Kurnool District Latest News
-
శ్రీశైలానికి వెళ్తుండగా ప్రమాదం
కోడుమూరు రూరల్: కర్ణాటక రాష్ట్రంనుంచి శ్రీశైలానికి వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. దుర్ఘటన ఆదివారం కోడుమూరు–కర్నూలు రోడ్డులో ప్యాలకుర్తి వద్ద చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం దావణగేరి జిల్లా నరసగండ్ల హల్లి గ్రామానికి చెందిన మురుగేంద్రయ్య, పద్మావతి, గౌరమ్మలతో పాటు మరో నలుగురు వ్యక్తులు కలిసి శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు బయలుదేరారు. కోడుమూరు దాటిన తర్వాత ప్యాలకుర్తి వద్ద కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో మురుగేంద్రయ్య, పద్మావతి, గౌరమ్మలకు రక్తగాయలవ్వగా, మిగిలిన నలుగురు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కోడుమూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారును ఢీకొన్న లారీ.. ఏడుగురికి గాయాలు -
ఎకై ్సజ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
కర్నూలు: ఎకై ్సజ్ శాఖలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుళ్ల అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక కోలాహలంగా సాగింది. మూడేళ్లకు ఒకసారి సాగాల్సిన అసోసియేషన్ ఎన్నికలు తొమ్మిదేళ్లుగా వాయిదా పడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం స్థానిక ఎకై ్సజ్ కార్యాలయంలో అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల అధికారిగా ఈఎస్టీఎఫ్ సీఐ కేఆర్ రాజేంద్రప్రసాద్ వ్యవహరించారు. కర్నూలు ఏసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పనిచేస్తున్న ఎర్రల వెంకట గిరిబాబు పూర్వపు అధ్యక్షుడు ఓబులేసుపై 86 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. మొత్తం 207 మంది ఓటింగ్లో పాల్గొనగా, గిరిబాబుకు 146, ఓబులేసుకు 60 ఓట్లు రాగా, ఒక ఓటు చెల్లలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 14 ఎకై ్సజ్ స్టేషన్లు, నంద్యాల కర్నూలు పీఎస్ కార్యాలయాలు, ఈఎస్టీఎఫ్, మోబైల్ పార్టీ, చెక్పోస్టులు, ఎన్ఫోర్స్మెంట్ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఓటింగ్లో పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అలాగే అసోసియేట్ అధ్యక్షులుగా ఎస్ఆర్ అబ్దుల్మాలిక్, ఉపాధ్యక్షులుగా బలరాముడు, పీ విరుపాక్షిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా విజయ్కుమార్, ఆర్టనైజింగ్ కార్యదర్శిగా జయచంద్రుడు, సహాయ కార్యదర్శులుగా నక్కా సుధాకర్, పాలొళ్ల జగదీష్, ప్రెస్ సెక్రెటరీలుగా కేసీ శ్రీనివాసులు, డీ దస్తగిరి, కోశాధికారిగా కల్పన, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా జీ రాణి, ఎం రవికుమార్, కే వెంకటరాముడు, డీ చిన్న అల్లస్వామి ఎన్నికయ్యారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా గిరిబాబు, విజయ్కుమార్ -
నైతిక విలువలకు ప్రాధాన్యం
కర్నూలు(సిటీ): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో నైతిక విలువలు, నాణ్యమైన విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఏపీ ప్రైవేట్ ఆన్ ఎయిడ్ స్కూల్స్ యాజమాన్య సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వీ జనార్దన్రెడ్డి, గౌరవాధ్యక్షులు జీ పుల్లయ్య అన్నారు. ఆదివారం స్థానిక సెయింట్ జోసఫ్ డిగ్రీ కళాశాలలో నగరంలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ పాఠశాలల గుర్తింపును 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పెంచాలన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఇంటి స్థలాలను, ఆరోగ్యశ్రీ కార్డులను, ఇళ్లు నిర్మించుకునేందుకు తక్కువ వడ్డీతో రుణాలను ఇప్పించాలన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్ శ్రీనివాసరెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షులు సీఆర్ షాహిదా, పట్టణ అధ్యక్షులు బీ యుగంధర్, కార్యదర్శులు కే శ్రీనివాస్, బీ మాధవక్రిష్ణతో పాటు జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారులు, స్కూళ్లకు అవసరమైన స్టాల్స్ స్టేషనరీ, యూనిఫామ్స్, లేబరెటరీ, సీసీ కెమెరాలు, కంప్యూటర్స్, ఎల్ఈడీ ప్యానల్స్, బోర్డ్స్, బుక్ పబ్లిషర్స్ పాల్గొన్నారు. ఏపీ ప్రైవేట్ ఆన్ ఎయిడ్ స్కూల్స్ యాజమాన్య సంఘం నేతలు -
శ్రీమఠంలో ‘న్యాయసుధ’ మహోత్సవం
మంత్రాలయం: శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో ప్రతి ఏటా శ్రీమన్ న్యాయసుధ మంగళ మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల నేతృత్వంలో మంగళ మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. వివిధ పీఠాధిపతులు జ్యోతి ప్రజ్వలనతో మహోత్సవానికి అంకురార్పణ పలికారు. మహోత్సవంలో భాగంగా రాఘవేంద్ర స్వామి రచించిన శ్రీమన్ న్యాయసుధ గ్రంథంపై వ్యాక్యార్థగోష్టి నిర్వహించారు. ముందుగా వేద వ్యాసుడి పూజోత్సవం, శ్రీమన్ న్యాయసుధ శోభయాత్ర భక్తులను అలరించింది. వేడుకలో వ్యాసరాజ మఠం పీఠాధిపతి విద్యాశ్రీషా తీర్థులు, శ్రీపాదరాజ మఠం పీఠాధిపతి సుజయనిధి తీర్థులు, కృష్ణాపుర మఠం పీఠాధిపతి విద్యాసాగర తీర్థులు, కనియూరు మఠం పీఠాధిపతి విద్యావల్లభతీర్థులు, శిరూర్ మఠం పీఠాధిపతి వేదవర్ధన తీర్థులు, అధమారు మఠం పీఠాధిపతి ఈషాప్రియ తీర్థులు, బందరకెరె మఠం పీఠాధిపతి విద్ద్యేశ తీర్థులు, కన్వమఠం పీఠాదిపతి విద్యాకన్వ విరాజ తీర్థులు, బాలఘర్ మఠం పీఠాధిపతి అక్షోభ్య రామ ప్రియతీర్థులు , చిత్తాపూర్ మఠం పీఠాధిపతి విద్ద్యేంద్ర తీర్థులు, ఉడిపి మఠం పీఠాధిపతులు బన్నంజే రాఘవేంద్ర తీర్థులు, వామన తీర్థులు పాల్గొన్నారు. -
ఉల్లాస్... ఉత్తుత్తి పరీక్ష!
కర్నూలు సిటీ: ఉల్లాస్ కార్యక్రమం కింద చదువు నేర్పించకుండానే ఆదివారం పరీక్ష నిర్వహించారు. ‘ఉల్లాస్’ కింద స్వయం సహాయక సంఘాల్లో నిరక్షరాస్యులను గుర్తించి వారికి చదువు నేర్పాలి. జిల్లాలోని కర్నూలు, కల్లూరు, ఓర్వకల్లు, సి.బెళగల్, దేవనకొండ, కృష్ణగిరి, కోడుమూరు, ఆస్పరి, కోసిగి మండలాల్లోని 28,872 మంది పొదుపు మహిళలకు 2,887 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎంపిక చేసిన కేంద్రాల్లో అక్షర జ్ఞానాన్ని నేర్పించే కార్యక్రమాన్ని వయోజన విద్యకు చెందిన సూపర్వైజర్లు పర్యవేక్షణ చేయాలి. కానీ వారు జిల్లా కేంద్రానికి పరిమితమై పర్యవేక్షణ చేయలేకపోయారు. కొన్ని కేంద్రాల్లో స్వచ్ఛందంగా పొదుపు సంఘాల్లోని చదువుకున్న వారు అక్షరాలను నేర్పించినా...అది సంతకాల వరకే పరిమితం అయ్యింది. కొన్ని చోట్ల మినహా చాలా చోట్ల చదువు చెప్పించకపోయినా కూడా ఆదివారం పరీక్ష నిర్వహించారు. మెజార్టీ కేంద్రాల్లో డీఆర్డీఓ గుర్తించిన నిరక్షరాస్య మహిళలు కాకుండా వారి పిల్లలు, అప్పటికే చదువుకున్న వారికి పరీక్ష నిర్వహించారు. కొన్ని చోట్ల పరీక్ష నిర్వహించకుండానే మహిళలతో సంతకాలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. తనిఖీ చేసిన డీడీ జిల్లాలో ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పరీక్షను వయోజన శాఖ డీడీ చంద్రశేఖర్ రెడ్డి తనిఖీ చేశారు. ఓర్వకల్లు మండలంలోని పాలకొల్లు గ్రామంలోని కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన వెంట పర్యవేక్షకులు నెమలయ్య ఉన్నారు. -
పేలిన వంట గ్యాస్.. ముగ్గురికి గాయాలు
ఆలూరు రూరల్: వంట గ్యాస్ లీకై సిలిండర్ పేలడంతో ముగ్గురు గాయపడ్డారు. ఇందులో గురుస్వామి, ధర్మ అనే బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. మండలంలోని కురువళ్లి గ్రామంలో ఆదివారం తెల్లవారు జామున ప్రమాదం జరిగింది. ఎస్ఐ మహబూబ్ బాషా తెలిపిన వివరాలు.. కురువళ్లి గ్రామానికి చెందిన గురుస్వామి తన భార్య గాయత్రి, కుమరుడు ధర్మతో కలిసి ఇంట్లో నిద్రపోయారు. ఆదివారం తెల్లవారు జామున చుట్టుపక్కల వారు.. గ్యాస్ లీకై న వాసన వస్తోందని గురుస్వామికి చెప్పారు. ఆయన లైట్ ఆన్ చేయగానే ఒక్క సారిగా లీకై న గ్యాస్ మంటలు చెలరేగి పెద్ద శబ్దం వచ్చింది. ప్రమాదంలో గురుస్వామి, కుమారుడు ధర్మ తీవ్రంగా గాయపడ్డారు. గాయత్రికి స్వల్పగాయాలయ్యాయి. ఇల్లు ధ్వంసమైంది. క్షతగాత్రులను ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆదోని ఆసుపత్రికి రెఫర్ చేశారు. ప్రస్తుతం గాయపడిన తండ్రి, కొడుకు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గాయపడిన వీరిలో ఇద్దరి పరిస్థితి విషమం -
‘పశుసంవర్ధక’ సంఘాలు ఏకగ్రీవం
కర్నూలు(అగ్రికల్చర్): పశుసంవర్ధక శాఖలో మూడు సంఘాలకు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. కర్నూలులోని కొండారెడ్డిబురుజు సమీపంలోని బహుళార్ధ పశువైద్యశాల ప్రాంగణంలో నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నేరియన్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అథితిగా రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్ సేవానాయక్ హాజరయ్యారు. పశుసంవర్ధక శాఖలో ప్రభుత్వ గుర్తింపు పొందిన వెటర్నరీ అసిస్టెంట్స్ అసోసియేషన్, లైవ్స్టాక్ అసిస్టెంట్స్ సర్వీస్ అసోసియేషన్, జూనియర్ వెటర్నరీ అఫీసర్స్ అసోసియేషన్/ వెటర్నరీ లైవ్స్టాక్ అఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారు. ● ఆంధ్రప్రదేశ్ నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నేరియన్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా శాఖ చైర్మన్గా జి.వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా బజారి, ఉపాధ్యక్షులుగా జనార్దన్రెడ్డి, రాముడు,వెంకట రమణయ్య, ప్రధాన కార్యదర్శిగా రంగన్న, కోశాధికారిగా గంగ ఎన్నికయ్యారు. ● లైవ్స్టాక్ అసిస్టెంట్స్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జీసీ సుబ్బరాయుడు, అసోసియేట్ ప్రసిడెంటుగా భరత్కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఆయేశ్వరి, కోశాధికారిగా రాజేష్ ఎన్నికయ్యారు. ● వెటర్నరీ అసిస్టెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా స్రవంతి, అసోసియేట్ అధ్యక్షుడుగా మద్దిలేటి, ప్రధాన కార్యదర్శిగా హనుమంతు, కోశాధికారిగా శశిధర్ ఎన్నికయ్యారు. ● ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా నాయకులు జవహర్లాల్, సాంబశివారెడ్డి, రమణ, భాస్కరనాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– ఆళ్లగడ్డ ఆర్అండ్బీ రహదారిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. సంజామల మండలం కానాలకు చెందిన మేడిగ దానియేలు(45) వ్యవసాయ, ఉపాధి పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సొంత పనుల నిమిత్తం స్కూటీపై ఆళ్లగడ్డకు వెళుతుండగా పట్టణ శివారులోని పేరా బిల్డింగ్ వద్ద అటువైపే వెళుతున్న టర్బో లారీ వెనుక వైపు నుంచి స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దానియేలు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య రాణి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళుతుండటంతో ప్రమాద ఘటనను చూసిన వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దొర్నిపాడు వద్ద లారీని ఆపి పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి శవపరీక్ష నిమత్తం మృతదేహాన్ని కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
బీసీల హక్కులను కాలరాస్తున్న పాలకులు
కర్నూలు(అర్బన్): పాలక పార్టీలు బీసీల హక్కులను కాలరాస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక బీ క్యాంప్లోని బీసీ భవన్లో జిల్లా అధ్యక్షుడు మురళీమోహన్ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావుయాదవ్, ప్రధాన కార్యదర్శి టీ మద్దులేటి, ప్రచార కార్యదర్శి ఎం. రాంబాబు, వైఎస్సార్పీపీ మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు భారతి, ఉపాధక్షులు గ్యాస్ శ్రీనివాసులు, రజక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాడాల నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ.. బీసీ కులగణన చేపట్టి జనాభా నిష్పత్తి మేరకు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లకై ఉద్యమాలను చేపడుతామన్నారు. దేశంలో, రాష్ట్రంలో బీసీల ప్రయోజనాలను దెబ్బతీస్తూ వారి హక్కులను కూడా హరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో గొర్రెల పెంపకందారుల సంఘం చైర్మన్ శ్రీనివాసులు, పలు బీసీ కుల సంఘాల నాయకులు నాగేంద్రయాదవ్, శకుంతల, ఉప్పరి శివన్న, ధర్మ, పీజీ వెంకటేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కమిటీలో పలువురికి చోటు ... ఈ నేపథ్యంలోనే బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీలో పలువురికి స్థానం కల్పించి నియామక పత్రాలను అందించారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా కుమ్మరి రామక్రిష్ణ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా కుమ్మరి రాజేశ్వరి, కార్యదర్శిగా కే శ్రీనివాసులు, కోశాధికారిగా కే బజారన్న, కే గిరిబాబు, సహాయ కార్యదర్శిగా ఎం రవికుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా ఏ నాగార్జున, జిల్లా కమిటీ ఉపాధ్యక్షులుగా బీ రాధ, కార్యదర్శిగా సీ రేణుక, కే లింగన్నను నియమించారు. -
అమ్మానాన్నను వీడి అనంతలోకాలకు..
కోసిగి: బుడిబుడి నడకలతో..వచ్చీ రాని మాటలతో... ముసిముసి నవ్వులతో అందరినీ మెప్పించే ఆ చిన్నారి ఇక లేరు. ఎప్పుడూ అమ్మానాన్న వెంటే ఉండే ఆ బాలిక ఈ లోకాన్ని వీడి వెళ్లి పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. ప్రమాదవశాత్తూ ఇంటి మిద్దైపె నుంచి పడి మృత్యువాత పడింది. ఈ దుర్ఘటన కోసిగి మండలం వందగల్లు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన లంకా ఆంజనేయులు, నాగలక్ష్మి దంపతులు వ్యవసాయ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె శ్రీదేవికి మూడేళ్లు ఉండగా.. చిన్న కుమార్తె ఏడాది వయస్సులో ఉన్నారు. ఆదివారం తల్లిదండ్రులు ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా పెద్ద కుమార్తె శ్రీదేవి (3) ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ఉంది. ఆటల్లోనే మెల్లగా మెట్లు ఎక్కి మిద్దె పైకి వెళ్లింది. అదే సమయంలో ట్రాక్టర్ శబ్దం రావడంతో తండ్రి వెళ్తున్నాడని భావించి మిద్దైపె నుంచి తొంగి చూస్తూ కింద పడిపోయింది. తలకు తీవ్రమైన రక్త గాయం కావడంతో బైక్పై కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కళ్లెదుట కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మిద్దైపె నుంచి పడి చిన్నారి మృతి -
నేడు అర్జీల స్వీకరణ
కర్నూలు(సెంట్రల్): కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు అర్జీలను సమర్పించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జాతీయ పోటీల్లో స్వర్ణం కర్నూలు (టౌన్): అహ్మదాబాదులో ఈనెల 20 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించిన సీనియర్ జాతీయ బధిరుల (డెఫ్) టెన్నిస్ క్రీడలో కర్నూలు క్రీడాకారిణి జాఫ్రీన్ బంగారు పతకం సాధించింది. కర్నూలులో డిప్యూటీ రిజిస్ట్రార్ కో–ఆపరేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఆమె మహిళల సింగిల్స్ విభాగంలో స్వర్ణం, అలాగే నంద్యాల జిల్లాకు చెందిన చందన్తో కలిసి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో బంగారు పతకం సాధించింది. దీంతో ఈ ఏడాది నవంబర్లో జపాన్ దేశంలో నిర్వహించనున్న అంతర్జాతీయ బధిరుల ఒలింపిక్స్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. ఈ సందర్భంగా క్రీడా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘాకర్నూలు: జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోటు చేసుకుంటున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకొని జిల్లా పోలీస్ శాఖ రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా అంతటా పోలీస్ స్టేషన్ల వారీగా 584 మంది రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి గౌరవ ప్రదమైన జీవితం కొనసాగించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు కౌన్సెలింగ్ ఇస్త్తూనే, కొత్తగా కేసుల్లో ఇరుక్కున వారి జాబితాను సిద్ధం చేస్తున్నారు. స్టేషన్ల వారీగా రౌడీ షీటర్లు జీవనోపాధికి చేస్తున్న వృత్తులపై కూడా ఆరా తీస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే, పోలీస్ శాఖ పరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సబ్ డివిజన్ల వారీగా రౌడీ షీటర్లు ఇలా ... జిల్లాలోని వివిధ సబ్ డివిజన్ల వారీగా 584 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. అందులో కర్నూలు సబ్ డివిజన్ పరిధిలో 199 మంది, ఆదోని 87, పత్తికొండ 112, ఎమ్మిగనూరులో 186 మంది ఉన్నారు. -
జలం ఇవ్వలేక చేతి పంపులు ‘బోరు’మంటున్నాయి. బిందె నీటిని కూడా ఇవ్వలేక మంచినీటి పథకాలు దిష్టిబొమ్మల్లా మారాయి. చుక్కనీరు అందక పల్లెల్లో ‘దాహం’ కేకలు వినిపిస్తున్నాయి. మంచినీటి కోసం పనులు మానుకొని ప్రజలంతా ఇంటి వద్దే ఉండాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయ
హొళగుంద మండలం నెరణికి గ్రామంలో నీటి కోసం బిందెలను తీసుకొచ్చిన దృశ్యం● ఎండాకాలంలో ప్రజలకు అందని మంచినీరు ● తుంగభద్ర దిగువ కాలువ ఉన్నా తప్పని తిప్పలు ● 76 గ్రామాల్లో నీటి ఎద్దడి ఉంటుందని అధికారుల అంచనా ● రూ.6.91 కోట్ల ప్రతిపాదనలు పంపినా కనిపించని ఫలితం ● అడుగంటుతున్న ఎస్ఎస్ ట్యాంకుల్లోని నీటి నిల్వలుకర్నూలు(అర్బన్): వేసవి కాలం ప్రారంభం కావడం, భూగర్భ జలాలు అడుగంటడం తదితర కారణాలో జిల్లాలో అనేక గ్రామాలు తాగునీటి ఇబ్బందులను చవిచూస్తున్నాయి. పల్లెల్లో చేతిపంపులు పనిచేయకపోవడంతో ప్రజలు వ్యవసాయ బావులు, బోర్లపై ఆధారపడ్డారు. తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొని జిల్లా పశ్చిమ ప్రాంతంలో పరిస్థితి దయనీయంగా మారింది. పలు గ్రామాల్లో సమీపంలోని ఎస్ఎస్ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా ప్రజల అవసరాలకు సరిపోవడం లేదు. కొంతమేర ముందస్తు చర్యలు చేపట్టినా.. ఆయా ఎస్ఎస్ ట్యాంకుల్లోని నీటి నిల్వలు రోజు రోజుకు తగ్గిపోతుండడంతో భవిష్యత్తును తలచుకొని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు రిజర్వాయర్లు, ఎస్ఎస్ ట్యాంకుల నుంచి సరఫరా అవుతున్న నీరు చివరి గ్రామాల వరకు వెళ్లకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నీరు బంద్ అయితే.. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఎస్ఎస్ ట్యాంకులన్నీ తుంగభద్ర దిగువ కాలువ (ఎల్ఎల్సీ) నీటిపై ఆధారపడినవే. ఈ నీటిని ఈ నెలాఖరు, ఏప్రిల్ 10వ తేదీన బంద్ చేసే అవకాశాలు ఉన్నట్లు నీటిపారుదల అధికారులు చెబుతున్నారు. ఈ నీరు బంద్ అయితే ఈ నీటిపై ఆధారపడిన ఎస్ఎస్ ట్యాంకుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వేసవి ప్రారంభంలోనే ఎల్ఎల్సీ నీటితో ఆయా ప్రాంతాల్లోని ఎస్ఎస్ ట్యాంకులన్నింటినీ మందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఒకటికి రెండు సార్లు నింపారు. దీంతో నీటి సమస్య ఎక్కడా ఉత్పన్నం కాలేదు. ప్రస్తుతం ఎస్ఎస్ ట్యాంకుల్లో కూడా 50 నుంచి 75 శాతం నీటి నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు నాటికి ఈ నిల్వలు మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికై నా ఎల్ఎల్సీ నీటితో మరోసారి ఆయా ట్యాంకులను నింపుకోగలిగితే కొంత ఉపశమనం లభించే అవకాశాలు ఉంటాయి. స్పందించని ప్రభుత్వం జిల్లాలో ప్రస్తుత వేసవిలో 76 గ్రామాలు తీవ్ర మంచినీటి ఎద్దడికి గురయ్యే ప్రమాదం ఉందని, ఆయా గ్రామాల్లో వేసవి దాహార్తిని ఎదుర్కొనేందుకు రూ.6.91 కోట్లు వ్యయం కానుందని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పటికే అనేక గ్రామాల్లో ట్రాన్స్పోర్టేషన్, హైరింగ్ ద్వారా నీటిని అందించాల్సిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాగునీటికి 2 కిలోమీటర్లు వెళ్లాల్సిందే విద్యుత్ తీగలు తెగిపోవడం, పైప్లైన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో గోనెగండ్ల మండలం బీ అగ్రహారం గ్రామానికి చెందిన ప్రజలు గత వారం రోజులుగా గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ బోర్ల నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. సైకిళ్లు, తోపుడు బండ్లు, మోటారు సైకిళ్లపై బిందెలు వేసుకొని పోయి నీటిని తెచ్చుకుంటున్నారు. అలాగే మండల కేంద్రమైన గోనెగండ్లలో కూడా నాలుగు రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బైలుప్పల, హెచ్ కై రవాడి గ్రామంలోని బీసీ, జమ్మన్న కాలనీల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. అలాగే ఎమ్మిగనూరు మండలంలోని అల్వాల ఎస్ఎస్ ట్యాంకు నుంచి మూడు రోజులకు ఒకసారి నీరు వదులుతుండడం వల్ల పెసలదిన్నె, గార్లదిన్నె తీవ్ర మంచి నీటి ఎద్దడి నెలకొంది.గ్రామీణం.. ప్ర‘జల’ కష్టం ఆలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన అనేక గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొనింది. హాలహర్వి మండలం బాపురం రిజర్వాయర్ నుంచి 27 గ్రామాలకు, చింతకుంట రిజర్వాయర్ నుంచి 11 గ్రామాలకు నీటిని సరఫరా చేయాల్సి ఉంది. అయితే పైప్లైన్లు లీకేజీ కావడం, ఓహెచ్ఎస్ఆర్లు శిథిలావస్థకు చేరడంతో పదుల సంఖ్యలో గ్రామాలకు నీరందని పరిస్థితి నెలకొనింది. చింతకుంట రిజర్వాయర్ కింద టీ చాకిబండ, మల్లికార్జునపల్లి, అమృతాపురం, బళ్లూరు తదితర గ్రామాలకు నీరు అందడం లేదు. బాపురం రిజర్వాయర్ కింద ఆస్పరి మండలంలోని చిన్నహోతూరు, జోహరాపురం, నాగనాథనహళ్లి రిజర్వాయర్ కింద చిగిలి, తంగరడోణ, అలాగేర, శంకరబండ, నగరూరు గ్రామాల్లో ప్రజల క‘న్నీటి’ కష్టాలు కనిపిస్తున్నాయి. ఎండుతున్న గొంతులుహొళగుంద మండలం విరుపాపురం ఎస్ఎస్ ట్యాంకు నుంచి నీరు సరఫరా కాకపోవడంతో నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెరణికి గ్రామంలో 2 వేల జనాభా ఉందని, 100 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా స్పందన కరువైంది. అ లాగే మంత్రాలయం మండలంలోని చెట్నేహళ్లి, కల్లుదేవకుంట గ్రామాలకు ఎన్ఏపీ స్కీం నుంచి నీరు అందడం లేదు. గొంతులు ఎండుతున్నా యని, తాగునీటి సమస్య తీర్చాలని ఆయా గ్రామాల ప్రజలు ఇటీవలే ఎన్ఎహ్ 167పై రాస్తారోకో నిర్వహించారు. అయినా స్పందన లే దు. ఎన్ఏపీ స్కీం నుంచి నందవరం మండలం ఇబ్రహీంపురం, ఇబ్రహీంపురం కొట్టాల, మంత్రాలయంతోపాటు మరో మూడు గ్రామాలకు అరకొరగా నీరు సరఫరా అవుతోంది. అంతటా నీటి ఎద్దడేపత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలం లింగనేనిదొడ్డి, పత్తికొండ మండలం అటికెలగుండు, దేవనబండ, చక్రాళ్ల, పెండ్లిమాన్ తండా, కృష్ణగిరి మండలం బాపనదొడ్డి, పెద్దొడ్డి, బోయబొంతిరాళ్ల గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడింది. అలాగే ఆదోని మండలం బసరకోడు, అలసందగుత్తి, దిబ్బనకల్, నెట్టేకల్, చిన్న పెండేకల్, పెద్ద పెండేకల్, బైచిగేరి తదితర గ్రామాల్లో బోర్లు సరిగా పనిచేయడం లేదు. పైప్లైన్లు సక్రమంగా లేకపోవడం వల్ల నీటి ఇబ్బందులు తలెత్తాయి. జిల్లాలో చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి కనిపిస్తోంది. -
కేజీబీవీ పిలుస్తోంది!
● అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం ● వచ్చే నెల 11వ తేదీ వరకు గడువు కర్నూలు సిటీ: కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) అడ్మిషన్లకు ప్రతి ఏటా పోటీ పెరుగుతోంది. 2025–26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఇటీవలే నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఆన్లైన్లో శనివారం నుంచి వచ్చే నె ల 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్(మధ్యలో చదువు మానేసిన వారు), పేద, బడుగు, బలహీన, మైనార్టీ, బీపీఎల్ కుటుంబాల్లోని బాలికలు మాత్రమే అర్హులు. అర్హులైన వారు https:// apkgbv.apcfss.in అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకే... బాలికల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు 2004–05 విద్యా సంవత్సరంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలను ఏర్పాటు చేశారు. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మొదటగా ఏర్పాటు చేసిన స్కూళ్లలలో 9,10 తరగతులకు అప్గ్రేడ్ చేశారు. ఇక్కడ చదువుతున్న బాలికలు సెకెండరీ విద్యకు దూరం అవుతున్నారని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ స్కూళ్లలో ఇంటర్మీడియెట్, వృత్తివిద్య కోర్సులను ప్రవేశ పెట్టింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 54 కస్తూర్బా గాంఽధీ బాలిక విద్యాలయాలు ఉండగా.. 6 నుంచి 10వ తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియేట్ విద్య, వృత్తి విద్యా కోర్సులు ఆంగ్ల మాధ్యమంలో అందిస్తున్నారు. ప్రతి తరగతికి 40 సీట్లు ఉన్నాయి. మైనార్టీలకు ప్రత్యేక కేజీబీవీలు, ఉర్దూ మీడియంలో సైతం ఓ కేజీబీవీ స్కూల్ అందుబాటులో ఉంది. -
రిజర్వాయర్ల విస్తరణ జరగాలి
ఆలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉంది. జనాభా పెరిగిన నేపథ్యంలో చింతకుంట, బాపురం రిజర్వాయర్లను విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దశాబ్దాల క్రితం వేసిన పైప్లైన్ల లీకేజీలతో అనేక గ్రామాల్లో నీటి సమస్య ఉత్పన్నమవుతోంది. అలాగే ఆలూరు చెరువు అన్యాక్రాంతం కాకుండా ఎస్ఎస్ ట్యాంకు నిర్మించాల్సి ఉంది. అలాగే సమ్మతగేరిలో ఎస్ఎస్ ట్యాంకు, జే హొసళ్లి, బండగట్టులో ఓహెచ్ఎస్ఆర్లు నిర్మించాలి. దేవనకొండ మండలం కొత్తపేట, పుల్లాపురం గ్రామాలకు పైప్లైన్ వేయాలి. పందికోన రిజర్వాయర్ నుంచి పైప్లైన్ వేస్తే ఆస్పరి మండలంలోని పలు గ్రామాల నీటి సమస్య తీరే అవకాశం ఉంటుంది. – బీ విరూపాక్షి , ఆలూరు ఎమ్మెల్యే శాశ్వత పరిష్కారం చూపాలి ఆస్పరి మండలంలోని జొహరాపురం గ్రామానికి శాశ్వత మంచినీటి పరిష్కారం చూపాలి. పలుమార్లు అధికారులు, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్యకు పరిష్కారం లభించడం లేదు. అనేక సంవత్సరాలుగా గ్రామంలోని వక్కిరేణి నీటిని తాగుతూ ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఒక ట్యాంకర్ రూ.800 పెట్టి కొనుగోలు చేస్తున్నారు. గ్రామ సమీపంలో రిజర్వాయర్ నిర్మించి హంద్రీనీవా కాలువ నుంచి పైప్లైన్ ద్వారా నిల్వ చేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. – చంద్ర, జొహరాపురం, ఆస్పరి మండలం చర్యలు చేపడతాం ప్రస్తుత వేసవిలో జిల్లాలో తాగునీటి ఎద్దడికి గురయ్యే గ్రామాలను ఇప్పటికే క్షేత్ర స్థాయిలోని అధికారుల ద్వారా నివేదికలు తెప్పించుకొని గుర్తించాం. ఆయా గ్రామాల ప్రజల నీటి కష్టాలను తొలగించేందుకు అవసరమైన ముందస్తు చర్యలను చేపడతాం. అవసరమున్న జనవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు కార్యాచరణను రూపొందించాం. ఎల్ఎల్సీకి నీరు బంద్ కాకముందే మరోసారి కెనాల్ పరిధిలోని ఎస్ఎస్ ట్యాంకులన్నింటినీ నింపుకుంటాం. ఇప్పటికే వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు రూ.6.91 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. – బీ నాగేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ● -
విత్తనాల డీలర్లకు లైసెన్స్ తప్పనిసరి
కర్నూలు(అగ్రికల్చర్): విత్తనాల డీలర్లకు తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలని, ఎరువులు, పురుగుమందులు కూడా లైసెన్స్తోనే విక్రయించాలని రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ డాక్టర్ ప్రవీణ్ అన్నారు. వ్యవసాయ శాఖ రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఫర్టిలైజర్ దుకాణాలు నిర్వహించుకోవాలని సూచించారు. కర్నూలు, పత్తికొండ సబ్ డివిజన్లోని మండలాలతో పాటు గోనెగండ్ల మండలాలకు చెందిన డీలర్లకు జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం నాయకులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ...ప్రతి డీలరు లైసెన్స్ కాపీలను దుకాణంలో అందరికి కనిపించే విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి మాట్లాడుతూ.. ఎరువులు, విత్తనాలకు కొంతమంది కృత్రిమ కొరత సృష్టిస్తుంటారని, ఇది మంచిది కాదన్నారు. ఈ సందర్బంగా డీలర్లకు ఉపయోగపడే విధంగా కరదీపిక బుక్లెట్ను విడుదల చేశారు. జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు విశ్వనాథ్, దస్తగిరిరెడ్డి, ఆత్మ డీపీడీ శ్రీలత, ఏడీఏలు సాలురెడ్డి, మహమ్మద్ ఖాద్రీ, మోహన్విజయ్, అరుణకుమారి, తెలుగు రాష్ట్రాల సీడ్మెన్ అసోషియేషన్ అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల డీలర్ల సంక్షేమ సంఘం నేతలు అశోకానందరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం నేతలు రామకృష్ణ, మధుమతి తదితరులు పాల్గొన్నారు. -
పిడుగుపాటుతో రైతుకు అస్వస్థత
గోనెగండ్ల: వర్షం కురుస్తూ.. ఉరుములు, మెరుపు రావడంతో పొలం నుంచి ఇంటికి వస్తున్న రైతు అస్వస్థతకు గురయ్యాడు. చేతికి, వీపుకు గాయలై స్పృహ కోల్పోయి పడిపోయాడు. ఈ ఘటన గోనెగండ్ల గ్రామ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. గోనెగండ్లకు చెందిన అంగడి మాబుసాహె బ్ అనే రైతు గ్రామ శివారులో తనకు ఉన్న మూడు ఎకరాల భూమిలో సజ్జ పంటను సాగు చేశాడు. శనివారం సాయంత్రం పొలానికి వెళ్లగా అనుకోకుండా ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు వస్తుండడంతో మాబు సాహెబ్ ఇంటికి వెళ్లేందుకు తన బైకు దగ్గరకు వచ్చి స్పృహ కోల్పోయి పడిపోయాడు. ఆ దారిలో ఆటోలో వెళ్తున్న ఇతర రైతులు, కూలీలు స్పృహ కోల్పోయి పడిఉన్న రైతును గమనించి గోనెగండ్ల ఆస్పత్రికి తీసుకువచ్చారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆటోలో ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. -
శ్రీశైలానికి తరలివస్తున్న కన్నడిగులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల క్షేత్రానికి కన్నడిగులు భారీగా తరలివస్తున్నారు. ఉగాది మహోత్సవాలు సమీపిస్తుండటంతో వేలాది మంది భక్తులు పాదయాత్రగా, వాహనాల్లో చేరుకుంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తజనంతో క్షేత్ర వీధులు కిటకిలాడుతున్నాయి. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి బారులుదీరారు. ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీ వరకు కన్నడ భక్తుల కోసం విడతల వారీగా మల్లన్న స్పర్శదర్శనాన్ని ఏర్పాటు చేశారు. కన్నడ భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతుంది. -
చట్టాలపై అవగాహన అవసరం
కర్నూలు(అర్బన్): బాలల పరిరక్షణ, బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు సంబంధించిన చట్టాలపై అవగాహన పెంచుకోవాలని డీసీపీఓ శారద కోరారు. శనివారం సాయంత్రం స్థానిక పెద్దపాడులో జేజే యాక్ట్, పోక్సో యాక్ట్పై బాలల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ బాల బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపుల నుంచి రక్షించేందుకు 2012లో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింద న్నారు. బాల బాలికలపై ఎక్కడైనా లైంగిక వేధింపులు జరిగితే ఫిర్యాదు చేసేందుకు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఆన్లైన్ ద్వారా ఈ బాక్స్ ఏర్పా టు చేయడం జరిగిందన్నారు. లీగల్ కం ప్రొఫెషనల్ ఆఫీసర్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు బాలబాలికలు ఎవరైనా నేరాలకు గురైనప్పుడు అలాంటి వారిని బాలల న్యాయమండలి ముందు ప్రవేశ పెడతామన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు జమీలబేగం, చోటీమాబేగం,ప్రొటెక్షన్ ఆఫీసర్ పద్మ, నాన్ ప్రొటెక్షన్ ఆఫీసర్ దీపారాణి, డీసీపీయు సిబ్బంది శ్వేత పాల్గొన్నారు. -
కర్రలపై 450 కి.మీ పాదయాత్ర
దారి పొడవునా వడివడిగా అడుగులు వేసుకుంటూ కన్నడిగులు శ్రీగిరి వైపు సాగిపోతున్నారు. వారిలో కొందరు కాళ్లకు కర్రలకు కట్టుకుని నడుస్తూ భక్తిని చాటుతున్నారు. కర్ణాటక రాష్ట్రం భాగల్కోట్ జిల్లా నీల్లోఖేరీ గ్రామానికి చెందిన కృష్ణగౌడు ఆరు అడుగుల ఎత్తైన కర్రలతో, మంజునాథ్ తల్వార్, మండేస్దేవూర్ శివ్దళ్వార్, హనుమంత్తల్వార్ నాలుగు అడుగుల ఎత్తైన కర్రలతో శ్రీశైలానికి వెళ్తున్నారు. తొమ్మిది రోజుల క్రితం బయలుదేరి దాదాపు 450 కి.మీ ప్రయాణించి జూపాడుబంగ్లా చేరుకున్నారు. మల్లన్న స్వామి తమ కోర్కెలు నెరవేర్చడంతో కర్రలపై నడుస్తూ మొక్కు తీర్చుకుంటామని వారు తెలిపారు. – జూపాడుబంగా్ల -
ఆకట్టుకోని పవన్ ప్రసంగం
పాణ్యం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్నా ఇప్పటికీ తాము చేసిన అభివృద్ధి ఇదీ అని చెప్పుకోలేకపోతున్నారు. ఎంతసేపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విమర్శలు చేయడంతోనే సరిపెడుతున్నారు. శనివారం కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఇదే పంథా కొనసాగించారు. దీంతో ఆయన ప్రసంగానికి ప్రజల నుంచి స్పందన కరువైంది. కార్యక్రమం నిర్వహించిన ఊరి పేరు పూడిచెర్ల అనబోయి ఉప్పలపాడుగా సంభోదించారు. సభకు పొదుపు సంఘాల మహిళలను పెద్ద ఎత్తున తరలించారు. అయితే పవన్ ప్రసంగిస్తుండగానే మహిళలు ఇంటిబాట పట్టడం కనిపించింది. ఇకపోతే కర్నూలు జిల్లాలో కూటమి ఎమ్మెల్యేలు పది మంది ఉండగా.. కార్యక్రమంలో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే పాల్గొనడం గమనార్హం. -
కోసిగిలో ‘గరివిడి లక్ష్మీ’ షూటింగ్
కోసిగి: గరివిడి లక్ష్మీ చిత్ర యూనిట్ సభ్యులు శనివారం కోసిగిలోని దొరల ఇంటి ఆవరణలో షూటింగ్ చేశారు. గరివిడి లక్ష్మీ అనే సినిమాలో ఆనంది హీరోయిన్గా నటిస్తున్నారు. కోసిగిలోని దొరల ఇంటిలో గ్రామీణ ప్రాంత సర్పంచ్ సన్నివేశం చిత్రీకరించారు. సాయంత్రం గ్రామ సమీపంలో ఓ మొక్కజొన్న పైరులో మరికొన్ని సన్నివేశాలు చీత్రికరిస్తున్నట్లు యూనిట్ సభ్యులు తెలిపారు. గ్రామంలో దొరల ఇంటిలో షూటింగ్ జరుగుతుండడంతో చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు చూడడానికి ఎగపడ్డారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ బందోబస్తు కల్పించారు. -
చంద్రబాబుకు తొత్తుగా మందకృష్ణ మాదిగ
● మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి కర్నూలు(టౌన్): మరుగున పడిన ఎస్సీ వర్గీకరణను ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి యూపీఏ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉషా మెహ్రా కమిషన్ వేయించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు మాదిగ జాతికి ప్రతినిధిగా చెప్పుకునే మందకృష్ణ మాదిగ చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారన్నారు. రాజకీయ పదువుల్లో కూడా రాష్ట్రంలో ముగ్గురు మాదిగ కులస్థులకు జిల్లా పరిషత్ చైర్మన్ పదువులు ఇచ్చి గౌరవం కల్పించిన ఘనత దివంగత వైఎస్సార్కే దక్కుతుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి ప్లీనరీలోనే ఎస్సీ వర్గీకరణ అంశంపై తీర్మానం చేశారన్నారు. 30 ఏళ్లకు పైగా పోరాటంలో మాదిగలకు సుప్రీం కోర్టు తీర్పు వల్ల న్యాయం జరుగుతుందని, దీన్ని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందన్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికై నా రెండు కళ్ల సిద్ధాంతం మానుకోవాలని, సుప్రీం కోర్టు తీర్పు లేకపోతే ఆయన ఎప్పటికీ వర్గీకరణకు ఆమోదం తెలిపేవాడు కాదన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధనలో అమరులైన ఏడుగురికి రూ.25లక్షల ఎక్స్గ్రేషియా ఇప్పించాలని మందకృష్ణను డిమాండ్ చేశారు. -
వడగండ్లు.. కడగండ్లు
కర్నూలు(అగ్రికల్చర్)/సి.బెళగల్: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వడగండ్లతో కూడిన అకాల వర్షాలు కురిశాయి. దీంతో పలు గ్రామాల్లో దాదాపు గంటకుపైగా విద్యుత్ సరఫరా నిలిపోయింది. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వడగండ్ల వానలతోపాటు గాలి తీవ్రత ఉండటంతో పలుచోట్ల మామాడితోటల్లో కాయలు నేలరాలాయి. చాలా చోట్ల రాళ్లతో కొట్టినట్లుగా వర్షం కురిసింది. సి.బెళగల్తో పాటు కంబదహాల్, కృష్ణదొడ్డి, వెల్దుర్తి, ఆస్పరి మండలంలో చిన్నహోతూరులో భారీ చినుకులలో వడగండ్లు కురిశాయి. వర్షాలతో భానుడి భగభగలు కొద్దిగా తగ్గడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఊరట పొందారు. ఆది, సోమవారాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. -
టిప్పర్ కింద పడి వ్యక్తి దుర్మరణం
బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. గూడూరు మండలం నాగలాపురం గ్రామానికి చెందిన కురువ సుధాకర్, తన సోదరుడు కుమారుడు శివతో కలిసి మద్దిలేటి నరసింహస్వామి ఆలయానికి బైక్పై వచ్చారు. స్వామి దర్శనం అనంతరం స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి కింద పడటంతో టిప్పర్లు టైర్ల కురువ సుధాకర్ (44)పై ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శివ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరు కుని ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రాణం తీసిన విద్యుదాఘాతం ఆదోని అర్బన్: విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ దుర్ఘటన శనివారం ఆదోని మండలం సాదాపురం గ్రామంలో చోటు చేసుకుంది. తాలూకా పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 16 మంది ఆదోని మండలం సాదాపురం గ్రామంలో త్రీఫేజ్ విద్యుత్ లైనింగ్ పనులు చేస్తున్నారు. రెండు ట్రాన్స్ఫార్మర్లు ఉండగా.. ఒకదానిని మాత్రమే ఆఫ్ చేశారు. రెండో ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేయకుండా పనులు చేస్తుండగా.. జార్ఖండ్ రాష్ట్రంలోని లోడాసోయి గ్రామానికి చెందిన జయరామ్పార్థర్(24) విద్యుత్షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని బంధువులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు న్నట్లు పోలీసులు చెప్పారు. ఈతకు వెళ్లి బాలుడి మృతి కోడుమూరు రూరల్: ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు ఒక బాలుడు నీటమునిగి మృతిచెందాడు. ఈ ఘటన శనివారం పులకుర్తి గ్రామంలో చో టు చేసుకుంది. గ్రామానికి చెందిన సత్యన్న, మల్లీశ్వ రీ దంపతుల పెద్ద కుమారుడు వరుణ్తేజ్ (7) కోడుమూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నాడు. అయితే ఒంటిపూ ట బడులు కావడంతో శనివారం మధ్యాహ్నం పాఠశాల నుంచి ఊరికి వెళ్లాడు. ఇంటి సమీపంలో ఉన్న సుంకులమ్మ వంకకు బాలుడు ఈతకు వెళ్లాడు. అయితే ఈత సరిగా రాకపోవడం, వంక లోతుగా ఉండడంతో వరుణ్తేజ్ నీటిలో మునిగిపోయాడు. చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోవడంతో బాలుడు నీట మునిగి మృతిచెందాడు. కూలి పనికి వెళ్లి వచ్చిన తండ్రి కుమారుడి కోసం వెత కగా వంకలో మృతదేహం కనిపించింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు నీట ము నిగి మృతిచెందడంతో అప్పుడే నూరేళ్లు నిండా యా నాన్న అంటూ ఆ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు చూపరులను సైతం కంటతడి పెట్టించింది. బాలుడు నీట మునిగి మృతిచెందడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఉల్లాస్.. తుస్..!
ఒక్క రోజూ కూడా తరగతులు నిర్వహించ లేదు మాది కానాల గ్రామం. ఇక్కడ ఒక్క రోజు కూడా అభ్యసనా తరగతులు నిర్వహించలేదు. మాకు ఒక్క పాఠ్యపుస్తకం ఇవ్వలేదు. అసలు ఉల్లాస్ కార్యక్రమం గురించే తెలియదు. పరీక్షలు ఎక్కడ పెడతారు? ఏమి రాయాలో తెలియదు. అధికారులెవ్వరూ ఒక్క రోజూ కూడా రాలేదు. మమ్మల్ని ఏమి అడగలేదు. – కమాల్బీ, నిరక్షరాస్యురాలు, కానాల, నంద్యాల మండలం తరగతులు నిర్వహించారు ఉల్లాస్ కార్యక్రమంలో ప్రతి గ్రామంలో వలంటీర్లు రోజూ అభ్యసనా తరగతులు నిర్వహించారు. తాను, మా సిబ్బంది పర్యవేక్షించాం. ఫొటోలు కూడా మా ఉన్నతాధికారులకు అప్లోడ్ చేశాం. పరీక్షలు రాసే విధంగా అభ్యాసకులను ఇప్పటికే సిద్ధం చేశాం. –భాస్కరరెడ్డి, నోడల్ ఆఫీసర్, నంద్యాల ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. మహిళ చదువుకుంటే ఆమెలో ఆత్మవిశ్వాసం పెరిగి పిల్లల పెంపకంతో పాటు ఆర్థిక వ్యవహరాల్లో స్వతంత్య్రంగా వ్యవహరించనుంది. కుటుంబానికి సారథిగా ఎదిగి రాణించే అవకాశం కలుగుతుంది. ఈ నేపథ్యంలో మహిళల్లో అక్షరాస్యత శాతం పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అధికారుల నిర్లక్ష్యంతో లక్ష్యం నీరుగారిపోతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉల్లాస్ కార్యక్రమం అధికారుల పర్యవేక్షణ లేక తుస్స్మంది. నేడు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా ఇప్పటి వరకు పలు చోట్ల అభ్యసన తరగతులు చేపట్టకపోవడం, పుస్తకాలు సైతం పంపిణీ చేయకపోవడం విడ్డూరం. నంద్యాల(న్యూటౌన్): గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉల్లాస్ కార్యక్రమం జిల్లాలో తుస్సుమంది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఎక్కడా అభ్యసనా తరగతులు సక్రమంగా నిర్వహించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నేడు ఆదివారం జరగనున్న అర్హత పరీక్ష గురించి వారికి తెలియదంటున్నారంటే అధికారుల తీరు ఎలా ఉందో అర్థమవుతోంది. ప్రస్తుత రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు నిరక్షరాస్యత అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఉల్లాస్ పేరుతో చదవడం, రాయడం నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. పొదుపు సంఘాల మహిళలు, పాఠశాలల్లో పని చేస్తున్న వంట ఏజెన్సీ నిర్వాహకులు, ఆయాలు, అంగన్వాడీ కేంద్రాల ఆయాలకు రాత్రి పూట రెండు గంటల పాటు అభ్యసనా తరగతులు నిర్వహించాలి. జిల్లాలోని ప్రతి మండలం నుంచి 1000 మంది చొప్పున మొత్తం 26,784 మందిని గుర్తించారు. వీరికి గత ఏడాది డిసెంబర్ 24 నుంచి తొలి విడతగా అభ్యసనా తరగతులు ప్రారంభించారు. వీరిలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎక్కువ మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులే. వీరికి బోధించేందుకు ప్రతి పది మందికి ఒకరు చొప్పున సంఘంలో విద్యావంతులైన ఒక స్వచ్ఛంద శిక్షకురాలిని నియమించారు. రోజుకు రెండు గంటల పాటు ఆయా గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రం, సామాజిక భవనం, ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఎక్కడో ఒక చోట అభ్యసనా తరగతులు నిర్వహించాలి. అభ్యసనా సామగ్రి కూడా ప్రభుత్వం అందజేసింది. అయితే ఉల్లాస్ కార్యక్రమంలో గ్రామాల్లో అభ్యసనా తరగతులు తూతూ మంత్రంగా సాగినట్లు తెలుస్తోంది. నమోదైన మహిళలందరికీ వలంటీర్లు ప్రాథమిక అక్షరాస్యత పరీక్ష ఈ నెల 23వ తేదీన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ద్వారా నిర్వహించేందుకు సన్నద్ధం చేశారు. ఎలా రాయాలో? ఏమి రాయాలో! ఈనెల 23న ఉల్లాస్ పరీక్ష ఉండటంతో అభ్యసకులు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో ఎక్కడా సక్రమంగా అభ్యసనా తరగతులు జరగలేదని.. ఎక్కడో జరిగినా అవి తూతూ మంత్రంగా జరిగాయని విమర్శలు వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు కూడా ఉల్లాస్ శిక్షణ తరగతులు పర్యవేక్షణ చేయలేదని, అక్కడక్కడా ఫొటోలకు ఫోజులిచ్చి వెళ్లిపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్వాక్రా మహిళలు కనీసం ఒక్క రోజూ కూడా అభ్యసన తరగతులు నిర్వహించలేదని, చదువుకునేందుకు ఒక్క పాఠ్యపుస్తకం ఇవ్వలేదు చెబుతున్నారు. ఈ నెల 23వ తేదీన అర్హత పరీక్ష నిర్వహిస్తారని తెలిసిందని, ఆ పరీక్షలో ఏమి రాయాలో, ఎలా రాయా లో తెలియక ఆందోళనగా ఉందని చెబుతున్నారు. ఉల్లాస్ కార్యక్రమంలో అభ్యసనా తరగతుల నిర్వహణకు ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు పెట్టి పాఠ్య పుస్తకాలు, అభ్యాసకుల హాజరు పట్టికలు ముంద్రించింది. వాటిని పూర్తి స్థాయిలో పంపిణీ చేయక పోవడంతో స్థానిక వెలుగు కార్యాలయాల్లో మూల న మగ్గుతున్నాయి. మహిళలందరినీ విద్యావంతు లు చేయాలనే కేంద్ర ప్రభుత్వం లక్ష్యానికి అధికారులుతూట్లు పొడుస్తున్నారని, రూ.కోట్లు ప్రజాధనం వృథా అవుతుందని జిల్లాలో పలువురు విమర్శిస్తున్నారు. జిల్లాలో ఇలా.. పరీక్ష కేంద్రాలు : 760 పరీక్ష రాయనున్న వారు : 26,784 పరీక్ష తేదీ : 23-03-2025 సమయం : ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు గ్రామాల్లో కానరాని అభ్యసనా తరగతులు అధికారుల పర్యవేక్షణ కరువు నేడు పరీక్ష ..అభ్యాసకుల ఆందోళన జిల్లాలో పరీక్షకు హాజరు కానున్న 26,784 మంది -
లెక్కలేకుండా ఖర్చు పెట్టేస్తున్నారు
ఆన్లైన్ లావాదేవీల కారణంగా బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యేవరకు మనం ఎంత ఖర్చు పెట్టామో తెలియని పరిస్థితి. దీనికితోడు ఏ వస్తువును ఎంతకు కొనుగోలు చేస్తున్నారో కూడా తెలియకుండా, బేరమాడకుండా కొనేస్తున్నారు. సాధారణంగా మనం కిరాణా దుకాణానికి వెళ్తే సరుకులకు దేనికి ఎంత బిల్లు వేశాడో చూస్తాము. కానీ డిజిటల్ పేమెంట్స్ కారణంగా ఇవేమీ పట్టించుకోవడం లేదు. షాపువారు ఎంత చెబితే అంత చెల్లించి వచ్చేస్తున్నారు. దీనివల్ల డబ్బు విలువ చాలా మందికి తెలియకుండా పోతోంది. ముఖ్యంగా ఈ తరం యువతకు అస్సలు తెలియడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
చిల్లర కొరత తీరింది
మాది జనరల్ స్టోర్. రూ.10 నుంచి రూ.5వేల వరకు వివిధ రకాల వస్తువులు విక్రయిస్తాం. వీటిని కొనుగోలు చేసేందుకు ప్రతిరోజూ ఎంతో మంది వస్తుంటారు. ఈ క్రమంలో చిల్లర కొరత బాగా ఎదురయ్యేది. ముఖ్యంగా రూ.10, రూ.20 నోట్ల కొరత కారణంగా ఇబ్బంది పడేవాళ్లం. డిజిటల్ పేమెంట్స్ రాకతో చిల్లర సమస్య తీరింది. 90 శాతం మంది వీటి ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. – జి.రాజశేఖర్, వ్యాపారి, కర్నూలు 80 శాతం పైగా డిజిటల్ పేమెంట్సే.. మాకు హోటల్, కంప్యూటర్ విడిభాగాల వ్యాపారాలు ఉన్నాయి. కోవిడ్కు ముందు ఎక్కువగా లావాదేవీలన్నీ నగదు రూపంలో జరిగేవి. కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. 80 నుంచి 90 శాతం వీటినే వినియోగిస్తున్నారు. ఫలితంగా మాకు కూడా ప్రతిరోజూ బ్యాంకుకు వెళ్లి డబ్బులు జమ చేసే శ్రమలేదు. మా వద్ద పనిచేసే ఉద్యోగులకు మాత్రం వారి సౌలభ్యం కోసం నగదు రూపంలో జీతం ఇస్తున్నాం. – భూమా కిశోర్, వ్యాపారి, కర్నూలు ఎంత ఖర్చు చేస్తున్నామో తెలియట్లేదు గతంలో డబ్బు చేతిలో ఉంటే చూసి ఖర్చు పెట్టేవారం. నగదు రూపంలో డబ్బులు ఉండటం వల్ల దేనికెంత ఖర్చు చేస్తున్నామో తెలిసేది. కానీ ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్స్ కావడంతో ఎంత ఖర్చు చేస్తున్నామో అర్థంకాని పరిస్థితి. తెలియకుండానే నెలలో 20 నుంచి 30 శాతం ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాం. – సాయిరామ్, ప్రభుత్వ ఉద్యోగి, కర్నూలు -
బ్యాంకుల్లోనూ పలుచబడిన జనం
ఒకప్పుడు బ్యాంకులకు వెళ్తే అక్కడ పనిపూర్తి చేసుకుని తిరిగి రావడానికి గంట నుంచి రెండు గంటల సమయం పట్టేది. కోవిడ్ తర్వాత ఈ పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. అప్పటి వరకు వివిధ రకాల పథకాల సొమ్ము అకౌంట్లో ప్రభుత్వం వేస్తే దానిని తీసుకోవడానికై నా బ్యాంకులకు, ఏటీఎంలకు వెళ్లేవారు. ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ కారణంగా డబ్బు ఎలా వస్తుందో, ఎలా పోతుందో కూడా తెలుసుకోలేకపోతున్నారు. దాదాపుగా అన్ని చోట్లా ఏటీఎంలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రుణాలను సైతం బ్యాంకు యాప్ల ద్వారానే నిమిషాల్లో తీసుకునే సౌలభ్యం వచ్చింది. కేవలం కరెంట్ బ్యాంకు ఖాతాలు ఉన్న కొద్ది మంది వ్యాపారులు మాత్రమే పెద్ద మొత్తంలో డబ్బులు వేయడానికి, డ్రా చేయడానికి మాత్రమే బ్యాంకులకు వెళ్తుండటం గమనార్హం. ఖాతాల్లో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి, అనుమానాలు తీర్చుకోవడానికి మాత్రమే బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. -
రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్తో పాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. వైద్యులకు ఏఐ ఎంతో ఉపయోగం కర్నూలు(హాస్పిటల్): రోగులకు వైద్య సేవలు అందించడంలో వైద్యులకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ఎంతో ఉపయోగపడుతుందని కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ అన్నారు. శనివారం కళాశాలలోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో ‘ప్రజారోగ్య రీసెర్చ్లో కృత్రిమ మేధస్సు పాత్ర’ అనే అంశంపై ఇంటర్నీస్, పీజీ విద్యార్థులతో సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ మాట్లాడుతూ.. వైద్యరంగంలో ఇమేజింగ్ టెక్నాలజీ, డేటా అనలైజేషన్ మొదలైన విభాగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మంచి ఫలితాలు ఇస్తోందన్నారు. రాబోయే కాలంలో ప్రజారోగ్యానికి అవసరమయ్యే ఏఐని ఉపయోగించుకుని చక్కటి ప్రణాళికలు రూపొందించుకోవచ్చని చెప్పారు. కమ్యూనిటీ మెడిసిన్ హెచ్వోడీ డాక్టర్ పి. సుధాకుమారి మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్తో తక్కువ సమయంలో లక్షలాది మంది రోగుల డేటాను అనలైజ్ చేయవచ్చన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్కు అవసరమైన మేరకు ఉపయోగించుకోవాలని, ప్రతి దానికీ దాని మీదే ఆధారపడితే వైద్యులకు, రోగులకు మధ్య హ్యూమన్ టచ్ మిస్ అవుతుందని కొందరు అన్నారు. ఏఐలో డేటా, సాంకేతిక తేడాలు వస్తే ఫలితాలు కూడా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. సెమినార్లో ప్రొఫెసర్ డాక్టర్ సింధియా శుభప్రద, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డీసీహెచ్ఎస్లు డాక్టర్ స్వర్ణకుమారి, డాక్టర్ రవినాయక్, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ పుష్పలత, డాక్టర్ ప్రవీణ, డాక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. శ్రీశైల దేవస్థానానికి భారీగా విరాళాలు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానానికి పలువురు భక్తులు భారీగా విరాళాలు సమర్పించారు. శనివారం రంగారెడ్డి జిల్లా బాలాపూర్కు చెందిన కనకదుర్గ అన్నప్రసాద వితరణకు రూ.2,00,232 విరాళాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి జి.స్వాములకు అందజేశారు. అలాగే నెల్లూరుకు చెందిన బి.పల్లవి ప్రాణధాన ట్రస్ట్కు రూ.1,00,011, గోసంరక్షణనిధి పథకానికి బి.మౌనిక రూ.1,00,011, అన్నప్రసాద వితరణకు యామిని సురేష్ రెడ్డి రూ.1,00,011, అన్నప్రసాద వితరణకు బసిరెడ్డి శ్రీనివాసరెడ్డి రూ.1,00,011, గో సంరక్షణ నిధి పథకానికి బసిరెడ్డి సాయిచరణ్ రూ.1,00,011 విరాళాన్ని అందజేశారు. ఆయా విరాళాలను క్యూలైన్ల సహాయ కార్యనిర్వహణాధికారి జి.స్వాములుకు అందజేశారు. విరాళాలు అందించిన దాతలకు దేవస్థానం తరుఫున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను, జ్ఞాపికలను అందించి సత్కరించారు. -
పెరిగిన అనవసర ఖర్చు
● ధర తెలుసుకోవడం దాదాపుగా మానేశారు ● రూ.5 మొదలు వేల రూపాయల లావాదేవీలు ఆన్లైన్లోనే.. ● తలకిందులవుతున్న ఫ్యామిలీ బడ్జెట్ ● ఎంత సంపాదిస్తున్నా ఇట్టే అయిపోతుందనే భావన ● కోవిడ్ తర్వాత అన్నీ డిజిటల్ చెల్లింపులే.. ● చిల్లర కొరత నేపథ్యంలోనూ మారిన తీరు● ఆదోనికి చెందిన నాగేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. చిరుద్యోగమే అయినా 20 ఏళ్లకు పైగా సీనియారిటీ ఉండటంతో జీతం రూ.లక్షకు పైగా వస్తోంది. మొదట్లో తాను ఖర్చుచేసిన ప్రతిదీ ఓ పుస్తకంలో రాసుకునే అలవాటు ఉండేది. అన్ని ఖర్చులు పోను నెలకు 30శాతం దాకా మిగిలేది. కానీ ఇటీవల డిజిటల్ అకౌంట్లో ఖర్చు పెడుతూ లెక్క రాసుకోవడం మానేశాడు. నెల తిరిగేసరికి బ్యాంకు ఖాతా ఖాళీ అవుతోంది. ఎందుకిలా అని ప్రశ్నించుకుంటే ఆన్లైన్లో తెలియకుండానే తానే ఖర్చు చేస్తున్నట్లు తెలుసుకున్నాడు.● కర్నూలు నగరంలోని ఎ.క్యాంపునకు చెందిన వెంకట్ ఓ ప్రైవేటు కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. ఆయన జీతం నెలకు రూ.60వేలు. వచ్చిన జీతంతో ఇంట్లోని నలుగురు కుటుంబసభ్యులతో హాయిగా జీవిస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో నెలాఖరుకు అకౌంట్లో డబ్బులన్నీ అయిపోయినట్లు గమనిస్తున్నాడు. ఇంత డబ్బు ఏమైందని పరిశీలిస్తే అదంతా డిజిటల్ పేమెంట్స్ ద్వారా తానే ఖర్చు చేసినట్లు నిర్ధారించుకున్నాడు. కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో ప్రస్తుతం అన్ని రకాల వ్యాపారాలు ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్ ద్వారానే సాగుతున్నాయి. ఒకప్పుడు ఫోన్ పే, గూగుల్ పే లాంటివి ఉపయోగించాలంటే భయపడే జనం ఇప్పుడు అవలీలగా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఎంతగా అంటే రూ.5 నుంచి వేల రూపాయల వరకు ఆన్లైన్లోనే చెల్లింపులు చేస్తున్నారు. ఏదైనా కొనుగోలు చేసినా, ఎవరికై నా డబ్బు పంపాలన్నా, అప్పు ఇవ్వాలన్నా, తీసుకున్న రుణం తీర్చాలన్నా, ఇతర ఎలాంటి లావాదేవీలైనా సరే డిజిటల్ పేమెంట్ తప్పనిసరి అవుతోంది. ఎంత ఖర్చు పెడుతున్నారో తెలియనంతగా వీటి వినియోగం ఉంటోంది. అయితే పెట్టే ఖర్చు మొత్తం బ్యాంకు ఖాతా ద్వారానే జరుగుతోంది. దీన్నిబట్టి ఎవరికి ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎంత ఏఏ ఖాతాలకు మళ్లిస్తున్నారు, ఎవరెవరికి చెల్లిస్తున్నారు, వీరికి ఎవరి నుంచి డబ్బులు వస్తున్నాయనే విషయాలన్నీ బ్యాంకుల వారికి తెలిసిపోతోంది. అది చిన్న మొత్తమైనా, పెద్ద మొత్తమైనా సరే అన్ని వివరాలు ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా మనకు తెలియకుండానే బ్యాంకులకు/ప్రభుత్వానికి చెప్పేస్తున్నాయన్న మాట. కోవిడ్ తర్వాత ఊపందుకున్న పేమెంట్స్ డిజిటల్ పేమెంట్స్ రూపంలో పదేళ్ల క్రితం డెబిట్, క్రెడిట్కార్డులు, గిఫ్ట్కార్డులు వచ్చాయి. కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసి వాటిని వ్యాపార దుకాణాల్లో స్క్రాచ్ చేసి డబ్బులు చెల్లించేవారు. కొంత కాలం తర్వాత ఇవే కార్డుల ద్వారా ఆన్లైన్లోనే వస్తువులను కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. కోవిడ్ అనంతరం వ్యాపార లావాదేవీల్లో మరింత సరళతరం వచ్చింది. అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్ల ద్వారా జనం డబ్బు చెల్లించడం, తీసుకోవడం ప్రారంభించారు. కోవిడ్ కారణంగా డబ్బుల మార్పిడి వల్ల ఎక్కడ వైరస్ అంటుకుంటుందోనని భయపడి ఈ పేమెంట్స్కు అలవాటు పడ్డారు. ఎంతగా అంటే రూ.5ల కొనుగోలుకు సైతం ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారు. మొదట్లో ఇలా డబ్బులు తీసుకోవడానికి ఇష్టపడని వ్యాపారులు సైతం క్రమంగా అంగీకరించక తప్పని పరిస్థితి. చిల్లర కొరత కారణంగా కూడా డిజిటల్ పేమెంట్స్ ఊపందుకున్నాయి. డబ్బులు ఏట్లో పారేసినా లెక్క పెట్టి పారేయాలన్నది పెద్దల మాట. అంటే చేతితో డబ్బులు లెక్క పెట్టి పారేస్తూ ఉంటే దాని విలువ తెలుస్తుందని భావన. అలాగే మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయినీ ఏదైనా పుస్తకంలో రాసుకుంటే నెల చివరలో దేనికెంత ఖర్చు పెట్టాము.. ఎక్కడ అనవసరంగా ఖర్చు చేస్తున్నాము.. ఏ ఖర్చులు తగ్గించుకోవాలి.. ఎక్కడ మిగిలించాలనే విషయాలు తెలుస్తాయి. దీన్ని బట్టే ఫ్యామిలీ బడ్జెట్ రూపొందించుకోవచ్చు. కానీ ఇటీవల డిజిటల్ పేమెంట్స్, ఆన్లైన్ కొనుగోళ్ల పుణ్యమా అని ఎంత డబ్బు వస్తున్నా ఇట్టే అయిపోతోంది. లెక్క పెట్టకుండా ఖర్చు చేయడం వల్లే ఈ సమస్య వస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. -
కష్టపడి పనిచేస్తే లక్ష్యం చేరుకోవచ్చు
కర్నూలు సిటీ: న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ లక్ష్యాలను చేరుకోవాలంటే కష్టపడి పనిచేయాలని రాష్ట్ర హైకోర్టు జడ్జి, జిల్లా పోర్ట్ ఫోలియో జడ్జి జస్టిస్ బి.ఎస్ భానుమతి అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన న్యాయవాద సంఘం వార్షికోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాకు చారిత్రాత్మక పేరుందని, ఈ జిల్లా నుంచి చాలా మంది ఉన్నత న్యాయమూర్తులుగా రాణించారన్నారు. న్యాయపరంగా జిల్లా అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని హామీనిచ్చారు. ● హైకోర్టు జడ్జి జస్టిస్ కె. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. తాను ఈ జిల్లాకు చెందిన వాడినని, జిల్లా గురించి తనకు మంచి అవగహన ఉందన్నారు. కక్షిదారులకు న్యాయవాదులు అందుబాటులో ఉండి పని చేస్తే విజయాలు సొంతం అవుతాయన్నారు. ● జస్టిస్ ఎన్.హరినాథ్ మాట్లాడుతూ.. న్యాయవాదులు స్థానికంగానే కాకుండా అన్ని ప్రాంతాల్లో తిరిగి న్యాయ సేవలను కక్షిదారులకు అందించాలన్నారు. న్యాయవాది పనితనంపై ఆధారపడి కక్షిదారులకు న్యాయం అందుతుందన్నారు. ● న్యాయమూర్తి జస్టిస్ ఎ.హరినాథశర్మ మాట్లాడుతూ తాత్కాలిక ఆదాయానికి ఆశపడకుండా జూనియర్ న్యాయవాదులు పని చేస్తే భవిష్యత్తులో అభివృద్ధి వైపు వెళ్తారన్నారు. ప్రస్తుతం న్యాయవాదులు సాంకేతికతను అందిపుచ్చుకొని వృత్తిలో నైపుణ్యం పొందాలన్నారు. ● న్యాయవాద సంఘం వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన న్యాయమూర్తులకు, న్యాయవాదులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి, బార్ కౌన్సిల్ సభ్యులు పి.రవిగువేరా, బార్ అధ్యక్ష, కార్యదర్శులు బి. కృష్ణమూర్తి, బి.ఎస్ రవికాంత్, ప్రసాద్, సీనియర్ న్యాయవాదులు సి.నాగేంద్రనాథ్, ఎ.రామసుబ్బారెడ్డి, శివరామయ్య, జోగయ్య శర్మ, వై.జయరాజ్, ప్రభుత్వ న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు జడ్జి భానుమతి -
జెడ్పీ నిధుల తగ్గింపుతో ఇబ్బందులు
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ (జెడ్పీ)లకు విడుదల చేస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధులను 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గించడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. జిల్లాకు వచ్చిన పీఆర్అండ్ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్కుమార్, డైరెక్టర్ కృష్ణతేజను శనివారం కలిసి వినతిపత్రం అందించారు. జెడ్పీకి 15 శాతం కింద రూ.25 కోట్ల మేర నిధులు విడుదలవుతున్నాయని, జిల్లాలోని సీపీడబ్ల్యూఎస్ పథకాల ఆపరేషన్, నిర్వహణకు వ్యయం అవుతున్న రూ.80 కోట్లను భరించడం చాలా కష్టంగా మారిందన్నారు. ఇంత కష్టాలు ఉన్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక సంఘం నిధులను 10 శాతానికి తగ్గింపు నిర్ణయాన్ని పునః సమీక్షించాలని కోరారు. లేని పక్షంలో కనీసం రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులనైనా విడుదల చేయాలని కోరారు. అలాగే జెడ్పీ పాత పరిపాలనా భవనాన్ని రాష్ట్ర పర్యాటక శాఖకు లీజుకు వచ్చే ప్రతిపాదనను కూడా త్వరగా పరిశీలించి తగు ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. సీఎఫ్ఎంఎస్లో పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ల పలు రకాల బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని కోరారు. జెడ్పీ సీఈఓ, డిప్యూటీ సీఈఓలు వినియోగిస్తున్న ప్రభుత్వ వాహనాలు రవాణా శాఖ నిబంధనల మేరకు కాలాతీతమైనందున ఇద్దరు అధికారులు అద్దె వాహనాలు వినియోగించుకునేందుకు అనుమతితో పాటు వాటి బాడుగలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కోరారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో లిఫ్ట్ సౌకర్యం కోసం రూ.48 లక్షల అంచనాతో దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్కు పంపిన ప్రతిపాదనలపై ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు ఉన్నతాధికారులతో చైర్మన్ సుదీర్ఘంగా చర్చించారు. పీఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్ను కలిసిన జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి -
ఆధిపత్యం కోసమే అంతమొందించారు
● వీడిన టీడీపీ నేత సంజన్న హత్యకేసు మిస్టరీ ● ఐదుగురు నిందితుల అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు: టీడీపీ నాయకుడు షరీన్నగర్కు చెందిన కాశపోగు సంజన్న హత్య కేసు మిస్టరీ వీడింది. షరీన్నగర్లో ఆధిపత్యం కోసమే సంజన్నను వడ్డె రామాంజనేయులు అలియాస్ అంజి కుటుంబ సభ్యులు హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వడ్డె రామాంజనేయులు, వడ్డె శివకుమార్, వడ్డె తులసి, రేవంత్, వారి అనుచరుడు మాల అశోక్ను నాల్గవ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎదుట హాజరు పరిచారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో దర్యాప్తు అధికారి మహిళా పీఎస్ డీఎస్పీ కే శ్రీనివాసాచారి, కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్తో కలిసి ఎస్పీ విక్రాంత్ పాటిల్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఈ నెల 14వ తేదీన రాత్రి 9.30 గంటల ప్రాంతంలో షరీన్నగర్లో అల్లీపీరా, వీరాస్వామి భజన మందిరంలో భజన ముగించుకుని బయటకు వస్తున్న కాశపోగు సంజన్నపై అదే వీధికి చెందిన వడ్డె రామాంజనేయులు అతని కుమారులు కొంత మంది అనుచరులు కలిసి పిడిబాకులు, కత్తులు, వేటకొవళ్లతో దాడి చేసి హత్య చేశారు. 30వ వార్డు కార్పొరేటర్ జయరాముడుకు హతుడు సంజన్న తండ్రి. జయరాముడు ఫిర్యాదు మేరకు నాల్గవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఉపకరణాలను ఉపయోగించుకొని నిందితుల కదలికలు, వారు వినియోగించిన వాహనాలు, సీసీ ఫుటేజీల ద్వారా గుర్తించి కాదాంబరి టౌన్షిప్ సమీపంలోని నిర్జన ప్రదేశంలో అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. హత్యకు వాడిన వేట కొడవళ్లు, పిడిబాకు, రక్తం మరకలు ఉన్న దస్తులు, సెల్ఫోన్లు, కర్రలు, హత్య సమయంలో వాడిన కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచామని, ప్రతి వారం స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చేలా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ చెప్పారు. శిక్షలు పడే విధంగా చర్యలు ... విచారణ వేగవంతం చేసి నిందితులపై కఠిన శిక్షలు పడేటట్లు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. మృతుడు సంజన్న కుటుంబం, హంతుకులు వడ్డె రామాంజనేయులు కుటుంబం మధ్య ఉన్న పాతకక్షలు, వార్డులో ఆధిపత్య పోరే కారణంగా దర్యాప్తులో తేలిందని వివరించారు. చాకచక్యంగా, వేగంగా కేసును ఛేదించి త్వరగా నిందితులను అరెస్ట్ చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో సీఐలు మధుసూదన్గౌడ్, శేషయ్య, చంద్రబాబునాయుడు, శ్రీధర్, తబ్రేజ్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
పొలంలో పేలుడు.. ముగ్గురికి గాయాలు
● ఒకరి పరిస్థితి విషమం సి.బెళగల్: పొలంలో అడ్డుగా ఉన్న బండరాళ్లను తొలగిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించి ముగ్గురు యువకులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సి.బెళగల్కు చెందిన పింజరి ఖాజా పొలంలో బండరాళ్లు అడ్డుగా ఉన్నాయి. వీటిని కాంప్రెసర్తో పగులగొట్టడానికి గ్రామానికి చెందిన వాహన యజమాని వడ్డె రాజుతో ఒప్పందం చేసుకున్నాడు. గురువారం కాంప్రెసర్ వాహన యజమాని గ్రామానికి చెందిన బలిగేరి కుంటిచేయి లక్ష్మన్న కుమారుడు బలిగేరి వీరాంజనేయులు, సురపురం మునిస్వామి కుమారుడు సురపురం శ్రీరాములు, కేశారం కుమారుడు మద్దిలేటి అనే యువకులతో కలసి పొలానికి వెళ్లారు. పొలంలోని మూడు ప్రాంతాల్లో బండరాళ్లను పేల్చేందుకు ప్రయత్నించగా రెండు మాత్రమే పేలాయి. శుక్రవారం మరోసారి వెళ్లగా మూడో బండరాయి నుంచి ఒక్కసారిగా పేలుడు సంభవించింది. రాళ్లు ఎగిరి పడటంతో పనిలో నిమగ్నమైన ముగ్గురు యువకులు బలిగేరి వీరాంజనేయులు, సురపురం శ్రీరాములు, మద్దిలేటి గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బలిగేరి వీరాంజనేయులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై విచారిస్తున్నట్లు ఎస్ఐ తిమ్మారెడ్డి తెలిపారు. -
మోక్ష మార్గానికి శుభ రాత్రులు
రహదారులపై నీళ్లు కనిపిస్తున్నాయి. అక్కడికి వెళ్లి చూస్తే ఏమీ కనిపించవు. తీవ్ర ఉష్ణోగ్రతల ఫలితంగా ఏర్పిడిన ఎండమావులని తేలుతోంది. ఇటీవల ఉమ్మడి కర్నూలు జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 40 డిగ్రీలు దాటి పోయాయి. కర్నూలు నగరం సమీపంలోని బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎండమావులు కనిపిస్తున్నాయి. దీంతో వాహనదారులు మధ్యాహ్నం వేళ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలను కాసేపు ఆపుకుని వెళ్తే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు నంద్యాల(వ్యవసాయం): పవిత్ర రంజాన్ మాసం చివరి ఘట్టానికి చేరుకుంది. ముస్లింలు ఈ మాసమంతా మహిమతో కూడినదిగా భావిస్తారు. ఇందులో మొదటి పది రోజులు అల్లాహ్ కరుణ కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తే... రెండవ పది రోజుల్లో తమ తప్పులను క్షమించాలని ప్రార్థిస్తారు. ఇక మూడవదైన ముఖ్యమైన చివరి పదిరోజులు మొదటి రెండు విభాగాల కంటే కొంచెం భిన్నమైనవిగా భావిస్తారు. నరకం నుంచి బయట పడేయాలని అల్లాను శరుణు కోరుకునేందుకు ఈ పదిరోజులను ప్రత్యేకమైనవిగా భావిస్తారు. ఈ పవిత్ర మాసంలో చివరి పదిరోజులు ఏకాగ్రతతో అల్లాను ఆరాధిస్తే ఎక్కువ ఫలితాలు లభిస్తాయని, మోక్షానికి మార్గం లభిస్తుందని భావించి ముస్లింలు మసీదులు, ఇళ్లల్లో ఎతెకాఫ్, తాఖ్రాత్ చేపట్టనున్నారు. పుణ్య ఫలాల శుభరాత్రులు.. రంజాన్ మాసం చివరి పది రోజుల్లో పవిత్ర బడీరాత్ వస్తుంది. దీన్నే షబ్ ఏ ఖదర్ లేదా లైలతుల్ ఖద్ర్ అనికూడా అంటారు. ఈ పవిత్ర రాత్రి చివరి పది రోజుల్లో బేసి రాత్రుల్లో (ఈనెల 24, 25, 27, 29వ తేదీ) ఉంటుందన్న నమ్మకంతో ముస్లింలు తాఖ్రాత్గా నిర్వహిస్తారు. మరీ ముఖ్యంగా ఈనెల 27వ రోజు రాత్రే లైలతుల్ ఖద్ర్ ఉంటుందని ముస్లింల విశ్వాసం. లైలతుల్ ఖద్ర్ రాత్రి జాగరణ చేసి ప్రార్థనలు చేయడంతో వెయ్యి నెలలపాటు ఉపవాస దీక్షలు చేసినంత ఫలం లభిస్తుందని పెద్దలు పేర్కొంటున్నారు. ప్రజల పాపాలను క్షమించాలని కోరుతూ మహమ్మద్ ప్రవక్త ప్రార్థించారని పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఉండడంతో ముస్లింలు జాగరణ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. పవిత్ర రంజాన్ మాసంలో అత్యంత ముఖ్యమైనవిగా, అధిక పుణ్యాన్ని ఇచ్చే తాఖ్ రాత్లు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయా రోజుల్లో రాత్రుల నుంచి తెల్లవారుజామున ఫజర్ నమాజ్ వరకు పవిత్ర రంజాన్ విశిష్టత, మహాప్రవక్త గుణగణాలు, ఖురాన్ పఠనం, జికార్, తహజూద్, నమాజ్లతో గడుపుతారు. ఇందుకోసం ఆయా మసీదులకు ఇతర ప్రాంతాల నుంచి పీఠాధిపతులు, గురువులు, వక్తలను పిలిపించి దైవసందేశాలను భక్తులకు వివరిస్తారు. ఇందుకుగాను పట్టణంలోని పలు మసీదు కమిటీ నిర్వాహకులు ఈ పదిరోజుల పాటు వక్తలను ఆహ్వానిస్తారు.. ఈ సమయాల్లో మసీదులకు హాజరయ్యే భక్తులకు తెల్లవారుజామున సహేరి ఏర్పాట్లు చేస్తారు. అల్లాహ్ ఇంటి ఆతిథ్యం ఎతెకాఫ్.. రంజాన్లో బడీరాత్ ఎంత ప్రాధాన్యత ఉంటుంతో ఎతెకాఫ్కు కూడా అంతే ఉంటుంది. అల్లాహ్ ఇంటి (మసీదు) ఆతిథ్యం ఈ ఎతెకాఫ్ కల్పిస్తుందంటారు. ‘రంజాన్ కే మహినేమె..జిస్ గావ్మే ఏక్బీ ఆద్మీ ఎతెకాఫ్ నా రహేత.. ఉస్ గావ్ పర్ లానత్ హై. ఔర్ మేరి రహ్మత్ నహీ రహేగి’. అంటే రంజాన్ మాసంలో ఒక ఊర్లో ఒక వ్యక్తి కూడా ‘ఎతెకాఫ్’ ఉండకపోతే.. ఆ ఊరిపై నా కరుణ, ప్రేమాభిమానాలు ఉండవు అని పవిత్ర ఖురాన్లో అల్లాహ్ స్పష్టం చేశారు. ఎతెకాఫ్ను చివరి పది రోజుల్లో పాటించాలి. ఇల్లు, కుటుంబం, వృత్తిని పక్కన పెట్టి వీలు పడిన రోజులు (కనీసం 24 గంటలు) మసీదులో గడపడమే ఎతెకాఫ్ అంటారు. అన్నింటినీ త్యాగం చేసి ఆధ్యాత్మికతతో ఉండే మనుషులపై అల్లాహ్ అత్యంత కరుణ చూపి మొరను ఆలకిస్తారని మౌల్వీలు అంటున్నారు. ప్రజాప్రతినిధుల ఇంటికెళ్లి మనం సమస్య చెప్పుకుంటాం. ఆయన అభయం ఇస్తే ధైర్యం వస్తుంది. మన ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధి అభయానికే ఊరట కలిగితే.. సృష్టికర్త అల్లాహ్కు మొరపెట్టుకుంటే లభించే ఆనుగ్రహానికి హద్దు ఉండదంటారు. పది రోజులు పవిత్రమైన రోజులు రంజాన్ మాసంలో చివరి పదిరోజులు మోక్ష మార్గానికి తరావి, ఎతెకాఫ్, తాఖ్ రాత్లు ఎంతో పవిత్రమైన రోజులు. ఈ రోజుల్లో కఠోర దీక్షలు రాత్రింబవళ్లు ఖురాన్, దైవ బోధనలతో నియనిష్టతో ఉంటే ఎన్నో మాసాల నుంచి చేయనటువంటి పుణ్యం, మోక్షాలు లభిస్తాయన్నారు. – అబ్దుల్ఖాదీర్, మౌల్వి, ఆర్టీసీ బస్టాండ్ మసీదు, నంద్యాల రంజాన్ మాసం ఆఖరి పది రోజులు ప్రత్యేకం ఎతెకాఫ్, తాఖ్రాత్ల నిర్వహణలో ముస్లింలు -
ఎకై ్సజ్ శాఖలో ఎస్ఐల పదోన్నతికి దేహదారుఢ్య పరీక్ష
కర్నూలు: ఎకై ్సజ్ శాఖ ఫోర్త్ జోన్ పరిధిలో ఎస్ఐ పోస్టుల భర్తీకి అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. సీమ జిల్లాల్లో 52 ఎస్ఐ పోస్టులు ఖాళీగా ఉండగా 48 పోస్టులను హెడ్ కానిస్టేబుళ్లు, క్లర్కులకు అడ్హాక్ పద్ధతిలో పదోన్నతి కల్పించి పోస్టింగులు కేటాయించాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఎకై ్సజ్ కార్యాలయ ఆవరణలోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్లకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. రాయలసీమ జిల్లాల నుంచి 17 మందికి గాను 16 మంది హాజరయ్యారు. వారికి బరువు, ఎత్తు, ఛాతీ కొలతలను తీసుకున్నారు. వీరంతా అర్హత సాధించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, లీగల్ మెటరాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ రాములు, జిల్లా ఎకై ్సజ్ అధికారి సుధీర్ బాబు, ఏఈఎస్ రాజశేఖర్ గౌడ్, ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ రామకృష్ణ, సీఐలు రాజేంద్రప్రసాద్, చంద్రహాస్ తదితరులు పాల్గొన్నారు. ●16 మంది జూనియర్ అసిస్టెంట్లు ఉత్తీర్ణత -
గుర్తు తెలియని వాహనం ఢీకొని..
వెలుగోడు: మోత్కూరు గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మోత్కూరు గ్రామానికి చెందిన గుండెపోగు ఏసేపు కుమారుడు అశోక్(28) బైక్పై వెలుగోడుకు వస్తుండగా మార్గమధ్యలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వెలుగోడులోని ఓ మందుల దుకాణంలో పని చేస్తున్నాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ద్వారా వెలుగోడుకు చెందిన వాహనం బైక్ను ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. -
మెడికల్ షాపుల్లో ‘ఆపరేషన్ గరుడ’
కర్నూలు: ఆపరేషన్ గరుడలో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు ఐజీ ఈగల్ టీమ్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లోకల్ పోలీస్, డ్రగ్స్ కంట్రోల్ టీమ్ ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో మెడికల్ షాపులు, ఏజెన్సీల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ ఎస్పీ ఆదేశాల మేరకు అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి కర్నూలు, నంద్యాల, ఆదోని ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం పొద్దుపోయేదాకా విస్తృత తనిఖీలు నిర్వహించారు. దుకాణం లైసెన్స్, నిల్వలకు సంబంధించిన రిజిస్టర్లతో పాటు ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయాలు జరుపుతున్న విషయాలపై పరిశీలన జరిపారు. దాదాపు 20కి పైగా దుకాణాల్లో తనిఖీలు చేయగా కొన్నింటిలో నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. అలాగే భౌతిక నిల్వలకు రికార్డులో పొందుపరచిన నిల్వలకు తేడాలు ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. -
కర్నూలు మార్కెట్లో వరి ధాన్యం క్రయవిక్రయాలు
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం క్రయవిక్రయాలకు శ్రీకారం చుట్టారు. మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులు శుక్రవారం పూజలు నిర్వహించి కొనుగోళ్లను ప్రారంభించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వరి సాగు ఎక్కువగా ఉన్నప్పటికీ మార్కెటింగ్ సదుపాయం లేదు. దళారీలకు, మిల్లులకు తీసుకెళ్లి అమ్మకోవాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో మార్కెటింగ్ శాఖ కర్నూలు మార్కెట్లో వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టింది. మార్కెట్కు మొదటి రోజు ఇద్దరు రైతులు మాత్రమే 23 క్వింటాళ్ల ధాన్యం తీసుకొచ్చారు. క్వింటాకు రూ.2,529 ధర లభించింది. 2024–25 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఏప్రిల్ 1 నుంచి ధాన్యం క్రయవిక్రయాలు రెగ్యులర్గా చేపడతామని జేడీ తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ జయలక్ష్మి, అసిస్టెంట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా కోర్టుల్లోనూ మధ్యవర్తిత్వం
కర్నూలు(సెంట్రల్): సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అన్ని కోర్టుల్లో మధ్యవర్తిత్వాన్ని ప్రవేశపెట్టాలని హైకోర్టు ఆదేశించిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు/ జిల్లా ప్రధానన్యాయమూర్తి జస్టిస్ జి.కబర్ధి తెలిపారు. జిల్లా కోర్టుల్లోనూ మధ్యవర్తిత్వం విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలతో మధ్యవర్తిత్వంపై న్యాయవాదులు, ఎన్జీఓలకు ఇచ్చిన 40 గంటల శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు భావన, మధ్యవర్తిత్వం, సాంకేతిక అంశాలపై న్యాయవాదులకు కేరళల నుంచి వచ్చిన గోపీనాథన్ బృంద సభ్యులు 40 గంటలపాటు శిక్షణ తరగతులను నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.కబర్ధి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జస్టిస్ బి.లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ..సివిల్ ప్రోసిజర్ కోడ్లోని సెక్షన్ 89 కింద పరిగణించేదే మధ్యవర్తిత్వమని, కోర్టుల్లో కేసు విచారణ వరకు వెళ్లకుండానే పరిష్కరించుకోవచ్చన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.కబర్ధి -
ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు
కర్నూలు సిటీ: జిల్లాలోని 172 కేంద్రా ల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. శుక్రవారం మొత్తం 31,686 మంది విద్యార్థులకుగాను 31,393 మంది హాజరుకాగా.. 293 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ ఎస్.శ్యామూల్ పాల్ తెలిపారు. ఒపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షలకు 821 మందికిగాను 728 మంది విద్యార్థులు హాజరు కాగా.. 93 మంది గైర్హాజరయ్యారు. బ్యాంకుల సమ్మె వాయిదా కర్నూలు(అగ్రికల్చర్): ఈ నెల 24, 25 తేదీల్లో చేపట్టనున్న బ్యాంకుల సమ్మె వాయిదా పడింది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ పిలుపు మేరకు ఈ నెల 24, 25 తేదీల్లో బ్యాంకుల సమ్మెకు అన్ని బ్యాంకు యూనియన్లు సిద్ధమయ్యాయి. శుక్రవారం ఉన్నతస్థాయిలో ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ ప్రతినిధులు చర్చలు జరిపారు. అందులో భాగంగా రెండు నెలల సమయం ఇస్తే డిమాండ్లపై సానుకూలంగా చర్యలు తీసుకుంటామని కోరినట్లు జిల్లా కన్వీనర్ నాగరాజు తెలిపారు. ఇందుకు అనుగుణంగా రెండు రోజుల సమ్మెను వాయిదా వేసినట్లు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
పోలీసుల స్ఫూర్తి.. సామరస్య దీప్తి
కర్నూలు: శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉండే పోలీసులు వారు. రంజాన్ నెల సందర్భంగా సామరస్యాన్ని చాటారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయగా.. హిందూ, ముస్లింలు పోలీసులు అందరూ కలసి వచ్చారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా హాజరయ్యారు. మండ్లెం పీఠాధిపతి కరీముల్లా ప్రార్థన చేయించి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్తార్ విందు మతసామరస్యాన్ని చాటిందని ఎస్పీ తెలిపారు. ప్రజలు అన్ని పండుగలను ప్రశాంత వాతావరణంలో కలసి మెలసి ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకోవాలని సూచించారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్, సీఐలు, ఎస్ఐలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులో ఎస్పీ విక్రాంత్ పాటిల్ -
కొత్త జిల్లాల్లో ట్రెజరీ భవన నిర్మాణాలు
కర్నూలు(అగ్రికల్చర్): కొత్త జిల్లాల్లో ట్రెజరీ కార్యాలయాల భవన నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఖజానా, లెక్కల శాఖ డైరెక్టర్ మోహన్రావు తెలిపారు. అదేవిధంగా సబ్ ట్రెజరీ కార్యాలయాలకు కూడా సొంత భవనాలు నిర్మిస్తామని, కలెక్టర్లు అవసరమైన స్థలాలు కేటాయించాల్సి ఉందన్నారు. శుక్రవారం ఆయన కర్నూలు జిల్లా ట్రెజరీ, కర్నూలు డివిజన్ సబ్ ట్రెజరీలను తనిఖీ చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జరిగిన లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించారు. గత నెల ‘సాక్షి’లో ‘ట్రెజరీల్లో లంచావతారాలు’ శీర్షికన ప్రచురితమైన కథనంపై తీసుకున్న చర్యలపైనా ఆరా తీసినట్లు సమాచారం. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. జిల్లా ట్రెజరీ, సబ్ ట్రెజరీల్లో కొంతమంది ఏళ్ల తరబడి ఒకేచోట పని చేస్తున్నారని, ఇందువల్లనే అక్రమాలకు అవకాశం ఏర్పడిందనే విషయాన్ని విలేకర్లు డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఇందులో వాస్తవం ఉందని, అయితే ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయన్నారు. మరో నెల, రెండు నెలల్లో బదిలీలకు అవకాశం ఉందని, ఆ సమయంలో ఇలాంటి వారిని బదిలీ చేస్తామన్నారు. ఆయన వెంట జిల్లా ట్రెజరీ అధికారి రామచంద్రరావు, ఏటీవో జయలక్ష్మి, ఎస్టీవో పలనాటి సునీల్ తదితరులు ఉన్నారు. మోహన్రావును పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు కలిశారు. ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్న వారిని త్వరలో బదిలీ చేస్తాం ఖజానా, లెక్కల శాఖ డైరెక్టర్ మోహన్రావు వెల్లడి -
దేవదాయ శాఖ ఈఓల పవర్కు ‘చెక్’
కర్నూలు కల్చరల్: దేవదాయ శాఖకు సంబంధించిన ఆలయాలు, సంస్థలకు చెందిన నిధులు దుర్వినియోగం కాకుండా ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇకపై ప్రతి ఫిక్స్డ్ డిపాజిట్ ఈఓతో పాటు సంబంధిత దేవదాయశాఖ అధికారితో కలిపి సంయుక్త పేరిట ఉండాలనే మార్గదర్శకాలను జారీ చేశారు. ఆలయాలకు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) నిధులను కొందరు ఈఓలు గుట్టుచప్పుడు కాకుండా తీసుకుని సొంతంగా వాడుకుంటున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఇద్దరు ఈఓలు వారి పరిధిలోని దేవాలయాల ఎఫ్డీలను స్వాహా చేశారు. వారిపై కేసులు పెట్టి సస్పెండ్ చేశారు తప్ప నిధులు రీకవరీ చేయడంలో జాప్యం చేస్తున్నారు. ఎఫ్డీలు స్వాహా కావడంతో మేల్కొన్న దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఈఓల పరిధిలో ఉన్న ఆలయాల్లోని ఫిక్స్డ్ డిపాజిట్లను గ్రూప్ల వారీగా తనిఖీ చేయించారు. దీనికి పైతం కొందరు ఈఓలు సహకరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఒక్కొక్కరు, వైఎస్సార్ కడప జిల్లాలో ఇద్దరు ఈఓలు వారి ఆలయాల ఎఫ్డీల పరిశీలనకు సహకరించడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి ఫిక్స్డ్ డిపాజిట్ ఈఓతో పాటు సంబంధిత దేవదాయశాఖ అధికారితో కలిపి సంయుక్త పేరిట ఉండాలనే ఆదేశాలు ఇచ్చారు. కమిషనర్ ఆదేశాలు పాటించాలి కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో ని ఈఓలు నలుగురు ఇంకా వారికి సంబంధించిన గ్రూప్ టెంపుల్స్ ఎఫ్డీల ఫైల్స్ను చూపించడం లే దు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశాం. దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలి. – పి. గురుప్రసాద్, డిప్యూటీ కమిషనర్, దేవాదాయ శాఖ ఈఓ, జిల్లా దేవదాయ శాఖ అధికారి పేరిట ఫిక్స్డ్ డిపాజిట్లు -
నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి
కర్నూలు(సెంట్రల్): జిల్లా అభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రగతి సాధించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో 25, 26 తేదీల్లో జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్కు అవసరమైన సమాచార సేకరణపై కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని వ్యవసాయాధికారి పీఎల్ వరలక్ష్మీని ఆదేశించారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా 50 శాతం సబ్సిడీతో యంత్ర పరికరాలను ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సాయిల్ టెస్టు ఫలితాలను వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. పశుసంవర్ధక శాఖకు సంబంధించి పెండింగ్లోని గోకులాల నిర్మాణాలకు నిధుల కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. పరిశ్రమల శాఖకు సంబంధించి విశ్వకర్మ యోజన పథకం కింద లబ్ధిదారులకు త్వరగా రుణాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన వసతి గృహాల మరమ్మతులను త్వరగా చేపట్టాలన్నారు. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి 24 హాస్టళ్లకు సంబంధించి రూ.7.89 కోట్లు మంజూరయ్యాయని, ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఐసీడీఎస్కు సంబంధించి 146 అంగన్వాడీ సెంటర్లను అప్గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ సీపీఓ హిమప్రభాకరరాజు, కర్నూలు నగర పాలకసంస్థ కమిషనర్ రవీంద్రబాబు పాల్గొన్నారు. -
శ్రీమఠంలో భక్తుల సందడి
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో భక్తుల సందడి నెలకొంది. గురువారం ప్రత్యేకం కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. స్థానిక తుంగభద్ర నది, శ్రీమఠం ప్రాంగణం, మధ్వాచార్ కారిడార్లు భక్తులతో కిక్కిరిశాయి. స్వామి మూల బృందావన దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. రాఘవేంద్రస్వామి, గ్రామ దేవత మంచాలమ్మ, అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాద కౌంటర్ల వద్ద భక్తులు బారులు తీరడం కనిపించింది. ఫార్మసీ ఉద్యోగ నియామక ప్రక్రియ నిలిపివేత కర్నూలు(హాస్పిటల్): కడప జోన్–4 పరిధిలో కాంట్రాక్టు ఫార్మసీ ఆఫీసర్ ఉద్యోగాల నియామక ప్రక్రియ హైకోర్టు ఉత్తర్వుల మేరకు తాత్కాలికంగా నిలిపివేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ అధికారి డాక్టర్ బి.రామగిడ్డయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హైకోర్టు నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చిన తర్వాత నియామక ప్రక్రియ చేపడతామన్నారు. ఈ విషయాన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు గమనించాలని కోరారు. డీఈఓ బ్లాగ్లో టీచర్ల సీనియారిటీ జాబితా కర్నూలు సిటీ: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా డీఈఓ బ్లాగ్లో ఉంచామని డీఈఓ ఎస్.శ్యామూల్ పాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్కూల్ అసిస్టెంట్లు(అన్ని సబ్జెక్టులు), ఎస్జీటీ తత్సమాన అర్హత కలిగిన వారి సీనియారిటీ జాబితా సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఈ జాబితాలను https://deokrnl13blogspot.com అనే బ్లాగ్లో అందుబాటులో ఉన్నాయని, అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23వ తేదీలోపు ఆధారాలతో సంప్రదించాలని తెలిపారు. చెత్త వాహనాలతో నిరసన కర్నూలు (టౌన్): నగరంలో మొండి బకాయిలు రాబట్టేందుకు మున్సిపల్ సిబ్బంది వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక దేవనగర్లోని ఉమ్మడి ఎంఎస్ 9– గెస్ట్ ఇన్ లాడ్జి నిర్వాహకులు ఏడు సంవత్సరాలుగా ట్రేడ్ లైసెన్సులు నగరపాలక సంస్థకు చెల్లించడం లేదు. దీంతో గురువారం మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది చెత్త వాహనాన్ని తీసుకొని లాడ్జి ఎదుట నిలిపేశారు. అక్కడే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. ట్రేడ్ లైసెన్సుల బకాయిలు రూ.3,31,250 చెల్లించాలని నిర్వాహకులకు తెలియజేశారు. నగరపాలక సంస్థ నుంచి ప్రయోజనాలు పొందుతూ పన్నులు చెల్లించకుండా ఉండటం తగదని పారిశుద్ధ్య పర్యవేక్షకులు నాగరాజు వెల్లడించారు. పారిశుద్ధ్య తనిఖీదారులు అనిల్ పాల్గొన్నారు. నేడు ఖజానా శాఖ డైరెక్టర్ రాక కర్నూలు (అగ్రికల్చర్): ఖజానా, లెక్కల శాఖ డైరెక్టర్ మోహన్రావు శుక్రవారం కర్నూలుకు రానున్నారు. ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు జిల్లా ట్రెజరీ, సబ్ ట్రెజరీల్లో 2024–25లో జరిగిన లావాదేవీలపై ఖజానా శాఖ వార్షిక తనిఖీ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఖజానా శాఖ డైరెక్టర్ మోహన్రావు కర్నూలుకు రానున్నారు. శుక్రవారం ఉదయం 9:30 గంటలకు కలెక్టరేట్లోని స్ట్రాంగ్ రూమ్ను తనిఖీ చేయనున్నారు. అనంతరం బి.క్యాంప్లోని ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి వార్షిక తనిఖీలలో భాగంగా ఇంతవరకు చేపట్టిన తనిఖీలను పరిశీలిస్తారు. -
ప్రభుత్వాసుపత్రుల్లో తగ్గిన ప్రసవాలు
● ఈ ఆర్థిక సంవత్సరంలో 22.8 శాతానికే పరిమితం ● సరైన సేవలు అందకపోవడమే ప్రధాన కారణం ● 77 శాతం పైగా ప్రయివేట్ ఆసుపత్రుల్లోనే.. ● ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మొక్కుబడి సేవలు ● పరిస్థితి విషమిస్తేనే కర్నూలు జీజీహెచ్కు తరలింపుకర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ప్రసూతి విభాగంపత్తికొండ నియోజకవర్గం: తుగ్గలి పీహెచ్సీ పరిధిలో 2024 జూన్ నుంచి 638 మంది గర్భిణిలను గుర్తించారు. వీరిలో 25 మంది మాత్రమే పీహెచ్సీలో డెలివరీ అయ్యారు. మరో 28 మందిని రెఫర్ చేశారు. కోడుమూరు నియోజకవర్గం: గూడూరు పీహెచ్సీ పరిధిలో మొత్తం 476 మంది గర్భిణిలను గుర్తించగా.. వీరిలో 67 మంది పీహెచ్సీలోనే డెలివరీ అయ్యారు. మరో ఆరుగురిని కర్నూలుకు రెఫర్ చేశారు. ఆలూరు నియోజకవర్గం: మొలగవల్లి పీహెచ్సీ పరిధిలో మొత్తం 210 మంది గర్భిణిలను గుర్తించగా.. 8 మంది మాత్రమే పీహెచ్సీలో డెలివరీ చేయించుకున్నారు. 15 మందిని రెఫర్ చేశారు.గత ఆర్థిక సంవత్సరంలో 45,040 మంది గర్భిణిలు రిజిష్టర్ అయ్యారు. ఇందులో 10,072 మంది(22.36శాతం) హైరిస్క్లో ఉన్నట్లు వైద్య సిబ్బంది గుర్తించారు. ఇదే గత ప్రభుత్వంలో ప్రసవాల సంఖ్య ప్రభుత్వాసుపత్రుల్లో 60శాతం వరకు ఉండగా.. హైరిస్క్ గర్భిణిల శాతం కూడా 19లోపే. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం సన్నగిల్లడంతోనే గర్భిణిలు ప్రయివేట్ను ఆశ్రయిస్తున్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.20,479 ఈ ఆర్థిక సంవత్సరం(2024–25)లో ప్రసవాల సంఖ్య ప్రభుత్వ సర్వజన వైద్యశాల: కర్నూలు ఏరియా ఆసుపత్రి: 1 (ఆదోని) ఎంసీహెచ్ ఆసుపత్రి: 1 సీహెచ్సీలు: 5 పీహెచ్సీలు: 44 అర్బన్ హెల్త్ సెంటర్లు: 28 జరిగిన ప్రసవాలు: 4,671 మంది (22.80శాతం) ప్రయివేట్ ఆసుపత్రులు: 120 జరిగిన ప్రసవాలు: 15,808 (77.19శాతం) కర్నూలు(హాస్పిటల్): ప్రభుత్వాసుపత్రుల్లో సకాలంలో వైద్యులు ఉండకపోవడం.. ఉన్న సిబ్బంది నుంచి మాటల తూటాలు.. అరకొర వైద్య సేవలు.. సాయంత్రం దాటితే ఆయా ఆసుపత్రుల్లో ఎవ్వరూ కనిపించకపోవడం.. ఇదీ జిల్లాలో ప్రభుత్వాసుపత్రుల తీరు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చక్కబెట్టిన సేవలను కూటమి ప్రభుత్వం దూరం చేస్తోంది. ఇందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగ్గిన ప్రసవాల సంఖ్యే నిదర్శనం. గత ప్రభుత్వంలో 60 శాతం వరకున్న ప్రసవాలు.. ఇప్పుడు ముక్కుతూ మూలుగుతూ 25 శాతం మించకపోవడం గమనార్హం. అనుభవజ్ఞులైన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఉన్నా ప్రభుత్వాసుపత్రులను ఆశ్రయించడం క్రమంగా తగ్గుతోంది. మరీ ముఖ్యంగా కర్నూలు సర్వజన ప్రభుత్వాసుపత్రిలో అధునాతన కొత్త భవనంతో పాటు ప్రత్యేక వసతులతో కూడిన ఐసీయూ సేవలందిస్తోంది. ఉచితంగా రక్తం ఇచ్చేందుకు బ్లడ్ బ్యాంకు కూడా ఉంది. వైద్యులు, పీజీ విద్యార్థులు, నర్సుల సంఖ్య గణనీయంగా పెరిగినా పరిస్థితి విషమంగా ఉన్న గర్భిణిలు మాత్రమే ప్రసవానికి వస్తుండటం గమనార్హం. ప్రైవేటు ఆసుపత్రుల్లో 76 శాతం ప్రసవాలు జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) 20,479 ప్రసవాలు జరిగితే అందులో ప్రైవేటు ఆసుపత్రుల్లో 15,808(77.19శాతం) ప్రసవాలు జరగడం గమనార్హం. గర్భం దాల్చినప్పటి నుంచి పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాల్లోని గైనకాలజిస్టుల వద్ద గర్భిణిలు చికిత్స చేయించుకుంటున్నారు. ప్రసవానికి కూడా వారి సూచన మేరకు ప్రైవేటు ఆసుపత్రులనే ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ వార్డులు, బాత్రూమ్లు శుభ్రంగా ఉండటం, నర్సింగ్ కేర్ బాగుండటం, వైద్యులు అందుబాటులో ఉండటం వల్ల ప్రయివేట్ను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యవసరమైతేనే కర్నూలు జీజీహెచ్కు.. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ప్రసూతి విభాగానికి ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో ప్రతిరోజూ 35 నుంచి 40 దాకా ప్రసవాలు జరిగేవి. ఇక్కడ అనుభవజ్ఞులైన వైద్యులు, ఎప్పుడూ పీజీల సేవలు, నర్సింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని నమ్మి ఇతర ప్రాంతాల నుంచి సైతం ప్రసవానికి ఇక్కడికే వచ్చేవారు. కానీ ఆరోగ్యశ్రీ ప్రైవేటులోనూ వర్తిస్తుండటంతో ఇక్కడికి వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ప్రస్తుతం ప్రతిరోజూ 15 నుంచి 20 ప్రసవాలు మాత్రమే ఇక్కడ జరుగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 80 శాతం సిజేరియన్ కాన్పులే.. ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల్లో 80 శాతం సిజేరియన్ కాన్పులే ఉంటున్నాయి. గర్భిణిలు, కుటుంబసభ్యులు ప్రసవ వేదనకు తట్టుకోలేక సిజేరియన్ చేయాలని కోరడం, కొంత మంది వైద్యులు, చాలా మంది గర్భిణిలకు హైబీపీ, రక్తహీనత, షుగర్, థైరాయిడ్, గర్భంలో బిడ్డ అడ్డం తిరగడం, ఉమ్మునీరు తక్కువగా ఉండటం వంటి హైరిస్క్ కారణాలతో సిజేరియన్ ఆపరేషన్లు చేయాల్సి వస్తోందని అధికారులకు ఆయా ఆసుపత్రుల నిర్వాహకులు వివరణ ఇస్తున్నారు. అయితే కొన్ని ఆసుపత్రులు, వైద్యులు సిజేరియన్ చేస్తే ప్యాకేజి, డబ్బులు ఎక్కువ వస్తాయని కూడా అటువైపు మొగ్గు చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో 60శాతం ప్రభుత్వాసుపత్రుల్లోనే! సంవత్సరం ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు ప్రసవాల శాతం హైరిస్క్ గర్భిణిల శాతం 2019-20 39,140 61.33 19.69 2020-21 36,170 57.60 19.32 2021-22 27,305 58.47 19.08 2022-23 26,433 51.42 17.10 2023-24 28,108 54.39 21.30 † గత ప్రభుత్వంలో ప్రతి పీహెచ్సీకి ఇద్దరేసి మెడికల్ ఆఫీసర్లు ఉండగా.. ఒకరు క్షేత్రస్థాయికి వెళ్లినా మరొకరు ఆసుపత్రిలోనే ఉండి రోగులకు చికిత్సలు అందించే పరిస్థితి. రాత్రివేళల్లోనూ నర్సింగ్ సిబ్బంది తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపట్టారు. వైద్యులు ఫోన్ చేస్తే వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం ప్రసవాల సంఖ్య తగ్గేందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
జీజీహెచ్కు హైరిస్క్ కేసులే ఎక్కువ
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ప్రసూతి విభాగానికి గతంలో సాధారణ కాన్పులకు కూడా వచ్చేవారు. ఇప్పుడు ఎక్కువ శాతం హైరిస్క్ కేసులే వస్తున్నాయి. గతంలో 40 దాకా ప్రసవాలు జరుగుతుండగా, ఇప్పుడు 15 నుంచి 20 శాతానికి మించని పరిస్థితి. ఇందుకు ప్రధాన కారణం నంద్యాల జిల్లా విడిపోవడం, అక్కడి ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులకు లక్ష్యాలు విధించడం, ప్రైవేటు ఆసుపత్రుల సంఖ్య పెరగడం, అక్కడ కూడా ఆరోగ్యశ్రీ ఉండటమే. కర్నూలు చుట్టుపక్క మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లోనూ ప్రసవాలు జరుగుతుండంతో జీజీహెచ్కు వచ్చే వారి సంఖ్య తగ్గింది. – డాక్టర్ శ్రీలక్ష్మి, హెచ్ఓడీ, గైనకాలజి విభాగం, జీజీహెచ్, కర్నూలు -
సాంకేతికతతో నేరాలను నియంత్రిద్దాం
కర్నూలు: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాల నియంత్రణతో పాటు నేరస్థులను పట్టుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో గురువారం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో ఎస్పీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా వర్చువల్ విధానంలో పాల్గొన్న సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్లాల్తో ఎస్పీ మాట్లాడారు. సీసీ టీఎన్ఎస్ గురించి ఐజీ ఎస్పీతో చర్చించారు. అనంతరం కర్నూలు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు సబ్ డివిజన్లలో దీర్ఘకాలంగా పెండింగ్లోని కేసుల గురించి ఎస్పీ ఆరా తీశారు. స్టేషన్ల వారీగా కేసుల పెండింగ్కు కారణాలను తెలుసుకొని పరిష్కారానికి పలు సూచనలు, సలహాలు చేశారు. సీసీటీఎన్ఎస్ అప్లికేషన్లో నమోదు తప్పనిసరి కేసు నమోదు నుంచి అభియోగ పత్రాల దాఖలు వరకు ప్రతి అంశాన్ని సీసీటీఎన్ఎస్ అప్లికేషన్లో నమోదు చేయాలని ఎస్పీ ఆదేశించారు. పోలీస్స్టేషన్లలో నమోదయ్యే కేసుల వివరాలను ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సీసీ టీఎన్ఎస్లో ఎప్పటికప్పుడు పొందుపరచాలన్నారు. హత్య కేసుల్లో, 174 సీఆర్పీసీ కేసుల్లో త్వరితగతిన పురోగతి పొందేలా చూసుకుంటూ అభియోగ పత్రాలను వీలైనంత త్వరగా కోర్టులో దాఖలు చేయాలన్నారు. స్టేషన్లో పనిచేసే సీసీ టీఎన్ఎస్ పోలీస్ సిబ్బందితో ఈ అంశాలపై మాట్లాడారు. నేర సమీక్ష సమావేశంలో అధికారులకు ఎస్పీ ఆదేశంసైబర్ నేరాలపై అవగాహన కల్పించండి సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్టేషన్ల వారీగా సదస్సులు నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాద నియంత్రణ చర్యలతో పాటు డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్పై స్టేషన్ల వారీగా ముమ్మర తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ జి.హుసేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డీఎస్పీలు బాబుప్రసాద్, శ్రీనివాసాచారి, ఉపేంద్రబాబు, హేమలత, భాస్కర్రావు, ట్రైనీ డీఎస్పీ ఉషశ్రీ, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
ముగిసిన సుయతీంద్రతీర్థుల సమారాధన
మంత్రాలయం: నవ మంత్రాలయం శిల్పి, రాఘవేంద్రస్వామి మఠం పూర్వపు పీఠాధిపతి సుయతీంద్రతీర్థుల ఉత్తరారాధనతో వేడుకలు ముగిశాయి. గురువారుం శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో మధ్యారాధన వేడుకలు అంగరంగా వైభవంగా జరిగాయి. సుప్రభాత సేవతో ఆరాధనకు అంకురార్పణ పలుకగా.. వేద పఠనం గావిస్తూ సుయతీంద్రతీర్థుల మూల బృందావనానికి శాస్త్రోక్తంగా విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆధ్యాత్మిక పరిమళాలు విరబూసేలా మధ్యారాధన పూజోత్సవాలు గావించారు. కర్ణాటకలోని మత్తూరు మఠం పీఠాధిపతి బోధానంద సరస్వతీ శ్రీమఠాన్ని సందర్శించి పీఠాధిపతులు సుబుధేంద్రతీర్థులను సన్మానించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విధ్వాంసులు, కళాకారులను స్వామిజీ సన్మానించారు. -
అనుమతి లేని బోట్లు నడిపితే చర్యలు
పగిడ్యాల: కృష్ణా నదిలో అనుమతి లేని బోట్లు నడిపితే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ శివరాముడు హెచ్చరించారు. ‘నిబంధనలు నీట ముంచి.. ప్రయాణికుల రక్షణ మరిచి’ అన్న శీర్షికను గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై తహసీల్దార్ స్పందించారు. ఉదయం పోలీస్, రెవెన్యూ సిబ్బందితో కలసి మూర్వకొండ ఘాట్ను పరిశీలించి ఘాట్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణానది బ్యాక్వాటర్లో ఎలాంటి ఇంజిన్ బోట్లు తిప్పరాదని ఆదేశించారు. ఫోర్ట్ అధికారులు జారీ చేసి న బోటుకు ఫిట్నెస్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, బోట్ లైసెన్స్ తెచ్చుకోవాలన్నారు. బోట్లు తిప్పకుండా ప్రతి రోజు మూర్వకొండ ఘాట్ వద్ద రెవెన్యూ అసిస్టెంట్లకు బందోబస్తు విధులు వేస్తామన్నారు. తహసీల్దార్ వెంట రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీరంగారెడ్డి, వీఆర్వో వెంకటస్వామి, పోలీసు సిబ్బంది, రెవెన్యూ అసిస్టెంట్లు ఉన్నారు. ఆదర్శ పాఠశాల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం ● 6వ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల ● ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ నంద్యాల(న్యూటౌన్): ఆదర్శ పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాలకు ఈనెల 31వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.150, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.75 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్, కార్డులు, యూపీఐ ద్వారా ఆన్లైన్లో ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తు సమర్పించేందుకు www. cse.ap.gov.in, www.apms. apcfss.in వెబ్సైట్ సంప్రదించాలి. ఆరో తరగతిలో ప్రవేశానికి గతేడాది మాదిరిగానే పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న మోడల్ స్కూల్లోనే ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. మెరిట్ లిస్ట్ ఆధారంగా రోస్టర్ ప్రకారం సీట్లను కేటాయించనున్నారు. ఏప్రిల్ 27న మెరిట్ లిస్ట్, అదే రోజు సెలక్షన్ లిస్ట్ను సైతం వెల్లడిస్తారు. ఏప్రిల్ 30న సర్టిఫికెట్ల పరిశీలనతో పాటు కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా, రిజర్వేషన్ రూల్స్ ప్రకారం సీట్లు కేటాయిస్తారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ జనార్దన్రెడ్డి తెలిపారు. ఈ పాఠశాలల్లో ఒక్కసారి సీటు దక్కితే ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకూ చదువుకోవచ్చాన్నారు, ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవాలనే తపన ఉండే గ్రామీణ విద్యార్థులకు ఆదర్శ పాఠశాలలు వరంగా చెప్పవచ్చు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ప్రతిభకనబరిస్తే సీటు దక్కుతుంది. -
పశువైద్యానికి ‘పరీక్ష’!
బహుళార్ధ పశువైద్య శాలలో అరకొర సేవలు ● మూగజీవాలకు పరీక్షలన్నీ బయటికే ● పశువులను ఎక్కడెక్కడో తిప్పాల్సిన పరిస్థితి ● వేధిస్తున్న మందుల కొరత ● చికిత్సకోసం యజమానుల జేబులు ఖాళీ ● మూలనపడిన అధునాతన యంత్రాలు అన్నీ బయటికే రాస్తున్నారు దాదాపు పది నెలల ఒంగోలు జాతి కోడెదూడ కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉంది. మేత కూడా తినడం లేదు. స్థానిక పశువైద్యలలో చూపించినా ఫలితం లేకపోయింది. మెరుగైన వైద్యం కోసం కర్నూలు బహుళార్ధ పశువైద్యశాలకు తీసుకొచ్చాం. డాక్టర్లు వైద్య సేవలు బాగా అందిస్తున్నా మందులు, సూదులు, పరీక్షలు అన్నింటినీ బయటికే రాశారు. దీనివల్ల ఖర్చు ఎక్కువగానే వచ్చింది. – నారాయణ, మిట్టకందాల, పాములపాడు మండలం కర్నూలు(అగ్రికల్చర్): బహుళార్థ పశువైద్యశాల.. కర్నూలు నగరంతో పాటు జిల్లాలోని మూగజీవుల పాలిట వరం. ఏరియా పశువైద్యశాలలు, వెటర్నరీ డిస్పెన్సరీల్లో చేతులెత్తేసిన కేసులకు ఇక్కడి వైద్యులు మెరుగైన వైద్యం అందించడంతో పాటు శస్త్ర చికిత్సలు చేస్తూ ప్రాణం పోస్తున్నారు. అత్యవసర వైద్యం కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూగజీవులను కొండారెడ్డిబురుజు సమీపంలోని బహుళార్ధ పశువైద్యశాల కు తీసుకొస్తారు. గత వైఎస్ఆర్సీపీ పాలనలో వైద్య సేవల్లో ఎలాంటి లోపం లేకుండా అందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆసుపత్రి నిర్వహణ అటకెక్కింది. అధునాతన యంత్ర పరికరాలు మరుగునపడటంతో వైద్య సేవలు అధ్వాన్నమయ్యాయి. గతంలో యజమానులకు ఒక్క రూ పాయి ఖర్చు లేకుండా వైద్య సేవలు అందించారు. నేడు వైద్య సేవలు మినహాయిస్తే.. పరీక్షలు, మందు లు ఇతరత్రాలన్నీ బయటకే రాస్తుండటం గమనార్హం. సేవలు నిర్వీర్యం ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక బహుళార్ధ పశువైద్య శాల ఉంది. ఒక డీడీ పోస్టు, రెండు ఏడీ పోస్టులు, రెండు వెటర్నరీ అసిస్టెంటు సర్జన్ పోస్టులు ఉన్నాయి. సిబ్బంది పూర్తి స్థాయిలో ఉన్నారు. ప్రధానమైన సమస్య చికిత్సకు ఏది అవసరమైన బయటికి వెళ్లి తెచ్చుకోవాల్సిందే. సాంకేతిక సమస్యల కారణంతో సేవలను నిర్వీ ర్యం చేసినట్లు తెలుస్తోంది. డిజిటల్ ఎక్స్రే యూనిట్ ఉన్నా.. కొన్ని నెలలుగా పూర్తిగా మరుగున పడిపోయింది. ఎక్స్రే మిషన్ దుమ్మూ, ధూళితో నిండిపోయింది. రక్తం, యూరిన్ పరీక్షలను కూడా బయటికే పంపుతున్నారు. ఎక్స్రే కోసం గాంధీనగర్కు.. రక్త, యూరిన్ పరీక్షలకు గాయత్రీ ఎస్టేటుకు వెళ్లాల్సి వస్తోంది. అరకొరగా మందులు ప్రస్తుతం ఆసుపత్రిలో రెండు, మూడు మందులు ఇస్తే.. మరో రెండు, మూడు బయటికి రాస్తున్నారు. ఆసుపత్రిలో సేవలు గాడితప్పినా పశువైద్యశాల డీడీ, జిల్లా పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ పట్టించుకున్న దాఖలాలు లేవు. కాస్త చొరవ తీసుకుంటే అన్ని రకాల వైద్య సేవలు బయటకు పంపకుండానే అందించే అవకాశం ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం గమనార్హం. ఆసుపత్రికి ప్రతి రోజు కుక్కలు, పిల్లులు, పందులు ఇతర పశువులను 130 వరకు తెస్తుంటారు. ఇందులో 10 శాతం వాటికి ఎక్స్రే అవసరం అవుతుంది. మరో 10 శాతం వాటికి రక్త, పేడ పరీక్షలు నిర్వహిస్తారు. ఎక్స్రే తీయడానికి రూ.800–రూ.1000 వరకు ఖర్చు అవుతుంది. పరీక్షలకు మరో రూ.1000 వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని చూస్తే ఆసుపత్రి అధికారులు రైతులపై ఏ స్థాయిలో ఆర్థిక భారం మోపుతున్నారో స్పష్టమవుతోంది. కుక్కలు, పిల్లులకు ఉచితంగా టీకాలు వేయాల్సి ఉన్నా.. వాటిని కూడా బయటకే రాస్తుండటం విమర్శలకు తావిస్తోంది. మరుగున పడిన ప్రతిపాదనలు బహుళార్ధ పశువైద్యశాలను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్పు చేయాలనే ప్రతిపాదన ఉంది. ఇందులో భాగంగానే రూ.4 కోట్లతో అన్ని రకాల సదుపాయాలతో జి+3 అంతస్తుల భవనాన్ని నాబార్డు నిధులతో నిర్మించారు. 24 గంటలు మూగ జీవులకు వైద్య సేవలు అందించే విధంగా డాక్టర్లను కూడా పెంచాలనే ప్రతిపాదన ఉంది. ఈ ప్రతిపాదనలు మరుగున పడిపోగా.. స్థాయికి తగినట్లుగా కూడా సేవలు అందించకపోవడం గమనార్హం. మెరుగైన వైద్య సేవలే అందిస్తున్నాం బహుళార్ధ పశువైద్యశాలలో మెరుగైన వైద్య సేవలే అందిస్తున్నాం. డిజిటల్ ఎక్స్రే యూనిట్లో సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో కొంత అంతరాయం కలిగింది. ఇతర పరీక్షల కోసం శాంపిల్స్ తీసి వ్యాధి నిర్ధారణ కేంద్రానికి పంపుతున్నాం. అక్కడ చేయని వాటిని బయటకు పంపుతున్నాం. – డాక్టర్ హేమంత్కుమార్, డిప్యూటీ డైరెక్టర్, బహుళార్ధ పశువైద్యశాల, కర్నూలు -
నోట మాట రావడం లేదు
● ధరలు భారీగా పతనం ● పొలాల్లోనే దిగుబడిని వదిలేసిన రైతులుటమాట పంట సాగు చేసిన రైతుల నోట మాట రాక మూగబోయింది. పంట ఆరంభం నుంచి కోత దశ వరకు అష్ట కష్టాలు పడి సాగు చేసినా ఒకవైపు తెగుళ్లు.. మరో వైపు నిలకడలేని ధరల కారణంగా నష్టాలు మూట గట్టుకున్నారు. ఆఖరికి పంటపై పెట్టిన పెట్టుబడి కూడా చేతి కందే పరిస్థితి లేకపోవడంతో ఏం చేయాలో దిక్కు తోచక సతమతమవుతున్నారు. పంట సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలి భగవంతుడా..! అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రబీలో మండల వ్యాప్తంగా దాదాపుగా 150 ఎకరాల్లో పంట సాగు చేయగా ధర మాత్రం గత మూడు నెలలుగా ఒడిదుడుగులకు గురవుతుంది. 25 కేజీల బాక్స్ కేవలం రూ.80 లకే మార్కెట్లో ధర పలకుతుండటంతో కోత కోసిన కూలీల ఖర్చు కూడా రావడం లేదని పంటను పొలాల్లో వదిలేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – కృష్ణగిరి -
అడవి తల్లి చల్లగా ఉండాలని..
● ఐస్క్రీమ్ పుల్లపై 90 సూక్ష్మ చిత్రాలు ఆవిష్కరణ ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ ఐస్క్రీమ్ పుల్లపై 90 సూక్ష్మ చిత్రాలు గీచి అబ్బుర పరిచారు. మైక్రో పెన్ను, బ్రష్తో పోస్టర్ కలర్స్ ద్వారా ఐస్క్రీమ్ పుల్లపై 3 గంటలు శ్రమించి 90 సూక్ష్మ చిత్రాలు వేశారు. చిత్రంలో అడవిలో చెట్లు లేక వన్యప్రాణులు అలమటించిపోయే వేదన, వారి వేదనను వనదేవతకు మొరపెట్టుకోవడం, వన దేవత కన్నీరు పెట్టడం, చెట్లు, నీరు లేక వన్యప్రాణులు విలవిలలాడుతుండటం, ఎండిపోయిన చెట్లు, జంతు కళేబరాలు, నరికివేసిన చెట్లు, తదితరాలతో పాటు జంతువులు, ఖడ్గమృగాలు, నెమళ్లు, కొంగలు, పక్షులు, చేపలు, తాబేళ్లు, తదితర వన్యప్రాణులను సూక్ష్మ చిత్రాల్లో చూపించారు. – నంద్యాల(అర్బన్) -
టీడీపీ నేతలా.. మజాకా
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్రబ్యాంకు అధికారులపై టీడీపీ నాయకులు జులం ప్రదర్శిస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ తమ వాళ్లకే దక్కాలని, మళ్లీ టెండర్లు పిలవాలని, లేదా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఏదో ఒకటి తమ వాళ్లకే ఇవ్వాల్సిందేనని ఏకంగా సీఈవో చాంబరులోకి చొచ్చుకెళ్లి రభస సృష్టించారు. జిల్లా సహకార కేంద్రబ్యాంకు అధికారులు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కోసం ఇటీవల టెండర్లు పిలిచారు. టెండరుదారుల సమక్షంలోనే గురువారం టెండర్లు ఓపెన్ చేశారు. ఐదుగురు టెండర్లు వేయగా.. టెక్నికల్ బిడ్లో ఇద్దరికి మాత్రమే అర్హత లభించింది. పైనాన్సియల్ బిడ్లో ఎవ్వరు తక్కువ సర్వీస్ చార్జీలతో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని నిర్వహిస్తామని కోట్ చేసి ఉంటారో వారికే టెండరు ఖరారు చేస్తారు. డీసీసీబీలో జీవీఎల్ మ్యాన్ పవర్ సప్లయి ఏజెన్సీస్ సర్వీస్ చార్జీ కేవలం 2 శాతం మాత్రమే కోట్ చేసింది. మరో ఏజెన్సీ 8 శాతం సర్వీస్ చార్జీలను కోట్ చేసింది. దీంతో డీసీసీబీ అధికారులు జీవీఎల్ సంస్థకే టెండరు ఖరారు చేశారు. డీసీసీబీలో 106 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీరందరూ ఈ సంస్థ తరుఫున పని చేస్తారు. ఈ సంస్థ మూడు నాలుగేళ్లుగా పని చేస్తోంది. ఎలాంటి రిమార్కులు లేవు. టెండర్లు పిలిచే ముందు ఈ సంస్థను కూడా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నుంచి తప్పించారు. తాజాగా పిలిచిన టెండర్ల ద్వారా అతి తక్కువ సర్వీస్ చార్జీ కోట్ చేయడం ద్వారా ద్వారా మళ్లీ దక్కించుకున్నారు. జీవీఎల్ సంస్థపై వైఎస్సార్సీపీ ముద్ర వేసిన నందికొట్కూరు, పాణ్యం ఎమ్మెల్యే వర్గీయులు బ్యాంకు అధికారులపై అక్కసు వెల్లగక్కుతున్నారు. పథకం ప్రకారం జీవీఎల్కే టెండరు దక్కే విధంగా చేశారని ఆక్రోశం వ్యక్తం చేశారు. కాగా పాలక వర్గాలు ఉంటే వాళ్లు చెప్పిన సంస్థను ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం పాలక వర్గాలు లేవు. జాయింట్ కలెక్టర్ నవ్య అఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్గా కొనసాగుతున్నారు. ఈ సమయంలో పారాదర్శకంగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని టెండరు ద్వారా ఎంపిక చేశారు. దీనిని టీడీపీ నేతలు జీర్ణించుకోలేక అధికారులపై జులుం ప్రదర్శిస్తున్నరనే విమర్శలు ఉన్నాయి. టీడీపీ నేతల చేసిన రభసను బ్యాంకు అధికారులు మూడవ పట్టణ పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. డీసీసీబీలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ టెండర్లపై రభస అతి తక్కువ సర్వీస్ చార్జీ కోట్ చేసిన జీవీఎల్కు సంస్థకు ఖరారు తమ వారికే ఏజెన్సీ దక్కాలని టీడీపీ నేతల పట్టు -
దుఃఖాన్ని దిగమింగి పరీక్షకు హాజరు
ఆలూరు: బాల్యంలో చేయి పట్టుకుని ప్రపంచాన్ని చూపించిన, మంచి నేర్పించిన తండ్రి ఇక లేరు..పుట్టినప్పటి నుంచి లాలన పంచి, మమకారంతో పెంచిన అమ్మ ఇక రాదు.. ఎంతో కష్టాన్ని భరించి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు లేరనే దుఃఖంలోనే ఇద్దరు పదో తరగతి విద్యార్థులు బుధవారం పరీక్ష రాశారు. కంట నీరు వస్తున్నా అమ్మానాన్నలు పెట్టుకున్న ఆశలు, తమ ఆశయాలను నెరవేర్చుకునేందుకు పరీక్షకు హాజరయ్యారు. ఆలూరు మండలం మొలగవెల్లి గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన సాయి పోగు భగీరత, భార్య శ్రీదేవి దంపతుల నాలుగో కుమారుడు సాయిపోగు రామకృష్ణ స్థానిక పాఠశాలలో పదో తరగతి చదివారు. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ కుమారుడిని చదివించారు. ఈ నెల 18న హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో మిర్చి పంటను కోసేందుకు శ్రీదేవి (47) కూలి పనికి వెళ్లారు. పొలం సమీపంలోని ఎల్లెల్సీలో నీటిని తాగేందుకు వెళ్లి కాలు జారి పడి మృతి చెందారు. తల్లి మృతి చెందిన బాధను దిగమింగుకుని ఆలూరు ప్రభుత్వ బాలికల ఉన్న పాఠశాల పరీక్ష కేంద్రంలో సాయిపోగు శివరామకృష్ణ బుధవారం హిందీ పరీక్ష రాశారు. తండ్రి మరణించినా.. ఆలూరులోని మెయిన్ ఉర్దూ పాఠశాలలో మహ్మద్ ముజమల్ అనే విద్యార్థి పదో తరగతి చదివారు. మంగళవారం తెల్లవారు జామున విద్యార్థి తండ్రి నూర్మహ్మద్ (50) అనారోగ్యంతో మృతి చెందారు. ఆ బాధతోకూడా బుధవారం ఉదయం పరీక్ష కేంద్రానికి మహ్మద్ ముజమల్ చేరుకున్నారు. హిందీ పబ్లిక్ పరీక్షను రాశారు. తండ్రి మరణించిన దుఃఖంలోనూ పరీక్షకు హాజరైన విద్యార్థి మహ్మద్ ముజమల్ను ఉపాధ్యాయులు అభినంధించారు. -
పెద్దాయనా.. మన్నించు !
సంజీవయ్య జయంతి ఉత్సవాలకు రూ.3 లక్షలు ● ఫిబ్రవరి 14న ఘనంగా నిర్వహించిన జిల్లా అధికార యంత్రాంగం ● నేటికీ నయాపైసా విదల్చని ప్రభుత్వం కర్నూలు(అర్బన్): దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి నిర్వహణకు సంబంధించిన వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేటికీ విడుదల చేయకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంజీవయ్య సొంత జిల్లా అయిన కర్నూలులో ఆయన జయంతిని అంగరంగ వైభవంగా అధికారికంగా రాష్ట్ర స్థాయి పండుగ నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే స్టేట్ హెడ్ క్వార్టర్స్తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.లక్ష, సంజీవయ్య సొంత జిల్లా కర్నూలుకు రూ.3 లక్షల నిధులు కేటాయిస్తున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరి 10న రాష్ట్ర ప్రభుత్వం జీఓ 2 విడుదల చేసింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం స్థానిక నంద్యాల చెక్పోస్టు సమీపంలో దామో దరం సంజీవయ్య విగ్రహం ఉన్న ప్రాంతంలో జయంతి వేడుకలను ఫిబ్రవరి 14న ఘనంగా నిర్వహించారు. నేడో రేపో నిధులు విడుదలైన వెంటనే చెల్లించవచ్చనే ధైర్యంతో సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన పలువురు అధికారులు సప్లయర్స్ షాపు, పూల దుకాణాలు, కిరాణ తదితర షాపుల్లో అప్పులు చేసి జయంతిని ఘనంగా చేశారు. జయంతి నిర్వహించి నెల రోజులు గడచిపోయినా, ప్రభుత్వం నుంచి నేటికీ నయాపైసా విడుదల కాకపోవడంతో అప్పులు ఇచ్చిన షాపుల వారికి ముఖాలు చూపించలేక, అపద్దాలు చెప్పలేక పలువురు అధికారులు ముఖం చాటేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా షాపుల యజమానులు సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండటం గమనార్హం. -
ప్రజల రక్షణ మరిచి !
నిబంధనలు నీట ముంచి.. ● యథేచ్ఛగా ఇంజిన్ బోటు ప్రయాణం ● కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ ● కెపాసిటీకి మించి లైఫ్ జాకెట్స్ లేకుండా ప్రయాణికుల తరలింపు ● ఘాట్ నిర్వాహకులకు అధికార పార్టీ నేతల అండదండలు పగిడ్యాల: శ్రీశైలం బ్యాక్వాటర్లో ఇంజిన్ బోటులో ప్రయాణికుల తరలింపును అడ్డుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించినా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. మూర్వకొండ ఘాట్, అర్లపాడు ఘాట్ నిర్వాహకులకు అధికార పార్టీ నేతల అండదండలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కృష్ణానదికి ఇరువైపులా బంధువర్గాలు ఉన్న ప్రజలు ఆయా ప్రాంతాలకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే వ్యవప్రయసాలు కావడంతో చాలా మంది ఇంజిన్ బోట్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఘాట్ నిర్వాహకులు కెపాసిటీకి మించి ప్రయాణికులను పడవలో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కనీసం లైఫ్ జాకెట్లు లేకుండా ప్రయాణికులను పంపుతున్నారు. మూడు నెలలుగా కొనసాగుతున్న అనధికారిక ఇంజిన్ బోటు ప్రయాణంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఘాట్ నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఇంజిన్ బోట్లలో కెపాసిటీకి మించి 25 నుంచి 30 మంది ప్రయాణికులను తరలించడమే కాకుండా బైక్లను అందులో తరలించి ఒక్కొక్కరి నుంచి రూ. 200ల ప్రకారం వసూలు చేస్తున్నారు. 2007 జనవరి 18న ఇదే మూర్వకొండ ఘాట్ నుంచి సింగోటం జాతరకు నాటు పడవలో వెళ్తూ 60 మంది జల సమాధి అయిన ఘటన నేటికి కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అయినా కాలం చెల్లిన ఫిట్నెస్ లేని ఇంజిన్ బోట్లపై ప్రయాణికులు భయం భయంగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి (లైసెన్స్) లేకపోయినప్పటికీ అధికార పార్టీ ఎమ్మెల్యే వర్గీయుల కనుసన్నల్లో అనధికార ప్రయాణానికి పచ్చ జెండా ఊపడంతో ఘాట్ నిర్వాహకులకు కాసుల పంట పండుతోంది. ఈ విషయమై తహసీల్దార్ శివరాముడును వివరణ కోరగా.. ఇంజిన్ బోటు ప్రయాణానికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని విచారించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. -
సెల్ ఫోన్ హ్యాక్ చేసి.. రూ. 90 వేలు కాజేసి!
వెల్దుర్తి: సైబర్ నేరగాళ్లు రోజుకో పంథాలో దోచుకుంటున్నారు. సెల్ఫోన్ను హ్యాక్ చేసి, ఓటీపీలు తెలుసుకుని బ్యాంక్ ఖాతాలో ఉన్న నగదును అపహరించారు. వెల్దుర్తి పట్టణానికి చెందిన రేమడూరు రామిరెడ్డికి స్థానిక యూనియన్ బ్యాంకులో ఖాతా ఉంది. సైబర్ నేరగాళ్లు అతని సెల్ ఫోన్ను ఈనెల 17న హ్యాక్ చేసి ఓటీపీలు తెలుసుకుంటూ బ్యాంకు ఖాతాలోని రూ.99 వేలను అమేజాన్ పే ద్వారా బదిలీ చేసుకున్నారు. తన ఖాతా నుంచి నగదు మాయమైనట్లు గుర్తించిన బాధితుడు బుధవారం బ్యాంకుకు వెళ్లి ఆరా తీశారు. సైబర్ నేరగాళ్ల పనేనని తెలుసుకుని తన ఖాతాను లాక్ చేయించారు. బాధితుడు సైబర్ పోలీసులు, స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫోన్లకు వచ్చే కొత్త లింకులు ఓపెన్ చేయవద్దని, ఫోన్లు హ్యాక్ అయి నగదు మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎస్ఐ అశోక్ హెచ్చరించారు. ప్రయాణికుల భద్రతకు పకడ్బందీ చర్యలు చేపట్టండి ఆదోని సెంట్రల్: ప్రయాణికుల భద్రతకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని రైల్వే సౌత్ సెంట్రల్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ రైల్వే అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీలో భాగంగా ఆయన బుధవారం సులహాళ్లి నుంచి గుంతకల్లు వరకు రైల్వే స్టేషన్లను పరిశీలిస్తూ ఆదోని రైల్వే స్టేషన్ను తనిఖీ చేశారు. అమృత్ భారత్ పథకం కింద స్టేషన్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. ఈయన వెంట ప్రిన్సిపల్ చీఫ్ అప్రంటీస్ మేనేజర్ పద్మజ, గుంతకల్లు డీఅర్ఎం చంద్ర శేఖర్ గుప్త ఆదోని స్టేషన్ మాస్టర్ వెంకటేశ్వర్లు, చీఫ్ క్యాంప్ సూపరింటెండెంట్ త్రిభువన్, రైల్వే పోలీసులు తదితరులు ఉన్నారు. పట్టణంలోని నల్లగేటు వద్ద అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మా ణం చేపట్టాలని బీజేపీ నాయకులు నాగరాజు గౌడ్, మధుసూనద్ శర్మ తదితరులు అరుణ్ కుమార్ జైన్కు వినతి పత్రం అందజేశారు. ఒద్దెల వాగులో యువకుడి గల్లంతు ● గాయాలతో బయటపడిన మరొకరు పాణ్యం: మండల కేంద్రమైన పాణ్యం–కొణిదేడు గ్రామాల మధ్య ఉన్న వొద్దెలవాగులో ఓ యువకుడు గల్లంతు కాగా మరో యువకుడు గాయాలతో బయటపడ్డాడు. కొణిదేడు సమీపంలో రైల్వే డబ్లింగ్ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ పనులు చేస్తున్న ఛత్తీస్ఘడ్కు చెందిన రాహూల్, మరో యువకుడు పని మీద బుధవారం సాయంత్రం బైక్పై పాణ్యం వచ్చారు. రాత్రి పని ముగించుకుని పని చేసే చోటుకు తిరిగి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఒద్దెలవాగులో పడిపోయారు. గమనించిన వాహనదారులు రాహుల్ అనే వ్యక్తికి బయటకు తీశారు. మరో యువకుడు గల్లంతైనట్లు తెలిపారు. సమాచారం తెలుసుకు న్న 108 సిబ్బంది గాయపడిన రాహుల్ను నంద్యాల జీజీహెచ్కు తరలించారు. స్థానికులు వాగు వెంట మరో యువకుడికి కోసం గాలిస్తున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం డోన్ టౌన్: పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం చెందాడు. మల్లెంపల్లె గ్రామానికి చెందిన సలీంద్ర వీరాంజనేయులు (30) డోన్ పట్టణం నుంచి కొత్తపల్లె వైపు ట్రాక్టర్లో వెళ్తుండగా వెనుక వస్తున్న మరో ట్రాక్టరు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరాంజనేయులు ట్రాక్టర్ నుంచి ఎగిరి పక్కనే ఉన్న డివైడర్పై పడటంతో తలకు తీవ్రగాయమైంది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య మంజుల, నెలల వయస్సు కుమారుడు ఉన్నారు. -
దైవ దర్శనానికి వెళ్తూ..
జూపాడుబంగ్లా/కొత్తపల్లి: సప్తనదుల సంగమేశ్వరంలో వెలిసిన సంగమేశ్వరుడి దర్శనానికి వెళ్లిన ఓ యువకుడు కృష్ణానదిలో మునిగి మృత్యువాత పడ్డాడు. మండ్లెం గ్రామానికి చెందిన పోతులరాజు మద్దిలేటి, బాలావతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దవాడైన సందీప్కుమార్బాబు తిరుపతిలోని ఐఎఫ్ ఎఫ్టీ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రికి ఆరోగ్యం బాగోలేదని చూసేందుకు నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి చేరుకున్నాడు. కాగా బుధవారం తన మిత్రుడు తంగడంచ గ్రామానికి చెందిన శివకుమార్తో కలిసి బైక్పై సప్తనదుల సంగమేశ్వరాలయానికి వెళ్లారు. నదిలో స్నానం చేసిన అనంతరం ఆలయ అర్చకుడు తగ్గిన కృష్ణా జలాల్లో నడుచుకొంటూ ఆలయం వద్దకు వెళ్లి పూజలు చేసి రావటాన్ని గమ నించారు. వారు కూడా ఆలయం వద్దకు వెళ్లి స్వామిని దర్శించుకునేందుకు కృష్ణాజలాల్లో నడుచుకొంటూ వెళ్లసాగారు. కొద్దిదూరం వెళ్లాక శివకుమార్ తన వద్ద ఉన్న సెల్ఫోన్ ఒడ్డుపై పెట్టివస్తానని బయటకు వచ్చాడు. సందీప్కుమార్బాబు ఒక్కడే నీళ్లల్లో నడుచుకుంటూ ఆలయం వద్దకు వెళ్లాడు. ఆలయం సమీపిస్తుండగానే అక్కడ లోతైన గుంతలోని పూడికలో కూరుకపోయి మునిగిపోయాడు. శివకుమార్ గమనించి కేకలు వేయటంతో సమీపంలోని మత్స్యకారులు పుట్టిల్లో వెళ్లి నీట మునిగిన సందీప్కుమార్బాబును ఒడ్డుకు చేర్చారు. కాగా అప్పటికే అతను మృతిచెందాడు. సమాచారం అందుకన్న యువకుడి తల్లిదండ్రులు సంగమేశ్వరానికి చేరుకుని విలపించారు. సమాచారం అందుకున్న కొత్తపల్లి ఎస్ఐ ఎం.కేశవ సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి బాబాయి బుజ్జన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్ఐ తెలిపారు. పేకాటరాయుళ్ల అరెస్ట్ సంజామల: మండల పరిధిలోని మంగపల్లె గ్రామంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని ఎస్ఐ రమణయ్య బుధవారం అరెస్ట్ చేశారు. గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు రైల్వే ట్రాక్ సమీపంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం రావడంతో సిబ్బందితో కలసి దాడి చేసి పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.3150 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
రైతు ఇంట మెరిసిన ఆణిముత్యాలు
● ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ముగ్గురు కుమారులు ● చిన్నారులకు ఉచితంగా బోధన చేస్తున్న రైతు బేతంచెర్ల: ఆ రైతుకు చదువు అంటే ఎంతో ఇష్టం. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత చదువుకు దూరమయ్యాడు. అయితే వ్యవసాయం చేస్తూనే తన కలను కుమారులతో సాకారం చేసుకున్నాడు. ముగ్గురు కొడుకులను బాగా చదివించడంతో వారు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. తన బిడ్డల్లానే గ్రామంలో చిన్నారులు కూడా శ్రద్ధగా చదువుకుని ప్రయోజకులు కావాలని ఆకాంక్షిస్తూ సాయంత్రం వేళ ఉచితంగా విద్యను బోధిస్తున్నాడు. ఎంబాయి గ్రామం పాడి పంటలకు ప్రసిద్ధి. ఆ గ్రామంలో ఈడిగ వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరమ్మ దంపతులది సాధారణ వ్యవసాయ కుటుంబం. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని దగ్గరగా చూసిన ముగ్గురు కుమారులు పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించారు. పెద్ద కుమారుడు తులసీ రామ్ గౌడ్ డిగ్రీలో బీజెడ్సీ పూర్తి చేసి 2014లో ఎయిర్ ఫోర్స్లో మెడికల్ అసిస్టెంట్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం బెంగళూరులో పని చేస్తున్నారు. రెండవ కుమారుడు బెనర్జీ గౌడ్ వెటర్నరీలో డిప్లొమో పూర్తి చేసి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అనిమల్ హస్బెండరీగా ఎంపికయ్యారు. కొలుములపల్లె సచివాలయంలో పని చేస్తూ.. ఇటీవల వెటర్నరీ అసిస్టెంట్గా పదోన్నతి పొంది ముద్దవరంలో విధులు నిర్వహిస్తున్నారు. చిన్న కుమారుడు తరుణ్కుమార్ గౌడ్ 2019లో అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. ఇటీవల కళాశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మాణిక్యరావు చేతుల మీదుగా డాక్టర్ పట్టా అందుకున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రభుత్వ కొలువులు సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పట్టుదలతో సాధించారు నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను. ఆర్థిక పరిస్ధితుల కారణంగా ఉన్నత చదువులకు వెళ్లలేక గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ పిల్లలను బాగా చదివించాలనుకున్నా. వారు కూడా పట్టుదలతో చదివి ప్రయోజకులయ్యారు. చిన్నప్పటి నుంచి పిల్లలు పాఠశాలకు వెళ్లి వచ్చిన తరువాత బోధన ఆంశాలపై చర్చించి, సందేహాలను నివృత్తి చేసేవాడిని. మా పెద్ద కుమారుడు తులసీరామ్ గౌడ్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం సాధించిన తరువాత తమ అన్నను ఇద్దరు తమ్ములు ఆదర్శంగా తీసుకుని ఉద్యోగాలు సాధించారు. నా కొడుకుల మాదిరిగానే గ్రామంలోని చిన్నారులు కూడా బాగా చదువుకోవాలని నా వంతుగా సాయంత్రం వేళలో ఉచితంగా బోధన చేస్తున్నాను. – వెంకటేశ్వర్లు గౌడు, ఎంబాయి -
అందరూ చూస్తుండగానే ఆత్మహత్య
● గుత్తి రైల్వే స్టేషన్లో రైలు కింద పడి మృతి ● మృతుని స్వగ్రామం గొర్విమానుపల్లె ● ఆర్థిక సమస్యలే కారణమని సమాచారం కొలిమిగుండ్ల: అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ బుధవారం మధ్యాహ్నం ప్రయాణికులతో రద్దీగా ఉంది.. అందరూ చూస్తుండగానే ఓ యువకుడు పట్టాలపైకి చేరుకొని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హఠాత్తు సంఘటనతో అక్కడి ప్రయాణికులు షాక్కు గురయ్యారు. కొలిమిగుండ్ల మండలం గొర్విమానుపల్లెకు చెందిన రామదాసు శ్రీరాములు, మునెమ్మ దంపతులకు కుమార్తె, కుమారుడు సంతానం కాగా కూతురుకు వివాహమైంది. కుమారుడు మహేంద్ర (25) గతంలో గ్రామంలో వలంటీర్గా పని చేశాడు. ప్రస్తుతం అనంతపురం జిల్లా యాడికి సమీపంలోని ఓ సిమెంట్ పరిశ్రమలో పని చేస్తున్నాడు. కొద్ది రోజుల నుంచి ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కే మార్గం లేక ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలు చోట్ల గాలిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం గుత్తి రైల్వే స్టేషన్కు చేరుకున్న యువకుడు రైలు వేగంగా వస్తుండగా ప్రయాణికులు చూస్తుండగానే ప్లాట్ఫామ్ పైనుంచి దూకి పట్టాలపై తల పెట్టి పడుకోవడంతో రైలు అతనిపై వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీయగా గొర్విమానుపల్లెకు చెందిన మహేంద్రగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. -
యోగా అవార్డులకు నామినేషన్ల ఆహ్వానం
కర్నూలు(హాస్పిటల్): పీఎం యోగా అవార్డులు ఇచ్చేందుకు ఆన్లైన్ ద్వారా నామినేషన్లు, ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు సెట్కూరు సీఈఎ డాక్టర్ కె.వేణుగోపాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. యోగాలో జాతీయ, అంతర్జాతీ య స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి, యోగా అభివృద్ధికి కృషి చేసిన సంస్థలకు అవార్డులు ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలకు https:// innovateindia. mygov. in/ pm& yoga& awards–2025 ను సందర్శించాలన్నారు. క్వింటా పత్తి రూ.7,666 ఆదోని అర్బన్: ఆదోని వ్యవసాయ మార్కెట్యార్డులో పత్తి ధర క్రమంగా పెరుగుతోంది. బుధవారం క్వింటా ధర రూ.7,666గా నమోదైంది. రైతులు 517 క్వింటాళ్లు అమ్మకానికి తీసుకురాగా.. గరిష్ట ధర రూ.7,666, మధ్య ధర రూ.7,380, కనిష్ట ధర రూ.5,389 పలికింది. ● వేరుశనగలు 5,100 సంచులు విక్రయానికి రాగా.. గరిష్ట ధర రూ.6,827, మధ్య ధర రూ. 6,469, కనిష్ట ధర రూ.3,399 నమోదైంది. ● ఆముదాలు 32 సంచులు రాగా గరిష్ట ధర రూ.5,970, మధ్య ధర రూ.5,970, కనిష్ట ధర రూ.5,077 పలికింది. ● ఎండుమిర్చి 2,057 సంచులు రాగా గరిష్ట ధర రూ.10,206, మధ్య ధర రూ.8,300, కనిష్ట ధర రూ.2,009 నమోదైంది. మధ్యవర్తిత్వంపై శిక్షణ కర్నూలు(సెంట్రల్): సుప్రీంకోర్టు నూతనంగా ప్రవేశపెట్టిన మధ్యవర్తిత్వంపై బార్ అసోసియేషన్ సభ్యులకు శిక్షణ ఇచ్చారు. బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కబర్థి ఆదేశాలతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, కేరళ నుంచి వచ్చిన రిసోర్స్పర్స్న్లు సురేష్, జ్యోతిగోపీనాథన్ న్యాయవాదులకు అవగాహన కల్పించా రు. మధ్యవర్తిత్వంతో కేసులను ఎలా పరిష్కరించాలనే అంశాలు, ఉన్న చట్టాలపై శిక్షణ ఇచ్చారు. పది పరీక్ష కేంద్రాల తనిఖీ కర్నూలు సిటీ: నగరంలోని పదోతరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తనిఖీ చేశారు. బిషప్ సెంట్ జోసెఫ్ ఇంగ్లిషు మీడియం హైస్కూల్, గుడ్ షెప్పర్డ్ ఇంగ్లిషు మీడియం హైస్కూల్లో ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 172 పరీక్ష కేంద్రాల్లో బుధవారం జరిగిన పదో తరగతి పరీక్షలకు 219 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 31,535 మంది విద్యార్థులకుగాను 31,316 మంది హాజరు అయ్యారని డీఈఓ ఎస్. శామ్యూల్ తెలిపారు. రెండో రోజు ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. ఓపెన్ స్కూల్ టెన్త్ పరీక్షలకు 809 మంది విద్యార్థులకుగాను 721 మంది పరీక్షకు హాజరుకాగా 88 మంది గైర్హాజరయ్యారు. -
నేడు నేర సమీక్ష సమావేశం
దుకాణానికో రేటు ఖరారు ● కర్నూలులో రూ.70 వేలు ఇవ్వాల్సిందేనని పట్టు ● మధ్యవర్తిత్వం చేసిన ఓ మంత్రి ● ప్రస్తుతానికి రూ.40వేలు చెల్లించేలా ఒప్పందం ● వ్యాపారాన్ని బట్టి కూడా వసూళ్లు ●● ప్రతినెలా 10లోపు లావాదేవీల పూర్తి కర్నూలు: ఉమ్మడి జిల్లాలోని మద్యం దుకాణాల్లో పోలీసుల మామూళ్ల దందా శృతి మించుతోంది. వ్యాపారం సాగుతుందా? లేదా అనే విషయంతో సంబంధం లేకుండా అన్ని చోట్టా వసూళ్ల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. నెలకు దుకాణానికి రూ.40 వేలు, మరికొన్ని చోట్ల రూ.50 వేలు చొప్పున కప్పం కట్టాల్సిందేనంటూ అనధికారిక ఆదేశాలు జారీ చేస్తున్నారు. వచ్చిన మొత్తాన్ని వాటాలేసి పంచుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 225 మద్యం దుకాణాలు, 60 బార్లు ఉన్నాయి. వీటిలో 90 శాతం దుకాణాల్లో పోలీసులు మామూళ్లు వసూలు చేస్తున్నారు. నెలకు రూ.40 వేల చొప్పున ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. కర్నూలు అర్బన్లో 21, రూరల్లో 11 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఒక్కొక్క దుకాణానికి రూ.70 వేల చొప్పున ఇవ్వాలని ఓ పోలీసు అధికారి హుకూం జారీ చేయగా మద్యం సిండికేట్దారులు ఓ మంత్రిని ఆశ్రయించారు. వ్యాపారంలో ఎదురవుతున్న కష్టాల గురించి చెప్పుకున్నారు. దీంతో మంత్రి మధ్యవర్తిత్వం చేసి ఒక్కొక్క దుకాణానికి రూ.40 వేలు ఇచ్చేలా డీల్ కుదిర్చినట్లు వ్యాపారుల్లో చర్చ జరుగుతోంది. ఒక్క కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో ఉన్న 32 మద్యం దుకాణాలు, 18 బార్ల నిర్వాహకులు కలసి నెలకు రూ.20 లక్షల దాకా పోగేస్తున్నారంటే వసూళ్ల పర్వం ఏస్థాయిలో సాగుతుందో అర్థమవుతోంది. వ్యాపారం బాగా సాగితే అదనపు వసూళ్లు కోడుమూరు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 15 మద్యం దుకాణాలు ఉన్నాయి. జిల్లాలోనే అత్యధిక వ్యాపారం జరిగే నాగలాపురం మద్యం దుకాణం నుంచి నెలకు రూ.లక్ష చొప్పున ఇవ్వాల్సిందేనంటూ ఓ అధికారి హుకూం జారీ చేసినట్లు వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలా ఉమ్మడి కర్నూలు జిల్లాలో వందకు పైగా దుకాణాల్లో అత్యధిక వ్యాపారం జరుగుతుండటంతో వాటి నిర్వాహకుల నుంచి పోలీసులు అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. సిండికేట్ నిర్వాహకుల లెక్కల్లో ఏయే స్టేషన్కు ఎంత మొత్తం మామూళ్లు ఇస్తున్నారో పొందుపరచిన వివరాలపై ఇటీవల ఎకై ్సజ్ అధికారులు, మద్యం వ్యాపారుల మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. ప్రతినెలా 10వ తేదీలోపే! కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వసూళ్ల దందా జోరుగా సాగుతోంది. ప్రతినెలా 10వ తేదీ లోపే వసూళ్ల ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. రెండు జిల్లాల్లో నెలకు రూ.కోటికి పైగా మామూళ్ల రూపంలో పోలీసులకు అందుతున్నట్లు వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చిన మొత్తాన్ని రెండు వాటాలు వేసి ఎస్హెచ్లు, ఆపై అధికారులు పంచుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. స్టేషన్, సబ్ డివిజన్ పరిధిలో ఉండే మద్యం దుకాణాల సంఖ్యను బట్టి మామూళ్లు ముట్టజెపుతున్నట్లు తెలుస్తోంది. అధిక ధరలకు అమ్మకాలు ●పోలీసులను మామూళ్ల మత్తులో పెట్టి నిర్వాహకులు నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. ● అధిక ధరలకు అమ్ముకునేందుకు రూరల్ ప్రాంతాల్లో బెల్టు షాపులకు మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. ● ఈ క్రమంలో అర్బన్ ప్రాంతాల్లో దుకాణానికి నెలకు రూ.40 నుంచి రూ.50 వేలు, రూరల్ ప్రాంతాల్లో రూ.60 వేల నుంచి రూ.80 వేల దాకా మామూళ్ల రూపంలో పోలీసులు పోగేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ● ప్రతి మద్యం దుకాణం నుంచి వాటి అనుబంధ బెల్టు షాపులకు క్వార్టర్పై ఉన్న ఎమ్మార్పీ కంటే రూ.20 నుంచి రూ.50 వరకు ఎక్కువ ధరకు వ్యాపారులు సరఫరా చేస్తున్నారు. ● బెల్టు దుకాణాల్లో జరిగే దందాను చూసీచూడనట్లు ఉండేందుకు వ్యాపారాన్ని బట్టి ప్రత్యేక ప్యాకేజీలు ఏర్పాటు చేసుకుని వసూలు చేస్తున్నట్లు సమాచారం. కర్నూలు: జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో గురువారం నేర సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. గత నెలలో జరిగిన నేరాలతో పాటు పెండింగ్ కేసులపై ఎస్పీ విక్రాంత్ పాటిల్ సమీక్షించనున్నారు. ముందుగా ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కర్నూలు శివారులోని జగన్నాథగట్టుపై ఉన్న పోలీసు శిక్షణ కేంద్రంలో పోలీసు అధికారులకు ఫైరింగ్పై శిక్షణ, 10 గంటల నుంచి వ్యాస్ ఆడిటోరియంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు జిల్లాలోని పోలీసు అధికారులకు ఆదేశాలు అందాయి. -
రాష్ట్రంలో అరాచకపాలన
● వైఎస్సార్ విగ్రహానికి నిప్పు పెట్టడం దారుణం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి కోడుమూరు రూరల్: రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి అన్నారు. ప్రజల గుండెల్లో నుంచి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తొలగించాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మహానేత వైఎస్సార్ విగ్రహానికి నిప్పు పెట్టారన్న విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేతలు బుధవారం కోడుమూరు వెళ్లారు. మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని పరిశీలించి అక్కడే నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి, కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్దన్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రజల సంక్షేమానికి అహర్నిశలు పాటుపడిన వైఎస్సార్ విగ్రహానికి నిప్పు పెట్టడం దారుణమన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన ‘కూటమి’ నేతలు హామీలను అమలు చేయలేక.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే వైఎస్సార్ విగ్రహాలపై దాడులు చేయిస్తున్నారన్నారు. యూనివర్సిటీలకు వైఎస్సార్ పేరు ఉండగా మార్చడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఒకే వ్యక్తిపై పలు జిల్లాల్లో ఒకే విధమైన కేసులు నమోదు చేయించి వేధింపులకు పాల్పడుతున్నారని, ఇది అనాగరిక చర్య అన్నారు. అధికారం శాశ్వతం కాదని, భవిష్యత్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోడుమూరులో వైఎస్సార్ విగ్రహానికి నిప్పు పెట్టడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహారించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు రఘునాథ్రెడ్డి, వైస్ ఎంపీపీ విజయ్కుమార్రెడ్డి, కృష్ణాపురం సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు కృష్ణారెడ్డి, వెఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ప్రభాకర్, మండల అధ్యక్షుడు రమేష్నాయుడు, మాజీ ఉపసర్పంచ్ ప్రవీణ్కుమార్, స్థానిక నాయకులు జగదీష్, గోపి, విజయభాస్కరరెడ్డి, బందె నవాజ్, డీజె రాజు, బజారి, వెంకటేశ్వర్లు, ఈరన్న, మాసుమ్, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
27న ‘స్థానిక’ ఖాళీల భర్తీకి ఎన్నికలు
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్, మండల పరిషత్తుల్లో ఖాళీగా ఉన్న కోఆప్షన్ సభ్యులు, ఎంపీపీ పదవుల భర్తీకి ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు వెలుగోడుకు చెందిన సయ్యద్ సులేమాన్ గత ఏడాది మార్చి 28న, క్రిష్ణగిరి మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు షేక్ షాలీసాహెబ్ ఈ ఏడాది జనవరి 1న మృతి చెందారన్నారు. అదేవిధంగా వెల్దుర్తి, తుగ్గలి మండల పరిషత్ అధ్యక్షులు బి.శారద, ఆదెమ్మ వ్యక్తిగత కారణాలతో 2024 మార్చి 29న తమ పదవులకు రాజీనామా చేశారన్నారు. ఈ నేపథ్యంలో ఖాళీ ఏర్పడిన నాలుగు పోస్టులకు ఎన్నికలను నిర్వహించునున్నామన్నారు. ఇందుకు సంబంధించి ఈ నెల 23న నోటీసులు జారీ చేస్తామని, ఆ రోజు నుంచి కోఆప్షన్ సభ్యుల స్థానాలకు 27వ తేది ఉదయం 10 గంటల వరకు, ఎంపీపీ స్థానాలకు ఉదయం 11 గంటల వరకు నామినేషన్లు దాఖాలు చేసుకోవచ్చన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన అనంతరం యథావిధిగా నామినేషన్ల ఉపసంహరణ, బరిలో ఉన్న వారి జాబితాలను ప్రకటిస్తామన్నారు. అదే రోజున మధ్యాహ్నం 1 గంటకు జెడ్పీలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి కోఆప్షన్ సభ్యున్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. అలాగే మండల పరిషత్ కార్యాలయాల్లో కూడా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఎంపీపీ, కోఆప్షన్ సభ్యున్ని ఎన్నుకుంటారన్నారు. ఆరు గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచులకు.. జిల్లాలోని ఆరు గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచు స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. దేవనకొండ మండలం వెలమకూరు, పత్తికొండ మండలం జూటూరు, ఓర్వకల్ మండలం గుట్టపాడు, కర్నూలు మండలం సుంకేసుల, ఆలూరు మండలం మొలగవెళ్లి, వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచు ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలిపారు. 27న ఉదయం 11 గంటలకు ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికలను నిర్వహిస్తామన్నారు. ఖాళీగా మూడు జెడ్పీటీసీ స్థానాలు .... జిల్లా పరిషత్లో కూడా మూడు జెడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కల్లూరు జెడ్పీటీసీ వి.ప్రభాకర్రెడ్డి 2023 అక్టోబర్ 20న మృతి చెందారు. చిప్పగిరి జెడ్పీటీసీగా ఉన్న బి.విరుపాక్షి ఆలూరు ఎమ్మెల్యేగా ఎన్నికవడం వల్ల తన జెడ్పీటీసీ పదవికి 2024 జూన్ 14న రాజీనామా చేశారు. ప్యాపిలి జెడ్పీటీసీగా ఉన్న బోరెడ్డి శ్రీరాంరెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఈ నెల 10న మరణించారు. ఈ మూడు స్థానాలతో పాటు జిల్లాలో ఖాళీగా ఉన్న సర్పంచు, ఎంపీటీసీ, వార్డు సభ్యుల స్థానాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. -
అవిశ్వాస తీర్మానం
ఆదోని మునిసిపల్ చైర్పర్సన్పై కర్నూలు(సెంట్రల్): ఆదోని మునిసిపల్ చైర్పర్సన్ బోయ శాంత ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపికై నా కౌన్సిలర్ల మాటకు విలువ ఇవ్వకుండా విశ్వాసం కోల్పోయారని, ఆమైపె అవిశ్వాస తీర్మానానికి అవకాశం ఇవ్వా లని కోరుతూ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు కలెక్టర్ను కలిశారు. బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ పి.రంజిత్బాషాను ఆయన చాంబర్లో కలసి 35 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా సంతకాలు చేసిన లేఖను అందజేశారు. ఈ లేఖపై కలెక్టర్ 15 రోజుల్లో విచారణ జరిపి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రత్యేకంగా మునిసిపల్ససర్వసభ్య సమావే శా న్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గితే నూతన ౖచైర్మన్ను ఎన్నుకునే వీలుంటుంది. కౌన్సిలర్ల మాటకు విలువ లేకుండా చేశారు... ఆదోని మునిసిపల్ చైర్పర్సన్ బోయ శాంత కౌన్సిలర్ల మాటకు విలువ లేకుండా చేయడంతోనే ఆమైపె అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైనట్లు కౌన్సిలర్లు గౌస్, రఘునాథఽరెడ్డి, లక్ష్మీదేవి, లోకేశ్వరి, నరసింహులు, సందీప్రెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ తరపున గెలిచిన ఆమె ఇటీవల బీజేపీలోకి వెళ్లి ఎమ్మెల్యే డాక్టర్ బి.పార్థసారథి మాటలు విని తమ తీర్మానాలను పట్టంచుకోవడంలేదన్నారు. ఇదేసమయంలో ఆదోని ఎమ్మెల్యే అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాకుండా, కౌన్సిలర్లపై పెత్తనం చేస్తున్నారని, బలవంతంగా పార్టీ మారాలని ఒత్తిళ్లు చేస్తున్నట్లు వాపోయారు. బెదిరించి పార్టీ మార్పిస్తున్నారు అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు వైఎస్ఆర్సీపీ మునిసిపల్ మేయర్లు, చైర్మన్లను దౌర్జన్యంగా బెదిరించి టీడీపీ, బీజేపీ, జనసేనల్లోకి చేర్చుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి, మేయర్ బీవై రామయ్య ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల తిరుపతిలో కనీస బలం లేకుండా డిప్యూటీ మేయర్ పోస్టును టీడీపీ కై వసం చేసుకోవడాన్ని చూశామని, అదే తరహాలో ఆదోనిలో కూడా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను భయపెట్టి పార్టీలో చేర్చుకుంటున్నారన్నారు. చైర్పర్సన్ సహా ఐదుగురు కౌన్సిలర్లను పార్టీలో చేర్చుకున్నారని తెలిపారు. పార్టీ మారిన వారంతా అవిశ్వాసం సందర్భంగా వైఎస్ఆర్సీపీకే ఓటు వేయాలని, లేదంటే విప్ను జారీ చేసి డిస్క్వాలిఫై చేస్తామన్నారు. మొత్తం వార్డులు: 42 వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు: 41 టీడీపీ కౌన్సిలర్లు: 01 కలెక్టర్కు లేఖను అందించిన 35 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఆదోని మున్సిపాలిటీలో పార్టీల బలాబలాలు (కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక చైర్పర్సన్ సహా ఐదుగురిని బెదిరించి బీజేపీలో చేర్చుకున్నారు. ఒకరు చనిపోయారు. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీకి 35 మంది కౌన్సిలర్ల బలం ఉంది.) -
దివ్యాంగులకు యూడీఐడీ
శాశ్వత ఐడీ తప్పనిసరి దివ్యాంగులకు ఇప్పటి వరకు సదరం సర్టిఫికెట్లు జారీ చేసేవారు. అయితే ఇకపై శాశ్వతంగా ఆధార్కార్డు తరహాలో కేంద్ర ప్రభుత్వం యూడీఐడీను ప్రవేశపెట్టింది. దివ్యాంగులకు రానున్న రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అందాలన్నా ఈ కార్డు తప్పనిసరి కానుంది. దివ్యాంగులు ఆన్లైన్లో నమోదు చేసుకొని ఈ కార్డును పొందితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. – రయిస్ ఫాతిమా, ఏడీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ కర్నూలు(అర్బన్): దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, ఇతరత్రా సేవలకు సదరం స్థానంలో యూడీఐడీ (యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డు )ని అందించనుంది. దివ్యాంగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే చేయూత, ఇతర ప్రయోజనాలకు ఇప్పటి వరకు సదరం సర్టిఫికెట్ తప్పనిసరి. దీని కోసం దివ్యాంగులు గ్రామ సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో సదరం శ్లాట్ బుక్ చేసుకుంటే ప్రభుత్వం నిర్దేశించిన వైద్య శిబిరంలో వైద్యులు వైకల్య నిర్ధారణ అనంతరం సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సదరం సర్టిఫికెట్లకు స్వస్తి పలికింది. ఆ స్థానంలో యూడీఐడీని పొందేందుకు స్వాలంబన్కార్డు.జీఓవీ.ఇన్ (https://swavlambancard. gov.in) అనే వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో దివ్యాంగులు నేరుగా ఇంటి వద్ద నుంచే ఫోన్, ఇంటర్నెట్ సెంటర్, మీ సేవా కేంద్రాల నుంచి కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సులభతరంగా సేవలు ... కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన యూడీఐడీ పోర్టల్ వల్ల సేవలు చాలా సులభతరం కానున్నాయి. ఇకపై సదరం శిబిరాల కోసం మీ సేవతో పాటు యూడీఐడీ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి సదరం శిబిరాలకు సంబంధించి ఎప్పుడు హాజరు కావాలనే సమాచారం దివ్యాంగుల ఫోన్ నెంబర్కు సంక్షిప్త సందేశం రూపంలో వస్తుంది. దివ్యాంగులు ఆన్లైన్లో దరఖాస్తు చేసే సమయంలో ఎలాంటి తప్పులు, అక్షరదోషాలు లేకుండా చూసుకోవాలి. ఇప్పటి వరకు ఐదు రకాల వైకల్యం ఉన్న వారికే మీ సేవ ద్వారా సదరం శిబిరాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. ఇక యూడీఐడీ పోర్టల్లో 21 రకాల వైకల్యాలను చేర్చారు. తలసేమి యా, ఆటిజం, యాసిడ్ బాధితులు, న్యూరో సంబంధిత బాధితులు కూడా సదరం శిబిరాల కోసం యూడీ ఐడీ పోర్టల్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. సదరం శిబిరంలో వైకల్య నిర్ధారణ పూర్తయిన అనంతరం సర్టిఫికెట్లను స్మార్ట్ కార్డు రూపంలో పోస్టల్శాఖ ద్వారా ఇంటికే పంపించనున్నారు. ఈ కార్డు ద్వారా చేయూత పింఛన్లతో పాటు ఇతర పలు సంక్షేమ ప్రయోజనాలకు దేశ వ్యాప్తంగా చెల్లుబాటు కానుంది. యూనిక్ డిజేబులిటీ ఐడీ కార్డులను ఆన్లైన్ నుంచే డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ఇప్పటి వరకు ఉన్న సదరం సర్టిఫికెట్లు మన రాష్ట్రంలో మాత్రమే చెల్లుబాటు అయ్యేవి. ఇలా దరఖాస్తు చేసుకోండి ... ఆన్లైన్లో స్వాలంబన్కార్డు.జీఓవీ.ఇన్ వెబ్సైట్ను సందర్శించాలి. అప్లయ్ బటన్పై క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి కొన్ని సూచనలు ఉంటాయి. వాటిని పూర్తిగా చదివి అర్థం చేసుకొని తరువాత అంగీకరిస్తు సబ్మిట్ క్లిక్ చేస్తే దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది. దివ్యాంగులు వారికి చెందిన పూర్తి సమాచారాన్ని అక్కడ అడిగిన విధంగా నమోదు చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది. వైద్య పరీక్షల అనంతరం వెబ్సైట్లో అర్జీల స్టేటస్ను నిత్యం పరిశీలించుకోవచ్చు. కొత్త పోర్టల్ను అందుబాటులోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం 21 రకాల సేవలు సులువుగా పొందే అవకాశం -
ప్రశాంతంగా ఏఎన్ఎంల పదోన్నతి కౌన్సెలింగ్
కర్నూలు(హాస్పిటల్): సచివాలయాల్లో పనిచేసే ఏఎన్ఎం–3లకు ఎంపీహెచ్ఏ–ఎఫ్గా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు వీరికి కర్నూలు మెడికల్ కాలేజీలోని నూతన ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కౌన్సెలింగ్ నిర్వహించి స్థానాలు కేటాయించారు. కౌన్సెలింగ్లో స్థానం పొందిన వారికి డీఎంహెచ్వో డాక్టర్ పి. శాంతికళ, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు ఆర్డర్ కాపీలు అందజేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో 172 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ పి. శాంతికళతో పాటు ఏవో అరుణ, సూపరింటెండెంట్ పి. శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్ మధుసూదన్లు కౌన్సెలింగ్ నిర్వహించి స్థానాలు కేటాయించారు. -
అన్నదానం పేరుతో అక్రమ వసూళ్లు
● కాశినాయన ఆశ్రమమంటూ విరాళాల సేకరణ ● రాజమండ్రి పోలీసులకు చిక్కిన వెలుగోడు ముఠా ఆత్మకూరురూరల్: అన్నదానం పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠా పోలీసులకు పట్టుబడింది. వెలుగోడు మండలానికి చెందిన నిందితులు కర్ణాటక, తమిళనాడుతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రా ల్లో కాశిరెడ్డి నాయన పేరిట నిత్యాన్నదానం చేస్తున్నామని, శ్రీశైలంలో ఒక వసతి గృహం నిర్మిస్తున్నామని నమ్మబలుకుతూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న విషయాన్ని రాజమండ్రి పోలీసులు బట్టబయలు చేశారు. వెలుగోడు మండల కేంద్రంలో నివసించే శంకర్ అనే వ్యక్తి శంకర్ రెడ్డి, భవనం రమణారెడ్డి అనే పేర్లతో చెలామణి అవుతూ దాదాపు లక్షలాది రూపాయలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇతను అతని కులస్తులను కొందరిని తన ముఠాలో చేర్పించుకుని ఖరీదైన దుస్తులు, వేషధారణతో వాహనాల్లో తిరుగుతూ పలు ప్రాంతాల్లో విరాళాలు సేకరించారు. వీరు రెండు రోజుల క్రితం రాజమండ్రిలో తాము ఆత్మకూరు మండలం నల్లకాల్వ గ్రామంలో వైఎస్సార్ స్మృతివనం సమీపంలో కాశిరెడ్డి నాయనం ఆశ్రమం ఏర్పాటు చేశామని, అక్కడ నిత్యాన్నదానం జరుగుతుందని చెబుతూ.. చందాలు వసూలు చేసే యత్నం చేశారు. వీరి పోకడ గమనించిన రాజమండ్రికి చెందిన త్రినాథరెడ్డి అనే వ్యక్తి ఈ ముఠాను పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. ఇంతకు ముందు నంద్యాల ఎస్పీగా పని చేసిన రఘువీరారెడ్డి అక్కడ ఉండడంతో ఆయన ఈ విషయంపై విచారణ జరిపించారు. దీంతో శంకర్ ముఠా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తేలడంతో వారిపై కేసు నమోదు చేశారు. వారి వద్ద ఉన్న రసీదు పుస్తకాలు, డిజిటల్ లావాదేవీలను పరిశీలిస్తే ఈ మధ్య కాలంలోనే రూ. 20 లక్షలకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. శంకర్ ముఠాలో వెలుగోడు మండలం రేగడగూడూరు గ్రామానికి చెందిన వారు కూడా ఇద్దరు ఉన్నట్లు తెలిసింది. నల్లకాల్వలో కాశిరెడ్డి నాయన ఆశ్రమం ఉన్న విషయం నిజమే అయినప్పటికీ ఈ ఆశ్రమ నిర్వాహకులు వేరే వారు కావడం గమనార్హం. ఇందులో వారు ప్రచారం చేసుకుంటున్నంత స్థాయిలో అన్నదాన కార్యక్రమాలు జరగడం లేదు. -
సూర్య @ 42.7 డిగ్రీలు
కర్నూలు(అగ్రికల్చర్): మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో రాష్ట్రంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒకవైపు సుర్రుమంటున్న ఎండలు, మరోవైపు వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే ఎండల నుంచి ప్రజలకు కొంతైనా ఉపశమనం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ఏ మాత్రం చొరవ తీసుకోవడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్న ఐదేళ్లు కర్నూలు నగరంలోని ప్రధాన కూడళ్లలో చలువ పందిళ్లు ఏర్పాటు చేసింది. 2024లో ఫిబ్రవరి నెల చివరి నాటికే చలువ పందిళ్లు ఏర్పాటు అయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చలువ పందిళ్లు, చలి వేంద్రాల జాడ కనిపించడం లేదు. బండిఆత్మకూరు మండలంలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత... రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే నమోదు అవుతున్నాయి. బండి ఆత్మకూరు మండలం పెద్ద దేవళాపురం గ్రామంలో 42.7 డిగ్రీలు, కల్లూరులో 42.6, చాగలమర్రిలో 42.4 డిగ్రీలు, గోస్పాడులో 41.9, దొర్నిపాడులో 41.7, ఆత్మకూరులో 41.5, కొత్తపల్లిలో 41.4, కోడుమూరులో41.2, కోసిగిలో 41.2, పెద్దకడు బూరులో 41.1 కర్నూలులో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత లు నమోదైంది. సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీల అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా యి. రానున్న రోజుల్లో వడగాల్పులు, ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. మార్చి నెలలో నే ఉష్ణోగ్రతలు గతంలో ఎపుడూ లేని విధంగా 44 డిగ్రీలను అధిగమించే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచిస్తున్నారు. పెద్ద దేవళాపురంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కల్లూరులో 42.6 డిగ్రీలు నమోదు వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి -
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
కర్నూలు: ఖైదీలు సత్ప్రవర్తనతో శిక్షను పూర్తి చేసి గౌరవప్రదమైన జీవితం గడపాలని న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి, కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సూచించారు. మంగళవారం కర్నూలు శివారులోని పురుషుల కేంద్ర కారాగారం, మహిళా కారాగారాలను వారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖైదీలకు న్యాయవాదులు లేకుంటే ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామన్నారు. ఖైదీలకు అందించే ఆహారం, రేషన్తో పాటు ఆరోగ్యం గురించి తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. ఖైదీలను కోర్టు వాయిదాలకు కచ్చితంగా హాజరుపరచాలని జైలు అధికారులను ఆదేశించారు. ఏవైనా సమస్యలుంటే కర్నూలు న్యాయ సేవాధికార సంస్థను, లేదంటే లీగల్ సర్వీసెస్ హెల్ప్లైన్ నెంబర్ 15100ను సంప్రదించాలని సూచించారు. కొందరు ఖైదీలు బెయిల్ మంజూరైనప్పటికీ జామీనుదారులు లేక జైలులోనే ఉంటున్నామని జిల్లా జడ్జి దృష్టికి తీసుకురాగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైభవంగా సుయతీంద్రతీర్థుల పూర్వారాధన మంత్రాలయం: నవ మంత్రాలయ శిల్పి, రాఘవేంద్రస్వామి మఠం పూర్వపు పీఠాధిపతి సుయతీంద్రతీర్థులు పూర్వారాధన వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో మంగళవారం వేకువ జామున సుప్రభాత సేవతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత పీఠాధిపతి గురువులైన సుయతీంద్రతీర్థుల వేడుకలు శాస్త్రోక్తంగా చేపట్టారు. ముందుగా స్వామిజీ మూల బృందావనానికి నిర్మల్య విసర్జన గావించి పుష్ప, పంచామృతాభిషేకం చేపట్టి ప్రత్యేక పూలతో విశేష అలంకరణ గావించారు. వేడుకల్లో భాగంగా యాగ మంటపంలో సుయతీంద్రతీర్థుల ప్రశస్థితి భక్తులకు ప్రవచించారు. పత్తికొండ కళాశాలకు ఏ గ్రేడు పత్తికొండ రూరల్: పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఏ గ్రేడు వచ్చినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ మాధురి తెలిపారు. పాణ్యం డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ ఎం.ఫరీదా బేగం, డోన్ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ జి.చంద్రశేఖర్ అకడమిక్ ఆడిట్లో భాగంగా మంగళవారం కళాశాలను పరిశీలించారన్నారు. అకడమిక్ రిజిస్టర్లు, తరగతి గదులు, ప్రయోగశాలలు, కళాశాల మైదానంలో స్పోర్ట్స్, విద్యార్థులకు తాగునీటి సదుపాయం వంటి వాటిని పరిశీలించి సంతృప్తి చెందినట్లు తెలిపారు. -
మత్తు పదార్థాలను సమష్టిగా నిర్మూలిద్దాం
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో గంజాయి సాగు, మత్తు పదార్థాల రవాణా, వినియోగాన్ని సమష్టి కృషితో నిర్మూలిద్దామని జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా అధికారులకు పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నార్కోటిక్స్ కోఆర్డినేషన్(ఎన్సీఓఆర్డీ) సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలతో కలిగే అనార్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మత్తు పదార్థాల వినియోగం, రవాణాపై ప్రజలు కూడా సమాచారం అందించాలని కోరారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనార్థాలపై పాఠశాలల్లో వ్యాసరచన, వక్తృత్వ పోఈలను నిర్వహించాలన్నారు. ప్రజలకు అవగాహన కోసం ర్యాలీలు నిర్వహించాలని, ప్రతిజ్ఞలు చేయించాలని డీఈఓను కోరారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లాకల్యాణి, జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మీ, డీఈఓ శామ్యూల్పాల్, ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు, అదనపు మునిసిపల్ కమిషనర్ ఆర్ర్జీవీ కృష్ణ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్కుమార్ పాల్గొన్నారు. -
దాహం తీర్చుకునేందుకు వెళ్లి..
● ఎల్లెల్సీలో పడి మహిళా కూలీ మృత్యువాత హాలహర్వి: వ్యవసాయ పనులకు వెళ్లిన ఓ మహిళా కూలీ ప్రమాదవశాత్తూ ఎల్లెల్సీ కాల్వలో పడి మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆలూరు మండల మొలగవల్లి గ్రామానికి చెందిన శ్రీదేవి(40) మంగళవారం గూళ్యం గ్రామానికి చెందిన ఓ రైతు మిరప పంట కోసేందుకు తోటి కూలీలతో కలసి వెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వస్తూ పచ్చారపల్లి వద్ద నీళ్లు తాగేందుకు ఎల్లెల్సీ కాలువలోకి దిగింది. ప్రమాదవశాత్తూ కాలు జారి శ్రీదేవి కాలువలో పడిపోయింది. పక్కనే ఉన్న ఆటో డ్రైవర్ మునిస్వామి రక్షించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. సమాచారం అందుకున్న హాలహర్వి ఎస్ఐ చంద్ర వెంటనే ఫైర్ స్టేషన్ సిబ్బంది, గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టారు. గూళ్యం 48వ డీప్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మృతురాలికి భర్త భగీరథ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్ర తెలిపారు. రెండు బైక్లు ఢీకొని.. ● వృద్ధుడి మృతి ● యువకుడికి తీవ్ర గాయాలు పత్తికొండ రూరల్: అతి వేగం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. టిఫిన్ చేసేందుకు హోటల్ వెళ్లిన వృద్ధుడు తిరిగిరాని లోకాలకు చేరాడు. పత్తికొండ పట్టణంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందగా, మరో యువకు డు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక దాసరి వీధిలో బోయ హనుమన్న, తిమ్మక్కలు నివాసముంటున్నారు. వారి కుమారుడు భార్యా పిల్లలతో బతుకుదెరువుకు గుంటూరు వలస వెళ్లారు. ఇంటి వద్ద వున్న తిమ్మక్క మంగళవారం మిరపకాయలు తెంపేందుకు కూలికి వెళ్లగా.. హనుమన్న టిఫిన్ చేసేందుకు టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనంపై ప్రభుత్వ బీసీ హాస్టల్ సమీపంలోని ప్రధాన రోడ్డు పక్కనే ఉన్న హోటల్కు వెళ్లాడు. టిఫిన్ చేసిన తర్వాత ఇంటికి వచ్చేందుకు వాహనాన్ని తీస్తుండగా పత్తికొండకు చెందిన కూరగాయల వ్యాపారి అభిరాం పల్సర్ బైక్తో వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా కోలు కోలేక వృద్ధుడు మృతి చెందాడు. యువకుడు అభి రాం చికిత్స పొందుతున్నాడు. భర్త మృతితో భార్య తిమ్మక్క రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
దివ్యాంగులకు యూడీఐడీ
శాశ్వత ఐడీ తప్పనిసరి దివ్యాంగులకు ఇప్పటి వరకు సదరం సర్టిఫికెట్లు జారీ చేసేవారు. అయితే ఇకపై శాశ్వతంగా ఆధార్కార్డు తరహాలో కేంద్ర ప్రభుత్వం యూడీఐడీను ప్రవేశపెట్టింది. దివ్యాంగులకు రానున్న రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అందాలన్నా ఈ కార్డు తప్పనిసరి కానుంది. దివ్యాంగులు ఆన్లైన్లో నమోదు చేసుకొని ఈ కార్డును పొందితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. – రయిస్ ఫాతిమా, ఏడీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ కర్నూలు(అర్బన్): దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, ఇతరత్రా సేవలకు సదరం స్థానంలో యూడీఐడీ (యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డు )ని అందించనుంది. దివ్యాంగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే చేయూత, ఇతర ప్రయోజనాలకు ఇప్పటి వరకు సదరం సర్టిఫికెట్ తప్పనిసరి. దీని కోసం దివ్యాంగులు గ్రామ సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో సదరం శ్లాట్ బుక్ చేసుకుంటే ప్రభుత్వం నిర్దేశించిన వైద్య శిబిరంలో వైద్యులు వైకల్య నిర్ధారణ అనంతరం సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సదరం సర్టిఫికెట్లకు స్వస్తి పలికింది. ఆ స్థానంలో యూడీఐడీని పొందేందుకు స్వాలంబన్కార్డు.జీఓవీ.ఇన్ (https://swavlambancard. gov.in) అనే వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో దివ్యాంగులు నేరుగా ఇంటి వద్ద నుంచే ఫోన్, ఇంటర్నెట్ సెంటర్, మీ సేవా కేంద్రాల నుంచి కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సులభతరంగా సేవలు ... కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన యూడీఐడీ పోర్టల్ వల్ల సేవలు చాలా సులభతరం కానున్నాయి. ఇకపై సదరం శిబిరాల కోసం మీ సేవతో పాటు యూడీఐడీ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి సదరం శిబిరాలకు సంబంధించి ఎప్పుడు హాజరు కావాలనే సమాచారం దివ్యాంగుల ఫోన్ నెంబర్కు సంక్షిప్త సందేశం రూపంలో వస్తుంది. దివ్యాంగులు ఆన్లైన్లో దరఖాస్తు చేసే సమయంలో ఎలాంటి తప్పులు, అక్షరదోషాలు లేకుండా చూసుకోవాలి. ఇప్పటి వరకు ఐదు రకాల వైకల్యం ఉన్న వారికే మీ సేవ ద్వారా సదరం శిబిరాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. ఇక యూడీఐడీ పోర్టల్లో 21 రకాల వైకల్యాలను చేర్చారు. తలసేమి యా, ఆటిజం, యాసిడ్ బాధితులు, న్యూరో సంబంధిత బాధితులు కూడా సదరం శిబిరాల కోసం యూడీ ఐడీ పోర్టల్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. సదరం శిబిరంలో వైకల్య నిర్ధారణ పూర్తయిన అనంతరం సర్టిఫికెట్లను స్మార్ట్ కార్డు రూపంలో పోస్టల్శాఖ ద్వారా ఇంటికే పంపించనున్నారు. ఈ కార్డు ద్వారా చేయూత పింఛన్లతో పాటు ఇతర పలు సంక్షేమ ప్రయోజనాలకు దేశ వ్యాప్తంగా చెల్లుబాటు కానుంది. యూనిక్ డిజేబులిటీ ఐడీ కార్డులను ఆన్లైన్ నుంచే డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ఇప్పటి వరకు ఉన్న సదరం సర్టిఫికెట్లు మన రాష్ట్రంలో మాత్రమే చెల్లుబాటు అయ్యేవి. ఇలా దరఖాస్తు చేసుకోండి ... ఆన్లైన్లో స్వాలంబన్కార్డు.జీఓవీ.ఇన్ వెబ్సైట్ను సందర్శించాలి. అప్లయ్ బటన్పై క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి కొన్ని సూచనలు ఉంటాయి. వాటిని పూర్తిగా చదివి అర్థం చేసుకొని తరువాత అంగీకరిస్తు సబ్మిట్ క్లిక్ చేస్తే దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది. దివ్యాంగులు వారికి చెందిన పూర్తి సమాచారాన్ని అక్కడ అడిగిన విధంగా నమోదు చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది. వైద్య పరీక్షల అనంతరం వెబ్సైట్లో అర్జీల స్టేటస్ను నిత్యం పరిశీలించుకోవచ్చు. కొత్త పోర్టల్ను అందుబాటులోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం 21 రకాల సేవలు సులువుగా పొందే అవకాశం -
ప్రశాంతంగా ఏఎన్ఎంల పదోన్నతి కౌన్సెలింగ్
కర్నూలు(హాస్పిటల్): సచివాలయాల్లో పనిచేసే ఏఎన్ఎం–3లకు ఎంపీహెచ్ఏ–ఎఫ్గా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు వీరికి కర్నూలు మెడికల్ కాలేజీలోని నూతన ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కౌన్సెలింగ్ నిర్వహించి స్థానాలు కేటాయించారు. కౌన్సెలింగ్లో స్థానం పొందిన వారికి డీఎంహెచ్వో డాక్టర్ పి. శాంతికళ, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు ఆర్డర్ కాపీలు అందజేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో 172 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ పి. శాంతికళతో పాటు ఏవో అరుణ, సూపరింటెండెంట్ పి. శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్ మధుసూదన్లు కౌన్సెలింగ్ నిర్వహించి స్థానాలు కేటాయించారు. -
సూర్య @ 42.7 డిగ్రీలు
కర్నూలు(అగ్రికల్చర్): మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో రాష్ట్రంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒకవైపు సుర్రుమంటున్న ఎండలు, మరోవైపు వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే ఎండల నుంచి ప్రజలకు కొంతైనా ఉపశమనం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ఏ మాత్రం చొరవ తీసుకోవడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్న ఐదేళ్లు కర్నూలు నగరంలోని ప్రధాన కూడళ్లలో చలువ పందిళ్లు ఏర్పాటు చేసింది. 2024లో ఫిబ్రవరి నెల చివరి నాటికే చలువ పందిళ్లు ఏర్పాటు అయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చలువ పందిళ్లు, చలి వేంద్రాల జాడ కనిపించడం లేదు. బండిఆత్మకూరు మండలంలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత... రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే నమోదు అవుతున్నాయి. బండి ఆత్మకూరు మండలం పెద్ద దేవళాపురం గ్రామంలో 42.7 డిగ్రీలు, కల్లూరులో 42.6, చాగలమర్రిలో 42.4 డిగ్రీలు, గోస్పాడులో 41.9, దొర్నిపాడులో 41.7, ఆత్మకూరులో 41.5, కొత్తపల్లిలో 41.4, కోడుమూరులో41.2, కోసిగిలో 41.2, పెద్దకడు బూరులో 41.1 కర్నూలులో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత లు నమోదైంది. సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీల అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా యి. రానున్న రోజుల్లో వడగాల్పులు, ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. మార్చి నెలలో నే ఉష్ణోగ్రతలు గతంలో ఎపుడూ లేని విధంగా 44 డిగ్రీలను అధిగమించే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచిస్తున్నారు. పెద్ద దేవళాపురంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కల్లూరులో 42.6 డిగ్రీలు నమోదు వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి -
లాభాల బాట పట్టించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం
నష్టాల ఊబిలో చిక్కుకున్న డీసీసీబీకి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఊపిరిపోసింది. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు కేడీసీసీబీ రుణాలు పంపిణీ చేసే ఏర్పాటు చేసింది. కస్టమ్స్ హయరింగ్ సెంటర్లు, మల్టీపర్పస్ గోదాముల నిర్మాణాలకు డీసీసీబీ రుణాలు అందచేసింది. గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా బ్యాంకు లోనింగ్ భారీగా పెరిగింది. వైఎస్ఆర్సీపీ హయాంలో దశాబ్దాల నాటి నష్టాలను అధిగమించి నికర లాభాల్లోకి వచ్చింది. 2022–23, 2023–24 సంవత్సరాల్లో రికార్డు స్థాయిలో ఏకంగా రూ.10కోట్ల లాభం ఆర్జించగా.. సభ్యులైన పీఏసీఎస్లకు రూ.4 కోట్లు డివిడెండ్ ఇచ్చింది. రాయలసీమ జిల్లాల్లోనే అత్యధిక టర్నోవర్ కలిగిన బ్యాంకుగా రెండేళ్లు వరుస అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం. ● నికర లాభాల్లోకి వచ్చిన కేడీసీసీబీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన మొదటి ఏడాదిలోపే మళ్లీ నష్టాల్లోకి వచ్చి బలహీనమైన బ్యాంకుగా రికార్డు నమోదు చేసుకోవడం ఆందోళన కలిగించే విషయం. గతంలో ఎప్పుడూ లేని విధంగా 2024–25లో రుణాల పంపిణీ నామమాత్రంగా చేపట్టారు. పీఏసీఎస్ల కంప్యూటరీకరణ పేరుతో రైతులకు అవసరమైన రుణాల పంపిణీ విషయంలో కనీస చొరవ కరువైంది. ఇదే సమయంలో బకాయిలు పేరుకుపోవడంతో బ్యాంకు మళ్లీ నష్టాల బాట పట్టింది. -
రూ.330 కోట్లకు చేరుతున్న నిరర్ధక ఆస్తులు
రైతుల మెడపై జప్తుల కత్తి ● నష్టాల బాటన కేడీసీసీ బ్యాంకు ● కూటమి ప్రభుత్వ పాలనలో మళ్లీ చీకటి రోజులు ● ఇప్పటికే 90 మంది రైతుల ఆస్తులు స్వాధీనం ● 800 మంది ఆస్తుల వేలానికి రంగం సిద్ధం ● రికవరీ పేరిట రైతుల ఆత్మాభిమానంతో ఆటలు ● వైఎస్సార్సీపీ పాలనలో కేడీసీసీబీ లాభాల బాట ● నేడు నిరర్థక ఆస్తులే రూ.330 కోట్లు వడ్డీ రూ.20 లక్షలు చిప్పగిరి మండలం ఏరూరు గ్రామానికి చెందిన ఒక రైతు 2021లో కర్షక జ్యోతి కింద రూ.25 లక్షలు, దీర్ఘకాలిక రుణం కింద గొర్రెల పెంపకానికి రూ.15 లక్షల ప్రకారం మొత్తం రూ.40 లక్షల రుణం తీసుకున్నారు. వివిధ కారణాల వల్ల రుణాలను చెల్లించలేదు. నాలుగేళ్లలో వడ్డీ రూ.20 లక్షలు అయింది. మొత్తం రూ.60 లక్షలు చెల్లించాలని, లేకపోతే ఆస్తులు వేలం వేస్తామని నోటీసు జారీ చేశారు. ఇటీవల గ్రామానికి వెళ్లిన ప్రత్యేక టీమ్ రైతుకు చెందిన ట్రాక్టరును జప్తు చేసి బెల్డోణలోని పీఏసీఎస్కు స్వాధీనం చేశారు. బైక్ను జప్తు చేశారు చిప్పగిరి మండలం రామదుర్గం గ్రామానికి చెందిన ఒక మహిళ 2014లో దీర్ఘకాలిక రుణం కింద డెయిరీ లోన్ తీసుకున్నారు. కంతుల ప్రకారం కొంత మొత్తం కూడా చెల్లించారు. అసలు రూ.2.70 లక్షలు, అయితే ఇప్పుడు ఈ మహిళ చెల్లించాల్సిన మొత్తం వడ్డీతో కలిపి రూ.7 లక్షలు దాటింది. ఇటీవల గ్రామానికి వెళ్లిన రికవరీ టీమ్ ఈ మహిళ కుటుంబానికి చెందిన బైకును జప్తు చేసి సొసైటీకి తరలించింది. మహిళ తాకట్టు పెట్టిన స్థిరాస్తులను వేలంలో విక్రయించేందుకు రంగం సిద్ధం చేసింది.కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(కేడీసీసీబీ) బకాయిలను రాబట్టుకునేందుకు రైతుల మెడపై జప్తుల కత్తి పెట్టింది. కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు డీసీసీబీ రైతుల జీవితాలతో చెలగాటమాడుతోంది. రైతాంగాన్ని 2024–25లో అధిక వర్షాలు, అనావృష్టి పరిస్థితులు కోలుకోలేని దెబ్బతీశాయి. అంతంతమాత్రం పండిన పంటలకు కూడా గిట్టుబాటు ధరలు లేక నష్టాలను మూటకట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లా సహకార కేంద్రబ్యాంకు రైతుల ఆస్తులు స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచే రైతుల ఆస్తుల వేలానికి చర్యలను వేగవంతం చే యడం గమనార్హం. రుణాల రికవరీకి వెళ్లిన అధికారులు ఏది కనిపిస్తే దానిని స్వాధీనం చేసుకుంటుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 90 మంది రైతుల ఆస్తుల స్వాధీనం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వత డీసీసీబీ జప్తుల తీవ్రత మొదలైంది. 2014–15 నుంచి 2018–19 వరకున్న టీడీపీ ప్రభుత్వంలో వరుస కరువు రైతులను నిలువునా ముంచింది. పంటలు పండక రైతులు అల్లాడుతుంటే అప్పట్లో కూడా జప్తుల పర్వం కొనసాగింది. నాడు ఆస్తులను వేలం వేయడంతో పాటు రైతుల ఇళ్లలోని చరాస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మళ్లీ నాటి పరిస్థితులే పునరావృతం అవుతున్నాయి. 2024 జూన్ 12న కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. నాటి నుంచి నేటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో 90 మంది రైతుల ఆస్తులను డీసీసీబీతో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు స్వాధీనం చేసుకున్నాయి. 2024–25లో మొత్తం 800 మంది రైతుల ఆస్తులు వేలం వేయడం, స్వాధీనం చేసుకోవాలనేది లక్ష్యంగా తెలుస్తోంది. ఈ నెల చివరిలోపు రైతుల ఆస్తుల వేలానికి ముమ్మర కసరత్తు జరుగుతోంది. డీసీసీబీలో ప్రధానంగా ఆలూరు బ్రాంచీలో బకాయిలు అత్యధికంగా ఉన్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో ఆలూరు ప్రాంతంలోని 18 మంది రైతుల ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి రంగం సిద్ధమైంది. ముమ్మరంగా చరాస్తుల జప్తు బకాయిలను రాబట్టుకునేందుకు ముందుగా రైతులకు సంబంధించిన చరాస్తులను జప్తు చేయాలని జాయింట్ కలెక్టర్, డీసీసీబీ పర్సన్ ఇన్చార్జి చైర్మన్ నవ్య స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. చరాస్తుల జప్తు తర్వాత స్థిరాస్తుల వేలానికి శ్రీకారం చుట్టాలని ఆదేశించారు. జప్తులు, వేలంపాట, రికవరీలపై జేసీ ప్రతి రోజు డీసీసీబీ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నారు. దీంతో అధికారులు జప్తుల పర్వాన్ని వేగవంతం చేయడం గమనార్హం. ఇప్పటికే ఆలూరు బ్రాంచి పరిధిలోని చిప్పగిరి మండలం ఏరూరు గ్రామంలో ట్రాక్టరు, బైకు.. కుందనగుర్తి గ్రామంలో ఒక బైకు, రామదుర్గం గ్రామంలో రెండు బైకులను జప్తు చేసినట్లు స్పష్టమవుతోంది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నిరర్థక ఆస్తులు కొండలా పెరిగిపోతున్నాయి. 2024 ఏప్రిల్ నెలలో రూ.193 కోట్ల నిరర్ధక ఆస్తులు ఉన్నాయి. ఈ నెల 15 నాటికి నిరర్థక ఆస్తులు రూ.267 కోట్లకు చేరుకోగా.. మార్చి చివరి నాటికి రూ.330 కోట్లకు చేరనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆలూరు, డోన్, ఆదోని, పత్తికొండ, కృష్ణానగర్, కోడుమూరు, కోవెలకుంట్ల, నందికొట్కూరు, వెలుగోడు, ఆత్మకూరు బ్రాంచీల్లో నిరర్థక ఆస్తులు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
ఎస్సీ వర్గీకరణతో మాల, మాదిగలకు నష్టమే
కర్నూలు(అర్బన్): రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ నివేదికల ఆధారంగా ఎస్సీ వర్గీకరణను జిల్లా యూనిట్, రాష్ట్ర యూనిట్గా చేసినా.. రాష్ట్రంలోని మాల మాదిగలకు నష్టం జరుగుతుందని ఏపీ ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోన నాగరాజు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం స్థానిక కార్యాలయంలో సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు ఎన్సీహెచ్ బజారన్నతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణను జిల్లా యూనిట్గా విద్యా, ఉద్యోగాల్లో మూడు కేటగిరీలుగా వాటాలు చేస్తామని ప్రకటించిందన్నారు. అయితే ఏకసభ్య కమిషన్ వర్గీకరణను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి అమలు చేసేందుకు రాష్ట్రం యూనిట్గా చేయనున్నట్లు ప్రకటించారన్నారు. ఈ నేపథ్యంలోనే ఏ కేటగిరీలోని రెల్లి, ఉపకులాలకు 1 శాతం, బీ కేటగిరీలోని మాదిగ, ఉపకులాలకు 6.50 శాతం, సీ కేటగిరిలోని మాల, ఉపకులాలకు 7.50 శాతం రిజర్వేషన్ ప్రతిపాదిస్తు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందించిందన్నారు. ఏ విధంగా వర్గీకరణ చేపట్టినా రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి అనంతపురం, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మాలలకు, వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాదిగలకు నష్టం జరుగుతుందన్నారు. జిల్లా యూనిట్గా అమలు చేసినా ఎస్సీ జాబితాలోని 59 ఉప కులాలు భారీగా విద్య, ఉద్యోగాలను కోల్పోతారన్నారు. ఈ అంశంపై ఈ నెల 20న అసెంబ్లీలో చర్చ జరిగిన అనంతరం రాయలసీమలోని మేధావులను కలిసి ఎస్సీలకు ఎలాంటి నష్టం జరగకుండా నేషనల్ ఎస్సీ కమిషన్ను కలిసి వివరించనున్నట్లు తెలిపారు. ఏపీ ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోన నాగరాజు -
క్లస్టర్ యూనివర్సిటీ ఇన్చార్జి వీసీగా వి.వెంకట బసవరావు
కర్నూలు సిటీ: క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్గా సోమవారం రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య వి. వెంకట బసవరావు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు క్లస్టర్ వర్సిటీ వీసీగా పని చేస్తున్న ఆచార్య డీవీఆర్ సాయిగోపాల్ పదవీ కాలం ఇటీవలే ముగిసింది. అయితే రెండు వారాలకుపైగా ఖాళీగా ఉన్న వీసీ పోస్టును ఆర్యూ వీసీకి ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆయనకు క్లస్టర్ వర్సిటీ రిజిస్ట్రార్ డా.కె వెంకటేశ్వర్లు స్వాగతం పలికారు. వర్సిటీ అనుబంధ కాలేజీల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది అభినందనలు తెలిపారు. -
మధ్యవర్తిత్వంతో త్వరితగతిన కేసుల పరిష్కారం
కర్నూలు(సెంట్రల్): మధ్యవర్తిత్వంతో కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు/జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.కబర్ధ్థి అన్నారు. సోమవారం జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై కర్నూలు, నంద్యాల జిల్లాల న్యాయవాదులు, ఎన్జీఓలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రితో కలసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం హైకోర్టు అన్ని కోర్టుల్లో మధ్యవర్తిత్వాన్ని ప్రవేశపెట్టాలని తీర్మానించినట్లు చెప్పారు. అందులో భాగంగా ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు న్యాయవాదులకు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరరం కేరళ నుంచి వచ్చిన జ్యోతిగోపీనాథన్ మధ్యవర్తిత్వంపై శిక్షణనిచ్చారు. -
అంతర్గత బదిలీలకు తిలోదకాలు
శ్రీశైల దేవస్థానంలో అంతర్గత బదిలీలకు అధికారులు తిలోదకాలిచ్చారు. మూడు నెలలకోసారి అంతర్గత బదిలీలు చేయాలనే దేవదాయశాఖ కమిషనర్ ఆదేశాలను గాలికొదిలేశారు. ఫలితంగా కొందరు ఫెవికాల్ వీరులు దాదాపు తొమ్మిది నెలలుగా కొన్ని విభాగాల్లో తిష్టవేశారు. శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో వెలసిన భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి తరలివచ్చే భక్తులకు సేవలందించేందుకు రాష్ట్ర దేవదాయశాఖ సుమారు 300 మంది రెగ్యులర్ సిబ్బందిని, 1000 మందికి పైగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఇతర ఉద్యోగులను నియమించింది. దేవస్థానంలో విధులు నిర్వహించే రెగ్యులర్ ఉద్యోగులకు ప్రతి ఐదేళ్లకోసారి ఇతర దేవస్థానాలకు బదిలీ చేస్తారు. ఇక పరిపాలన సౌలభ్యం కోసం, ప్రతి అధికారికి, సిబ్బందికి పాలనలో అనుభవం కోసం ప్రతి మూడు నెలలకోసారి రొటేషన్ పద్ధతిన అంతర్గత బదిలీలు చేయాలని రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను పాటించకుండా అధికారులు తమకు నచ్చిన సమయంలో ఇష్టానుసారంగా అంతర్గత బదిలీలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈఓల మాట వినని అధికారులు, సిబ్బందిపై కక్ష తీర్చుకునేందుకు మాత్రమే కమిషనర్ ఆదేశాలు ఉపయోగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం రాగానే.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జూలై 8న పర్యవేక్షకులు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, పలువురు అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులతో పాటు పరిచారకులను ఒకేసారి 52 మందిని బదిలీ చేశారు. మరికొన్ని రోజులకు ఏఈఓ, పర్యవేక్షకులను సైతం అంతర్గత బదిలీలు చేస్తూ ఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత సుమారు తొమ్మిది నెలలవుతున్నా అంతర్గత బదిలీల ఊసే లేదు. దీంతో వసతి విభాగంలో కొందరు పాతుకుపోయారనే విమర్శలున్నాయి. ఈ విభాగంలోని వారు ప్రొటోకాల్ వ్యవహారాలు, సిఫార్స్ లేఖలకు వసతి గదులు, దర్శనం టికెట్లు కేటాయించాల్సి ఉంటుంది. ప్రాధాన్యత ఉన్న విభాగం కాబట్టి ఇక్కడి నుంచి కొందరు కదలడం లేదనే ఆరోపణలున్నాయి. మల్లికార్జున సదన్ కౌంటర్లో పనిచేసే ఓ ఉద్యోగి రెండేళ్లకు పైగా అక్కడే విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రమోషన్లు ఇచ్చి..పోస్టింగులు మరిచి! దేవస్థానంలో పర్యవేక్షకులుగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరికి సహాయ కార్యనిర్వహణాధికారులుగా, సీనియర్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురికి పర్యవేక్షకులుగా గత ఏడాది డిసెంబరు 27న ప్రమోషన్లు ఇచ్చారు. కానీ ఇంతవరకు పోస్టింగులు ఇవ్వలేదు. గత మూడు నెలలుగా వారు గతంలో వారికి కేటాయించిన సీటులోనే విధులు నిర్వహిస్తున్నారు. చర్యలు తీసుకుంటాం అంతర్గత బదిలీలు పరిపాలన సౌలభ్యం కోసం చేపట్టే అంశం. ఈ విషయం పరిపాలనకు సంబంధించిన అంశం. నేను ఈఓగా వచ్చి మూడు నెలలు మాత్రమే అవుతుంది. అప్పటి నుంచి సంక్రాంతి, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపైనే ప్రత్యేక దృష్టి సారించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎవరెవరు ఎన్ని నెలలుగా ఒకే సీటులో ఉంటున్నారనే విషయంపై పరిశీలించి, చర్యలు తీసుకుంటాం. – ఎం.శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి మూడు నెలలకోసారి బదిలీలు చేయాలని కమిషనర్ ఆదేశాలు పట్టించుకోని శ్రీశైలం దేవస్థానం అధికారులు -
కమనీయం.. కల్యాణోత్సవం
● వైభవంగా గోరంట్ల మాధవుడి గరుడోత్సవంకోడుమూరు రూరల్: శ్రీలక్ష్మీ మాధవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గోరంట్ల గ్రామంలో సోమవారం వేకువజామున కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాధవస్వామి తరఫున ఎర్రగుడి గ్రామస్తులు, అమ్మవార్ల తరఫున గోరంట్ల వాసులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. ఆలయ పండితులు ఆగమశాస్త్ర ప్రకారం కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఉత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి వందలాదిగా తరలివచ్చారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఈఓ గుర్రెడ్డి, వేద పండితులు వందవాసి రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ, పురుషోత్తం, హరి, శ్రీనివాస ఆచారి, వెంకటరమణ, రమణమూర్తి, వెంకట్రామయ్య, రాజేష్, పద్మానాభ ఆచారి, ఎస్ఐ శ్రీనివాసులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఘనంగా గరుడోత్సవం కల్యాణోత్సవం అనంతరం ఉత్సవమూర్తులైన శ్రీలక్ష్మి, భూదేవి, మాధవస్వామిని గరుడ వాహనంపై అధిష్టింపజేశారు. డప్పువాయిద్యాలు, మేళతాళాల మధ్య గ్రామ వీధుల్లో గరుడోత్సవం నిర్వహించారు. గరుడ వాహనానికి ముందు ఎర్రగుడి వాసులు, వెనుక గోరంట్ల వాసులు నిలబడ్డారు. భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గరుడోత్సవాన్ని నిర్వహిస్తున్న తరుణంలో ఎర్రగుడి గ్రామానికి చెందిన సుధాకర్ అనే భక్తుడి కాలికి గాయమైంది. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
ప్రసవ వేదనతో ఉపాధ్యాయిని మృతి
కోసిగి: మండల కేంద్రంలోని చాకలిగేరి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని కవిత(28) ప్రసవ వేదనతో ఆత్మకూరు ఆస్పత్రిలో ఆదివారం రాత్రి మృతి చెందిందారు. సోమవారం ఉదయం ఎంఈఓ శోభరాణి, హెచ్ఎం సుబ్బలక్ష్మి తెలిపిన వివరాలు.. పాములపాడు మండలం బానుముక్కల గ్రామానికి చెందిన కవిత 2018 డీఎస్సీలో ఉపాధ్యాయురాలిగా ఎంపికై 2020 సెప్టెంబర్ 27న కోసిగి చాకలిగేరి ప్రాథమిక పాఠశాలలో చేరింది. ఏడాది క్రితం సచివాల ఉద్యోగి వినోద్తో వివాహం కాగా మూడు నెలల క్రితం మెటర్నిటీ సెలవుల్లో సొంత గ్రామం బానుముక్కలకు వెళ్లింది. ఆదివారం అర్ధరాత్రి ప్రసవ నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆత్మకూరు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రసవ సమయంలో ఆమె హైబీపీతో ఆస్పత్రిలోనే మృతి చెందారు. విషయం తెలుసుకున్న తోటి ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు. మహిళ ఆత్మహత్యాయత్నం బండి ఆత్మకూరు: మండల పరిధిలోని కడమల కాలువ గ్రామానికి చెందిన మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మహిళపై కొన్నిరోజుల క్రితం ఆర్ఎంపీ సుబ్బరాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇదే విషయమై గతంలో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తనపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ ఆర్ఎంపీతోపాటు అతని తండ్రి సోమవారం తెల్లవారుజామున మహిళ ఇంటి మీదకు వెళ్లి హత్యాయత్నానికి పాల్పడ్డారు. భయాందోళనకు గురైన మహిళ పురుగు మందు తాగింది. కుటుంబ సభ్యులు, స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ విషయంపై ఎస్ఐ జగన్మోహన్ను వివరణ కోరగా జరిగిన ఘటనపై విచారణ జరిపి, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. జలవనరుల శాఖలో పదోన్నతులు కర్నూలు (సిటీ): జలవనరుల శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న వారికి అడ్హక్ విధానంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పదోన్నతులు కల్పించి పోస్టింగులు ఇస్తూ ఆ శాఖ ప్రత్యేక స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన 11 మంది ఇంజినీర్లు పదోన్నతులు పొందారు. ఎస్ఆర్బీసీ సర్కిల్1లోని సబ్ డివిజన్3లో డీఈఈగా పనిచేస్తున్న సీహెచ్ శ్రీనివాసరావు, ఎన్.నాగేంద్రకుమార్ (తెలుగు గంగ), ఎం.రమేష్ బాబు(ఎస్ఆర్బీసీ క్వాలిటీ కంట్రోల్), ఎస్.గుణకర్రెడ్డి (సీఈ ఆఫీస్, కర్నూలు), ఎం.వేణుగోపాల్ రెడ్డి(ఎస్ఆర్బీసీ సర్కిల్1), ఎస్.మురళి (జీఆర్పీ), ఎం.మల్లికార్జున రెడ్డి(ఎస్ఆర్బీసీ సర్కిల్1), పి.శరత్కుమార్ (తెలుగు గంగ), బి.మహేష్ (సీఈ ఆఫీస్, కర్నూలు), ఎస్.శివప్రసాద్ (హెచ్ఎన్ఎస్ఎస్ సర్కిల్1), టి.రాధాకృష్ణ (ఎస్ఆర్బీసీ సర్కిల్1) పదోన్నతి పొందారు. వీరందరికీ పదోన్నతులు కల్పించి పోస్టింగ్ ఇచ్చారు. మృతదేహం లభ్యం పెద్దకడబూరు: మండల పరిధిలోని పులికనుమ ప్రాజెక్టులో గల్లంతైన వ్యక్తి మృతదేహం సోమవారం రాత్రి లభ్యమైంది. మండల పరిధిలోని హులికన్వీ గ్రామానికి చెందిన మస్కి నాగేంద్ర శనివారం రాత్రి చేపలు పట్టడానికి పులికనుమ ప్రాజెక్టులో దిగి గల్లంతైన విషయం విధితమే. ఆదివారం గాలించినా మృతదేహం ఆచూకీ దొరక్క పోవడంతో సోమవారం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి మృతదేహం లభ్యమైంది. మృతుడి కుమారుడు చిన్న లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మంజునాథ్, ఎస్ఐ నిరంజన్రెడ్డి తెలిపారు. -
సమస్య పరిష్కారం అయితే బాధితులు తిరిగి అర్జీ ఇచ్చేందుకు ఎందుకు వస్తారు? అర్జీల పరిష్కారం 93 శాతం ఉంటే.. వ్యయప్రయాసలకోర్చి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చుట్టూ ఎందుకు తిరుగుతారు? బాధితులతో మాట్లాడినంతనే పరిష్కారం అయినట్లు చూపుతుండటమే ఇందుకు ప్రధాన కారణంగా
నామమాత్రంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ● కలెక్టరేట్ చుట్టూ బాధితుల ప్రదక్షిణ ● రాజకీయ జోక్యంతో ఎక్కడి అర్జీలు అక్కడే.. ● కనీసం పింఛన్లు కూడా ఇవ్వలేని దైన్యం ● భూ సమస్యలతో వృద్ధుల పడరానిపాట్లు ● జిల్లా కలెక్టర్కు చెప్పుకున్నా క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం కర్నూలు(సెంట్రల్)/కర్నూలు రూరల్/కల్లూరు: ప్రతి సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి బాధితులు వస్తున్నారు. స్వయంగా జిల్లా కలెక్టర్ అర్జీలు స్వీకరిస్తుండటంతో తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందనే భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. వీరిలో ఎక్కువగా 50 ఏళ్లకు పైబడిన వారే ఉంటున్నారు. చాలా మంది బీపీ, షుగర్తోపాటు ఒళ్లు, కాళ్ల నొప్పులతో బాధ పడుతున్నా ఎంతో ఆశతో కలెక్టరేట్కు వచ్చి అర్జీలు అందజేస్తున్నారు. అయితే వాటి పరిష్కారాలపై క్షేత్రస్థాయిలో వేరుగా.. అధికారిక లెక్కల్లో మరో రకంగా ఉంటోంది. వచ్చిన అర్జీల్లో దాదాపు 93 శాతం అర్జీలకు పరిష్కారాలు చూపినట్లు అధికారులు చెబుతుండగా బాధితులు మళ్లీ మళ్లీ అవే అర్జీలతో కలెక్టరేట్కు వస్తుండటం గమనార్హం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ ఇచ్చిన వారితో మాట్లాడినంతనే పరిష్కారం అయినట్లు అధికారులు రికార్డుల్లో చూపుతున్నారు. కొందరైతే కలెక్టర్, వారి శాఖల ఉన్నతాధికారుల భయంతో కూడా సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపకపోయినా చూపినట్లు లాగిన్లో ఎంట్రీ చేస్తున్నట్లు బాధితుల మాటలను బట్టి అర్థమవుతోంది. విపరీతమైన రాజకీయ జోక్యం.. ● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిపాలన విషయంలో రాజకీయ జోక్యం పెరిగిపోయింది. ● ఏకంగా సీఎం చంద్రబాబునాయుడే వైఎస్ఆర్సీపీ నాయకులకు సాయం చేస్తే ఇబ్బందులు పడతారని హెచ్చరించిన నేపథ్యంలో పాలనలో పక్షపాతం కనిపిస్తోంది. ● కూటమి నేతలు నేరుగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నా ఎవరూ ఏమి అనడంలేదు. ● పట్టున్న గ్రామాల్లో పేదల ఆధీనంలో ఉన్న భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకొని గెంటేస్తున్నారు. ● పోలీసు స్టేషన్కు వెళ్లినా బాధితులకు న్యాయం జరగడంలేదు. ● రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఏమి చేయలేకపోతున్నారు. ● ఈక్రమంలో కలెక్టరేట్, ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికను బాధితులు ఆశ్రయిస్తుండడంతో అక్కడ కూడా తమకు తెలియకుండా పరిష్కారాలు చూపరాదని అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. సీఎంఓ పంపే అర్జీలపైనే ప్రత్యేక దృష్టి సీఎంఓ పంపే అర్జీలపైనే అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నిర్దేశించిన గడువులోపు వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు మొత్తం 317 అర్జీలు రాగా, 259 అర్జీలను పరిష్కరించారు. అయితే ఆయా సమస్యలపై కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి విచారణ చేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అర్జీలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాం. ప్రతిరోజూ అర్జీలను పరిశీలించి పరిష్కారాలు చూపాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నాం. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. రాజకీయ జోక్యాన్ని సహించం. – పి.రంజిత్ బాషా, జిల్లా కలెక్టర్ 2024 జూన్ 15 నుంచి ఇప్పటి వరకు అర్జీల వివరాలు అర్జీలు 40,072 పరిష్కారం 37,415 పెండింగ్ 2657 -
పొలం వద్దే ప్రాణాలొదిలిన రైతు
కొత్తపల్లి: పైరు కాపలా కోసమని పొలానికెళ్లిన రైతు అక్కడే ప్రాణాలొదిలన ఘటన ఆదివారం రాత్రి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన రైతు చాకలి మధు(38) ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని 3 ఎకరాల్లో వేరుశనగ, 3 ఎకరాల్లో మినుము సాగు చేశాడు. సమీపంలో నల్లమల అటవీ ప్రాంతం ఉండటంతో అడవి పందుల బెడద నుంచి వేరుశనగ పైరును కాపాడుకునేందుకని రాత్రి కాపలా కోసమని పొలానికి వెళ్లి అక్కడే నిద్రించాడు. సోమవారం ఉదయం అతని స్నేహితుడు పాతకోట వెంకటరమణ డీజిల్ కోసమని మధు పొలం వద్దకు వెళ్లి చూడగా విగత జీవిగా పడి ఉండటంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఎం.కేశవ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. విషపురుగు కాటుతో మృతిచెంది ఉండొచ్చని పలువురు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. -
నంద్యాలలో జిల్లా కేంద్రంలో..
బొమ్మలసత్రం: స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అదిరాజ్సింగ్రాణా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికకు 72 ఫిర్యాదులు అందాయి. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కార మార్గాన్ని చూపుతున్నామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మందా జావళి ఆల్ఫోన్స్ తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● ఆస్తి కోసం తన పెద్ద కుమారుడు శివశంకర్గౌడ్ తప్పుడు కేసులు పెట్టి మానసికంగా, శారీరకంగా తనను వేధిస్తున్నారని పగిడ్యాల మండల కేంద్రానికి చెందిన లక్ష్మన్నగౌడ్ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ● చుక్కల భూమి జాబితాలో నుంచి తన పొలాన్ని తీసేయిస్తానని నమ్మించి పూజారి నాగేంద్రయ్య రూ. 1.50 లక్షలు కాజేశాడని దొర్నిపాడు మండలం ఉమాపతి గ్రామానికి చెందిన మల్లికార్జున ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. యించాడు. -
పలుమార్లు అర్జీలు ఇచ్చినా స్పందించడం లేదు
నేను దివ్యాంగుడిని. నాకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తప్ప వేరే ఆదాయ మార్గాలు లేవు. రెండు కాళ్లు లేకపోవడంతో ఏ పనీ చేసుకోలేను. సొంత ఇల్లు కూడా లేదు. వచ్చిన పింఛన్తో ఇంటి బాడుగ, కరెంటు బిల్లు, ఇంటి ఖర్చులు, అనారోగ్యం కోసం ఖర్చు పెట్టుకోవాలి. నా పరిస్థితిని చూసి ఇంటి స్థలంతోపాటు, ఏదైనా ఔటు సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని పలుమార్లు కలెక్టర్కు అర్జీలు పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. – బోయ మద్దిలేట్టి, ఉల్చాల గ్రామం, కర్నూలు పెన్షన్ కోసం ఐదుసార్లు అర్జీ నాకు షుగర్ ఎక్కువై ఒక కాలు ను ఆపరేషన్ చేసి తొలగించారు. రెండేళ్ల నుంచి కాలు లేకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నా. బతుకు భారమైంది. దివ్యాంగుల పెన్షన్ కోసం ఐదుసార్లు కలెక్టర్కు అర్జీ పెట్టుకున్నా. ఎంపీడీఓను కలవమన్నారు.. అక్కడ కూడా ఎవరూ పట్టించుకోరు. – వెంకటేశ్వర్లు, కులుమాల, గొనెగండ్ల మండలం -
ఎకై ్సజ్లో అసోసియేషన్ ఎన్నికల కోలాహలం
కర్నూలు: ఎకై ్సజ్ శాఖలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుళ్ల అసోసియేషన్ ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. మూడేళ్లకోసారి జరగాల్సిన అసోసియేషన్ ఎన్నికలు తొమ్మిదేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో అధ్యక్ష పదవి రేసులో ఉన్న ఓబులేసు, వైవీ గిరిబాబు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 ఎకై ్సజ్ పోలీస్స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఓబులేసు నంద్యాల డీటీఎఫ్లో పనిచేస్తుండగా మరో అభ్యర్థి గిరిబాబు కర్నూలు ఏసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ 1995 బ్యాచ్కు చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు. ఎకై ్సజ్ శాఖలోకి డిప్యూటేషన్పై వచ్చి ఇక్కడే విలీనమయ్యారు. 1992 బ్యాచ్కు చెందిన సీనియర్లతో పాటు 2014 బ్యాచ్కు చెందిన కానిస్టేబుళ్లు ఐఎంఎల్ డిపో, కారుణ్య నియామకం కింద ఎంపికై నవారు వివిధ విభాగాల్లో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం 135 మంది కానిస్టేబుళ్లు, 75 మంది హెడ్ కానిస్టేబుళ్లు కలిపి 210 మంది తమ ఓటు ద్వారా అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంది. అధ్యక్ష పదవికి ఓబులేసు, గిరిబాబు పోటీ పడుతుండగా, ప్రధాన కార్యదర్శి పదవికి విజయ్కుమార్, జగన్నాథం పేర్లు వినిపిస్తున్నాయి. ఈనెల 23న కర్నూలు ఎకై ్సజ్ కార్యాలయ ఆవరణంలో పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. ఎన్నికల తేదీ గడువు సమీపిస్తుండటంతో బరిలో ఉన్న అభ్యర్థులు.. ఎకై ్సజ్ స్టేషన్లతో పాటు ఈఎస్టీఎఫ్, మొబైల్ పార్టీ, చెక్పోస్టు, ఎన్ఫోర్స్మెంట్, నంద్యాల, కర్నూలు ఈఎస్ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిని కలిసి తమ విజయానికి దోహదపడాలని అభ్యర్థిస్తున్నారు. ఎకై ్సజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఇటీవలనే ఎన్నికలు నిర్వహించి ఆ సంఘం అధ్యక్షునిగా రాజేంద్రప్రసాద్ను ఎన్నుకున్న విషయం తెలిసిందే. జోరుగా ప్రచారం చేస్తున్న అభ్యర్థులు ఈనెల 23న పోలింగ్ -
పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
కర్నూలు: జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభమైన పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ప్రత్యేక పోలీసు బృందాలచే పెట్రోలింగ్ నిర్వహించి విద్యార్థులు గుంపులుగా చేరకుండా చర్యలు చేపట్టారు. విద్యార్థులు సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లకుండా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అనుమతించారు. ఖరీఫ్ సీజన్కు విత్తనాల కేటయింపు కర్నూలు(అగ్రికల్చర్): రానున్న ఖరీఫ్ సీజన్కు సబ్సిడీ విత్తనాలను కేటాయిస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ధరలు, సబ్సిడీలు మే నెలలో ఖరారు కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ( ఏపీసీడ్స్) విత్తనాలను సరఫరా చేస్తుంది. కర్నూలు జిల్లాకు వేరుశనగ 13,804 క్వింటాళ్లు.. కందులు 892.5 క్వింటాళ్లు, మినుములు 25, పెసర 10, కొర్ర 70, దయంచా 154, పిల్లి పెసర 11 క్వింటాళ్ల ప్రకారం మొత్తం 14,955.61 క్వింటాళ్లు కేటాయించింది. ● నంద్యాల జిల్లాకు వేరుశనగ 3,063 క్వింటాళ్లు, దయంచ 3,023, సన్హెంప్ 5, పిల్లి పెసర 19, కందులు 2,550, మినుము 745, పెసర 20, కొర్ర 91, వరి 380 క్వింటాళ్ల ప్రకారం మొత్తం 9,896 క్వింటాళ్లు కేటాయించింది. రెండు జిల్లాలకు ఏపీ సీడ్స్ విత్తనాలు సరఫరా చేయనుంది. నేటి నుంచి సుయతీంద్ర తీర్థుల సమారాధన మంత్రాలయం: శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పూర్వ పీఠాధిపతి, నవ మంత్రాలయ రూపశిల్పిగా పేరుగాంచిన సుయతీంద్రతీర్థుల సమారాధన వేడుకలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థుల గురువులైన సుయతీంద్రతీర్థుల 12వ సమారాధన వైభవంగా నిర్వహించనున్నారు. వేడుకల్లో భాగంగా మంగళవారం పూర్వారాధన, బుధవారం మద్యారాధన, గురువారం ఉత్తరారాధన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రతి రోజూ ఉదయం సుప్రభాత సేవతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మద్యారాధన రోజు మహా పంచామృతాభిషేకం, స్వర్ణ రథోత్సవాలు జరపనున్నారు. పలువురు విద్వాన్లచే రోజూ ఆధ్యాత్మిక ప్రవచనాలు వినిపించనున్నారు. పెద్దాసుపత్రిలో ఓపీ విభాగాల తనిఖీ ● విధుల్లో లేని ఇద్దరు వైద్యులకు మెమోలు కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని పలు ఓపీ విభాగాలను సోమవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం, జనరల్ సర్జరీ విభాగాల తనిఖీ సమయంలో విధి నిర్వహణలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వారికి మెమోలు జారీ చేసి సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణలో రోగుల రద్దీ దృష్ట్యా అదనంగా మరో ఓపీ కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
అమరజీవికి ఘన నివాళి
కర్నూలు: జిల్లా పోలీస్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయ మైదానంలో చిత్రపటానికి అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్పీరా పూలమాల వేశారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలను, సేవలను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలని ఆడిషనల్ ఎస్పీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు సీఐలు, ఆర్ఐలు, ఆర్ఎస్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నెలాఖరులోపు రుణాలు చెల్లిస్తే అపరాధ వడ్డీ మినహాయింపు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా సహకార కేంద్రబ్యాంకులో నిరర్థక ఆస్తులుగా మిగిలి పోయి న దీర్ఘకాలిక రుణాల రికవరీల కోసం ఉద్దేశించిన ఉపశమన పథకం గడువు ఈ నెల చివరి వరకు మాత్రమే ఉందని సీఈఓ విజయకుమార్ తెలిపారు. డీసీసీబీ బ్రాంచీల ద్వారా దీర్ఘకాలిక రుణాలు తీసుకొని.. రికవరీ చేయక నిరర్థ్ధక ఆస్తులుగా మిగిలిపోయిన బకాయిలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ నెల చివరిలోపు అప్పు మొత్తాన్ని చెల్లిస్తే.. అపరాధ వడ్డీ మినహాయింపు ఉంటుందని, వడ్డీ మీద వడ్డీలో గరిష్టంగా రూ.50 వేల వరకు మాఫీ ఉంటుందన్నారు. ఇటువంటి బకాయిలు ఉమ్మడి జిల్లాలో రూ.15 కోట్ల వరకు ఉన్నాయని తెలిపారు. దీర్ఘకాలిక రుణాలు అంటే డెయిరీ, గొర్రెల, మైనర్ ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ వంటి వాటికి తీసుకున్న రుణాలకు మాత్రమే ఈ మినహాయింపులు ఉంటాయని పేర్కొన్నారు. రూ.61.22 కోట్ల పన్ను వసూళ్లు కర్నూలు (టౌన్): 2024–2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కర్నూలు నగరపాలక సంస్థ ఆస్తి, నీటి పన్నులను రూ.61.22 కోట్లు వసూలు చేసినట్లు ఆ సంస్థ మేనేజర్ చిన్నరాముడు తెలిపారు. ఆదివారం ఆయన పన్ను వసూళ్ల కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. పన్ను వసూళ్లు నగరంలో ముమ్మరంగా సాగుతుందన్నారు. సెలవు రోజైన ఆదివారం రెవెన్యూ, సచివాలయాల సిబ్బంది స్పెషల్ డ్రైవ్ చేపట్టారన్నారు. ఈ నెలాఖరుకు 100 శాతం పన్నులు వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నకిలీ వెబ్సైట్లను నమ్మి మోసపోవద్దు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం పేరుతో రూపొందించిన నకిలీ వెబ్ సైట్లను నమ్మి మోసపోవద్దని శ్రీశైల దేవస్థానం ఈఓ ఎం. శ్రీనివాసరావు భక్తులకు సూచించారు. ఆదివారం ఈఓ మాట్లాడుతూ దేవస్థానం వసతిని ముందస్తుగా రిజర్వు చేసుకునేందుకు, ఆర్జితసేవలు, దర్శనం టికెట్లు పొందేందుకు దేవస్థానం ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. అయితే, ఈసేవలు పొందేందుకు దేవస్థానం వెబ్సైట్ www.srisailadevasthanam. org, దేవదాయ శాఖ అధికారిక వెబ్సైట్ www. aptemples. ap. gov. inలను మాత్రమే వినియోగించుకోవాలని చెప్పారు. ఇతర వివరాలకు దేవస్థానం సమాచార కేంద్రం ఫోన్ నంబర్లు 83339 01351/52/53ను సంప్రదించాలన్నారు. 26 నుంచి హ్యాండ్బాల్ పోటీలు కర్నూలు (టౌన్): ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు బిహార్ రాష్ట్రాంలోని జహీరాబాద్లో 46 వ జాతీయ స్థాయి హ్యాండ్బాల్ జూనియర్ బాలుర చాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సి. శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
కర్నూలు సిటీ: ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగరంలోని ఓ కాలేజీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడిగా బి.లక్ష్మీ నరసింహులు (దేవనకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ, జువాలజీ లెక్చరర్), ఉపాధ్యక్షుడిగా జేవీ రమణగుప్తా (ప్రభుత్వ జూనియర్ కాలేజీ, కర్నూలు ఇంగ్లిష్ లెక్చరర్), కార్యదర్శిగా కె.రామాంజనేయులు (ప్రభుత్వ జూనియర్ టౌన్ మోడల్ కాలేజీ, కర్నూలు, కెమిస్ట్రీ లెక్చరర్), జాయింట్ సెక్రటరీగా పి.డేవిడ్ (ప్రభుత్వ జూనియర్ కాలేజీ, కౌతాళం, కెమిస్ట్రీ లెక్చరర్), కోశాధికారిగా జె.రాహుల్ కుమార్ (ప్రభుత్వ టౌన్ మోడల్ జూనియర్ కాలేజీ, కర్నూలు), మహిళ కార్యదర్శిగా ఎస్.రేష్మా (ప్రభుత్వ జూనియర్ బాలికల కాలేజీ, కర్నూలు), రాష్ట్ర కౌన్సిలర్గా పి.శ్రీనివాసులు(ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ), ఆర్.రవీంద్ర బాబు (ప్రభుత్వ జూనియర్ బాలురు కాలేజీ, కర్నూలు) ఎన్నికై నట్లు ఎన్నికల అధికారిగా మహమ్మద్ వాయిజ్ ప్రకటించారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు నూతన కార్యవర్గాన్ని అభినందించారు. -
టీడీపీలో ఇరువర్గాల ఘర్షణ
సంజామల: గ్రామాల్లో అధిపత్యం కోసం తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. ఈ విషయంలోనే సంజామల మండలం ఆకుమల్ల గ్రామంలో ఆదివారం రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. గ్రామ సంఘం పెద్దను ఎన్నుకునే విషయంలో అధికారపార్టీలో విభేదాలు తలెత్తాయి.సంఘం పెద్ద కోసం మల్లు మహేశ్వర్ రెడ్డి, దుబ్బ రామగోవింద్ రెడ్డి వర్గాల మధ్య పోరు నడుస్తోంది.అయితే, ఆదివారం ఉదయం పాత వారే కొన సాగుతారని మల్లు మహేశ్వర్రెడ్డి వర్గం దండోర వేయిస్తుండగా ప్రత్యర్థి వర్గం అడ్డుకుంది. ఈ విషయంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా మల్లు మహేశ్వరరెడ్డి, ఆయన వర్గానికి చెందిన కై పరమణారెడ్డి, కై ప మోహన్రెడ్డికి గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో దుబ్బ రామగోవింద్రెడ్డి, యనకండ్ల తిమ్మయ్యతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ రమణయ్య తెలిపారు. గుర్తు తెలియని యువకుడి ఆత్మహత్య మంత్రాలయం: స్థానిక ఎమ్మిగనూరు రోడ్డులోని జగ నన్న కాలనీ సమీపంలో ఓ గుర్తు తెలియని యువకు డు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.టవల్తో వేప చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ శివాంజల్ అ క్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆచూకీ కోసం గుర్తించేందుకు ప్రయత్నించగా ఎటువంటి ఆధారాలు లభించలేదు. యువకుడి వయస్సు దా దాపు 35 నుంచి 40 ఏళ్లు ఉండి, గళ్ల చొక్కా ధరించా డు. మృతదేహం ఉబ్బిపోయి ఉండటంతో మూడు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. గల్లంతైన బాలుడు శవమై తేలాడు ఆదోని అర్బన్: రెండు రోజుల క్రితం బసాపురం ఎల్లెల్సీ కాలవలో గత్లంతైన పట్టణంలోని బోయగేరికి చెందిన శేఖర్ కుమారుడు హరికృష్ణ (16) ఆదివారం శవమై కనిపించాడు. అగ్నిమాపక సిబ్బంది సంజీవ్కుమార్, మల్లికార్జునరెడ్డి, అనీఫ్, వెంకటేశ్వర్లు, చిదంబరంరెడ్డి, నరసింహులు, మహమ్మద్ శుక్రవారం నుంచి గాలింపు చర్యలు చేపడుతున్నారు. బాలుడు గల్లంతైన ప్రాంతానికి కొద్ది దూరంలో ఆదివారం ఉదయం మృతదేహం కనిపించడంతో బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు. ఇస్వీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
క్వింటాకు రూ.10 వేల వరకే ధర
గత ఏడాది పండించిన మిర్చి ఇప్పటికీ గోదాముల్లో ఉంది. ఈ సారి 3.50 ఎకరాల్లో మిర్చి సాగు చేశాం. ఎకరాకు పెట్టుబడి వ్యయం రూ.1.50 లక్షల వరకు వస్తోంది. ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చి ధర కనీసం రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు లభిస్తేనే గిట్టుబాటు అవుతుంది. ప్రస్తుతం ఇప్పటి వరకు 60 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇందులో 20 క్వింటాళ్లు తాలు కాయలే. ప్రస్తుతం దళారీలు క్వింటా రూ.10 వేల చొప్పున అడుగుతున్నారు. ఈ ధరతో అమ్ముకుంటే పెట్టుబడి కూడా దక్కదనే భయంతో ఏసీ గోదాముల్లో నిల్వ చేశాం. – ఎర్ర చిన్న సతీష్, బసలదొడ్డి, పెద్దకడుబూరు మండలం -
వాగులో మునిగి గొర్రెల కాపరి మృతి
ఆళ్లగడ్డ/రుద్రవరం: చందలూరు–నల్లగట్ల గ్రామ పొలిమేర మధ్యలో వక్కిలేరు వాగు నీటిలో మునిగి ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం గొర్రెలను ఏరు దాటిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రుద్ర వరం మండలం నక్కలదిన్నెకు చెందిన శివరాం, పాపారాయుడు, నారబోయిన కృష్ణుడు (54) అనే ముగ్గురు దాదాపు 700 గొర్రెలను పెంచుతున్నారు. వాటిని మేపేందుకు ప్రతి రోజు చుట్టు పక్కల గ్రామాల పొలాల్లోకి వెళ్లేవారు. ఈక్రమంలోనే ఆదివారం నక్కలదిన్నె నుంచి చందలూ రు–నల్లగట్ల పొలిమేర మధ్యకు వెళ్లారు. మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో గొర్రెలను సమీపంలోని వక్కిలేరు వాగులోకి తోలారు. అందులో వాటికి ఈత నేర్పి తీసుకొస్తున్న సమయంలో కొన్ని గొర్రెలు వారిపై దూకాయి. ఈ ఘటనలో శివరాం, పాపారాయుడు అతి కష్టం మీద ఒడ్డుకు చేరుకోగా నారబోయిన కృష్ణుడు మాత్రం నీటిలో మునిగిపోయాడు. ఎంత గాలించినా ఆచూకీ లభించకపోవడంతో సమాచారం అందుకున్న ఆళ్లగడ్డ పోలీసులు అక్కడికి చేరుకొని స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. నారబోయిన కృష్ణుడుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని పోలీసులు చందలూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో ప్రాథమిక చికిత్స చేయించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆళ్లగడ్డ పోలీసులు తెలిపారు. -
పెద్దాసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికుడి మృతి
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పారిశుద్ధ్య కార్మికుడు జె.నాగేష్(41) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందాడు. మూడు రోజుల క్రితం తను పనిచేసే క్యాజువాలిటీలో అస్వస్థతకు గురి కాగా అక్కడే వైద్యులు చికిత్స అందించి ఇంటికి పంపించారు. ఆదివారం ఉదయం నుంచి మళ్లీ ఆరోగ్యం బాగాలేక పోవడంతో కుటుంబసభ్యులు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే నాగేష్ మరణించాడు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేశారు. మరణించిన అతని కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి విజయ రామాంజనేయులు డిమాండ్ చేశారు. సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడం వల్లే కార్మికులు శారీరక, మానసిక వేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారితో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు చర్చించి పంపించారు. కార్యక్రమంలో సుజాత, సునీత, విజయ్కుమారి, మల్లేశ్వరి, మురళి, ప్రసాద్, మహేష్, డేవిడ్, డ్రైవర్ భాషా, రంగన్న పాల్గొన్నారు. -
సముద్ర శాస్త్రవేత్త ఎంపీఎం రెడ్డి సేవలు చిరస్మరణీయం
కర్నూలు కల్చరల్: సుప్రసిద్ధ శాస్త్రవేత్త డాక్టర్ ఎంపీఎం రెడ్డి సేవలు చిరస్మరణీయమని అరుణ భారతి అధ్యక్షుడు బీసీ రాజారెడ్డి అన్నారు. సీక్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం తెలుగు కళా స్రవంతి ఆఽధ్వర్యంలో డాక్టర్ ఎంపీఎం రెడ్డి సంస్మరణ సభను నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ రాజారెడ్డి మాట్లాడుతూ.. భారతీయ తొలి సముద్ర శాస్త్రవేత్తగా ఎదిగిన ఎంపీఎం రెడ్డి ఆదర్శనీయులు అన్నారు. ప్రపంచంలోని అన్ని సముద్రాలు సందర్శించి పరిశోధనలు చేశారని గుర్తు చేసుకున్నారు. సముద్ర శాస్త్రంపై ఈయన రాసిన పుస్తకాలను కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రచురించడం గర్వకారణమన్నారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ రెడ్డి రచించిన సముద్ర శాస్త్ర గ్రంథాలే ప్రపంచంలోని అన్ని యూనివర్సిటీల్లో సముద్ర శాస్త్ర, మత్య్స శాస్త్ర విద్యార్థులు పాఠ్యగ్రంథాలుగా చదువుకోవడం ఉమ్మడి కర్నూలు జిల్లాకు గర్వకారణమన్నారు. ఎంపీఎం రెడ్డి కూతురు మాలతి, కుమారుడు డాక్టర్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తమ తండ్రి కెనడాలో ఉండి కూడా భారతీయ సంస్కృతికి పెద్ద పీట వేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో తెలుగు కళా స్రవంతి అధ్యక్షుడు ఇనాయతుల్లా, సాహితీ స్రవంతి అధ్యక్షులు కెంగార మోహన్, కార్యదర్శి జంధ్యాల రఘుబాబు, రచయిత గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి, గజల్ గాయకుడు మహమ్మద్ మియ్యా, మద్దిలేటి యాదవ్ మాట్లాడారు. ఎంపీఎం రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
మిర్చి రైతుకు దక్కని భరోసా
● కాయకుళ్లుతో భారీగా పెరిగిన పెట్టుబడి వ్యయం ● ఎకరాకు రూ.1.50 లక్షల వరకు ఖర్చులు ● సగటు దిగుబడి 15 క్వింటాళ్లకే పరిమితం ● ఇందులోనూ 30–40 శాతం తాలు కాయలు ● నేడు మిర్చికి లభిస్తున్న ధర రూ.10 వేలలోపే -
హాస్టల్ విద్యార్థినులకు తప్పిన ప్రమాదం
నంద్యాల(అర్బన్): స్థానిక తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని జూనియర్ కళాశాల గిరిజన బాలికల వసతి గృహం విద్యార్థినులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం ఉన్నట్టుండి హాస్టల్ రెండో అంతస్తు కిటికి దిమ్మె విరిగి కింద పడింది. అయితే, ఆ సమయంలో విద్యార్థినులంతా బయట వరండాలో ఘటనా స్థలానికి కొద్ది దూరంలో ఉండటంతో ప్రమాదం తప్పింది. హాస్టల్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, పలు గదులు పెచ్చులూడి వర్షానికి కారుతున్నాయని విద్యార్థినులు వాపోయారు. ప్రమాదం జరగకముందే అధికారులు భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
గ్యాస్ డెలివరీలో నిలువు దోపిడీ!
● కనీసంగా రూ.30 వసూలు ● అంతస్తులు పెరిగే కొద్ది రూ.10 పెంచుతున్న వైనం ● 15 కిలోమీటర్ల వరకు ఎలాంటి రుసుం వసూలు చేయరాదంటున్న నిబంధనలు ● దోపిడీకి డెలివరీ బాయ్స్కు అనుమతి ఇస్తున్న గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యాలు ● ఫిర్యాదు చేస్తే ఇబ్బందులు సృష్టిస్తున్న డెలివరీ బాయ్స్ ● చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న పౌరసరఫరాల అధికారులు కర్నూలు(సెంట్రల్): గ్యాస్ సిలిండర్ డెలివరీ కోసం 15 కిలోమీటర్ల వరకు ఎలాంటి రుసుం వసూలు చేయరాదు. 15 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల వరకు సిలిండర్కు రూ.30 వసూలు చేయాలి. అయితే ఎక్కడా ఆ నిబంధనలు అమలు కావడం లేదు. ఐదు కిలోమీటర్ల లోపే సిలిండర్లు డెలివరీ అవుతున్నా కనీసంగా రూ.30 వసూలు చేస్తున్నారు. అపార్టుమెంట్లలో అంతస్తుకు రూ.15 చొప్పున అక్రమంగా వసూలు చేస్తున్నారు. మొదటి అంతస్తులోకి సిలిండర్ రావాలంటే రూ.45, రెండో అంతస్తులోకి రావాలంటే రూ.50, మూడో అంతస్తులోకి రావాలంటే రూ.60 వరకు వసూలు చేస్తున్నారు. ఎదురిచ్చి గ్యాస్ సిలిండర్ల డెలివరీ! జిల్లాలో దాదాపు 30 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. ఇందులో 6,67,456 మందికి గ్యాస్ కనెక్షన్లు ఉండగా, భారత్, హెచ్పీ, ఐఓసీ కంపెనీలు గ్యాస్ను సరఫరా చేస్తున్నాయి. ఎక్కువగా ప్రజలు భారత్ గ్యాస్ కంపెనీ సిలిండర్లనే వినియోగిస్తున్నారు. నిబంధనలు ప్రకారం ఒక వినియోగదారుడు బుక్ చేసుకున్న సిలిండర్ను డెలివరీ చేసేందుకు నిర్వహణలో ఉన్న ఏజెన్సీలు వాహనాలు, బాయ్స్ను అందుబాటులో ఉంచుకోవాలి. బాయ్స్కు వారే జీతా లు ఇవ్వాలి. అయితే ఏజెన్సీలలు ఇక్కడే మోసం చేస్తున్నాయి. సొంతంగా ఆటోలు ఉన్న వారితో కలసి సిలిండర్లను డోర్ డెలివరీ చేసే బాధ్యతను వారికి అప్పగిస్తున్నారు. ఇలా వారి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఏజెన్సీ నిర్వాహకులు ఆటోగాని, డెలివరీ బాయ్కుగాని ఎలాంటి బాడుగ, జీతాలు చెల్లించరు. ఆటో యజమానే డెలివరీ చేసి వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాలి. దీంతో ఆటో యజమానులు గిట్టుబాటు కోసం దోపిడీ చేస్తున్నారు. ఎక్కువ కనెక్షన్లు ఉన్న ఏజెన్సీలకు అయితే ఆటో యజమానులే ఎదురు చెల్లించి డెలివరీ చేసేందుకు ఒప్పందం చేసుకుంటారట. దీంతో డెలివరీ బాయ్స్ కనీసంగా రూ.30 నుంచి రూ.50 వరకు వసూలు చేసుకొని గిట్టుబాటు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో సిలిండర్ బిల్లింగ్లో డెలివరీ కోసం కేటాయించిన మొత్తం ఏజెన్సీల ఖాతాలోకి వెళ్లిపోతోంది. మొత్తంగా వినియోగదారుడే ఏజెన్సీ, డెలివరీ బాయ్ చేతిలో మోసపోయి దగాపడుతున్నాడు. నోటీసులతో సరి.. గ్యాస్ పంపిణీపై నెలరోజులుగా 60కి పైగా ఫిర్యాదులు అందాయి. వీటిలో గ్యాస్ డెలివరీ కోసం అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులే అధికం. ఈ క్రమంలో ఫిబ్రవరి నెలలో ఏజెన్సీలకు అధికారులు నోటీసులు ఇచ్చిసరిపెట్టారు. వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదు. ఇటీవల గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి డెలివరీ కోసం డబ్బులు తీసుకోరాదని స్వయంగా జేసీ డాక్టర్ బి.నవ్య చెప్పారు. ఫిర్యాదు చేస్తేనే చర్యలు గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీని పౌర సరఫరాల అధికారులు పరిశీలించడం లేదు. నెలవారీగా ఏజెన్సీ నిర్వాహకుల నుంచి వస్తున్న డబ్బులు తీసుకొని మిన్నకుండి పోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సిలిండర్ డెలివరీ విషయంలో చాలామంది వినియోగదారులు బాయ్స్తో గొడవ పడి ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో దోపిడీ యథాతథంగా కొనసాగుతోంది. నిబంధనలు పాటించాలి 15 కిలోమీటర్ల వరకు గ్యాస్ సిలిండర్ డెలివరీ కోసం ఎలాంటి రుసుం వసూలు చేయరాదు. అలా వసూలు చేస్తే మాకు ఫిర్యాదు చేయాలి. వచ్చిన ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తున్నాం. వచ్చిన ఫిర్యాదులను వచ్చినట్లుగానే పరిష్కరిస్తున్నాం. 15 కిలో మీటర్లు దాటితే సిలిండర్కు రూ.30 వసూలు చేయాలని ప్రభుత్వం నిబంధనలు ఉన్నాయి. ఏజెన్సీలు విధిగా నిబంధలను పాటించాలి. –రాజారఘువీర్, డీఎస్ఓ, కర్నూలు -
పది పరీక్షలకు అంతా సిద్ధం
● నేటి నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు ● జిల్లాలో 172 కేంద్రాలు ఏర్పాటు ● పరీక్షలకు హాజరుకానున్న 40,776 మంది విద్యార్థులు ● సమస్యాత్మకమైన కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు కర్నూలు సిటీ: పాఠశాల విద్యలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంగ్లిషు మీడియం, ఎన్సీఈఆర్టీ సిలబస్తో విద్యార్థులు మొదటిసారి పరీక్షలు రాయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 40,776 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 31,410 మంది, ప్రైవేటు 7,038 మంది, ఓపెన్ టెన్త్ విద్యార్థులు 2,328 మంది హాజరుకానున్నారు. ఇందులో 23,486 మంది ఇంగ్లిషు మీడియం, 5,068 మంది తెలుగు, 379 మంది ఉర్దూ, 477 మంది కన్నడ మీడియంలో నేటి (సోమవారం) నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలు రాయనున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. గత ప్రభుత్వం మన బడి నాడు–నేడు కింద అన్ని రకాల వసతులు కల్పించడంతో సదుపాయాల కొరత తీరింది. రెగ్యులర్ టెన్త్తో పాటు, ఒపెన్ స్కూల్ పది పరీక్షలు సైతం ఒకే సమయంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 172 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓపెన్ స్కూల్ పరీక్షలకు 20 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు 172 మంది ముఖ్య పర్యవేక్షకులను, 172 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 1,840 మంది ఇన్విజిలెటర్లను, సీ సెంటర్లకు 11 మంది కస్టోడియన్స్, 7 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్లను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల్లోని గార్గేయపురం జెడ్పీ హైస్కూల్, రామళ్లకోట జెడ్పీ హైస్కూల్, ఉల్చాల జడ్పీ హైస్కూల్, ఆస్పరి జడ్పీ హైస్కూల్ ఏ సెంటర్, బీ సెంటర్, ఏపీ మోడల్ స్కూల్ గాజులదిన్నెలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆల్ ది బెస్ట్ ఉజ్వల భవిష్యత్తుకు మొదటి మెట్టు పదవ తరగతి. పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు పాజిటివ్ ఆలోచనతో పరీక్షలు రాయాలి. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు పట్టుదలతో విజయవంతంగా పూర్తి చేయాలి. పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి. – పి.రంజిత్ బాషా, జిల్లా కలెక్టర్ పకడ్బందీగా ఏర్పాట్లు పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. మాప్ కాపీయింగ్కు పాల్పడితే చట్ట రీత్యా చర్యలు ఉంటాయి. విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతించారు. కేంద్రా ల్లోకి ఎలాంటి సెల్ఫోన్లు అనుమతించం. పరీక్షల్లో ఏవైన సమస్యలు తలెత్తినా, సందేహాలు ఉన్నా డీఈఓ ఆఫీస్లో కంట్రోల్ రూం నంబర్ 98855716544ను సంప్రదించవచ్చు. – ఎస్.శామ్యూల్ పాల్, డీఈఓ -
వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ కార్యదర్శిగా అబ్దుల్ గఫార్
ఓర్వకల్లు: వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శిగా అబ్దుల్ గఫార్ను నియమించినట్లు పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర వైఎస్సార్సీపీ వ్యవస్థాపకులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర మైనార్టీ విభాగంలో జిల్లాకు చెందిన కొందరికి స్థానం లభించినట్లు తెలిపారు. అందులో భాగంగా రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శిగా నన్నూరు గ్రామానికి చెందిన మైనార్టీ నాయకులు అబ్దుల్ గఫార్ను నియమించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈయన నియామకం పట్ల జిల్లా మైనార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. క్రెడాయ్ నూతన చైర్మన్గా గోరంట్ల రమణ కర్నూలు (టౌన్): క్రెడాయ్ (కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) నూతన చైర్మన్గా గోరంట్ల రమణ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం స్థానిక కల్లూరు రోడ్డులో ఉన్న క్రెడాయ్ భవనంలో క్రెడాయ్ సభ్యుల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కర్నూలు చాప్టర్ నూతన చైర్మన్తో పాటు అధ్యక్షుడిగా సురేష్ రెడ్డి, కార్యదర్శిగా గోవర్దన్రెడ్డిని ఎన్నుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా అర్కిటెక్ రంగనాథ రెడ్డి వ్యవహరించారు. నూతనంగా ఎన్నికై న చైర్మన్ గోరంట్ల రమణ మాట్లాడుతూ 2015 నుంచి 2021 వరకు క్రెడాయ్ సంస్థలో కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశానన్నారు. క్రెడాయ్ సంస్థ ద్వారా ప్రాపర్టీషోలు నిర్వహించామన్నారు. నూతన కార్యవర్గంతో ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొంటున్న నిర్మాణ రంగానికి నూతనోత్సాహం తీసుకువస్తామని స్పష్టం చేశారు. రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ● పోలీస్ స్టేషన్ల వారీగా రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ కర్నూలు: కర్నూలు శివారుల్లోని షరీన్నగర్లో టీడీపీ నాయకుడు సంజన్న హత్య సంఘటన నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. హంతకుడు వడ్డే రామాంజనేయులు అలియాస్ అంజిపై అనేక కేసులు ఉండడమే గాక, రౌడీ షీట్ కూడా ఉండడంతో రౌడీ షీటర్ల కదలికలపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా అంతటా పోలీస్ స్టేషన్ల వారీగా రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి గౌరవ ప్రదమైన జీవితం కొనసాగించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు కౌన్సెలింగ్ ఇస్తునే, కొత్తగా కేసుల్లో ఇరుక్కున వారి జాబితాను సిద్ధం చేస్తున్నారు. స్టేషన్ల వారీగా రౌడీ షీటర్లు జీవనోపాధికి చేస్తున్న వృత్తులపై కూడా ఆరా తీస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే, పోలీస్ శాఖ పరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
గర్భదారణ సమస్యలపై దృష్టి సారించాలి
కర్నూలు(హాస్పిటల్): గర్భం దాల్చినప్పుడు మహిళలకు అనేక సమస్యలు వస్తాయని, వాటిని ఎప్పటికప్పుడు వైద్యులు గమనిస్తూ తగిన చికిత్సలు అందించాలని, అప్పుడే తల్లీబిడ్డలు పూర్తిగా క్షేమంగా ఉంటారని వైద్యనిపుణులు అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్ట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఫాగ్సి) ఆధ్వర్యంలో కర్నూలు కిమ్స్ కడల్స్ ఆసుపత్రిలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రాయలసీమలోని వైద్యులకు నిరంతర వైద్యవిజ్ఞాన సదస్సు (సీఎంఈ) నిర్వహించారు. కర్నూలు జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలకు చెందిన దాదాపు 200 మంది వరకు గైనకాలజిస్టులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గైనకాలజిస్టు డాక్టర్ కేపీ. శిల్పా మాట్లాడుతూ ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సదుపాయాలతో గర్భస్థ మహిళలతో పాటు వారి కడుపులో ఉండే శిశువులకు వచ్చే ఎలాంటి సమస్యలైనా పరిష్కరించవచ్చని చెప్పారు. పీడియాట్రిక్ కార్డియాలజిస్టు డాక్టర్ కె.మహమ్మద్ ఫారూక్ మాట్లాడుతూ గర్భస్థ శిశువులకూ గుండెకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చని, ప్రసవం అయిన తర్వాత వీలైనంత వెంటనే వాటికి తగిన చికిత్సలు అందించాలని తెలిపారు. అనంతరం గర్భిణిలకు వచ్చే పచ్చకామెర్లు, గుండె సమస్యలు, హైబీపీ, మధుమేహం, ఇతర సమస్యలు, వాటిని గుర్తించి చికిత్స చేసే పద్ధతుల గురించి నిపుణులు వివరంగా చర్చించారు. కార్యక్రమంలో ఫాగ్సీ ప్రెసిడెంట్ ఎస్.వెంకటరమణ, కార్యదర్శి వి.రాధాలక్ష్మి, గర్భస్థ శిశు సమస్యల నిపుణురాలు కె.నివేదిత, గైనకాలజిస్ట్, వై.కుసుమ, కె.లక్ష్మీప్రసన్న, ఎ.సుధారాణి, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు కె.నవీన్, ఎస్.జె. జానకీరామ్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు జి.సందీప్కుమార్, నియోనెటాలజిస్టు ఎన్.భారతి పాల్గొన్నారు. -
గొంతులు ఎండుతున్నాయ్ !
● తాగునీటి సమస్యపై అధికార, ప్రతిపక్ష సభ్యులు గగ్గోలు ● హామీ ఇవ్వకుండా మంత్రి టీజీ భరత్ వెళ్లిపోవడంపై అసహనం ● నీటి పారుదలపై సుదీర్ఘ చర్చ కర్నూలు(అర్బన్): వేసవి ప్రారంభంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అనేక గ్రామాల ప్రజల గొంతులు ఎండుతున్నాయని అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి, ప్రజల దాహార్తిని తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఆలూరు, పాణ్యం, నందికొట్కూరు ఎమ్మెల్యేలు బి. విరూపాక్షి, గౌరు చరితారెడ్డి, జి. జయసూర్య, కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు పి. రంజిత్బాషా, రాజకుమారి గణియా, కర్నూలు జేసీ డా.బి. నవ్య, ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి, కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, జెడ్పీ సీఈఓ జి. నాసరరెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. అజెండాలో పొందుపరిచిన విధంగా తాగునీరు, వ్యవసాయం, ఇరిగేషన్ శాఖలపై సుదీర్ఘంగా చర్చించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా ఏళ్ల క్రితం నిర్మించిన 60కి పైగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు ఉన్నాయని, వాటి నిర్వహణను ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారా? అని రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ప్రశ్నించారు. కట్టలు బలహీనపడి పోవడం, లీకేజీలను పరిశీలించకుంటే సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందన్నారు. వాటిని తనిఖీ చేసి నివేదికలు అందించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్ల విస్తరణ చేపట్టాలి.. ఎమ్మెల్యే విరూపాక్షి ఆలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందన్నారు. జనాభా పెరిగిన నేపథ్యంలో చింతకుంట, బాపురం రిజర్వాయర్లను విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే ఆలూరు చెరువు అన్యాక్రాంతం కాకుండా ఎస్ఎస్ ట్యాంకును నిర్మించాలన్నారు. సమ్మతగేరిలో ఎస్ఎస్ ట్యాంకు నిర్మించాలని, కోగిలతోట గ్రామంలో శిథిలావస్థకు చేరిన ఓహెచ్ఎస్ఆర్ను తొలగించి కొత్త ఓహెచ్ఎస్ఆర్ను నిర్మిస్తుండడం వల్ల గ్రామంలో తీవ్ర మంచినీటి సమస్య ఉందన్నారు. పందికోన రిజర్వాయర్ నుంచి పైప్లైన్ వేస్తే ఆస్పరి మండలంలోని పలు గ్రామాల నీటి సమస్య తీరే అవకాశం ఉందన్నారు. అలాగే తుంగభద్ర డ్యామ్ గేట్లకు సంబంధించిన చైన్ లింకులను మొత్తం మార్చాలని కేంద్ర బృందం సూచించిందని, ఇందుకు రూ.150 కోట్ల వరకు వ్యయం కానుందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నయాపైసా కూడా కేటాయించలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరారు. మంత్రికి ప్రజల సమస్య పట్టదా.. సమావేశం జరుగుతున్న సమయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, జయసూర్య వెళ్లిపోవడం పట్ల ఆలూరు ఎమ్మెల్యే బి. విరుపాక్షితో పాటు పలువురు జెడ్పీటీసీ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుత వేసవిలో నెలకొన్న తాగునీటి సమస్యపై సుదీర్ఘ చర్చ జరుగుతున్న సమయంలో రాష్ట్ర మంత్రిగా ఎలాంటి హామీ ఇవ్వకుండా వెళ్లడం ఏమిటని వారు ప్రశ్నించారు. వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులకు సంబంధించి పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాల్లో తమ వాణిని వినిపించాల్సిన ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా వెళ్లిపోవడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. నీటి వృథాను అరికట్టేందుకు రిజర్వాయర్లు అవసరం ... జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి కర్నూలు జిల్లాకు పైభాగాన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కురిసిన అధిక వర్షాల వల్ల గత ఏడాది జూరాల నుంచి 1200 టీఎంసీలు, సుంకేసుల నుంచి 300 టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలైందని ఆందోళన వ్యక్తం చేశారు. నీటిని నిల్వ చేసుకునేందుకు రిజర్వాయర్లు లేని కారణంగా ప్రతి ఏడాది దాదాపు 540 టీఎంసీల నీరు వృథా అవుతుందన్నారు. వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి అయితే నీటి వృథాను కొంతమేర అరికట్టడంతో పాటు సాగు, తాగునీటికి ఉన్న ఇబ్బందులు తొలగే అవకాశం ఉంటుందన్నారు. అలాగే రబీ సీజన్లో ఏర్పడిన ఎరువుల కొర త ఖరీఫ్లో రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రూ.6.47 కోట్ల పనులకు ఆమోదం జిల్లా పరిషత్ సాధారణ నిధులు, 2024–25 ఆర్థిక సంవత్సరం నిధులు, మిగులు నిల్వలు కలిపి మొత్తం రూ.6.47 కోట్లతో వివిధ అభివృద్ది పనులకు జెడ్పీ సర్వసభ్య సమావేశం ఆమోదం తెలిపింది. ఆదివారం జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మొత్తం 147 పనులను చేపట్టేందుకు సభ్యులు ఆమోదం తెలిపారు. -
ఏపీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో ఆది, సోమవారాల్లో జరగనున్న ఏపీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జేసీ డాక్టర్ బి.నవ్య అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఆమె ఎఫ్ఆర్ఓ, ఎన్టీఆర్ వైద్య యూనివర్సిటీ జూనియర్ అసిస్టెంట్ పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అభ్యర్థులు హాల్ టిక్కెట్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్నాహ్నం 12 గంటలకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షా సమయం ఉంటుందన్నారు. గంట మందుగానే పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు చేరుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, జిల్లా వైద్య అధికారి శాంతికళ, ఏపీపీఎస్సీ అధికారివెంకట్రావు, ఆర్వీ రమణ పాల్గొన్నారు. జేసీ డాక్టర్ బి.నవ్య -
ఎస్టేటు అధికారుల బదిలీ
కర్నూలు(అగ్రికల్చర్): రైతుబజార్ల ఎస్టేటు అధికారుల బదిలీలు జరిగాయి. కీలకమైన సి.క్యాంపు రైతుబజారు ఎస్టేటు అధికారిగా కళ్యాణి నియమితులయ్యారు. అమీన్ అబ్బాస్నగర్ రైతుబజారు ఎస్టేటు అధికారిగా పనిచేస్తున్న కళ్యాణిని సి.క్యాంపునకు బదిలీ చేస్తూ రాష్ట్ర రైతుబజార్ల సీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సి.క్యాంపులో పనిచేస్తున్న హరీష్కుమార్ ఆదోని రైతుబజారుకు బదిలీ అయ్యారు. కొత్తపేట రైతుబజారు ఎస్టేటు అధికారిగా పనిచేస్తున్న జయమ్మను అమీన్ అబ్బాస్నగర్ రైతుబజారుకు బదిలీ చేశారు. ఆదోని రైతుబజారులో ఎస్టేటు అధికారిగా పని చేస్తున్న అక్తర్షరీఫ్ను కొత్తపేట రైతుబజారుకు బదిలీ చేశారు. సి.క్యాంపు రైతు బజారులో నిజమైన రైతులకు స్థానం కల్పిస్తామని ఎస్టేటు అధికారి కళ్యాణి వెల్లడించారు. శ్రీగిరి భద్రతపై సమీక్ష శ్రీశైలంటెంపుల్: ‘సాక్షి’ దిన పత్రికలో శనివారం ‘భగవంతుడా.. ఇదేమి భద్రతా’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు స్పందించారు. దేవస్థాన భద్రతా విషయాలపై సమగ్ర పరిశీలన చేయాలని దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నరసింహారెడ్డిని ఈఓ ఆదేశించారు. ఈ మేరకు ఆయన క్యూలైన్ల వద్దకు చేరుకుని, క్యూలైన్ ఏఈఓ, పర్యవేక్షకులు, భద్రతా పరికరాల పర్యవేక్షణ చేపట్టే ఇంజినీర్లు, సెక్యూరిటీ సూపర్ వైజర్లతో సమీక్షించారు. మెటల్ డోర్ ఫ్రేమ్ డిటెక్టర్లు కొన్ని పనిచేయడం లేదని, హ్యాండ్ డిటెక్టర్లు ఉన్నా వినియోగించేందుకు సిబ్బంది తక్కువ ఉన్నారని గుర్తించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భద్రతా ఏర్పాట్లు మరింత మెరుగుపరుస్తామన్నారు. లగేజ్ స్కానర్లు సైతం వినియోగంలోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. సోమవారం ఈఓ స్వయంగా క్షేత్ర భద్రతపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి లోపాలను క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుంటారన్నారు. -
షుగర్ వ్యాధి బారిన పడకుండా ఒక్కొక్కరు ఒక్కో ఆరోగ్య సూత్రాన్ని పాటిస్తుంటారు. ఒకరు రైస్ తినకూడదంటారు.. ఇంకొకరు నడక మంచిదంటారు.. ఒక వయస్సుకు వచ్చిన తర్వాత వ్యాధి బారిన పడటం ఒక ఎత్తయితే, రాకుండా జాగ్రత్త పడటం ఇంకొక ఎత్తు. మరి పుట్టుకతోనే ఈ వ్యాధి తోడుగా వస
కోవిడ్ తర్వాత పెరిగిన కేసులు కోవిడ్–19 అనంతరం టైప్–1 డయాబెటిస్ రోగుల సంఖ్య పెరిగింది. గతంలో డయాబెటిస్ రోగులు 5 శాతం ఉండగా ఇప్పుడు 10శాతానికి చేరుకుంది. కోవిడ్ వైరస్ నేరుగా బీటా కణాలపై దాడి చేయడమే ఇందుకు కారణం. ఈ కారణంగా కోవిడ్కు గురైన వారికి జన్మించే పిల్లల్లో టైప్–1 డయాబెటీస్ ఎక్కువగా కనిపిస్తోంది. – డాక్టర్ పి.శ్రీనివాసులు, ఎండోక్రైనాలజీ హెచ్వోడి, జీజీహెచ్, కర్నూలు ఇన్సులిన్తో మాత్రమే చికిత్స చిన్నపిల్లల్లో వచ్చే టైప్–1 డయాబెటిస్కు ఇన్సులిన్తో మాత్రమే చికిత్స అందుబాటులో ఉంది. ఆయాసం, కడుపునొప్పి, వాంతులు లక్షణాలతో చిన్నపిల్లలను ఆసుపత్రికి తీసుకొస్తారు. అన్నిరకాల పరీక్షలు నిర్వహించి డయాబెటిస్ నిర్దారణ అయ్యాక చికిత్స ప్రారంభిస్తాం. ఈ పిల్లలకు ఇన్సులిన్తో పాటు ఆహార నియమావళి తప్పనిసరి. – డాక్టర్ ఎం.మల్లికార్జున, అసోసియేట్ ప్రొఫెసర్, పీడియాట్రిక్స్, జీజీహెచ్, కర్నూలు● కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీకి చెందిన యువకునికి పుట్టుకతోనే షుగర్ వ్యాధి వచ్చింది. వైద్యులు పరిశీలించి టైప్–1 డయాబెటిస్గా నిర్ధారించారు. అప్పటి నుంచి ఇన్సులిన్ను ఇంజెక్షన్ రూపంలో అందిస్తున్నారు. ప్రస్తుతం ఇతని వయస్సు 30 ఏళ్లు. రోజూ ఇంజెక్షన్ వేయించుకోవాలంటే బాధగా ఉంటోందని, కానీ బతకాలంటే తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. స్వీట్లు అంటే ఇష్టమని, కానీ తింటే పరిస్థితి దారుణంగా ఉంటుందని వాపోతున్నాడు.● పగిడ్యాల మండలంలోని పాత ముచ్చుమర్రి గ్రామానికి చెందిన మల్లయ్య, మానస దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు వెంకట ఉమామహేష్, రెండవ కుమారుడు లిఖిత్. 9 నెలల వయస్సు కలిగిన లిఖిత్కు పుట్టుకతోనే చక్కెర వ్యాధి తోడుగా వచ్చింది. తరచూ అపస్మారక స్థితికి చేరుకోవడం గమనించి కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రిలో సుమారు రూ.3లక్షలకు పైగా ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. షుగర్ లెవెల్స్ గుర్తించేందుకు మిషన్ తెచ్చుకుని వారానికోసారి ఇన్సులిన్ ఇంజెక్షన్ వేయించాల్సిన పరిస్థితి. వారానికి సుమారు రూ.5వేల దాకా ఖర్చవుతోందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కర్నూలు(హాస్పిటల్): పేరులో తియ్యదనం దాచుకున్న మహమ్మారి మధుమేహం. ఇది పెద్దలనే కాదు.. చిన్నారులనూ వదలని పరిస్థితి. పుట్టుకతోనే తోడుగా వచ్చి జీవించినంత కాలం వేధిస్తోంది. అందరిలా జీవించాలంటే రోజూ సూదిపోటుతో ఇన్సులిన్ మందు వేసుకోవడం తప్పనిసరి. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నబిడ్డలను తల్లిదండ్రులే స్వయంగా ఇంజెక్షన్ ద్వారా ఇన్సులిన్ ఇవ్వడం వారికీ నరకంతో సమానం. ఇలాంటి బాధితుల సంఖ్య సమాజంలో రోజురోజుకూ పెరుగుతోంది. శరీరంలోని క్లోమగ్రంధిలో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ గ్రంధిలో ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే కణాలను(బీటా కణాలు) వ్యక్తుల రోగనిరోధక వ్యవస్థ నాశనం చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీన్ని టైప్–1 మధుమేహం(డయాబెటిస్) అంటారు. సాధారణంగా పిల్లలు, యువకుల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు బీటా కణాలను రోగినిరోధక వ్యవస్థ నిర్వీర్యం చేయడం కాకుండా క్లోమగ్రంధికి ఏదైనా వ్యాధి సోకినప్పుడు లేదా గాయం అయినప్పుడు బీటా కణాలు నిర్వీర్యం అవుతాయి. దీనిబారిన పడిన వారికి క్రమం తప్పకుండా ఇన్సులిన్ను ఇంజెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది కొంత మందికి జన్యుపరంగా కూడా రావచ్చు. మరికొంత మందికి పలు రకాల వైరల్ వ్యాధులు, ఇతర ప్రమాదకర అనారోగ్యాల కారణంగా కూడా ఈ పరిస్థితి ఎదురవ్వొచ్చు. అంతేకానీ ఆహారం, జీవనశైలి అలవాట్లు టైప్–1 డయాబెటిస్కు కారణం కావు. ప్రభుత్వాసుపత్రుల్లో అరకొర ఇన్సులిన్ ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్సతో పాటు ఇన్సులిన్ను ఉచితంగా అందించాల్సి ఉంది. అయితే గత 10 నెలలుగా వీరికి అరకొరగా ఇన్సులిన్ ఇస్తున్నారు. కేవలం కర్నూలు, నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలల్లో మాత్రమే అధికారులు స్థానికంగా కొనుగోలు చేసి ఇన్సులిన్ను కొద్దిమొత్తంలో అందజేస్తున్నారు. ఏరియా ఆసుపత్రులు, సీహెచ్సీలు, పీహెచ్సీల్లో ఇన్సులిన్ అందుబాటులో ఉండటం లేదు. దీంతో చాలా మంది మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో చిన్నారికి వ్యాధి తీవ్రతను బట్టి నెలకు రెండు నుంచి నాలుగు ఇన్సులిన్ ఇంజెక్షన్లు అవసరం. పెరుగుతున్న చికిత్స వ్యయం మెడికల్షాపుల్లో ఒక్కో ఇన్సులిన్ ఖరీదు రూ.180 వరకు ఉంటోంది. ఈ మేరకు ప్రతి చిన్నారికి నెలకు రూ.600 నుంచి రూ.800 వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రులతో పాటు ప్రైవేటు క్లినిక్లు, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యుల వద్ద చికిత్స తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఆధునిక వైద్యవిధానాల మేరకు వారికి నొప్పి తక్కువగా ఉండే ఇన్సులిన్ పెన్నుల ద్వారా ఇంజెక్షన్ చేస్తున్నారు. వీటి ఖరీదు సాధారణ ఇన్సులిన్తో పోలిస్తే రెట్టింపుగా ఉంటుంది. లక్షణాలు టైప్–1 డయాబెటిస్ లక్షణాలు బయటపడటానికి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పట్టవచ్చు. విపరీతమైన దాహం, తిన్న తర్వాత కూడా బాగా ఆకలివేయడం, నోరు తడి ఆరిపోవడం. కడుపునొప్పి, వాంతులు, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లడం. ఊహించని విధంగా బరువు తగ్గిపోవడం, అలసట, కంటిచూపు తగ్గిపోవడం. శ్వాస తీసుకోవడానికి ఎక్కువ కష్టపడటం, తరచుగా చర్మ, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు. మూడ్ మారిపోవడం, నిద్రలో మూత్రవిసర్జన చేయడం. చిన్నారుల్లో ‘తియ్యని’ బాధ పుట్టుకతోనే తోడవుతున్న షుగర్ వ్యాధి కోవిడ్ తర్వాత పెరిగిన టైప్–1 రోగులు వంశపారంపర్యం, పలు రకాల ఇన్ఫెక్షన్లు కారణం ఇన్సులిన్ తీసుకోవడం తప్పనిసరి పెరిగిన చికిత్స వ్యయంతో సతమతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో 50లక్షల వరకు జనాభా ఉంటుంది. ఇందులో 15 నుంచి 20 శాతం వరకు మధుమేహ బాధితులు. వీరిలో టైప్–2 మధుమేహ బాధితులు 90 శాతం కాగా.. టైప్–1 బాధితులు 10 శాతం పైనే. ఈ లెక్కన 7.50లక్షల నుంచి 10లక్షల వరకు మధుమేహ బాధితులు ఉండగా.. 75వేల నుంచి లక్ష దాకా చిన్నారులు ఉంటున్నారు. -
రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్బాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను అందజేయవచ్చన్నారు. సోమవారం కలెక్టరేట్తో పాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. చేపల పెంపకంతో స్వయం ఉపాధి కర్నూలు(అగ్రికల్చర్): స్వయం ఉపాధిలో రాణించేందుకు చేపల పెంపకం చక్కటి అవకాశమని మత్స్యశాఖ కమిషనర్ రాంశంకర్నాయక్ తెలిపారు. శనివారం ఆయన కర్నూలు, సుంకేసుల డ్యామ్, గాజులదిన్నె ప్రాజెక్టుల్లో పర్యటించారు. కర్నూలు మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో 2024–25 సంవత్సరానికి సంబంధించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతిని సమీక్షించారు. జిల్లా ప్రగతిని జిల్లా మత్స్యశాఖ అధికారి శ్యామల కమిషనర్కు వివరించారు. కర్నూలు పాత బస్టాండు సమీపంలోని చేపల మార్కెట్ను తనిఖీ చేశారు. బంగారుపేటలోని దేశీయ మత్స్య శిక్షణా కేంద్రం(ఐఎఫ్టీసీ)లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నేడు మార్కెట్లో చేపలకు విశేషమైన డిమాండ్ ఉందని, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద చేపల మార్కెటింగ్కు అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పొదుపు మహిళల అనుసంధానంతో చేపల ఉత్పత్తిని పెంచడం, వినియోగాన్ని విస్తృతం చేయనున్నట్లుగా పేర్కొన్నారు. బోధనలో ఇంటి వాతావరణం కల్పించాలి కల్లూరు: పాఠశాలలు, కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లోని విద్యార్థులకు ఇంటి వాతావరణంలో ఉన్నట్లుగా బోధన చేయాలని డీఈఓ శామ్యూల్పాల్ సూచించారు. శనివారం కల్లూరు మండలం పెద్దపాడు ఏపీ మోడల్ స్కూల్లో సమగ్ర శిక్ష ద్వారా కేజీబీవీ ప్రిన్సిపాళ్లకు, ఎన్ఎమ్లు, పీఈటీలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడి, మానసిక ఆందోళనకు గురి కాకుండా ఉపాధ్యాయులు సూచనలివ్వాలన్నారు. కార్యక్రమంలో సమగ్ర ఏపీసీ శ్రీనివాసులు, జీసీడీఓ స్నేహలత పాల్గొన్నారు. రైతుల ఆశలపై కూటమి ప్రభుత్వం నీళ్లు పత్తికొండ రూరల్: టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న రైతుల ఆశలపై కూటమి ప్రభుత్వం నీళ్లు చల్లిందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.రామచంద్రయ్య ఆరోపించారు. శనివారం స్థానిక చదువుల రామయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ను ఇక్కడి పాలకుల ఉదాసీన వైఖరి వల్ల టమాటా ప్రాసెసింగ్ యూనిట్గా మార్చారన్నారు. ప్రాసెసింగ్ యూనిట్ను వ్యాపార దృక్పథంతోగాకుండా రైతుల ప్రయోజనార్థం విస్తృతం చేసి, అందులో రైతులను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ మండల కార్యదర్శి రాజాసాహెబ్, ఏపీ రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి సురేంద్రకుమార్, పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, ఉమాపతి, కారన్న, నెట్టికంటయ్య పాల్గొన్నారు. -
నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం
ఈ నెల 16వ తేదీన (ఆదివారం) జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి తెలిపారు. జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన ఉదయం 9.30 గంటలకు స్థానిక మినీ సమావేశ భవనంలో 1వ స్థాయి సంఘ సమావేశాలను నిర్వహించనున్నామన్నారు. అనంతరం 10.30 గంటలకు స్థానిక జెడ్పీ సమావేశ భవనంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా అజెండాలో పొందుపరిచిన గ్రామీణ నీటి సరఫరా – పారిశుద్ధ్యం, వ్యవసాయం, జలవనరుల శాఖలకు సంబంధించి సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. -
జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిద్దాం
కర్నూలు(సెంట్రల్): జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిద్దామని జిల్లా ఇన్చార్జ్ ఆఫీసర్.. రహదారులు, భవనాలు, రవాణా శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ కాంతిలాల్ దండే సూచించారు. సమర్థవంతమైన పరిపాలనను అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులను జిల్లా ఇన్చార్జ్ ఆఫీసర్లుగా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి ఐఏఎస్ అధికారులను జోనల్ ఇన్చార్జ్ ఆఫీసర్లుగా నియమించింది. అందులో భాగంగా కర్నూలు జిల్లా ఇన్చార్జ్ అధికారిగా నియమితులైన రహదారులు, భవనాలు, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే శనివారం కర్నూలు వచ్చారు. ఆయన కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పథకాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో పేదరిక నిర్మూలన, ఎంఎస్ఎంఈల ఏర్పాటు, విద్య, వైద్య రంగాల అంశాలపై దృష్టి సారిస్తామన్నారు. అనంతరం జిల్లాలో అమలవుతున్న కార్యక్రమాపై కలెక్టర్.. ప్రిన్సిపల్ సెక్రటరీకి వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఆర్వో వెంకట నారాయణమ్మ, సీపీఓ హిమ ప్రభాకరరాజు పాల్గొన్నారు. ఆర్అండ్బీ అధికారులతో.. జిల్లా ఇన్చార్జ్ ఆఫీసర్ కాంతిలాల్ దండే ఆర్అండ్బీ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జిల్లాలో ముఖ్యమైన రోడ్ల నిర్మాణాలు అవసరం ఉంటే ప్రతిపాదనలు పంపాలని, మిషన్ పాట్ హోల్ కింద పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్ఈ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. వాహనాల రిజిస్ట్రేన్లను పెండింగ్లో లేకుండా చూసుకోవాలని, ఎన్ఫోర్స్మెంట్, రిజిస్ట్రేషన్ అంశాలపై నివేదిక ఇవ్వాలని ఆయన డీటీసీ శాంతికుమారికి సూచించారు. జిల్లా ఇన్చార్జ్ ఆఫీసర్ సెక్రటరీ కాంతిలాల్ దండే -
ఇది కల్తీ ప్రపంచం
● నాణ్యతా లోపాలపై అవగాహన తప్పనిసరి ● బిల్లు తీసుకుంటేనే రక్షణ ● నేరుగా లేదా ఆన్లైన్లో ఫిర్యాదుకు అవకాశం ● రూ.5లక్షల్లోపు కేసులకు ఫీజు లేకుండానే న్యాయం ఆహార కల్తీపై కేసులు సంవత్సరం : 2024-25సేకరించిన శాంపిల్స్ : 510కల్తీ నిర్ధారణ : 38 కేసులు : 9జరిమానా : రూ.2.10లక్షలుఅవగాహన కల్పించేందుకు చర్యలు -
నాటుసారా నిర్మూలనే నవోదయం 2.0 లక్ష్యం
కర్నూలు: నాటుసారా నిర్మూలనే నవోదయం 2.0 లక్ష్యమని కర్నూలు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు అన్నారు. జిల్లాలో 110 నాటుసారా ప్రభావిత గ్రామాలు ఉండగా.. ఆయా గ్రామాల్లో నాటుసారా నిర్మూలనలో ప్రజలను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో ఎకై ్సజ్ శాఖ ప్రచార రథాన్ని ప్రారంభించింది. స్థానిక కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సుధీర్ బాబు ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. సారా వినియోగం వల్ల కలిగే అనర్థాలు, మానుకుంటే కలిగే ప్రయోజనాలను వివరిస్తూ గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ప్రచార రథాన్ని ప్రారంభించినట్లు సుధీర్ బాబు తెలిపారు. కర్నూలు పట్టణంలోని సారా ప్రభావిత ప్రాంతాలైన బంగారుపేట, బుధవారపేటలో సాయంత్రం ప్రచార రథం కలియతిరిగింది. కార్యక్రమంలో ఏఈఎస్లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణారెడ్డి, సీఐలు చంద్రహాస్, జయరాం నాయుడు, రాజేంద్రప్రసాద్, ఎస్ఐ దుర్గానవీన్ బాబు, ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు. ● ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు -
అండగా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్
వస్తు సేవల్లో నాణ్యత లోపించినా.. కల్తీ ఆహార పదార్థాలను విక్రయించినా.. బీమా, బ్యాంకులు మోసానికి పాల్పడినా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అండగా ఉంటుంది. జిల్లా స్థాయిలో రూ.5 లక్షల వరకు మోసాలకు ఎలాంటి కోర్టు ఫీజు చెల్లించకుండానే వినియోగదారుడు తగిన పరిహారం పొందవచ్చు. న్యాయవాది అవసరం లేకుండానే పోరాటం చేయవచ్చు. రూ.5 లక్షల పైన వివాదాలకు కోర్టు ఫీజులతో పాటు న్యాయవాదులను నియమించుకునే అవకాశం ఉంది. జిల్లా కమిషన్ గత మూడ్లేలో 635 కేసులను పరిష్కరించగా.. రూ.15 కోట్లను పరిహారంగా వినియోగదారులకు అందించింది. ప్రస్తుతం 119 కేసులు పెండింగ్లో ఉన్నాయి. నిర్భయంగా ఫిర్యాదు చేయాలి వినియోగదారుల హక్కులు కాపాడడం మా ప్రథమ కర్తవ్యం. మోసపోయిన వారు కమిషన్ను ఆశ్రయిస్తే తగిన న్యాయం చేస్తాం. రూ.5 లక్షల వరకు ఎలాంటి ఫీజు ఉండదు. ఆన్లైన్లోనూ ఫిర్యాదు తీసుకుంటాం. మార్టులు, మాల్స్లో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేస్తే పరిష్కారానికి కమిషన్ సిద్ధంగా ఉంటుంది. – కరణం కిశోర్, చైర్మన్, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ -
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
కర్నూలు: నగరంలోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కల్లూరు మండలం దేవేంద్ర నగర్లో నివాసముంటున్న అనురాధ, సుదర్శన్ యాదవ్ దంపతులకు ఇద్దరు కూతుర్లు, కొడుకు సంతానం. చిన్నకూతురు సుప్రియ (19) కర్నూలుకు చెందిన కరీంను ప్రేమించింది. ఈ విషయం తెలిసి ఆమె తండ్రి మదనపడుతుండేవాడు. చివరకు పెళ్లికి అంగీకరించినప్పటికీ తన ప్రేమ విషయంలో తండ్రి మదన పడుతున్న విషయాన్ని గ్రహించి సుప్రియ తీవ్ర మనస్తాంతో ఈనెల 8వ తేదీన పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయింది. కుటుంబ సభ్యులు గుర్తించి ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందింది. ఈ మేరకు మృతురాలి తల్లి అనురాధ నాల్గవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నిర్లక్ష్యానికి మందేది?
● విధి నిర్వహణలో అధికారి వేళాకోలం గోస్పాడు: నంద్యాల జిల్లా ఔషధ నియంత్రణ అధికారి బాబా ఖలందర్ విధులకు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్తారో తెలియక ఎంతో మంది అవస్థలు పడుతున్నారు. తనిఖీలు, ఉన్నతాధికారుల సమావేశాలు.. అంటూ విధుల్లో సమయపాలన పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కార్యాలయానికి తరచూ మెడికల్ షాపుల నిర్వాహకులు వారి అవసరాల నిమిత్తం వస్తుంటారు. అయితే కార్యాలయంలో సిబ్బంది అటెండర్, కంప్యూటర్ ఆపరేటర్ మాత్రమే విధుల్లో కనిపిస్తారు. రిలీవింగ్ సర్టిఫికెట్ కోసం, ఇప్పటికే ఉన్న మెడికల్ షాపులను ఒకచోటి నుంచి మరొక చోటకు మార్పు కోసం, కొత్తగా షాపు పర్మిషన్ కోసం రోజుల తరబడి తిరగాల్సి వస్తుందని అక్కడికి వచ్చే వారు ఆవేదన చెందుతున్నారు. కింది స్థాయి సిబ్బందిని అడిగితే పనుల నిమిత్తం పెద్దసారు బయటకు వెళ్లారని, సార్ ఎప్పు డు వస్తారు తెలియదని చెబుతుండటం గమనార్హం. జిల్లా కేంద్రంలో ఓ అధికారి విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
పాణ్యం: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. గురువారం పాణ్యం సీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్ల నైట్ డ్యూటీ రోస్టర్ పట్టికను తనిఖీ చేశారు. ప్రతి నెలకు ఎన్ని కాన్పులు చేస్తున్నారని వైద్యులను ప్రశ్నించి సిజేరియన్ కాన్పులు అధికంగా జరుగుతుండడంతో కారణాలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో నలుగురు డాక్టర్లు ఉండగా అనస్తీయా డాక్టర్ మునిస్వామి మాత్రమే విధుల్లో ఉండగా మిగిలిన వారు ఎక్కడని ప్రశ్నించగా, ఒకరు నైట్ డ్యూటీ, మరొకరు ట్రైనింగ్ వెళ్లారని బదులిచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. అనంతరం పాణ్యం ఆర్టీసీ బస్టాండ్ను పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఎంఎస్ఎం భవనం కోసం ఎకరా, ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నాగులు ఎకరాల భూమికి సంబంధించి ప్రతిపానదలు త్వరగా పంపాలని తహసీల్దార్ నరేంద్రనాథ్రెడ్డిని ఆదేశించారు. చెంచుకాలనీలో గృహనిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీఓ ప్రవీణ్కుమార్ను ఆదేశించారు. కలెక్టర్ రాజకుమారి -
పంచాయతీ కార్యదర్శిపై కేసు నమోదు
శిరివెళ్ల: యర్రగుంట్ల 2వ గ్రామ సచివాలయ గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శి సురేష్బాబుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిన్న పీరయ్య గురువారం తెలిపారు. గతంలో కార్యదర్శి సామాజిక పింఛన పంపిణీ అనంతరం మిగిలిన రూ. 8.48 లక్షలను తిరిగి ఏంపీడీఓ కార్యాలయానికి అప్పగించలేదు. పింఛన్ల డబ్బులు చెల్లించక పోవడంపై ఎంపీడీఓ శివమల్లేశ్వరప్ప ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇద్దరు నిందితులకు జైలు శిక్ష నంద్యాల (వ్యవసాయం): హత్యాయత్నం, దాడి కేసులో ఇద్దరు నిందితులకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి రాధారాణి గురువారం తీర్పునిచ్చారు. పాణ్యం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బేతంచెర్ల గ్రామానికి చెందిన సందొలి అంజి, మాదిగ హరినాథ్లో ఒకరు పాణ్యం మండలం తమ్మరాజుపల్లికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుని తరచూ వచ్చేవాడు. ఈ క్రమంలో మహిళ అత్త శివమ్మ గుర్తించి హెచ్చరించింది. అయితే నిందితులిద్దరూ 2017 ఏప్రిల్లో శివమ్మపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో నిందితులకు ఒక్కొక్కరికి ఏడేళ్లు జైలు శిక్ష, రూ.11 వేలు జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. కారు బోల్తా చాగలమర్రి: కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై నగళ్లపాడు గ్రామం వద్ద గురువారం తెల్లవారుజామున కారు అదుపు తప్పి వాగులో బోల్తా పడింది. బనగానపల్లెకు చెందిన నలుగురు వ్యక్తులు తిరుమలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నగళ్లపాడు వద్ద కారు అదుపు తప్పి భవనాసి వాగులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న రాజారెడ్డి, హర్షకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు స్వల్పంగా గాయ పడ్డారు. క్షతగాత్రులను టోల్ ప్లాజా సిబ్బంది ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.చాగలమర్రి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. 8 నెలలుగా గైర్హాజరు ● ఉపాధ్యాయుడికి నోటీసులు జారీ చేసిన ఎంఈఓలు హొళగుంద: హొన్నూరు ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు శివశంకర్రెడ్డి ఎనిమిది నెలలుగా విధులకు హాజరు కావడం లేదు. ఉపాధ్యాయుడిపై శాఖాపరమైన చర్యలకు డీఈఓ దృష్టికి తీసుకెళ్లి నోటీసులు జారీ చేసినట్లు ఎంఈఓ–1, 2 సత్యనారాయణ, జగన్నాధం గురువారం విలేకరులకు తెలిపారు. కడపకు చెందిన శివశంకర్రెడ్డి 2023లో విధుల్లో చేరారని, 2024 జూలై 5వ తేదీ నుంచి గైర్హాజరవుతున్నారన్నారు. షోకాజ్ నోటీసులు, మెమోలు పోస్ట్ ద్వారా ఆయన ఇంటికి పంపినా ఎలాంటి సమాధానం రాలేదని తెలిపారు. విద్యాశాఖాధికారులకు నివేదిక చేయని పక్షంలో ప్రభుత్వ నియామవళి ప్రకారంగా శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఎంఈఓలు చెప్పారు. -
మహానందిలో వైభవంగా పదహారు రోజుల పండుగ
మహానంది: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం మహానందిలో గురువారం పదహారు రోజుల పండుగను వైభవంగా నిర్వహించారు. ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్రెడ్డి, దేవికల ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, నాగేశ్వరశర్మ, హనుమంతుశర్మ, శాంతారాంభట్, అర్చకులు జనార్ధన్, మహేశ్వరయ్య ముందుగా యాగశాలలో అంకురాలకు విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవాల తొలిరోజు పుట్టమన్ను తెచ్చి పాలల్లో తడిపిన నవ ధాన్యాలతో చేసిన అంకురార్పణలో వచ్చిన మొలకలను రుద్రగుండం కోనేరులో శాసీ్త్రయంగా కలిపారు. ఈ ఏడాది మొలకలు బాగా వచ్చాయని, పంటలు బాగా పండుతాయని పండితులు చెప్పా రు. అనంతరం రథం వద్దకు చేరుకుని రథాంగ దేవతలను పూజించి వారిని స్వస్థానాలకు పంపి రథాన్ని రథమండపంలోకి చేర్చారు. దీంతో శ్రీ కామేశ్వరీదేవి, మహానందీశ్వరుల కళ్యాణ, బ్రహ్మోత్సవ దీక్ష ముగిసిందని వేదపండితులు రవిశంకర అవధాని తెలిపారు. మహానంది, నంద్యాల ప్రాంతాలకు చెందిన ఆర్యవైశ్య మహిళలు శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి వారి దంపతులకు వడిబియ్యం(చీర,సారె) సమర్పించి పూజలు చేశారు. -
ఎమ్మెల్యే చెప్పారని రూ.కోటి స్థలం ధారాదత్తం
డోన్: ప్రజోపకరమైన ప్రభుత్వ స్థలాలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా ధారాదత్తం చేస్తున్నారు. డోన్ మున్సిపల్ పరిధిలోని కేవీఎస్ పార్కు ఆవరణలో ఐదు సెంట్ల స్థలాన్ని గత ఏడాది పిరమిడ్ ధ్యానకేంద్రం నిర్మాణానికి కేటాయిస్తున్నట్లు కౌన్సిల్ తీర్మానం చేసింది. అయితే ఆ స్థలాన్ని కాదని కొత్తపేటలోని అన్న క్యాంటీన్తో పాటు ఓవర్హెడ్ ట్యాంకు ఉన్న సర్వే నంబర్ 281లో పిరమిడ్ ధ్యానకేంద్రం నిర్వాహకులు వారంరోజుల క్రితం ధ్యానకేంద్రం నిర్మాణానికి ఏకంగా భూమిపూజ చేశారు. దీంతో మున్సిపల్ చైర్మన్తో పాటు కౌన్సిల్ సభ్యులు ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. కేవలం ఎమ్మెల్యే మౌఖికంగా చెప్పారని కమిషనర్ ఏకపక్ష నిర్ణయంతో ప్రజోపకరమైన స్థలాలను ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు కట్టబెట్టడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎవరికి వారు కౌన్సిల్ ఆమోదం లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కోటి రూపాయల విలువైన స్థలాన్ని ప్రైవేటు సంస్థకు ఽఅప్పగించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ధార్మిక సంస్థకు పట్టణంలో ఏ మూలకై నా స్థలం కొనుగోలు చేసే శక్తి ఉండగా.. ప్రజలకు ఉపయోగపడే స్థలాన్ని ఉచితంగా కేటాయించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న తలెత్తుతోంది. ఎమ్మెల్యే చెబితే నిర్మించుకోమన్నాం 281 సర్వే నంబర్లోని అన్న క్యాంటీన్ వద్ద పిరమిడ్ ధ్యానకేంద్రాన్ని అనధికారికంగా నిర్మించుకోమన్నాం. గత కౌన్సిల్లో పిరమిడ్ ధ్యాన కేంద్రానికి కేవీఎస్ పార్కులో స్థలం కేటాయించిన విషయం నాకు తెలియదు. స్థానిక ఎమ్మెల్యే సూచన మేరకే నిర్ణయం తీసుకున్నాం. – ప్రసాద్గౌడ్, మున్సిపల్ కమిషనర్, డోన్పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్మాణానికి కేటాయింపు గతంలో కేవీఎస్ పార్కులో స్థలం కేటాయింపునకు కౌన్సిల్ ఆమోదం ప్రస్తుతం అన్న క్యాంటీన్ వద్ద అనుమతులు ప్రజోపకరమైన స్థలాలను ప్రైవేటు సంస్థలకు కేటాయించడం పట్ల ప్రజల ఆగ్రహం -
ఎమ్మెల్యే దళితుడని.. ఎంపీ మహిళని!
● ప్రజాప్రతినిధులను కాదని టీడీపీ నాయకుడితో ప్రారంభోత్సవాలు ● ప్రొటోకాల్ ఉల్లంఘించిన టీడీపీ నంద్యాల పార్లమెంటరీ ఇన్చార్జి నందికొట్కూరు: పట్టణంలో ప్రొటోకాల్ పాటించకుండా టీడీపీ నంద్యాల పార్లమెంటరీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి గురువారం అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో సుమారు రూ.7 లక్షలతో విద్యుత్ ట్రాన్ఫార్మర్ నిర్మించారు. అక్కడే ముఖద్వారం కూడా నిర్మించారు. ఆ రెండింటినీ శివానందరెడ్డి ప్రారంభించి, శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే గిత్తా జయసూర్య దళితుడు కావడం, ఎంపీ బైరెడ్డి శబరి మహిళా కావడం, మున్సిపల్ చైర్మన్ సుధాకర్రెడ్డి ఎంపీ వర్గానికి చెందిన వారు కావడంతో అంతా తానై శివానందరెడ్డి ప్రారంభోత్సవాలు చేయడం గమనార్హం. విద్యుత్ శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే, ఎంపీ, మున్సిపల్ చైర్మన్ పట్ల ఏమాత్రం గౌరవం ఉందో ఈ ఘటన అద్దం పడుతోందని స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. -
రాష్ట్రంలోని టీడీపీ నేతలు కపట రాజకీయాలు చేస్తున్నారు. ఇందుకు టమాట ప్రాసెసింగ్ యూనిట్ను వాడుకుంటున్నారు. వైఎస్సార్సీపీ హయాంలోనే ఈ పరిశ్రమకు ఊపిరి వచ్చింది. పనులు కూడా చకచకా సాగుతున్నాయి. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి అంతా మారిపోయింది. అ‘ధనం’
మార్కెట్లో ధర లేక నిల్వ ఉన్న టమాట (ఫైల్)● దురుద్దేశంతో దూదెకొండకు టమాట ప్రాసెసింగ్ యూనిట్ మార్పు ● మాజీ సీఎం వైఎస్ జగన్కు మంచి పేరు రాకుండా ఉండాలన్నదే ఉద్దేశం ● వైఎస్సార్సీపీ హయాంలోనే టమాట ప్రాసెసింగ్ యూనిట్కు శ్రీకారం ● రూ.15 లక్షలు ఖర్చు చేసి పిల్లర్లు కూడా ఏర్పాటు ● ప్రభుత్వం మారడంతో ముడుపుల కోసం టీడీపీ నేతల ఒత్తిళ్లు ● తట్టుకోలేక పారిపోయిన కాంట్రాక్టర్ టమాట ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు వైఎస్సార్సీపీ హయాంలోనే పనులు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టీడీపీ నేతలు ముడుపుల కోసం కాంట్రాక్టర్ను ముప్పు తిప్పలు పెట్టారు. దీంతో ఉక్కిరిబిక్కిరైన కాంట్రాక్టర్ పనులను నిలిపివేశారు. దీంతో పిల్లర్లకు కట్టిన కడ్డీలు కట్ చేసుకోవడంతో పాటు సిమెంటు ఇతర మెటీరియల్ మొత్తం తరలించుకుపోయారు. హోసూరులో కేటాయించిన భూమిపై లేని వివాదాన్ని టీడీపీ నేతలు సృష్టించారు. అక్కడే ప్రాసెసింగ్ యూనిట్ పెడితే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పేరు వస్తుందనే ఉద్దేశంతో స్థలాన్ని దూదెకొండ ప్రాంతానికి మార్పు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మరుగున పడిపోయాయి. కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వైఎస్సార్సీపీ హయాంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఉల్లి, టమాట సోలార్ డ్రైయర్లు నిర్వహించే పొదుపు మహిళలను నిర్లక్ష్యం చేశారు. దీంతో వారు అప్పుల ఊబిలో కూరకుపోయారు. చివరికి సోలార్ డ్రైయర్లను సరఫరా చేసిన ఎస్4ఎస్ సంస్థ వాటిని వెనక్కి తీసుకెళ్లింది. ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటును పట్టించుకోని కూటమి ప్రభుత్వం నేడు టమాట ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు భూమి పూజ అంటూ హడావుడి చేస్తోంది. పత్తికొండ మండలం దూదేకొండ గ్రామంలోని సర్వే నెంబర్ 63/3లోని 2.50 ఎకరాల్లో టమాట ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఈ నెల 5న జీవో జారీ అయ్యింది. ఈ నెల 14న భూమి పూజ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేటాయించిన నిధులతోనే టమాట ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. కర్నూలు(అగ్రికల్చర్): టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ఉమ్మడి రాష్ట్రానికి 9 ఏళ్లు, విభజన తర్వాత ఏర్పాటైన రాష్ట్రానికి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అ 14 ఏళ్లలో ఏ నాడు కూడా జిల్లాలో టమాట ప్రాసెసెంగ్ యూనిట్ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేయలేదు. రైతుల కష్టాలు, కన్నీళ్ల గురించి పట్టించుకోలేదు. పత్తికొండ ప్రాంతంలో టమాట జ్యూస్ ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన మాటను సైతం చంద్రబాబు మరచిపోయారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పత్తికొండలో టమాట ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. ఈ పరిశ్రమ పూర్తయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పేరు వస్తుందనే భయంతో ప్లేటు మార్చారు. హడావుడిగా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు జీవో ఇచ్చారు. కర్నూలు ఎమ్మెల్యే, పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ టమాట ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు శుక్రవారం భూమి పూజ చేయనున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పట్టించుకోని కూటమి ప్రభుత్వం హడావుడిగా భూమి పూజ కార్యక్రమం చేపట్టడంపై రైతులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో పనులు ఇలా.. టమాట ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు ప్రక్రియ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే మొదలైంది. అప్పట్లో పత్తికొండ సమీపంలోని హోసూరు గ్రామం సర్వే నంబరు 286/1ఏ3, 286/1ఏ4, 286/1ఏ5ల్లోని 3.60 ఎకరాల భూమిని కేటాయించారు. రూ.12.05 కోట్ల నిధులతో బిల్డింగ్ నిర్మాణంతోపాటు మిషనరీలు ఏర్పాటు చేసే విధంగా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నిర్మాణపు పనులు కూడా మొదలై చురుగ్గా జరిగే స్థాయికి వచ్చాయి. దాదాపు రూ.15 లక్షలు ఖర్చు చేసి పిల్లర్స్ కూడా వేశారు. అయితే గత ఏడాది మే నెలలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ గెలిచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతోనే సమీకృత టమాట ప్రాసెసింగ్ యూనిట్ గ్రహణం పట్టినట్లు అయింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల దుస్థితి ఇదీ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఉల్లి, టమాట రైతుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున సోలార్ డ్రైయర్లు ఏర్పాటయ్యాయి. మహిళలు వాటిని సద్వినియోగం చేసుకొని రాణించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పట్టించుకునే దిక్కులేక దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. అప్పట్లో కల్లూరు, గూడూరు, గోనెగండ్ల తదితర మండలాల్లో 322 సోలార్ డ్రైయర్ల యూనిట్లు ఏర్పాటు చేశారు. ఇవి 2024 మే నెల వరకు ఇవి పనిచేశాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రోత్సాహం లేక మూలనపడ్డాయి. సోలార్ డ్రైయర్లను ఎస్4ఎస్ సంస్థ వెనక్కి తీసుకెళ్లింది. రైతులు నమ్మరు రాష్ట్ర ప్రభుత్వం టమాట రైతులను ఎప్పుడూ పట్టించుకోలేదు. మార్కెట్లో టమాట ధర పడిపోయినప్పుడు కనీసం స్పందించలేదు. పొలాల్లోనే పంటలను వదిలేస్తున్నా అధికారులను పంపించలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన టమాట ప్రాసెసింగ్ యూనిట్కు ఆపేసి ఇప్పుడు హంగామా చేస్తున్నారు. అధికారంలో ఉన్న టీడీపీ నాయకులను రైతులు ఎవరూ నమ్మరు. వారు చెప్పే మాటలన్నీ బూటకమే అని అర్థమవుతోంది. – టి. శ్రీనివాసులు, హోసూరు, పత్తికొండ మండలం టమాట రైతుల దుస్థితి ఇదీ..రబీ సీజన్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1,700 ఎకరాల్లో టమాట పంట సాగైంది. కర్నూలు జిల్లాలో 1,250, నంద్యాల జిల్లాలో 450 ఎకరాల్లో టమాట పంట సాగు చేశారు. మార్కెట్లో క్వింటాకు కనిష్టంగా రూ.100 వరకు, గరిష్టంగా రూ.600 వరకు ధర లభించింది. కిలో రూ.4 నుంచి రూ.5 పలుకుతుండడంతో విధిలేని పరిస్థితిలో కర్నూలు మండలం పడిదెంపాడు, ఈ.తాండ్రపాడు, నందనపల్లె, పూడూరు, శివరామాపురం గ్రామాల్లో టమాట పంటను పశువులకు మేతగా వదిలేశారు. కృష్ణగిరి పెనుమాడ సమీపంలో పొలాలను ఇలాగే వదిలేశారు. పెట్టుబడి రాక నష్టం పోయినా ప్రభుత్వం సాయం కూడా అందించలేదని రైతులు ఆరోపించారు. ప్రస్తుత కుట్ర ఇదీ.. అంతా హడావుడి -
బీసీ రుణాలపై ‘పచ్చ’ గద్దలు
‘‘ ఎంపీడీఓ గారు ... బీసీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి నేను ఒక లిస్ట్ పంపుతున్నాను. మిగిలిన వాటన్నింటిని పక్కన పెట్టి ఈ లిస్ట్లో ఉన్న వాళ్లకి బీసీ కార్పొరేషన్ లోన్లు వచ్చేలా చూడు ! అవసరమైతే బ్యాంకర్లతో కూడా మాట్లాడు.. ఎలాగైనా మనవాళ్లకు రుణాలు అందే తీరాలి’’ అంటూ ఎంపీడీఓలను జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు ఆదేశిస్తున్నారు.● తాము పంపిన జాబితాలనే ఓకే చేయాలని హుకుం ● ఎంపీడీఓలను ఆదేశిస్తున్న ఎమ్మెల్యేలు ● టీడీపీ నేతల సిఫారసుతో అర్హులకు మొండిచెయ్యి ● జనరిక్ షాపులకు భలే డిమాండ్ ● జనాభాలో సింహభాగం ఉన్నా 4,201 యూనిట్లే! కర్నూలు (అర్బన్): బీసీ కార్పొరేషన్ రుణాలను తన్నుకుపోయేందుకు ‘పచ్చ’ నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తాము సిఫారసు చేసిన వారిని కాదని, ఏ ఒక్కరికీ రుణం మంజూరైనా పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రభుత్వం అందజేయనున్న సబ్సిడీ రుణాలపై టీడీపీ నేతల కన్ను పడింది. తమ వారికే అందించాలని అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. పేదలకు పారదర్శకంగా సబ్సిడీ రుణాలు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వేలాది మంది నిరుద్యోగులు ఈ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ... ఆయా మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో జరిగిన ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఇంతలో అందరి ఎంపీడీఓలకు ఎమ్మెల్యే కార్యాలయాల నుంచి లబ్ధిదారుల ఎంపిక జాబితాలను తామే పంపిస్తామని, మీరు ఎలాంటి ఎంపిక జాబితా తయారు చేయవద్దని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. దీంతో రాజకీయ సిఫారసు లేకుంటే అర్హత ఉన్నా, రుణం అందని పరిస్థితి నెలకొనింది. సిఫారసు ముందు పారదర్శకత అనే పదం మంటగలిసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధినేత బాటలోనే తమ్ముళ్ల ప్రయాణం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలోనే టీడీపీ నాయకులు కూడా ప్రయాణిస్తున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే వైఎస్సార్సీపీకి చెందిన వారికి ఏ పనులు చేయకండని చెప్పడంతో దాన్ని స్థానిక ఎమ్మెల్యేలు ‘ తుచ ’తప్పకుండా పాటిస్తున్నారు. రుణాల విషయంలో కూటమిలోనూ అధిక శాతం పోటీ నెలకొనడంతో జనసేన, బీజేపీ నేతలను పక్కనపెట్టి లబ్ధిదారుల ఎంపికలో టీడీపీ విధేయులకే పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ, ఈబీసీ, కాపు రుణాల్లో మితిమీరిన రాజకీయ జోక్యం చోటు చేసుకోవడంతో అర్హులకు రుణాలు అందని పరిస్థితి నెలకొనింది. జనరిక్ షాపులకు భలే డిమాండ్ జనరిక్ మందుల షాపుల ఏర్పాటుకు సంబంధించి 50 శాతం సబ్సిడీ ఉండడంతో చోటా నేతల దృష్టి అంతా ఈ రుణాలపై పడింది. తమ ప్రాంతంలో బీఫార్మసీ, ఎంఫార్మసీ పూర్తి చేసిన వారి చిరునామాలను గుర్తించి ఎలాగైనా మీకు రుణాలు ఇప్పిస్తామని నమ్మబలుకుతూ కమీషన్లు గుంజుతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో 62 జనరిక్ మెడికల్ షాపులను మంజూరు చేసింది. ఒక్కో షాపు ఏర్పాటుకు రూ.8 లక్షలు అవసరం కాగా, ఇందులో 50 శాతం అంటే రూ.4 లక్షలను సబ్సిడీ ఉన్న నేపథ్యంలో టీడీపీ నేతల చూపు వీటిపై పడింది. అలాగే అన్ని పథకాల ఏర్పాటుకు గరిష్టంగా రూ.2 లక్షలు సబ్సిడీ ఉన్నందున రుణాలను ఎలాగైనా తమ వారికి ఇప్పించుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. జనాభాలో సింహభాగం ఉన్నా ... ఉమ్మడి కర్నూలు జిల్లాలో సింహభాగం జనాభా బీసీ, ఈబీసీలు ఉన్నా, కేవలం 4201 యూనిట్లను మాత్రమే మంజూరు చేశారనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.77.19 కోట్ల రుణాలను అందించనున్నారు. ఇందులో కర్నూలు జిల్లాకు 1,673 మంది బీసీలకు, 171 మంది ఈబీసీలకు రూ.31.35 కోట్లు, నంద్యాల జిల్లాలో 2,156 మంది బీసీలు, 171 మంది ఈబీసీలకు రూ.45.84 కోట్లను అందించనున్నారు. అలాగే కాపు కార్పొరేషన్ ద్వారా కర్నూలు జిల్లాలో 190 యూనిట్లకు రూ.6.40 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.6.35 కోట్లతో 189 యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్వేచ్ఛ కోల్పోయిన అధికారులుగత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ‘నవరత్నాల ’ పేరుతో కులం, మతం, రాజకీయం చూడకుండా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందించిన అధికారులకు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో స్వేచ్చ లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, ఎంపీడీఓల పర్యవేక్షణలోనే లబ్దిదారుల ఎంపిక జరిగేది. ఎలాంటి రాజకీయ జోక్యం లేకపోవడం వల్ల అర్హులైన ప్రతి ఒక్కరికి అప్పట్లో సంక్షేమ పథకాలు అందాయని, ప్రస్తుతం తమ చేతులు కట్టేసి పనులు చేయమంటున్నారని పలువురు ఎంపీడీఓలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ముగిసిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సర ప్రధాన పరీక్షలు ముగిశాయి. గురువారం జరిగిన పరీక్షలకు 23,114 మంది విద్యార్థులకుగాను 22,479 మంది హాజరుకాగా.. 635 మంది గైర్హాజరు అయ్యారు. ఇంటర్మీడియెట్ పరీక్షలు చివరి దశకు చేరుకోవడంతో బోర్డు అధికారులు మూల్యాంకనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 17 నుంచి ప్రధాన సబ్జెక్టుల మూల్యాంకనం మొదలు కానుంది. రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యం కర్నూలు: రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా పోలీసులు చర్యలు చేపట్టారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగినా వెంటనే డయల్ 100 , 112కు ఫోన్ చేసి సమాచారమివ్వాలని తెలిపారు. రోడ్డు భద్రత నిబంధన ఉల్లంఘనలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. విజిబుల్ పోలీసింగ్ ద్వారా ప్రజల్లో భద్రతా భావం పెంపొందిస్తున్నామని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై నిరంతరం డ్రోన్ కెమెరాలతో నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు. సామరస్యంతో హోలీ జరుపుకోవాలి కర్నూలు: మతసామరస్యం పాటిస్తూ సంతోషకర వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలని జిల్లా ప్రజలకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పండుగ వేడుకల్లో ఎదుటి వారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించొద్దని సూచించారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు. మద్దతు ధరతో శనగల కొనుగోలు కర్నూలు(సెంట్రల్): మద్దతు ధరతో శనగల కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నట్లు జేసీ డాక్టర్ బి.నవ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతులు సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. క్వింటా శనగకు మద్దతు ధర రూ.5,650గా నిర్ణయించామన్నారు. జిల్లాలో 29వేల మంది రైతులు 1,04,43.25 ఎకరాల్లో శనగ సాగు చేసినట్లు పేర్కొన్నారు. లా సెమిస్టర్ ఫలితాల విడుదల కర్నూలు సిటీ: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో లా సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు వర్సిటీ పరీక్షల విభాగం సీఈ వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. థర్డ్, ఫిఫ్త్ ఇయర్స్ 2, 4, 6, 8, 10 సెమిస్టర్ల ఫలితాల కోసం https://rayalaseemauniversity.ac.in/ అనే వెబ్సైట్ను సందర్శించాలని పేర్కొన్నారు. హంద్రీ–నీవాకు నిలిచిపోయిన నీరు దేవనకొండ: హంద్రీ– నీవా కాలువకు అధికారులు నీటిని అర్ధాంతరంగా ఆపేశారు. మార్చి 15 వరకు నీటిని వదులుతారని అధికారులు ప్రకటించినా మార్చి 12వ తేదీనే నిలిపివేశారు. దీంతో పంట తుది దశకు చేరుకున్న రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. దేవనకొండ మండలంలో హంద్రీ–నీవా కాలువ కింద రబీలో 8 వేల ఎకరాల్లో వివిధ పంటలను సాగుచేశారు. మొత్తం 3 వేల ఎకరాల్లో పంటలు చివరి దశకు చేరుకోనున్నాయి. ఇంతలోనే కాలువకు నీరు బంద్ కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. -
రూ.210 కోట్లతో ‘పందికోన’ పనులు
● అధికారులు ప్రతిపాదనలు పంపాలి ● జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు (సెంట్రల్): పందికోన రిజర్వాయర్లో మిగిలిపోయిన పనులను పూర్తి చేసేందుకు రూ.210 కోట్లతో ప్రతిపాదనలను త్వరితగతిన ప్రభుత్వానికి పంపించాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. ఈ నిధులతో పనులు చేపడితే ఆయకట్టు విస్తీర్ణాన్ని పెంచవచ్చని తెలిపారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టుల పరిస్థితిపై జలవనరుల శాఖ అధికారులతో గురువారం జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సుంకేసుల జలాశయం, గాజులదిన్నె ప్రాజెక్టు, పందికోన రిజర్వాయర్, కృష్ణగిరి రిజర్వాయర్, హంద్రీనీవా విస్తరణ పనులు, పులికనుమ రిజర్వాయర్, 68 ట్యాంకులు నింపడం, గుండ్రేవుల రిజర్వాయర్ గురించి కలెక్టర్ జలవనరుల శాఖ అధికారులతో చర్చించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ .. హంద్రీ–నీవా విస్తరణ పనులను జూన్ లోపు పూర్తి చేయాలన్నారు. హంద్రీ–నీవా కాలువ ద్వారా 68 ట్యాంకులను నీరు నింపాల్సి ఉండగా ఇప్పటివరకు 33 చెరువులకు నింపారని, మిగిలిన ట్యాంకులను కూడా త్వరితగతిన నింపాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి సమస్యలు, అవసరమైన నిధుల వివరాలు అందజేయాలని జలవనరుల శాఖ ఏసీని ఆదేశించారు. డబ్బులిస్తేనే తుంగభద్ర దిగువ కాలువ చివరి ఆయకట్టు రైతులకు నీళ్లు ఇస్తామని పత్రికల్లో వచ్చిన వార్తలపై కలెక్టర్ వివరణ అడిగారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, జలవనరుల శాఖ ఎస్ఈ ద్వారకానాథ్ రెడ్డి, హంద్రీనీవా ఈఈ చంద్రశేఖర్రెడ్డి, ఈఈలు, డీఈలు శైలేష్, రామకృష్ణ, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చెమటలు పట్టిస్తున్న ఉష్ణోగ్రతలు
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మార్చి మొదటి పక్షంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. గురువారం కర్నూలులో 40.1 డిగ్రీలు, నంద్యాలలో 40.2 డిగ్రీలు నమోదు కావడం వేసవి తీవ్రతను స్పష్టం చేస్తోంది. 2024లో ఫిబ్రవరి చివరి నాటికే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎండలు, వడగాలుల నుంచి ఊరట కల్పించేందుకు కర్నూలులోని ప్రధాన కూడళ్లలో చలువ పందిళ్లు ఏర్పాటయ్యాయి. చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు నిర్వహించారు. ఈ సారి గత ఏడాది కంటే ముందుగానే ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. కర్నూలులో 40.1, నంద్యాలలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు -
గృహ నిర్మాణ లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయం
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: గృహ నిర్మాణ లబ్ధిదారులకు ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందజేస్తుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. గురువారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హౌసింగ్ ఇంజినీర్లు, సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వార్డ్ అమెనిటీ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ప్రతి లబ్ధిదారుని ఇంటింటికి వెళ్లి అదనపు ఆర్థిక సహాయం గురించి తెలియజేయాలని ఆదేశించారు. సర్వే సిబ్బంది సంబంధిత లాగిన్లో వివరాలు పొందుపరిచి లబ్ధిదారులతో జియో టాగింగ్ చేసి అప్ లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 కింద జిల్లాకు 21,711 గృహాలు మంజూరయ్యాయన్నారు. లబ్ధిదారులకు గతంలో ఒక యూనిట్కి రూ. 1.80 లక్షల రూపాయలు వచ్చేదన్నారు. వీటికి అదనంగా ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు రూ.50 వేలు, ఎస్టీ లబ్ధిదారులకు రూ. 75 వేలు, పీవీటీజీలకు లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారన్నారు. జిల్లాలో గృహాలు నిర్మించుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీల లబ్ధిదారులకు రూ. 114.24 కోట్ల అదనపు సాయం అందుతుందన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి 7,069 గృహాలు పూర్తిచేయాలని లక్ష్యంలో భాగంగా ప్రతి రోజు ప్రతి మండలంలో మూడు గృహాల చొప్పున లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ మేర పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పీఎం జన్మన్ కింద ఆత్మకూరు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, పాణ్యంలోని చెంచుగూడేలలో 527 గృహాలు నిర్మించాల్సి ఉందని అందుకు యూనిట్ విలువ 2.29 లక్షల రూపాయలకు అదనంగా మరో లక్ష రూపాయలు అదనపు సాయం అందుతుందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ ఈఈ శ్రీహరి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఎండలో ఎక్కువగా తిరగొద్దు ● డీఎంహెచ్ఓ డాక్టర్ పి.శాంతికళ కర్నూలు (హాస్పిటల్): వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఎండల్లో ఎక్కువ తిరగరాదని డీఎంహెచ్ఓ డాక్టర్ పి.శాంతికళ గురువారం ఒక ప్రకటనలో సూచించారు. ప్రజలు ఉదయం 11 గంటల లోపు తమ పనులు ముగించుకుని నీడ గల ప్రదేశాల్లో ఉండాలని తెలిపారు. ఎండలో తప్పరిసరిగా తిరగాల్సి వస్తే గొడుగు, టోపీ ధరించాలన్నారు. వెంట నీళ్ల బాటిల్ ఉంచుకుని గంటగంటకూ తాగుతూ ఉండాలని సూచించారు. వడదెబ్బకు గురైన వ్యక్తిని దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వైద్యసహాయం అందేలా చూడాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అన్ని సచివాలయాలు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు, ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు తరచూ పరిశుభ్రమైన నీటిని తాగాలన్నారు. -
మూత్ర సమస్యలుంటే నిర్లక్ష్యం చేయొద్దు
చాలా మంది మూత్రసమస్యలను నిర్లక్ష్యం చేస్తుంటారు. కొన్నిసార్లు అవి సాధారణమే అయినా ఒక్కోసారి అది ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్య గా మారుతుంది. ముఖం ఉబ్బరం, మూత్రంపోయినప్పుడు చురుకు, మంట, ఎరుపు రంగు లో మూత్రం రావడం, మూత్రం సరిగ్గా రాకపోవడం, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం, చిన్న వయస్సులోనే రక్తపోటు లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. –డాక్టర్ పీఎల్. వెంకట పక్కిరెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, నెఫ్రాలజి విభాగం, జీజీహెచ్, కర్నూలు నేడు వైద్యవిజ్ఞాన సదస్సు అంతర్జాతీయ కిడ్నీ దినో త్సవాన్ని పురస్కరించుకు ని నేడు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఓల్డ్ క్లినికల్ లెక్చర్ గ్యాలరీలో వైద్యవిజ్ఞాన సదస్సు నిర్వహించనున్నాము. లూపస్ నెఫ్రైటిస్ కరెంట్ ట్రీట్మెంట్ అండ్ వే ఫార్వర్డ్ అనే అంశంపై హైదరాబాద్కు చెందిన సీనియర్ నెఫ్రాలజిస్టు డాక్టర్ ఎ. శశికిరన్ ప్రసంగిస్తారు. ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు ప్రారంభిస్తారు. –డాక్టర్ ఎస్. అనంత్, ఇన్చార్జ్ హెచ్ఓడీ, నెఫ్రాలజి విభాగం, జీజీహెచ్, కర్నూలు ● -
24 గంటల్లో భవన నిర్మాణాలకు అనుమతులు
● టౌన్ ప్లానింగ్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ విజయభాస్కర్ కర్నూలు (టౌన్): పట్టణాల్లో భవనాల అనుమతులకు సంబంధించి 24 గంటల వ్యవధిలో అనుమతులు మంజూరు చేస్తున్నట్లు టౌన్ ప్లానింగ్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ విజయభాస్కర్ అన్నారు. బుధవారం స్థానిక నగర పాలక సంస్థ నూతన కౌన్సిల్ హాలులో జిల్లాలోని మున్సిపాల్టీల పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు, లైసెన్సు ఇంజినీర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ భవన నిర్మాణాలకు అనుమతుల్లో జాప్యాన్ని నిరోధిస్తూ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. దీని ప్రకారం దరఖాస్తును పోర్టల్లో అప్లోడ్ చేసిన గంటల వ్యవధిలోనే అనుమతులు పొంది పనులు ప్రారంభించవచ్చన్నారు. అక్యుపెన్సీ సర్టిఫికెట్ సైతం పొందవచ్చని చెప్పారు. అయితే, నిర్మాణానికి సర్వే రిపోర్టు, స్థలం విలువ ఆధారిత సర్టిఫికెట్ తప్పనిసరిగా పొందుపరచాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఆకస్మిక తనిఖీల్లో అనుమతులను రద్దు చేస్తామన్నారు. టెక్నికల్ పర్సన్లు తప్పులు చేస్తే వారి లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్ ప్రదీప్కుమార్, డిప్యూటీ సిటీ ప్లానర్ శోభన్ బాబు, డీటీసీపీ శశిలత, నంద్యాల అసిస్టెంట్ సిటీ ప్లానర్ మూర్తి, టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది, వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ అధికారులు ఎల్టీపీలు పాల్గొన్నారు. -
ఉల్లి రైతు కంట కన్నీరు!
మార్కెట్లో వ్యాపారుల ఇష్టారాజ్యం ● కొన్ని లాట్లకు ధర కోట్ చేయని వైనం ● నాణ్యత సాకుగా చూపి అన్యాయం ● విధిలేక ఎంతోకొంతకు అమ్ముకుంటున్న రైతులు మార్కెట్లో రైతులకు తీరని అన్యాయం ఎకరాకు రూ.30 వేల వరకు ఖర్చు పెట్టి ఉల్లి సాగు చేశాం. 60 ప్యాకెట్ల దిగుబడి వచ్చింది. ఎంతో వ్యయ ప్రయాసలతో కర్నూలు మార్కెట్కు తీసుకొచ్చి మంగళవారం టెండరుకు పెట్టాం. ఉల్లి నాణ్యత సంతృప్తికరంగానేనే ఉంది. కానీ వ్యాపారులు టెండరు వేయలేదు. అలాగని సరుకును వెనక్కు తీసుకుపోలేం. మార్కెట్లో రైతులకు తీరని అన్యాయం జరుగుతోంది. ఏదో ఒక ధరకు అమ్ముకుపోయే పరిస్థితి కల్పిస్తున్నారు. – సుంకులమ్మ, చిట్యాల గ్రామం, క్రిష్ణగిరి మండలం మూడు రోజులైనా కొనే దిక్కులేదు ఈ నెల 9న రాత్రి 100 ప్యాకెట్ల ఉల్లిని కర్నూలు మార్కెట్కు తీసుకొచ్చాం. నాణ్య త కూడా బాగుంది. సోమవారం టెండరు కు పెట్టారు. వ్యాపారులెవ్వరూ టెండరు వేయలేదు. మంగళవారం కూడా టెండరుకు పెట్టారు. అయినా వ్యాపారులు స్పందించలేదు. మార్కెట్కు ఉల్లి గడ్డలు తీసుకరావడానికి దాదాపు రూ.7వేల నుంచి రూ.8వేలు ఖర్చయింది. వెనక్కి తీసుకపోవాలంటే మళ్లీ అదే స్థాయిలో ఖర్చు వస్తుంది. టెండరు వేయకపోతే అనామతుపై అతి తక్కువ ధరకు విక్రయించుకోవాల్సిందే. – దేవేంద్ర ఆచారి, గువ్వలదొడ్డి గ్రామం, ఎమ్మిగనూరు మండలం కర్నూలు(అగ్రికల్చర్): పంట దిగుబడులను గిట్టుబాటు ధరతో అమ్ముకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి రైతులు వ్యయ ప్రయాసలకోర్చి కర్నూ లు మార్కెట్కు చేరుకుంటున్నారు. సరుకు మార్కెట్లోకి ప్రవేశించే సమయంలోనే లాట్ నెంబర్ అలాట్ అవుతుంది. పంట నాణ్యతను బట్టి వ్యాపారులు ఈ–నామ్లో ఆన్లైన్ టెండరు ద్వారా ఏదో ఒక ధర కోట్ చేయాల్సి ఉంది. ఎక్కువ ధర కోట్ చేసిన వారికి ఆ లాట్ దక్కుతుంది. రైతు ఆ ధరకు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మరుసటి రోజు మళ్లీ టెండరుకు పెట్టుకోవచ్చు. కానీ మార్కెట్లో కొన్ని లాట్లకు వ్యాపారులు అస్సలు టెండరు వేయరు. ప్రధానంగా ఉల్లిగడ్డల విషయంలో ప్రతి రోజు 20 నుంచి 30 లాట్లకు వ్యాపారులు టెండరు వేయని పరిస్థితి. ఈ కారణంగా రైతులు రోజుల తరబడి మార్కెట్లోనే ఉండాల్సి వస్తోంది. వ్యాపారులు సిండికేట్గా మారి కొన్ని లాట్లకు ధర కోట్ చేయరనే ప్రచారం జరుగుతోంది. టెండరు వేయకపోతే రైతు లు ఏదో ఒక ధరకు అమ్ముకుంటారని, అప్పుడు నాణ్యత బాగోలేదని చెబితే తక్కువ ధరతో లాట్ను దక్కించుకోవచ్చనే కుట్ర కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి రోజు 20 నుంచి 30 మంది రైతులు అనామతుపై నామమాత్రపు ధరకు అమ్ముకొని కన్నీళ్లతో ఇంటిముఖం పడుతుండటం గమనార్హం. -
క్రీడలపై కూటమి నేతల దుష్ప్రచారం సిగ్గుచేటు
నందికొట్కూరు: ఆడుదాం ఆంధ్ర క్రీడల్లో ఒకరేమో రూ.300 కోట్ల స్కామ్ అంటారు, మరొకరేమో రూ.400 కోట్ల స్కామ్ అని నోటికొచ్చినట్లు మాట్లాడటం చూస్తే వాళ్ల ఆరోపణల్లో నిజం లేదనే విషయం తెలుస్తోందని రాష్ట్ర శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. బుధవారం ఆయన నంద్యాల జిల్లా నందికొట్కూరులో విలేకరులు అడిగిన ప్రశ్నలకు పైవిధంగా సమాధానమిచ్చారు. తెలుగు దేశం పార్టీ ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు నోటికి వచ్చినట్లు ఆడుదాం ఆంధ్ర క్రీడల్లో స్కామ్ జరిగినట్లు దుష్ప్రచారం చేయడం సిగ్గు చేటన్నారు. క్రీడల శాఖ మంత్రి ఆడుదాం ఆంధ్రకు బడ్జెట్లో రూ.119 కోట్లు కేటాయించినట్లు అసెంబ్లీలో చెబుతుంటే ఆరోపణలు చేసేవారికి వినిపించకపోవడం శోచనీయమన్నారు. ఎన్నికల ముందు రాష్ట్రమంతా చంద్రబాబు, భువనేశ్వరి కన్నీటితో ప్రచారం చేసి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి పది నెలలైనా మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదన్నారు. నాలుగేళ్ల వరకూ జగనన్న పాలనపై ఇదే విమర్శలు చేసుకుంటూ ఒక్కపథకం కూడా అమలు చేయకుండా కాలం గడపటమే చంద్రబాబు నైజమన్నారు. రైతు భరోసా, తల్లికి వందనం ఇవ్వాలని ప్రజలు అడుగుతుంటే ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమంగా కేసులు బనాయించడం తగదని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15వేల సచివాలయాలకు రూ.38 కోట్లతో క్రీడా కిట్లను పంపిణీ చేశామని గుర్తు చేశారు. గత జగనన్న పాలనలో సచివాలయాలలో 1.30 లక్షల ఉద్యోగాలు ఇస్తే కూటమి నేతలకు కనిపించకపోవడం విడ్డూరమన్నారు. -
యాపదిన్నె సర్పంచ్పై కేసు నమోదు
డోన్ టౌన్: మండలపరిధిలోని యాపదిన్నె గ్రామానికి చెందిన తెలుగుదేశం సర్పంచ్ రామిరెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. వాటర్ షెడ్ పనుల్లో తనకు ప్రాధాన్యత ఎందుకు ఇవ్వరని మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో వాటర్ షెడ్ ఏపీఓ విజేత,ఎంపీడీఓ వెంకటేశ్వరరెడ్డి విధులకు ఆటంకం కల్గించి అసభ్య పదజాలంతో దూషించిన విషయం తెలిసిందే. దీనిపై సదరు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామిరెడ్డిపై కేసు నమోదు చేసి చేసి రిమాండ్కు పంపతున్నట్లు బుధవారం సీఐ ఇంతియాజ్బాషా తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి అవుకు: మండల పరిధిలోని చెన్నంపల్లె గ్రామంలో విద్యుత్ షాక్కు గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేతంచర్ల మండలం బలపాలపల్లె గ్రామానికి చెందిన చిన్న తిమ్మిగాళ్ల వేణుగోపాల్ (37) భార్యాపిల్లలతో సహా గత రెండేళ్లుగా అవుకులో నివాసం ఉంటూ గౌండ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం చెన్నంపల్లె గ్రామంలో ఓ ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా స్లాబ్ను కూలుస్తుండగా ప్రమాదవశాత్తు పైన ఉన్న కరెంట్ తీగలు తగిలి కిందపడ్డాడు. దీంతో 108 అంబులెన్స్ ఈఎంటీ జనార్దన్ రెడ్డి అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య చిన్న తిమ్మగాళ్ల ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ క్రిష్ణయ్య తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు సంతానం. రంగాపురం జెడ్పీ హైస్కూలు విద్యార్థిని ఆత్మహత్య బేతంచెర్ల: మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురం జెడ్పీ హైస్కూలో 10 వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల మేరకు గ్రామానికి చెందిన తిరుమలేశ్వరెడ్డి, లావణ్య దంపతుల పెద్ద కుమార్తె మధు లత(15) గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతోంది. కుటుంబ సమస్యలో మరే కారణం చేతనో ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో బుధవారం ఉదయం ఫ్యానుకు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బయటకు వెళ్లిన తల్లి లావణ్య ఇంటికి వచ్చి చూసి వెంటనే వేలాడుతున్న కుమార్తెను కిందికి దింపి చూడగా అప్పటికే మృతి చెందింది. మరో 5 రోజుల్లో పబ్లిక్ పరీక్షలకు హాజరు కావలసిన విద్యార్థిని మృతి పట్ల తోటి విద్యార్థులు కన్నీరు, మున్నీరుగా విలపించారు. హెచ్ఎం మల్లికార్జున, ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు. -
సాధారణ కాన్పులో బాలభీముడు జననం
కోడుమూరు రూరల్: స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఓ మహిళకు సాధారణ కాన్పులో 4.25 కిలోల బరువు గల పండంటి మగ శిశువు మంగళవారం రాత్రి జన్మించాడు. కోడుమూరు మండలం వర్కూరు గ్రామానికి చెందిన సులోచన ప్రసవ నొప్పులతో మంగళవారం స్థానిక ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. ఆరోగ్య పరీక్షలు చేసిన గైనకాలజిస్ట్ పుష్పలత సాధారణ కాన్పు చేశారు. సహజంగా అప్పుడే పుట్టిన పిల్లలు రెండున్నర కిలోల నుంచి మూడున్నర కిలోల బరువు ఉంటారని ఈ బిడ్డ 4.25 కిలోలు ఉండటం అది కూడా సాధారణ కాన్పులో జన్మించడం విశేషమని వైద్యాధికారి డా.నాగరాజు తెలిపారు. సులోచనకు ఇది నాలుగో కాన్పు. అన్ని కూడా నార్మల్ డెలివరీలు కావడం గమనార్హం. ముగ్గురు అమ్మాయిల తర్వాత కుమారుడు జన్మించడం పట్ల సులోచన, నారాయణ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. -
జీవనశైలితో కిడ్నీ కుదేల్!
● పెరుగుతున్న కిడ్నీ వ్యాధి బాధితులు ● 10 నుంచి 17 శాతానికి పెరిగిన రోగుల సంఖ్య ● బీపీ, షుగర్తోనే కిడ్నీకి ఇబ్బంది ● కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి నెలా 1300 మందికి డయాలసిస్ ● 30 ఏళ్ల లోపు బీపీ వస్తే కిడ్నీ సమస్యలు ఉన్నట్లు అనుమానం ● నేడు వరల్డ్ కిడ్నీ డే మానవశరీరంలో గుప్పెడంత పరిమాణంలో ఉండే కిడ్నీలు రక్తాన్ని వడపోసి, మలిన పదార్థాలను వేరుచేసి వాటిని మూత్రం ద్వారా విసర్జిస్తాయి. దేహంలో నీటి శాతాన్ని అవసరమైన పరిమాణంలో క్రమబద్ధంగా ఉంచి ఎక్కువైన నీటిని బయటకు పంపిస్తాయి. లవణ పరిమాణాన్ని, రక్తపోటును క్రమబద్ధీకరిస్తాయి. ఇలా మనిషి ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషించే ఈ అవయవం పనితీరు మందగించి అది విఫలమవ్వడం ఆరంభమైతే దానిని పూర్తిగా నయం చేయడం కష్టం. అయితే, ప్రస్తుతం మారిన మనిషి జీవన శైలి ఆ పరిస్థితిని తీసుకొస్తుంది. అవగాహన లేమితో కిడ్నీ సంబంధ వ్యాధులు పెరిగిపోతున్నాయి. ఈ నెల 13న వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ప్రత్యేకం కథనం. ఆరేళ్లలో కిడ్నీ రోగుల వివరాలు కర్నూలు(హాస్పిటల్): నిరంతరం పనిచేసే కిడ్నీలను జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా తీవ్ర నష్ట జరుగుతుంది. కొన్నిసార్లు ప్రాణాల మీదకు వస్తుంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని నెఫ్రాలజి విభాగంలో ప్రతి వారం సోమ నుంచి శుక్రవారం వరకు ఓపీ చూస్తారు. ఇక్కడ గత జనవరి నెల 665 ఓపీ, 138 ఐపీ, ఫిబ్రవరిలో 450 ఓపీ, 137 ఐపీ రోగులు చేరి చికిత్స పొందారు. ఈ విభాగంలో సగటున ప్రతి నెలా 1300 మంది దాకా కిడ్నీ బాధితులకు డయాలసిస్ చేస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు నలుగురికి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించి విజయవంతం చేశారు. ఈ ఆసుపత్రితో పాటు నగరంలోని పలు నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ(వైద్యసేవ) ద్వారా ఉచితంగా డయాలసిస్, పలు రకాల ఆపరేషన్లు ఉచితంగా నిర్వహిస్తున్నారు. పిల్లలు, పెద్దల్లో కిడ్నీ వ్యాధులు చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చే జన్యుపరమైన వ్యాధులు, ఇన్ఫెక్షన్ వల్ల మూత్రపిండాల వ్యాధులు కలుగుతాయి. పుట్టుకతో వచ్చే జన్యుపరమైన వ్యాధుల వల్ల పిల్లలు ఎదుగుదల లేకపోవడం, మూత్రం ఎక్కువగా, తక్కువగా పోవడం, కాళ్లు, చేతులు వంకర్లు పోవడం వంటివి జరుగుతాయి. ఇన్ఫెక్షన్తో వచ్చే వ్యాధుల వల్ల పిల్లలకు మూత్రం ఎరుపు రంగులో రావడం, కాళ్లవాపులు రావడం, ఒళ్లు దద్దుర్లు రావడం వంటివి జరుగుతాయి. పెద్దల్లో రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాల ఇన్ఫెక్షన్ వల్ల సాధారణంగా మూత్రపిండాలు చెడిపోతాయి. ఈ వ్యాధులు ఉన్న వాళ్లు మూత్రపిండాల వైద్యుల పర్యవేక్షణలో ఉండటం మంచిది. కిడ్నీలు పాడయ్యేందుకు కారణాలు బీపీ, షుగర్, ఉబ్బు కామెర్లు, అధిక మొత్తంలో నొప్పుల మాత్రలు వాడటం, కిడ్నీల్లో రాళ్లు, జన్యుపరంగా పుట్టుకతో వచ్చే వ్యాధులు, మూత్రకోశ, మూత్రనాళ వ్యాధులు, వాంతులు, విరేచనాలు, పాముకాటు, మలేరియా, పచ్చకామెర్లు, లెప్టోస్పైరా, గర్భం సమయంలో మూత్రం ఇన్ఫెక్షన్, రక్తపోటు రావడం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. సంవత్సరం ఓపీ ఐపీ రోగుల సంఖ్య రోగుల సంఖ్య 2019 9,034 1,830 2020 2,640 630 2021 1,546 1,010 2022 5,228 1,337 2023 5,575 1,493 2024 6,943 1,771కిడ్నీ జబ్బు లక్షణాలు నిస్సత్తువ, వాంతి వచ్చినట్లు ఉండటం, ఆకలి లేకపోవడం, దురద, ఒళ్లునొప్పులు, మూత్రం ఎక్కువగా పోవడం, అతి తక్కువగా పోవడం, రాత్రిపూట మూత్రం ఎక్కువగా పోవడం, శరీర వాపు, చిన్నపిల్లల్లో మూత్రం ఎర్రగా రావడం, ఒళ్లు దద్దుర్లు, చిన్నపిల్లల్లో ఎదుగుదల లేకపోవడం, కాళ్లు వంకరలు పోవడం, అధిక రక్తపోటు. వ్యాధి లక్షణాలను బట్టి చికిత్స మూత్రపిండాలకు వచ్చిన వ్యాధి లక్షణాలు, దాని తీవ్రతను బట్టి వైద్యులు రకరకాల చికిత్సలను చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని వ్యాధులు ఆహార నియమావళి పాటించి మందులు తీసుకుని తగ్గించుకోవచ్చు. కొన్ని వ్యాధుల్లో డయాలసిస్, కిడ్నీ మార్పిడి అవసరం రావచ్చు. –డాక్టర్ ఎం. శ్రీధరశర్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్, నెఫ్రాలజి విభాగం, జీజీహెచ్, కర్నూలు -
ఆగని మట్టి అక్రమ తవ్వకాలు
● చూసీచూనడట్లు వదిలేస్తున్న రెవెన్యూ అధికారులు రుద్రవరం: మండలంలో మట్టి అక్రమ తవ్వకాలు ఆగడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాగులు, వంకలు, లే అవుట్లలో యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తుండటంతో అక్రమార్కులది అడిందే ఆట పాడిందే పాటలా తయారైంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొందరి నుంచి భూమిని కొనుగోలు చేసి పేదల కోసం కేటాయించింది. అప్పటి ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి కొంత మంది పేదలకు ఇళ్ల స్థలాలు కూడా పంపిణీ చేశారు. లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేలోపే ప్రభుత్వం మారడంతో అంతా తలకిందులైంది. ఆ భూమిలో ఇప్పుడు కూటమి నేతలు ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు సాగిస్తున్నారు. లబ్ధిదారులు అడ్డుకునేందుకు వెళ్లగా తమ పూర్వికుల భూమి అని, తమకు పూర్తి హక్కులు ఉన్నాయని గదమాయిస్తున్నారు. చేసేదేమీ లేక అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకునే నాథుడే లేరు. మంగళవారం పేరూరు సమీపంలోని వక్కిలేరులో మట్టిని తవ్వి ట్రాక్టర్లలో ఆళ్లగడ్డ, శిరివెళ్ల మండలాల్లోని బత్తలూరు, ఎర్రగుంట్ల గ్రామాలకు తరలిస్తున్నండగా స్థానికులు సంబంధిత వీఆర్వోకు సమాచారం ఇచ్చారు. ఆయన అక్కడికి చేరుకుని మట్టి తవ్వకాలు నిలిపేయాలని చెబుతూనే స్థానికులు వెళ్లిపోయిన తర్వాత తిరిగి తవ్వేకోవచ్చన్న సంకేతాలు ఇచ్చి వెళ్లినట్లు సమాచారం. దీంతో కూటమి నేతలు తిరిగి జేసీబీతో వాగులోని మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా వేర్వేరు గ్రామాలకు తరలించారు. మట్టి తవ్వకాలపై తహసీల్దారు మల్లికార్జునరావును వివరణ కోరగా తాము ఎవ్వరికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పుకోచ్చారు. -
మత్స్య సహకార సంఘాల బలోపేతానికి కృషి
● జిల్లా మత్స్య సహకార సంఘం చైర్మన్ నవీన్కుమార్ కర్నూలు(అగ్రికల్చర్): మత్స్యకారుల సంక్షేమానికి, మత్స్య సహకార సంఘాల పటిష్టతకు చర్యలు తీసుకుంటామని ఉమ్మడి కర్నూలు జిల్లా మత్స్య సహకార సంఘం(డీఎఫ్సీఎస్) చైర్మన్ బీఎస్ నవీన్కుమార్ తెలిపారు. మంగళవారం కర్నూలు బంగారుపేటలోని మత్స్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంఘం సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సవరించిన బైలాను అన్ని సహకార సంఘాలకు త్వరలోనే తెలుగులోనే అందజేస్తామన్నారు. మత్స్యకారులందరు ఎన్ఎఫ్డీపీ, ఈ–శ్రామిక్లలో పేర్లను నమోదు చేసుకోవా లని సూచించారు. కొత్త సంఘాల ఏర్పాటుకు ఇప్పటికే ఉన్న సంఘాలలో సభ్యత్వాలను పెంచుకోవడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎఫ్సీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ సంధ్యారాణి, డైరెక్టర్లు శేఖర్, నాగశేషులు, శ్రీనివాసు లు, మల్లీశ్వరుడు, మద్దిలేటి, నగేష్ పాల్గొన్నారు. -
కర్ణాటక బస్సు ఢీకొని వ్యక్తి మృతి
నందవరం: కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తుతెలి యని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మండల పరిధిలోని హాలహర్వి – చిలకడోణ గ్రామాల మధ్య కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం వద్ద చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు.. మతిస్థిమిత్తం లేని, గుర్తు తెలియని వ్యక్తి కేజీబీవీ వద్ద జాతీయ రహదారి దాటుతుండగా బెంగళూరు నుంచి మంత్రాలయం వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొంది. ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి కాళ్లకు, తలకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అంబులెన్స్లో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతిచెందాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కొండముచ్చు దాడిలో ఇద్దరికి గాయాలు కొలిమిగుండ్ల: బందార్లపల్లెలో కొండ ముచ్చు గ్రామస్తులను హడలెత్తిస్తోంది. మంగళవారం ఎస్సీ కాలనీకి చెందిన ఓబులేసుపై దాడి చేయడంతో చెంపకు, మక్కల నాగేంద్ర వీపుపై రక్తగాయాలయ్యాయి. వారం రోజుల నుంచి కొండముచ్చు గ్రామంలో తిష్టవేయడంతో పిల్లలు, మహిళలు, వృద్ధులు భయభ్రాంతులకు గురవుతున్నారు. బయటకు వెళ్లాలంటే ఎప్పుడు వచ్చి దాడి చేస్తోందనని ఆందోళన చెందుతున్నారు. వీధుల్లో సంచరిస్తూ ఇళ్ల ముందు తిష్టవేస్తుండటంతో మహిళలు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. అటవీ శాఖాధికారులు స్పందించి గ్రామంలో నుంచి కొండముచ్చును తరలించే చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు. నేడు వాహనాల వేలం కర్నూలు: వివిధ ఎకై ్సజ్ నేరాల్లో పట్టుబడిన వాహనాలను బుధవారం వేలం వేయనున్నట్లు కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ సీఐ చంద్రహాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు వేలం ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఆసక్తి ఉన్నవారు దరావత్ సొమ్ము చెల్లించి వేలంలో పాల్గొనాలని పేర్కొన్నారు. స్థానిక ఎకై ్సజ్ స్టేషన్లో వేలం ప్రక్రియ ఉంటుందని సీఐ వెల్లడించారు. -
సారా తయారీ మానుకోకపోతే పీడీ చట్టం
కర్నూలు: నాటుసారా తయారీ, రవాణా, విక్రయాలు మానుకోకపోతే పీడీ చట్టంతో జైలుకు పంపుతామని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీదేవి హెచ్చరించారు. నవోదయం 2.0లో భాగంగా కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని గుడంబాయి తండా, గుమ్మితం తండాల్లో మంగళవారం నాటుసారా వినియోగం వల్ల కలిగే అనర్థాలపై సీఐ చంద్రహాస్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్.హనుమంతరావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సారీ తయారీని మానుకుని ప్రత్యామ్నాయ ఉపాధితో గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపాలని సూచించారు. సీఐ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకుల సమ్మెను విజయవంతం చేద్దాం
● యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ జిల్లా నాయకులు కర్నూలు (అగ్రికల్చర్): న్యాయమైన డిమాండ్లను సాధించుకునేందుకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్బీయు) పిలుపు మేరకు ఈ నెల 24, 25 తేదీల్లో చేపట్టనున్న బ్యాంకుల సమ్మెను విజయవంతం చేయాలని వివిధ బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ నేతలు కోరారు. మంగళవారం వివిధ బ్యాంకుల రీజినల్ కార్యాలయాల ఎదుట ఆయా బ్యాంకుల ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా రీజినల్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో యూఎఫ్బీయూ జిల్లా కన్వీనర్ నాగరాజు, కెనరా బ్యాంకు రీజినల్ కార్యాలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఆ బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ రీజినల్ సెక్రటరీ కే.పుష్పక్ మాట్లాడారు. ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బ్యాంకు ఉద్యోగులకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. గ్రాట్యూటీ చట్టాన్ని సవరించి రూ.25 లక్షల వరకు గరిష్ట పరిమితిని పెంచాలని కోరారు. కెనరా బ్యాంకు వర్క్మెన్ ఎంప్లాయీస్ యూనియన్ సెంట్రల్ కమిటీ సభ్యుడు అనిల్రెడ్డి మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని కేడర్లలో తగిన నియామకాలు చేపట్టాలని, తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఐడీబీఐ బ్యాంకును ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వ వాటా 51 శాతం ఉండేలా చూడాలని కోరారు. ఈ నెల 13, 18వ తేదీల్లో ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో జరిగే చర్చలకు యూఎఫ్బీయూ నేతలు హాజరవుతున్నారని, చర్చలు ఫలించకపోతే రెండు రోజుల సమ్మెకు సిద్ధం కావాలని సూచించారు. -
ఇప్పటికిప్పుడే పునాదులు ఎలా తీసుకోవాలి
● అధికారులను ప్రశ్నించిన జగనన్న కాలనీ లబ్ధిదారులు కోసిగి: ఇప్పటికిప్పుడే పునాదులు తీసుకోవాలంటే తమ చేత అయ్యే పనేనా అని మండల కేంద్రంలోని జగనన్న కాలనీ లబ్ధిదారులు అధికారుల ఎదుట వాపోయారు. మండల కేంద్రంలోని సజ్జలగుడ్డం రోడ్డులో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న కాలనీ పేరుతో 909 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఎంత మంది పునాదులు తీసుకున్నారు, ఎంత మంది పునాదులు తీసుకోలేదనే వివరాలు సేకరించి నివేదికను తయారు చేసేందుకు మంగళవారం వీఆర్వోలు బలరాం, వీరేష్ కలిసి జగనన్న కాలనీకి రాగా లబ్ధిదారులు కామలదొడ్డి వీరేష్, బసవరాజు, మల్లి, వేమారెడ్డి, మరి కొందరు అక్కడకి చేరుకుని తమ ఆవేదన వెలిబుచ్చారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈరోజే గడువు పూర్తయిందంటే ఎలా అని, ఇప్పటికిప్పుడే పునాదులు వేసుకోవాలంటే తమ ఆర్థిక పరిస్థితి సరిపోతుందా అని నిలదీశారు. ఇప్పటికై నా ప్రభుత్వమే ఇళ్లు మంజూరు చేసి, బిల్లులు విడుదల చేస్తే నిర్మాణాలు ప్రారంభించుకుంటామని బాధితులు విన్నవించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము ఇక్కడికి వచ్చామని చెప్పి వీఆర్వోలు వెళ్లిపోయారు. అలాగే 16 మంది కుమ్మరి కులస్తులకు కేటాయించిన స్థలంలోనూ ప్రైవేట్ వ్యక్తులు ప్లాట్లు వేసుకున్నారని బాధితులు కుమ్మరి కోసిగయ్య, బజారి, నాగరాజు, నరసింహ, అంబమ్మ ఆరోపించారు. ఇదే విషయమై ఫిబ్రవరి 6న తహసీల్దార్ను కలిసి ఫిర్యాదు చేసినా పరిష్కారం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలపై తహసీల్దార్ రుద్రగౌడను వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీఆర్వోలు జగనన్న కాలనీలో సర్వే చేపట్టారని, కుమ్మరి కులస్తులకు ఇచ్చిన స్థలాలు ఎక్కడికీ పోవని, ప్రైవేట్ వ్యక్తులు వేసిన లేఅవుట్లను రీసర్వే చేసి లబ్ధిదారులకు న్యాయం చేస్తామని చెప్పారు. -
కాలకూట విషం
పొలాల్లో, ఇంటి పరిసరాల్లో పెరిగిన కలుపు తీసేందుకు వాడే పారాక్వాట్ క్రిమిసంహారక మందు ఇప్పుడు మనుషుల ప్రాణాలు తీసేందుకు ఎక్కువగా ఉపయోగపడుతోంది. గ్రామాల్లోని రైతుల ఇళ్లల్లో, పొలాల్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఈ మందు, ఇప్పుడు పట్టణాల్లోని వారికి సైతం సులభంగా ఫెర్టిలైజర్స్ షాపుల్లో లభ్యమవుతోంది. దీంతో క్షణికావేశంలో దీనిని తాగి ప్రాణాలు తీసుకుంటున్నారు. యాసిడ్ కంటే పదుల రెట్ల గాఢత కలిగిన ఈ ద్రావణాన్ని తాగిన వారు 99 శాతం మరణిస్తారని వైద్యులు చెబుతున్నారు. – కర్నూలు(హాస్పిటల్) ● కర్నూలు మెడికల్ కాలేజీకి చెందిన ఓ వైద్యవిద్యార్థిని గత నెల 14న పారాక్వాట్ అనే విషరసాయనం తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కర్నూలు, అనంతపురం ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆమెను బతికించేందుకు తల్లిదండ్రులు చేయని ప్రయత్నం లేదు. ఇప్పటికే కొన్ని రూ.లక్షలలు ఆమె వైద్యం కోసం ఖర్చు చేశారు. అయినా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. ● కర్నూలు నగరంలోని బి.క్యాంపునకు చెందిన ఓ యువతి(19) ప్రేమించిన వాడు దూరమవుతాడన్న ఆందోళనతో ఈ నెల 9న పారాక్వాట్ రసాయన మందు తాగింది. చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రెఫర్ చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. పారాక్వాట్ రసాయనం ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు ఓపీ పాయిజన్ కేసులుగా వచ్చే వాటిలో అధిక శాతం పారాక్వాట్ క్రిమిసంహారక రసాయన మందు నమోదవుతోంది. పంట పొలాల్లో కలుపు తీయడానికి రైతులు ఈ మందును ఎక్కువగా వాడుతుంటారు. వేల లీటర్ల నీటిలో రెండు, మూడు మూతల ద్రావణాన్ని కలిపి ఎకరాల కొద్దీ పొలాల్లో రైతులు ఈ మందును పిచికారీ చేస్తారు. కొద్ది నిమిషాల్లోనే కలుపు మొక్కలు మాడిపోతాయి. అలాంటిది నేరుగా ద్రావణాన్ని తాగితే పరిస్థితి ఎలాగుంటుందో అర్థం చేసుకోవచ్చు. తాగేందుకు డబ్బా నోట్లో పెట్టుకున్నా గుక్కెడు తాగగానే తట్టుకోలేక పారేసే పరిస్థితి ఉంటుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ ద్రావణం వేగంగా శరీరంలోని జీవకణాలను, అంతర్భాగాల్లోని పైపొరలను దెబ్బతీస్తూ వెళ్లి ప్రాణాలను తీస్తుంది. ఇంతటి ప్రమాదకరమైన ఈ రసాయాన్ని కొన్ని రాష్ట్రాల్లో నిషేధించారు. కానీ ఇక్కడ పప్పు, బెల్లాల్లా దుకాణాల్లో లభ్యమవుతోంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ఈ మందు తాగి గత ఏడాది 69 మంది, ఈ యేడాది రెండు నెలల్లోనే 35 మంది చికిత్స కోసం వచ్చారు. ఇందులో కర్నూలు, నంద్యాల జిల్లాలతో పాటు పక్కనున్న ఉమ్మడి అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాలు, కర్ణాటక, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల వారూ ఉన్నారు. ఈ ఆసుపత్రితో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆలూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, పత్తికొండ, డోన్ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఏటా వంద మందికి పైగా చికిత్స కోసం వస్తున్నారు. ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ 99 శాతం మంది మరణిస్తుండగా తక్కువ మోతాదులో తాగిన వారు మాత్రమే బతికిపోతున్నారు. పలు దేశాల్లో పారాక్వాట్ నిషేధం ఒడిస్సా రాష్ట్రంలోని బుర్లా జిల్లాలో ఐదేళ్ల క్రితం ఈ విషం భారిన 177 మంది పడ్డారు. ఇందులో ముగ్గురు మాత్రమే జీవించి ఉన్నారు. 2019 సెప్టెంబర్లో అక్కడి వైద్యులు నిరసన చేయగా ఒడిస్సా ప్రభుత్వం దీనిని పూర్తిగా నిలిపివేస్తామని హామీ ఇచ్చింది. కేరళ రాష్ట్రంలో మాత్రమే దీనిని పూర్తిగా నిషేధించారు. అభివృద్ధి చెందిన 32 దేశాల్లోనూ పారాక్వాట్ను పూర్తిగా నిషేధించారు. దీని జన్మస్థానమైన స్విట్జర్లాండ్లోనూ ఈ రసాయాన్ని నిషేధించారు. మన దేశంలో కేవలం 9 రకాల పంటలకు మాత్రమే వాడాలని సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డు, రిజిస్ట్రేషన్ కమిటీ పేర్కొన్నా 25 రకాల పంటలకు వాడుతున్నారు. ప్రాణాలు తోడేస్తున్న పారాక్వాట్ ఏటా వందల మంది మృతి కర్నూలు జీజీహెచ్లో 14 నెలల్లో 104 మందికి చికిత్స పారాక్వాట్కు విరుగుడు లేదు అభివృద్ధి చెందిన దేశాలతో పాటు కేరళలో నిషేధం పారాక్వాట్కు విరుగుడు లేదు పారాక్వాట్ విష రసాయన పదార్థానికి విరుగుడు లేదు. దీని ప్రభావానికి గురైన వారి లక్షణాలను బట్టి వైద్యం చే స్తాం. దానివల్ల కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ విషం తీసుకున్న వారిలో 99 శాతం మంది మరణిస్తున్నారు. – డాక్టర్ రామశివనాయక్, ఎమర్జెన్సీ మెడిసిన్ హెచ్ఓడీ, జీజీహెచ్, కర్నూలు పీల్చినా విషప్రభావమే పారాక్వాట్ మింగినా, తాకినా చివరకు పీల్చినా విషప్రభావానికి గురైనట్లే. కేవలం ఒక టీ స్పూన్ పారాక్వాట్ తీసుకోవడం వల్ల మరణం సంభవించవచ్చు. ఈ రసాయనం దుస్తులు, కళ్లు, చర్మాన్ని తాకినా తీవ్ర అనారోగ్యం లేదా మరణానికి కారణం కావచ్చు. దీనిని తాగిన కొన్ని నిమిషాల్లోనే శరీరంలోని ఇతర భాగాల్లోకి వెళ్లి గుండె, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులను నాశనం చేస్తుంది. – డాక్టర్ పి.సుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, జీజీహెచ్, కర్నూలు -
అమ్మానాన్నలను మింగేసి.. ఆనందాలను చిదిమేసి!
● ఐదుగురిని బలిగొన్న బస్సు కర్ణాటక రాష్ట్రం గంగావతి డిపోకు చెందిన బస్సు మంత్రాలయానికి మంగళవారం 14 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఆదోని మండలం పాండవగల్ సమీపంలో కల్వర్టు వద్ద వేగాన్ని నియంత్రించుకోలేక రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. బస్సు పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లి నిలిచిపోవడంతో అందులోని ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండు కుటుంబాల్లో చీకటి కమ్ముకుంది. – ఆదోని టౌన్ -
పన్నులు చెల్లించకుంటే సేవలు బంద్
● డ్రస్ సర్కిల్ షాపు వద్ద నిరసన వ్యక్తం చేసిన మున్సిపల్ సిబ్బంది కర్నూలు (టౌన్): ఈనెల 31లోపు పన్నులు చెల్లించకపోతే సేవలు నిలిపేస్తామని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఆర్జీవీ క్రిష్ణ హెచ్చరించారు. మున్సిపల్ రెవెన్యూ అధికారులు, సిబ్బంది మంగళవారం బకాయిలు ఉన్న వ్యాపార దుకాణాల వద్దకు వెళ్లి యాజమాన్యాల తీరును నిరసించారు. అందులో భాగంగా అబ్దుల్లాఖాన్ ఎస్టేట్లోని డ్రస్ సర్కిల్ వద్ద నిరసన చేపట్టగా రూ.6.79 లక్షల బకాయిలు చెల్లిస్తామని యాజమాన్యం లిఖిత పూర్వకంగా రాసివ్వడంతో వెనుదిరిగారు. మేడం కాంపౌండ్లోని వాణిజ్య సముదాయాలకు సంబంధించి రూ.5.57 లక్షల బకాయిలను వెంటనే చెల్లించాలని మున్సిపల్ అధికారులు సూచించారు. ఆదేశాలను పట్టించుకోకపోతే శాఖ పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్లు జునీద్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు భార్గవ్, తిప్పన్న, రాజు పాల్గొన్నారు. -
చౌడేశ్వరీ మాతను దర్శించుకున్న బాలనటి శ్రీదేవి
బేతంచెర్ల: పట్టణానికి సమీపంలోని కొలుములపల్లె రహదారిలో వెలసిన చౌడేశ్వరీ మాతను బింబిసారలో బాలనటిగా నటించిన శ్రీదేవి మంగళవారం దర్శించుకున్నారు. ఈసందర్భంగా చౌడేశ్వరీ మాత ఆలయంలో తల్లిదండ్రులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బేతంచెర్ల పట్టణానికి చెందిన శ్రీహరి గౌడ్, భార్య లక్ష్మి వృత్తి రీత్యా హైదరాబాద్లో ఉంటున్నారు. నందమూరి కళ్యాన్రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమాలో బాలనటిగా శ్రీదేవి నటించింది. మాటీవీలో చిన్ని, జీటీవీలో కళ్యాణ వైభోగం సీరియల్తోపాటు కొత్తగా రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శాంతి భద్రతలకువిఘాతం కలిగిస్తే చర్యలు ● ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆలూరు రూరల్: శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. స్థానిక పోలీసు స్టేషన్ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణాన్ని పరిశీలించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, వాహన తనిఖీలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. అసాంఘిక కార్యకలాపాలపై నిఘా వేసి ఉంచాలన్నారు. అనంతరం స్టేషన్లోని రికార్డులు పరిశీలించి శాంతి భద్రతలపై సీఐ వెంకటచలపతి, ఎస్ఐ దిలీప్కుమార్ను అడిగి తెలుసుకున్నారు. ప్రాణం తీసిన మలుపు ● బైకు అదుపుతప్పి యువకుడి మృతి కొత్తపల్లి: మూల మలుపు వద్ద బైకు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని శివపురం గ్రామానికి చెందిన హరికృష్ణయాదవ్(37) ఆత్మకూరు మండలం కొట్టాలచెరువు గ్రామ సమీపంలో లింగమయ్య స్వామిని దర్శించుకుని పల్సర్ బైకుపై ఇంటికి తిరుగు పయనం అయ్యాడు. శివపురం గ్రామ పోలిమేరలోని జమ్ములమ్మ గుడి వద్ద మలుపు ఉండటంతో బైకు అదుపు తప్పి రోడ్డు పక్కన పిచ్చి మొక్కల మధ్య ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో పడి ఉండగా అటుగా వెళ్తున్న ప్రయాణికులు గమనించి గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని కొత్తపల్లికి, అక్కడి నుంచి ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య శ్రావణి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొత్తపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. -
రూ.139.90 కోట్లు
4,66,348 జిల్లాలోని గృహాల సంఖ్య నెలకు రూ.3వేల చొప్పున చెల్లించాల్సిన నిరుద్యోగ భృతి విద్యారంగం.. అస్తవ్యస్తం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యారంగం అస్తవ్యస్తంగా మారింది. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినా.. నేటి వరకు ఒక్క నయాపైసా విడుదల చేయలేదు. అదిగో, ఇదిగో డీఎస్సీ అంటూ కాలయాపన చేస్తున్నారు. ఎన్నికలకు ముందు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. – డీ సోమన్న, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు విద్యార్థులకు ఆర్థిక కష్టాలు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేయకపోవడంతో విద్యార్థులపై కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయాలన్నా, సర్టిఫికెట్లు తీసుకోవాలన్నా పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులు అనేక ఆర్థిక కష్టాలకు గురవుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదు. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. – అబ్దుల్లా, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఉన్నత విద్య ప్రశ్నార్థకం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా నేటి వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. యువగళం పాదయాత్రలో అన్ని ఇవ్వగలం అని నమ్మించిన మంత్రి నారా లోకేష్ నేడు నోరుమెదపడం లేదు. ఫీజు రీయంబర్స్మెంట్ను విడుదల చేయకుండా బకాయి పెట్టడంతో విద్యార్థుల ఉన్నత విద్య ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే విద్యార్థులతో కలసి ఉద్యమాలు చేస్తాం. – ఆర్ చంద్రప్ప, టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కర్నూలు(అర్బన్): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ అందించకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతోంది. ఫీజు బకాయిలపై నోరు మెదపకుండా విద్యార్థుల చదువులకు చంద్రబాబు ప్రభుత్వం ఆటంకం కల్పిస్తోంది. ఫీజులు చెల్లించాలని విద్యార్థులను వివిధ కళాశాలల యాజమాన్యాలు పట్టిపీడిస్తున్నాయి. ప్రతి విద్యా సంవత్సరం నాలుగు విడతలుగా ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తోంది. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి అదే ఏడాది మార్చి 2వ తేదీన మొదటి విడతగా జిల్లాలోని 35,618 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.23.95 కోట్లను అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం జమ చేసింది. మిగిలిన మూడు విడతల ఫీజును ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. వైఎస్సార్సీపీ హయాంలో ఇలా.. 2017–18, 2018–19 విద్యా సంవత్సరాల్లో పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను అధికారంలోకి వచ్చిన వెంటనే 2019–20 విద్యా సంవత్సరంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విడుదల చేసింది. అప్పట్లో జిల్లాలో 32,162 మంది విద్యార్థులకు సంబంధించిన అరియర్స్ అందాయి. గతంలో కుటుంబ వార్షిక ఆదా యం రూ. లక్ష ఉండగా వీలైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరాలనే సదుద్దేశంతో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.2.50 లక్షలకు పెంచింది. ఈ నేపథ్యంలోనే వసతి దీవెన పథకం ద్వారా ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు రూ.20 వేల ప్రకారం అందించింది. ● గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టిన సమయంలో బీసీ, ఈబీసీ, మైనారిటీ, కాపు విద్యార్థుల ఇంజనీరింగ్ విద్యకు ఏడాదికి రూ.35 వేలు మాత్రమే విడుదలయ్యేవి. కానీ, కొన్ని పెద్ద కళాశాలల్లో (గ్రేడ్ –1) ఇంజినీరింగ్ ఫీజు ఏడాదికి రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు ఉంది. ఆయా కళాశాలల్లో చదువుతున్న సంబంధిత సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వం విడుదల చేసే రూ.35 వేలను మినహాయించి మిగిలిన ఫీజు వారి తల్లిదండ్రులే చెల్లించాల్సి వచ్చేది. ఈ ఆర్థిక భారాన్ని కూడా తొలగించేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకు వేసి ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని పెంచారు. దీంతో గ్రేడ్–1 కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని కూడా తగ్గించిన ఘనత వైఎస్ జగన్కే దక్కింది. ● ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ తదితర సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ.501.60 కోట్లను తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఘరానా మోసం ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా విద్యార్థులను, నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోంది. రూ.3,900 కోట్ల ఫీజు బకాయిలను పెట్టి, విద్యార్థి సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో రూ.780 కోట్లను మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. నెలకు రూ.3 వేల ప్రకారం నిరుద్యోగులకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.72 వేలు అప్పుపడింది. 20 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉన్నా.. ఎలాంటి బడ్జెట్ను ప్రవేశ పెట్టలేదు. – రెడ్డిపోగు ప్రశాంత్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వైద్య విద్యకు మోకాలడ్డు ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో వైద్య రంగానికి పెద్దపీట వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు నిర్మాణాలను కూడా ప్రారంభించారు. అందులో భాగంగానే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆదోని, నంద్యాల ప్రాంతాల్లో మెడికల్ కళాశాలల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. నంద్యాలలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభం కాగా, ఆదోనిలో చురుగ్గా జరుగుతున్న మెడికల్ కళాశాల నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం మోకాలడ్డువేసింది. కరువు ప్రాంతమైన ఆదోనిలో మెడికల్ కళాశాల నిర్మాణానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో దాదాపు 80 శాతం నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. మిగిలిన 20 శాతం పనులు పూర్తియితే ఈ ఏడాది 150 సీట్లతో కళాశాల ప్రా రంభయ్యేది. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిర్మాణాలకు బ్రేకులు వేసింది. దీంతో ఆదోని మెడికల్ కళాశాల కలగానే మిగిలిపోయింది.పైపెచ్చు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటై న మెడికల్ కళాశాలలను ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేందుకు తీసుకున్న నిర్ణయం పట్ల పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రూ.1678.85కోట్లు అమలు చేయకపోతే ఏడాదికి నష్టం నేడు యువత పోరు కర్నూలు(టౌన్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహిస్తున్న యువత పోరు నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలో ఉదయం 10 గంటలకు స్థానిక గౌరి గోపాల్ ఆసుపత్రి వద్దనున్న ధర్నా చౌక్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్బావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లాలో వేడుకలు నిర్వహిద్దామని పిలుపు నిచ్చారు. ప్రస్తుతం ఇలా.. జిల్లాలో 35,618 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, కాపు, క్రిస్టియన్ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి కూటమి ప్రభుత్వం మూడు విడతలుగా రూ.71.86 కోట్లను బకాయి పడింది.చంద్రబాబుకు నిరుద్యోగులను మోసం చేయడం ఆనవాయితీగా మారింది. 2014లో కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తానని, అప్పట్లో రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హామీని చెత్తబుట్టలో పడేశారు. 2019 ఎన్నిలకు ముందు రాజకీయ లబ్ధి కోసం 2018 అక్టోబర్ నుంచి నెలకు రూ.వెయ్యి కొంతమందికి మాత్రమే నిరుద్యోగ భృతి వేసి చేతులుదులుపుకున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు ఇస్తానని, ఉద్యోగం ఇచ్చే వరకూ ‘యువనేస్తం’ పేరిట నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఈ లెక్కన జిల్లాలో నెలకు రూ.139.90కోట్లు ఇవ్వాలి. ‘కూటమి’ మాటలు నమ్మి ఉద్యోగాలపై ఆశతో కోచింగ్ సెంటర్లకు వెళ్లే విద్యార్థులకు ప్రతి నెలా వేల రూపాయలు ఖర్చవుతోంది. ప్రభుత్వం భృతి ఇవ్వకపోవడంతో వారిపై భారీగా ఆర్థిక భారం పడుతోంది. ఓ వైపు ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవు. మరో వైపు భృతి లేకపోవడంతో నిరుద్యోగులు ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. యువనేస్తం.. నిలువునా మోసం -
రాజకీయ కక్షతో వేధిస్తే ప్రజలే తిరగబడతారు
కర్నూలు: రాజకీయ కక్షతో ప్రతిపక్ష పార్టీ నాయకులను వేధిస్తే ప్రజలే తిరగబడతారని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లను దుర్భాషలాడారన్న అభియోగంపై ఆదోని మూడో పట్టణ పోలీస్స్టేషన్లో ప్రముఖ సినీనటుడు పోసాని మురళీకృష్ణపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఈనెల 5వ తేదీన రిమాండ్పై ఆయనను కర్నూలు శివారులోని జిల్లా కారాగారానికి తరలించారు. కాటసాని రాంభూపాల్రెడ్డి సోమవారం జిల్లా జైలుకు వెళ్లి పోసాని మురళీకృష్ణతో ములాఖత్ అయి పరామర్శించారు. అనంతరం కారాగారం గేటు బయట కాటసాని మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ నాయకుల మీద కక్ష సాధింపులు కొనసాగుతున్నాయని, అధికారం ఉంది కదా అని రాజకీయ కక్షతో ఒకే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కేసులు పెట్టి వేధించడం తగదన్నారు. కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను భ్రష్టుపట్టిస్తోందని విమర్శించారు. వైఎస్సార్సీపీ నాయకు లు ఏది మాట్లాడినా అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని, అదే టీడీపీ నాయకులు మాట్లాడితే మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. చట్టం అనేది ఒకరి సొత్తు కాదని, అందరికీ సమానంగా ఉండాలన్నారు. ఎళ్లకాలం ఒకేలా ఉండదని, కూటమి నాయకులు గుర్తు పెట్టుకుని నడుచుకోవాలన్నారు. ప్రముఖ సినీనటుడు పోసాని మురళీకృష్ణతో ములాఖత్ సందర్భంగా కాటసాని -
ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టాలి
● వీడియో కాన్ఫరెన్స్లో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ కర్నూలు (సెంట్రల్): వర్షపు ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకుని వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. ఆయన సోమవారం మధ్యాహ్నం న్యూఢిల్లీ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి పొదుపు, వినియోగం, నిర్వహణపై కొన్ని ప్రాంతాల కలెక్టర్ల పనితీరును సమీక్షించి తగు సూచనలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులు, పారిశ్రామికవేత్తల ఆర్థిక సాయం, సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా నీటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులతో మాట్లాడారు. ఫారం పాండ్స్, అమృత సరోవర్ తదితర పనులపై డ్వామా పీడీ వెంకటరమణయ్యను, బోర్వెల్ రీచార్జ్ స్ట్రక్చర్స్పై ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావును, చెరువులు, మైనర్ డ్యామ్ల పునరుద్ధరణ పై ఇరిగేషన్ ఎస్ఈ ద్వారకానాథ్రెడ్డిని నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. -
మోహినీ అలంకారంలో అహోబిలేశుడు
అమృతం అసురుపాలు కాకుండా లోక సంరక్షణ కోసం మహా విష్ణువు దాల్చిన జగన్మోహిని అలంకరణలో ప్రహ్లాదవరుడు భక్తులకు దర్శనమిచ్చారు. అహోబిలేశుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా దిగువ అహోబిలంలో సోమవారం ప్రహ్లాదవరుడు జగన్మోహిని అలంకారంలో కనువిందు చేశారు. పట్టు వస్త్రాలు, మిరుమిట్లు గొలిపే ఆభరణాలు ధరించి పల్లకీలో మాడ వీధుల్లో విహరించారు. ఎగువ అహోబిలంలో వెలసిన జ్వాలా నరసింహస్వామి పొన్నచెట్టు వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. – ఆళ్లగడ -
మంత్రి లోకేష్.. పట్టించుకోరా?
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వ విద్యాలయాల్లో ప్రవేశం కోసం నిర్వహించి కామన్ పీజీ సెట్ ఎంట్రెన్స్ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సోమన్న, షాబీర్బాషా డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. కామన సెట్తో విద్యార్థులకు ఎంతో నష్టం వాటిల్లుతోందన్నారు. ఇష్టమున్నా లేకున్నా ఇతర యూనివర్సిటీలకు వెళ్లి చదువుకోవాల్సి ఉంటుందన్నారు. అలాగే జీఓ నంబర్ 77ను రద్దుచేస్తానని చెప్పిన మంత్రి లోకేష్ పట్టించుకోవడంలేదన్నారు. వర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. కామన్ సెట్తో డిగ్రీ, పీజీ కళాశాలను మూసివేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. శరత్కుమార్, అభి, అశోక్, అక్షర తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ తీరుపై ప్రజాగ్రహం●
● కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నాలు ● ఇళ్ల స్థలాల కోసం పేదల నిరసన ● కామన్ పీజీసెట్ను రద్దు చేయాలన్న విద్యార్థులు ● హిందూ సంఘాల నాయకుల ఆందోళన ఒకటి కాదు.. రెండు కాదు.. వందల సంఖ్యలో సమస్యలు.. ప్రతి రోజూ అవస్థలే.. అయినా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం స్పందించకోపవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం భారీగా కలెక్టరేట్కు వచ్చి ధర్నాలు, నిరసనలు తెలిపారు. ప్రజల కష్టాలు పట్టవా అంటూ పాలకులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వ అధినేత స్పందించకపోతే ప్రతిరోజు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కామన్ పీజీసెట్ ఎంట్రెన్స్తో తమకు నష్టం వాటిల్లుతోందని, దానిని రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వరా.. ఎవరి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తోందని వివిధ సంఘాల నాయకులు మండిపడ్డారు. కర్నూలు జిల్లా పేరు లేకుండానే రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు చేయడం కూటమి ప్రభుత్వం దుర్ణీతికి నిదర్శనమని సీపీఐ నాయకులు ఆరోపించారు. జిల్లాకు జరిగిన అన్యాయంపై ధర్నా నిర్వహించారు. కాశిరెడ్డి నాయన ఆశ్రమంలో జరుగుతున్న కూల్చి వేతలను వెంటనే నిలపుదల చేయకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తోందని హిందూ సంఘాల నాయకులు హెచ్చరించారు. – కర్నూలు(సెంట్రల్) -
ఈ ప్రభుత్వం వద్దు
అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కర్నూలు జిల్లాపై సవతి తల్లి ప్రేమను చూపుతోందని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కె.జగన్నాథం విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్లో కర్నూలు జిల్లా పేరు లేకుండానే కేటాయింపులు చేయడం కూటమి ప్రభుత్వం దుర్ణీతికి నిదర్శనమని ఆరోపించారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ‘ఈ ప్రభుత్వం మాకు వద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన కర్నూలు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులైనా వేదవతి, గుండ్రేవుల, ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణాలకు నిధులు కేటాయించలేదన్నారు. జిల్లా పశ్చిమ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు వలస వెళ్తున్నా పట్టించుకోవడంలేదన్నారు. జిల్లాలో పరిశ్రమలను స్థాపించి యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలన్నారు. నాయకులు ఎస్.మునెప్ప, పి.రామకృష్ణారెడ్డి, నాగరాజు, శ్రీనివాసులు, ఈశ్వర్ పాల్గొన్నారు.