంటున్నాడా..? లేదా అని గుర్తించి.. అర్థం కాకుంటే సరైన మార్గంలో బోధన సాగిస్తుంది. ప్రతీ విద్యార్థి అభ్యసన సామార్థ్యాలు మదింపు చేయడంతోపాటు గతంతో పోలిస్తే పురోగతి ఎలా ఉందో పరిశీలించి నివేదిక రూపొందించనున్నారు. వారంలో నాలుగు రోజులు ఏఐ పాఠాల బోధన సాగనుంది. విద్యార్థులకు ఉపయోగం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపునకు ప్రస్తుతం ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం అమల్లో ఉంది. మరింత మెరుగైన సామర్థ్యాలు సాధించేందుకు అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో మొదటి విడతలో నాలుగు ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేశాం. ఆయా పాఠశాలల్లో శనివారం నుంచి ఏఐ బోధన ప్రారంభమవుతుంది. విద్యార్థులకు చదవడం, రాయడం, లెక్కలు చేయడం వంటి సామర్థ్యాల పెంపుకు ఏఐ ఎంతో ఉపయోగపడుతుంది. – ఉప్పులేటి శ్రీనివాస్, జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ మండలం పాఠశాల విద్యార్థులు రెబ్బెన తక్కెళ్లపల్లి 10 కెరమెరి గోయగాం 10 వాంకిడి ఖిరిడి 10 బెజ్జూర్ సలుగుపల్లి 10 -
మార్చిలోనే 40 డిగ్రీల ఎండ
● పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు ● గతేడాదితో పోల్చితే అధికం తిర్యాణి(ఆసిఫాబాద్): వేసవి ప్రారంభంలోనే సూర్యుడు సుర్రుమంటున్నాడు. రోజురోజుకూ ప గటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వేడి, ఉక్కపోత కారణంగా ప్రజలు మధ్యాహ్నం బయటికి రాలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. మార్చిలో నే పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్గా నమో దు కావడం ఎండల తీవ్రతకు అద్దం పడుతోంది. 40 డిగ్రీలు దాటిన గరిష్ట ఉష్ణోగ్రతలుజిల్లాలోని రెబ్బెనలో బుధవారం అత్యధికంగా 40.6 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది రాష్ట్రంలోనే రెండో గరిష్ట ఉష్ణోగ్రత.. గతేడాది మార్చి 12న రెబ్బెనలో 38.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ ఏడాది గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు అధికంగా నమోదు కావడం విశేషం. జిల్లాలో గడిచిన మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య రికార్డవుతున్నాయి. తాజాగా బుధవారం రెబ్బెనలో 40.6 డిగ్రీల సెల్సియస్గా నమోదు కాగా, కౌటాల, బెజ్జూర్లో 40.5, కెరమెరి, దహెగాం, తిర్యాణి మండలాల్లో 40.4, ఆసిఫాబాద్లో 40.3, పెంచికల్పేట్లో 40.2, సిర్పూర్(టి)లో 40.1, చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్లో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని 15 మండలాలకు పది మండలాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. రానున్న మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరగడంతో పాటు వడగాలులు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో ఆత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. నిర్మానుష్యంగా రోడ్లుజిల్లాలో మూడు రోజులుగా ఎండలు పెరగడంతో పగటిపూట రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. గాలిలో తేమశాతం తగ్గడంతో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో రోజంతా కూలర్లకే అతుక్కుపోతున్నారు. ఎండల నేపథ్యంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఇప్పటికే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి అప్రమత్తం చేశారు. ఉపాధిహామీ కూలీలు ఉదయం 9 గంటలకే పనులు పూర్తి చేసుకుని ఇళ్లకు చేరుకుంటున్నారు. జ్యూస్ సెంటర్లు, కొబ్బరిబొండాలు, కీరదోసకాయల దుకాణాలకు జనాల తాకిడి పెరిగింది. -
గుడ్డు ధరలు పెంపు
● ‘మధ్యాహ్న’ ఏజెన్సీ మహిళలకు ఊరట ● సర్కారు పాఠశాల విద్యార్థులకు ప్రయోజనం ● రూ.5నుంచి రూ.6కు పెంచుతూ ఉత్తర్వులు జారీ మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అందిస్తున్న కోడిగుడ్డు ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వారంలో మూడు రోజులు గుడ్డు అందిస్తోంది. ఇటీవల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ధరాభారం తాము మోయలేమంటూ మధ్యాహ్న భోజన వంట ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కొన్ని పాఠశాలల్లో వారంలో గుడ్డుకు బదులు అరటిపండు ఇస్తుండగా.. ఇంకొందరు వారంలో ఒక గుడ్డుతో సరిపెడుతున్నారు. కోడిగుడ్డు కొనుగోలు అంటేనే వంట ఏజెన్సీ మహిళలు తమవైపు గుర్రుగా చూస్తున్నారని టీచర్లు వాపోయిన సందర్భాలు లేకపోలేదు. మార్కెట్లో గుడ్డు ధరలకు ప్రభుత్వం చెల్లించే ధరల్లో వ్యత్యాసం ఉండడంతో ఏజెన్సీలకు అదనపు భారంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గుడ్డు ధరను ఒక రూపాయి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. కోడిగుడ్డు ధర రూ.5నుంచి రూ.6 వరకు పెంచింది. దీంతో ఏజెన్సీ మహిళలకు ఉపశమనం కలుగనుంది. ఆకాశాన్నంటిన ధరకోడిగుడ్డు ధర బహిరంగ మార్కెట్లో ఆకాశాన్ని అంటుతోంది. మధ్యాహ్న భోజన తయారీ ఏజెన్సీలకు భారంగా మారుతోంది. మంచిర్యాల జిల్లాలోని 747 పాఠశాలల్లో 37,241మంది విద్యార్థులు, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని 732 ప్రభుత్వ పాఠశాలల్లో 43,110 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60ః40 నిష్పత్తిలో నిధులు విడుదల చేస్తాయి. తొమ్మిది, పది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు వండి పెట్టేందు కు రూ.6.19, 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు రూ.9.29 స్లాబ్ ధరలతోపాటు కోడిగుడ్డుకు అదనంగా రూ.5 రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. 9, 10వ తరగతుల వరకు రూ.10.68 పైసలు బిల్లులో కోడిగుడ్డు ధర కలిపి ఇస్తున్నారు. మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం బియ్యం సరఫరా చేస్తోంది. కూరల కోసం పప్పు, కూరగాయలు, నూనెను వంట ఏజెన్సీ మహిళలు సమకూర్చుకుంటారు. విద్యార్థులందరికీ సోమ, బుధ, శుక్రవారాల్లో మధ్యాహ్న భోజనంలో ఉడికించిన కోడిగుడ్డు అందించాలి. గతంలో గుడ్డుకు రూ.4 చెల్లించే ప్రభుత్వం 2022లో అప్పటి ధరల ప్రకారం రూ.5కు పెంచింది. కానీ కొద్ది నెలలుగా గుడ్డు ధర అమాంతం పెరగడంతో చాలా పాఠశాలల్లో వారానికి ఒకటి, రెండుసార్లు మాత్రమే వడ్డిస్తున్నారు. దీంతో విద్యార్థులు పోషకాహారానికి దూరం అవుతున్నారు. ఒక్కో గుడ్డుకు రూ.5 ప్రభుత్వం చెల్లిస్తుండగా.. ప్రస్తుత మార్కెట్లో రూ.6.50 నుంచి రూ.7వరకు పలుకుతున్న సందర్భాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇంకెంత పెరుగుతుందోనని ఏజెన్సీ నిర్వాహకులు ధరలు పెంచాలని ఆందోళన చేశారు. ఇటీవల మధ్యాహ్న భోజనం వంట ధరలను పెంచుతూ కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పెంచిన ధరలు డిసెంబర్ ఒకటి నుంచి అమల్లోకి తెచ్చారు. కేంద్రం ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. రెండేళ్ల తర్వాత మధ్యాహ్నం భోజనం వంట ధరల పెంపుతో ఏజెన్సీలకు కాస్త ఊరట కలిగిస్తోంది. మూడు రోజులు అందించాలి కోడిగుడ్డు ధరలు పెంచుతూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. మార్కెట్లో గుడ్డు ధరలు పెరగడం వల్ల ఏజెన్సీల నిర్వాహకులు కొంత ఇబ్బంది పడిన విషయం తెలియంది కాదు. రూపాయి పెంచడం వల్ల ఏజెన్సీలు, విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. పోషకాలు అందించేందుకు విద్యార్థులకు విధిగా వారానికి మూడు రోజులు ఉడకబెట్టిన గుడ్డు అందించాల్సిందే. – యాదయ్య, డీఈవో -
‘అపార్’ నమోదు వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్రూరల్: విద్యార్థుల అపార్ గుర్తింపు కా ర్డుల నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అపార్ గుర్తింపు సంఖ్య అందించాలన్నారు. వేసవిలో పాఠశాలల్లో తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమగ్ర శిక్ష అభియాన్ కింద అమలు చేస్తున్న కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు. వసతి గృహాల్లోని విద్యార్థుల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్డీవో లోకేశ్వర్రావు, డీటీడీవో రమాదేవి, ఎస్వోలు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
వేసవి వేడి.. ఒంటిపూట బడి
● ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు ● ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు అమలు ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ● ‘పది’ పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి స్కూళ్లుకెరమెరి(ఆసిఫాబాద్): మార్చిలోనే భానుడు తన ప్ర తాపం చూపుతున్నాడు. ఎండల తీవ్రత పెరిగిన నే పథ్యంలో ఈ నెల 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగనున్నాయి. ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించనున్నారు. జిల్లాలో 1,273 పాఠశాలలుజిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, ఆశ్రమ, ఆదర్శ, గురుకులాలు, కేజీబీవీలు మొత్తం 1,273 పాఠశాలలు ఉ న్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆయా స్కూళ్లలో 98వేల మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్యాన్లు లేవు. నల్లాలు ఏర్పాటు చేసినా భగీరథ నీటి కనెక్షన్ ఇవ్వలేదు. ఎండల తీవ్రత పెరగడంతో విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. డీహైడ్రేషన్, వడదెబ్బ, నీరసంతో అనారోగ్యం బారిన పడతారు. ఎండ, వేడి కారణంగా అలసటకు గురవుతారు. ఈ నేపథ్యంలో ఏటా ప్రభుత్వం వేసవిలో ఒంటిపూట బడులు నిర్వహిస్తుంది. 21 నుంచి ‘పది’ వార్షిక పరీక్షలుఈ నెల 21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రా రంభం కానున్నాయి. జిల్లాలోని 174 ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చే యనున్నారు. ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేసిన ఉ న్నత పాఠశాలల్లో మాత్రం తరగతులు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అకాడమిక్ క్యాలెండర్ ప్రకా రం ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించనున్నారు. మోడి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థినులుపాఠశాలల పనివేళలు ఇలా..మొదటి గంట ఉదయం 8 గంటలు రెండో గంట ఉదయం 8:05 గంటలు ప్రార్థన ఉ.8:05 నుంచి 8:15 మొదటి పీరియడ్ 8:15 నుంచి 8:55 రెండో పీరియడ్ 8:55 నుంచి 9:35 మూడో పీరియడ్ 9:35 నుంచి 10:15 స్వల్ప విరామం 10:15 నుంచి 10:30 నాలుగో పీరియడ్ 10:30 నుంచి 11:10 ఐదో పీరియడ్ 11:10 నుంచి 11:50 ఆదో పీరియడ్ 11:50 నుంచి మధ్యాహ్నం 12:30జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎండల నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య రక్షణకు ఉపాధ్యాయులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలి. – యాదయ్య, జిల్లా విద్యాధికారి -
జిల్లాకు 47 మంది జూనియర్ లెక్చరర్లు
ఆసిఫాబాద్రూరల్: టీజీపీఎస్సీ నిర్వహించిన పరీక్షలో జూనియర్ లెక్చరర్లుగా ఎంపికై న వారు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం జి ల్లాకు 47 మంది జూనియర్ లెక్చర్లర్లను కే టాయించిందని డీఐఈవో కళ్యాణి తెలిపారు. జిల్లా కేంద్రంలో గురువారం పలువురు విధుల్లో చేరారు. కాగా, జిల్లాలో పదేళ్లుగా 61 మంది అతిథి అధ్యాపకులు పనిచేస్తున్నారు. నూతన అధ్యాపకులు చేరడంతో ఉపాధి కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు విద్యా వ్యవస్థలో అవకాశం కల్పించాలని కోరుతున్నారు. -
వసతుల కల్పనకు చర్యలు
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. మండలంలోని కౌటగూడ, జన్కాపూర్ అంగన్వాడీ కేంద్రాలను గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో మంజూరైన మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. చిన్నారులకు ఇబ్బందులు లేకుండా తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం అందించే పోషకాహారం గర్భిణులు, పిల్లలకు సక్రమంగా అందించాలన్నారు. వేసవిలో ఇబ్బందులు లేకుండా నిత్యం సూపర్వైజర్లు సెంటర్లను సందర్శించాలని సూచించారు. కాలం చెల్లిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించొద్దన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, జిల్లా పోషణ్ అభియాన్ సమన్వయకర్త గోపాలకృష్ణ, సూపర్వైజర్లు లైలా, పెంటుబాయి తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్కు వచ్చే ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలిఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్కు వివిధ పనులకు వచ్చే ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫ్రిడ్జ్ను పరిశీలించారు. ఎండల నేపథ్యంలో ప్రతీ సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రజలకు చల్లని తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఏవో మధుకర్ను ఆదేశించారు. ఫ్రిడ్జ్లో లోపాలుంటే వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. -
నెలరోజులుగా ‘భగీరథ’ బంద్
● అందవెల్లి వంతెన అప్రోచ్ రోడ్డు పనులతో పైప్లైన్ తొలగింపు ● పనులు పూర్తయినా నీటి సరఫరా పునరుద్ధరించని అధికారులు ● నాలుగు మండలాల్లోని ప్రజలకు తాగునీటి ఇబ్బందులుదహెగాం(సిర్పూర్): మిషన్ భగీరథ నీటి సరఫరా నెల రోజులుగా నిలిచిపోయింది. ఓ వైపు ఎండలు మండుతుండగా.. నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. కాగజ్నగర్ మండలం అందవెల్లి వద్ద పెద్దవాగుపై నిర్మించిన వంతెన అప్రోచ్ రోడ్డు పనులు ఫిబ్రవరి 12న ప్రారంభించారు. వంతెన పైనుంచి భగీరథ పైప్లైన్ ఉండటంతో అప్రోచ్ పనుల సమయంలో ఆ పైప్లైన్ తొలగించారు. అప్పటి నుంచి భగీరథ నీటి సరఫరా కావడం లేదు. నెల రోజులైనా పునరుద్ధరించకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు తాగునీటికి తంటాలు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో పంచాయతీ ట్రాక్టర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా..నెల రోజులుగా భగీరథ పథకం నీటి సరఫరా నిలి చిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో విద్యుత్ బోర్ల వద్దకు వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. దహెగాం మండలం ఒడ్డుగూడ, బామానగర్, ఐనం గ్రామాల్లో తీవ్రమై న నీటి ఎద్దడి ఉన్నందున పంచాయతీల ఆధ్వర్యంలో ట్యాంకర్లను ఏర్పాటు చేస్తున్నారు. చిన్న ఐనంలో తాగునీటి ఎద్దడిపై ‘సాక్షి’లో కథనాలు ప్రచురించడంతో అధికారులు స్పందించి వాగు వద్ద బోరు కు మోటర్ బిగించి సమస్యను పరిష్కరించారు. మిగిలిన గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు కొనసాగుతున్నాయి. పట్టించుకోని అధికారులు..నెల రోజులుగా గడుస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. గ్రామాల్లోని చేతిపంపుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ఎడ్లబండ్ల ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. వంతెన వద్ద అప్రోచ్ రోడ్డు పనులు పూర్తయి మూడు రోజులు కావొస్తున్నా పైప్లైన్ పనులు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మూడు రోజుల్లో పూర్తి చేస్తాం అందవెల్లి పెద్దవాగు వద్ద వంతెన అప్రోచ్ పనులు ప్రారంభించడంతో భగీరథ పైప్లైన్ కనెక్షన్ తొలగించాం. అప్రోచ్ పనులు పూర్తయిన నేపథ్యంలో మూడు రోజుల్లో పైప్పైన్ పనులు పూర్తి చేస్తాం. నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. త్వరలో తాగునీటి సరఫరాను పునరుద్ధరిస్తాం. – సాయికృష్ణ, భగీరథ ఏఈ64 గ్రామాలకు బంద్..అందవెల్లి పెద్దవాగు వంతెన వద్ద భగీరథ పైప్లైన్ తొలగించడంతో వంతెన అవతలి వైపు 64 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. అసలే వేసవి కావడంతో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతోంది. కాగజ్నగర్ మండలంతోపాటు కన్నెపల్లి, భీమిని, దహెగాం మండలాల్లో 64 గ్రామాలకు ఈ పైప్లైన్ ద్వారానే నీటి సరఫరా జరుగుతుంది. నెల రోజులుగా పైప్లైన్ కనెక్షన్ తొలగించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందవెల్లి పెద్దవాగు వంతెన వద్ద అప్రోచ్ పనులు మూడు రోజుల క్రితమే పూర్తి చేశారు. అయినా పైప్లైన్ మరమ్మతులు చేపట్టడం లేదు. -
సమస్య ఉంటే సమాచారం ఇవ్వాలి
దహెగాం(సిర్పూర్): విద్యుత్ సరఫరాలో సమస్యలు ఉంటే వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించాలని ట్రాన్స్కో ఏఈ శేషారావు అన్నారు. మండల కేంద్రంలో గురువారం ట్రాన్స్కో ఆధ్వర్యంలో పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రైతులు సాగు మోటార్లకు స్టార్టర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం పంటల సాగుకు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తుందని పేర్కొన్నారు. విద్యుత్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. కార్యక్రమంలో డీఈ నాగరాజు, ఏఈ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యంపై ప్రతిఒక్కరూ శ్రద్ధ వహించాలి
● ఎస్పీ డీవీ శ్రీనివాసరావుఆసిఫాబాద్అర్బన్: పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్లో బుధవారం హైదరాబాద్ కేర్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ఈసీజీ, షుగర్, బీపీ, పల్స్రేట్, 2డీ ఏకో తదితర వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఆరోగ్యమే మహా భాగ్యమని, ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవ చేసే పోలీసులు ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రభాకర్రావు, డీఎస్పీ కరుణాకర్, సీఐ రాణాప్రతాప్, ఆర్ఐ పెద్దన్న, సీఐ రవీందర్, డీసీఆర్డీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, సిబ్బంది శంకర్రెడ్డి, విజయ్, సీనియర్ ఆర్థో సర్జన్ విశ్వనాథ్, కార్డియాలజిస్ట్ సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రుణాల పేరుతో మోసం!
● కాగజ్నగర్లో రూ.లక్షలు కాజేత ● లబోదిబోమంటున్న బాధిత మహిళలు సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మహిళలకు సులువుగా రుణాలు ఇస్తామని చెప్పి రూ.లక్షలు వసూళ్లు చేసి మోసం చేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ నెల 7న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో ముగ్గురు వ్యక్తులు తాము ఆంధ్రా నుంచి వచ్చామని చెప్పుకుంటూ కాలనీల్లో ఇంటింటికీ తిరిగారు. మహిళలకే రుణాలు అంటూ, ఒక్కొక్కరికి కనీసం రూ.50వేల చొప్పున రుణాలు ఇస్తామని నమ్మించారు. ముందుగా మహిళలు గ్రూప్గా ఏర్పాటు చేసుకోవాలంటూ ఒక్కొక్కరి నుంచి రూ.3వేల చొప్పున వసూలు చేశారు. అలా పట్టణంలోని విజయ్ బస్తీ, కోసిని, సర్దార్బస్తీ, తదితర కాలనీలకు చెందిన మహిళలు, అంగన్వాడీ టీచర్లు, గృహిణులు మొత్తం వందమందికి పైగా డబ్బులు కట్టారు. అయితే ఈ నెల 11న డబ్బులు చెల్లించిన వారందరికీ రుణాలు ఇస్తామని చెప్పి వెళ్లిపోయారు. కానీ గత రెండు రోజులుగా రుణాల కోసం మహిళలు కాల్స్ చేస్తే అటు నుంచి ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. డబ్బులు కట్టిన మహిళలకు రూ.3వేలు తీసుకుని రూ.వెయ్యి విలువైన టేబుల్ ఫ్యాన్లు అంటగట్టారని వాపోతున్నారు. ఆసిఫాబాద్ పట్టణం జూబ్లీ మార్కెట్లో తమ ఆఫీసు ఉందని చెబితే అక్కడికి వెళ్లి చూస్తే ఎలాంటి ఆఫీసు లేదు. ఈ వ్యవహారమంతా చూస్తే మోసపోయినట్లుగా గుర్తించారు. ఇంకా కొత్తగా ఎవరూ కూడా డబ్బులు కట్టడం చేయొద్దని బుధవారం సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇదంతా చెప్పుకుంటే ఇబ్బందిగా ఉంటుందని ఎవరూ కూడా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు ఇవ్వలేదు. మారుమూల ప్రాంతాల్లో ఇంకా బాధితులు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే రుణాల మోసంపై అందరం కలిసి ఫిర్యాదు చేస్తామని బాధిత మహిళ ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
సీ్త్రనిధి రుణాలు వందశాతం రికవరీ చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: మహిళా సంఘాల అభివృద్ధిలో భాగంగా అందించే సీ్త్రనిధి రుణాలను మార్చి నెలాఖరులోగా రికవరీ చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం డీఆర్డీవో దత్తారావుతో కలిసి ఏపీఎంసీ, సీసీలు, మెప్మా సిబ్బందితో సీ్త్రనిధి రుణాల రికవరీ, నూతన రుణాల జారీ, ప్రమాద బీమా, బ్యాంకు లింకేజీ అంశాలపై సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సీ్త్రనిధి కింద తీసుకున్న రుణాలు, ఓవర్ డ్యూస్ రికవరీ వందశాతం పూర్తి చేసేవిధంగా అధికారులు మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. అధిక బకాయిలు ఉన్న సభ్యులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. వందశాతం రుణాలు చెల్లించిన సంఘాలకు నూతన రుణాలు మంజూరు చేయాలన్నారు. ప్రతిఒక్కరూ ప్రమాద బీమాకు ప్రీమియం చెల్లించేలా అవగాహన కల్పించడంతోపాటు వందశాతం బ్యాంకు లింకేజీ పూర్తి చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మండలాల వారీగా సమీక్షించారు. అదనపు డీఆర్డీవో రామకృష్ణ, జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, మెప్మా ప్రాజెక్టు అధికారి మోతీరాం, సీ్త్రనిధి సిబ్బంది పాల్గొన్నారు. -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకెరమెరి(ఆసిఫాబాద్): విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని గోయగాం ఉన్నత పాఠశాలను బుధవారం సందర్శించారు. మధ్యాహ్నం భోజనం, హాజరు పట్టికను పరిశీలించారు. పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షల తీరును పర్యవేక్షించారు. విద్యార్థులు వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. అనంతరం మండలంలోని ధనోరా వద్ద ఉన్న మిషన్ భగీరథ పంప్హౌస్ను సందర్శించారు. ఈఈ రాకేశ్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎంఈవో ఆడే ప్రకాశ్, ఉపాధ్యాయులు, ఏఈలు ఉన్నారు. ‘ధరణి’ దరఖాస్తులు పరిష్కరించాలి ఆసిఫాబాద్అర్బన్: వివిధ భూ సమస్యలపై ధరణి పోర్టల్లో పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాల తహసీల్దార్లతో ధరణి(భూభారతి)లో వచ్చిన సమస్యలపై సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి పరిశీలించి, రికార్డులు సరిచూసి దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. ప్రతీ ఫైల్ వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్, సబ్ కలెక్టర్, ఆర్డీవో లాగిన్లో ఉన్న రికార్డులను త్వరగా పరిష్కరించాలన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై అధికారులు ప్రతిరోజూ సమీక్ష నిర్వహించాలని సూచించారు. -
● పెరుగుతున్న వ్యాధిగ్రస్తులు ● జిల్లాలో వందమందికి పైగా పేషెంట్లు ● రెండు డయాలసిస్ కేంద్రాల్లో బాధితులకు సేవలు ● నేడు వరల్డ్ కిడ్నీ డే
ఆసిఫాబాద్: మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైనవి కిడ్నీలు. అవి సక్రమంగా పనిచేస్తేనే శరీరం నుంచి వ్యర్థాలు బయటికి వెళ్లి ఆరోగ్యంగా ఉంటారు. కానీ మారిన ఆహారపు అలవాట్లు, వివిధ అనారోగ్య సమస్యలతో కొంతమంది మూత్రపిండాలు చిన్నవయస్సులోనే దెబ్బతింటున్నాయి. గతంతో పోలిస్తే జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. గురువారం వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా కథనం. వందమంది బాధితులు డీహైడ్రేషన్, పెయిన్ కిల్లర్లు అధికంగా వినియోగించడం, ఇన్ఫెక్షన్లు, బీపీ, షుగర్, ఆటోఇమ్యున్ వ్యాధితో పాటు జన్యుపరమైన సమస్యలతో మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. శాశ్వత కిడ్నీ ఫెయిల్యూర్ను దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి అంటారు. కిడ్నీలు 80 శాతం వరకు పాడయ్యే వరకు పనిచేస్తాయి. ఇందులో ఐదు దశలు ఉండగా, చివరి దశకు చేరితే మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు భావిస్తారు. జిల్లావ్యాప్తంగా ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్లలో వంద మందికి పైగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. బాధితులకు సేవలందించేందుకు జిల్లా కేంద్రంతోపాటు కాగజ్నగర్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో ఐదు డయాలసిస్ మిషన్లు ఉన్నాయి. ఆసిఫాబాద్లో 40 మంది, కాగజ్నగర్లో 40 మందికి ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. స్లాట్ దొరక్కపోతే ఇతర ప్రాంతాలకు.. కొంతమంది వ్యాధిగ్రస్తులకు స్లాట్ బుకింగ్ దొరక్కపోవడంతో మంచిర్యాల, కరీంనగర్తో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఆర్థిక స్థామత ఉన్న కొంతమంది మంది హైదరాబాద్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఒక్కొసారి డయాలసిస్ కోసం రూ.6 వేలు వెచ్చించాల్సి వస్తుంది. వారానికి రెండుసార్ల చొప్పున నెలకు ఎనిమిది సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి ఉటుంది. ఇందుకు నెలకు సుమారు రూ.50 వేలు ఖర్చవుతుంది. బతుకుపై ఆశతో తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ఆస్తులు అమ్ముకుని చికిత్స చేయించుకుంటున్నారు. కిడ్నీ సమస్య ముదిరితే అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం కూడా జరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని జన్కాపూర్కు చెందిన ఓ బాధితుడు మృతి చెందాడు. జిల్లా కేంద్రంలోని డయాలసిస్ కేంద్రంలో చికిత్స పొందుతున్న వ్యాధిగ్రస్తులు(ఫైల్)జాగ్రత్తలు పాటించాలి హైబీపీ, డయాబెటీస్, కుటుంబంలో ఎవరికై న కిడ్నీవ్యాధిగ్రస్తులు ఉంటే తరచూ కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. కిడ్నీ సంబంధిత వ్యాధులకు గురైతే తరచుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. అవసరం లేకున్నా ఒత్తిడిగా అనిపించడం, ఎలాంటి కారణం లేకుండా బరువు తగ్గడం వ్యాధికి సంకేతంగా భావించాలి. షుగర్ వ్యాధితో బాధపడేవారిలో 40 శాతం మంది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. మూత్రంలో ప్రోటీన్లు పోవడం క్లిష్టమైన అంశం. మూత్ర పరీక్షల ద్వారానే గుర్తిస్తారు. అనుమానం ఉన్నవారు తరచూ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. మూత్రంలో రక్తం వస్తుంటే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. -
క్రీడాపాఠశాలలో ప్రవేశానికి ఎంపిక పోటీలు
ఆసిఫాబాద్రూరల్: ఉమ్మడి జిల్లా గిరిజన ఆదర్శక్రీడా పాఠశాలలో ప్రవేశానికి జిల్లా కేంద్రంలోని గిరిజన క్రీడాపాఠశాలలో బుధవారం ఎంపిక పోటీలు నిర్వహించినట్లు డీటీడీవో రమాదేవి తెలిపారు. ఐదో తరగతిలో 40 సీట్లకు 60 మంది, 6 నుంచి 9వ తరగతి వరకు బ్యాక్ లాగ్ సీట్లు కోసం 80 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ప్రతిభ చూపిన 40 మంది బాలికలను ఎంపిక చేస్తామన్నారు. అనంతరం తిర్యాణి గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న పీడీ లక్ష్మణ్ ఇటీవల బాడీబిల్డింగ్ పోటీల్లో మిస్టర్ ఆదిలాబాద్ టైటిల్ని సొంతం చేసుకోవడంతో డీఎస్వో మీనారెడ్డి, ఏసీఎంవో ఉద్దవ్, డీటీడీవో రమాదేవి శాలువాతో ఆయనను సత్కరించారు. కార్యక్రమంలో కోచ్లు విద్యాసాగర్, అరవింద్, తిరుమల్, పీడీలు పీఈటీలు మధుసూదన్, సంగీత, వెంకటేశ్, రాజ్కుమార్ పాల్గొన్నారు. -
కూలీలకు వంద పనిదినాలు కల్పించాలి
పెంచికల్పేట్(ఆసిఫాబాద్): ఉపాధిహామీ పథకంలో కూలీలకు వంద పనిదినాలు కల్పించాలని జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జాబ్కార్డు కలిగిన ప్రతీ కుటుంబానికి పనిదినాలు కల్పించాలన్నారు. పనులను ముందుగా గుర్తించి సుమారు వందమంది కూలీలు పనిచేసేలా ప్రోత్సహించా లని సూచించారు. పంచాయతీల్లోని నర్సరీలను ప్రతిరోజూ సందర్శించి మొక్కల సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వందశాతం పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో అల్బర్ట్ తదితరులు ఉన్నారు. -
మద్యంతో ప్రమాదాలు..
కౌటాల మండలం తాటిపల్లి వద్ద పెన్గంగలో స్నానాలు(ఫైల్)చింతలమానెపల్లి(సిర్పూర్): చిన్నాపెద్ద, కుల, మత బేధం లేకుండా హోలీ పండుగను అంతా కలిసి ఉల్లాసంగా జరుపుకొంటారు. సామూహికంగా జరుపుకునే ఈ పండుగకు క్రేజ్ ఎక్కువే. రంగులు చల్లుకుంటూ విందులు, వినోదాలతో సంతోషంగా గడపుతుంటారు. జిల్లావ్యాప్తంగా పట్టణాలు, గ్రామాల్లో పౌర్ణమి సందర్భంగా రెండు రోజులపాటు హోలీ నిర్వహించుకుంటారు. విభిన్న ఆచారాలు ఉన్నప్పటికీ హోలీ పండుగ కొత్త అలవాట్లకు వేదికగా మారుతుంది. సంబురాల అనంతరం యువత ఎక్కువగా స్నానాలకు వెళ్తుంటారు. జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లో నదులు, వాగులు, చెరువులు, కుంటలు, నీటిప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి. రంగులు చల్లుకున్న అనంతరం స్నానాలకు వెళ్లడం సర్వసాధారణం. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో వట్టివాగు, అడ ప్రాజెక్టు, పెద్దవాగుకు స్నానాలకు వెళ్తుంటారు. కాగజ్నగర్, పెంచికల్పేట్, దహెగాం మండలాల ప్రజలు సమీపంలోని పెద్దవాగు, ప్రాజెక్టులు, సిర్పూర్(టి), కౌటాల మండలాల్లో పెన్గంగ నది వద్దకు, చింతలమానెపల్లి, బెజ్జూర్ మండలాల వాసులు ప్రాణహిత నదికి స్నానాలకు వెళ్తుంటారు. నిత్యం నీటి ప్రవాహం జిల్లాలోని జీవనదులైన పెద్దవాగు, ప్రాణహిత, పెన్గంగ నదుల్లో ఏడాదంతా నీటి ప్రవాహం కొనసాగుతోంది. అడ, వట్టివాగు ప్రాజెక్టుల్లో నిత్యం జలకళ ఉంటుంది. సమీపంలోని గ్రామాల్లోని ప్రజలు పండుగ వేళల్లో స్నానాలకు నీటి వనరుల వద్దకు వెళ్లడం సాధారణ విషయం. పెద్దవాగు, ప్రాణహిత, పెన్గంగ నదుల్లో పలుచోట్ల ప్రమాదకర మడుగులు, ప్రమాదకర స్థాయిలో నీటిమట్టం ఉంటుంది. హోలీ జరుపుకునే వారు గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. హోలీ సమయంలో ప్రమాదాలకు ఆస్కారం ఉండటంతో కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లోని చిన్నపిల్లలు, యువకులు ప్రాణా ల విలువ గుర్తించే విధంగా అవగాహన కల్పించాలి. ముందస్తుగా హెచ్చరించడం ద్వారా ప్రమాదాల బారినపడకుండా అప్రమత్తంగా ఉంటారు. నదులు, వాగుల వద్ద ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలి. అవసరమైన చోట నీటిమట్టం సూచించే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలి. గతంలో ప్రమాదాలు జరిగిన ప్రదేశాలు, ప్రజల తాకిడి ఎక్కువగా ఉంటే చోట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలి. జిల్లావ్యాప్తంగా రేపు హోలీ సంబురాలు వాగులు, నదుల వద్ద స్నానాలు నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదాలకు ఆస్కారంహోలీ వేడుకల్లో మద్యం సేవించడం, విందులు జరుపుకోవడం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇవి శృతిమించితే రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. మద్యం తాగి నదులకు స్నానాలకు వెళ్లేటప్పుడు అత్యుత్సాహంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు మార్కెట్లో రంగులు ప్రమాదకరంగా ఉంటున్నాయి. రసాయన రంగులు వినియోగించడం ద్వారా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. మార్కెట్లో ఎక్కువగా కాఫర్సల్ఫేట్, కాల్షియం క్రోమియం, లిరాకై ్సడ్ వంటి రసాయనాలను సాధారణంగా బట్టలకు రంగులు వేయడానికి వినియోగిస్తుంటారు. వీటిని చర్మంపై చల్లుకోవడం ద్వారా చర్మ సంబంధమైన వ్యాధులు, కళ్లలో పడితే కంటి సంబంధిత వ్యాధులు, ముక్కు, నోటిద్వారా శ్వాసనాళాల్లోకి వెళ్లినా, జీర్ణాశయంలోకి వెళ్లినా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. వీటిపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సహజంగా ప్రకృతి పదార్థాలతో తయారు చేసే రంగులను వినియోగించడం శ్రేయస్కరం.గతేడాది హోలీ పండుగ కౌటాల మండలంలో విషాదం నింపింది. పండుగ సంబురాల అనంతరం నదికి స్నానానికి వెళ్లిన కౌటాల మండల కేంద్రానికి ముగ్గురు యువకులు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. పండుగ రోజు చేతికందిన కుమారులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబాలు తీరని దుఃఖంలో మునిగిపోయాయి.. పండుగ సమయంలో ఏమరుపాటుగా ఉంటే జరిగే ప్రమాదాలకు ఈ ఘటన నిదర్శనం.. ఈ నెల 14న హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేక కథనం.ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆసిఫాబాద్అర్బన్: జిల్లా ప్రజలు హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. హోలీ రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు వేడుకలు ముగించుకోవాలని సూచించారు. ఇష్టపడని వ్యక్తులు, ప్రదేశాలు, వాహనాలపై రంగులు, నీటిని చల్లొద్దన్నారు. నీటి బెలూన్లు, గాజు పొడి కలిపిన రంగులను వాడొద్దన్నారు. మద్యం మత్తులో అల్లర్లు చేయడం నిషేధమని, మద్యం తాగి వాహనాలు నడపొద్దన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు, పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. శాంతి భద్రతలకు భంగం కలిగించడం, ప్రజలకు అసౌకర్యం కలిగించే చర్యలు చేపడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. -
సైన్స్తో విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం
పెంచికల్పేట్(సిర్పూర్): సైన్స్తో విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంపొందుతుందని జిల్లా సైన్స్ అధికారి కటకం మధుకర్ అన్నారు. మండలంలోని చేడ్వాయి ఉన్నత పాఠశాలలో బుధవారం మొబైల్ సైన్స్ ల్యాబ్ ద్వారా పలు ప్రయోగాలు చేశారు. ఆయన మాట్లాడుతూ సైన్స్ ప్రయోగాలు చేయడం ద్వారా విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం కలుగుతుందన్నారు. పరిశోధన శక్తి పెరిగి నూతన ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈవో రమేశ్బాబు, ఉపాధ్యాయులు రాకేశ్, సుమిత, రాజ్కమలాకర్రెడ్డి, శిల్ప, స్వప్న పాల్గొన్నారు. -
దాహం తీరేదెలా..?
● జిల్లాలో మండుతున్న ఎండలు ● అటవీ ప్రాంతాల్లో నీటి కరువు ● తాగునీటి కోసం మైదాన ప్రాంతాల్లోకి వన్యప్రాణులు ● పొంచి ఉన్న వేటగాళ్ల ముప్పుపెంచికల్పేట్(సిర్పూర్): మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్కు చేరువయ్యాయి. వేడి, పొడి వాతావరణంతో అడవుల్లోని సహజ నీటి వనరులు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఫలితంగా అటవీ ప్రాంతాలను ఆవాసంగా చేసుకుని మనుగడ సాగిస్తున్న వన్యప్రాణులు తాగునీటికి అల్లాడుతున్నాయి. ఎండలు మొదలై 15 నుంచి 20 రోజులవుతున్నా అటవీశాఖ అధికారులు మాత్రం నీటి వసతి కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం లేదు. దాహానికి తట్టుకోలేక వన్యప్రాణులు నీటి వనరులను వెతుక్కుంటూ అడవులను విడిచి మైదాన ప్రాంతాలకు పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలో అటవీ జంతువులు వేటగాళ్ల ఉచ్చులకు చిక్కుతున్నాయి. అలాగే వీధికుక్కల దాడిలోనూ ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. 6,04,172 ఎకరాల్లో అడవులుజిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్నగర్ ఫారెస్టు డివిజన్లు ఉన్నాయి. ఆయా డివిజన్లలో 11 రేంజ్లు, 79 సెక్షన్లు, 245 బీట్లు, 846 కంపార్టుమెంట్లు ఉన్నా యి. జిల్లావ్యాప్తంగా 6,04,172 ఎకరాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. పెద్దపులులు, చిరుతపులులు, ఎలుగుబంట్లు, జింకలు, మెకాలు, దుప్పులు, నీలు గాయి, కొండగొర్రెలు, అడవి పందులతోపాటు అనేక రకాల అరుదైన జంతువులు ఇక్కడ జీవనం సాగిస్తున్నాయి. దట్టమైన అడవుల్లో గడ్డి మైదానా లు, నీటి ఊటలు ఉన్నాయి. నిత్యం నీటితో కళకళలాడే పెన్గంగ, ప్రాణహిత నదులు, పెద్దవాగు వ న్యప్రాణుల దాహం తీరుస్తున్నాయి. జిల్లాలోని ము ఖ్యమైన ప్రాంతాల్లో అటవీ జంతువుల దాహం తీ ర్చడానికి అధికారులు 159 సాసర్పిట్లు, 19 సోలా ర్ నీటి కుంటలు ఏర్పాటు చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో వేసవిలో నీటి వనరులు అడుగంటిపోతాయి. ఈ సమయంలో అధికారులు ఏర్పాటు చేసే నీటికుంటలు, సాసర్ పిట్లే వాటికి ఆధారం. పొంచి ఉన్న ముప్పు..ఎండాకాలంలో అడవి జంతువులకు నీటి సౌకర్యం కల్పించడం, వేటగాళ్ల బారి నుంచి కాపాడటం అఽధికారులకు సవాలుగా మారింది. అడవుల నుంచి దాహంతో మైదాన ప్రాంతాల్లోకి వస్తున్న వన్యప్రాణులకు వేటగాళ్ల నుంచి ముప్పు పొంచి ఉంది. నిరంతరం నీరు లభించే ప్రాంతాలు వేటగాళ్లకు అనుకూలంగా మారాయి. నీటివసతి ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ తీగలు, ఉచ్చులు బిగించి వన్యప్రాణులను వేటాడుతున్నారు. మాంసాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మార్చిలోనే పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. వేడికి అల్లాడుతున్న వన్యప్రాణులు ఏప్రిల్, మేలో వేటగాళ్ల ఉచ్చులకు బలయ్యే అవకాశం ఉందని జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.పెంచికల్పేట్ రేంజ్లో నీరు లేక ఖాళీగా ఉన్న సాసర్పిట్జిల్లా వివరాలుఫారెస్టు సాసర్ సోలార్ రేంజ్లు పిట్లు కుంటలు పెంచికల్పేట్ 15 5 బెజ్జూర్ 26 1 కాగజ్నగర్ 22 8 సిర్పూర్(టి) 22 2 కర్జెల్లి 29 1 రెబ్బెన 10 2 ఆసిఫాబాద్ 15 0 జోడేఘాట్ 5 0 కెరమెరి 5 0 తిర్యాణి 5 0 గిన్నెధరి 5 0 ఖాళీగా సాసర్పిట్లు..వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అటవీ శాఖ అధికారులు ఆయా రేంజ్ల పరిధిలో ఏర్పాటు చేసిన నీటికుంటలు, సాసర్పిట్లు, సోలార్ నీటి కుంటలు అలంకారప్రాయంగా కనిపిస్తున్నాయి. సాసర్పిట్లలో ట్యాంకర్ల ద్వారా వారం రోజులకు ఒకసారి నీటితో నింపాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వన్యప్రాణుల కోసం ఉప్పుగడ్డలు మాత్రం నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో అందుబాటులో ఉంచారు. ఏడాదిగా కంపా నిధులు నిలిచిపోవడంతో అడవి జంతువుల దాహార్తి తీర్చడం అటవీశాఖ అధికారులకు భారంగా మారింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం ఎండల తీవ్రతతో అడవిలోని సహజ వనరులు ఎండిపోతున్నాయి. నీటి లభ్యత ఉన్న ప్రదేశాల్లో చెలిమెలు ఏర్పాటు చేస్తున్నాం. మార్చి నెలాఖరు వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు ఉన్నతాధికారులకు నివేదించాం. నిధులు రాగానే సాసర్పిట్లలో నీటిని నింపే ప్రక్రియ ప్రారంభిస్తాం. వన్యప్రాణులు మైదాన ప్రాంతాల్లోకి వస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలి. వన్యప్రాణులను వేటాడితే కేసులు నమోదు చేస్తాం. – అనిల్కుమార్, ఎఫ్ఆర్వో, పెంచికల్పేట్ -
నెలాఖరులోగా పనులు పూర్తిచేయాలి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులు ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి మంగళవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డీఆర్డీవో దత్తారావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పంచాయతీ, హౌజింగ్ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, పంచాయతీ కా ర్యదర్శులతో అభివృద్ధి పనుల పురోగతిపై సమీ క్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ముందస్తు ప్రణా ళికతో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కల సంరక్షణపై దృష్టి సారించాలన్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో వందశాతం ఆస్తిపన్నులు వసూలు చేసేలా అధి కారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. లేఅవుట్ లేని భూముల క్రమబద్ధీకరణ కోసం ఎల్ఆర్ఎస్– 2020లో భాగంగా అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హత గల వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, జాబ్కార్డు కలిగిన వారికి వందరోజుల ఉపాధిహామీ పనులు కల్పించాలన్నారు. వేసవి నేపథ్యంలో ఉదయం, సాయంత్రం పనులు చేయించాలని సూచించారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
డోర్లి–2 ఓసీపీ సందర్శన
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలో మూసివేసిన డోర్లి– 2 ఓసీపీని మంగళవారం కోల్ కంట్రోల్ అధికారులు సందర్శించారు. నాగ్పూర్ కోల్ కంట్రోల్ కార్యాలయ ఓఎస్డీ సందీప్ ఎస్ పరాంజ పేతో పాటు కొత్తగూడెం కోల్ కంట్రోల్ కార్యాలయ ఓఎస్డీ డీవీ సుబ్రమణ్యం ఏరియా అధికారులతో కలిసి మూతపడిన గని, పరిసర ప్రాంతాల్లో సింగరేణి యాజమాన్యం చేపట్టిన పర్యావరణ పనులు, ఓసీపీ వద్ద నాటిన మొక్కలు, ఎదిగిన వృక్షాలను పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న నీటి నిర్వహణ, మృతిక సంరక్షణ చర్యల వివరాల ను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు గోలే టి టౌన్షిప్లోని జీఎం కార్యాలయంలో ఇన్చార్జి జీఎం నరేందర్ కోల్ కంట్రోల్ అధికారులకు ఏరి యా స్థితిగతుల వివరాలను వెల్లడించారు. కార్యక్రమాల్లో ఎస్వోటూజీఎం రాజమల్లు, ఏరియా సర్వే అధికారి ఆప్సర్ పాషా, డీవైఎఎస్వో శేఖర్, కార్పొరేట్ అదనపు మేనేజర్లు తిరుపతి, బాబ్జీ, డోర్లి– 2 మేనేజర్ మహేశ్, ఎన్విరాన్మెంట్ అధికారి హరీశ్, ఫారెస్టు అధికారి రమణారెడ్డి, ఎస్టేట్ అధికారి రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పరిసరాలు పరిశీలిస్తున్న కోల్ కంట్రోల్ అధికారులు -
మహిళల అభ్యున్నతికి చర్యలు
ఆసిఫాబాద్అర్బన్: మహిళల అభ్యున్నతి, రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం జిల్లా సీ్త్ర, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ముందుగా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్బాబుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా ప్రోత్సహిస్తున్నామని అన్నారు. చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు బ్యాంకు లింకేజీ ద్వారా స్వశక్తి మహిళా సంఘాలకు రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. గృహ హింస, లైంగిక వేధింపుల బాధితులకు సఖి కేంద్రం ద్వారా సాయం అందిస్తున్నామన్నారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ బేటీ పడావో.. బేటీ బచావో కార్యక్రమం ద్వారా బాలికల్లో అక్షరాస్యత పెరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో మోటివేషన్ స్పీకర్లను నియమించినట్లు తెలిపారు. భావితరాలకు మహిళలు ఆదర్శంగా నిలవాలని, ఉన్నత లక్ష్యాలు సాధించాలని కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా సూచించారు. అనంతరం ఎమ్మెల్యే హరీశ్బాబు మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే కుటుంబం, సమాజం వారిని గుర్తిస్తుందన్నారు. ఆత్మ నూన్యత భావన విడిచి ముందడుగు వేయాలని సూచించారు. భ్రూణ హత్యలు, బాల్యవివాహా లు అరికట్టినప్పుడే సమాజం అభివృద్ధి వైపు పయనిస్తుందని పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు మహిళలను ఘనంగా సత్కరించారు. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, సీడీపీవోలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం -
నాణ్యతతో పనులు చేపట్టాలి
ఆసిఫాబాద్అర్బన్: ఉపాధిహామీ పథకం ద్వారా జిల్లాలో చేపడుతున్న పనుల్లో నాణ్య త పాటించాలని పంచాయతీరాజ్ విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ విభాగం ఎస్ఈ సూర్యప్రకాశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం వి విధ మండలాల్లో ఉపాధిహామీ పథకం కింద పనులు చేపడుతున్న ఏజెన్సీ నిర్వాహకులు, అధికారులకు పంచాయతీరాజ్ ఈఈ ప్రభాక ర్ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్ఈ సూర్యప్రకాశ్ మాట్లాడుతూ నిర్దేశించిన సమయంలో పనులు పూర్తిచేయడంతోపాటు నాణ్యత ప్రమాణాలు పాటించి నప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నా రు. రానున్న రోజుల్లో నాణ్యత పరీక్షించిన త ర్వాతే బిల్లుల చెల్లింపులు జరుగుతాయని స్ప ష్టం చేశారు. పనులు పూర్తిచేయడంలో అలసత్వం ప్రదర్శించొద్దని హెచ్చరించారు. సమావేశంలో డీఈ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వేసవిలో నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలి
రెబ్బెన: వేసవిలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయాల ని ట్రాన్స్కో ఎస్ఈ రాథోడ్ శేషారావు అన్నా రు. మండలంలోని నంబాల సబ్స్టేషన్లో కొ త్తగా ఏర్పాటు చేసిన బ్రేకర్ను మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వేసవిలో నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు కొత్త బ్రేకర్ను ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సరఫరాలో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే సత్వరమే వాటిని పరిష్కరించి విద్యుత్ సరఫరాలో అంతరాయం రాకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. డీఈఈ వీరేశం, ఏడీఈ ఫిరోజ్ఖాన్, సంతోష్, ఏఈ ఇమ్రాన్, సిబ్బంది రయీస్, సురేశ్, హరీశ్, సత్తయ్య, నసీరుద్దీన్, మధు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలని వినతి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలో సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల ని డీవైఎఫ్ఐ, టీఏజీఎస్ నాయకులు మంగళవారం కలెక్టరేట్లో ఏవో మధుకర్కు వినతిపత్రం అందించారు. నాయకులు కార్తీక్, మాల శ్రీ మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజ లకు కనీస వసతులు కూడా లేవన్నారు. ట్రా ఫిక్ సమస్యతో వాహనదారులు ఇబ్బంది ప డుతున్నారని, వ్యాపారులు పగటిపూటే భారీ వాహనాలు రోడ్లపై నిలుపుతున్నారని ఆరో పించారు. గోదాంలను కాలనీల్లో కాకుండా బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలన్నా రు. పట్టణంలో సులభ్ కాంప్లెక్స్లు, పా ర్కింగ్ స్థలాలు, తాగునీటి కోసం చలివేంద్రాలు, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జన్కాపూర్ మైదానానికి ప్రహరీ నిర్మించి, సెక్యూరిటీ పెంచాలన్నారు. నాయకులు శ్రావణి తదితరులు ఉన్నారు. -
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు కొండాలక్ష్మణ్ బాపూజీ పేరును నామకరణం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం అంబేడ్కర్ చౌక్ వద్ద పద్మశాలీ సేవా సంఘం సభ్యులు సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. జిల్లా అధ్యక్షుడు ఇరుకుల ఆంజనేయులు మాట్లాడుతూ వాంకిడి మండల కేంద్రానికి చెందిన కొండాలక్ష్మణ్ బాపూజీ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పదవులు సైతం లెక్కచేయలేదన్నారు. వాంకిడిలో సేవాసదన్ సంస్థకు చెందిన భూమిలో బాపూజీ స్మృతి వనం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఎమ్మెల్సీ దండె విఠల్ రూ.30లక్షలు కేటాయించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు శంకర్, శ్రీకాంత్, లింగయ్య, పుష్పలత, సునీత, ఇరుకుల మంగ, ప్రణయ్, భద్రయ్య, శ్యాం, శైలేందర్, శ్రీనివాస్, ధర్మయ్య, సత్యనారాయణ, మహేష్, మాలి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగోసె శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు సమస్యలు రానీయొద్దు
వాంకిడి(ఆసిఫాబాద్): బీసీ, ఎస్సీ వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రానీయొద్దని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి సజీవన్ అన్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ, బీసీ వసతిగృహాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూం, వంటగది, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తప్పనిసరిగా మెనూ పాటిస్తూ ప్రతిరోజూ ఆరోగ్యకరమైన భోజనం అందించాలన్నారు. వసతిగృహాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులు పూర్తినమ్మకంతో కష్టపడి చదవాలన్నారు. పరీక్షల తీరుపై అవగాహన కల్పించారు. ఆయన వెంట బీసీ హాస్టల్ వార్డెన్ మధుకర్, ఎస్సీ హాస్టల్ వార్డెన్ తిరుపతి తదితరులు ఉన్నారు. -
జిల్లాకు ఇంటిగ్రేటెడ్ గురుకులం
● ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు ● వాంకిడి మండలం ఇందాని శివారులో స్థలం పరిశీలన ● రూ.200 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆసిఫాబాద్రూరల్: పేదరికాన్ని రూపుమాపే ఏకై క ఆయుధం విద్య మాత్రమే.. పేద కుటుంబాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ప్రతీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో సమీకృత గురుకుల పాఠశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే వాంకిడి మండలం ఇందాని సమీపంలో ప్రభు త్వ స్థలాన్ని ఇటీవల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్రావు, అధికారులు తదితరులు పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ గురుకులం నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్థలం గుర్తింపుబడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యనందించేందుకు 25 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన భవనాలు నిర్మించనున్నారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులందరూ ఒకే చోట చదువుకునేందుకు వీలుగా వసతులు కల్పించనున్నారు. ఆర్థికంగా వెనుకబడిన ఆదివాసీ జిల్లాలో సమీకృత గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తుండటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 25 ఎకరాల స్థలం అందుబాటులో లేకపోవడంతో వాంకిడి మండలం ఇందాని గ్రామ శివారులో 321 సర్వే నంబర్లో 20 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు జిల్లా కేంద్రానికి సమీపంలో నిర్మిస్తే అన్ని మండలాల విద్యార్థులకు అందుబాటులో ఉంటుందని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. అలాగే సిర్పూర్ నియోజకవర్గంలో సమీకృత గురుకుల పాఠశాల ఏర్పాటుపై స్పష్టత రావాల్సి ఉంది. జిల్లాలో పరిస్థితి..జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు కలిపి మొత్తం 1,265 ఉన్నాయి. ఇందులో కళాశాలలు 17, పాఠశాలలు 1,248. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆయా చోట్ల 1,03,264 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఐదు సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2,898 మంది విద్యార్థులు, ఏడు గిరిజన సంక్షేమ గురుకులాల్లో 2,917 మంది, 38 ఆశ్రమ పాఠశాలల్లో 7,065 మంది, 15 కేజీబీవీల్లో 3,917 మంది, ఐదు బీసీ జ్యోతిబా పూలే గురుకులాల్లో 2,215 మంది, మూడు మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 1,185 మంది, రెండు మోడల్ స్కూళ్లలో 1,304 మంది, 19 ఎస్సీ, బీసీ పోస్ట్ మెట్రిక్, ప్రీమెట్రిక్ వసతి గృహలు, ఎస్సీ బాలబాలికల వసతి గృహాల్లో 385 మంది, 11 బీసీ వసతి గృహల్లో 789 మంది, 107 ప్రైవేట్ పాఠశాలల్లో 29,779 మంది, 732 ప్రభుత్వ పాఠశాలల్లో 43,110 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండాలి ఆసిఫాబాద్కు సమీపంలో చాలా వరకు ప్రభుత్వ భూములు ఉన్నాయి. జిల్లా కేంద్రం పరిధిలో ఐదు కి.మీ.ల దూరంలో సమీకృత గురుకులం ఏర్పాటు చేస్తే విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. ఆదర్శ డిగ్రీ కళాశాలను బెండారలో ఏర్పాటు చేయడంతో దూరభారంతో విద్యార్థులు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. – తిరుపతి, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి -
దివ్యాంగులకు యూనిక్ డిజేబులిటీ ఐడీ
ఆసిఫాబాద్అర్బన్: ప్రస్తుతం అందిస్తున్న సద రం సర్టిఫికెట్ స్థానంలో దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం యూనిక్ డిజేబులిటీ ఐడీలను అందుబాటులోకి తీసుకువచ్చిందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం అదనపు కలెక్టర్ దీపక్ తివా రితో కలిసి జిల్లా పరిషత్, జిల్లా సంక్షేమశాఖ, వైద్యారోగ్యశాఖ అధికారులు, మున్సిపల్ కమి షనర్లు, ఎంపీడీవోలు, ఏపీఎంలు, దివ్యాంగుల సంక్షేమ సంఘాల ప్రతినిధులకు అవగా హన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడు తూ దివ్యాంగులకు 21 కేటగిరీల్లో యూడీఐడీ కార్డులు అందించనున్నట్లు తెలిపారు. సదరం సర్టిఫికెట్ ఉన్న వారికి స్పీడ్ పోస్టు ద్వారా కార్డులు పంపిస్తారని పేర్కొన్నారు. దివ్యాంగుల సౌ కర్యార్థం ప్రత్యేక హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామన్నారు. డీఆర్డీవో దత్తారావు, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ అధికారి భాస్కర్ పాల్గొన్నారు. ఈవీఎం గోదాం వద్ద పటిష్ట బందోబస్తుజిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాం వద్ద పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధి కారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. ఈవీ ఎం గోదాంను సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్తో కలిసి ఎన్నికల అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. -
జిల్లా క్రీడాకారులకు పతకాలు
రెబ్బెన(ఆసిఫాబాద్): హర్యానా రాష్ట్రంలోని కర్ణాల్లో జరిగిన 73వ ఆల్ ఇండియా పోలీస్ సెపక్తక్రా చాంపియన్షిప్ టీం ఈవెంట్లో రాష్ట్ర జట్టు తరుఫున బరిలో దిగిన జిల్లా క్రీడాకారులు కాంస్య పతకాలు సాధించినట్లు సెపక్తక్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్రెడ్డి సోమవారం తెలిపారు. ఈ నెల 7 నుంచి జరుగుతున్న ఆల్ ఇండియా పోలీస్ సెపక్తక్రా చాంపియన్షిప్లో రెబ్బెన మండలానికి చెందిన పోలీస్ క్రీడాకారులు ఆర్.వెంకటేశ్, ఆడే రాజేందర్, పి.గోపి అద్భుత ఆట తీరు ప్రదర్శించారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో కాంస్య పతకాలు సాధించిన పోలీ స్ క్రీడాకారులను ఒలింపిక్ అసోసియేషన్ ఉ మ్మడి జిల్లా వైస్ ప్రెసిడెంట్ నారాయణరెడ్డి, బాల్బ్యాడ్మింటన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్.తిరుపతి, సెపక్ తక్రా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శిరీష అభినందించారు. -
అర్జీలు వేగంగా పరిష్కరించాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ● కలెక్టరేట్లో ప్రజావాణి ఆసిఫాబాద్అర్బన్: ప్రజావాణిలో ప్రజలు అందించే అర్జీలను అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. అద నపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా తన పట్టా భూమికి హద్దులు నిర్ధారించాలని రెబ్బెన మండలం నంబాల గ్రామానికి చెందిన మసాడి రాజేశ్వరి దరఖాస్తు చేసుకుంది. ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్టులో చేపలు పెంచడానికి అవకాశం కల్పించా లని తిర్యాణి మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీలు కోరారు. తన పట్టా భూమిని నిషే ధిత జాబితా నుంచి తొలగించాలని బెజ్జూర్ మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన చాపిడి శంకర్ విన్నవించాడు. దివ్యాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలని చింతలమానెపల్లి మండలం ఖర్జెల్లికి చెందిన చౌదరి ఓంకార్ వినతిపత్రం సమర్పించాడు. ప్రస్తుతం తాను సాగు చేసుకుంటున్న భూమికి పట్టా మంజూరు చేయాలని బెజ్జూర్ మండలం ముంజంపల్లికి చెందిన నికోడే లచ్చుంబాయి వేడుకుంది. సదరం సర్టిఫికెట్ అందించాలని కౌటాల మండలానికి చెందిన శంకర్ కోరాడు. దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని వాంకిడి మండలానికి చెందిన మురళీ, మహేందర్ దరఖాస్తు చేసుకున్నారు. వాంకిడి మండలం సరండి శివారులోని భూమిని ధరణి పోర్టల్లో నమోదు చేయాలని రాజేశ్వర్ విన్నవించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులకు నిర్ణీత గడువులోగా న్యాయం చేయాలన్నారు. వేతనం రావడం లేదు చింతలమానెపల్లి మండలం డబ్బా రైతువేదికలో 2021 నుంచి వాచ్మెన్గా పనిచేస్తున్నా. ప్రారంభంలో మూడు నెలలు సక్రమంగా చెల్లించారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు వేతనం రావడం లేదు. – నక్క జగానంద్, చింతలమానెపల్లి -
కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సోమవారం నిర్వహించిన సెకండియర్ ఇంగ్లిష్ పరీక్షకు 5,046 మంది విద్యార్థులకు 4,917 మంది హాజరుకాగా, 129 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విభాగంలో 4,315 మందికి 4,207 మంది, ఒకేషనల్ వి భాగంలో 731 మందికి 710 మంది హాజరయ్యారని డీఐఈవో కళ్యాణి తెలిపారు. ఆసిఫాబాద్, కౌటాల, దహెగాంలోని పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలిజిల్లాలో ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని సోమవారం తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, సౌకర్యాల కల్పన వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. -
అందవెల్లి వంతెనపై రాకపోకలు షురూ
దహెగాం(సిర్పూర్): కాగజ్నగర్ మండలం అందవెల్లి గ్రామ సమీపంలోని పెద్దవాగుపై నిర్మించిన వంతెన అప్రోచ్ రోడ్డు పనులు పూర్తికావడంతో సోమవారం నుంచి రాకపోకలు ప్రారంభమయ్యాయి. 2021లో భారీ వరదలకు పెద్దవాగు ఉప్పొంగి వంతెన కుంగిన విషయం తెలిసిందే. మరోసారి వరదలు వచ్చి వంతెన మరింత కుంగి ప్రమాదకరంగా మారింది. 2023లో వంతెన కూలడంతో పూ ర్తిగా రాకపోకలు నిలి చిపోయాయి. వాగులో తాత్కాలిక రోడ్డు వేసి రాకపోకలు సాగించా రు. గతేడాది వంతెన మరమ్మతులు పూర్తి కాగా, వర్షాకాలంలో మట్టితో తాత్కాలికంగా అప్రోచ్ రోడ్డు వేసి ప్రయాణాలు పునరుద్ధరించారు. గత నెలలో మళ్లీ అప్రోచ్ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించడంతో మ రోసారి వాగులో నుంచి తాత్కాలిక రోడ్డు వే శారు. అప్రోచ్ రోడ్డు పనులు పూర్తికావడంతో వాహనాల రాకపోకలకు అనుమతించారు. -
ఉత్తమ ఫలితాలు సాధించాలి
కెరమెరి(ఆసిఫాబాద్): పదో తరగతి విద్యార్థులు వా ర్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఏటీడీవో శ్రీనివాస్ అన్నారు. మండలంలో ని జోడేఘాట్, బాబేఝరి, హట్టి ఆశ్రమ పాఠశాలలను సోమవా రం సందర్శించారు. పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలకు పరిశీలించారు. వార్షిక పరీక్షలకు పది రోజులే గడువు ఉన్నందున కష్టపడి చదవాలన్నారు. ఉపాధ్యాయులు చదువులో వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించాలని సూచించారు. వందశాతం ఉత్తీర్ణత సాధించేలా సన్నద్ధం చేయాలన్నారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయులు మోతీరాం, జంగు, పంచఫుల తదితరులు ఉన్నారు. -
ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని వినతి
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలోని ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని సీపీఎం పార్టీ నాయకులు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతిపత్రం అందించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలోని వట్టివాగు, అడ ప్రాజెక్టు, జగన్నాథ్పూర్ ప్రాజెక్టుల్లో నీరున్నా పంటల సాగుకు ఉపయోగపడటం లేదన్నారు. కాలువలకు మరమ్మతులు లేకపోవడం, అసంపూర్తిగా ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కూశన్న, నాయకులు దినకర్, శ్రీనివాస్, ఆనంద్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధికి నిబంధనాలు
● కొత్త జాబ్కార్డుల జారీని తాత్కాలికంగా నిలిపివేసిన ప్రభుత్వం ● జాబ్కార్డు లేక ఉపాధికి దూరమవుతున్న కూలీలు ● ‘ఆత్మీయ భరోసా’తో గ్రామాల్లో పెరిగిన డిమాండ్రెబ్బెన(ఆసిఫాబాద్): రాష్ట్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో కొత్త జాబ్కార్డుల మంజూరులో విధించిన నిబంధనలు కొత్త కూలీల పాలిట శాపంగా మారింది. కొన్ని నెలలుగా కొత్తగా కార్డులు జారీని నిలిపివేయడంతో అర్హులకు ఉపాధి దక్కడం లేదు. ఉపాధిహామీ చట్టం ప్రకారం ఆసక్తి చూపే ప్రతీ కూలీకి తప్పనిసరిగా పనులు కల్పించాల్సిందే. కానీ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు చట్టానికే తూట్లు పొడుస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. వేసవిలో ఉపాధి పనులే దిక్కు..జిల్లా ప్రజలకు ఉపాధి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉండటంతో ప్రజలంతా వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. జనవరి నాటికే వానాకాలం పంటల సీజన్ పూర్తవుతుంది. వ్యవసాయ కూలీలు, భూమి లేని నిరుపేదలకు ఉపాధిహామీ పనులే దిక్కుగా మారుతాయి. జనవరి నుంచి జూన్ వరకు కొనసాగే ఉపాధిహామీ పనులు వేసవిలో కూలీలకు బాసటగా నిలుస్తున్నాయి. ఈజీఎస్ కింద కూలీలకు చెల్లించే రోజువారి కూలి సైతం పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పనులకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఏటా జిల్లాలో ఉపాధిహామీ పనులు చేసే కూలీల సంఖ్య సైతం పెరుగుతోంది. జిల్లాలో మంజూరైన జాబ్కార్డులకు, పనిచేసే కూలీల సంఖ్యకు పొంతన ఉండటం లేదు. అధికారులు జిల్లాలో 1,23,035 జాబ్కార్డులను మంజూరు చేయగా, ప్రస్తుతం కేవలం 91,721 జాబ్కార్డులు మాత్రమే యాక్టివ్లో ఉన్నాయి. 2,43,969 మంది కూలీలు ఉండగా 1,70,268 మంది మాత్రమే పనులకు వెళ్తున్నారు. పెరిగిన డిమాండ్అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా భూమి లేని నిరుపేదలకు ఏడాదికి రూ.12వేలు ఆర్థికసాయం అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంగా నామకరణం చేసి భూమి లేని నిరుపేదలకు ఆర్థికసాయం అందించేందుకు కసరత్తు ప్రారంభించింది. అయితే పేదలను గుర్తించేందుకు ఉపాధిహామీ పథకంలో ఏడాదిలో కనీసం 20 రోజులపాటు పనిచేయాలని నిబంధన విధించారు. జనవరిలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి లబ్ధిదారులకు రూ.6వేల నగదు అందించింది. దీంతో ఉపాధిహామీ పనులు చేసే కూలీలకే ఆత్మీయ భరోసా పథకం వర్తిస్తుందనే భావనతో గ్రామీణ ప్రాంత ప్రజలు పనుల కోసం దరఖాస్తులు అందిస్తున్నారు. భూములు ఉన్న రైతులు సైతం కొత్తగా జాబ్కార్డుల కోసం ఆసక్తి చూపుతున్నారు. ఈజీఎస్ అధికారులు కొత్త జాబ్కార్డుల మంజూరుకు ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో దరఖాస్తులు స్వీకరించి దగ్గర పెట్టుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే జాబ్కార్డులు ఉన్న కూలీలు పూర్తిస్థాయిలో పనులకు రావడం లేదని సిబ్బంది చెబుతున్నారు. గతంలో స్వచ్ఛ భారత్ మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలను కూడా జాబ్కార్డులు ఉన్న వారికి మాత్రమే మంజూరు చేశారు. మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తయి బిల్లులు తీసుకున్న వారు జాబ్కార్డులను పక్కన పడేశారు. రైతులు సైతం వ్యవసాయ భూముల్లో పనుల కోసం జాబ్కార్డులు తీసుకుని పనులు చేయించుకుంటున్నారు. ఆ తర్వాత పనులకు వెళ్లేందుకు ఆసక్తి చూపకపోవడంతో పనిచేసే కూలీల సంఖ్య తగ్గుతోంది. ఇప్పుడు కొత్త జాబ్కార్డుల మంజూరు, మార్పులు చేర్పులపై ఆంక్షలు విధించడంతో కొత్తగా పని చేసేందుకు ఇష్టపడుతున్న కూలీలపై ప్రభావం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు జాబ్కార్డులు మంజూరు చేసి పనులు కల్పించేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.విచారణ తర్వాతే జారీ ఉపాధిహామీ పనులు చేసేందుకు జాబ్కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే తప్పకుండా జారీ చేస్తాం. కానీ ఆత్మీయ భరోసా పథకం వర్తించాలనే కోరికతో జాబ్కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే.. అ లాంటి వాటిని విచారణ చేపడతాం. ప్రభుత్వం ఉ పాధిహామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తుండటంతో కొత్త జాబ్కార్డు ల కోసం చాలామంది దరఖాస్తులు చేసుకుంటున్నారు. అర్హత ఉంటేనే కొత్త జాబ్కార్డు ఇస్తున్నాం. – దత్తారావు, డీఆర్డీవోనిలిచిన కొత్త కార్డుల జారీవేసవిలో చేసేందుకు పనులు లేక ఉపాధి కోసం ఆరాటపడే కూలీలకు ఉపాధిహామీ వరంలా మారింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్త జాబ్కార్డుల మంజూరును తాత్కాలికంగా నిలిపివేయడంతో కొత్తగా పనులు చేసేందుకు ఆసక్తి చూపే కూలీలు ఉపాధి పనులకు దూరమవుతున్నారు. కొత్త జాబ్కార్డుల జారీతోపాటు పాత జాబ్కార్డులో పేర్ల తొలగింపులు, చేర్పుల ప్రక్రియపై సైతం నిబంధనలు విధించింది. చనిపోయిన కూలీల పేర్ల తొలగింపు ప్రక్రియ సైతం నిలిచిపోవడంతో పనిచేసే కూలీల సంఖ్య తగ్గుతోంది. పెళ్లికి ముందు తల్లిదండ్రులతో కలిసి జీవించి వివాహ అనంతరం వేరు కాపురం ప్రారంభించిన కుమారులకు సైతం కొత్త జాబ్కార్డులు రావడం లేదు. పలువురు పనులు చేసేందుకు ముందుకొస్తున్నా అధికారులు వారికి అవకాశం కల్పించలేకపోతున్నారు. చేసేదేమీ లేక కూలీలు ఇతర పనులను వెతుక్కుంటున్నారు. వేసవి ప్రారంభం కావడంతో పనుల కోసం కూలీలు వలస వెళ్లాల్సి వస్తోంది. -
ఉద్యోగులకు అభినందన
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలోని కై రిగూడ ఓసీపీ గడిచిన ఫిబ్రవరిలో అధిక ఉత్పత్తిని సాధించడంతో ఓసీపీలో పనిచేస్తున్న ఉద్యోగులను ఏరియా జీఎం విజయ భాస్కర్రెడ్డి అభినందించారు. సోమవారం కై రిగూడ ఓసీపీని సందర్శించి కై రిగూడ ఓసీపీ 135 శాతం బొగ్గు ఉత్పత్తి సాధనకు కృషి చేసిన ఉద్యోగులను ప్రశంసించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో బెల్లంపల్లి ఏరియాకు 37.5లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సంస్థ నిర్దేశించిందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 21 రోజుల గడువు మిగిలి ఉందని, వందశాతం ఉత్పత్తి లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి నరేందర్, ఏఐటీయూసీ బ్రాంచి ఉపాధ్యక్షుడు మొ గిళి, ప్రాజెక్టు ఇంజినీర్ వీరన్న, సేఫ్టీ అధికారి నారా యణ, మేనేజర్ శంకర్, డీవైపీఎం వేణు, నాయకులు శేషు, దివాకర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీ విద్యార్థినుల ప్రతిభ
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజ న మహిళా డిగ్రీ గురుకులానికి చెందిన విద్యార్థినులు మౌంటెన్ బైక్ సైక్లింగ్లో ఉత్తమ ప్రతిభ చూపినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శారద సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ నెల 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించిన తొమ్మిదో రాష్ట్రస్థాయి మౌంటెన్ బైక్ సైక్లింగ్లో కళాశాలకు చెందిన స్నేహ టైం ట్రయల్ 20 కిలోమీటర్లు, మాస్ స్టార్ట్స్ 40 కిలోమీటర్ల విభాగంలో బంగారు పతకం సాధించిందని తెలిపారు. అలాగే వాణిశ్రీ రజత పతకం, ప్రియాంక కాంస్య పతకం, శ్రీదేవి రజత పతకం సాధించారని వెల్లడించారు. విద్యార్థినులు భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని పీడీ హారిక ఆకాంక్షించారు. -
పదోన్నతితో మరింత బాధ్యత
ఆసిఫాబాద్అర్బన్/కెరమెరి: పదోన్నతితో ఉద్యోగిపై మరింత బాధ్యత పెరుగుతుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. కెరమెరి పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న జాదవ్ ఉల్లాస్ ఎస్సైగా పదోన్నతి పొందగా, సోమవారం జిల్లా కేంద్రంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. 1989లో ఉల్లాస్ పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం పొందగా 2012లో హెడ్ కానిస్టేబుల్, 2000లో ఏఎస్సైగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం ఆయనను జైనూర్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా నియమించారు. గతంలో ఆదిలాబాద్, ఇంద్రవెల్లి, సోన్, నీల్వాయి, కెరమెరి పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఆరోగ్యం కాపాడుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఎస్పీకి మొక్క అందిస్తున్న ఎస్సై ఉల్లాస్ -
వైద్యకళాశాలకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ వైద్యకళాశాలకు స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు ఆచా ర్య కొండాలక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ మైదానంలో ఆదివా రం నిర్వహించిన అఖిల భారత పద్మశాలి సంఘం 17వ మహాసభ వేదికపై ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. కళాశాల ఏర్పాటు నుంచీ జిల్లాకు చెందిన అనేక మంది తెలంగాణవాదులు, అభిమానులు మెడిక ల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు నా మకరణం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాకు చెందిన ఉద్యమకారుడికి గుర్తింపు ఇవ్వాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మంత్రులు, కలెక్టర్తోపాటు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకవెళ్లారు. ఎట్టకేలకు ప్రభుత్వ వైద్యకళాశాలకు కొండాలక్ష్మణ్ బాపూజీ పేరు నామకరణం చేస్తామని సీఎం ప్రకటించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఘనంగా గోలేటి భీమన్న జాతర
రెబ్బెన(ఆసిఫాబాద్): మండలంలోని గోలేటి గ్రామ శివారులో గల శ్రీ భీమన్న ఆలయంలో ఆదివారం జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. భీమన్న దేవుడిని దర్శించుకునేందుకు వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు కోళ్లు, మేకలు బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాల్లో వనభోజనాలు చేశారు. సాయంత్రం భీమన్న దేవుడి రథోత్సవం నిర్వహించారు. భీమన్న ఆలయంలో మొదటిసారిగా జాతర మహోత్సవం నిర్వహించగా, సీనియర్ సివిల్ జడ్జి యువరాజ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. జాతరలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన పులిహోర పంపిణీని ఎస్సై చంద్రశేఖర్ ప్రారంభించారు. -
నిధులు రాక నిరుపయోగం
ఆసిఫాబాద్రూరల్: వ్యవసాయ క్లస్టర్ల పరిధిలోని రైతులకు పంటల సాగుపై సలహాలు, సూచనలు అందించేందుకు గత ప్రభుత్వం నిర్మించిన రైతువేదికల నిర్వహణ గాడితప్పింది. సర్కారు నుంచి నిధులు విడుదల కాకపోవడంతో వాటి పర్యవేక్షణ ప్రశ్నార్థకంగా మారింది. నిర్వహణ లేకపోవడంతో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. జిల్లాలో ఇలా..జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉండగా, 70 వ్యవసాయ క్లస్టర్లు ఉన్నాయి. రైతులకు సాగులో ఆధునిక పద్ధతులు, మార్కెటింగ్, తదితర అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహించేందుకు 15 మండలాల్లో 70 రైతు వేదికలు నిర్మించారు. ఒక్కో దాని నిర్మాణానికి రూ.22 లక్షలు వెచ్చించారు. ఈ రైతు వేదికల నిర్వహణకు నెలకు కనీసం రూ.8 వేల నుంచి రూ.10 వేలు ఖర్చవుతుంది. గత ప్రభుత్వం 2022 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల పాటు సక్రమంగా నిధులు విడుదల చేసింది. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు నిధుల విడుదల నిలిచిపోయింది. అప్పటి నుంచి వాటి నిర్వహణను పట్టించుకునే వారు కరువయ్యాయి. నిర్వహణ ఏఈవోలకు తలకు మించిన భారంగా మారింది. విద్యుత్ బిల్లులు, ఇతర ఖర్చులు వారు సొంతంగా చెల్లించాల్సి వస్తోంది. కొన్నిచోట్ల విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది. గ్రామాలకు దూరంగా నిర్మాణంజిల్లాలో 70 రైతువేదికలు ఉన్నాయి. నాలుగు నుంచి ఐదు పంచాయతీలను కలుపుకుని ఒక క్లస్టర్గా ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి క్లస్టర్ ఒక రైతువేదిక నిర్మాణం చే పట్టారు. ఇందులో చాలావరకు గ్రామాలకు దూరంగా ఉండటంతో రైతులు అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. కాంగ్రెస్ సర్కారు ప్రతీ మంగళవా రం రైతునేస్తం కార్యక్రమం పేరుతో పంటల సాగు విధానంలో నూతన పద్ధతులు, అధిక దిగుబడి వి ధానాలపై శాస్త్రవేత్తలు, నిపుణులు, వ్యవసాయాధి కారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. మండలానికి ఒకటి చొప్పున 15 రైతువేదికలను ఇందు కోసం వినియోగిస్తున్నారు. మిగిలినవి నిరుపయోగంగా ఉంటున్నాయి. కాంట్రాక్టర్లకు పూర్తిస్థాయిలో బిల్లులు కూడా అందకపోవడంతో కొన్నిచో ట్ల మరుగుదొడ్లు నిర్మించలేదు. మరికొన్ని చోట్ల అసంపూర్తిగానే ఉన్నాయి. తాగు నీటి సదుపాయం లేదు. ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. ఉన్నతాధికారులకు నివేదించాం ఎంపిక చేసిన రైతువేదికల్లో ప్రస్తుతం ప్రతీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ రైతులను ఆహ్వానిస్తున్నాం. రైతువేదికల స్థితిగతులపై ఉన్నతాధికారులకు నివేదిక అందించాం. నిధులు మంజూరు కాగానే వసతులు కల్పనకు చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్రావు, జిల్లా వ్యవసాయాధికారి గ్రామాలకు దూరంగా రైతువేదికలు 15 చోట్ల వీడియో కాన్ఫరెన్స్ సేవలు మిగిలినవి అలంకారప్రాయమే.. -
నూతన బొగ్గు బ్లాక్లు సింగరేణికి కేటాయించాలి
● డిప్యూటీ సీఎంకు గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల వినతి శ్రీరాంపూర్: సింగరేణికి నూతన గనులను కేటాయించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ నాయకులు రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరారు. హైదరాబాద్లో భట్టి విక్రమార్క నివాసంలో ఆదివారం కలిశారు. వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ అధ్యక్షుడు వీ.సీతారామయ్య, ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్ మాట్లాడుతూ.. సింగరేణిలో కొత్త గనులను ఏర్పాటు చేస్తేనే సంస్థకు భవిష్యత్ ఉంటుందన్నారు. సత్తుపల్లి ఓసీపీ 3, ఇల్లెందు ఓసీపీ 3తోపా టు గతంలో అనుమతి ఇచ్చిన తాడిచర్ల గనులను సింగరేణికే కేటాయించాలని కోరారు. వీటిలో వెంటనే ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పీవీకే ఓసీపీ, కేటీకే ఓసీపీ, ఇల్లెందు ఓసీపీలలో బొగ్గు తీసే పనులను కాంట్రాక్టర్లతో కాకుండా సింగరేణి కార్మికులతో చేపట్టాలని కోరా రు. తమ విన్నపాలపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారని యూనియన్ నా యకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీయూసీకి చెందిన మిర్యాల రంగయ్య, కె.వీరభద్రయ్య, సారయ్య, వైవీ.రావు, మడ్డి ఎల్ల య్య, షేక్ బాజీసైదా, ఐఎన్టీయూసీ నాయకులు నర్సింహారెడ్డి, త్యాగరాజన్, సమ్మయ్య శంకర్రావు, వికాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అంబులెన్స్లో కవలలు జననం
ఆసిఫాబాద్: ప్రసవ వేదనతో బాధపడుతున్న ఓ గర్భిణిని 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పండంటి కవలలకు జన్మనిచ్చింది. ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట గ్రామానికి చెందిన ఎం.హారిక ప్రసవం కోసం ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు పరీక్షలు, స్కానింగ్ చేసిన అనంతరం గర్భంలో కవలలు ఉన్నట్లు ధ్రువీకరించారు. ఆస్పత్రిలో గైనకాలజిస్టు లేకపోవడంతో 108 అంబులెన్స్లో మంచిర్యాలకు రెఫర్ చేశారు. అంబులెన్స్లో తరలిస్తుండగా రెబ్బెన సమీ పంలో ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారని ఈఎంటీ టెక్నీషి యన్ హెచ్.వెంకటేశ్, పైలెట్ ఆర్.కార్తీక్ తెలి పారు. మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. -
సమాన పనికి సమాన వేతనం అందించాలి
ఆసిఫాబాద్రూరల్: సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి డిమాండ్ చేశారు. శనివా రం జిల్లా కేంద్రంలోని బాలికల డిగ్రీ కళాశాలలో ‘ప్రమాదంలో మహిళల హక్కులు– మన కర్తవ్యం’ అనే అంశంపై మహిళా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లుగా చైల్డ్ కేర్ లీవ్ రెండేళ్లకు గాను ఇవ్వాలని, కాంట్రాక్ట్ సిస్టంలో పని చేస్తున్న కేజీబీవీ ఉపాధ్యాయులకు సమాన పనికి సమాన వేతనం అందించాలని కోరారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్లో పని చేస్తున్న వారి కి భారతీయ లేబర్ కోడ్కు అనుగుణంగా మి నిమం పే స్కేల్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్ శారద, అధ్యాపకులు తిరుమల, శారద, సబిత తదితరులు పాల్గొన్నారు. -
వేతనాలు చెల్లించాలని నిరసన
పెంచికల్పేట్: పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని ఎల్కపల్లి అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం పలువురు కా ర్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త ఎనగందుల తిరుపతి మాట్లాడుతూ.. పోలీస్స్టేషన్లో బుచ్చక్క, జయ, సుగుణ, పంచా యతీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మల్ల క్క, నిర్మలకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పనిచేసిన కాలానికి వెంటనే జీతాలు మంజూరు చేయాలని కోరారు. వీరికి బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, బీజేపీ నాయకుడు హరీశ్, కాంగ్రెస్ నాయకుడు రమేశ్ మద్దతు తెలిపారు. -
పోచమ్మ ఆలయంలో హోమం
బెజ్జూర్: మండల కేంద్రంలో నూతనంగా ని ర్మించిన పోచమ్మ ఆలయంలో శనివారం హో మం నిర్వహించారు. అంతకుముందు అమ్మవారి విగ్రహాన్ని భాజాభజంత్రీల మధ్య ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆది వారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని వేదపండితుల మంత్రోచ్ఛారణల మ ధ్య నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదా నం చేశారు. నాయకులు మనోహర్గౌడ్, శ్రీవర్ధన్, చంద్రశేఖర్, భాస్కర్రాజు, తిరుపతి, మహేశ్, ఇస్తారి, శ్రీనివాస్ తదితరులున్నారు.