‘వీవోఏపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి’ | - | Sakshi
Sakshi News home page

‘వీవోఏపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి’

Published Thu, Feb 20 2025 8:53 AM | Last Updated on Thu, Feb 20 2025 8:48 AM

‘వీవోఏపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి’

‘వీవోఏపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి’

దహెగాం: ఐకేపీలో వీవోఏగా విధులు నిర్వహిస్తున్న పడాల రాజ్‌కుమార్‌ గౌడ్‌పై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో సిబ్బందితో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం స్వయం సహాయక సంఘ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తున్న క్రమంలో చప్పిడి విలాస్‌ వచ్చి దాడి చేశారన్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. ఈ నిరసనలో సీఐటీయూ కమిటీ సభ్యులు క్రిష్ణమాచారి, రోజా, ఆయా మండలాల వీవోఏలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement