15 నిమిషాలు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి | - | Sakshi
Sakshi News home page

15 నిమిషాలు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి

Published Sun, Feb 23 2025 2:08 AM | Last Updated on Sun, Feb 23 2025 2:08 AM

-

కర్నూలు(సెంట్రల్‌): గ్రూపు–2 మెయిన్స్‌ పరీక్షలు ఆదివారం నిర్వహించనున్నారు. పరీక్ష రాసే వారు 15 నిమిషాలు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రాల్లోకి అనుమతించబోమని ఏపీపీఎస్‌సీ ప్రకటించింది. గ్రూపు–2 మెయిన్స్‌ పరీక్షలకు హాజరయ్యే వారు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు కార్డుతోపాటు హాల్‌ టిక్కెట్‌తో కేంద్రంలోకి వెళ్లాలి. ఆదివారం ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు మొదటి పేపర్‌, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు రెండో పేపర్‌ను నిర్వహిస్తారు. కర్నూలు జిల్లాలో 30 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, వాటిలో 9,993 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షల ఏర్పాట్లు, అధికారుల సమన్వయం కోసం జేసీ డాక్టర్‌ బి.నవ్యను కోర్డినేట్‌ అధికారిగా ఏపీపీఎస్‌సీ నియమించింది.

కలెక్టరేట్‌లో హెల్ప్‌డెస్కు

గ్రూపు–2 మెయిన్స్‌ రాత పరీక్షకు వచ్చే అభ్యర్థులు సందేహాలను నివృత్తి చేయడం కోసం కలెక్టరేట్‌లో హెల్ప్‌డెస్కును ఏర్పాటు చేశారు. ఇది ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరక అభ్యర్థులకు అందుబాటులో ఉంటుంది. సందేహాలకు 08518–277305కు ఫోన్‌ చేయవచ్చని జేసీ డాక్టర్‌ బి.నవ్య తెలిపారు. కాగా.. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది.

నేడు గ్రూపు–2 మెయిన్స్‌ పరీక్షలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement