ప్రశాంతంగా అసర్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా అసర్‌ పరీక్షలు

Published Tue, Apr 8 2025 7:15 AM | Last Updated on Tue, Apr 8 2025 7:15 AM

ప్రశాంతంగా అసర్‌ పరీక్షలు

ప్రశాంతంగా అసర్‌ పరీక్షలు

కెరమెరి(ఆసిఫాబాద్‌): ఆసిఫాబాద్‌, వాంకిడి, కెరమెరి మండలాల్లోని 72 ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం అన్వల్‌ నేషనల్‌ ఎండ్‌లైన్‌ రిపోర్ట్‌(అసర్‌) పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించారు. నీతి ఆయోగ్‌ పిరమిల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 916 మంది విద్యార్థులు హాజరయ్యారు. 285 మంది 3వ తరగతి విద్యార్థులు, 315 మంది 4వ తరగతి, 316 మంది 5వ తగరతి విద్యార్థులు తెలుగు, ఆంగ్లం, గణితం పరీక్షలు రాశారు. ఆయా పాఠశాలల్లో సుమారు 85 మంది ఉపాధ్యాయులు సర్వేలో పాల్గొనగా, సీఆ ర్‌పీలు, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్‌, సీసీవోలు పర్యవేక్షించారు. నీతి ఆయోగ్‌ ప్రతినిధులు జిల్లాలోని పలు పాఠశాలలో కొనసాగిన అసర్‌ సర్వేను పరిశీలించారు. విద్యార్థుల ప్రగతిని తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement