breaking news
Kurnool District Latest News
-
మంత్రి లోకేష్ పేరు చెప్పి భూములు కాజేశారు!
● వెంటనే చర్యలు తీసుకోవాలి ● పీజీఆర్ఎస్లో కై రుప్పల బాధితుల ఫిర్యాదు కర్నూలు(సెంట్రల్): మంత్రి లోకేష్ పేరు చెప్పి ఆస్పరి మండలం కై రుప్పల గ్రామ టీడీపీ నాయకుడు కమ్మరి వరప్రసాదు అనే వ్యక్తి భూములు కాజేస్తున్నారని, ఆయన స్వాధీనం నుంచి తమ భూములను తమకు ఇప్పించాలని అదే గ్రామానికి చెందిన కమ్మర గాయత్రీదేవి, సంధ్యారాణి అనే మహిళలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమా నికి డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, జెడ్పీ సీఈఓ వెంకటరమణారెడ్డి, అభియాన్ ఏపీసీ లోక రాజు హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మొత్తం 440 అర్జీలు పీజీఆర్ఎస్కు జిల్లా నలుమూలల నుంచి మొత్తం 440 అర్జీలు వచ్చాయి. ఇందులో రెవెన్యూకు సంబంధించే దాదాపు 150కిపైగా అర్జీలు ఉన్నాయి. పెన్షన్ల కోసం సుమారు 50కిపైగా అర్జీలు వచ్చాయి. అర్జీలకు సరైన పరిష్కారాలు చూపాలని, రీ ఓపెన్, ఇంప్రాపర్ రెడ్రసల్ కేసులను పూర్తిగా తగ్గించాలని అధికారులకు డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ సూచించారు. కాగా.. ఈనెల 24న సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన నేపథ్యంలో ఉన్నతాధికారులైన కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, జేసీ నూరుల్ ఖమర్ ఏర్పాట్లలో ఉన్నారు. దీంతో జిల్లా స్థాయి అధికారులే ఫిర్యాదులను స్వీకరించాల్సి వచ్చింది. మా చావులకు అధికారులే కారణం! తాము జీవనోధిపాధి కోసం గ్రామంలో లేకపోవడంతో కమ్మర వరప్రసాదు తమ భూములను వారి పేరిట ఆన్లైన్ చేయించుకున్నారని కమ్మర గాయత్రీదేవి, సంధ్యారాణి అనే మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా అధికారులు ఆయన పేరిట తమ భూములను ఆన్లైన్ చేసి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చారని కన్నీటి పర్యంతమయ్యారు. వాటిని వెంటనే రద్దు చేసి తమ పేరిట మార్చాలని కోరారు. లేదంటే తమ చావులకు అధికారులే కారణమవుతారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
రాత్రి వరకు ఎంటీఎస్ టీచర్ల కౌన్సెలింగ్
● కనీస సౌకర్యాలు కల్పించలేకపోయిన అధికారులు కర్నూలు సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మినిమం టైం స్కేల్ (ఎంటీఎస్) టీచర్లకు ఇటీవలే కూటమి ప్రభుత్వం రెన్యూవల్ చేసింది. 1998 డీఎస్సీ, 2008 డీఎస్సీలకు చెందిన ఎంటీఎస్ టీచర్లకు స్థానాలు కేటాయించేందుకు సమగ్ర శిక్ష కార్యాలయంలో సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. టీచర్ల మధ్య సీనియారిటీ విషయంలో స్పష్టత కోసం కొంత ఆలస్యంగానే కౌన్సెలింగ్ మొదలు పెట్టారు. కూర్చునేందుకు సరైన సదుపాయాలు లేక ఎంటీఎస్ టీచర్లు అవస్థలు పడ్డారు. కనీసం తాగేందుకు కూడా నీటి సదుపాయం కల్పించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లు 149, అలాగే 1998 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లు 180 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి స్థానాలు కేటాయించారు. సింగిల్ టీచర్ ఉన్న స్కూళ్లలో పనిచేసే వారికి కౌన్సెలింగ్ నిర్వహించ లేదని తెలుస్తోంది. కొత్త టీచర్లు వచ్చేంత వరకు అక్కడే పని చేయాల్సి ఉంటుందని అధికారులు వారికి సూచించారు. కౌన్సెలింగ్ను డీఈఓ ఎల్.సుధాకర్, డిప్యూటీ డీఈఓ శ్రీధర్ బాబు పర్యవేక్షించారు. -
సీనియర్ సహాయకులుగా ముగ్గురికి పదోన్నతి
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలోని వివిధ కార్యాలయాల్లో జూనియర్ సహాయకులుగా విధులు నిర్వహిస్తున్న ముగ్గురికి సీనియర్ సహాయకులుగా పదోన్నతి కల్పించారు. సోమవారం స్థానిక జెడ్పీలో జరిగిన కార్యక్రమంలో పదోన్నతి పొందిన ముగ్గురు సీనియర్ సహాయకులకు జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి పోస్టింగ్ ఆర్డర్స్ను అందించారు. పారదర్శకంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. పదోన్నతి పొందిన వారిలో పీ మల్లికార్జున రావునును ఆదోని ఎంపీపీ, డీ కిరణ్కుమార్ను పీఆర్ క్యూసీ సబ్ డివిజన్ కర్నూలు, డీ మౌలాలిని ఎంపీపీ పాణ్యంకు నియమించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి పాల్గొన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన తుగ్గలి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 24న జొన్నగిరి వద్ద జియోమైసూర్ కంపెనీ ప్రవేట్ లిమిటెడ్ (ఇండియా) గోల్డ్ మైనింగ్ కంపెనీ ప్రారంభోత్సవానికి వచ్చేస్తున్న సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, ఎస్పీ విక్రాంత్పాటిల్, జేసీ నూరుల్ఖమర్ ఏర్పాట్లను పరిశీలించారు. మైనింగ్ ప్లాంట్లో హెలిప్యాడ్, వ్యూ పాయింట్, బహిరంగ సభ, స్టాళ్ల ఏర్పాట్లను మ్యాప్ ద్వారా తెలసుకున్నారు. కార్యక్రమానికి 5వేల నుంచి 10వేల వరకు ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్అండ్బీ ఎస్ఈ మహేశ్వరరెడ్డి, డ్వామా పీడీ నరసింహారెడ్డి, కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రదీప్కుమార్, కర్నూలు, పత్తికొండ ఆర్డీవోలు సందీప్కుమార్, ఓబులేసు, ఆదోని ఇన్చార్జ్ సబ్ కలెక్టర్ మధుసూదన్రెడ్డి, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యుత్ సమస్యలకు సత్వర పరిష్కారం ● ఎస్ఈ ప్రదీప్కుమార్ కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని విద్యుత్శాఖ ఈఈ, డీఈఈ, ఏడీఈలను ఎస్ఈ ప్రదీప్కుమార్ ఆదేశించారు. కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్ భవన్లో సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించారు. వినియోగదారుల నుంచి ఫోన్ ద్వారా వివిధ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. బిల్లింగ్, పోల్స్ తదితర వాటికి సంబంధించిన సమస్యలను కొందరు ఎస్ఈ దృష్టికి తెచ్చారు. డీఈఈ విజయ భాస్కర్ పాల్గొన్నారు. రేపటి నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్ ● జూలై 6న సీట్ల కేటాయింపు కర్నూలు సిటీ: పాలిసెట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఈ నెల 24వ తేదీ నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఎస్.జి పుల్లారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవిఎస్ఎస్ఎన్ ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోపు https://polycet.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో బీసీ, బీసీ విద్యార్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.250 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి రసీదును ప్రింటౌట్ తీసుకోవాలన్నారు. ఒకటో ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు ఈ నెల 29 నుంచి జూలై 3వ తేది వరకు ఆన్లైన్లో ఆప్షన్ నమోదు చేసుకోవాలన్నారు. జూలై 4న ఆప్షన్ల మార్పునకు అవకాశం ఉంటుందని, జూలై 6వ తేదీ సీట్ల కేటాయింపు చేయనున్నారన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో సీటు పొందిన విద్యార్థులు రూ.4,700, ప్రైవేటు కాలేజీల్లో సీటు పొందిన విద్యార్థులు రూ.25 వేలు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 9052437831, 9703535575, 9848202584 అనే నంబర్లను సంప్రదించాలన్నారు. -
ఒట్టి మాటలు కట్టిపెట్టి.. గడ్డిమేలు తలపెట్టండి!
రోళ్లపాడు గడ్డి మైదానంలో కృష్ణ జింకలుఎన్ఎస్టీఆర్లో అరుదైన గడ్డి మైదానాలుఆత్మకూరురూరల్: పర్యావరణమంటే భూమిపై ఉండే సమస్త భూ ఉపరితల ఆవరణమని తెలుసుకోవాలి. అడవులను సంరక్షించడం ఒక్కటే సమగ్ర పర్యావరణ రక్షణ కాదు. విశాలమైన పచ్చికబయళ్లు, పొద లు, గుల్మాలతో కూడిన గడ్డితో మైదానాలు కూడా. ఇవి పర్యావరణ సమతుల్యతకు విశేషంగా దోహద పడుతున్నావి. సాధారణ గడ్డి మైదానాలు జీవవైవిధ్యానికి ఇతోదికంగా ఉపయోగ పడుతున్నప్పటికీ వాటిని గ్రేజింగ్ (పశువులు మేసే బీళ్లు) గానో, బంజరులు గానో రెవెన్యూ రికార్డులు వర్గీకరిస్తున్నాయి కానీ వాటి సంరక్షణకు ఇప్పటికీ ప్రత్యేక చట్టాలు లేవు. నాగార్జునసాగర్ –శ్రీశైలం పులుల అభయారణ్యం పరిధిలో ఉన్న రోళ్లపాడు గడ్డి మైదానాలు క్షీణదశకు చేరుకుంటున్నా అటవీ అధికారులు ప్రమాదాన్ని గుర్తించలేక పోతున్నారు. బట్టమేకపక్షి సంరక్షణ కేంద్రంగా ఉన్నప్పటికీ పరిసరాల్లో చోటు చేసుకున్న పెను మార్పులు గుర్తించక పోవడంతో ఈ మైదానం పర్యావరణ సమతుల్యతకు కృషి చేయలేక పోతోంది. రోళ్లపాడు అభయారణ్యంలో ఇప్పటికే బట్టమేక పక్షి జాడ కనిపించడం లేదు. గడ్డి మైదానాల్లో ఉండాల్సిన పొదలు, గుల్మాల వంటి వాటిని తొలగించడంతో ఇక్కడ ఉండాల్సిన ప్రధాన మాంసాహార జంతువు తోడేలు జీవనం ప్రమాదంలో పడుతోంది. పలు ప్యాక్ (గుంపు)లుగా ఉన్న తోడేళ్లు ఇప్పుడు అక్కడ కనిపించడం లేదు. క్షీణతకు కారణాలివే.. రోళ్లపాడు వంటి ప్రధాన గడ్డి మైదానాల ప్రాంతం ఒకప్పుడు మోకాటి ఎత్తు గడ్డిలో పలు రకాల కీటక జాతులకు ఆలవాలంగా ఉండేది. ఈ గడ్డి మైదానాల్లో కృష్ణ జింకల మందలు, గొర్ల మందలు తిరుగుతు మేస్తూ ఉంటే కీటకాలు పైకి లేస్తూ బట్టమేక, నేల నెమలి వంటి పక్షులకు పుష్కల ఆహారం అందించేవి. అందుకే అరుదైన బట్టమేక పక్షుల సంరక్షణ కేంద్రంగా దీన్ని అభయారణ్యంగా నోటిఫై చేశారు. అయితే ఇప్పుడు ఇక్కడ బట్టమేక పక్షి అసలు కనిపించడం లేదు. రోళ్లపాడు అభయారణ్యం చుట్టూ ఉన్న గ్రామ పరిధిలో ఒకప్పుడు కొర్రలు, ఆరికెలు వంటి తృణధాన్యాలు, అపరాల సాగు ఉండేది. అలాగే వేరుశనగ పంట కూడా ప్రముఖంగా పండేది. ఇది బట్టమేక పక్షికి ముఖ్య ఆహారం. అయితే ఈ పక్షి కేంద్రానికి ఆనుకుని అలగనూరు జలాశయం నిర్మించడం, శ్రీశైలం కుడిగట్టు కాలువలు రావడంతో వ్యవసాయ రీతి మారింది. వరి ప్రధాన పంటగా మారడంతో పాటు ఉద్యాన పంటలు పెరిగి అపరాలు, తృణధాన్యాలు మాయమయ్యాయి. మరో వైపు మరో వైపు అటవీ జీవావరణానికి ప్రమాద కరమైన ప్రోసోపిస్ (ముళ్ల పొదలు) జాతులు ఆక్రమణ కూడా జరుగుతోంది. ఈ జాతి మొక్కలు, గడ్డిని ఎదగకుండా చేస్తాయి. అంతే కాకుండా రోళ్లపాడు అనుబంధంగా ఉన్న ఎర్రమల చుట్టూ భారీ సోలార్ ప్రాజెక్ట్లు రావడంతో భూ స్వరూపమే పూర్తిగా మారింది. దీంతో రోళ్లపాడు అభయారణ్యం ఉనికిని కోల్పోతోంది. భారత దేశపు గడ్డి మైదానాలు జీవావరణ ప్రాంతాలు. వీటిని రక్షించుకోవడానికి ప్రత్యేక చట్టాల ఆవశ్యకత ఉంది. 1986 పర్యావరణ రక్షణ చట్టం ఉన్నప్పటికీ దాని తీవ్రత సరిపోవడం లేదు. జాతీయ గడ్డి భూముల రక్షణపై ఏళ్లుగా చర్చలు జరుగుతున్నప్పటికీ సమగ్రమైన చట్ట పరిధి రక్షణ ఇప్పటికీ రూపొంద లేదు. ఇప్పటికై నా తగు చర్యలు తీసుకోక పోతే రోళ్లపాడు వంటి అద్భుతమైన గడ్డి మైదానాల్లో ఏషియన్ చీతా, బట్టమేక, తోడేలు వంటి అపురూప వన్యప్రాణుల పునఃప్రవేశాన్ని కలగనలేము. – బి.విజయకుమార్ సీఎఫ్ డైరెక్టర్, ఫారెస్ట్ అకాడమి, రాజమండ్రి క్షీణదశలో రోళ్లపాడు గడ్డి మైదానాలు కనిపించని బట్టమేక... కనుమరుగవుతున్న తోడేళ్లు పర్యావరణ సమతుల్యతకు గడ్డి మైదానాలు కీలకం ప్రమాదాన్ని గుర్తించని అటవీ అధికారులు -
అనుమతి ఒకటి.. ప్రచారంలో మరొకటి!
● పత్తికొండలో ఒక స్కూల్ నిర్వాకం ● మోసపోతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు పత్తికొండ: అనుమతి ఒక స్కూల్పైనే తీసుకుని ప్రచారంలో మరొక పాఠశాల పేరు చెబుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. పత్తికొండలో నడుస్తున్న ఈ స్కూల్పై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఆరేళ్ల కిందట పట్టణంలోని యశోదగార్డెన్ పాఠశాలను శ్రీచైతన్య విద్యా సంస్థల యాజమాన్యం లీజుకు తీసుకుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునేందుకు న్యాయపరమైన అడ్డంకులు వచ్చాయి. దీంతో అనుమతులు కోసం దరఖాస్తు చేసుకోలేదు. ఇదిలా ఉండగా శ్రీచైతన్య స్కూల్ పేరుతో ప్రచారం చేసుకోని అడ్మిషన్లు చేయించుకుంటున్నారు. యశోదగార్డెన్ పేరుతో పాఠశాల నిర్వహిస్తున్నారు. ఫీజుల దోపిడీ! శ్రీచైతన్య అలియాస్ యశోదగార్డెన్ స్కూల్లో ఇంటిగ్రేటిడ్ చదువు పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నారు. సీబీఎస్ఈ సిలబస్, సీ బ్యాచ్, స్టేట్ సిలబస్ అంటూ మూడు భాగాలు చేసి ఫీజులు తీసుకుంటున్నారు. నర్సరీలో స్టడీ కోసం ఫీజు రూ.20వేలు ఉంది. పుస్తకాలు, యూనిఫామ్, స్టడీ మెటీరియల్ పేరుతో 35వేల రూపాయిలు ఉంటుంది. 6 నుండి 10 వరకు రూ.70వేలు దాకా ఉంటుంది. జిల్లా కేంద్రంలో ఉన్న ఫీజులు ఇక్కడ వసూలు చేస్తూ గ్రామీణ విద్యార్థులపై పెనుభారం మోపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా యశోదగార్డెన్ స్కూల్ పేరుతో అనుమతి తీసుకుని శ్రీచైతన్య పేరుతో నడిచే పాఠశాలలో నిబంధనలకు విరుద్ధం వ్యవహరిస్తున్నారు. అధికారుల కళ్లకు గంతలు కట్టి చదువు పేరుతో ఫీజులు దోపిడీకి యాజమాన్యం పాల్పడుతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాల ఆవరణలో ఎక్కడా ఫీజులు సూచించే బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. గతంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఫిర్యాదులపై తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న అరోపణలు ఉన్నాయి. యశోదగార్డెన్ స్కూల్ పేరుతో గుర్తింపు ఉండి శ్రీచైతన్య పేరుతో ప్రచారం చేసుకొని అడ్మిషన్లు చేసుకుంటున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీనిపై పాఠశాల యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ నిబంధనలను వివరిస్తాం. లేదంటే నోటీసులు జారీ చేసి చర్యలకు జిల్లా అధికారులుకు సిఫార్సు చేస్తాం. శ్రీచైతన్య పేరుతో వారు ఎలాంటి ప్రచారం చేసుకోవడానికి విద్యాశాఖ నుంచి అనుమతులు లేవు. – మాలతీ ఎంఈఓ -
రక్షణ నల్లమలకే పరిమితమా..
1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1980 అటవీ సంరక్షణ చట్టాలు కేవలం అడవుల సంరక్షణ కోసం మాత్రమే పరిమితమవుతున్నాయి. గడ్డి మైదానాల రక్షణకు స్వయం ఛాలక వ్యవస్థ ఏది లేక పోవడం సంపూర్ణ జీవావరణ వ్యవస్థకు విఘాతంగా మారుతోంది. అలాగే గ్రాస్ మాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన డాక్టర్ మురాత్కర్ లాటి వారిచేత గడ్డి మైదానాల అభివృద్ధిపై వర్క్షాప్లు, ప్రణాళికలు ఎన్ఎస్టీఆర్లో చేపడుతున్నప్పటికీ అడవి వెలుపల ఉన్న రోళ్ల పాడు గడ్డి మైదానాల అభివృద్ధికి, రక్షణకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. గడ్డి మైదానాలను కీలకమైన వన్యప్రాణి ఆవాస కేంద్రాలుగా గుర్తించి వాటి రక్షణకు ప్రభుత్వం పూనుకోవాలి. అప్పుడే గడ్డి మైదానాల ఆవాస వన్యప్రాణులైన కృష్ణ జింకలు, తోడేళ్లు, బట్టమేక పక్షులు, గోల్డెన్ జాకాల్ (నక్క)లు మనుగడ సాగిస్తాయి. ఇప్పటికే ఈ గడ్డి మైదానాల నుంచి అదృశ్యమైన ఏషియన్ చీతా అంశం నుంచి పాఠాలు నేర్చుకుని వాటి పునరుజ్జీవనానికి కృషి చేయాలని జీవావరణ ప్రేమికులు కోరుతున్నారు. -
ఎల్నినో ‘మండుతోంది’!
● కర్నూలులో 39, నంద్యాలలో 39.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకర్నూలు(అగ్రికల్చర్): ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వానాకాలం వచ్చి 22 రోజులవుతున్నా ఎండాకాలంగానే కనిపిస్తుండటం గమనార్హం. ఇటీవల వర్షాలు కొంతవరకు మురిపించినప్పటికీ.. ఆ తర్వాత నైరుతి రుతుపవనాలు ముఖం చాటేశాయి. దీంతో వర్షాలు కనుమరుగై ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు భూములను సిద్ధం చేసుకున్నారు. విత్తనం విత్తుకోవడానికి వానలు కరువయ్యాయి. సాధారణంగా ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల వరకు మాత్రమే నమోదవుతాయి. కానీ కర్నూలులో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27.9 డిగ్రీలు నమోదయ్యాయి, నంద్యాలలో గరిష్ట ఉష్ణోగ్రత 39.5 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26.6 డిగ్రీలు నమోదయ్యాయి. సాధారణం కంటే 4 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.7 మి.మీ ఉండగా.. 96.3 మిమీ వర్షపాతం నమోదైంది. 10 రోజులుగా చినుకు జాడ లేకపోవడంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకమవుతోంది. ఆగస్టు వరకు ఎల్నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. -
తలకెక్కించుకోవాల్సిందే...
హెల్మెట్ వినియోగం విషయంలో కూడా జిల్లాలో ఇంకా నిర్లక్ష్యం కనిపిస్తోంది. శిరోభారం అనే ఆలోచనను వాహనదారులు వీడాల్సిన అవసరముంది. ఆరునెలల వ్యవధిలో ఏకంగా 3,145 మంది వీటిని ధరించకపోవడం వల్ల జరిమానా రూపంలో భారీగా ప్రభుత్వ ఖజానాకు చెల్లించారు. సిగ్నల్ జంపింగ్, అధిక బరువు, మైనర్లు వాహనాలు నడపటం, అదనంగా ప్రయాణికులను తీసుకెళ్లడం లాంటి కేసుల సంఖ్య కూడా తగ్గేలా వాహనదారుల్లో మార్పు రావాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. కర్నూలు: హెల్మెట్ లేకుండా బైకులపై రయ్మని దూసుకెళ్లడం.. మద్యం తాగిన తర్వాత వాహనాన్ని నడపటం.. వ్యతిరేక మార్గంలో ప్రయాణించడం.. పరిమితికి మించి ప్రయాణికులను తరలించడం.. లైసెన్స్, వాహనాల పత్రాలు లేకుండానే డ్రైవింగ్ చేయడం.. పరిపాటిగా మారింది. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధమైన ప్రయాణాల జోరు జిల్లాలో పెరుగుతోంది. ఏమవుతుందనే సాహసమో.. ఒక్కసారే కదా అనే నిర్లక్ష్యమో ఏదైమైతేనేమి వాహనదారుల జేబుకు చిల్లు పడుతోంది. ఎవరికి వారుగా చిన్నపాటి మొత్తంగానే భావించినా ట్రాఫిక్ ఉల్లంఘనకు వాహనదారులు తగిన మూల్యాన్ని మాత్రం భారీగానే చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 2026 జనవరి నుంచి జూన్ 20వ తేదీ వరకు ఆరు నెలల వ్యవధిలోనే ఉల్లంఘనలకు సంబంధించి 57 వేలకు పైగా కేసులు నమోదైన తీరు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. మొదటి స్థానంలో లైసెన్స్, రికార్డులు లేని కేసులు 57 వేల కేసుల్లో లైసెన్స్, వాహన పత్రాలు లేకుండా నడిపిన కేసులే అత్యధికంగా ఉన్నాయి. ఇందుకు దాదాపు రూ.23 లక్షలకు పైగా వాహనదారులు జరిమానాల రూపంలో చెల్లించారు. నంబర్ ప్లేట్లు లేకుండా తిప్పుతున్న వాహనాలపై నమోదైన కేసులు రెండో స్థానంలో ఉన్నాయి. దాదాపు 6,043కు పైగా నంబర్ ప్లేట్లు లేని కేసులు నమోదయ్యాయి. ట్రాఫిక్ సిగ్సల్స్ పడినా పట్టించుకోని వాహనదారులపై కూడా 4,332 కేసులు నమోదయ్యాయి. అలాగే రాంగ్ రూట్ ప్రయాణాలతో ప్రమాదాల బారిన పడుతున్న సంఘటనలు నిత్యం జిల్లాలో ఏదో ఒక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడపటమే దీనికి కారణమని తెలిసినప్పటికీ వాహనదారుల్లో మార్పు కరువైంది. సమయం కలసివస్తుందని కొందరు వాహనదారులు చేస్తున్న తప్పిదం ఎంతోమంది ప్రాణాల మీదకు తెస్తోంది. యూటర్న్ తీసుకుని వెళ్లాలంటే అర కిలోమీటర్, కిలోమీటర్ ప్రయాణించాల్సి వస్తోందని రాంగ్రూట్లో వెళ్తున్నారు. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ ట్రాఫిక్ ఉల్లంఘనలు మాత్రం తగ్గడం లేదు. ‘మత్తు’గా దొరికిపోతున్నారు! మద్యం తాగి వాహనాలు నడపొద్దని తనిఖీల సందర్భంగా అధికారులు హెచ్చరిస్తున్నా కేసులు నమోదు చేసి కోర్టు మెట్లు ఎక్కించి భారీగా జరిమానాలు విధిస్తున్నా మందుబాబుల్లో మార్పు కనిపించడం లేదు. మద్యం మత్తులో వాహనాలు తోలుతూ కొందరు ప్రమాదాల బారిన పడుతుండగా పోలీసుల తనిఖీల్లో దొరికి భారీగా జరిమానాలు చెల్లించి ఆర్థికంగా చిత్తవుతున్న వారి సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోంది. ఇందులో యువతే అధిక సంఖ్యలో ఉండటం ఆందోళనకర పరిణామం. గత ఏడాది జిల్లాలో ఏకంగా 9,360 మంది మందు బాబులు తనిఖీల్లో పోలీసులకు దొరికిపోయారు. వారిని న్యాయస్థానాల్లో హాజరుపర్చగా మొదటి ఆరు మాసాలు ఒక్కొక్కరు రూ.3 వేలు, రెండో ఆరు మాసాలు ఒక్కొక్కరు రూ.10 వేల చొప్పున జరిమానా రూపంలో రూ.6.50 కోట్లు మూల్యం చెల్లించారు. అలాగే ఈ ఏడాది ఆరు మాసాల వ్యవధిలోనే 4258 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు కాగా రూ.4.26 కోట్లు జరిమానా రూపంలో చెల్లించుకున్నారు. ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చినా.. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అమలు చేసేందుకు కర్నూలు నగరంలో ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. నగరంలోని రాజ్విహార్, పాత కంట్రోల్ రూమ్ సెంటర్, పంప్హౌస్, వెంకటరమణ కాలనీ, ఐదు రోడ్ల కూడలి, సి.క్యాంప్ సెంటర్, నంద్యాల చెక్పోస్టుతో పాటు ప్రధాన రహదారుల్లో వందకు పైగా ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థతో నిఘా ఏర్పాటు చేశారు. ఉల్లంఘనలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా పర్యవేక్షణ ఉంది. రక్షణతో పాటు పర్యవేక్షణ కోసం వీటి సంఖ్యను నగరంలో పెంచనున్నారు. అయినప్పటికీ వాహనదారుల ఉల్లంఘనల జోరు కొనసాగుతూనే ఉంది. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్న కూడళ్లలో ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వాహన చోదకులు ఇష్టారాజ్యంగా దూసుకెళ్తున్నారు. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్ వంటి ఉల్లంఘనలు కూడా ఎక్కువే. మైనర్ల చేతికి ద్విచక్ర వాహనాలు ఇవ్వడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవు. రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు జిల్లా అంతటా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆటోడ్రైవర్లకు, ద్విచక్ర వాహనదారులకు పోలీసులు ప్రతిరోజూ పోలీస్స్టేషన్ల వారీగా అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే వారికి తనిఖీల సందర్భంగా జరిమానాలు విధిస్తారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కడ జరిగినా, ఇబ్బందికరంగా వాహనాలు నడిపినా డయల్ 100 లేదా 112కు సమాచారమివ్వాలి. – విక్రాంత్ పాటిల్, ఎస్పీ లైసెన్స్, వాహన 13,640 నెంబర్ ప్లేట్లు లేకుండా 6,043 సిగ్నల్ జంపింగ్ 4,332 ఓవర్ స్పీడ్ 4,106 వ్యతిరేక మార్గ ప్రయాణం 3,784 ఓవర్ లోడ్ 3,146 హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ 3,145 సెల్ఫోన్ మాట్లాడుతూ 1,089 బహిరంగ ప్రదేశాల్లో 7,963 ట్రిపుల్ రైడింగ్ 286 అదనపు ప్రయాణికులు 401 సీటు బెల్టు లేకుండా డ్రైవింగ్ 249 మైనర్ డ్రైవింగ్ 52 ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోని వైనం మద్యం మత్తులో డ్రైవింగ్ ఆరు నెలల్లో 57 వేల కేసులు జరిమానాల జోరుతో జేబులు గుల్ల -
డీసీసీబీ పర్సన్ ఇన్చార్జ్ పదవీకాలం పొడిగింపు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా సహకార కేంద్రబ్యాంకు నాన్ ఆఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్ పదవీ కాలం ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 26వ తేదీతో పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో వ్యవసాయ, సహకార శాఖల ప్రిన్స్పల్ సెక్రటరీ రాజశేఖర్ ఆరు నెలలు పొడిగిస్తూ జీవో ఆర్టీ నంబరు 551 జారీ చేశారు. కర్నూలు డీసీసీబీ పర్సన్ ఇన్చార్జ్ డి.విష్ణువర్ధన్రెడ్డి ఈ ఏడాది డిసెంబరు 26 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. శాస్త్రోక్తంగా సహస్ర దీపార్చన సేవ శ్రీశైలంటెంపుల్: జ్యోతిర్లింగక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రమైన శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామి వార్లకు సోమవారం దేవస్థానం సహస్రదీపార్చన సేవ నిర్వహించింది. ముందుగా ఆలయ ప్రాంగణంలోని పురాతన మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో సహస్రదీపార్చన పూజలు జరిపించారు. ఈ సేవలో భాగంగా మండపంలో వెయ్యి దీపాలను వెలిగించి, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. అనంతరం స్వామిఅమ్మవార్లను వెండిరథంపై ఉంచి ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. తుంగభద్రలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కర్నూలు (సెంట్రల్): నగర పరిధిలోని తుంగభద్ర నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించినట్లు వన్టౌన్ సీఐ మారుతి శంకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మృతురాలు 5.6 అడుగుల ఎత్తు ఉండి, కుడి చేతిపై కె.బాషా అనే అక్షరాలతో పచ్చబొట్టు ఉందన్నారు. లేత ఆకుపచ్చ పూల అంచుల నల్ల చీర, ఆకుపచ్చ గాజులు ధరించిందని, ఎవరైనా ఆమెను గుర్తు పడితే వన్టౌన్ పోలీస్స్టేషన్లో సమాచారమివ్వాలని సీఐ సూచించారు. ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ దాడులు వెల్దుర్తి: మండల కేంద్రంలోని 7 విత్తనాలు, ఎరువుల దుకాణాలలో సోమవారం ఏకకాలంలో కర్నూలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ పవన్ కిశోర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. రిజిస్టర్లు, స్టాకు పరిశీలిస్తూ, గోడౌన్లలో సోదాలు చేపట్టారు. రెండు దుకాణాలలో యూరియా, ఇతరత్రా ఎరువులను ఎమ్మార్పీకి మించి అమ్మడాన్ని గుర్తించారు. ఆయా దుకాణదారులపై నిత్యావసరాల చట్టం క్రింద కేసు నమోదు చేసి, రూ.4,09,450ల విలువైన 274 బస్తాలను సీజ్ చేసినట్లు తెలిపారు. దాడుల్లో కర్నూలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వ్యవసాయాధికారి విశ్వనాథ్, స్థానిక వ్యవసాయాధికారి అక్బర్ బాషాపాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి ప్యాపిలి: పట్టణ సమీపంలోని స్థానిక కలచట్ల బ్రిడ్జిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చంద్రమోహన్ (50) మృతి చెందాడు. తుగ్గలి మండలం లంకాయపల్లె గ్రామానికి చెందిన చంద్రమోహన్ సొంత పని నిమిత్తం బైక్పై ప్యాపిలికి చేరుకున్నాడు. పని ముగించుకుని తిరిగి వెళ్తుండగా కలచట్ల బ్రిడ్జిపై లారీ ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న హైవే అంబులెన్సు సిబ్బంది క్షతగాత్రున్ని డోన్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. గర్భిణి ప్రాణాలు కాపాడిన పోలీసులు ఆదోని అర్బన్: తనతోపాటు రెండేళ్ల కుమారుడిని తీసుకుని వెళ్లి రాంజల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకునేందు వెళ్లిన గర్భిణిని ఆదోని త్రీటౌన్ పోలీసులు అన్వర్, గురుప్రసాద్, పరశురామ్ కాపాడారు. ఆత్మహత్య చేసుకోవద్దని ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆదోని పట్టణంలో అంబేడ్కర్ నగర్కు చెందిన ఫిఫా అలియాస్ ఈశ్వర్, సునీత భార్యభర్తలు. ప్రతిరోజూ భర్త మద్యం సేవించి వేధించేవాడు. సోమవారం మద్యం మత్తులో వచ్చి భార్య సునీతతో గొడవపడి చెప్పుతో కొట్టాడు. దీంతో సునీత అవమానంగా భావించి రెండేళ్ల కుమారుడిని ఎత్తుకుని రాంజల చెరువులో ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లిందని పోలీసులు తెలిపారు. ఆమె ప్రవర్తన చూసిన స్థానికులు వెంటనే 100కు కాల్ చేయడంతో తాము స్పందించి రాంజల చెరువు వద్దకు వెళ్లి సునీతను, ఆమె రెండేళ్ల కుమారుడిని ప్రాణాపాయం నుంచి కాపాడినట్లు తెలిపారు. -
నిజాలు వెల్లడయ్యేనా? కటకటాల్లో సమాధేనా!
ఆదోని: గంగమ్మ పోలీసు కస్టడీ మృతి కేసులో ప్రత్యక్ష సాక్షి దర్గప్ప బెయిల్ పిటీషన్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సోమవారం జిల్లా కోర్టులో జరిగిన విచారణలో దర్గప్ప తరపు న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ తమ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును నేటికి వాయిదా వేశారు. ఇప్పటికే రెండు రోజుల క్రితం హైకోర్టు ఆదేశాల మేరకు కర్నూలు మేజిస్ట్రేట్ పోలీసు కస్టడీలోని దర్గప్ప వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో పోలీసు పహరా మధ్య పోలీసు సదన్లో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఎవరినీ కలిసేందుకు పోలీసులు అనుమతించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దర్గప్ప ఆరోగ్యం, ఆయన ఇచ్చిన వాంగ్మూలం కేసును ఎలాంటి మలుపు తిప్పుతుందోననే చర్చ కొనసాగుతోంది. హత్యోదంతంలో మరొకరు ఎవరు? కుమారుని హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ పోలీసు విచారణలో గంగమ్మ మృతి చెందడం తెలిసిందే. విచారణ సందర్భంగా సిట్ పోలీసులు కొట్టడం వల్లే ఆమె మరణించినట్లు పత్రికల్లో విరుస కథనాలు వెలువడ్డాయి. అయితే పోలీసులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఇదిలాఉంటే తన తల్లి కిందపడటం వల్లే మరణించినట్లు గంగమ్మ కుమార్తెతో పోలీసులు రాతపూర్వకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కుమారుడి హత్యోదంతంలో గంగమ్మ, దర్గప్పతో పాటు మరొకరు కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు పోలీసులు మరొకరు ఎవరనే విషయాన్ని కూడా వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 22 రోజులుగా పోలీసుల ఆధీనంలోనే! సిట్ పోలీసుల విచారణ ఇప్పటికే వివాదాస్పదం కావడం తెలిసిందే. గంగమ్మ మృతి, దర్గప్ప ఆసుపత్రి పాలవడం చూస్తే ఏస్థాయిలో తమదైన శైలిలో విచారణ చేపట్టారో అర్థమవుతోంది. హైకోర్టు దర్గప్ప వాంగ్మూలాన్ని కోరడంతో పోలీసులు ఆయనను ఏమైనా భయపెట్టి ఉంటారేమోనని చర్చ జరుగుతోంది. గంగమ్మ మరణం వెనుక మిస్టరీని దర్గప్ప నిర్భయంగా బయటపెట్టగలడా? లేక తనను కూడా ఏమైనా చేస్తారేమోనని పోలీసుల స్క్రిప్టుతో సరిపెడతాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల్లో వణుకు సిట్ పోలీసుల తీరు తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని స్థానిక పోలీసుల్లో వణుకు మొదలైంది. ఇప్పటికే కేసు రోజుకో మలుపు తిరుగుతుండటం, వ్యవహారం హైకోర్టు వరకు చేరడంతో ఎవరి ‘సిట్’కిందకు నీళ్లు వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. కౌతాళం సీఐ కూడా విజయవాడలోనే మకాం వేయడం, స్థానిక పోలీసులు ఇద్దరు, ముగ్గురిపై వేటు పడక తప్పదనే ప్రచారం ప్రతి ఒక్కరినీ కలవరపెడుతోంది. ఫిర్యాదు స్వీకరించే విషయంలో నిర్లక్ష్యం నేపథ్యంలో గతంలో ఇక్కడ పనిచేసిన అధికారిపైనా చర్యలు తీసుకుంటారనే చర్చ కొనసాగుతోంది. మొత్తంగా నేడు కోర్టులు ఏవిధంగా స్పందిస్తాయోనని పోలీసుల్లో ఉత్కంఠ నెలకొంది.నేడు హైకోర్టుకు దర్గప్ప వాంగ్మూలంగంగమ్మ మరణం వెనుక నిజానిజాలను వెల్లడించాల్సిన ప్రత్యక్ష సాక్షి దర్గప్ప. వీరిద్దరిపైనే సిట్ పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికీ గంగమ్మ మరణం వెనుక కారణాలను పోలీసులు వెల్లడించకపోవడం.. దర్గప్ప ఆరోగ్య పరిస్థితిని వివరించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే దర్గప్ప కనీసం నడవలేని స్థితిలో కాళ్లు సెప్టిక్ అయ్యాయని, అంతర్గత అవయవాలు కూడా దెబ్బతిన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇదిలా ఉండగా ఇంజినీరింగ్ చదువుతున్న దర్గప్ప కుమారుడు తండ్రికి బెయిల్ మంజూరు చేయించాలని ఆదోని చెందిన ప్రముఖ న్యాయవాదిని ఆశ్రయించాడు. ఈ బెయిల్ పిటిషన్పై నేడు తీర్పు వెలువడనుండటం, మరోవైపు హైకోర్టు దర్గప్ప వాంగ్మూలాన్ని ఈనెల 23న తమ ముందుంచాలని ఆదేశించడం ఆసక్తి రేపుతోంది. గంగమ్మ మృతి ఇప్పటికీ అనుమానాస్పదమే లాకప్డెత్గానే పత్రికల్లో కథనాలు కిందపడి చనిపోయినట్లుగా కుమార్తెతో లేఖ పోలీసుల తప్పించుకునే ప్రయత్నమనే వాదన ఇదే కేసులోని దర్గప్ప ఆసుపత్రిపాలు 22 రోజులకు పైగా కొనసాగుతున్న చికిత్స -
కూటమి ప్రభుత్వంలో ఓట్ల గల్లంతు ఖాయం
● బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి ● వైఎస్సార్సీపీ వర్గీయుల ఓట్లు తొలగించకుండా జాగ్రత్త పడాలి ● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆలూరు రూరల్: కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ వర్గీయుల ఓట్లు గల్లంతు కావడం ఖాయమని, గ్రామాల్లో బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. సోమవారం ఆయన మండలంలోని కరిడిగుడ్డం, ముద్దనగేరి, కురుకుంద, మూసానహళ్లి, కాత్రికి, గోనేహాల్, మనేకుర్తి, అంగస్కల్ గ్రామాల్లో పర్యటించారు. బీఎల్ఏలు, ఓటర్లను అవగాహన కల్పించారు. ఎన్నికల్లో నేరుగా గెలిచే పరిస్థితి చంద్రబాబుకు లేదన్నారు. వెన్నుపోటులతోనే ఆయన అధికారంలోకి వచ్చారని, తిరిగి అధికారంలోకి రావటానికి ఓట్లు గల్లంతు చేస్తారన్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వైఎస్సార్సీపీ వర్గీయుల ఓట్లు తీసివేసే ప్రక్రియ కచ్చితంగా సాగుతోందన్నారు. ‘సర్’ ప్రక్రియలో బీఎల్ఏలు వైఎస్సార్సీపీ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఓటరు సవరణ చాలా ప్రాధాన్యత ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో అర్హులైన వారు ఓటు వేసేలా జాగ్రత్త తీసుకోవాలన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన వారి ఓట్లు తొలగించకుండా, డబుల్ ఎంట్రీలు లేకుండా చూడాల్సి బాధ్యత బీఎల్ఏలపై ఉందన్నారు. కూటమి ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమై టీడీపీ యాప్ ద్వారా తమ వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందన్నారు. ప్రతి బీఎల్ఏ ఇంటింటికి తిరిగి ఓటర్లకు ఇచ్చిన ఫారాలను పరిశీలించి వివరాలన్నీ పూర్తి చేయించాలన్నారు. చంద్రబాబు పాలనంతా మోసమే! హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసగించడం చంద్రబాబుకు వెన్నుతో పెట్టిన విద్య అని ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మొక్కుబడిగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాల్ని సైతం లక్షలాది రూపాయలకు అమ్ముకోవడం సిగ్గుచేటన్నారు. అన్నదాత సుఖీభవలో కోత విధించడం సరికాదన్నారు. సూపర్ సిక్స్ పేరిట మోసం చేసిన చంద్రబాబును గద్దె దింపేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బీఎల్ఏలు, ఎంపీటీసీలు, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో నెమలి మృతి
చాగలమర్రి: మండల కేంద్రంలో సోమవారం జాతీయ పక్షి నెమలి విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. నల్లమల అటవీ ప్రాంతం నుంచి అడ్డువాగు కాలువ మీదుగా పాత హైవే పైకి చేరుకుంది. జన సంచారంలోకి వచ్చిన నెమలి భయపడి సమీపంలోని 11 కేవీ విద్యుత్ తీగలపైకి ఎగరడంతో విద్యుదాఘాతానికి గురై గాయపడింది. స్థానికులు గుర్తించి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే డి.వనిపెంట సెక్షన్ అధికారి టి. రామకృష్ణ అక్కడికి చేరుకుని గాయపడిన నెమలికి వైద్య చికిత్స అందించినా కోలుకోలేక మృతి చెందింది. పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేస్తామని అటవీ అధికారులు తెలిపారు. -
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్
కర్నూలు: నగరంలోని బళ్లారి చౌరస్తా సమీపంలో ఉన్న కేశవ గ్రాండ్ హోటల్ వద్ద సిటీ కేఫ్లో ఈ నెల 16వ తేదీన రియల్ ఎస్టేట్ వ్యాపారి పాతబస్తీ గరీబ్నగర్కు చెందిన నవీద్పై జరిగిన హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులను నాలుగో పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. తన మిత్రులు మహబూబ్బాషా, బీసన్నతో కలిసి కర్నూలు సిటీ కేఫ్లో మాట్లాడుతుండగా, ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా హోటల్లోకి ప్రవేశించి నవీద్ను చంపాలనే ఉద్దేశంతో కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో స్నేహితులు ఆయనను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షి మహబూబ్బాషా ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన నాలుగో పట్టణ పోలీసులు నవీద్ ఇంటి సమీపంలో నివసిస్తున్న గుజిరి సామాన్ల వ్యాపారం చేసే షేక్షా, అతని అన్న కుమారుడు అబ్దుల్ రహిమాన్, అక్క కొడుకు రెహాన్ను నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారు దాడికి ఉపయోగించిన రెండు కత్తులు, ఒక ఆటోను సీజ్ చేసి నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా, రిమాండ్కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు. వారిని పంచలింగాల జిల్లా కారాగారంలో అప్పగించినట్లు తెలిపారు. నవీద్, షేక్షా మధ్య ఎల్కూరు బంగ్లా వద్దగల ఐదు సెంట్ల ప్లాట్ విషయంలో జరిగిన లావాదేవీల్లో వచ్చిన మనస్పర్థలే హత్యాయత్నానికి దారి తీసినట్లు దర్యాప్తులో తేలిందని సీఐ తెలిపారు. -
ఇప్పటి వరకు ఇవ్వలేదు
ఈ ఏడాది ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నా. మిరప, ఉల్లి సాగు చేయాలని పొలంలోనే నారు పోశా. మొక్కలు నాటుకొచ్చాయి కానీ అవసరమైన ఎరువులు లేవు. దీంతో నాటు వేయడం ఆపేశాను. రైతుకు ఇంట్లో ఎరువులు ఉంటేనే పంటలు సాగే చేసే ధైర్యం వస్తుంది. రైతుభరోసా కేంద్రాల దగ్గర సారోళ్ల అడిగితే ఎరువులు వస్తాయని చెప్పినారు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. ముఖ్యంగా యూరియా చాలా అవసరం. – రామాంజనేయులు, రైతు, పత్తికొండ చాలా ఏళ్లుగా పొలాలను కౌలు తీసుకుని పంటలను సాగు చేస్తున్నా. ఈ ఏడాది ఎరువులను తీసుకునేందుకు వీలుకుదరడం లేదు. ఇంత దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. ఎరువులు లేకుండా పంటలను ఎలా సాగు చేసుకోవాలి? ఇకనైనా ప్రభుత్వం తీరు మార్చుకుని రైతులందరికీ అవసరమైన ఎరువులను అందజేయాలి. – వెంకటేష్, కౌలు రైతు, సి.బెళగల్ పంటల సాగుకు సత్తువ ఎరువులు చాలా అవసరం. అలాంటి ఎరువులు ఏవీ అందుబాటులో లేవు. గత ప్రభుత్వంలో ఊర్లో ఉన్న రైతు భరోసా కేంద్రంలోనే యూరియా, సత్తువ(డీఏపీ) ఎరువులు, పురుగు నివారణ మందులు అన్నీ ఆర్బీకేలో అందుబాటులో ఉండేవి. ఈ ప్రభుత్వ వచ్చాక ఆర్బీకేని ఆర్ఎస్కేగా పేరు మార్చారు తప్ప ప్రయోజనమేమీలేదు. ఇప్పుడు యూరియా తప్ప ఏవీ లేవు. ఎరువులు తెచ్చుకోవాలంటే డోన్కు 30 కిలోమీటర్లు, పత్తికొండకు 28 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. డోన్ నుంచి బస్తాకు ఆటో బాడుగ రూ.55. పత్తికొండ నుంచి రూ.50 చెల్లించాల్సి వస్తోంది. ఆర్ఎస్కేల్లో విలువైన కియోస్క్ యంత్రాలు కూడా మూలనపడ్డాయి. ఏవీ పనిచేయడం లేదు. – ఈశ్వరరెడ్డి, రైతు, బొందిమడుగుల -
అమ్మవారికి పల్లకీ సేవ
శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆదివారం సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఉత్సవమూర్తులు ఆశీనులుగావించి వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు చేసి, మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో దేవస్థాన అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శిగా శోభన్బాబు శ్రీశైలంప్రాజెక్ట్: సున్నిపెంటకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు గంగుమాల శోభన్బాబు పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ప్రకటనను జారీ చేసింది. శోభన్బాబు కరాటే రంగంపై మక్కువతో తైక్వాండో రాష్ట్రస్థాయి ప్రధాన కార్యదర్శిగా ఎదిగాడు. వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తుండడంతో పార్టీలో పదవి లభించింది. యువకుడిపై పోక్సో కేసు బొమ్మలసత్రం: పట్టణంలోని టూటౌన్ పోలీస్టేషన్ పరిధిలో ఓ యువకుడిపై ఆదివారం పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ అస్రార్బాషా తెలిపారు. మూడవ తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలిక ఇంటి ముందు ఒంటరిగా నిద్రిస్తుండగా ఇంటి పక్కన నివాసముంటున్న 18 ఏళ్ల జ్ఞానమూర్తి బాలిక పక్కన కూర్చుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన బాలిక కుటుంబ సభ్యులు యువకుడినిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సోకేసు నమోదు చేశారు. పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు కొలిమిగుండ్ల(అవుకు): మండల పరిధిలోని గుండ్లశింగవరం సమీపంలో ఆదివారం కారు అదుపుతప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. వివరాలిలా ఉన్నాయి. అనంతపురం నుంచి నంద్యాల వైపు వెళుతున్న కారు గుండ్లశింగవరం సమీపానికి చేరుకోగానే మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించ ప్రయత్నంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న పంట కాల్వలోకి పడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు క్షేమంగా బయట పడ్డారు. స్థానికులు, వాహనదారుల సాయంతో ఇరువురిని బయటకు తీసుకొచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పంట కాల్వలో పడిన కారును క్రేన్ సాయంతో బయటకు తీయించారు. అనధికార మద్యంవిక్రయదారుల అరెస్ట్ కర్నూలు: బెల్ట్ దుకాణాల ద్వారా (అనధికార) మద్యం విక్రయాలు జరుపుతున్న 45 మందిని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు ఆదేశాల మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో టాస్క్ఫోర్స్ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించి 67 లీటర్ల అనధికార మద్యం సీజ్చేసి విక్రయదారులపై కేసు నమోదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రాజశేఖర్గౌడ్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 14 ఎకై ్సజ్ స్టేషన్లు ఉన్నాయి, ఆయా స్టేషన్ల అధికారులతో కలిసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనధికార మద్యం దుకాణాలతో పాటు బహిరంగ ప్రదేశాల్లో మద్య పానంపై కూడా తనిఖీలు నిర్వహించారు. 32 మందిపై బహిరంగ సేవనం కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం బనగానపల్లె: మండలంలోని రాళ్లకొత్తూరు గ్రామ సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. బనగానపల్లె సీఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల మేరకు.. రాళ్లకొత్తూరుతండా గ్రామానికి చెందిన కిశోర్నాయక్ (23) రాంకో సిమెంట్ ఫ్యాక్టరీలో లారీ డ్రైవర్గా పని చేసేవాడు. శనివారం డ్యూటీ ముగిశాక మోటర్ సైకిల్పై స్వగ్రామానికి బయలుదేరాడు. రాళ్లకొత్తూరు సమీపంలో రహదారిపై లారీ ఆగి ఉంది. చీకటిలో కనిపించకపోవడంతో దానిని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బనగానపల్లె సీఐ సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి సోదరుడు రవితేజానాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
నిజ జీవితంలో యోగా అవసరం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్థికర్నూలు (టౌన్): అనునిత్యం ఎదురయ్యే అటుపోట్లను అధిగమించేందుకు నిజ జీవితంలో యోగా అవసరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్ధి అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమన్నారు. శారీరక, మానసిక ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి చైతన్యం కలిగించడమే అంతర్జాతీయ యోగా దినోత్సవ ఉద్దేశమన్నారు. న్యాయ శాఖ ఉద్యోగి, యోగా మాస్టర్ ముంతాజ్ యోగాసనాలు చేయించారు. జిల్లా జడ్జీలు రామచంద్రుడు, శోభారాణి, లక్ష్మీరాజ్యం, వెంకట హరినాథ్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి, సీనియర్ సివిల్ జడ్జీలు సంధ్యారాణి, అపర్ణ, సరోజమ్మ, అనూష, స్రవంతి, అనిల్ కుమార్, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ‘నీట్’ రీఎగ్జామ్
● జిల్లాలో 16 కేంద్రాల్లో నిర్వహణ ● 92.29 శాతం హాజరు ● పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కర్నూలు సిటీ: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం నీట్ రీఎగ్జామ్ను ప్రశాంతంగా నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 16 కేంద్రాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, దివ్యాంగులకు సాయంత్రం 6.15 గంటల వరకు ఆఫ్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించారు. మొత్తం 4,995 మందికి గాను 4,610మంది విద్యార్థులు హాజరు 385 మంది గైర్హాజరయ్యారు. గత నెలలో నీట్ ప్రశ్నపత్రం లీక్ కావడంతో రీ–ఎగ్జామ్ పకడ్బందీగా నిర్వహించారు. భారీ బందోబస్తు ప్రతి కేంద్రానికి ఒక తహసీల్దార్, ప్రతి నాలుగు కేంద్రాలకు ఓ జిల్లా అధికారిని నోడల్ ఆఫీసర్గా నియమించారు. అదే విధంగా కేంద్రాల దగ్గర భారీగానే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నీట్ పరీక్ష విద్యార్థులందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. ఎన్టీఏ నిబంధనల మేరకు ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. కర్నూలు బీక్యాంపులోని ప్రభుత్వ బాలురు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి డోన్కి చెందిన ఇద్దరు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో పరీక్ష రాయలేకపోయారని సమాచారం. కర్నూలులోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని కనుక్కునేందుకు కొంత మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కర్నూలు నగరంలోని ఇందిరాగాంధీ స్మారక నగర పాలక హైస్కూల్, కేవీఆర్ మహిళా డిగ్రీ కాలేజీలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ సిరి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పరీక్ష ప్రశాంతంగా జరిగిందని, 92.29 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. -
గతంలో పంపిణీ విధానమే మేలు
గతంలో రైతుల నుంచి పాసుపుస్తకం జిరాక్స్ ప్రతిని తీసుకుని వివరాలు రాసుకుని టోకన్ ఇచ్చేవారు. రైతులకు సమయం ఎంతో ఆదా అయ్యేది. ప్రస్తుతం రైతుసేవా కేంద్రాలకు వచ్చి పాసుపుస్తకం, ఆధార్కార్డు సమర్పించి వివరాలను నమోదు చేయించుకుని, మూడు సార్లు వచ్చిన ఓటీపీలను చెప్పాల్సి వస్తుంది. దీంతో రైతులు ఉదయం నుంచి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. – మహానంది, రైతు నేను 50 ఎకరాల్లో సోయాబీన్, ఆరు ఎకరాల్లో మొక్కజొన్న వేశా. ఎకరాకు డీఏపీ ఒక బస్తా ఇస్తే ఏరకంగా పంట సాగు చేయాలి? నాకున్న సొంత భూమికి ఇచ్చారు. కౌలుకు వేసుకున్న 20 ఎకరాల పొలానికి ఎరువులు ఎట్లా? పొలం కౌలుకు ఇచ్చిన వారు ఇక్కడ లేరు. వారు ఇక్కడకు వచ్చి యాప్తో వేలిముద్ర వేసి ఎరువులు ఇప్పించడం కుదురుతుందా? ఇప్పుడు నాకు సోయాబీన్కు డీఏపీ, యూరియా కావాలి. పంటను పండించాలా, నాశనం చేసుకోవాలా? ఇలాగైతే వ్యవసాయం చేయలేం! – శ్రీనివాసులు, రైతు పాములపాడు నేను నాలుగు ఎకరాల్లో పత్తి పంట సాగు చేశా. కొన్ని రోజులుగా డీలర్లు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా యూరియా దొరకడం లేదు. వరి మడులను సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికై నా యూరియా అందుబాటులో ఉంటే బాగుంటుంది. యూరియా అత్యవసరమవుతుంది. రైతులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని చెబుతున్నారు. కానీ మాకు యాప్ తెలియదు. ప్రభుత్వమే అర్హులైన రైతులందరికీ యూరియా పంపిణీ చేయాలి. – కురవ భీరప్ప, రైతు, జొహరాపురం -
ఓటరూ.. ఆందోళన వద్దు!
అన్ మ్యాప్డు కాకపోయినా..కర్నూలు(సెంట్రల్): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)పై ఎన్నికల కమిషన్ ఓటర్లకు శుభవార్త చెప్పింది. అన్మ్యాప్డు ఓటర్లను భయపెడుతున్న అంశంపై తాజాగా వివరణ ఇచ్చింది. 2025, 2002 ఓటరు జాబితాలు మ్యాప్ కాకపోయినా ఎన్యుమరేషన్ ఫామ్ను ఎన్నికల కమిషన్కు సమర్పిస్తే సరిపోతుందని తెలిపింది. అంతేకాక ఎన్నికల కమిషన్ గుర్తించిన ఆధార్తోపాటు 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఒక్కదాన్ని సమర్పించాలని షరతు పెట్టింది. కర్నూలు జిల్లాలో 2025 ఓటరు జాబితా ప్రకారం 20,86,119 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్ల వివరాలన్నీ 2002 జాబితాతో సరి పోల్చడమే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ముఖ్య ఉద్దేశం. అయితే ప్రస్తుతం ఉన్న ఓటర్లలో చాలా మంది 2002 జాబితా తో పోల్చితే మ్యాప్ కావడం లేదు. దీంతో చాలా మంది అన్మ్యాప్డ్గా మిగిలిపోతున్నారు. దీంతో వారంతా తమను ఓటర్లుగా తొలగిస్తారనే భయంతో ఉన్న నేపథ్యంలో అన్ మ్యాప్డ్ ఓటర్లకు ఎన్నికల కమిషన్ వివరణతో కొంత ఆందోళన తగ్గింది. రెండు జాబితాల్లో పేరు లేకపోతే... ప్రస్తుతం జరుగుతున్న సర్ ప్రక్రియలో 2002, 2025 ఓటరు జాబితాలు అత్యంత కీలకం. రెండు జాబితాల్లో ఓటరుగా ఉండటం లేదా తల్లిదండ్రులు వివరాలు కలిగి ఉండాలి. అప్పుడు ఓటరుగా కొనసాగిస్తారు. అయితే రెండు జాబితాల్లో పేర్లు లేనివారు ఏమి చేయాలంటే... కొత్తగా ఓటు నమోదుకు ఫామ్–6ను నింపి ఇస్తే సరిపోతుంది. వారి పేరు కూడా కొత్తగా వచ్చే ఓటరు జాబితాలో వచ్చేస్తుంది. డబుల్ ఓటర్లకు.. ట్రబులే! ప్రస్తుతం ఉన్న ఓటరు జాబితాలో చాలా మందికి రెండు చోట్లా ఓటు హక్కు ఉంది. అయితే గతంలో ఎన్నికల కమిషన్ చేపట్టే స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్)లో దానిని గుర్తించేందుకు డమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్ పద్ధతిని వాడిన సరైన ఫలితం లభించేది కాదు. ఈ క్రమంలో ప్రస్తుతం చేపట్టే సర్లో మాత్రం డబుల్ ఓటర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. రెండు చోట్లా ఓటు ఉన్నా ఒక్క చోటే ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వాలి. కాదని రెండు చోట్లా ఇచ్చినా వారు సమర్పించి గుర్తింపు కార్డులతో పట్టుబడే అవకాశం ఉంది. దీంతో డబుల్ ఓటర్లకు ట్రబుల్ మొదలైందనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న ఓటర్లలో ఎవరినీ తొలగించం. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దు. ఓటర్లు సరైన డాక్యుమెంట్లను సమర్పిస్తే ఎవరి ఓటును తొలగించడం, చేర్చడంకానీ చేయడానికి వీలు ఉండదు. అన్మ్యాప్డు ఓటర్లు అయితే ఎన్యుమరేషన్ ఫామ్ను ఇస్తే సరిపోతుంది. దానికి 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఒక దానిని సమర్పించాల్సి ఉంటుంది. – డాక్టర్ ఎ.సిరి, జిల్లా ఎన్నికల అధికారిణి, కర్నూలు ఎన్యుమరేషన్ ఫామ్ నింపితే చాలు ఓటు పదిలమే 2002 జాబితాలో తల్లిదండ్రుల పేర్లు లేకపోయినా భయం అవసరం లేదు ఎన్యుమరేషన్ ఫామ్తోపాటు 13 రకాల గుర్తింపు కార్డుల్లో దేనినైనా సమర్పిస్తే సరి 2002, 2025 జాబితాల్లో అసలు పేరే లేకపోతే ఫామ్–6 ఇస్తే ఓటుగా నమోదు 2002 జాబితాలో ప్రస్తుత ఓటరు వివరాలు లేకపోయినా, వారి తల్లిదండ్రుల వివరాలు లేక పోయినా.. మ్యాపింగ్ అయి ఉంటే చాలు ఎన్యుమరేషన్ ఫామ్ ఇస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. అయితే అన్మ్యాప్డ్ ఓటర్లకు నోటీసు ఇస్తామని, తాము గుర్తించిన 13 రకాల గుర్తింపు కార్డులను సమర్పిస్తే సరిపోతుందని ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చింది. 1987 జూలై ఒకటో తేదీ నాటికీ ఓటరు జన్మించి ఉంటే తనకు సంబంధించిన గుర్తింపు కార్డుల్లో ఒక్కదాన్ని ఇస్తే సరిపోతుంది. 1987 జూలై 01 నుంచి 2004 డిసెంబర్ 02వ తేదీ మధ్య జన్మించి ఓటరైతే తన ఒక్క గుర్తింపు కార్డుతోపాటు తల్లిదండ్రుల్లో ఒకరి వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. 2004 డిసెంబర్ 02 తరువాత జన్మించిన ఓటరైతే తన గుర్తింపు కార్డుతోపాటు తల్లిదండ్రుల ఇద్దరి గుర్తింపు కార్డులను సమర్పిస్తే సరిపోతుంది. 2004 తరువాత విదేశాల నుంచి వచ్చి ఇండియాలో ఉంటే అతని పాస్పోర్టు, వీసాలను సమర్పించి ఓటు హక్కును పొందవచ్చు. -
చంద్రబాబు పాలనపై తీవ్ర అసంతృప్తి
● టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన 30 కుటుంబాలుచిప్పగిరి: చంద్రబాబు పాలనపై రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి అన్నారు. హొళగుంద మండలంలోని సులువాయి గ్రామం నుంచి 30 కుంటుంబాల సభ్యులు టీడీపీని వీడి ఆదివారం వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ కార్యాలయంలో వారికి వైఎస్సార్సీపీ కండువా వేసి ఎమ్మెల్యే ఆహ్వానించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వ విధానాలు రాష్ట్ర ప్రజలకు నచ్చడం లేదన్నారు. ఎన్నికల సమయంలో సూపర్సిక్స్ పేరుతో అమలుకు సాధ్యంకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా పూర్తిగా విఫలం అయ్యారన్నారు. ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి గొప్పలు చెబుతున్నారని, అధికారం చేపట్టి రెండు సంవత్సరాలవుతున్నా ఒక్క కొత్త పింఛన్ ఇవ్వలేదన్నారు. అభివృద్ధి పేరిట చేసస్తున్న రూ. లక్షల కోట్ల అప్పులు ఎక్కడికి పోతున్నాయో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీడీపీని భూస్థాపితం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో శేఖప్ప, ఖాశీం, నాగరాజు, ఉప్పర రామంజిని, బోయ గోవిందు, మహబూబ్ సాబ్, చాకలి హనుమంతు, శంకరప్ప, బోయ తిమ్మప్ప, దాసరి బీమయ్య, చంద్రశేఖర్, తిక్కప్ప, హుసేని, మల్లికార్జున, సుభాన్ సాబ్, గిరప్ప తదితరులు ఉన్నారు. -
దొంగ అరెస్ట్
● మోటారు సైకిల్ స్వాధీనంకర్నూలు: నగరు శివారులోని కోడుమూరు రోడ్డులో హోసన్నా మందిరం సమీపాన నివసించే శోభారాణి ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగను నాలుగో పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. శోభారాణి గత నెలలో ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా అనంతపురానికి వెళ్లారు ఇదే అదనుగా భావించిన దొంగ ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి 30 తులాల వెండి ఆభరణాలు, ఇంటి బయట పార్కు చేసిన ఉంచిన ద్విచక్రవాహనం చోరీ చేసి పరారయ్యాడు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దొంగలు తెలంగాణ రాష్ట్రం పరిగి కురుకచెర్లలో నివాసం ఉండే అరుణ్కుమార్, యామీన్గా గుర్తించారు. కోడుమూరు రోడ్లోని రియలెన్స్ మార్ట్ వద్ద యామీన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. అతని వద్ద నుంచి మోటారు సైకిల్ను స్వాధీనం చేసుకొని నిందితుడిని న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా రిమాండ్కు ఆదేశించారు. ఈ కేసులో మరో ముద్దాయి అరుణ్కుమార్ను అరెస్ట్ చేయాల్సి ఉందని సీఐ విక్రమసింహ తెలిపారు. -
పొలంలో ప్రాణాలు వదలిన వీఆర్వో
ఎమ్మిగనూరురూరల్/గోనెగండ్ల: పొలంలో పనిచేస్తూ గుండెపోటు రావటంతో వీఆర్వో తలారి మునెప్ప(53) మృతి చెందారు. ఎమ్మిగనూరు మండలం పార్లపల్లి గ్రామానికి చెందిన మునెప్ప గతంలో కౌతాళం మండలం ఎరిగేరిలో వీఆర్వోగా పనిచేశారు. సంవత్సరం క్రితం గోనెగండ్ల మండలానికి బదిలీపై వచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో తన స్వగ్రామం అయిన పార్లపల్లి గ్రామానికి వెళ్లారు. భార్య భాగ్యమ్మతో కలసి పొలం పనులకు వెళ్లి ఒక్కసారిగా ఛాతీలో నొప్పి వస్తుందని భార్యకు చెప్పి పక్కకు ఒరిగిపోయారు. వెంటనే భార్య భాగ్యమ్మ కుమారుడు నరసింహులుకు ఫోన్ చేసి చెప్పారు. పొలం దగ్గరకు వెళ్లి ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధం చేయటంతో అప్పటికే ప్రాణాలు వదిలినట్లు గుర్తించారు. దీంతో మునెప్ప మృతదేహంపై పడి భార్య, కుమారుడు రోదించటం అక్కడి వారి కంట కన్నీరు తెప్పించింది. వీఆర్వో మునెప్పకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీఆర్వో మృతిపై గోనెగండ్ల తహసీల్దార్ రాజేశ్వరి, సిబ్బంది సంతాపం తెలిపారు. -
మంత్రాలయంలో సోమయాగం
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన మంత్రాలయంలో ఆదివారం వేదపండితులు సోమయాగంను ప్రారంభించారు. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆజ్ఞానుసారం ఈ యాగం 24వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమయాగంతో దేశంలో వైపరీత్యాలు వైదొలగి సకాలంలో వర్షాలు కురుస్తాయన్నారు. రైతులకు పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని ఈ హోమం చేపడుతున్నట్లు చెప్పారు. రాఘవేంద్రస్వామి ఆశీస్సులు ప్రజలకు ఉండాలన్నారు. పందికోన మలలో నెమళ్లు పత్తికొండ: వాన పడిన సమయంలో నెమళ్లు పూరి విప్పి నాట్యం చేస్తే చూపరులకు కనువిందుగా ఉంటుంది. అలాంటి నెమళ్లు ఆవాసంగా పందికోన మల మారింది. పత్తికొండ పట్టణ శివారు నుంచి పందికోన, పెండ్లిమాన్తండాల నడుమ వేలాది ఎకరాల్లో పందికొన మల విస్తరించి ఉంది. వన్య ప్రాణాలు ఇక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. పందికోన మలలో నాలుగు దిక్కుల్లో వందలాది నెమళ్లు పొలాల్లో సంచరిస్తూ కనువిందు చేస్తున్నాయి. కందిసాగుకు 4,300 మినీకిట్లు కర్నూలు(అగ్రికల్చర్): ఆత్మనిర్భర్త ఇన్ పల్సెస్ కింద జిల్లాలో కంది సాగును ప్రోత్సహించనున్నారు. ఈ పథకం కింద ఎల్ఆర్జీ–105 రకం కంది విత్తనాలు 172 క్వింటాళ్లను మినీకిట్ల రూపంలో పంపిణీ చేయనున్నారు. మొత్తం 4,300 కందుల మినీకిట్లు పంపిణీ చేయడానికి రంగం సిద్ధమైంది. ఎల్ఆర్జీ–105 రకం విత్తనాలను 100 శాతం సబ్సడీతో పంపిణీ చేయనున్నారు. అదే విధంగా ఎల్ఆర్జీ–52 రకం కంది విత్తనాలను 50 క్వింటాళ్లు సబ్సిడీపై పంపిణీ చేయనున్నారు. కిలో పూర్తి ధర రూ.120.50 ఉండగా రూ.30 రాయితీ ఉంటుంది. నాలుగు కిలోల ప్యాకెట్కు సబ్సిడీ పోను రైతులు రూ.362 చెల్లించాల్సి ఉంది. -
మొహర్రం గుర్రం వచ్చెన్..!
మతసామరస్యానికి ప్రతీకగా హిందూ, ముస్లింలు సమైక్యంగా జరుపుకునే మొహర్రం వేడుకల్లో గుర్రాలకు ప్రత్యేకత ఉంది. అశ్వం స్వామివారి వాహనం కావడంతో కానుకగా లోహపు గుర్రాలను సమర్పిస్తారు. కోరినకోర్కెలు నెరవేరిన భక్తులు స్వామివార్లకు మొక్కుబడిగా గుర్రాలను సమర్పించుకుంటారు. తమ స్థోమతను బట్టి తోచినంతగా దగ్గరుండి గుర్రాలను ఎంతో ప్రీతిపాత్రంగా తయారు చేయించుకుంటారు. ఇంటి దగ్గర భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఊరేగింపుగా పీర్లచావిడులకు వచ్చి స్వామివారికి కానుకలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. మొహర్రం ఆరంభంతో శిల్ప కళాకారులకు చేతికి గుర్రాల తయారీ పని దొరికింది. దీంతో కళాకారులు గుర్రాల తయారీలో నిమగ్నమయ్యారు. – పత్తికొండ రూరల్ -
కార్యకర్తలకు అండగా ఉంటాం
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డిఓర్వకల్లు: కార్యకర్తల కుటుంబాలకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. మండలంలోని పాలకొలను గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త రామచంద్రుడు ఐదు నెలల క్రితం అకాల మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని కాటసాని రాంభూపాల్రెడ్డి పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం కాటసాని స్వగృహంలో రామచంద్రుడు కుటుంబానికి రూ.30 వేలు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం కాటసాని మాట్లాడుతూ.. కార్యకర్తల సంక్షేమానికి ఎల్లప్పుడూ ముందుంటానని భరోసా ఇచ్చారు. కార్యకర్తలు పార్టీకి బలమైన పునాదులని, వారి కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామన్నారు. రామచంద్రుడు కుటుంబానికి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. జెడ్పీటీసీ రంగనాథ్గౌడు, పాలకొలను రమేష్, అక్కిమి హనుమంతరెడ్డి, ఉలిందకొండ రమణారెడ్డి, గుట్టపాడు రామకృష్ణారెడ్డి, పాలకొలను మద్దయ్య, మాబాషా, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. -
వానల్లేవ్.. వరదల్లేవ్
● టీబీ డ్యాం ఎగువన కురవని వర్షాలు ● పూర్తిగా నిలిచిన ఇన్ఫ్లో ● డ్యాంలో 9.748 టీఎంసీలు నీరు నిల్వహొళగుంద: ఈ ఏడాది ప్రారంభంలో తుంగభద్ర డ్యాంకు ఆశించిన స్థాయిలో నీరు చేరకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది జూన్ నెలలో వేగంగా నిండిన డ్యాం ప్రస్తుతం వెలవెలబోతోంది. నైరుతి రుతుపవనాల ఆగమనం జరిగినా జలాశయం ఎగువ భాగంలోని శివమొగ్గ, చిక్మంగళూరు, శృంగేరి, వరనాడు తదితర ప్రాంతాల్లో వర్షాలు కురువకపోవడంతో డ్యాంకు వరద రావడం లేదు. రెండు వారాల క్రితం అడపాదడపా వర్షాల కారణంగా వరద వచ్చినా అది కూడా 500 క్యూసెక్కులు దాట లేదు. దీంతో ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనబడుతుండడంతో జలాశయం మీద ఆధార పడిన కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల రైతులు ఆందోళన చెందుతున్నారు. శనివారం ఉదయం డ్యాంకు ఇన్ఫ్లో 78 క్యూసెక్కులుండగా సాయంత్రానికి దాదాపు 30 క్యూసెక్కులకు పడి పోగా.. ఆదివారం ఉదయానికి పూర్తిగా నిలిచిపోయింది. గతేడాది ఈ సమయానికి ఇన్ఫ్లో 38 వేల క్యూసెక్కులు ఉండేది. జలాశయం పూర్తి సామర్థ్యం 1,633 అడుగుల వద్ద 105.788 టీఎంసీలు కాగా గతేడాది ఇదే సమయానికి 1612.09 అడుగుల వద్ద 41.856 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. ఈ ఏడాది ఆదివారం నాటికి 1588.40 అడుగుల వద్ద కేవలం 9.748 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. వరుణుడు కరుణిస్తాడా.. రిజర్వాయర్ నిండుతుందా అని మూడు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. -
దగాకోరు ప్రభుత్వంలో అన్నదాతల అవస్థలు
● పంటలకు గిట్టుబాటు ధర లేదు ● పెట్టుబడి సాయం దూరమైంది ● పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పత్తికొండ: దగాకోరు ప్రభుత్వంలో అన్నదాతలు అవస్థలు పడుతున్నారని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. ఆదివారం పత్తికొండ పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందేవని తెలిపారు. నేడు అన్నదాత సుఖీభవ క్రమంగా అన్నదాత దుఃఖీభవగా మారిందన్నారు. కేంద్రసాయంతో సంబంధం లేకుండా ప్రతి ఏడాది రూ. 20 వేలు అందజేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. రైతులను మోసం చేయడంలో చంద్రబాబుకు ఎవరూ సాటిరారని విమర్శించారు. అన్నదాత సుఖీభవలో ప్రతి ఏడాది రైతులు సంఖ్య పెరగాలని కాని అందుకు భిన్నంగా తగ్గడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని, సున్నావడ్డీ రుణాలు రద్దు చేశారని, రైతులు ఎలా బతకాలని ప్రశ్నించారు. పత్తికొండ నియోజకవర్గంలో రైతులు పండించిన టమాట, ఉల్లి పంటను గత ఏడాది రోడ్లపై, పొలాల్లో పారబోస్తుంటే కనీసం దయ కూడా చూపలేదన్నారు. ‘కూటమి’ నిర్లక్ష్యం కూరగాయలు పండించడంలో పత్తికొండ ప్రాంత రైతు లు భారీ స్థాయిలో ఉండటం గర్వంగా ఉందని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. టమాట సాగులో రాష్ట్రంలో చిత్తూరు జిల్లా మదనపల్లి తరువాత పత్తికొండ రెండో స్థానంలో ఉందన్నారు. ఇంతటి స్థాయిలో కూరగాయులు పండించే పత్తికొండ రైతులపై అన్ని విధాలా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి సోమశేఖర్, మేధావుల ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీరంగడు, సీనియర్ నాయకులు అటికెలగుండు బాబుల్రెడ్డి, ఎంపీపీ నారాయణ్దాస్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్నాయక్, బనగాని శ్రీనువాసులు, మండల కన్వీనర్ కారం నాగరాజుయాదవ్, నాయకులు కేశవరెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, సాబ్డిన్ నూర్భాషా, జాకీర్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. -
నాన్నకు బిడ్డే మహారాణి
తండ్రి చెంత ఉంటే ప్రతి బిడ్డ మహారాణే.. ప్రతి కొడుకు మహారాజునే. ఎంత కష్టమొచ్చినా.. బిడ్డలకు ఏ లోటు లేకుండా తండ్రి చూసుకుంటాడు. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా పలువురు తమ వాట్సాప్ స్టేటస్లో నాన్న ఫొటోలు పోస్టు చేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. తమ నాన్న కష్టాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రేమను వ్యక్తం చేశారు. మరి కొందరు అందుబాటులో ఉన్న తండ్రికి పాదాభివందనం చేసి ఆశ్వీరాదం తీసుకోగా ఇంకొందరు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అయితే పట్టణంలోని పాత బస్టాండ్లో ఒక తండ్రి తన కూతురును అట్ట పెట్టెలు వేసిన బండిపై కూర్చోబెట్టుకొని తీసుకెళుతున్న దృశ్యాన్ని చూసి.. తండ్రి ఉన్న ప్రతి బిడ్డ మహారాణినే అంటూ చర్చించుకున్నారు. – డోన్ టౌన్ -
నీట్ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
కర్నూలు: నీట్ పునఃపరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఆదివారం నిర్వహించనున్న నీట్ పరీక్ష నేపథ్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెరేడ్ మైదానంలో బందోబస్తు విధులకు హాజరైన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. ప్రతి కేంద్రం వద్ద సీఐ స్థాయి అధికారితో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రశ్నాపత్రాల రవాణా సమయంలో సివిల్ పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ సిబ్బందితో ఎస్కార్ట్ ఏర్పాటు చేశామన్నారు. మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్లు, ల్యాప్టాప్లు, బ్లూటూత్, ఇయర్ ఫోన్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరాదని సూచించారు. అడిషనల్ ఎస్పీలు హుసేన్ పీరా, కృష్ణమోహన్, డీఎస్పీ రాఘవేంద్ర, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు చర్యలు
కర్నూలు(అగ్రికల్చర్): ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో పశుగ్రాసం సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, అయితే కొరతను అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఎల్నినో కారణంగా పచ్చిమేత కొరతతో పాటు పశువులకు తాగునీటి కొరత కూడా ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. జిల్లాలో 7 లక్షల యూనిట్ల పశువులు ఉన్నాయని, ఆగస్టు నెల వరకు 3 లక్షల టన్నుల పశుగ్రాసం అవసరం కాగా 2.67 లక్షల టన్నుల పశుగ్రాసం అందుబాటులో ఉందన్నారు. పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు 75 శాతం సబ్సిడీతో 46 టన్నుల పశుగ్రాసం విత్తనాలు పంపిణీ చేస్తున్నామన్నారు. అదే విధంగా 946 టన్నుల సమీకృత దాణా కూడా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈపీఎండీఎస్ పద్ధతిలో 365 రోజులు భూమిని కప్పి ఉంచే నిరంతర పశుగ్రాసాల సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. -
బెల్టు షాపులపై దాడులు
కర్నూలు: అక్రమ మద్యం అమ్మకాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఎకై ్సజ్ అధికారులు దాడులు విస్తృతం చేశారు. ప్రొహిబిషన్ అండ్ ఎ కై ్సజ్ జిల్లా అధికారి సుధీర్ బాబు ఆదేశాల మేరకు ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణా రెడ్డి, కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ సీఐ చంద్రహాస్, ఎస్ఐలు రెహనా, మారుతీ ప్రసాద్, తేజ తదితరులు తమ సిబ్బందితో బృందాలుగా ఏర్పడి కర్నూలు నగరంలో శుక్రవారం అర్ధరాత్రి వరకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి పలువురిపై కేసులు నమోదు చేశారు. కర్నూలుకు చెందిన సుధాకర్ పొరుగు రాష్ట్రం తెలంగాణకు సంబంధించిన మద్యం బాటిళ్లను అక్రమంగా నిల్వ ఉంచి విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించి 12 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పసుపల గ్రామానికి చెందిన జ్యోతి వద్ద నుంచి 7 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీరు కొంతకాలంగా బెల్టు షాపులు నిర్వహిస్తూ అక్రమంగా మద్యం విక్రయాలు జరుపుతున్నట్లు విచారణలో బయటపడటంతో వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న ఐదుగురిపై కూడా కేసు నమోదు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా దేవకద్రకు చెందిన రఫిక్, కల్లూరుకు చెందిన దస్తగిరి, కర్నూలుకు చెందిన బాలకృష్ణతో పాటు మరో ఇద్దరు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంతో అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. -
అదనపు కోర్టులతో కేసులకు సత్వర పరిష్కారం
● ఎమ్మిగనూరులో రెండు కోర్టులు ● జూలై నెలాఖరులోపు ప్రారంభం ● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి ఎమ్మిగనూరురూరల్: అదనపు కోర్టుల ఏర్పాటుతో పెండింగ్లో ఉన్న చాలా కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి పేర్కొన్నారు. పట్టణంలోని పాత తహసీల్దార్ కార్యాలయ భవనం, కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ కార్యాలయాన్ని ఆయనతోపాటు జిడ్జి పి.హేమ, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఆర్అండ్బీ డీఈ నాగరాజు, బార్ అసోషియేషన్ సభ్యులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి జి.కబర్ధి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు కోర్టులు ఏర్పాటుకు రూ. 96 కోట్లు కేటాయిస్తే కర్నూలు జిల్లాకు రూ. 21 కోట్లు వచ్చాయన్నారు. ఎమ్మిగనూరుకు ఉన్న కోర్టుతో పాటు అదనపు కోర్టు, మెజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటుకు రూ. 2 కోట్లు కేటాయించిందని తెలిపారు. ప్రస్తుతానికి పాత తహసీల్దార్ కార్యాలయంలో ఒక కోర్టు, కోర్టు అవరణలో ఉన్న బార్ అసోసియేషన్ కార్యాలయంలో మరో కోర్టు ఏర్పాటుకు నిర్ణయించినట్లు చెప్పారు. బార్ అసోసియేషన్ సభ్యులు తమ భవాన్ని అదనపు కోర్టుకు ఇచ్చి తాము షెడ్స్లో ఉంటామని చెప్పటం చాలా సంతోషంగా ఉందన్నారు. రెండు కొత్త కోర్టులను జూలై నెలాఖరు లోపు ప్రారంభించనున్నట్లు, అంతలోపే సంబందిత అఽధికారులు మరమ్మతులు చేయించి సిద్ధం చేయాలన్నారు. ఎమ్మిగనూరు కోర్టులో ఇప్పటి వరకు 5 వేల కేసు పెండింగ్లో ఉన్నాయని, ఇప్పుడు కొత్త కోర్టుల ఏర్పాటు చేస్తే వాటికి త్వరితగిగతి పరిష్కారం లభిస్తుందన్నారు. కక్షిదారులు తమ కేసుల అప్పీల్కు ఆదోని కోర్టుకు వెళ్లేవారని ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయబోయే అదనపు కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చునని తెలిపారు. గోనెగండ్ల మండలానికి సంబంధించిన కేసులు పత్తికొండ కోర్టుకు వెళ్లేవని, ఇక నుంచి ఎమ్మిగనూరు కోర్టుకు మార్పు చేసినట్లు చెప్పారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. రషీదుల్లా, జనరల్ సెక్రటరీ కె.మల్లికార్జున, సీనియర్ న్యాయవాదులు పరమేశప్ప, లక్ష్మినారాయణరెడ్డి, డి. మల్లికార్జున, బార్ అసోసియేసన్ సభ్యులు పాల్గొన్నారు. -
పోలీసులూ.. టీడీపీ తొత్తులుగా మారొద్దు
కర్నూలు (టౌన్): పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ టీడీపీకి తొత్తులుగా మారవద్దని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి సూచించారు. బాధితులు పోలీసుస్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నా స్పందించకోపోవడం దారుణమన్నారు. కర్నూలులోని తన కార్యాలయంలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. తమ వార్డులో పనులు చేస్తున్నారని, తనకు రూ.5 లక్షలు కమీషన్ ఇవ్వాలంటూ మున్సిపల్ కాంట్రాక్టర్తో శ్రీరామనగర్కు చెందిన టీడీపీ నాయకుడు సునీల్ కుమార్ గొడవపడారన్నారు. అంతటితో ఆడగకుండా రెండు రోజుల క్రితం దాడి కూడా చేశారన్నారు. బాధితుడు, మున్సిపల్ కాంట్రాక్టర్లు, కురవ సంఘం నాయకులతో కలిసి మూడో పట్టణ పోలీసు స్టేషన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ను కలిసి ఫిర్యాదు చేశారన్నారు. అయితే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు విన్నవించినా ఎవరి ఒత్తిళ్లతో కేసును నీరు గారుస్తున్నారని ప్రశ్నించారు. బాధితుడిపైనే కేసు దుర్మార్గం కాదా? కర్నూలు పదో వార్డు మాజీ కార్పొరేటర్ షేక్ యూనుస్ బాషా పార్టీ కార్యాలయంపై దాడి చేసి, సామగ్రి ధ్వంసం చేశారని ఎస్వీ మోహన్రెడ్డి గుర్తు చేశారు. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులను భయాందోళనకు గురి చేశారని, దీనిపై పోలీసుస్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశారన్నారు. అయితే దాడి చేసిన మహబూబ్ ఖాన్, అనుచరులపై కేసు నమోదు చేయకుండా బాధితుడిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేయకపోవడంలో పోలీసు శాఖ ఎంతగా ఒత్తిడికి గురవుతుందో తెలుస్తోందన్నారు. బాధితులకు న్యాయం చేయండి.. సెల్యూట్ కొడతాం తండ్రిపై దాడి చేసిన కోపంతో ప్రత్యర్థి వ్యక్తిపై పాతబస్తీకి చెందిన నలుగురు యువకులు దాడి చేశారని ఎస్వీ తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోరని తెలిసే దాడి చేశారని, వీరిని వెంటనే అరెస్టు చేసి రోడ్లపై నడిపించుకుంటూ వెళ్లారన్నారు. అలాకాకుండా బాధితుల వైపు పోలీసులు ఉంటే సెల్యూట్ చేస్తామన్నారు. శాంతిభద్రతలపై ప్రజలకు నమ్మకం కలిగించాలని సూచించారు. పోలీసులపై ప్రజలకు నమ్మకం పోయింది!టీడీపీ ఐటీ విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్న గట్టు తిలక్ వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శ్రీరామనగర్కు చెందిన సతీష్ అనే యువకుడు మరణ వాంగ్మూలంలో రాశారని, కనీసం కేసు కూడా నమోదు చేయలేదని ఎస్వీ అన్నారు. దీంతో పోలీసులపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన యువజన విభాగం నగర అధ్యక్షుడు బాలు ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్నాడని, అయితే అతని కారులో సారాయి ఉందని కేసులు నమోదు చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టారన్నారు. వేధింపులు భరించలేక చనిపోదామని బాలు కత్తితో చేతులు కోసుకున్నాడని, అతనికి మద్దతుగా వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా కర్నూలులో ధర్నా చేశారన్నారు. అయితే జక్కంపూడి రాజాపై కేసులు నమోదు చేయడం దుర్మర్గం కాదా.. టీడీపీకి తొత్తులుగా పోలీసులు వ్యవహరించడం లేదా.. అని ప్రశ్నించారు. బాధితులను వదిలి అధికార పార్టీకి పోలీస్ యంత్రాంగం కొమ్ము కాస్తోందని విమర్శించారు. ఫిర్యాదులు చేస్తున్నా.. ఎఫ్ఐఆర్లు ఎందుకు నమోదు చేయడం లేదు కాంట్రాక్టర్పై దాడి చేసినా, సతీష్ చనిపోయినా చర్యలేవీ? వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి -
జవాబు లేని ప్రశ్నలు
ఆదోని: పోలీసులు తలుచుకుంటే ఏమైనా చేయగలరనేందుకు కౌతాళం ఘటన తాజా ఉదాహరణ. 21 రోజుల క్రితం సిట్ విచారణలో ఓ మహిళ చనిపోగా.. ఇప్పటి వరకు ఆ వివరాలు బయటకు పొక్కలేదు. కొట్టడం వల్లే ఆమె చనిపోయినట్లు పత్రికలు కోడై కూస్తున్నా ఇప్పటికీ పోలీసులు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇదే కేసులోని మరో వ్యక్తిని సైతం పోలీసులు విచారణ పేరిట చావబాదినట్లు తెలుస్తోంది. ఈయన కూడా ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఇతని విషయంలోనూ పోలీసులు గోప్యత పాటిస్తుండటం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కౌతాళం మండలం బదినేహాళ్ గ్రామానికి చెందిన గంగమ్మ తన కుమారుడు కనిపించలేదంటూ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. ఆ తర్వాత పోలీసులు స్పందించడం లేదంటూ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో విజయవాడకు చెందిన పోలీసు అధికారులతో ఒక సిట్ ఏర్పాటుకు కోర్టు ఆదేశించింది. అయితే సిట్ అధికారులకు ఈ కేసు అంతుచిక్కలేదు. చివరకు తమదైన శైలిలో గంగమ్మను విచారణ చేశారు. నిజాలు బయటకు వచ్చాయి. విధవరాలైన తను బ్యాగారి దర్గప్ప అనే వ్యక్తితో పెట్టుకున్న అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న తన కుమారుడిని తామే చంపి రహస్య స్థలంలో పూడ్చి పెట్టామని తెలిపింది. ఆ రూ.2లక్షలు ఎవరి చేతి నుంచి! ఖాకీ దెబ్బలకు తాళలేక సొమ్మసిల్లిన దర్గప్పను పోలీసులు మొదట అత్యంత గోప్యంగా కర్నూలులోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స చేయించినట్లు సమాచారం. ఒక పోలీసు అధికారి తన సొంత ఖర్చుతో రూ.2లక్షలు ఖర్చు చేసినా కోలుకోకపోవడంతో సదరు పోలీసు అధికారి కూడా చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. చివరకు దర్గప్పను కర్నూలు పెద్దాసుపత్రిలోని పోలీసు సదన్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. కర్నూలు టు విజయవాడ కౌతాళం ఘటన పోలీసులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. సిట్ అధికారుల దర్యాప్తు తమ మెడకు ఎక్కడ బిగుసుకుంటుందోనని జిల్లాస్థాయి నుంచి మండల స్థాయి పోలీసుల వరకు బెంబేలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో కేసును ఎలాగైనా మసిపూసి మారేడుకాయ చేసేందుకు పోలీసులు తమదైన శైలిలో పావులు కదుపుతున్నట్లు సమాచారం. అందులో భాగంగానే కర్నూలు, విజయవాడ ప్రాంతాలకు న్యాయ సలహాల కోసం తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఒక సీఐపై ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కౌతాళం పోలీసుస్టేషన్ పోలీసులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని, ఎవరి సీటుకు ఎసరు వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తిని చికిత్స కోసం చేర్చినప్పుడు సాధరణ రోగిలా కాకుండా మెడికో లీగల్ కేసుగా నమోదు చేశారా? రోగిని పోలీసులు రెఫర్ చేస్తే ఆసుపత్రి వర్గాలు మెడికో లీగల్ కేసు కింద నమోదు చేశారా? గాయాల స్వభావం, పరిస్థితి, చేర్పించిన సమయం, పోలీసు అధికారుల వివరాలు మొదలైనవి రిజిస్టర్లో పొందుపరిచారా? వైద్యులు గాయాలపై నివేదిక తయారు చేసి, అవసరమైతే మేజిస్ట్రేట్ లేదా దర్యాప్తు సంస్థలకు అందజేస్తారు? ఇలాంటి ప్రక్రియ చేపట్టారా? చికిత్స పొందుతున్న వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు నోరు మెదపడం లేదు. అసలు దర్గప్పను బయటి ప్రపంచానికి ఎందుకు చూపడం లేదు. స్పృహలోనే ఉన్నాడా? లేక కోమాలోకి వెళ్లిపోయాడా? రెండు రోజుల క్రితం పోలీసు సదన్లో దర్గప్ప స్టేట్మెంట్ రికార్డు చేసినట్లుగా చర్చ జరుగుతోంది. అయితే ఆ వివరాలను బయటపెట్టకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో పోలీసులకే తెలియాలి. సిట్ విచారణ పేరిట ఓ మహిళ మృతిపై అనుమానాలు అదే కేసులోని మరో వ్యక్తి మృత్యువుతో పోరాటం 21 రోజులుగా కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో గోప్యంగా చికిత్స కలకలం రేపుతున్న పోలీసుల తీరు -
గందరగోళం.. అయోమయం!
కర్నూలు సిటీ: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లోని (కేజీబీవీ) కాంట్రాక్ట్ టీచర్ల బదిలీల్లో నెలకొన్న గందరగోళంతో అందరూ అయోమయంలో పడ్డారు. జిల్లాలో 26 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో స్పెషల్ ఆషీసర్లుగా, పీఈటీ, సీఆర్టీలుగా సుమారుగా 315 మంది పని చేస్తున్నారు. ఇందులో 250 మంది వరకు కచ్చితంగా బదిలీ కావల్సిన వారు ఉన్నారు. వారిలో 202 మంది, రిక్వెస్ట్ బదిలీకి 84 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి 275 ఖాళీలు బదిలీలకి గత నెల డిస్ప్లే చేసి మౌఖికంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండానే బదిలీలు చేసి, బదిలీ అయిన వారిని కొత్త స్థానాల్లో చేరాలని కూడా సూచించారు. ఈ మేరకు చాలా మంది బదిలీ అయిన స్థానాల్లో చేరారు. అయితే జిల్లాలో సుమారుగా 46 మంది బదిలీలపై న్యాయస్థానాల్లో కేసులు వేసి వారిని యథాస్థానాల్లోనే కొనసాగేటట్లు ఉత్తర్వులు తెచ్చుకున్నారు. వీరందరూ తిరిగి వారి స్థానాల్లోకి రావడంతో వారి స్థానాల్లో చేరిన వారు సైతం తిరిగి వాళ్ల స్థానాల్లో వెళ్లాలా? లేకపోతే తదుపరి ఉత్తర్వులు ఇస్తారా? అనే విషయం తెలియక చిరుద్యోగులు మానసిన ఒత్తిడికి గురవుతున్నారు. కొంత మంది కేజీబీవీ కార్యదర్శికి పోన్లు చేసి తమ ఆవేదన చెప్పుకుంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. కర్నూలు నగరానికి సమీపంలో ఉండే ఇద్దరు, ముగ్గురు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లుగా చాలా ఏళ్లుగా పని చేస్తున్నారు. బదిలీల ప్రస్తావన వచ్చి ప్రతిసారి తమ ఆర్థిక బలంతో కేసులు వేయించి బదిలీలను నిలిపి వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 15 ఏళ్లకుపైగా చాలా మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ టీచర్లు కుటుంబాలకు సూదురంగా పని చేయాల్సి వస్తుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వేసిన ఓ కేసు విషయంలో హైకోర్టు మినిమం టైం స్కేల్తో పాటు మరికొన్ని సదుపాయాలను కల్పించాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ఉద్యోగులుగా పని చేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎంటీఎస్ అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంపై సమస్యలను నాన్చుతుందనే విమర్శలు ఉన్నాయి. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గత నెలలో కేజీబీవీల్లో పని చేసే టీచర్లకు బదిలీలను పారదర్శకంగా నిర్వహించాం. చాలా మంది ఏళ్లుగా దూరం ఉన్న వారికి కూడా వారు అనుకున్న స్థానాలు రావడంతో చాలా సంతోష పడుతున్నారు. అయితే కొంత మంది కోర్టుకెళ్లడంతో వారిని కోర్టు ఆదేశాల మేరకు వారి స్థానాల్లోనే కొనసాగించి, అక్కడికి వచ్చిన వారిని సీనియారిటీ ఆధారంగా ఖాళీలను దృష్టిలో పెట్టుకొని స్థానాలను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటాం. వారంలోగా కచ్చితంగా బదిలీలపై స్పష్టత రానుంది. – డా.ఎన్బీ లోకరాజు, సమగ్ర శిక్ష అదనపు కో–ఆర్డినేటర్ గత నెలలో కేజీబీవీ టీచర్ల బదిలీలకు కౌన్సెలింగ్ బదిలీలను అడ్డుకునేందుకు న్యాయస్థానాల్లో 46 మంది కేసులు వారి స్థానాల్లోనే కొనసాగేలా తాత్కాలిక ఉత్తర్వులు అప్పటికే కొత్త స్థానాల్లో విధుల్లో చేరిన ఉద్యోగులు ఎక్కడ పని చేయాలా అర్థంకాక ఆందోళన -
పోలీసు సదన్లో చికిత్స
గంగమ్మ చనిపోయినా, ఆమె ప్రియుడు బ్యాగారి దర్గప్ప ఇంకా పోలీసు కస్టడీలోనే చికిత్స పొందుతున్నాడు. పోలీసు కస్టడీలోని బ్యాగారి దర్గప్పకు ఈ పరిస్థితి ఎవరు కల్పించారు. కనీసం లేవలేని స్థితికి ఎవరు చేర్చారు. దాదాపు నెల రోజులుగా చేతులు సచ్చుపడిపోయి శరీరంలోని అవయవాలు దెబ్బతినేంతగా ఎవరు కొట్టి ఉంటారు? పోలీసు సదన్లో ఉంచి వైద్యం అందిస్తున్న పోలీసులు మరే కొత్త కథను అల్లుతున్నారోననే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అతని చేతులు పనిచేయడం లేదని తెలుస్తోంది. కాళ్లు సెప్టిక్ కాగా, శరీరంలోని అంతర్గత అవయవాలు(కిడ్నీ, లివర్ తదితరాలు) చాలా పనిచేయడం లేదని సమాచారం. వెంటిలేటర్ అవసరం లేకపోవడంతో పోలీస్ సదన్లో గోప్యంగా చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. -
పదిలో 99.24 శాతం ఉత్తీర్ణత
కర్నూలు(అర్బన్): జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని విద్యా సంస్థల్లో 2025–26 విద్యా సంవత్సరంలో పదవ తరగతి విద్యార్థులు 99.24 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి బి.సురేష్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆదేశాల మేరకు చేపట్టిన చర్యల్లో భాగంగా మొత్తం 132 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయగా, మొదటి విడతగా మార్చిలో 108 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. మే నెలలో జరిగిన సప్లిమెంటరీ పరీక్షల్లో 24 మంది పరీక్షలు రాయగా, 23 మంది ఉత్తీర్ణత సాధించగా.. ఒకరు మాత్రమే ఫెయిల్ అయ్యారన్నారు. 2026–27 విద్యా సంవత్సరంలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. రేపటి నుంచి రైతన్నా.. మీ కోసం వారోత్సవాలు కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖ మరోసారి రైతన్నా.. మీ కోసం వారోత్సవాలు నిర్వహించనుంది. ఈ ఏడాది మార్చిలో ఇదే కార్యక్రమాన్ని చేపట్టింది. తాజాగా ఈ నెల 22 నుంచి 27వ తేదీ వరకు వారోత్సవాల నిర్వహణకు షెడ్యూల్ను ఖరారు చేసింది. రైతుభరోసా కేంద్రాల పరిధిలో వ్యవసాయ శాఖ ఫీల్డ్ బృందాలు రైతుల ఇంటింటికి వెళ్లి ప్రధానంగా ఐదు అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, వ్యవసాయ సాంకేతికత వినియోగం, ఆహార ప్రాసెసింగ్ విస్తరణ, రైతులకు ఆర్థిక సహాయం తదితరాలపై ఫీల్డ్ బృందాలు రైతులతో చర్చిస్తాయని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజు 90 కుటుంబాల ప్రకారం ఆరు రోజుల్లో 540 కుటుంబాలను రైతన్నా.. మీ కోసం కింద కవర్ చేస్తామన్నారు. కేజీబీవీల్లో సీసీ కెమెరాలు కర్నూలు సిటీ: కసూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో భద్రతను మరింత పెంచేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్కూళ్లతో పాటు, ఏపీ మోడల్ స్కూల్స్, పీఎంశ్రీ స్కూళ్లలో కూడా కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో 26 కేజీబీవీలు ఉండగా, దాదాపు అన్నింటిలో సీసీ కెమెరాలను ఏర్పాటు పూర్తయింది. అయితే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాల్సి ఉంది. ఇప్పటి వరకు రెండు కేజీబీవీల్లో మాత్రమే సీసీ కెమెరాల ఆపరేంటింగ్కు అవసరమైన ఇంటర్నెంట్ను అమర్చారు. వీటి పనితీరును సమగ్ర శిక్ష అదనపు కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎన్.బి లోకరాజు పరిశీలించారు. వచ్చే వారంలోపు అన్ని కేజీబీవీల్లో ఇంటర్నెట్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు సిటీ: నీట్ ప్రవేశ పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి టి.శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీకి చెందిన ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు బస్సుల్లో నీట్ పరీక్ష హాల్ టికెట్ చూపించి ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి, తిరిగి పరీక్ష కేంద్రం నుంచి ఇంటికి చేరుకునేందుకు ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. యూనిఫైడ్ సర్వేపై అభ్యంతరాలను తెలపండి కర్నూలు(అర్బన్): యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే డేటాలో కుటుంబ వివరాలకు సంబంధించి ఏవైనా తప్పులు, పొరపాట్లు, అభ్యంతరాలు ఉంటే ఈ నెల 24లోగా ఫిర్యాదు చేసుకోవచ్చని జిల్లా స్వర్ణ గ్రామ/స్వర్ణ వార్డు సచివాలయాల అధికారి టీవీ భాస్కర్నాయుడు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అభ్యంతరాలను ఆయా సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు, వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రెటరీల ద్వారా పోర్టల్లో నమోదు చేయవచ్చన్నారు. కులంతో సంబంధం లేని ఫిర్యాదులను ఈ నెల 26వ తేది నాటికి, కులంతో సంబంధం ఉన్న ఫిర్యాదులను ఈ నెల 27వ తేది నాటికి సరిచేసి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే డేటాను వ్యాలిడేషన్ చేస్తామన్నారు. -
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే కక్ష సాధింపు
కర్నూలు(టౌన్): ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తున్నారని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎద్దుల శివారెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడలో గాదె సాయిక్రిష్ణ లాకప్ డెత్ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. వెంటనే విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిందని, ఇచ్చిన హామీలను పక్కన పెట్టి రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారన్నారు. అరకొర నిధులతో గత ఏడాది 20 లక్షల మందికి తల్లికి వందనం నిధులు ఎగ్గొట్టారని, వారికి ఈ ఏడాదైనా ఇస్తారా అని ప్రశ్నించారు. ఏడాదికి 3 సిలిండర్ల హామీ ఏమైందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రైతులు సైతం యూరియా కోసం ఇబ్బందులు పడే దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ● యువజన విభాగం ఉపాధ్యక్షులు నవీన్, పాణ్యం పబ్లిసిటీ విభాగం అధ్యక్షుడు సాయి, దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం బీసీ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. కారుమూరి సునీల్ను సంబంధం లేని లిక్కర్ కేసులో ఇరికించి ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. వాస్తవానికి లిక్కర్ విక్రయాలను నియంత్రించడం, వైన్ షాపుల సంఖ్యను గణనీయంగా తగ్గించింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. యువత, విద్యార్థులకు, మహిళలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చేంత వరకు వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో కోడుమూరు యువజన విభాగం అధ్యక్షులు వెంకటేష్, జిల్లా కార్యదర్శి మధుమోహన్ రెడ్డి, కల్లూరు మండల యువజన విభాగం అధ్యక్షులు మధు పాల్గొన్నారు. తక్షణం విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎద్దుల శివారెడ్డి -
ఎస్బీఐ ఉద్యోగుల సంక్షేమానికి తారకనాథ్ కృషి
● డిప్యూటీ జనరల్ మేనేజర్ హేమ వెల్లడికర్నూలు(అగ్రికల్చర్): ఎస్బీఐ ఉద్యోగుల సంక్షేమానికి దివంగత కార్మిక నాయకులు వై.తారకనాథ్ ఎంతో కృషి చేశారని ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.హేమ అన్నారు. స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ కర్నూలు మాడ్యుల్ ఆధ్వర్యంలో వై.తారకనాథ్ 22వ వర్ధంతి సందర్భంగా శనివారం వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, బేతంచెర్ల, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ ఎస్బీఐ శాఖల్లో రక్తదాన శిబిరాలు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు అవసరమైన సామగ్రి పంపిణీ చేశారు. కర్నూలులోని డాక్టర్ వైఎస్సార్ సర్కిల్లోని మెయిన్ బ్రాంచ్లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.హేమ ప్రారంభించారు. కర్నూలులో 70 మంది, ఎమ్మిగనూరులో 80 మంది, ఇతర పట్టణాల్లో 51 మంది ప్రకారం రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ విద్యాసాగర్, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ పి.శ్రీకాంత్, నాయకులు ప్రవీణ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
నేడు నీట్–యూజీ పరీక్ష
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో నీట్–యూజీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. మధ్యాహ్నం 1.30 గంటల తరువాత పరీక్ష హాలులోకి అనుమతించబోమన్నారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడుతూ జిల్లాలో నీట్–యూజీ పరీక్షలకు ఏర్పాటు చేసిన 16 కేంద్రాల్లో 4,995 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ విధించామన్నారు. పరీక్షా కేంద్రాలకు అనువుగా రవాణా సౌకర్యాలను కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల జాబితాలో పారదర్శకత కోసమే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కొనసాగుతోందన్నారు. జిల్లాలో అత్యధిక శాతం ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేశామని, ఎస్ఐఆర్ ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. రాజకీయ పార్టీలు బీఎల్ఓలకు సహకరించాలన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఈనెల 24న తుగ్గలి మండలం జొన్నగిరిలో జియో మైసూరు సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ చేపట్టిన గోల్డ్ మైన్స్ ప్రాజెక్టును ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ పాల్గొన్నారు. -
ఆళ్లగడ్డ మున్సిపల్ మాజీ చైర్మన్ మృతి
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పురపాలక సంఘం మాజీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ రామలింగారెడ్డి (87) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామలింగారెడ్డి శనివారం మధ్యా హ్నం తన నివాస గృహంలో ఉన్నట్టుండి కుప్ప కూలి పోయి మృతి చెందారు. సుదీర్ఘకాలం ఆళ్లగడ్డలో ఆసుపత్రి ఏర్పాటు చేసి డాక్టర్గా సేవలందించడంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ వైస్ చైర్మన్గా, చైర్మన్గా ఎన్నికై ఆళ్లగడ్డ పట్టణంతో పాటు నియోజకవర్గ ప్రజల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. రామలింగారెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ పరిశీలకులు గంగుల ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డిలతో పా టు పలువురు వైఎస్సార్సీపీ శ్రేణులు సంతాపం వ్యక్తం చేశారు. మద్దిలేటయ్య కిటకిటబేతంచెర్ల: వైష్ణవ పుణ్య క్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయం శనివారం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. జ్యేష్ట మాసం శుభ దినాల నేపథ్యంలో జిల్లా నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు చర్యలు చేపట్టారు. -
క్షణికావేశంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ఎమ్మిగనూరు రూరల్: క్షణికావేశంలో పట్టణంలోని తేరుబజార్లో నివాసం ఉంటున్న ఇంటర్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలివీ.. వంశీ, లావణ్య దంపతులకు శృతి(18), వెంకటసాయి సంతానం. వంశీ అనారోగ్యంతో ఏడు సంవత్సరాల కిత్రం మృతి చెందాడు. అప్పటి నుంచి ఇద్దరు పిల్లలను పనిచేసుకుంటు కష్టపడి చదివిస్తోంది. శృతి స్థానిక తిరుపతమ్మ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తిచేసింది. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించగా, ఎంసెట్ సైతం బాగా రాసినట్లు తెలుస్తోంది. అయితే శుక్రవారం ఉదయం ఇంటి పైన ఉన్న గదిలో తన బంధువుల అబ్బాయితో ఫోన్లో మాట్లాడినట్లుగా సమాచారం. ఇద్దరి మధ్య ఏమి గొడవ జరిగిందో కానీ శృతి ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె కోసం తల్లి లావణ్య పైకి వెళ్లి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించడంతో కేకలు వేయ గా ఇంటి పక్కన వారు వచ్చి కిందకు దించారు. చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న టౌన్ ఎస్ఐ మధుసూదన్రెడ్డి ఘటనాస్థలితో పాటు పోస్టుమార్టం గదిలో శృతి మృతదేహాన్ని పరిశీలించారు. కుమార్తె ఆత్మహత్యకు తమ బంధువుల అబ్బాయి కారణం కావచ్చని, విచారిస్తే అసలు నిజం బయటకు వస్తుందని మృతురాలి తల్లి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
యథేచ్ఛగా ఇనుప ఖనిజం తరలింపు
ఓర్వకల్లు: మండలంలోని ఉయ్యాలవాడ రెవెన్యూ పరిధిలో యథేచ్ఛగా ఇనుప ఖనిజాన్ని గుట్టుగా అక్రమ రవాణా చేస్తున్నారు. గ్రామ రెవెన్యూ పరిధిలోని 725, 726 సర్వే నంబర్లలోని అటవీశాఖ, ప్రభుత్వ బంజరు భూములకు సంబంధించి 130 ఎకరాల్లో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు భూగర్భ, గనుల శాఖ అధికారులు గుర్తించినట్లు స్థానికుల సమాచారం. ఈ నిక్షేపాలను వెల్దుర్తి మండలంలోని రామళ్లకోట, కలుగొట్ల గ్రామాలకు చెందిన వ్యక్తులు అక్రమంగా కొల్లగొడుతున్నట్లు తెలిసింది. రాత్రి వేళ టాక్టర్లతో ఇతర ప్రాంతాలకు తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ బృందంతో మైనింగ్ నిర్వహిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించడంతో అక్రమ మైనింగ్ బాగోతం బయటపడింది. ఈ ప్రాంతంలో వున్న ఖనిజ సంపదను కొందరు అక్రమార్కులు ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండానే దర్జాగా లూటీ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానికులు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజిస్టు దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు దాడులు చేసి తవ్వకాలను అడ్డుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. అక్రమ తవ్వకాలను అడ్డుకోని పక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి నందికొట్కూరు: పట్టణంలోని మారుతీనగర్కు చెందిన కోట లక్ష్మీదేవి(45) బుధవారం రాత్రి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. గత వారం అనారోగ్యంతో కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొంది ఈనెల 15వ తేదీన ఇంటికి చేరుకుంది. మృతిరాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. లక్ష్మీదేవి మృతిపై అనుమానం ఉందని బ్రాహ్మణకొట్కూరు గ్రామానికి చెందిన మృతురాలి సోదరుడు అంజి ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ ఖాజపీరా కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం చేయించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ముగిసిన టీటీడీ ధార్మిక కార్యక్రమాలు నంద్యాల (వ్యవసాయం): నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక కార్యక్రమాలు శుక్రవారం ముగిశాయి. ముఖ్యఅతిథిగా ప్రవచనకర్త డాక్టర్ బోలు గద్దె అనిల్ కుమార్ హాజరయ్యారు. నలదమయంతుల కథ అన్ని కాలాల్లోని ప్రజలకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం సామూహిక కుంకుమార్చన నిర్వహించి మహా మంగళహారతి ఇచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకట్ రెడ్డి, నిత్యాతృప్తా దాసు స్వామి, ఆలయ కమిటీ చైర్మన్ అన్నపురెడ్డి, నాగ ప్రసాద్ రెడ్డి, బాలశివారెడ్డి, సుబ్బారావు, రాముడు, పెద్ద వీరయ్య, లక్ష్మీదేవి, ఇందిరాదేవి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బ్యాగు ఇలా.. బడికెలా?
సొంతబ్యాగులు వేసుకొని వెళుతున్న విద్యార్థులు పాతబ్యాగుతోనే పాఠశాలకు వచ్చిన విద్యార్థి చిరిగిన బ్యాగుకు పిన్నీసు పెట్టుకుని..పేద విద్యార్థులనో.. నోరెత్తి అడగలేరనో.. తెలియదు కానీ.. కూటమి సర్కారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పట్ల చిన్న చూపు చూస్తోంది. 2026–27 విద్యా సంవత్సరంలో పాఠశాల తెరవగానే విద్యాకిట్లు ఇస్తామన్న కూటమి పాలకుల ప్రకటనలు ఒట్టిమాటలయ్యాయి. కేవలం పుస్తకాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో విద్యార్థులు చిరిగిన, పాత బ్యాగులతోనే బడికి వస్తున్నారు. ప్రభుత్వ తీరును విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. బడులు తెరిచి రోజులు గడుస్తున్నాయని, పూర్తి స్థాయిలో కిట్లు ఇంకెప్పుడిస్తారని మండిపడుతున్నారు. – మద్దికెర -
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి
కర్నూలు: కర్నూలులోని బళ్లారి చౌరస్తా ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐచర్ వాహనం డ్రైవర్ విజయవాడకు చెందిన సత్యనారాయణ (62) మృతిచెందాడు. ఈయన ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లోని ఆంజనేయ నగర్లో నివాసముంటూ డ్రైవర్ వృత్తితో జీవనం సాగిస్తున్నాడు. ఐచర్ కంటైనర్ వాహనంలో తెలంగాణలోని సూర్యపేటకు ఫుడ్ ప్రాడక్ట్కు సంబంధించిన సామగ్రిని తీసుకెళ్తూ కర్నూలులోని ఎన్హెచ్44 రోడ్డుపై బళ్లారి చౌరస్తా ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై వెళ్తూ ముందుగా వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని అతి వేగంతో ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఐచర్ కంటైనర్ వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు అయి డ్రైవర్ సత్యనారాయణ తీవ్ర గాయాలతో క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. రెండు కాళ్లు, తల, నుదుటి భాగాలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే జాతీయ రహదారి అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని సత్యనారాయణను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సేవలందించిన ఏపీఎస్పీ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది... ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే ఏపీఎస్పీ రెండో పటాలం కమాండెంట్ దీపిక పాటిల్ ఆదేశాల మేరకు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ సత్యనారాయణను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయంతో బయటకు తీసి అంబులెన్స్లో ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి మృతదేహాన్ని తరలించి భద్రపరిచారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బురద నీరే దిక్కు!
నందవరం: బురద నీరు తాగలేక చిన్నకొత్తిలి, పెద్దకొత్తిలి, జొహరాపురం గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్రామాలకు నెదార్లాండ్ స్కీమ్ నుంచి కుళాయి పైపులైన్ ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తుంగభద్ర నదికి వరద నీరు చేరింది. దీంతో నెదార్లాండ్ స్కీమ్లో వాటర్ను శుద్ధి చేయకుండా పంపిణీ చేస్తున్నారు. నీరు బురద మయంగా మారాయని, దుర్వాసన వస్తున్నాయని, ఎలా తాగాలని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్డబ్ల్ూయ్వస్ అధికారులు స్పందించి మంచి నీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు. -
ప్రాణాలను ‘లెక్క’ పెట్టకుండా..
చిత్రంలో కనిపిస్తున్న ఆటోలో ఉన్న వారంతా మహిళలే.. డ్రైవర్ మినహా. అందులో సాధారణంగా పది మందికి మించి ప్రయాణించడం కష్టం. అలాంటిది.. 10.. 15.. 20 మంది కూడా కాదు.. ఏకంగా 35 మంది ఉన్నారు. పనుల కోసం వారంతా ప్రాణాలు సైతం లెక్క పెట్టకుండా ఆటోలో వెళ్తూ కనిపించారు. దేవనకొండ మండలంలోని నునుసరాళ్ల నుంచి కొందరు మహిళలు వ్యవసాయ పనులకు ఆటో నిండా టాప్ పైఎక్కి తువ్వదొడ్డికి బయలుదేరారు. తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నా ఎవరిలో మార్పు కనిపించడం లేదు. కుటుంబానికి వెలుగులైన మహిళలూ.. ఏదైనా జరగరానిది జరిగితే.. ఎవరిది బాధ్యత. మీకో కుటుంబం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రమాదకర ప్రయాణం వద్దు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
బాధాకరం
మాకు సొంత భూమి లేదు. కౌలుకు 6.50 ఎకరాలు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. ఈ సారి పత్తి సాగు చేశా. ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి చేయూత లేదు. గత ప్రభుత్వం వైఎస్సార్ రైతుభరోసా కింద ఆర్థిక సహాయం అందించింది. చంద్రబాబు ప్రభుత్వం మమ్మల్ని పక్కన పెట్టడం బాధాకరం. బ్యాంకులు కూడా పంట రుణాలు ఇవ్వడం లేదు. – శేషన్న, జి.సింగవరం, కర్నూలు మండలం మేం దేవాలయ భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నాం. మాకు ఐదు ఎకరాలకు సీసీఆర్ కార్డును ప్రభుత్వం జారీ చేసింది. అన్నదాత సుఖీభవ కింద సాయం దక్కుతుందని ఆశించాం. ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. గత ఏడాది కూడా కౌలు రైతులను పట్టించుకోలేదు. ఈ సారి కూడా అన్యాయం జరిగింది. ప్రభుత్వం పట్టించుకోకపోతే సాగులో ఎలా రాణిస్తాం? ఇప్పటికై నా చంద్రబాబు చొరవ తీసుకొని కౌలురైతులకు న్యాయం చేయాలి. – జంగం జంబులింగయ్య, ఆర్.కొంతలపాడు, కర్నూలు మండలం పింఛన్లు, భూ రీసర్వే అర్జీలే అధికం ● తుగ్గలిలో పీజీఆర్ఎస్ తుగ్గలి: ఒకనెల–ఒక నియోజకవర్గం–నాలుగు పర్యటనల్లో భాగంగా రెండో శుక్రవారం తుగ్గలిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించగా భూ రీసర్వే చేయాలని, పింఛన్లు మంజూరు చేయాలని అధికంగా అర్జీలు వచ్చాయి. పొదుపు చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్, జేసీ, అధికారులు ప్రత్యేక బస్సుల్లో తుగ్గలికి చేరుకున్నారు. పీజీఆర్ఎస్లో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలు ఇవ్వగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జేసీ నూరుల్ ఖమర్, ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు పరిశీలించారు. అర్జీలపై వెంటనే విచారణ జరిపి పరిష్కరించాలిన అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అర్జీలను తిరస్కరిస్తే అందుకు కారణాలను దరఖాస్తుదారులకు తెలియజేయాలన్నారు. తమ పెద్దల నుంచి సంక్రమించిన 1.85 ఎకరాల స్థలం ఆక్రమణకు గురైందని, పెండింగ్లో ఉన్న ఆర్ఓఆర్ కేసు పరిష్కరించాలని కోరినా పరిష్కారం కాలేదని తుగ్గలికి చెందిన రవీంద్రనాథశర్మ పీజీఆర్ఎస్లో విన్నవించుకున్నారు. పత్తికొండ ఆర్డీవో సీహెచ్ ఓబులేసు, తహసీల్దార్ రవి, సిబ్బంది, స్థానిక అధికారులు పాల్గొన్నారు. జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో 50 శాతం రాయితీ కర్నూలు సిటీ: ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లల్లో చదువుతున్న అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టు పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ లభించింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ సిరి ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. సుధాకర్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీడబ్ల్యూజేఎఫ్, ఆంఽధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్కు వినతులు ఇవ్వడంతో ఈ మేరకు ఉత్తర్వులు వచ్చాయి. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు గోరంట్లప్ప, జిల్లా కమిటీ సభ్యులు టీ.జి ప్రసాద్, చంద్రమోహన్, నగర అధ్యక్ష, కార్యదర్శులు శివశంకర్, ఎర్రమల హర్షం వ్యక్తం చేశారు. 2,94,598గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ‘రైతు భరోసా’ అందుకున్న అన్నదాతలు కొంత మందికే అన్నదాత సుఖీభవ! కౌలు రైతులకు మొండి చేయి కొత్తగా వ్యవసాయంలోకి వచ్చిన వారికి అందని పెట్టుబడి సాయం గత వైస్సార్సీపీ ప్రభుత్వంలో రైతులందరికీ భరోసా ప్రస్తుతం 2,72,757 మందికే లబ్ధి నేడు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ సాయం విడుదల -
‘సర్’వేత్రా గందరగోళం!
కర్నూలు(సెంట్రల్): స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్(ఎస్ఐఆర్) గందరగోళంగా సాగుతోంది. 2025, 2002 ఓటరు జాబితాల్లో వేలాది మంది ఓటర్ల వివరాలు గల్లంతయ్యాయి. 2024 ఎన్నికల తరువాత జరిగిన స్పెషల్ సమ్మర్ రివిజన్లో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్ల వివరాలను వ్యూహాత్మకంగా గల్లంతు చేశారు. దీంతో వారంతా బీఎల్ఓలను తమ ఓట్లు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నిస్తున్నా సమాధానం కరువైంది. మరో వైపు 2002 జాబితాపై కూడా ప్రజల్లో ప్రతిష్టంబన నెలకొంది. కర్నూలు జిల్లాలో 2026 మార్చి 31వ తేదీ నాటికి 20,86,119 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో చాలా మంది బతుకుదెరువు కోసం హైదరాబాద్, కడప, బెంగళూరు, ముంబయి, గుంటూరు తదితర ప్రాంతాలకు వెళ్లారు. ఈ క్రమంలో 2025లో జరిగిన స్పెషల్ సమ్మర్ రివిజన్లో వారి ఓట్లపై వేటు వేశారు. ఆయా ఓటర్లకు కనీస సమాచారం ఇవ్వకుండానే తొలగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో దాదాపు 50వేలకు పైగా వలసదారులను జాబితా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత సర్ సర్వేలో వారి ఓటు వివరాలు జాబితాలో లేకపోవడంతో ఖంగుతింటున్నారు. సర్వే పూర్తయిన తరువాత మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఓటు హక్కు కల్పిస్తామని అధికారులు చెబుతుండటం గమనార్హం. 2002 జాబితాపై అదే సస్పెన్స్ ప్రస్తుతం జరుగుతున్న సర్ సర్వేను 2002, 2025 ఓటరు జాబితాలతో పోల్చి చూస్తున్నారు. అయితే చాలా మంది ఓటర్ల వివరాలు 2002లో జాబితాలో లేవు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. ఇప్పుడున్న పలు ఓటర్లకు అప్పటిలో ఓటు హక్కు లేకపోవడం, 18 ఏళ్లు వచ్చినా ఓటు కోసం దరఖాస్తు చేసుకోకపోవడం తదితర కారణాలతో అప్పట్లో ఓటు హక్కు పొందలేకపోయారు. ఈ క్రమంలో వీరి తల్లిదండ్రులు, తాత, అవ్వల వివరాలను పోల్చి చూసి సర్ సర్వే చేయాలి. అయితే కొన్ని చోట్ల 2002 జాబితాకు సంబంధించిన ఐడీ కార్డు కావాలని అడుగుతున్నారు. అప్పటి కార్డులను ఓటర్లు ఎందుకు ఉంచుకుంటారని ప్రశ్నిస్తున్నా బీఎల్ఓలు పట్టించుకోని పరిస్థితి. బీఎల్ఓలను భయపెడుతున్న టీడీపీ బీఎల్ఏలు జిల్లాలో ఇప్పటి వరకు 20,56,119 మంది ఓటర్లలో 6,40,008 మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫాంలను బీఎల్ఓలు అందజేశారు. దాదాపు 30.60 శాతం మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ పాంలు అందాయి. అలాగే ఆన్లైన్ ద్వారా 7,660 మంది ఎన్యుమరేషన్ ఫాంలను సబ్మిట్ చేశారు. కాగా, ఆఫ్లైన్ ద్వారా బీఎల్ఓలు ఇవ్వాల్సిన ఎన్యుమరేషన్ ఫాంలను టీడీపీ బీఎల్ఏలు భయపెట్టి వారే నేరుగా ఓటర్లకు అందజేస్తున్నారు. ఈక్రమంలో బీఎల్ఓలు వారిని వారించడంలో భయపడుతున్నారు. టీడీపీ మరో మూడేళ్లు అధికారంలో ఉండనుండటంతో భవిష్యత్లో ఇబ్బందులకు గురి చేస్తారేమోనన్న భయంతో మిన్నకుండిపోతున్నట్లు తెలుస్తోంది. మిత్రా యాప్లో నమోదు సందడిలో సడేమియా అన్నట్లుగా టీడీపీ బీఎల్ఏలు ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. సర్ సర్వేను పరిశీలించే నెపంతో నేరుగా ఓటర్ల వివరాలను మిత్రా యాప్లో నమోదు చేస్తున్నారు. అయితే అడ్డుకోవడంలో ఎన్నికల కమిషన్ విఫలమైంది. ఈ క్రమంలో మిత్రా యాప్ నుంచి నేరుగా ఫాం–7ను రైజ్ చేసి వైఎస్ఆర్సీపీ, ఇతర పార్టీల సానుభూతిపరుల ఓటర్లను తొలగించేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్లో అన్ని పార్టీలకు చెందిన బీఎల్ఏలు పాల్గొనవచ్చు. ఎక్కడైనా టీడీపీ బీఎల్ఏలు ఎన్యుమరేషన్ ఫాంలను ఇస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఓటర్ల వివరాలను ఎవరూ కాపీ చేయడానికి వీల్లేదు. – డాక్టర్ ఏ.సిరి, జిల్లా ఎన్నికల అధికారి, కర్నూలు వలసదారుల ఓటర్లను తొలగించిన వైనం 2002 జాబితాపై తొలగని ప్రతిష్టంబన టీడీపీ బీఎల్ఏలే ఎన్యుమరేషన్ ఫాంల పంపిణీ ఓటర్ల వివరాలు మిత్రా యాప్లో నమోదు చేస్తున్న టీడీపీ బీఎల్ఏలు ఇదేం పద్ధతి ‘సర్’ బీఎల్ఓలను నిలదీసిన వైఎస్సార్సీపీ బీఎల్ఏ ఆదోని: ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చి వివరాలు సేకరించాల్సిన బీఎల్ఓలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటంతో ‘ఇదేం పద్ధతి’ అని వైఎస్సార్సీపీ బీఎల్ఏ అడ్డుకున్నారు. ఆదోని పట్టణంలోని 4, 34 వార్డుల్లో బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లకుండా సచివాలయంలోనే టీడీపీ బీఎల్ఏల సహాయంతో ఓటర్లను పిలిపించారు. ఇది మంచి పద్ధతి కాదని, ఇళ్లకు వెళ్లకుండా సచివాలయాల్లో ఎందుకు కూర్చున్నారని వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు బి.దేవా నిలదీశారు. టీడీపీ బీఎల్ఏ జోక్యం చేసుకుంటూ తప్పేంటి అంటూ వాగ్వాదానికి దిగాడు. బీఎల్ఓలు తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లాల్సిందేనని బి.దేవా పట్టుబట్టాడు. ఎన్యుమరేషన్ ఇవ్వని వారికి చేటు తప్పదని, వారి ఓటు జూలై 21 ప్రచురించే ముసాయిదా జాబితాలో ఉండదని బి.దేవా హెచ్చరిస్తూ బీఎల్ఓలను సచివాలయం నుంచి ప్రజల మధ్యకు తీసుకెళ్లారు. బీఎల్ఓలు ఏదైనా పొరపాటు చేస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాఖపరమైన చర్యలు ఉంటాయని బి.దేవా హెచ్చరించారు. ఓటర్ల ఇళ్ల వద్దకే వెళ్లి బీఎల్ఓలు బాధ్యతలను నిర్వహించాలన్నారు. -
ఆశల సేద్యానికి తాళం!
ఎన్నో ఆశలతో సేద్యం చేయడానికి యూరియా కోసం వచ్చిన రైతులకు తాళం వేసిన కోసిగి వ్యవసాయ కార్యాలయం వెక్కిరించింది. కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం 11 గంటలకు వరకు అధికారుల కోసం వీరంతా ఎదురు చూడాల్సి వచ్చింది. వ్యవసాయ సహాయక అధికారి ఆలస్యంగా వచ్చి ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం ఉందని వెళ్లి పోయారు. రైతులు మాత్రం మధ్యాహ్న 12 గంటలకు వరకు అక్కడే ఉన్నారు. వీరికి ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వలేదు. రెండు రోజులుగా ఇదే దుస్థితి. ఈ విషయమై వ్యవసాయాధికారి ఎం.వరప్రసాద్ మాట్లాడుతూ.. వ్యవసాయ సిబ్బందికి బీఎల్ఓ విధులు ఉన్నాయని, మధ్యాహ్నం నుంచి అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. రైతుసేవా కేంద్రాల్లో యాప్లో రిజిష్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే యూరియా అందజేస్తున్నట్లు చెప్పారు. –కోసిగి -
జల్సాలకు అలవాటు పడి అడ్డదారి
● ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తూ పట్టుబడిన ఇద్దరు దొంగలు ● సీసీ ఫుటేజీ ద్వారా ఛేదించిన పోలీసులు కర్నూలు: జీవనోపాధి కోసం జేసీబీ ఆపరేటర్గా పనిచేస్తున్న ఉప్పర వీరేష్, వ్యవసాయం చేస్తున్న ముక్కెర రాముడు మద్యం, జల్సాలకు అలవాటు పడి వృత్తిపై వచ్చే ఆదాయం చాలక సులువుగా డబ్బు సంపాదించే మార్గాన్ని అన్వేషించారు. ఇద్దరూ కలసి ద్విచక్ర వాహన చోరీలను ఎంచుకున్నారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉప్పర వీరేష్ ద్విచక్ర వాహనం చోరీ చేసి ముక్కెర రాముడుకు అప్పగిస్తే.. అతను గ్రామీణ ప్రాంతాల్లో విక్రయించి సొమ్ము చేసుకుని ఇద్దరూ కలసి జల్సాలు చేసేవారు. నాలుగు మాసాలుగా సాగిపోతున్న వీరి చోరీల పర్వానికి కర్నూలు సీసీఎస్, మూడో పట్టణ పోలీసులు చెక్ పెట్టారు. పక్కా ఆధారాలతో నిఘా పెట్టి వారి నుంచి రూ.5 లక్షల విలువైన ఆరు ద్విచక్ర వాహనాలను రికవరీ చేశారు. సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామానికి చెందిన ఉప్పర వీరేష్ తెర్నెకల్లో వివాహం చేసుకుని ప్రస్తుతం అక్కడే నివాసముంటున్నాడు. కోడుమూరు మండలం వర్కూరు గ్రామానికి చెందిన ముక్కెర రాముడుతో పరిచయం ఏర్పడి జల్సాల కోసం ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసి పోలీసుల నిఘాకు చిక్కారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రి ఆవరణంలో పార్కు చేసి ఉన్న బుల్లెట్ వాహనం ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ రాత్రి చోరీకి గురైంది. ఆసుపత్రిలో పీజీ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న నిరంజన్ తన బుల్లెట్ వాహనాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మెయిన్ గేట్ వద్ద పార్కు చేసి విధులకు వెళ్లి తిరిగి బయటకు వచ్చేసరికి కనిపించలేదు. దీంతో తన వాహనం చోరీకి గురైందని మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా శుక్రవారం నంద్యాల చెక్పోస్టు సమీపంలోని అరుంధతి నగర్ టైల్స్ ఫ్యాక్టరీ వెనుక ఉన్న కంప చెట్లలో ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా నేరాల చిట్టా బయటపడింది. వీరి నుంచి రూ.5 లక్షల విలువ చేసే 6 మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పరి వీరేష్ గతంలో గోనెగండ్ల, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో కూడా ద్విచక్ర వాహనాలు చోరీ చేసినట్లు ఆయా పోలీస్స్టేషన్లలో రికార్డులకెక్కాడు. సీఐలు పూల రామకృష్ణ, శేషయ్య, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డితో కలసి అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా బైకు దొంగలను మీడియా ముందు హాజరుపరచి వివరాలను వెల్లడించారు. -
గ్రామీణ రోడ్ల్లను పట్టించుకోని ప్రభుత్వం
ఆస్పరి: అధ్వానంగా మారిన గ్రామీణ రోడ్లను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి విమర్శించారు. ఇటీవల కురిసిన వర్షాలకు తాత్కాలికంగా నిర్మించుకున్న ఆస్పరి మండలంలోని యాటకల్లు బ్రిడ్జి తెగిపోయింది. తెగిపోయిన యాటకల్లు బ్రిడ్జిని గురువారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది కురిసిన వర్షాలకు యాటకల్లు బ్రిడ్జి తెగిపోయిందన్నారు. శాశ్వతంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని స్వయంగా తాను అప్పటి కలెక్టర్ రంజిత్ బాషాకు తెలియజేసినా పట్టించుకోలేదన్నారు. అధికారులు స్పందించకపోవడంతో గ్రామస్తులు తాత్కాలికంగా గరుసు వేసి నిర్మించుకున్నా ఇటీవల కురిసిన వర్షాలకు తెగిపోయిందన్నారు. ఫలితంగా మండల కేంద్రమైన ఆస్పరికి వచ్చేందుకు యాటకల్లు, తొగలుగల్లు, దొడగొండ, బైలుపత్తికొండ, గార్లపెంట, కై రుప్పల, కారుమంచి, ములుగుందం, డి.కోటకొండ గ్రామాల ప్రజలు అదనంగా మరో 15 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వస్తోందన్నారు. రైతులు పండించిన పంటలను ఆటో, ట్రాక్టర్లులో ఆస్పరి మార్కెట్కు తీసుకొచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికై నా యాటకల్లు బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోతే ఆయా గ్రామాల ప్రజలతో కలసి ఆందోళన చేస్తామని ఎమ్మెల్యే అధికారులను హెచ్చరించారు. -
వాటర్ను కొనుగోలు చేస్తున్నారు
చిప్పగిరి మండలం కాజీపురం రిజర్వాయర్ నుంచి తొమ్మిది గ్రామాలకు సరఫరా అయ్యే నీరు పూర్తి కలుషితమవుతోంది. కుళాయిల ద్వారా వస్తున్న బురద నీరు తాగేందుకు ఏ మాత్రం పనికిరాని పరిస్థితి నెలకొంది. ఆలూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా నీటిని రిజర్వాయర్లో నిల్వ చేసి గ్రామాలకు వదులుతున్నారు. ఫిల్టర్బెడ్లు లేని కారణంగా రిజర్వాయర్లోకి వచ్చిన నీటిని యథాతథంగా సరఫరా చేస్తున్నారు. ఈ నీటిని తాగడం వల్ల ఆయా గ్రామాల ప్రజలు అనారోగ్య సమస్యలకు లోనవుతున్నారు. కొందరు మినరల్ వాటర్ను కొనుగోలు చేస్తున్నారు. – బి.విరూపాక్షి, ఆలూరు ఎమ్మెల్యే పలు ప్రాంతాల్లోని నీటి పథకాల ఫిల్టర్ బెడ్లు మార్చేందుకు చర్యలు చేపట్టాం. ఈ నేపథ్యంలోనే 19 నీటి పథకాల ఫిల్టర్బెడ్ల నిర్వహణకు రూ.6 కోట్లు అవసరమవుతాయని జిల్లా పరిషత్ సీఈఓ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. క్షేత్ర స్థాయిలో సమ స్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరిస్తున్నాం. – సీహెచ్ మనోహర్, ఎస్ఈ, ఆర్డబ్ల్యూఎస్ బాపురం రిజర్వాయర్ నుంచి సరఫరా చేస్తున్న మంచినీరు శుభ్రంగా రావడం లేదు. నీరు ఫిల్టర్ కాకపోవడం వల్ల బురద, నాచు నీటిలో వస్తున్నాయి. ఈ నీరు తాగడం వల్ల అనారోగ్యాలకు గురవుతున్నారు. శుభ్రమైన నీటిని సరఫరా చేసి ప్రజలు రోగాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. – నాగరాజు, బాపురం, హాలహర్వి -
హాస్టళ్ల నిర్వహణలో అశ్రద్ధ వద్దు
కర్నూలు(అర్బన్): జిల్లాలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల నిర్వహణలో ఎలాంటి అశ్రద్ధ ప్రదర్శించరాదని జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బి.రాధిక అన్నారు. గురువారం సాయంత్రం స్థానిక సంక్షేమభవన్లోని తన చాంబర్లో పత్తికొండ, ఆదోని డివిజన్లకు చెందిన సహాయ సంక్షేమాధికారులు, వసతి గృహ సంక్షేమాధికారులతో ఆమె సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హాస్టళ్లు పునః ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల ప్రవేశాలను మెరుగుపరచాలని, ప్రతి హాస్టల్లో వంద మంది విద్యార్థులకు తక్కువ కాకుండా ప్రవేశాలు కల్పించాలన్నారు. హాస్టళ్ల నిర్వహణకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సానుకూల థృక్పథం ఏర్పడేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి వసతి గృహ సంక్షేమాధికారి అంకితభావంతో విధులు నిర్వహించాలన్నారు. సమావేశంలో పత్తికొండ, ఆదోని సహాయ సంక్షేమాధికారులు కె.బాబు, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. -
పరిపాలనాధికారులుగా ముగ్గురికి పదోన్నతి
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలోని వివిధ కార్యాలయాల్లో సీనియర్ సహాయకులుగా విధులు నిర్వహిస్తున్న ముగ్గురికి పరిపాలనాధికారులుగా పదోన్నతి కల్పించారు. గురువారం స్థానిక జెడ్పీలో జరిగిన కార్యక్రమంలో పదోన్నతి పొందిన ముగ్గురు పరిపాలనాధికారులకు జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి పోస్టింగ్ ఆర్డర్స్ను అందించారు. వీరిలో ఎం.వీరభద్రయ్యను కౌతాళం ఎంపీడీఓ, బి.గిడ్డమూర్తిని జెడ్పీ, ఏవీ రమణయ్యను ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయానికి ఏఓలుగా నియమించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ ఏఓలుగా పదోన్నతి పొందిన వారు పారదర్శకంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఆఫీస్ సూపరింటెండెంట్లుగా పదోన్నతి కర్నూలు(హాస్పిటల్): వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే పలువురు సీనియర్ అసిస్టెంట్లకు ఆఫీస్ సూపరింటెండెంట్లుగా పదోన్నతి కల్పి స్తూ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ రామగిడ్డయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కడపలోని ప్రాంతీయ కార్యాలయంలో ఆయన సీనియర్ అసిస్టెంట్లకు కౌన్సెలింగ్ నిర్వహించి స్థానాలు కేటాయించారు. రాయలసీమ జోన్లో పది మంది పదోన్నతి పొందగా అందులో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు ఉన్నారు. వీరిలో కర్నూలులోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో పనిచేసే విశ్వనాథ్ కడపలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీకి, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో పనిచేసే అంబ ప్రసాద్ సింగ్ కర్నూలు మెడికల్ కాలేజీకి, నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పనిచేసే శివనాగిరెడ్డి కర్నూలులోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు, చంద్రహాసుడు కడప డీఎంహెచ్ఓ కార్యాలయం, బ్రాహ్మణకొట్కూరులో పనిచేసే కేవీఎన్ రాజశేఖర్ కడప డీఎంహెచ్ఓ కార్యాలయానికి పదోన్నతిపై బదిలీ అయ్యారు. నత్తనడకన వేరుశనగ పంపిణీ కర్నూలు(అగ్రికల్చర్): వేరుశనగ పంపిణీ నత్తనడకన సాగుతోంది. విత్తన పంపిణీ పట్ల చంద్రబాబు ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడం వల్ల గతంలో ఎప్పుడూ లేని విధంగా జాప్యం చోటు చేసుకుంటోంది. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ వివిధ మండలాల్లోని రైతుసేవా కేంద్రాల్లో దాదాపు 2,500 క్వింటాళ్ల వేరుశనగ రైతులకు అందుబాటులో ఉంచింది. ఆదోని, తుగ్గలి, పత్తికొండ, వెల్దుర్తి, కోడుమూరు, హాలహర్వి, ఆలూరు మండలాల్లో వేరుశనగ పంపిణీ మొదలైనట్లు అధికారులు చెబుతున్నారు. ఎల్నినో ప్రభావంతో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో వర్షాలు కురుస్తాయో లేదోననే భయం రైతులను వెంటాడుతోంది. వైద్య ఆరోగ్యశాఖలో పీఓలకు స్థానచలనం కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ప్రోగ్రామ్ ఆఫీసర్లకు స్థాన చలనం కలగనుంది. ఈ శాఖలోని పలువురు ప్రోగ్రామ్ ఆఫీసర్లు వివిధ పీహెచ్సీల్లో పనిచేస్తూ డిప్యుటేషన్పై ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఇలాంటి వారిని తప్పించి, వీరి స్థానంలో సివిల్ సర్జన్లు లేదా డిప్యూటీ సివిల్ సర్జన్లను నియమించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు అర్హులైన వారి వివరాలు సమర్పించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. త్వరలో ప్రస్తుతం పనిచేస్తున్న వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తారనే ప్రచారం వైద్యారోగ్యశాఖలో జోరుగా సాగుతోంది. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. గతేడాది సప్లిమెంటరీ పరీక్షల కంటే ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది తగ్గిపోయింది. గత నెల 21 నుంచి ఈ నెల 5వ తేది వరకు నిర్వహించిన పరీక్షల మూల్యాంకనం 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు చేపట్టారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలకు జనరల్ విభాగంలో 5215 మంది హాజరు కాగా 2045 మంది, వొకేషనల్ విభాగంలో 964 మంది పరీక్షలు రాస్తే 436 మంది పాసయ్యారు. సెకండియర్ జనరల్ విభాగంలో 3,388 మంది హాజరు కాగా 1927 మంది, వొకేషనల్ విభాగంలో 472 మంది హాజరు కాగా 296 మంది ఉత్తీర్ణులయ్యా రు. ఫస్టియర్లో జిల్లా రాష్ట్రంలో 10వ, సెకండియర్లో 8వ స్థానంలో నిలిచింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు ఈ నెల 19 నుంచి 26వ తేదీలోపు ఫీజు చెల్లించాల్సి ఉంది. రీవెరిఫికేషన్కు ఒక్కో సబ్జెక్టుకు రూ.1,300, రీకౌంటింగ్కు రూ.260 ఆన్లైన్లో చెల్లించాలని అధికారులు తెలిపారు. -
జూలై 11న లోక్ అదాలత్
కర్నూలు: కోర్టులలో ఉన్న సివిల్, భూసేకరణ, పన్ను బకాయిలు, మున్సిపల్ కేసులు జులై 11న నిర్వహించనున్న లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి సూచనల మేరకు మున్సిపల్, సచివాలయ, కెనరా లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ మేనేజర్, బీఎస్ఎన్ఎల్ అధికారులతో స్థానిక ప్రాంగణంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కోర్టులలో ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కక్షిదారులు తమ కేసులను రాజీపూర్వకంగా పరిష్కరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో భూసేకరణ, బ్యాంకు, మున్సిపల్, సచివాలయ అధికారులు పాల్గొన్నారు. -
అడవిలో అర్ధరాత్రి ఆక్రమణలు
ఆలూరు/హాలహర్వి: అక్రమ సంపాదన కోసం పచ్చ నేతలు ప్రకృతిని కొల్లగొడుతున్నారు. ఓ వైపు గ్రావెల్ కోసం కొండలను కరిగిస్తూ.. మరో వైపు ఇసుక కోసం నదులు, వాగులను గుళ్ల చేస్తున్న టీడీపీ నేతలు తాజాగా అడవిపై కన్నేశారు. అర్ధరాత్రి వేళ గుట్టుగా అడవిలో చెట్లను నరికేసి, భూములను చదును చేసి దర్జాగా ఆక్రమించుకోవాలనుకున్నారు. అయితే అటవీశాఖ అధికారుల దాడితో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన హాలహర్వి మండలం గూళ్యం గ్రామ రిజర్వు ఫారెస్టు కంపార్ట్మెంట్–2లో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గూళ్యం అటవీ ప్రాంతంలో ప్రసిద్ధ దిబ్బల సోమప్ప దేవాలయం వెనుక భాగంలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ భూములను ఆక్రమించుకునేందుకు టీడీపీ నేత అనుచరులు కుట్ర పన్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి జేసీబీలతో అక్కడికి చేరుకుని ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న వందలాది ఈత చెట్లను కూకటి వేర్లతో సహా తొలగించేశారు. అడవిలో అర్ధరాత్రి ఆక్రమణల విషయం తెలుసుకున్న ఆలూరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసులు, బీఎఫ్ఓలు విమల్, బాలు, తదితరులు అర్ధరాత్రి అక్కడికి వెళ్లి అడ్డుకున్నారు. అయితే జేసీబీ డ్రైవర్లు వారిపై దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. అక్రమణల సమాచారాన్ని హాలహర్వి పోలీసులకు చేరవేయడంతో వారు ఘటనా స్థలానికి వెళ్లారు. పోలీసులను గమనించిన జేసీబీ డ్రైవర్లు వాహనాలను వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఆరు జేసీబీలను వెంటనే సీజ్ చేసి హాలహర్వి పోలీస్స్టేషన్కు తరలించారు. జేసీబీ డ్రైవర్లు దాసరి తిమ్మరాజు, పి.అశోక్, వై.ఆనంద్, దాసరి హనుమేశ్, సందీప్ కుమార్, నవీన్పై, వారిని ప్రోత్సహించిన దొడ్డ గాదిలింగప్ప, పాండురంగపై కేసులు నమోదు చేసినట్లు ఆలూరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసులు గురువారం సాయంత్రం విలేకరులకు తెలిపారు. అయితే అటవీ అధికారులపై దాడి విషయాన్ని విలేకరులు ప్రశ్నించగా అదేమీ లేదని సమాధానం ఇచ్చారు. అటవీ సంరక్షణకు విఘాతం కలిగించినా, అటవీ సంపదను ధ్వంసం చేసినా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఆక్రమణల వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో పూర్తి స్థాయి విచారణ జరుపుతామన్నారు. అటవీ భూమిలో చెట్లను తొలగించిన దృశ్యంపట్టుబడిన జేసీబీలను చూపుతున్న ఫారెస్ట్ అధికారులు అటవీ భూముల కబ్జాకు యత్నించిన టీడీపీ నేతల అనుచరులు చెట్లు నరికి, భూమిని చదును చేసిన వైనం అడ్డుకునేందుకు వెళ్లిన అధికారులపై దాడి ? ఆరు జేసీబీలు స్వాధీనం, 8 మందిపై కేసు నమోదు -
ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక న్యాయ సహాయ సెల్
● జిల్లా జడ్జి జి.కబర్ధికర్నూలు(టౌన్): ఈశాన్య రాష్ట్రాల ప్రజల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు జిల్లా జడ్జి జి.కబర్ధి తెలిపారు. బుధవారం ఆయన జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ప్రత్యేక సెల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలో విద్యాభ్యాసం, ఉపాధి నిమిత్తం ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజల సంక్షేమానికి న్యాయ సహాయ సెల్ ఏర్పాటు చేశామన్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి, న్యాయవాదులు లక్ష్మీనారాయణ, శివరాం, సులోచన, ఓం ప్రకాష్ పాల్గొన్నారు. ఖైదీలకు న్యాయసహాయం అందిస్తాం జైలులో ఉన్న ఖైదీలు వారికున్న హక్కులను తెలుసుకోవాలని, ఖైదీలకు ఎవరికై నా న్యాయవాదులు లేకుంటే ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి తెలిపారు. బుధవారం జిల్లా జైలులో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ను, ములాఖత్ హెల్ప్ డెస్క్ను తనిఖీ చేశారు. ఖైదీలను కోర్టు వాయిదాలకు కచ్చితంగా హాజరుపర్చాలని ఆదేశించారు. లీగల్ ఎయిడ్ న్యాయవాదులు శివరాం, సులోచన, హెల్ప్డెస్క్ న్యాయవాది ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. -
వైద్య ఉద్యోగుల ఆకలి కేకలు!
నిత్యం రోగుల సేవల్లో తరిస్తున్న వారు జీతాల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి కల్పించారు. పదేళ్లుగా వారికి ప్రతి నెలా సక్రమంగా అందుతున్న జీతాలు నాలుగు నెలలుగా ఆగిపోయాయి. ఇదేమని ప్రశ్నిస్తే ఒక్కో శాఖ ఒక్కో కారణం చెబుతోంది. వైద్య ఆరోగ్య శాఖ నిధి పోర్టల్లో వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉందని చెబితే, ట్రెజరీ శాఖ మాత్రం వారి నియామక ఉత్తర్వులు సరిగ్గా లేవని, అన్ని పత్రాలు సమర్పిస్తే జీతాలు మంజూరు చేస్తామని చెబుతున్నారు. ఈ క్రమంలో కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు ఎండమావిలా మారుతున్నాయి.కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కాంట్రాక్టు విధానంలో దాదాపు 2 వేల మంది స్టాఫ్నర్సులు, పారామెడికల్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరు ఈ యేడాది మార్చి నుంచి జీతాల రాక ఇబ్బంది పడుతున్నారు. మొన్నటి వరకు వీరికి సీఎఫ్ఎంఎస్ ద్వారా జీతాలు మంజూరయ్యేవి. ఇప్పుడు దాని స్థానంలో నిధి పోర్టల్ను ఏర్పాటు చేశారు. అందులో కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలన్నీ నమోదు చేయాల్సి ఉంది. వివరాలను అప్లోడ్ చేయాల్సిన ఉద్యోగులు కొన్ని రోజుల పాటు తీవ్ర జాప్యం చేశారు. వారు అడిగే వివరాలన్నీ తెచ్చి ఇవ్వలేక కాంట్రాక్టు స్టాఫ్నర్సులు, పారామెడికల్ ఉద్యోగులు నరకయాతన అనుభవించారు. వివరాలు నమోదు చేసి ట్రెజరీకి పంపే ప్రక్రియ ఆలస్యం కావడంతో సమస్య మరింత జఠిలమయ్యింది. కార్యాలయం చుట్టూ ఉద్యోగులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జీతాల కోసం స్టాఫ్నర్సులు, పారామెడికల్ ఉద్యోగులు నిధి పోర్టల్లో వారి వివరాలు సరిగ్గా నమోదు చేయించుకునేందుకు ఆసుపత్రిలోని పరిపాలనా విభాగం చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నారు. ఇందులో కాంట్రాక్టు స్టాఫ్నర్సులు, ఈసీజీ టెక్నీషియన్లు, అనెస్తీషియా టెక్నీషియన్లు, రేడియోగ్రాఫర్లు, డయాలసిస్ టెక్నీషియన్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఆపరేషన్ థియేటర్ ఉద్యోగులు, బయోమెడికల్ ఇంజినీర్లు కలిపి దాదాపు 440 మందికి పైగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిధి పోర్టల్ సమస్య ఉన్నా అన్ని చోట్లా పరిష్కారమయ్యింది. కానీ కర్నూలులోనే సమస్య రోజురోజుకూ జఠిలమవుతోంది. ఈ విషయమై ఇటీవల కాంట్రాక్టు ఉద్యోగులు మంత్రి టీజీ భరత్ను కలిసి విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. కొంతకాలం నుంచి ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగుల జీతభత్యాల విషయం కర్నూలు మెడికల్ కాలేజీలోని ఏడీ చూస్తున్నారు. దీంతో ఆసుపత్రి అధికారులు ఈ విషయం తమ పరిధిలోనిది కాదన్నట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. క్లర్కులు సైతం వివరాలు నమోదు చేయడంలో తీవ్ర జాప్యం చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్టాఫ్నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధి పోర్టల్ పేరుతో వేధింపులు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టు స్టాఫ్నర్సులు, పారామెడికల్ ఉద్యోగులకు జీతాలు చెల్లించే విషయంలో పలు మార్పులు చేశారు. నిధి పోర్టల్ ద్వారా జీతాలు చెల్లించాలంటే ముందుగా ఉద్యోగుల నియామక పత్రాలు, కేడర్ వివరాలు, శాఖల వారీగా పోస్టుల వివరాలు, అప్పటి రోస్టర్ వివరాలు, రోస్టర్ నంబర్, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన నంబర్లు వంటి వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 2016లో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అప్పటి అధికారులు 56 మందికిగాను ఏకంగా 156 మందికి పైగా కాంట్రాక్టు విధానంలో ఉద్యోగులను నియమించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అప్పట్లో వివాదం జరిగింది. ఈ క్రమంలో కొందరికి రోస్టర్ పాయింట్లు సరిగ్గా ఇవ్వలేకపోవడంతో వివరాలు సక్రమంగా లేవని ట్రెజరీ అధికారులు పలుమార్లు జీతాలు నిలిపినట్లు సమాచారం. ఇప్పుడు కూడా నిధి పోర్టల్లో వివరాలు అప్లోడ్ చేయాల్సి రావడంతో సమస్య మొదటికి వచ్చింది. కాంట్రాక్టు ఉద్యోగులకు నాలుగు నెలలుగా అందని వేతనాలు ఇబ్బంది పడుతున్న స్టాఫ్ నర్సులు, పారా మెడికల్ ఉద్యోగులు ఉమ్మడి జిల్లాలో 2 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ట్రెజరీ అధికారుల కొర్రీలు నియామకపు ఉత్తర్వుల్లో రోస్టర్ పాయింట్లు లేవని మెలిక శాపంగా మారిన నిధి పోర్టల్ అందులో పూర్తి వివరాలను అప్లోడ్ చేస్తేనే జీతాలు పట్టించుకోని అధికారులునిధి పోర్టల్ పేరుతో ఉద్యోగులను వేధిస్తున్నారు. ఈ పోర్టల్లో మంజూరైన పోస్టులు, నోటిఫికేషన్, రోస్టర్ పాయింట్లు వంటి వివరాలు నమోదు చేయాలి. ఈ వివరాలు నమోదు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మరోవైపు ట్రెజరీ శాఖ అధికారులు మాత్రం రోస్టర్ పాయింట్లు లేకుండా గతంలో రిక్రూట్ చేశారని, శాంక్షన్ పోస్టుల కన్నా ఎక్కువ మందిని నియమించారని చెబుతున్నారు. ఈ గందరగోళం వల్లే జీతాల సమస్య వచ్చి పడింది. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కాంట్రాక్టు స్టాఫ్నర్సులు, పారామెడికల్ ఉద్యోగులకు పాత సీఎఫ్ఎంఎస్ విధానంలోనే జీతాలు ఇవ్వాలి. –సి.బంగారి, ఏపీ ప్రభుత్వ నర్సుల సంఘం కర్నూలు కార్యదర్శి కాంట్రాక్టు స్టాఫ్నర్సులు, పారామెడికల్ ఉద్యోగుల జీతాల సమస్య ఓ కొలిక్కి వచ్చింది. ఈ మేరకు ట్రెజరీ శాఖలో సమస్య పరిష్కారం అవుతోంది. త్వరలో ఉద్యోగులకు జీతాలు వేస్తారు. ఉద్యోగులు పంపిన వివరాలను ఆ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. అన్ని వివరాలు పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలోని ట్రామాకేర్ విభాగం కింద నియామకం పొందిన కొందరు ఉద్యోగులు మాత్రం మరికొంత కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. – కృష్ణమోహన్, అసిస్టెంట్ డైరెక్టర్, కర్నూలు మెడికల్ కాలేజీ -
ప్రైవేట్ బస్సుకు తప్పిన ప్రమాదం
పాణ్యం: మండల కేంద్రంలో జాతీయ రహదారిపై తెల్లవారుజామున 4 గంటలకు ప్రైవేట్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందరి భాగం దెబ్బతినగా డోర్ లాక్ కావడంతో ప్రయాణికులు వెనుక భాగంలోని డోర్ నుంచి కిందకు దిగారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై హైవే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్ నుంచి తిరుపతికి ఆంజనేయ ట్రావెల్ బస్సు 32 మంది ప్రయాణికులతో బయలుదేరింది. పాణ్యంలోని ఫ్లైఓవర్ వద్దకు రాగానే ముందు పౌడర్ లోడ్తో వెళ్తున్న లారీ ఎడమవైపు తిరిగే క్రమంలో బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు అద్దం పగిలిపోగా ముందు భాగం దెబ్బతింది. బస్సుల్లో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురై హాహాకారాలు పెట్టారు. బస్సు ముందువైపు ఉన్న డోర్ లాక్ కావడంతో వెనక ఉన్న ఎమర్జెన్సీ డోర్ నుంచి కిందకు దిగారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి సిబ్బందిని ఘటనా స్థలానికి పంపి విచారణ చేపట్టారు. హైవే పోలీసులు వాహనాన్ని స్టేషన్కు తరలించి రహదారిపై ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ప్రయాణికులను పలు బస్సుల్లో వారి స్వగ్రామాలకు పంపించారు. ఇదిలాఉండగా మండలంలో వరుసగా బస్సుల ప్రమాదాలు చోటు చేసుకోవడంతో అధికారులు, ప్రజలు హడలిపోతున్నారు. -
పొలాలన్నీ ఇసుక దిబ్బలే!
ఏ పొలం చూసినా ఇసుక దిబ్బలే.. కుంబళనూరు–నదిచాగి మెయిన్ రోడ్డుకు ఇరువైపుల పొలాలన్నీ ఇసుక దిబ్బలతో దర్శనమిస్తున్నాయి. ఇక్కడికి సమీపంలో ఇసుక రీచ్ నిర్వహిస్తున్నారు. అయితే కుంబళనూరు కొత్త గ్రామం నుంచి పాత గ్రామం వరకు పొలాలన్నింటినీ నిర్వాహకులు రెండింతల కౌలుకు మాట్లాడుకున్నారు. ఇక ఏ పొలం చూసినా ఇసుకతో నింపేస్తున్నారు. ఈ కారణంగా వాహనదారులు ఈ దారిలో ప్రయాణమంటే చుక్కలు చూస్తున్నారు. కొద్దిగా గాలి వస్తే చాలు ఇసుక కళ్లలో పడుతుండటంతో తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. అయినప్పటికీ అధికారులు నోరు మెదపకపోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనం. – కౌతాళం -
ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పల్స్పోలియో చుక్కలు వేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి డాక్టర్ ఉమ ఆదేశించారు. కర్నూలు మెడికల్ కాలేజీలోని న్యూ లెక్చరర్ గ్యాలరీలో బుధవారం కర్నూలు పట్టణ వార్డు ఆరోగ్య కార్యకర్తలకు పల్స్పోలియో కార్యక్రమంపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉమ మాట్లాడుతూ.. ఈ నెల 28వ తేదీన నిర్వహించే జాతీయ పల్స్పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో అర్హులైన పిల్లందరికీ పోలియో చుక్కలు వేయించాలని ఆదేశించారు. పోలియో బూత్లతో పాటు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రత్యేక మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాల్లోనూ బూత్లు ఏర్పాటు చేశామన్నారు. పోలియో చుక్కలు వేసే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి ఆమె వివరించారు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రఘు, వైద్యాధికారులు, సచివాలయం సిబ్బంది, క్షేత్రస్థాయి పర్యవేక్షకులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు 23 మంది ఎంపిక
కర్నూలు(సెంట్రల్): యోగాంధ్రలో భాగంగా జిల్లా స్థాయి పోటీల్లో విశేష ప్రతిభ కనబరచి 23 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ క్రమంలో వారంతా జేసీ నూరుల్ ఖమర్ను ఆయన కార్యాలయంలో కలవగా ఆయన అభినందించి రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ చాటి జిల్లాకు మంచి పేరు తేవాలని ప్రోత్సహించారు. సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, యోగాంధ్ర, ఆయూష్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అమర్నాథ్, యోగా అసోసియేషన్ అధ్యక్షుడు అవినాష్ పాల్గొన్నారు. హోంగార్డులకు బీమా అవసరం కర్నూలు(టౌన్): ఆరోగ్య భద్రతకు బీమా వంటి ఇన్సూరెన్స్ పాలసీలు హోంగార్డులకు అవసరమని హోంగార్డ్స్ కమాండెంట్ మహేష్ కుమార్ అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో హోంగార్డ్స్ పరేడ్, దర్బార్ నిర్వహించారు. కార్యక్రమంలో 70 మంది హోంగార్డులు హాజరయ్యారు. హోంగార్డ్స్ డీఎస్పీ ప్రసాద్, యాక్సిస్ బ్యాంక్ మేనేజర్, ఇన్సూరెన్స్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. మద్దిలేటయ్య హుండీ ఆదాయం లెక్కింపు బేతంచెర్ల: మండలపరిధిలోని ఆర్ఎస్ రంగాపురం శివార్లలో వెలసిన వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి నరసింహస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.45,73,676 వచ్చింది. స్వామి, అమ్మవార్లకు భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలు, ముడుపులు, నిత్యన్నదాన సత్రంలోని హుండీ ఆదాయం లెక్కింపు బుధవారం చేపట్టారు. దేవదాయశాఖ అధికారి రమేష్ పర్యవేక్షణలో మొత్తం 34 రోజులకు సంబంధించిన హుండీ ఆదాయం లెక్కించగా రూ.45,73,676 నగదు, 66 గ్రాముల బంగారు, 700 గ్రాముల వెండి వచ్చిందని ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు వెల్లడించారు. బాలాజీ సేవా ట్రస్ట్ సభ్యులు, డోన్, బేతంచెర్ల మద్దిలేటి సేవా సమితి, వాసవీ సభ్యులు పాల్గొన్నారు. మళ్లీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కర్నూలు(అగ్రికల్చర్): ఎల్నినో ప్రభావంతో నైరుతి రుతు పవనాలు బలహీనపడటంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల జిల్లాలో వర్షాలు కురిసిన తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాల్సి ఉంది. అయితే రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కర్నూలులో గరిష్టంగా 39.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. ఈ సమయంలో సాధారణ ఉష్ణోగ్రతల ప్రకారం 35 డిగ్రీల వరకు మాత్రమే నమోదు కావాల్సి ఉంది. అయితే సాధారణం కంటే 4–5 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కర్నూలులో రాత్రి ఉష్ణోగ్రతలు 28.5 డిగ్రీలు నమోదు కావడం గమనార్హం. నంద్యాల జిల్లాలో ఒకటి రెండు చోట్ల 39 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
మతిస్థిమితం సరిగాలేని యువకుడి ఆత్మహత్య
మహానంది: కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న యువకుడు గత కొద్దికాలంగా మతిస్థిమితం సరిగా లేక రైలు కింద పడి మృతి చెందాడు. ఈ ఘటన గోపవరంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తిమ్మనాయుడు దంపతుల రెండో కుమారుడు ముత్తా మదన్ (27) వ్యవసాయ పనులతో పాటు ఇతర పనులకు వెళ్లేవాడు. కొద్దిరోజులుగా మతిస్థిమితం సరిగా లేక మనోవేదనకు గురయ్యేవాడు. ఈ స్థితిలో మంగళవారం రాత్రి గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న నంద్యాల రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. డ్రంకెన్ డ్రైవ్లో ఐదుగురికి జైలుశిక్ష ఆదోని రూరల్: డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన ఐదుగురికి నాలుగు రోజులు జైలుశిక్ష విధిస్తూ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ తీర్పునిచ్చినట్లు తాలూకా సీఐ నల్లప్ప బుధవారం తెలిపారు. ఇందులో సింధనూరు తాలూకా రాయచూరు జిల్లాకు చెందిన యన్నూరు, ఆదోని పట్టణానికి చెందిన ఎం.పెద్ద ఈరన్న, ఆస్పరి మండలం నగరూరుకు చెందిన బాట రామకృష్ణ, ఆదోని పట్టణానికి చెందిన ఎరుకల సుంకన్న, సాంబగల్లు గ్రామానికి చెందిన సూరిపోగుల రాజు ఉన్నారన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రోడ్డు భద్రతా నియమాలను ప్రతిఒక్కరూ పాటించాలన్నారు. పంచాయతీ సెక్రటరీకి రిమాండ్ వెల్దుర్తి: పట్టణానికి చెందిన సంధ్యపోగు సతీష్ ఇంటి అప్రూవల్ కొరకు మంగళవారం ఓ టీస్టాల్ వద్ద రూ.40 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ స్థానిక మేజర్ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్ను బుధవారం ఏసీబీ కర్నూలు కోర్టులో హాజరుపరుచగా జడ్జి 15 రోజుల రిమాండ్కు ఆదేశించినట్లు ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. ఈ మేరకు నిందితుడిని పంచలింగాల డిస్ట్రిక్ జైలుకు తరలించినట్లు చెప్పారు. మంగళవారం లంచం తీసుకుంటూ పట్టుకున్న సెక్రటరీని ఏసీబీ అధికారులు అర్ధరాత్రి వరకు స్థానిక పంచాయతీ కార్యాలయంలో విచారించారు. సతీష్ తాను ఇంటి అప్రూవల్ కొరకు పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవడం, ఆ అర్జీని సెక్రటరీ లక్ష్మీనాథ్, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ అయిన తహసీల్దార్ చంద్రశేఖర్వర్మకు పంపడం, అనంతరం స్పెషల్ ఆఫీసర్ కార్యాలయానికి పంపడం తదితరాలను సెక్రటరీని, తహసీల్దార్ను విచారించి ఆధారాలు సేకరించారు. అనంతరం ఆయన్ను కర్నూలుకు తరలించారు. పట్టుబడ్డ నిందితుడికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు, అవినీతి ఆదాయ పూర్తి వివరాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఊరి వేసుకుని యువకుడి బలవన్మరణం మంత్రాలయం రూరల్: మండల పరిధిలోని వగరూరు గ్రామంలో మద్యం తాగి యువకుడు ఫ్యాన్కు ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై ఎస్ఐ మల్లికార్జున తెలిపిన మేరకు వివరాలు.. గ్రామానికి చెందిన ముల్లా రహిమాన్ (30) మద్యానికి బానిసై అప్పులు చేశాడు. తాను అప్పుల పాలయ్యానని, బతికినా దండగ అంటూ తరచూ చెప్పేవాడు. కుటుంబ సభ్యులు, బంధువులు అతనికి సర్ధి చెప్పేవారు. ఈ క్రమంలో బుధవారం కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లిన సమయంలో ఇంట్లో చీరతో ఫ్యాన్కు ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వారు తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి ఉరికి వేలాడుతూ శవంగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. భార్య బషీరూమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ముంభైలో కోసిగి యువకుడి ఆత్మహత్య కోసిగి: మండల కేంద్రంలోని సిద్దప్ప పాళెం ఊరువాకిలి సమీపంలో నివాసం ఉంటున్న కోదండ వెంకటేష్, సునీత దంపతుల కుమారుడు సాయికుమార్ (22) బుధవారం ముంభైలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఆ యువకుడు డిగ్రీ వరకు చదువుకుని గతేడాది నుంచి ముంభైలో బంధువుల వద్ద ఉంటూ కాల్ సెంటర్లో పని చేస్తున్నాడు. ఈ స్థితిలో ఏమైందో గానీ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. బాధిత కుటుంబ సభ్యులు హుటాహుటిన ముంభైకు బయలుదేరి వెళ్లినట్లు తెలిసింది. -
నాణ్యత చినుకులకెరుక!
టీడీపీ కాంట్రాక్టర్లకు డబ్బు సంపాదనపై ఉన్న శ్రద్ధ చేస్తున్న పనులపై ఉండటం లేదనేందుకు ఈ రోడ్డే నిదర్శనం. ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు, పట్టణ నడిబొడ్డున నిర్మించిన రోడ్డు పట్టుమని వంద రోజులు కాకమునుపే గుంతలు తేలడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కమీషన్ల బాగోతమే ఈ నాసిరకం పనులకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పత్తికొండ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు దాదాపు 2.60 కిలోమీటర్ల ప్రధాన రహదారిని రూ.2.75కోట్లతో నాలుగు నెలల కిందట నిర్మించారు. పనులు నాసిరకంగా చేపట్టడంతో రెండు వారాలకే చాలాచోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. రెండు రోజుల కిందట కురిసిన మొదటి వానకే అంబేడ్కర్ సర్కిల్ ప్రధాన రహదారి ఎక్కడికక్కడ గుంతలు తేలుతోంది. అయితే కాంట్రాక్టర్ కనీస మరమ్మతులు చేపట్టకపోవడం చూస్తే అధికారుల పనితీరు ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. – పత్తికొండ -
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి దుర్మరణం
వెల్దుర్తి: పట్టణ పరిధిలోని డోన్వైపు రైల్వే గేటు దాటిన తర్వాత హైవే–44పై యూ టర్న్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పోతులూరి ఆచారి (68) మృతి చెందాడు. వివరాలు.. మండల పరిధిలోని ఎల్ నగరంకు చెందిన పోతులూరి ఆచారి రైతు పనితో పాటు వడ్రంగి వృత్తి చేసేవాడు. ఐదు నెలల క్రితం నుంచి వెల్దుర్తికి వచ్చి ఇక్కడే నివాసముంటున్నాడు. బుధవారం కృష్ణగిరి మండలంలో బంధువుల శుభకార్యానికి హాజరయ్యేందుకు తన టీవీఎస్ ఎక్స్ఎల్ మోటార్ సైకిల్పై వెళ్తూ పట్టణ రహదారి నుంచి హైవేలోకి ప్రవేశించాడు. ఇదే సమయంలో ఒరిస్సాకు చెందిన శుభమ్ తన స్పోర్ట్స్ బైక్పై హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్తూ టీవీఎస్ ఎక్స్ఎల్ను ఢీకొట్టాడు. కింద పడ్డ పోతులూరి ఆచారి కాలికి గాయాలై తీవ్ర రక్తస్రావమైంది. హైవే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని 108 వాహనంలో స్థానిక సీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. మృతుడికి భార్య శంకరమ్మ, నలుగురు కుమార్తెలు ఉన్నారు. -
టీబీ డ్యాంలో 9.9 టీఎంసీల నీరు
హొళగుంద: కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర డ్యాంలో బుధవారం నాటికి 9.903 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇన్ఫ్లో 319 క్యూసెకులు ఉండగా.. బళ్లారి పట్టణానికి, ఆర్బీసీ కాలువలకు 380 క్యూసెక్కుల (అవుట్ఫ్లో) నీటిని వదులుతున్నారు. గతేడాది ఇదే సమయానికి 1605.27 అడుగుల వద్ద 29.145 టీఎంసీల నీరు నిల్వ ఉండి ఇన్ఫ్లో 14,621 క్యూసెక్కులు నమోదైంది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఇప్పటికే రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలాఉంటే బళ్లారి పట్టణ ప్రజల తాగునీటి అవసరాలకు బుధవారం టీబీ డ్యాం నుంచి ఎల్లెల్సీకి నీరు విడుదల చేశారు. దాదాపు 180 క్యూసెక్కుల మేర నీటిని వదులుతున్నారు. ఎల్లెల్సీకి వదులుతున్న నీరు బళ్లారి పట్టణానికి మాత్రమే కావడంతో ఆంధ్ర ప్రాంత రైతులు నిరాశకు లోనవుతున్నారు. -
ఆధునిక వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడి
దేవనకొండ: ఆధునిక వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అన్నారు. బుధవారం మండలంలోని కరివేముల గ్రామంలో రైతు సదాశివరావు హై–డెన్సిటీ ప్లాంటేషన్ కింద సాగు చేస్తున్న మామిడి పంటను కలెక్టర్ పరిశీలించారు. సూక్ష్మ నీటిసాగు సదుపాయాలతో సాగు చేస్తున్న ఇలాంటి తోటలు అధిక ఉత్పాదకత సాధించడంలో ఆదర్శమన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా తోటల అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. అనంతరం దేవనకొండలో పలువురు రైతులు 16 ఎకరాల్లో సాగు చేస్తున్న హైబ్రిడ్ కొబ్బరితోటతో పాటు మిశ్రమ, అంతర పంటల విధానాలను కలెక్టర్ పరిశీలించారు. ఆ తర్వాత మన గ్రోమోర్ సెంటర్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో యూరియా, ఎరువుల విక్రయాల్లో ఫిర్యాదులు ఉంటే 155251, 8341302863 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని రైతులకు సూచించారు. రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించడంలో విఫలమైన బండగట్టు, కుంకనూరు, ఆర్ఎస్కే సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యవసాయ అధికారిణి వరలక్ష్మి, పత్తికొండ ఆర్డీఓ ఓబులేసు, ఉద్యానశాఖ అధికారి రాజాకృష్ణరెడ్డి, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, ఏపీఎంఐపీ ఏపీడీ ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ కాంట్రాక్టర్పై టీడీపీ నేతల దాడి
సాక్షి టాస్క్ఫోర్స్, కర్నూలు: ఏయ్.. మేము ప్రజాప్రతినిధి అనుచరులం. రూ.5 లక్షలు ఇవ్వాలంటూ ఓ మున్సిపల్ కాంట్రాక్టర్పై దాడికి పాల్పడిన ఘటన కర్నూలులో చోటు చేసుకుంది. అడ్డొచ్చిన ఆ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్పై దౌర్జన్యం చేశారు. బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలివీ.. మంగళవారం సాయంత్రం కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ కాంట్రాక్టర్గా, అసోసియేషన్ నాయకులుగా ఉన్న రంగయ్యకు స్థానికంగా శ్రీరామ నగర్కు చెందిన సునీల్ కుమార్ పని విషయం మాట్లాడాలి రమ్మని ఫోన్ చేశాడు. దీంతో ఆయన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లిన తరువాత మా ఏరియాలో పనులు చేస్తున్నావు కదా.. రూ.5 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించాడు. గొడవకు దిగారు. అంత ఇచ్చుకోలేనని, తన వద్ద లేవంటూ సమాధానమిచ్చాడు. దీంతో రెచ్చిపోయిన ప్రజా ప్రతినిధి అనుచరులు కాంట్రాక్టను తీవ్రంగా కొట్టారు. తలపై, చెవిపై దాడి చేశారు. అక్కడి నుంచి బాదితుడు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని వైద్యం చేయించుకున్నాడు. కర్ణబేరి దెబ్బతినిందని చెప్పడంతో మరో ప్రెవేటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఈ విషయమై ‘సాక్షి’ బాధితుడితో మాట్లాడగా.. ‘‘నగరంలోని శ్రీరామనగర్కు చెందిన టీడీపీ ముఖ్యనేత అనుచరులు రూ.5 లక్షలు డిమాండ్ చేశారన్నారు. ఇవ్వకుంటే ఎలా పనులు చేస్తావో చూస్తామని బెదిరించారు. ఇలాగైతే కర్నూలులో ఏ విధంగా అభివృద్ధి పనులు జరుగుతాయని వాపోయినా వినిపించుకోలేదు. గతంలో ఎన్నడూ ఇటువంటి ఘటనలు జరుగలేదు. 30 సంవత్సరాల నుంచి మున్సిపల్ కాంట్రాక్టర్గా ఉన్నా. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పనులు చేయడం మాత్రమే తెలుసు. ఇప్పుడు కర్నూలులో పనులు చేయలేని పరిస్థితి ఉంది. ఓ వైపు చేసినా పనులకు బిల్లులు రాక అవస్థలు పడుతున్నాం. మళ్లీ ఇప్పుడు అధికార పార్టీ నేత అనుచరులంటూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. భయాందోళనకు గురి చేయడం ఎంతవరకు సమంజసం.’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టించుకోని పోలీసులు బాధితుడు బుధవారం సాయంత్రం తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేసేందుకు కర్నూలు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు పట్టించుకోలేదని, కనీసం ఫిర్యాదు తీసుకోలేదని రంగయ్య వాపోయాడు. న్యాయం కోసం జిల్లా ఎస్పీ విక్రాంత్పాటిల్ను కలుస్తానన్నారు. తనపై దాడి చేసిన టీడీపీ నేతలను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతానన్నారు. -
కొట్టుకుపోయిన పొలాల దారి
పెద్దకడబూరు: మండల కేంద్రం శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం పక్కన ఉన్న తక్కిడి ఓణి రస్తా (పొలాల రస్తా) మొన్న కురిసిన భారీ వర్షాలకు కొట్టుకొని పోయి గుంతగా మారింది. దారి ప్రమాదకరంగా మారడంతో రైతులు తమ పొలాలకు ఎద్దులబండి కట్టుకొని పోవాలన్నా, ఆ రస్తాగుండా వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాల రాకపోకలకు కూడా కష్టంగా మారింది. వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. దీంతో రైతులు నిత్యం ఆ రహదారిలో వెళ్లాల్సిందే. మరో వర్షం వస్తే ఉన్న కాస్తకూడా తెగిపోతే అటువైపు పొలాలకు దారేలేకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రహాదారికి మరమ్మతులు చేపట్టి, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
యోగాతో ఆరోగ్యం
● ఈనెల 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేద్దాం ● జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపు నంద్యాల: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. బుధవారం ఉదయం నంద్యాల ఇండోర్ స్టేడియం ఆవరణలో యోగాంధ్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, ఎస్పీ సునీల్షెరాన్తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం యోగా నిపుణుల సూచనల మేరకు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన సాధన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగాభ్యాసం ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరగడంతో పాటు ఒత్తిడి తగ్గుతుందన్నారు. ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడులు, అనారోగ్య సమస్యలకు యోగం చక్కని పరిష్కారంగా నిలుస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఇప్పటివరకు జిల్లాలో 3.50 లక్షల మంది ‘యోగాంధ్ర’ యాప్, పోర్టల్ ద్వారా స్వచ్ఛందంగా పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. ఆరోజు జిల్లాలోని ప్రతి గ్రామం, వార్డు, మండల కేంద్రం, నియోజకవర్గ కేంద్రం, జిల్లా కేంద్రంలో భారీ స్థాయిలో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా సాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యోగా సాధకులు, విద్యార్థులు, యువత, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. -
ఆర్యూ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఊరుకోం
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఊరుకోబోమని వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసెర్ వి.వెంకట బసరావు హెచ్చరించారు. బుధవారం వర్సిటీలోని సెనేట్ హాల్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో రెక్టార్ ఆచార్య ఎన్టీకే నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయ్కుమార్నాయుడుతో కలిసి వర్సిటీ అభివృద్ధికి చేపడుతున్న చర్యలను వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించి ఏ ఒక్క పని చేపట్టలేదని, అలాంటప్పుడు అవకతవకలకు ఆస్కారమెక్కడిదన్నారు. క్రమశిక్షణను ఉల్లంఘించడంతో పాటు వర్సిటీని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నించే ఎవరినైనా ఉపేక్షించబోమన్నారు. విద్యార్థి సంఘాల నేతలకు చాలా అవకాశాలు ఇచ్చామని, అయినా మార్పు రాకపోవడంతోనే ఇటీవల ఇద్దరు విద్యార్థులపై చర్యలు తీసుకున్నామన్నారు. నాన్ బోర్డర్స్ను వర్సిటీ హాస్టళ్లలోకి అనుమతించేది లేదన్నారు. వర్సిటీలో ఇప్పటికే నాలుగు కొత్త కోర్సులను ప్రారంభించామన్నారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాల బీఏ ఎకనామిక్స్(ఆనర్స్), బి.ఫార్మసీ కోర్సుల ప్రారంభానికి చర్యలు తీసుకుంటామన్నారు. వర్సిటీకి ఐఎస్వో 4 స్టార్ రేటింగ్ వచ్చిందన్నారు. న్యాక్ అక్రిడిటేషన్ ప్రక్రియను తిరిగి ప్రారంభించామన్నారు. సమావేశంలో వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి.విశ్వనాథరెడ్డి, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పీవీ సుందరానంద్ తదితరులు పాల్గొన్నారు. -
50 శాతం సబ్సిడీతో దాణా పంపిణీ
కర్నూలు(అగ్రికల్చర్): పాల ఉత్పత్తిని పెంచేందుకు 50 శాతం సబ్సిడీతో సమీకృత దాణా పంపిణీ చేస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. 50 కిలోల ప్యాకెట్ పూర్తి ధర రూ.1,110 ఉండగా.. ఇందులో 50 శాతం సబ్సిడీ మినహాయించి రూ.555 పాడి రైతులు చెల్లించాలని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాకు 946 మెట్రిక్ టన్నుల దాణా కేటాయించారని, ఇందులో మొదట ఎస్సీ, ఎస్టీ రైతులకు పంపిణీ చేస్తామన్నారు. ఎస్సీ రైతులకు 330 టన్నులు, ఎస్టీ రైతులకు 83 టన్నుల ప్రకారం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మిగిలిన దాణా ఇతరులకు పంపిణీ చేస్తామని.. వివరాలకు రైతు సేవా కేంద్రం లేదా పశువైద్యాధికారిని సంప్రదించాలన్నారు. వైద్య విద్య ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు(సెంట్రల్): ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ(ఈఎస్ఐసీ) ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ కర్నూలు బ్రాంచ్ మేనేజర్ బి.దుర్గా ప్రసాద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీమా చేసిన ఉద్యోగుల పిల్లలు అందుకు అర్హులని, దేశవ్యాప్తంగా 695 ఎంబీబీఎస్, 28 బీడీఎస్, 60 బీఎస్సీ నర్సింగ్ సీట్లు కేటాయించినట్లు చెప్పారు. నీట్(యూజీ)–2026 ర్యాంకు ఆధారంగా నిర్వహించే కౌన్సెలింగ్కు జూన్ 21వ తేదీలోపు, అలాగే వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ కోసం జూన్ 24వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పీఆర్ ఈఈగా శివసాగర్రెడ్డి బాధ్యతల స్వీకరణ కర్నూలు(అర్బన్): కర్నూలు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఈఈగా జి.శివసాగర్రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా పలువురు డీఈఈలకు ఈఈలుగా పదోన్నతి కల్పించిన నేపథ్యంలో వైఎస్సార్ కడప జిల్లాలో డీఈఈగా విధులు నిర్వహిస్తున్న శివసాగర్రెడ్డికి ఈఈగా పదోన్నతి కల్పించి ఇక్కడకు నియమించారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 30న ఇక్కడ ఈఈగా విధులు నిర్వహించిన ఎస్.మహేశ్వరరెడ్డి పదవీ విరమణ చేయడంతో అప్పటి నుంచి పాణ్యం డీఈఈ నాగిరెడ్డి ఇంచార్జీ ఈఈగా విధులు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ ఈఈగా శివసాగర్రెడ్డి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పీఆర్, పీఐయు డీఈఈలు బండారు శ్రీనివాసులు, కర్రెన్న, నాగిరెడ్డి, ఆర్.సతీష్కుమార్, పీఆర్ క్వాలిటీ కంట్రోల్ డీఈఈలు ధనిబాబు, భాస్కర్రెడ్డి, పత్తికొండ డీఈఈ శేషయ్య, డీఏఓ నాగశేఖర్రెడ్డి, ఏఈలు శుభాకాంక్షలు తెలిపారు. 20న పీఎం కిసాన్ పెట్టుబడి సాయం కర్నూలు(అగ్రికల్చర్): పీఎం కిసాన్ 23వ విడత ఆర్థిక సహాయం ఈ నెల 20న విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ–కేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే పీఎం కిసాన్ సాయం దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద 2026–27 సంవత్సరానికి మొదటి విడత పెట్టుబడి సాయం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద రూ.5వేలు, పీఎం కిసాన్ కింద రూ.2వేలు రైతుల బ్యాంకు ఖాతాలకు విడుదల కానున్నా యి. అయితే ఎంత మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందనే వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. 19న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేపై గ్రామసభలు కర్నూలు(అర్బన్): యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే డేటా వాలిడేషన్పై ఈనెల 19న జిల్లాలోని అన్ని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల పరిధిలో గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు ఎస్జీఎస్డబ్ల్యూ సచివాలయాల అధికారి టీవీ భాస్కర్ నాయుడు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇందుకు సంబంధించి ఇటీవల నిర్వహించిన సర్వే డేటాను ఆయా సచివాలయాల పరిధిలో ఈనెల 18న పంచాయతీ కార్యదర్శులు/వార్డు అడ్మిన్ సెక్రెటరీల ద్వారా ప్రచురిస్తామన్నారు. అభ్యంతరాలు ఉంటే ఈనెల 19 నుంచి 24వ తేదీ వరకు పోర్టల్ ద్వారా నమోదు చేస్తారన్నారు. కుల సంబంధమైన అభ్యంతరాలను సంబంధిత వీఆర్వో, తదుపరి అధీకృత అధికారి ద్వారా ఈనెల 27వ తేదీ వరకు పరిశీలిస్తారన్నారు. కులాలకు సంబంధం లేని అభ్యంతరాలు, ఫిర్యాదులను పంచాయతీ కార్యదర్శులు, వార్డు అడ్మిన్ సెక్రెటరీల ద్వారా ఈనెల 26వ తేదీ వరకు ప్రాసెస్ చేస్తారన్నారు. -
‘సర్’లో ఏకపక్షంగా ఉండొద్దు
ఆదోని: సర్ సర్వేలో బీఎల్ఓలు ఎక్కడా ఏకపక్షంగా వ్యవహరించరాదని, అధికార పార్టీకి లేదా ఇతర పార్టీ బీఎల్ఏలకు అనుకూలంగా వ్యవహరించొద్దని, ముఖ్యంగా ఓటర్ల సమాచారం రాజకీయ పార్టీల యాప్లోకి అప్లోడ్ చేయకుండా చూడాలని ఆదోని తహసీల్దార్ శేషఫణి హెచ్చరించారు. బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘టీడీపీ యాప్లో ఓటర్ల వివరాలు’ శీర్షికన వార్తా కథనం ప్రచురితమైన విషయం పాఠకులకు విధితమే. ఈ సందర్భంగా బుధవారం రాత్రి బీఎల్ఓలు, సూపర్వైజర్లకు నిర్వహించిన సమావేశంలో తహసీల్దార్ పలు సూచనలు చేశారు. ‘సర్’ సర్వేకు ఏ పార్టీ వారు వచ్చినా అభ్యంతరం తెలపొద్దని, అయితే ఓటర్ల వివరాలను వారి వ్యక్తిగత యాప్లోకి వెళ్లకుండా నిలుపుదల చేయాలన్నారు. ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వడంలో ఎక్కడా గందరగోళం చోటు చేసుకోకూడదని, వాటిని ఏ రాజకీయ పార్టీ బీఎల్ఏలకు ఇవ్వకూడదని ఆదేశించారు. ‘సర్’ ప్రక్రియలో ప్రతి ఒక్క బీఎల్ఓ పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏదైనా అనుమానం ఉంటే సంబంధిత అధికారులను కలవాలన్నారు. -
ఎస్ఐఆర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఈ నెల 15న మొదలైంది. ప్రతీ బీఎల్ఓ ఇంటింటికి తిరిగి ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చి ఓటరు ఉన్నారా? లేదా? విచారించి అప్పుడు మ్యాపింగ్ చేయాలి. అయితే బీఎల్ఓలు మాత్రం 2002 ఓటర్ల జాబితా, ప్రస్తుత జాబితా టేబుల్పై పెట్టుకుని ఇ
● ఈ నెల 14వ తేదికి ఆదోనిలో 89.17శాతం మ్యాపింగ్ పూర్తయింది. ఆదోనిలో 2002లో కౌతాళం మండలం ఉండేది. ఆలూరు నియోజకవర్గంలోని కొన్ని పల్లెలు ఉండేవి. ఇవన్నీ ఇప్పటి జాబితాతో 89.17 శాతం మ్యాపింగ్ చేశారంటే ఎంత గమ్మత్తుగా ఉందో ఇట్టే తెలుస్తోంది. ● ఆలూరు నియోజకవర్గంలో 2002లో ఇప్పటి ఆదోని మండలంలోని కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. ఇక్కడ 84.54 శాతం మ్యాపింగ్ చేశారు. ● మంత్రాలయం మండలం 2002లో ఎమ్మిగనూరు పరిధిలో ఉండేది. ఇప్పుడు మంత్రాలయం నియోజకవర్గం. ఇక్కడ 82.15 శాతం మ్యాపింగ్ చేశారు.సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎస్ఐఆర్ను ఎన్నికల సంఘం నిర్వహించడం సర్వసాధారణమే. అయితే పశ్చిమబెంగాల్లో దాదాపు 90లక్షల ఓట్లు తొలగింపు తర్వాత ఈ ప్రక్రియపై కూడా దేశవ్యాప్తంగా రాజకీయపార్టీలు అనుమానాలు లేవనెత్తుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏపీలో ఉండటంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరిగినా ప్రభుత్వ యంత్రాంగం అధికారపక్షం కనుసన్నల్లో నడవడం సర్వసాధారణం. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో ‘ఎస్ఐఆర్’ జరుగుతున్న తీరుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 24 ఏళ్ల తర్వాత జరిగే ఈ ప్రక్రియలో చనిపోయిన వారు, వలసలు, డబుల్ ఎంట్రీలు చాలా ఉన్నాయి. ప్రతీ ఇల్లు డోర్ టు డోర్ తిరిగి, వారికి రెండుచొప్పున ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చి పూర్తి చేసిన తర్వాత జూలై 14లోపు వాటిని తిరిగి బీఎల్ఓలకు అందజేయాలి. ఆపై మాత్రమే మ్యాపింగ్ చేయాలి. సెప్టెంబర్ 22న తుది ముసాయిదా ఓటరు జాబితా ప్రకటిస్తారు. అయితే ఈ నెల 14కే 76.74 శాతం మ్యాపింగ్ అధికారులు పూర్తి చేశారు. బీఎల్ఓలు ఏ ఇంటికి వెళ్లారు? ఎవరిని విచారించారు? అనేది జిల్లాలో ఏ ఒక్క ఓటరుకు తెలీదు. మీడియాకు సమాచారం లేదు. అలాంటప్పుడు జూన్ 15 కంటే ముందుగానే మ్యాపింగ్ బీఎల్ఓలు ఎలా చేశారు? అందులో పారదర్శకత ఎంత అనేది తేలాల్సిన ప్రశ్న. అధికారుల ఒత్తిడితోనే 76.74 శాతం మ్యాపింగ్ జిల్లా అధికారుల ఒత్తిడితోనే మ్యాపింగ్ హడావుడిగా చేసినట్లు ఈ ప్రక్రియలో పాల్గొన్న అధికారులే చెబుతున్నారు. ‘ఏం చేస్తాం సార్! మాపై తీవ్ర ఒత్తిడి ఉంది. అందుకే 2002 ఓటరు జాబితాను పెట్టుకుని మ్యాపింగ్ చేశాం. నిజానికి మీరు చెప్పినట్లు డోర్ టు డోర్ తిరిగి మ్యాపింగ్ చేస్తూ ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వాలి’ అని చెబుతున్నారు. ఇప్పటికే 76.74 శాతం పూర్తయింది. కోడుమూరులో 79.13, పత్తికొండలో 78.59, ఎమ్మిగనూరులో 76.73, పాణ్యం 69.53, కర్నూలులో 58.04 శాతం మ్యాపింగ్ పూర్తయింది. ఇళ్లు తిరగకుండా మ్యాపింగ్ చేసిన అధికారులు ఎన్యుమరేషన్ ఫారాల తర్వాత కూడా ఓటర్ల గుర్తింపు, తొలగింపులో ఏ మాత్రం పారదర్శకత పాటిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారదర్శకంగా చేస్తేనే ప్రయోజనం ● ఒక పోలింగ్ బూత్ పరిధిలోని ఓటరు మరో బూత్కు ఇల్లు మారి ఉంటారు. వీరి ఓటు బదిలీ చేసి మ్యాప్ చేయాలి. ● చనిపోయిన వారి ఓట్లు మ్యాపింగ్ చేయకూడదు. పూర్తిగా తొలగించాలి. ● జిల్లా వాసుల ఓట్లు పల్లెలు, పట్టణాలతో పాటు హైదరబాద్, బెంగళూరులోనూ ఉన్నాయి. అంతర్ రాష్ట్రాల పరిధిలోని ఓట్లను కో రిలేషన్ చేసి ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) ద్వారా వాటిని గుర్తిస్తారు. అప్పుడు డబుల్ ఓట్లు తేలతాయి. అప్పుడు ఫారం–ఏ, బీ ఇచ్చి ఏ రాష్ట్రంలో ఓటు ఉండాలి.. ఎక్కడకు బదిలీ చేయాలనేది నిర్ణయించాలి. అప్పుడు ఓటరు నిర్ణయం ప్రకారం ఓటు ఎక్కడ ఉండాలో తేలుస్తారు. ● సెప్టెంబర్ 22న ముసాయిదా ఓటరు జాబితా ప్రకటన తర్వాత ఫారం–6 ఇస్తారు. అప్పుడు కొత్త ఓట్లు చేరుస్తారు. ఫారం–6 ఇప్పుడు కూడా ఓటరు అడిగితే ఇవ్వాలి. ఫారం–6 నిరంతర ప్రక్రియ. ● అలాగే ఫారం–8 ద్వారా బూత్ పరిధిలోని ఓటు మరో బూత్కు మారుస్తారు. ● ఇవన్నీ కూడా పారదర్శకంగా చేస్తేనే ప్రయోజనం. అప్పుడు డబుల్ ఓట్లు తగ్గుతాయి. కచ్చితమైన ఓటరు జాబితా తేలుతుంది. పోలింగ్ శాతం పెరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు కూర్చుని మ్యాపింగ్ చేసినట్లు చేస్తే సర్ చేసినా ప్రయోజనం ఉండదు. నియోజకవర్గం పూర్తయిన మ్యాపింగ్ శాతం ఆళ్లగడ్డ 88.61 శ్రీశైలం 88.59 నందికొట్కూరు 80.7 నంద్యాల 78.33 కోడుమూరు 79.13 పత్తికొండ 78.59 ఎమ్మిగనూరు 76.73 కర్నూలు 58.04 పాణ్యం 69.53 మంత్రాలయం 82.15 ఆదోని 84.54 .. ఇవన్నీ చూస్తే ప్రక్రియ ఎంత పారదర్శకంగా జరిగిందో అర్థమవుతోంది. డోర్ టు డోర్ తిరగకుండా ఈ స్థాయిలో మ్యాపింగ్ చేయడం పట్ల రాజకీయ పార్టీల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. -
అమెరికా విమాన ప్రమాదంలో జిల్లా వాసి దుర్మరణం
కోసిగి/కౌతాళం: అమెరికాలో ఈనెల 15న జరిగిన విమాన ప్రమాదంలో కోసిగి మండలం తుంబిగనూరుకు చెందిన దాట్ల సుబ్రమణ్యం రాజు కుమారుడు సాయి కార్తీక్ వర్మ (26) దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. దాట్ల సుబ్రమణ్యం రాజు, పద్మావతి దంపతుల సొంత గ్రామం కోస్తాంధ్రలోని భీమవరం కాగా 30 ఏళ్ల క్రితం కోసిగి మండలంలోని తుంబిగనూరుకు వచ్చి స్థిరపడ్డారు. వీరి ఏకై క కుమారుడు సాయికార్తీక్ వర్మ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరిలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. అక్కడే స్టాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కాన్సాస్ రాష్ట్రంలో ఉంటున్నారు. ఈనెల 15న ఆదివారం సరదాగా గడిపేందుకు స్కైడైవింగ్ సహాస క్రీడలో పాల్గొనేందుకు వెళ్లాడు. స్కైడైవింగ్కు తీసుకెళుతున్న చిన్న విమానం సాంకేతిక లోపంతో కుప్పకూలడంతో మంటలు చెలరేగి 12 మంది అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిసింది. అమెరికాలో ఉద్యోగం చేస్తు చేదోడుగా ఉన్న ఒక్కగానొక్క కుమారుడు అకాల మరణం చెందడంతో ఆ కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి. -
మల్లన్న సేవలో బ్రిగేడ్ కమాండర్
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లను సేనా మెడల్ గ్రహీత బ్రిగేడ్ కమాండర్ రాహుల్ మచ్హరాల్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం మల్లన్న దర్శనార్థం విచ్చేసిన కమాండెంట్ దంపతులకు ఆలయ రాజగోపురం వద్ద ఈఓ ఎం.శ్రీనివాసరావు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం కమాండెంట్ దంపతులు మల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకం, భ్రమరాంబా దేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్ద గల ఆశీర్వచన మండపంలో కమాండెంట్ దంపతులకు వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. దేవస్థాన ఈఓ స్వామి వారి జ్ఞాపికను అందించి సత్కరించారు. గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర కార్యదర్శిగా రమణ కర్నూలు కల్చరల్: ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర కార్యదర్శిగా కర్నూలు నగరానికి చెందిన గోరంట్ల రమణ ఎన్నికయ్యారు. మంగళవారం విజయవాడలో సమితి గౌరవాధ్యక్షుడు గోకరాజు గంగరాజు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర సమావేశాల్లో రాష్ట్ర అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శిగా గోరంట్ల రమణను ప్రకటించారు. ఇంతవరక ఆయన పనిచేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి స్థానంలో మాడుగుల నాగఫణి శాస్త్రికి బాధ్యతలు అప్పగించారు. కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా వేణుగోపాల్ కొనసాగుతారు. గోరంట్ల రమణ విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన క్రెడాయ్ కర్నూలు చైర్మన్గా ఉన్నారు. హిందూ ధర్మాన్ని కర్నూలు నగర జిల్లా ప్రజలకు చేరువ చేస్తూ ధర్మ రక్షణలో చురుగ్గా పనిచేస్తూ కార్యకర్తలకు ప్రేరణ కలిగించడంలో వారి కృషిని హిందూ సమాజం గుర్తించిందనటానికి ఈ బాధ్యత ఒక గుర్తింపని హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య కోసిగి: కుటుంబ కలహాలతో కోసిగి రైల్వే స్టేషన్ సమీపంలో కిలోమీటర్ నంబర్ 523/6 వద్ద రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ఆధారంగా మృతుడు ఆర్లబండ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై రైల్వే పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. ఆర్లబండ గ్రామానికి చెందిన మజ్జిగ ఆటో వెంకటరెడ్డి, మహాదేవిల కుమారుడు ఉసేని (23) మంగళవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువకుడికి రెండు నెలల క్రితం అక్క కుమార్తె వందగల్లు గ్రామానికి చెందిన నాగలక్ష్మితో వివాహం జరిగింది. ఇష్టం లేని వివాహం చేయడం, ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు రైల్వే హెడ్కానిస్టేబుల్ సి.శివరామయ్య వెల్లడించారు. డ్రంకెన్ డ్రైవ్లో ఇద్దరికి జైలు డోన్ టౌన్: మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన ఇద్దరు నిందితులకు డోన్ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూరుల్లా జైలు శిక్ష విధించారు. పట్టణ సీఐ ఇంతియాజ్బాషా తెలిపిన వివరాల మేరకు.. పట్టణ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన పట్టణానికి చెందిన కేఈ సురేంద్రగౌడ్, ఎన్.నాగరాజులపై కేసు నమోదు చేసి మంగళవారం కోర్టులో హాజరు పరిచారు. సురేంద్రగౌడ్కు మూడు రోజులు, నాగరాజుకు నాలుగు రోజులు జైలు శిక్షలు విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. ఇంటి తాళం పగులగొట్టి చోరీ జూపాడుబంగ్లా: మండల కేంద్రంలోని క్వార్టర్స్ కాలనీలో కేజీ రోడ్డు పక్కన ఇంటి తాళం పగులగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మహేష్బాబు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ బెంగళూరులో ఉంటున్నారు. అతని ఇంట్లో పనిచేస్తున్న నవీన్ సోమ వారం ఉదయం వెళ్లి చూడగా తాళం పెకలించి ఉండటంతో దొంగతనం జరిగినట్లు నిర్ధారించు కుని మహేష్కు ఫోన్చేసి తెలియజేశారు. అతడి సూచన మేరకు ఇంట్లోకి వెళ్లి చూడగా.. బీరువా తలుపులు పెకలించి బంగారం, వెండి వస్తువులను దుండగులు దోచుకెళ్లినట్లు తెలిసింది. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై ఏఎస్ఐ సంజీవను వివరణ కోరగా ఇంటి యజమాని వచ్చిన తర్వాత ఏఏ వస్తువులు చోరీకి గురయ్యాయో తెలుస్తుందని, ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తామన్నారు. -
ఏజెంట్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(అర్బన్): తపాల జీవిత బీమా(పీఎల్ఐ), గ్రామీణ తపాల జీవిత బీమా(ఆర్పీఎల్ఐ) ఏజెంట్లుగా కమీషన్ ప్రాతిపదికన పనిచేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ జి.జనార్దన్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులై, కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎంపికై న అభ్యర్థులు సెక్యూరిటీ డిపాజిట్గా రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు కొండారెడ్డిబురుజు సమీపంలోని కర్నూలు డివిజన్ తపాల శాఖ కార్యాలయంలో ఈ నెల 30 నుంచి జూలై 3వ తేది వరకు ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 7013029312(జి.హరికృష్ణారెడ్డి) నెంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. మహానంది కొర్ర విత్తనం పంపిణీ ఎమ్మిగనూరు సెంట్రల్: స్థానిక బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో 20 మంది రైతులకు ఎస్ఐఏ–3159 మహానంది కొర్ర రకం విత్తనాలను శాస్త్రవేత్తలు మంగళవారం ఉచితంగా పంపిణీ చేశారు. అఖిల భారత సమన్వయ చిరుధ్యానాల పరిశోధన పథకం, నంద్యాల ప్రాంతీయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాల కార్యక్రమంలో భాగంగా విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా కో–ఆర్డినేటర్ డాక్టర్ రాఘవేంద్రచౌదరి మాట్లాడుతూ.. మహానంది కొర్ర పంట కాలం 85 రోజులు కాగా ఎకరానికి 9 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి ఇచ్చే సామర్థ్యం ఉంటుందన్నారు. ఈ రకాన్ని ఏక పంటగా అలాగే అంతర పంటగా సాగుచేసుకోడవానికి అనుకూలంగా ఉండటంతో పాటు తుప్పు తెగుళ్లను తట్టుకునే లక్షణం కలిగి ఉంటుందన్నారు. అనంతరం సాగు పద్ధతులు, పంట సంరక్షణ చర్యలు, అధిక దిగుబడి సాధించే అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ వెంకటరమణ, డాక్టర సతీష్బాబు పాల్గొన్నారు.జూలై 1 నుంచి వీబీజీ రామ్ జీ అమలు కర్నూలు(అగ్రికల్చర్): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్తగా తీసుకొస్తున్న వీబీజీ రామ్ జీ చట్టం జూలై 1 నుంచి అమలులోకి రానుంది. కొత్త చట్టంపై ఇప్పటికే జిల్లా నీటి యాజామాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్లకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. మరో 15 రోజుల్లో కొత్త చట్టం అమలులోకి రానుండటంతో ఎన్ఆర్ఈజీఎస్కు క్రమంగా ముగింపు పలికేందుకు కసరత్తు జరుగుతోంది. 2026–27లో చేపట్టబోయే కార్యక్రమాలన్నీ కొత్త చట్టానికి లోబడే నిర్వహించనున్నారు. ఇప్పుడు కుటుంబానికి ఏడాదికి 100 రోజుల పనిదినాలు కల్పిస్తుండగా కొత్త చట్టం ప్రకారం 125 రోజుల పని దినాలు కల్పించనున్నారు. లింగనిర్ధారణ చేస్తే ఫోన్ చేయండి ● టోల్ఫ్రీ నెం.18002332447 కర్నూలు(హాస్పిటల్): పీసీ పీఎన్డీటీ చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నెంబర్ 18002332447కు ఫోన్ చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ వై.కామేశ్వరప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటి అక్రమ కార్యక్రమాలను అరికట్టేందుకు అమలులో ఉన్న పీసీ పీఎన్డీటీ చట్టం–1994ను సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. హెల్ప్లైన్ ద్వారా అందిన సమాచారం పూర్తి గోప్యంగా ఉంచుతారని, సంబంధిత అధికారులచే తగిన విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆడ శిశువును రక్షించడం ప్రతి పౌరుని బాధ్యత అని.. మహిళా సంఘాలు, యువజన సంఘాలు, వైద్యనిపుణులు, ప్రజాప్రతినిధులు, సాధారణ ప్రజలు అందరూ కలిసి పీసీ పీఎన్డీటీ చట్టం అమలుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి మంగళవారం కర్ణాటక రాష్ట్రం హుబ్లికి చెందిన కె.ఆనంద బసవరాజ్ రూ.లక్ష విరాళాన్ని పర్యవేక్షకులు పి.దేవికకు అందజేశారు. విరాళాన్ని అందించిన దాతకు దేవస్థానం తరఫున స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాన్ని, లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు. -
బీఏఎస్ విద్యార్థుల చదువుకు ఆటంకం
● బ్యాంక్ ఖాతా వివరాలను యాజమాన్యం తప్పుగా నమోదు చేయడంతో జమకాని నిధులుఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని నారాయణ పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఆ స్కూల్లో బీఏఎస్ (బెస్ట్ అవైలబుల్ స్కూల్) పథకం కింద ఎంపికై న విద్యార్థుల చదువు ఆటంకంగా మారింది. బీఏఎస్ పథకం కింద 2016 నుంచి నారాయణ పాఠశాలలో ఎం.అజయ్కుమార్, ఎం.సుదర్శన్, బి.హస్నమని (10వ తరగతి), జై.రీటాఅనైన్య (7వ తరగతి) చదువుతున్నారు. విద్యార్థుల బ్యాంకు ఖాతా వివరాలను పాఠశాల నిర్వాహకులు తప్పుగా నమోదు చేయడంతో పథకం కింద నిధులు బదాలాయింపు కాలేదు. తర్వాత తప్పు తెలుసుకొని బ్యాంకు ఖాతా వివరాలు సరిచేసి ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయానికి పంపగా నేటికి ఫైల్ పెండింగ్లో ఉంది. అన్ని కార్పొరేట్ స్కూళ్లకు బీఏఎస్ కింద బకాయిలు మంజూరుకాగా స్థానిక నారాయణ స్కూల్కు మాత్రం పెండింగ్లో ఉన్నాయి. దీంతో ఫీజులు చెల్లించాలంటూ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తోంది. మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ను కలిసి బీఏఎస్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు ఉన్నఫలంగా ఫీజులు చెల్లించాలంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి ఎమ్మిగనూరు విద్యార్థుల సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్ సతీష్కుమార్ను వివరణ కోరగా విద్యార్థుల బ్యాంకు ఖాతా వివరాలు తప్పుగా నమోదు కావడంతో నిధులు మంజూరు కాలేదని చెప్పారు. వివరాలు సరిచేసి పంపామని, ఇంకా అప్రూవ్ కాలేదని, విద్యార్థుల చదువుకు ఇబ్బంది లేకుండా చూసుకుంటామన్నారు. -
బుసలు కొడుతున్న పాములు
వర్షాకాలం ప్రారంభమైందంటే చాలు ఎక్కడెక్కడో దాక్కున్న విష పురుగులన్నీ బయటకు వచ్చేస్తాయి. వాటికి అడ్డొచ్చిన వారిని కాటేసి వెళ్లిపోతాయి. దీంతో పలువురు విష పురుగుల కాట్లకు బలికావాల్సి వస్తోంది. ఇప్పటికే జిల్లాలో పాము కాట్లతో పలువురు మృతి చెందారు. ఇలాంటి సమయంలో విషపురుగుల భారి నుంచి కాపాడుకోవడంపై ప్రత్యేక కథనం. ● వర్షాలకు బయటకు వస్తున్న విషపురుగులు ● జిల్లాలో ఇప్పటికే పలువురికి పాముకాటు ● బేతంచర్లలోని డోన్ రహదారిలో ఉన్న ఓ నాపరాళ్ల ఫ్యాక్టరీలో పాము కరిచి ఈ నెల 10వ తేదీన జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన గోసాగోప్ అనే మహిళ మరణించారు. ● బేతంచర్ల మండలం ముద్దవరం గ్రామానికి చెందిన మధులిఖిత్ అనే బాలుడు ఈ నెల 10న ఇంటి ముందు ఆడుకుంటుండగా పాము కాటేసింది. తల్లిదండ్రులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు.● కోడుమూరు మండలం కల్లపరి హైస్కూల్లో వంట గదిలో బియ్యం సంచుల మధ్య నాగు పాము కనిపించింది. పాములు పట్టే వ్యక్తిని పిలిచి పట్టుకొని బయట వదిలేశారు. కర్నూలు(హాస్పిటల్): మృగశిరకార్తె ప్రారంభం అవుతుండగానే జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. చినుకు నేలరాలగానే వేడిగా ఉన్న భూమి కాస్త చల్లబడుతోంది. ఈ క్రమంలో ఉత్పత్తయ్యే వేడి ఆవిర్లను భరించలేక భూమి పొరల్లోని బొరియల్లో దాక్కున్న విషపురుగులు బయటకు వస్తున్నాయి. వాటికి సురక్షితమనుకున్న ప్రాంతంలో నక్కి ఉంటున్నాయి. అవసరాల రీత్యా మనుషులు వాటిని కదిలించడంతో వెంటనే కాటేస్తున్నాయి. ● ధాన్యపు గాదెలు, గడ్డివాముల వద్ద, పేడ దిబ్బలు, కట్టెలు కుప్పపోసిన ప్రాంతాల్లో పాములు ఎక్కువగా ఉంటాయి. ● పాము కాటుకు గురిగాకుండా రాత్రివేళ విధిగా టార్చిలైట్ తీసుకెళ్లాలి. పొలాల్లో నడిచేటప్పుడు చేతి కర్రతో చప్పుడు చేస్తూ వెళ్లాలి. తప్పనిసరిగా చెప్పులు/బూట్లు ధరించాలి. విషసర్పం కాటు–లక్షణాలు తాచుపాము విష ప్రభావం శరీరంలో ప్రవేశించడానికి కొంత వ్యవధి తీసుకుంటుంది. నల్లత్రాచు (కింగ్కోబ్రా) విషం ప్రభావం చాలా త్వరగా కనిపించి ప్రాణాంతకంగా ఉంటుంది. కట్లపాము కాటు బాధ ఒక రకమైతే, రక్తపింజర విష లక్షణాలు మరో రకంగా ఉంటాయి. ● కాటు వేసిన ప్రాంతంలో పాము కోరల గాయం స్పష్టంగా కనిపించి, నొప్పి తీవ్రంగా ఉంటుంది. ● నొప్పి క్రమంగా పైకి పాకుతూ తిమ్మిరిగా అనిపిస్తుంది. ● పాక్షిక పక్షవాతం కారణంగా నాలుక మందమైనట్లు, గొంతు కండరాలు బిగుసుపోయినట్లు, గొంతులో ఏదీ దిగని పరిస్థితి తలెత్తవచ్చు, కొందరికి నోట్లో చొంగ కారవచ్చు. ● కళ్లు మగతగా, శరీరం మత్తుగా ఉండి స్పృహ కోల్పోవచ్చు. పాము కాటేయగానే... ● పాము కరవగానే భయాందోళనకు గురిగాకుండా పక్కనుండే వారు ధైర్యం చెప్పాలి. ● కాటేసిన పాము ఎలాంటిదో గుర్తించాలి. చికిత్స చేసే వైద్యులకూ చెప్పాలి. ● సాధ్యమైనంత తొందరగా దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. పాము కాటును బట్టి చికిత్స పాము గాట్లను బట్టి కాటేసింది విషపు పామా కాదా నిర్ధారణ చేసుకుని వైద్యులు చికిత్స అందిస్తారు. రెండు కోరల మధ్య దూరం, లోతును బట్టి అది ఎలాంటి పామో వైద్యులకు తెలుస్తుంది. పాము కరిచిన చోట నీలంగా, వంగపండు రంగులా మారుతుంది. ఉబ్బులా, లావుగా అవుతుంది. దీన్ని బట్టి విషపు పాముగా గుర్తించవచ్చు. విషపు పాము కాటుకు ప్రథమ చికిత్సగా ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టి అందులో నుంచి ఏఎస్వీ ఇంజెక్షన్ ఇస్తారు. లక్షణాలను బట్టి చికిత్స అందిస్తారు. పాముకాటుకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స ఉచితంగా అందిస్తున్నాం. అన్ని ఆసుపత్రుల్లో యాంటీ స్నేక్ వీనమ్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచాం. అవసరమైన వారు కర్నూలు సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి ఇండెంట్ పెట్టి ఈ ఇంజెక్షన్లు తీసుకెళ్లవచ్చు. పాము కాటు వేస్తే నాటు వైద్యం జోలికి వెళ్లకుండా వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే ప్రాణాలు దక్కించుకోవచ్చు. ఆలస్యం చేస్తే ప్రాణాలకు ప్రమాదం. – డాక్టర్ వై.కామేశ్వరప్రసాద్, డీఎంహెచ్ఓ, కర్నూలు -
వైఎస్సార్సీపీ ఫేస్బుక్ పేజీని స్తంభింపజేయడం దుర్మార్గం
కర్నూలు (టౌన్): వైఎస్సార్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని స్తంభింపజేయడం దుర్మార్గమని ఆ పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి ఖండించారు. ఆయన మంగళవారం ఎస్వీ కాంప్లెక్స్లో మాట్లాడుతూ.. ప్రజాదరణ పొందిన పార్టీ అధికార పేజీని తొలగించడం ముమ్మాటికీ ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రతినిధిగా ఉన్న రాజకీయ పార్టీకి చెందిన ఫేస్బుక్ పేజీని కనిపించకుండా చేయడం దుస్సాహసమని మండిపడ్డారు. గతంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 1.4 మిలియన్ ఫాలొవర్స్ ఉన్న ఫేస్బుక్ పేజీని స్తంభింపజేయడం ప్రజల గొంతుకను అణచివేయడమేనని ధ్వజమెత్తారు. నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నందునే వైఎస్సార్సీపీ అధికారిక పేజీకి ఇంత ఆదరణ లభించిందన్నారు. దీన్ని స్తంభింపజేయడం అంటే ప్రజల నుంచి వస్తున్న భావాలను, అభిప్రాయాలను ప్రపంచం దృష్టికి రానీయకుండా చేసే దురుద్దేశమేనని వివరించారు. ఇదంతా నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. ‘సర్’ ముసుగులో ఓట్లు తొలగించే కుట్ర సర్ ముసుగులో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం బూత్ లెవల్ ఏజెంట్ల ద్వారా ఓటర్ల కులం, ఏ పార్టీ సానుభూతిపరుడు అనే వివరాలపై ఆరా తీస్తోందని ఆరోపించారు. ఆ సమాచారం అంతా సర్ పేరుతో టీడీపీ యాప్ రూపొందించిందన్నారు. ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయానికి లిస్టు పంపిస్తున్నారని, వైఎస్సార్సీపీ మద్దతుదారులను గుర్తించి వారి ఓట్లను తొలగించేందుకు ఫారం– 7 వాడాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. టీడీపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. -
ఏసీబీ వలలో వెల్దుర్తి పంచాయతీ సెక్రటరీ
వెల్దుర్తి: స్థానిక మేజర్ పంచాయతీ సెక్రటరీ (గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్) కే లక్ష్మీనాథ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ కర్నూలు రేంజ్ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన సంధ్యపోగు సతీష్ కర్నూలు రోడ్డు బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా ఉన్న 13వ వార్డు వీధిలో ప్రభుత్వ స్థలానికి డీ పట్టా పొంది గుడిసె వేసుకున్నాడు. ఈ స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు అప్రూవ్ చేయాలని పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్ని సంప్రదించాడు. నిబంధనల పేరుతో కాల యాపన చేస్తూ అప్రూవ్ ఫీజుతోపాటు రూ.50 వేలు అదనంగా డిమాండ్ చేశాడు. దీంతో సతీష్ ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో సెక్రటరీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు వల పన్నారు. ఈ మేరకు మంగళవా రం మధ్యాహ్న సమయంలో సెక్రటరీ లక్ష్మీనాథ్ తన కారులో కర్నూలు వెళ్తూ హనుమాన్ జంక్షన్ సమీపంలోని ఓ హోటల్ వద్ద సతీష్ నుంచి రూ.40 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ అనంతరం తమ కోర్టులో హాజరుపరుచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. కూటమి ప్రభుత్వంలో స్థానిక టీడీపీ నాయకుడి రెకమెండేషన్తో వెల్దుర్తి పంచాయతీ సెక్రటరీగా వచ్చి అక్రమాలకు పాల్పడాడు. అప్పటి సర్పంచ్ ముత్యాల శైలజ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ నిధులు దాదాపు రూ.3 లక్షలు మింగేశాడన్న ఆరోపణతో అధికారులు లక్ష్మీనాథ్ను డోన్ మండలం దొరపల్లెకు బదిలీ చేశారు. అవినీతికి అలవాటు పడిన లక్ష్మీనాథ్ మళ్లీ టీడీపీ నేతలను పట్టుకుని వెల్దుర్తికి బదిలీపై వచ్చాడు. మంగళవారం ఏసీబీ అధికారులు సెక్రటరీని పట్టుకున్నారనే సమాచారం అందుకున్న ఓ టీడీపీ నాయకుడు సంఘటనాస్థలికి చేరుకుని అతడిని కాపాడే ప్రయత్నం చేయడం కనిపించింది. ఇంటి నిర్మాణ అనుమతులకు రూ.50 వేలు డిమాండ్ ఏసీబీకి ఫిర్యాదు చేసిన బాధితుడు వల వేసి పట్టుకున్న ఏసీబీ అధికారులు -
ఈ నీరు తాగేదెలా?
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని మున్సిపల్ కుళాయిలకు రంగు మారిన బురదనీరు సరఫరా కావటంతో ప్రజలు అందోళనలు చెందుతున్నారు. మంగళవారం పట్టణంలోని పలు కాలనీల్లో ఉదయం, సాయంత్రం కుళాయిలకు ఎర్రగా రంగుమారి, దుర్వాసన వస్తున్న నీరు సరఫరా అయ్యాయి. పట్టణంలోని ఎస్ఎంటీ కాలనీ శారద కమిటీ స్కూల్ లైన్లో రంగు మారిన నీటిని పట్టుకుంటే ఉన్న మంచి నీరు పాడైపోయాయని మహిళలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ లైన్లో గత జనవరి నుంచి నీటి సరఫరా సరిగా లేదని మున్సిపల్ అధికారులు, సచివాలయం ఉద్యోగులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలి ఎమ్మిగనూరుటౌన్: కుళాయిలకు మట్టి, మురుగుతో కలుషితమైన నీరు వచ్చిందని, ఆ నీటిని తాగితే వ్యాధులబారిన పడతారని స్థానిక సీపీఎం నాయకుడు సురేష్ అన్నారు. పైపులైన్ల లీకేజీలతో నీరు కలుషితమవుతోందని, మంచినీరు కనీసం క్లోరినేషన్ చేయకుండా సరఫరా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు .ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడకుండా శుద్ధిచేసిన నీటినే సరఫరా చేయాలని కోరారు. నీటిని కాచివడబోసి తాగాలి వర్షాలు కురిసినందున గుడికల్ చెరువుకు కొత్త నీరు వచ్చి చేరిందని, అందువలన పట్టణంలో సరఫరా చేసిన మంచినీటిని కాచి వడబోసి చల్లార్చిన తరువాత తాగాలని మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి మంగళవారం ఒక ప్రకటలో తెలిపారు. -
బకాయిలు కట్టకుంటే బయటే!
● ఆర్యూ హాస్టళ్లకు తాళాలు ● మెస్ బిల్లులు చెల్లిస్తేనే లోపలికి.. కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీలో రోజుకో సమస్య ఉత్పన్నమవుతోంది. విద్యార్థి సంఘాల నాయకుల గొడవలు, అధికారులు, విద్యార్థి సంఘ నేతల మధ్య వాగ్వివాదాలు, విద్యార్థులపై కేసుల నమోదు, యూనివర్సిటీ నుంచి బహిష్కరణ, తాజాగా వర్సిటీ హాస్టళ్లకు తాళాలు వేసి విద్యార్థులను అనుమతించకపోవడం లాంటివి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం, అడ్మిషన్ల సమయంలో ఇలాంటివి తీవ్ర ప్రభావం చూపుతాయని విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. వర్సిటీ మెన్స్ హాస్టల్లో 600 మంది, ఉమెన్స్ హాస్టల్లో 450 మంది విద్యార్థులు ఉన్నారు. వీరు చెల్లించాల్సిన ఫీజు కోట్లలో బకాయి ఉంది. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. దీంతో హాస్టళ్ల నిర్వహణ కష్టంగా మారింది. అధికారుల చర్యలు.. విద్యార్థులకు అవస్థలు వేసవి సెలవుల అనంతరం వర్సిటీ సోమవారం పునఃప్రారంభమైంది. రెండు రోజులు గడిచినా విద్యార్థులకు భోజనం అందడం లేదు. ఈ నెల 27 నుంచి పీజీ సెమిస్టర్, బీటెక్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో హాస్టల్ వసతి, మెస్ లేకపోవడంతో విద్యార్థులు లబోదిబోమంటున్నారు. మెస్ చార్జీల బకాయిలు చెల్లిస్తేనే హాస్టళ్లు తెరుస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో లైబ్రరీ రూమ్స్, హాస్టళ్ల బయటే విద్యార్థులు పడుకోవాల్సి వస్తోంది. తక్షణమే వసతి గృహాలు తెరవాలని విద్యార్థులు కోరుతున్నారు. -
మ్యాపింగ్పై అనుమానాలు
● ఈ నెల 15 నుంచి బీఎల్ఓ, బీఎల్ఏలు ఇంటింటికీ వెళ్లి సర్వే ● 14వ తేదీకే ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ 76.74శాతం పూర్తి చేసిన అధికారులు ● ఆదోనిలో ఏకంగా 89.17శాతం మ్యాపింగ్, ఆలూరులో84.54 శాతం ● 2002 ఓటరు జాబితాలోని పేర్లను, ఇప్పటి పేర్లతో పోల్చి మ్యాపింగ్ ● వాస్తవానికి ఇళ్లిళ్లూ తిరిగి ఎన్యుమరేషన్ ఫారం ఇచ్చిన తర్వాతే మ్యాపింగ్ చేయాలి ● అధికారుల ఒత్తిడితో ఓటరు జాబితాలు టేబుల్పై పెట్టుకుని పని పూర్తి -
శ్రేణుల్లో ఉత్సాహం.. అడుగడుగునా చైతన్యం
● ఒకే రోజు 11 గ్రామాల్లో ఆలూరు ఎమ్మెల్యే పర్యటన హాలహర్వి: ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ఒకే రోజు దాదాపు 11 గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేసి వైఎస్సార్సీపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన పార్టీ బూత్ స్థాయి ఏజెంట్ల(బీఎల్ఏ) సమావేశాల్లో ఆయన ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను అడ్డం పెట్టుకుని అధికార పార్టీ ప్రజాస్వామ్యా న్ని నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడితే సహించేది లేదన్నారు. ఓటర్ల జాబితాలో అక్రమాలపై బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి బూత్ పరిధిలో ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలించి ఎలాంటి అక్రమాలు జరిగినా తక్షణం స్పందించాలన్నారు. -
ఫర్టిలైజర్ డీలర్లు విలువలు పాటించాలి
బనగానపల్లె రూరల్: ఫర్టిలైజర్ దుకాణం డీలర్లు విలువలతో కూడిన వ్యాపారం చేస్తూ వ్యవసాయాభివృద్ధికి తోడ్పాటునందించాలని ఏడీఆర్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఎం,జాన్సన్ సూచించారు. మంగళవారం మండలంలోని యాగంటిపల్లె గ్రామ సమీపంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో సీనియర్ శాస్త్రవేత్త ధనలక్ష్మీ అధ్యక్షతన వ్యవసాయ ఇన్పుట్ డీలర్స్ 2024–25వ సంవత్సరం ఉత్తీర్ణత పొందిన డీలర్లకు డిప్లొమా పట్టా పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న డైరెక్టర్ జాన్సన్ మాట్లాడుతూ.. డీలర్లు నేర్చుకున్న వ్యవసాయ పరిజ్ఞానాన్ని రైతాంగానికి చేరవేయాలని, రైతులకు సమయానుకూల వ్యవసాయ సూచనలు, సలహాలు ఇచ్చి పెట్టుబడి తగ్గించాలన్నారు. ఎరువులు, పురుగు మందులు, పంటను చూసి రైతులకు నాణ్యమైన మందులను సిఫార్సు చేయాలన్నారు. ఆత్మ పీడీ బాలాజీనాయక్, దేశీ కార్యక్రమ సమన్వయ కర్త విశ్వనాథ్రెడ్డి, కేవీకే ఏఈ సురేష్కుమార్ శాస్త్రవేత్తలు, డీలర్లు పాల్గొన్నారు. -
ఆర్డీఎస్ను సందర్శించిన కేఆర్ఎంబీ చైర్మన్
కర్నూలు(సిటీ): తుంగభద్ర నదిపై ఉన్న రాజోలి డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆనకట్టను మంగళవారం కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ బిశ్వాస్, సభ్యులు కేకే జాన్గిడ్లు సందర్శించారు. ఆర్డీఎస్ కాలువకు తమకు కేటాయించిన నీరు రావడం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి చేసిన ఫిర్యాదు మేరకు చైర్మన్ ఆనకట్టను, కాల్వను, తెలంగాణ వైపు ఉన్న హెడ్ రెగ్యులేటర్, గేట్లను, ఏపీ వైపు నిర్మాణంలో ఉన్న కుడి కాల్వ నిర్మాణ పనులు, ఆనకట్ట కింది భాగంలో ఉన్న పైపులను పరిశీలించారు. తమకు కేటాయించిన 15 టీఎంసీల నీరు ఆయకట్టుకు అందడం లేదని, ఆనకట్ట దిగువన ఏపీ వైపు వెళ్లే నీటిని బంద్ చేయించాలని తెలంగాణకు చెందిన ఇంజినీర్లు చైర్మన్ను కోరారు. అదే విధంగా కర్ణాటక ఇంజినీర్లు ఆర్డీఎస్ ఆనకట్ట అర్ధ అడుగు పెంచేందుకు చేపట్టిన పనులు ఏపీకి చెందిన వారు నిలిపివేశారని, దీనివల్ల తమ ఆయకట్టుకు అందాల్సిన నీరు అందడం లేదని చైర్మన్కు విన్నవించారు. ఆనకట్ట మీదుగా ఏపీ వైపు వచ్చిన చైర్మన్ ఆనకట్ట దిగువ భాగంలో ఉన్న పైపుల గురించి ఆరా తీశారు. ఆర్డీఎస్ కుడి కాలువ కేటాయింపులు, న్యాయస్థానంలో కేసుల వివరాలు చైర్మన్కు ఇంజినీర్లు వివరించారు. కేఆర్ఎంబీ చైర్మన్ పర్యటన షెడ్యూల్ ప్రకారం బుధవారం మధ్యాహ్నా నికి కేసీ కెనాల్కు నీటిని మళ్లించేందుకు నిర్మించిన సుంకేసుల బ్యారేజీని పరిశీలించాల్సి ఉంది. అయితే ఏ కారణం చేతనే తెలియదు కాని చైర్మన్ తన షెడ్యూల్ను మార్చుకుని కర్ణాటకలోని రాయచూరు నుంచి హైదరాబాదుకు వెళ్లిపోయారు. -
కల ‘పది’లమై.. భవిత ప్రశ్నార్థకమై!
కర్నూలు(సిటీ): నగరంలోని నరసింహారెడ్డి నగర్ రైల్వేస్టేషన్ ఎదురుగా పూరి గుడిసెలో నివాసముంటోంది నగిరి శ్రీవల్లి. ఈమె తల్లి నగిరి లక్ష్మి. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన నగిరి రాముడితో రెండో వివాహమైంది. పెళ్లయిన మూడేళ్లకే చిన్నారి శ్రీవల్లితో పాటు తల్లిని వదిలి ముఖం చాటేశాడు. విధిలేని పరిస్థితుల్లో బిడ్డతో సహా లక్ష్మి తిరిగి కర్నూలుకు చేరుకుంది. రైల్వేస్టేషన్కు ఎదురుగా ఖాళీ స్థలంలో ఓ చిన్న హోటల్ ఏర్పాటు చేసుకుంది. అదీ కలిసిరాక, కుమార్తె జీవితం తనలా కాకూడదనే దృఢ నిశ్చయంతో సమీపంలోని హోటల్లో పాచీ పని చేయసాగింది. ఇదే సమయంలో కుమార్తె జీవితంలో అక్షర దివిటీ వెలిగించింది. ఒక్కో మెట్టు ఎదుగుతున్న తీరు చూసి మురిసిపోయింది. పదో తరగతి చేరుకున్న తరుణంలో తన కల నెరవేరుస్తుందని చుట్టుపక్కల వారితో ఆనందం పంచుకుంది. ఇంతలో అనారోగ్యం బారినపడి గత ఏడాది డిసెంబర్లో మరణించింది. తల్లి పనిచేస్తున్న హోటల్లోనే కూలీగా ఉంటున్న మేనత్త విజయలక్ష్మి ఆసరాగా నిలవడంతో విధి ‘పరీక్ష’కు ఎదురొడ్డి నిలిచింది. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 453 మార్కులు సాధించింది. కలగా ఉన్నత చదువు తల్లి మరణంతో జీవితంలో చీకటి అలుముకున్నా చదువులమ్మ ఒడిలో రాణించసాగింది. పదిలో మెరుగైన ఫలితం సాధించినా ఇంటర్మీడియెట్ చదివేందుకు లక్ష్మీ కటాక్షం కరువైంది. విధిలేని పరిస్థితుల్లో తన తల్లి పనిచేసిన హోటల్లోనే కూలీగా మారింది. అక్కడికి వచ్చి వెళ్లే వారిలో ఎవరో ఒకరు అక్షర జ్యోతి వెలిగించకపోతారా అని దీనంగా వేడుకుంటోంది. ఈ నేపథ్యంలోనే గత నెల జిల్లా కలెక్టర్ను కలిసి తన దీనగాథను ఏకరువు పెట్టింది. కనీసం కస్తూర్బాలో సీటు ఇప్పించాలని అర్థించింది. మేము రైల్వేస్టేషన్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాం. ఈ ప్రాంతంలో ఎంతో మంది అనాథలు కళ్లెదుటే అనారోగ్యంతో చనిపోవడం చూశాం. అప్పుడు మా అమ్మ నువ్వు డాక్టర్వై ఇలాంటి పేదలకు వైద్యం చేయాలని ఎప్పుడూ చెబుతుండేది. అమ్మ కలను నెరవేర్చడమే నా లక్ష్యం. పదో తరగతి పాసైన సంతోషాన్ని కూడా అమ్మ చూడలేకపోయింది. – నగిరి శ్రీవల్లి -
మిశ్రమ పంటల సాగుకు ప్రాధాన్యం
కర్నూలు(సెంట్రల్): వ్యవసాయంలో మిశ్రమ పంటల సాగుకు ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి రైతులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ శాఖ అధికారులతో సాగు పద్ధతులపై కలెక్టర్ సమీక్షించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ కార్యక్రమాల అమలులో లోపాలు గుర్తిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంటల వైవిధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి రైతు ఒక ప్రధాన పంటతోపాటు 5 నుంచి 6 అనుబంధ పంటలను సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు. విత్తనాలు నాణ్యత ప్రమాణాలు సాధించలేకపోతే 6ఏ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఎరువుల పంపిణీ సమయంలో రైతులకు ఫార్మర్ యాప్ను డౌన్లోడ్ చేసివ్వాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి పీఎల్ వరలక్ష్మి, ఉద్యాన శాఖ అధికారి రాజాకృష్ణారెడ్డి, నేచురల్ ఫార్మింగ్ అధికారి మాధురి, మార్క్ఫెడ్ డీఎం రాజు పాల్గొన్నారు. -
పిల్లల నుంచి జీవన భృతి పొందవచ్చు
కర్నూలు(టౌన్): వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం 2007 ప్రకారం వృద్ధ తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి జీవన భృతిని పొందే హక్కును వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి అన్నారు. ఈ చట్టం ఆదేశాలను పిల్లలు ఉల్లంఘిస్తే జరిమానా లేదా జైలు శిక్ష తప్పదన్నారు. సోమవారం స్థానిక బి.క్యాంప్లోని మన వృద్ధుల ఆశ్రమంలో ప్రపంచ వృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవం నిర్వహించారు. వృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు, బిస్కెట్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ వృద్ధుల పట్ల జరుగుతున్న వివక్ష, వేధింపులు, శారీరక, మానసిక, ఆర్థిక నిర్లక్ష్యంపై సమాజంలో అవగాహన కల్పించడం, అలాగే తగిన రక్షణ కల్పించడమే వృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవ లక్ష్యమన్నారు. వృద్ధులకు కావలసిన ఉచిత న్యాయ సహాయం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చన్నారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్లైన్ నెంబర్ 15100 ద్వారా ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. లీగల్ సర్వీసెస్ సభ్యులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, న్యాయవాది పాపా రావు, శ్రీరాములు, మురారి శంకరప్ప, బీమా ఎల్లాగౌడ్, త్రినాథ్ కుమార్ పాల్గొన్నారు. -
వ్యక్తిని బలిగొన్న పాత కక్షలు
● తన పొలం గుండా మట్టి తరలింపును అడ్డుకోవడంతో దాడి ● తీవ్రంగా గాయపడి మృత్యువాత సి.బెళగల్: రెండు కుటుంబాల మధ్య నెలకొన్న పాతకక్షలు వ్యక్తి ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఘటనపై సి.బెళగల్ ఎస్ఐ వేణుగోపాల్రాజు సమాచారం మేరకు వివరాలు.. మండల పరిధిలోని పోలకల్ గ్రామానికి చెందిన మల్లెపోగు అమర్, పూలదాసు జగన్ (39) కుటుంబాల మధ్య గత కొంత కాలంగా గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తన పొలంగుండా మట్టిని తరలించుకుంటున్నారంటూ జగన్ వర్గం వారు అమర్ వర్గం సభ్యులకు అడ్డుపడి ఘర్షణకు దిగారు. ఆగ్రహించిన అమర్ వర్గం సభ్యులు రాళ్లు, కట్టెలతో దాడి చేయగా జగన్ తలకు తీవ్ర రక్తగాయం అయ్యింది. బాధితుడు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పగా వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేసే చర్యలు చేపట్టారు. గాయపడిన జగన్ను కుటుంబ సభ్యులు పెంచికలపాడు ఆసుపత్రికి తలించగా కోలుకోలేక మృతిచెందాడు. ఘటనపై మృతుడి తల్లి సుశీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అయితే ఒకప్పటి ఫ్యాక్షన్ గ్రామంగా పేరొందిన పోలకల్లో దాడి ఘటనలో వ్యక్తి మృతి చెందడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
ఫార్మాసిస్ట్ ఉద్యోగం ఇప్పిస్తామని మోసం
● పోలీస్ పీజీఆర్ఎస్కు 119 ఫిర్యాదులుకర్నూలు(టౌన్): కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఫార్మాసిస్టు ఉద్యోగం ఇప్పిస్తానని రూ.3.85 లక్షలు తీసుకుని మోసం చేసిన ఫయాజ్ బాషాపై చర్యలు తీసుకోవాలని గోనెగండ్ల మండలానికి చెందిన మహబూబ్ బాషా ఫిర్యాదు చేశారు. సోమవారం స్థానిక కొత్తపేటలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజల సమస్యలు, వినతులను ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ మొత్తం 119 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ ఫిర్యాదులన్నింటినీ విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు శివశంకర్, మస్తాన్ వలి పాల్గొన్నారు. -
గుండ్రేవుల, ఆర్డీఎస్పై సాకులు
● ‘సాక్షి’ ప్రశ్నలకు నీళ్లు నమిలిన ఇరిగేషన్ మంత్రికర్నూలు సిటీ: రాయలసీమలోనే అత్యంత వెనుకబడిన కర్నూలు జిల్లా పశ్చిమ పల్లెలకు తాగు, సాగునీటి సదుపాయం కల్పిస్తామని ప్రతి ఎన్నికల్లో హామీలు ఇస్తూ అధికారంలోకి వచ్చాక టీడీపీ ప్రభుత్వం మోసగిస్తోంది. రెండేళ్లు గడిచినా అమలుపై దాటవేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. సోమవారం జిల్లాకు వచ్చిన జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆ శాఖ కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈ కార్యాలయంలో జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పనులు, ప్రతిపాదిత ప్రాజెక్టులపై సమీక్షించారు. పలు పనులను నాయకులు మంత్రి దృష్టికి తీసుకురాగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీర్లకు సూచించారు. ఆ తరువాత మంత్రి విలేకర్ల సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతుండగా.. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న టీడీపీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పూర్వోదయం పథకం కింద రాయలసీమలో పురోగతిలోని ఒక్క ప్రాజెక్టును కూడా ఎందుకు చేర్చలేకపోయారని ‘సాక్షి’ ప్రశ్నించగా.. పూర్వోదయం కింద ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు చేర్చామంటూ దాటవేశారు. ● డ్రీప్ కింద ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రిని డ్రీప్ కింద శ్రీశైలం ప్రాజెక్టు ఫ్లంజ్ ఫూల్ కోసం రూ.253 కోట్లతో మీ ప్రభుత్వం ఎందుకు ప్రతిపాదనలు పంపలేదని ‘సాక్షి’ ప్రశ్నించగా సమాధానం చెప్పలేక రాయలసీమ మేలుకు రాష్ట్ర బడ్జెట్లో 51 శాతం ఖర్చు చేయనున్నామని సమర్థించుకున్నారు. ● అలగనూరు, జీఆర్పీ స్కీంలకు మరమ్మతులు చేయించడం లేదని ‘సాక్షి’ మంత్రిని ప్రశ్నిస్తే.. రాయలసీమలో హార్టికల్చర్ను అభివృద్ధి చేయనున్నామన్నారు. ● రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో జిల్లాలో కేవలం వేదావతి లిఫ్ట్ మాత్రమే చేర్చారని, మిగిలినవి ఎందుకు చేర్చలేకపోయారని, కోడుమూరు నియోజకవర్గంలో పులకుర్తి లిఫ్ట్ కింద పంట కాల్వలు ఎందుకు తీయడం లేదని ‘సాక్షి’ మంత్రిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానలు చెప్పడం గమనార్హం. ● రాయలసీమ జిల్లాల్లో కర్నూలు, వైఎస్ఆర్ కడప జిల్లాలకు, కర్నూలు పశ్చిమ పల్లెకు జీవనాడిగా చెబుతున్న గుండ్రేవుల ప్రాజెక్టుపై ‘సాక్షి’ ప్రశ్నించగా ఎలాంటి సమాధానం చెప్పకుండానే మంత్రి మొహం చాటేశారు. -
తుంగభద్రకు జలకళ
నందవరం: ఎగువ ప్రాంతాలైన మంత్రాలయం, నందవరం, కోసిగి తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి తుంగభద్రమ్మ జలకళను సంతరించుకుంది. సోమవారం మండల పరిధిలోని నాగలదిన్నె బ్రిడ్జి వద్ద వరద నీరు ప్రవహించింది. నిన్నటి వరకు వెలవెలబోయిన తుంగభద్ర నది నేడు కనువిందు చేస్తోంది. అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం కర్నూలు(సెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులను అర్జీదారులు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె జేసీ నూరుల్ ఖమర్, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మలతో కలసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సరైన ఎండార్స్మెంట్తోనే రీఓపెన్ కేసులను తగ్గించవచ్చని, జిల్లా అధికారులు రోజూ పీజీఆర్ఎస్ సైట్ను ఓపెన్ చేసుకొని సరైనా ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. జిల్లాలో పెండింగ్ కారుణ్య నియామకాలకు సంబంధించిన కేసులను పరిష్కరించేందు కు 15 రోజుల్లోనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు రామసుబ్బయ్య, శివప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. జీవాలకు చిటుకు వ్యాధి టీకాలు కర్నూలు(అగ్రికల్చర్): సన్న జీవాలలో చిటుకు వ్యాధి నివారణకు ముందు జాగ్రత్తగా టీకాలు వేసే కార్యక్రమం జిల్లాలో మొదలైనట్లు జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు టీకాల కార్యక్రమం కొనసాగుతుందని, గొర్రెల పెంపకందారులు విధిగా జీవాలకు చిటుకు వ్యాధి(ఈటీ) టీకాలు వేయించాలని ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అకస్మాత్తుగా చనిపోవడం, మేత తినడం మానేయడం, కడుపునొప్పి/ఉబ్బరం, విరేచనాలు, నోటి నుంచి నురుగ, వణుకు/ఫిట్స్ రావడం చిటుకు వ్యాధి లక్షణాలన్నారు. ఉచితంగా వేసే టీకాలను గొర్రెల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 24న జొన్నగిరికి సీఎం చంద్రబాబు కర్నూలు(సెంట్రల్): సీఎం చంద్రబాబు ఈనెల 24న జిలాల్లోని తుగ్గలి మండలం జొన్నగిరికి రానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. అక్కడి జియో మైసూర్ గోల్డ్మైన్స్ను సీఎం సందర్శిస్తారన్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. సోమవా రం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షించారు. జేసీ నూరుల్ ఖమర్, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ పాల్గొన్నారు. -
అదుపుతప్పిన ట్రావెల్ బస్సు
పాణ్యం: నెరవాడ మెట్ట ఆర్జీఎం ఇంజినీరింగ్ కళాశాల వద్ద జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరిన రమణ ట్రావెల్ బస్సు సోమవారం తెల్లవారుజామున 4.15 గంటలకు స్థానిక ఆర్జీఎం కళాశాల వద్ద వెళ్తుండగా టైర్ ఒక్కసారిగా పగలడంతో అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్పైకి దూసుకెళ్లి ఆగింది. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. బస్సుల్లో 30 మంది ప్రప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. హైవేపై ట్రాఫిక్ సమస్య లేకుండా చేశారు. బస్సును డివైడర్ పైనుంచి పక్కకు తొలగించారు. -
మహానందిలో భక్తుల సందడి
మహానంది: మహానందిలో ఆదివారం భక్తుల సందడి కొనసాగింది. సెలవురోజు కావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చారు. భక్తులు ముందుగా కోనేరుల్లో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం ఆలయంలోని కల్యాణ మండపంలో ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు శ్రీ గంగ, కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి వార్లకు కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కల్యాణం అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. -
పాఠశాల బియ్యం మాయంపై విచారణ
ఆదోని: పట్టణంలోని ఓ ఉన్నత పాఠశాలలో సన్న బియ్యం మాయంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. బియ్యం మాయం విషయాన్ని ఆదివారం సాక్షి దినపత్రిక వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ కథనంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సోమవారం ఉదయం 9.30 గంటలలోపు రిపోర్టు సమర్పించాల్సిందిగా ఆదోని ఎంఈఓ–2 కె.రంగన్నను ఆదేశించారు. పట్టణంలో మూడు ఉన్నత పాఠశాలలుండగా నెహ్రూ మెమోరియల్, మున్సిపల్ ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు ఫయాజ్, సుధాకర్బాబును విచారణకు పిలిచినట్లు ఎంఈఓ వెల్లడించారు. సోమవారం ఆ ఇద్దరిని విచారించి నివేదికను కలెక్టర్, డీఈఓకు పంపుతానని తెలిపారు. -
నేడు డయల్ యువర్ సీఎండీ, ఎస్ఈ
కర్నూలు(అగ్రికల్చర్): ఏపీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయమైన తిరుపతి నుంచి డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కర్నూలు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు 8977716661 నంబరుకు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. కర్నూలు కొత్తబస్టాండు సమీపంలో ఉన్న విద్యుత్ భవన్లో కూడా సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వినియోగదారులు ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు 7382614308 నంబరుకు ఫోన్చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. శ్రీమఠం.. భక్తజనసంద్రం మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది. రాయరు దర్శన క్యూలైన్లు, అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లు భక్తులతో కిటకిటలాడాయి. తుంగభద్ర నదీతీరంలో భక్తుల కోలాహలం కనిపించింది. మంచాలమ్మకు ప్రత్యేకంగా పూల అలంకరణ చేశారు. మూలబృందావనానికి శ్రీమఠం పీఠాధిపతి శ్రీసుబుధేంద్రతీర్థులు ప్రత్యేక పూజలు చేపట్టి మంగళహారతులు గావించారు. ఆదివారం కురిసిన భారీ వర్షంతో భక్తుల ఇబ్బంది పడకుండా హెచ్ఆర్బీ కల్యాణ మండపంలో వసతులు కల్పించారు. నకిలీ షాపింగ్ వెబ్సైట్లపై జాగ్రత్త అవసరంకర్నూలు (టౌన్): ఇటీవల కాలంలో నకిలీ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లతో మోసం చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొంతమంది సైబర్ నేరగాళ్లు ప్రముఖ కంపెనీల పేర్లను పొలి ఉండే నకిలీ వెబ్సైట్లను రూపొందించారని తెలిపారు. తక్కువ ధరకు స్కూల్ యూనిఫాంలు, షూస్, ఎలక్త్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు అందిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వెబ్సైట్ల ద్వారా ముందస్తు డబ్బు తీసుకొని అనంతరం వస్తువులు పంపకుండా, లేదంటే నాసిరకం వస్తువులను పంపించి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. అధికారిక, విశ్వసనీయ వెబ్సైట్లలో మాత్రమే కోనుగోళ్లు చేయాలని సూచించారు. అనుమానాస్పద లింకులు, సందేశాలను క్లిక్ చేయవద్దని, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలను ఎవరితో పంచుకోకూడదని తెలిపారు. ఆన్లైన్ మోసాలకు పాల్పడితే 1930 సైబర్ హెల్ప్లైన్ నెంబర్ను సంప్రదించాలన్నారు. రక్తదానంలో యువత ఆదర్శంగా నిలవాలి కర్నూలు(హాస్పిటల్): రక్తదానంలో యువత ఆదర్శంగా నిలవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ వై.కామేశ్వరప్రసాద్ అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ధన్వంతరి హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని సూచించారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని బ్లడ్బ్యాంక్ రాష్ట్రంలోనే అత్యధిక సేవలు అందించిందని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ ఎల్.భాస్కర్ తెలిపారు. అనంతరం రక్తదానం చేస్తున్న యువకులు, వారిని ప్రోత్సహిస్తున్న వారికి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ప్రశంసాపత్రాలు, శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో పాథాలజీ హెచ్ఓడీ డాక్టర్ బాలీశ్వరి, క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ అలీ హైదర్, రక్తకేంద్ర వైద్యులు షెహనాజ్, రవికాంత్, నర్సింగ్ సూపరింటెండెంట్ సావిత్రిబాయి పాల్గొన్నారు. -
తెగిన యాటకల్లు బ్రిడ్జి
ఆస్పరి: భారీ వర్షాలకు యాటకల్లు సమీపంలో ఉన్న బ్రిడ్జి తెగిపోయింది. దీంతో యాటకల్లు, తొగలుగల్లు, దొడగొండ, తురువగల్లు, ఐనకల్లు, కై రుప్పల, కారుమంచి గ్రామాల నుంచి ఆస్పరికి ఎమ్మిగనూరు వెళ్లేందుకు రాకపోకలు నిలిచిపోయాయి. గత ఏడాది వర్షాలకు ఈబ్రిడ్జి తెగిపోయింది. యాటకల్లు పంచాయితీ వారు తాత్కాలికంగా గరసు వేసి రాకపోకలు వచ్చేలా చేశారు. ప్రస్తుతం భారీ వర్షానికి తెగిపోవడంతో మండల కేంద్రమైన ఆస్పరికి, ఎమ్మిగనూరుకు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయా గ్రామాల ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వతంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి జిల్లా కలెక్టర్కు స్వయంగా వెళ్లి చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పటికై నా అధికారులు శాశ్వతంగా యాటకల్లు బ్రిడ్జి నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
భవిష్యత్తు వైఎస్సార్సీపీదే
● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిచిప్పగిరి: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, అన్ని పార్టీ నాయకులు వైఎస్సార్సీపీ వైపు చూస్తున్నారని ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి అన్నారు. భవిష్యత్ వైఎస్సార్సీపీదే అని తెలిసి పార్టీ లో చేరుతున్నారని చెప్పారు. దేవనకొండలోని 20 కుటుంబాలు, కుంకనూరు గ్రామానికి చెందిన 10 కుటుంబాలు లోక్సత్తా పార్టీ నుంచి ఆదివారం వైఎస్సార్సీపీలోకి చేరాయి. ఈ సందర్భంగా చిప్పగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బుసినె విరూ పాక్షి వారిని పార్టీ కండువా వేసి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎన్నికల్లో సుపర్ సిక్స్ హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన చంద్రబాబు వాటిని అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. కూటమి రెండేళ్ల పాలనలో స్కాములు, అప్పులు, మోసాలు తప్ప ఏమీలేదన్నారు. చివరకు డీఎస్సీలో కూడా అక్రమాలకు పాల్పడి డబ్బులు వసూలు చేసే స్థాయికి దిగజారారని మండి పడ్డారు. చంద్రబాబు పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. అన్ని రంగాల్లో అధోగతి పాలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే సత్తా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉందన్నారు. అధికార పార్టీ చేస్తున్న మోసాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో దేవనకొండ మండలం నుంచి లోక్సత్తా ఆదోని డివిజన్ ఇన్చార్జ్ చాకలి శేఖర్, లోక్ సత్తాపార్టీ నాయకులు ఓబులేసు, రంగన్న, నాగరాజు, వీరేష్, పెరవలయ్య, ప్రసాద్, రమేష్, బైరవకుంట చంద్రబాబు, దొర స్వామి, గుండు వీరాంజనేయ, శ్రీను తదితరులు ఉన్నారు. -
సూగూరు రిజర్వాయర్కు గండి
మంత్రాలయం రూరల్: గురురాఘవేంద్ర పాజెక్ట్లో భాగంగా మంత్రాలయం మండల పరిధిలో నిర్మించిన సూగూరు రిజర్వాయర్ కట్టకు చిన్న గండి పడింది. వగరూరు గ్రామ ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకుని అధికారులకు సమాచారం అందించారు. గండి పెద్దగా అయితే వగరూరు గ్రామం జలదిగ్బంధం అయ్యే అవకాశం ఉంది. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి విశ్వనాథ్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని గండి పూడ్చడానికి అవసరమైన ఇటాచి, ట్రాక్టర్లను సమకూర్చారు. మరమ్మతులు చేపట్టాలని అధికారులకు, స్థానిక నాయకులకు ఎమ్మెల్యే ఆదేశించారు. వగరూరు గ్రామ ప్రజలు ధైర్యంగా ఉండాలన్నారు. కాగా.. సూగూరు ఈ రిజర్వాయర్ కింద 3000 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఇక్కడి నుంచి వగరూరు, వి.తిమ్మాపురం గ్రామాలకు తాగునీరు అందుతోంది. రిజర్వాయర్ కట్ట మరమ్మతుల కోసం రూ. 17 కోట్లతో ప్రతిపాదనలు పంపినా చంద్రబాబు ప్రభుత్వం స్పందించలేదు. ఫలితంగా వర్షానికి ఆనకట్టకు గండిపడింది. -
విత్తనాలు అందించడంలో చేతులెత్తేసిన ప్రభుత్వం
వర్షాలు కురుస్తున్నా... రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. వేరుశనగ, కంది విత్తుకోవడానికి చక్కటి అదను అయినప్పటికీ విత్తనం అందక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జిల్లా అవసరాలకు వేరుశనగ విత్తనం కాయలను కడప నుంచి తెప్పిస్తున్నారు. వర్షాలతో వాగులు పొంగిపొర్లడంతో పలు మండలాలకు వేరుశనగ చేరని పరిస్థితి ఏర్పడింది. విత్తన పంపిణీపై ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడం రైతులకు శాపంగా మారింది. వేరుశనగ, కంది విత్తనాలు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారనే దానిపై వ్యవసాయ శాఖకు కూడా సమాచారం లేదు. యూరియా వినియోగాన్ని కట్టడి చేసేందుకు యాప్ ద్వారా అమ్మకాలు చేపట్టడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సర్వర్ సమస్యలు వేధిస్తున్నాయి. ఆలూరు సమీపంలో ఉప్పొంగిన కట్రవంకవాగుకర్నూలు(అగ్రికల్చర్): నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు వర్షాలు దంచికొట్టాయి. ఒక్క రోజులోనే వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ప్రధాన పట్టణాలు, గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. కర్నూలు జిల్లాలో సగటున 44.8 మి.మీ., నంద్యాల జిల్లాలో 21.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగిలో రికార్డు స్థాయిలో 100.6 మి.మీ.( 10.6 సెం.మీ), సి.బెళగల్లో అత్యల్పంగా 16.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. కర్నూలు జిల్లాలోని అన్ని మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, నంద్యాల జిల్లాలో ఒక మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కరిశాయి. నంద్యాల జిల్లా బేతంచెర్లలో అత్యధికంగా 77.2 మి.మీ., అత్యల్పంగా శ్రీశైలంలో 1.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. రహదారులు, వంతెనలపై ప్రమాదకరంగా వర్షపు నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు తోడు జిల్లాలోని కోసిగి, ఆలూరు, హొళగుంద, పెద్దకడుబూరు, హాలహర్వి తదితర మండలాల్లో కురిసిన అతి భారీ వర్షాలతో వాగులు, వంకలు ఏకమయ్యాయి. ఆదోనిలో లోతట్టు ప్రాంతాలు జలమయం ఆదోనిలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లంగరుబావి వీధి, మున్సిపల్ మెయిన్ రోడ్డు, శ్రీనివాసభవన్, పరిశాముల్ల ప్రాంతాలు చెరువులను తలపించాయి. ఆలూరు మండలంలో కురిసిన కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఆలూరు–గుంతకల్ మధ్య వాగులు ఉధృతంగా ప్రవహించడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. హాలహర్వి మండలంలోని గూళ్యం–సిద్ధాపురం మధ్య వాగులు పెద్ద ఎత్తున ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎమ్మిగనూరు మండలంతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి కురిసిన వర్షాలకు కడివెళ్ల సమీపంలోని కప్పలవాగుకు భారీగా వరద నీరు చేరి పొంగిపొర్లడంతో ఎమ్మిగనూరు– పత్తికొండ పట్టణాల మధ్య రవాణా స్తంభించిపోయింది. గోనెగండ్ల మండలం గంజిహళ్లి, అగ్రహారం గ్రామాల మధ్య వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆలూరు– చిప్పగిరి మధ్య కళ్లెవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గుంతకల్– చిప్పగిరి మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆదోని–గుంతకల్ మధ్య ఉన్న వంతెనలపై ఉధృతంగా వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కౌతాళం మండలంలో ఒకవైపు వర్షాలు, ఈదురు గాలులతో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మండలం కురిసిన వర్షం (మి.మీ.లలో) కోసిగి 100.6 ఆలూరు 95.2 బేతంచెర్ల 77.2 హొళగుంద 75.4 పెద్దకడుబూరు 70.4 ఆదోని 62.4 హాలహర్వి 57.6 డోన్ 57.0 దేవనకొండ 50.8 మంత్రాలయం 50.2 చిప్పగిరి 50.2 ఆస్పరి 50.0 మద్దికెర 48.8 అవుకు 46.2 పత్తికొండ 45.6 ఎమ్మిగనూరు 44.6 చాగలమర్రి 43.2 తుగ్గలి 42.4 నందవరం 37.4 కౌతాళం 36.0 ప్యాపిలి 35.4 వెల్దుర్తి 34.4 జిల్లాలో పొంగిపొర్లిన వాగులు, వంకలు ప్రధాన పట్టణాల మధ్య స్తంభించిన రాకపోకలు ఆదోనిలో లోతట్టు ప్రాంతాలు జలమయం పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం -
కూలిన పాత ఫ్లైఓవర్ ప్రహరీ
ఆదోని: ఆదోని పట్టణంలో శనివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రహరీ గోడ ఓ భాగం పదిహేను అడుగుల మేర కూలిపోయింది. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన సమయంలో వాహనాలు, పాదాచారుల రాకపోకలు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. స్థానికుల కథనం ప్రకారం రాత్రంతా కురిసిన భారీ వర్షానికి బ్రిడ్జిపై నీరు నిల్వ ఉండటంతో పాటు ప్రహరీగోడ నిర్మాణం బలహీనపడి ఒక్కసారిగా కూలిపోయింది. శిథిలాలు కింద ఉన్న దుకాణాల ముందు పడిపోయాయి. ఉద యం ఈ దృశ్యాన్ని గమనించిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గోడ కూలిన ప్రాంతంలో వెంటనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి వాహనదారులను అప్రమత్తం చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే సాంకేతిక నిపుణులతో తనిఖీలు నిర్వహించి ఫ్లైఓవర్ భద్రతపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. -
నేటి నుంచి ఇంటింటా ‘సర్’ సర్వే
● ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా ఎన్నికల సంఘంకర్నూలు(సెంట్రల్): భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో సోమవారం నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) సర్వే ప్రారంభం కానున్నది. ఈ మేరకు జిల్లా ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. ‘సర్’ సర్వేలో పాల్గొనే బూత్ లెవల్ ఆఫీసర్(బీఎల్ఓలు), బూత్ లెవల్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఎన్యుమరేషన్ ఫామ్లను అన్ని నియోజకవర్గాలకు పంపింది. సర్వేలో భాగంగా ఒక్కో కుటుంబాన్ని బీఎల్ఓలు కనీసం మూడు సార్లు సందర్శించి వివరాలు సేకరించాలి. ఎన్నికల సంఘం ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫా మ్ను ప్రతి ఓటరు కచ్చితంగా పూరించి ఏదైనా గుర్తింపు కార్డుతోపాటు అందజేస్తేనే ఓటరు జాబితాలో పేరు ఉంటుంది. ఓటరుకే పరీక్ష! కర్నూలు జిల్లాలో 2026 మార్చి 31వ తేదీ నాటికి 20,83,327 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 10,25,735 మంది పురుషులు, 10,57,272 మంది మహిళలు, 320 మంది ఇతరులు, 122 మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు. వీరంతా ఎవరికీ వారు ఓటర్లుగా ఉన్నట్లు రుజువు చేసుకోవాల్సి ఉంది. 2002, 2025 ఓటరు జాబితాలను పోల్చి చూస్తారు. ప్రస్తుతం 2025 జాబితాలో ఓటరుగా ఉన్నా వారి ఆనవాళ్లను 2002 జాబితాలోని వారి తాతలు, అవ్వలు, అమ్మలు, నాన్నల వివరాలను పోల్చి చూస్తారు. 2002 జాబితా ఆనవాళ్లు లేకపోతే వారిని ఓటరు మ్యాపింగ్ ప్రక్రియకు దూరంగా ఉంచి తొలగించే ప్రయత్నం చేస్తారు. షెడ్యూల్.. ● జూన్ 15 నుంచి జూలై 14వ తేదీ వరకు బీఎల్ఓలు ఇంటింటా తిరిగి ఎన్యుమరేషన్ ఫామ్–2ను ఇచ్చి దానిని పూరించుకొని తిరిగి తీసుకుంటారు. ● ఇదే సమయంలో పోలింగ్ కేంద్రాల పునర్ వ్యవస్థీకరణ కూడా జరుగుతుంది. ● జూలై 1వ తేదీ వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఓటరు వివరాలను పరిశీలన చేస్తారు. ● జూలై 21న ముసాయిదా జాబితాను ప్రకటిస్తారు. ● అప్పటి నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు దానిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. ● జూలై21 నుంచి సెప్టెంబర్ 18వ తేదీ వరకు వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి పరిష్కారం చేస్తారు. ● సెప్టెంబర్ 22న తుది ఓటరుజాబితా ప్రకటిస్తారు. జిల్లాలో జూన్ 15 నుంచి సర్ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. ప్రతి ఓటరు ఎన్యుమరేషన్ఫామ్–2ను పూరించి ఇవ్వాలి. దాని ఆధారంగానే ఓటరు జాబితాలో పేర్లు నమోదు అవుతాయి. 2026 జూలై 1వ తేదీ వరకు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి. ఓటు అనేది భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హక్కు. దానిని ప్రతి ఒక్కరూ నమోదు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ ఏ.సిరి, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి -
విద్యుత్ వైర్ల దొంగలు హల్చల్
● 20 మంది రైతుల బోర్ల తీగలు అపహరణ పాణ్యం: వ్యవసాయ బోర్ల మోటార్లకు ఏర్పా టు చేసిన విద్యుత్ తీగలను దొంగలు అపహరించారు. మండల కేంద్రమైన పాణ్యం – వడ్డుగండ్ల రస్తాలో శనివారం తెల్లవారు జామున దాదాపు 20 బోర్లకు చెందిన తీగలను కట్ చేసి దొంగిలించారు. ఉదయం పొలాలకు వెళ్లిన రైతులకు బోర్ల తీగలు కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. స్టార్టర్ నుంచి భూగర్భంలో మోటార్కు అమర్చిన ఉన్న వైర్ను దొంగలు బలవంతగా లాగడం వలన కనెక్షన్ తెగిపోవడంతో రైతులపై భారం పడుతోంది. కొత్త కనెక్షన్ ఇచ్చేందుకు రూ. 10 –15 వేల వరకు ఖర్చు అవుతోంది. భూగర్భంలో ఉన్న మోటార్ను బయటకు తీసి కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. తీగల దొంగల వల్ల పాణ్యంలో 20 మందిలపై భారం పడింది. పోలీసులు దర్యాప్తు చేపట్టి దొంగలను పట్టుకుని చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
మాజీ కార్పొరేటర్పై అక్రమ కేసు
● అరెస్ట్, బెయిల్ మంజూరు ● అక్రమ కేసులపై మండిపడిన మాజీ ఎమ్మెల్యే కాటసాని కర్నూలు (టౌన్): చిన్నపాటి గొడవలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 26వ వార్డు తాజా మాజీ కార్పొరేటర్ దండు లక్ష్మీకాంత రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అయితే సంఘటనకు సంబంధించిన పూర్వపరాలు పరిశీలించిన జడ్డి బెయిల్ మంజూరు చేశారు. వివరాల మేరకు.. కర్నూలు కృష్ణనగర్లోని వార్డు పరిధిలోకి వచ్చే విఠల్ నగర్ సవారి తోట వద్ద ఓ రోడ్డు విషయంలో దాదాపు నెలన్నర క్రితం స్థానిక టీడీపీ అనుచరుడుతో చిన్న పాటి గొడవ జరిగింది. రోడ్డును ఆక్రమించి ఇళ్లు కడుతున్నట్లు స్థానికులు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న లక్ష్మీకాంత రెడ్డి పనులు నిలిపివేయాలని కోరారు. ఇదే విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది జరిగి దాదాపు 48 రోజులవుతోంది. టీడీపీ నేతల ఒత్తిళ్ల మేరకు అప్పట్లో కార్పొరేటర్, స్థానికుడి మల్లికార్జున ఇరువురిపై కేసులు నమోదు చేశారు. అయితే ఇన్ని రోజలు పట్టించుకోని పోలీసులు శనివారం అత్యుత్సాహం ప్రదర్శించారు. ఉదయం ఇరువురిని స్టేషన్కు పిలిపించి అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. వీరిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అన్ని పరీక్షలు చేశారు. ఇద్దరిని జడ్జి అపర్ణ ఎదుట హాజరు పరిచారు. జడ్జి అన్నంటిని క్షుణంగా పరిశీలించి బెయిల్ మంజూరు చేశారు. అనంతరం ఇద్దరు కల్లూరులోని నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డిని కలిశారు. కాగా లక్ష్మీకాంత రెడ్డి మాజీ ఎమ్మెల్యే కాటసానికి ముఖ్య అనుచరుడుగా కొనసాగుతున్నారు. వైఎస్సార్సీపీలో చురుగ్గా పాల్గొంటున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతోనే టీడీపీ నేతలు అతనిపై కక్ష గట్టారని, నెలన్నర క్రితం జరిగిన సంఘటనను సాకుగా చూపుతూ పోలీసులతో అరెస్ట్ చేయించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది. వైఎస్సార్సీపీలో బలమైన నాయకులను టార్గెట్ చేసుకొని అరెస్టులు చేయిస్తున్నారు. టీడీపీ నాయకులకు పోలీసులు వత్తాసు పలుకుతూ వైఎస్సార్సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేయడం తగదు. కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్రమ కేసులు, అరెస్టులకు భయపడేది లేదని టీడీపీ నాయకులు తెలుసుకోవాలి. – మాజీ ఎమ్మెల్యే కాటసాని -
మహానందికి పోటెత్తిన భక్తులు
మహానంది: మహానంది క్షేత్రం శనివారం వీకెండ్ సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటూ వివిధ ప్రాంతాలకు చెందిన వేలా ది మంది భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. అధికారులు ఉదయం నుంచి రాత్రి వరకు నిర్విరామంగా దర్శన సౌకర్యం కల్పించారు.అయితే సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు మహా మంగళ హార తి సమయంలో భక్తులను అనుమతించకపోవడంతో ఆలయరాజగోపురం నుంచి అధికసంఖ్యలో వేచి ఉన్నారు. హారతి సమయం తర్వాత అందరిని ఒకేసారి అనుమతించడంతో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అలాగే ఒక్కొక్క కొబ్బరి కాయకు విక్రయ దారులు రూ.50 తీసుకున్నట్లు భక్తులు తెలిపారు. అధికారులు స్పందించి నిబంధనల మేరకు కొబ్బరికాయల విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కో రారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఆలయ సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి, దేవస్థాన సిబ్బంది తగిన చర్యలు తీసుకున్నారు. -
రక్తదాతలు..ప్రాణదాతలు
● ఐదేళ్లలో రెండున్నర లక్షల మంది రక్తదానం ● జిల్లాలో 13 బ్లడ్ బ్యాంకులు, 5 బ్లడ్ స్టోరేజ్ కేంద్రాలు ● నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం ● 18 నుంచి 60 ఏళ్లలోపు వారందరూ రక్తదానం చేయవచ్చు ● రక్తదానం చేసే వ్యక్తి కనీసం 45 కిలోల బరువు ఉండాలి. ● నిమిషానికి నాడి 60 నుంచి 100సార్లు కొట్టుకోవాలి. ● రక్తపోటు సిస్టాలిక్ 100 నుంచి 180, డయాస్టాలిక్ 50 నుంచి 100 వరకు ఉండాలి. ● హిమోగ్లోబిన్ శాతం 12.5గ్రాములపైన ఉండాలి. ● నోటి ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే అధికంగా ఉండకూడదు. ● మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. కర్నూలు(హాస్పిటల్): అత్యవసర సమయాల్లో రోగులకు కుటుంబ సభ్యులు, బంధువులే రక్తదానానికి వెనకడుగు వేస్తుండగా రక్తదాతలు ముందుకు వస్తున్నారు. ఎలాంటి సంబంధమూ లేకున్నా రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారుతున్నారు. కర్నూలు, ఆదోని, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లో రక్తదాతలు గ్రూపుగా ఏర్పడి, రక్తం అవసరమైన వారికి అందిస్తున్నారు. కొందరు సామాజిక మాధ్యమాల ద్వారా గ్రూపులుగా ఏర్పడి రక్తదానం చేస్తున్నారు. రక్తంలోని వివిధ గ్రూపులను కనుగొన్న నోబెల్ అవార్డు గ్రహీత, శాస్త్రవేత్త కార్ల్ స్టీనర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదిన ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.. బ్లడ్బ్యాంకులు ఇవీ.. జిల్లాలో కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ఆదోనిలోని ఏరియా హాస్పిటల్లో బ్లడ్బ్యాంకులు ఉన్నాయి. కర్నూలులో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రక్తనిధి ఉంది. విశ్వభారతి, ఆర్ఆర్ హాస్పిటళ్లలో బ్లడ్ బ్యాంక్లు ఉన్నాయి. అక్షయ బ్లడ్ బ్యాంక్, న్యూ లైఫ్ బ్లడ్ బ్యాంక్, కర్నూలు బ్లడ్ సెంటర్, కేర్ బ్లడ్ సెంటర్, మెడిప్లస్ బ్లడ్ సెంటర్, పెంచికలపాడులోని విశ్వభారతి జనరల్ హాస్పిటల్, ఆదోనిలో గోపి చారిటబుల్ బ్లడ్ సెంటర్, ఎమ్మిగనూరులో మహాత్మా గాంధి బ్లడ్ బ్యాంక్లు పనిచేస్తున్నాయి. వీటితో పాటు ఆలూరు, పత్తికొండ, కోడుమూరు, ఓర్వకల్లు, వెల్దుర్తి, పాణ్యంలలో రక్తనిల్వ కేంద్రాలు ఉన్నాయి. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 14న రక్తదాతలు, రక్తదానానికి ప్రోత్సహించిన వారికి, యువజన సంఘాలకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 50 మందికి సన్మానం చేస్తాం. కర్నూలులో ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని రక్తనిధిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అనంతరం అన్ని రక్తనిధుల్లో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించనున్నాం. రక్తదానంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. రక్తదానం చేయడానికి యువత ముందుకు వచ్చేలా చేసేందుకు కళాశాలల్లో రెడ్రిబ్బన్ క్లబ్లు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నాం. – డాక్టర్ ఎల్. భాస్కర్, జిల్లా అడిషనల్ డీఎంహెచ్వో, కర్నూలు మా స్వస్థలం అనంతపురం. ప్రస్తుతం కర్నూలులోని బాలాజీనగర్లో నివాసం ఉంటున్నాను. నాకు 39 సంవత్సరాల వయస్సు. బి పాజిటివ్ రక్తం గ్రూపు. మొదట్లో సీఆర్పీఎఫ్ జవాన్గా పనిచేశాను. ఇప్పుడు కర్నూలులో ఓ ప్రైవేటు సంస్థలో జాబ్ చేస్తున్నాను. నా భార్య గర్భవతిగా ఉన్న సమయంలో రక్తం అవసరమై చాలా ఇబ్బంది పడ్డాను. దీనికితోడు ప్రమాదాల్లో గాయపడిన వారు రక్తం కోసం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నాకు 22 ఏళ్ల వయస్సున్నప్పుడు మొదటిసారి రక్తదానం చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు 89 సార్లు రక్తం ఇచ్చాను. నాతో పాటు స్నేహితులనూ ప్రోత్సహిస్తున్నాను. – డి.వారాధిరెడ్డి, రక్తదాత, కర్నూలు సంవత్సరం లక్ష్యం లక్ష్యసాధన నిర్వహించిన క్యాంపులు 2021-2022 22,720 48,135 99 2022-2023 22,720 51,076 216 2023-2024 22,720 50,123 228 2024-2025 22,720 52,843 177 2025-2026 22,720 56,393 242 2026 ఇప్పటివరకు 3,786 5,165 23 -
2002లో ఓటు హక్కు లేకపోతే ఏం చేయాలి?
కర్నూలు(సెంట్రల్): రేపటి నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)సర్వే ప్రారంభం కానుంది. ఈ సర్వేకు 2002 ఓటరు జాబితా అత్యంత కీలకం. ఈ జాబితా 2025 జాబితాలను పోల్చుతూ సర్వే చేస్తారు. ప్రస్తుతం జాబితాలో పేరు ఉండి.. 2002 జాబితాలో పేరు లేకపోతే ఏమి చేయాలన్నదే సందేహం. ఈ క్రమంలో ఓటర్ల సందేహాలను తీర్చేందుకు ఎన్నికల కమిషన్ ముందుకొచ్చింది. జాబితాలో పేర్లు లేని సందర్భాలు.. ● 2002లో పెళ్లి చేసుకొని అత్తగారి ఊరికి వెళ్లిన ఆడవాళ్లు ● 2002లో ఓటు హక్కు వయసు రాకపోవడం ● 2002లో ఓటు హక్కు వచ్చినా ఏదైనా కారణం చేత ఓటరుగా నమోదు కాకపోవడం ● ప్రస్తుతం పైన చెప్పిన సందర్భాల ఓటర్ల వివరాలు 2025 జాబితాలో ఉంటాయి. అయితే 2002 జాబితాలో వారి పేర్లు లేకపోవడంతో ‘సర్’ సర్వేలో సందేహాత్మక ఓటర్లుగా నిలుస్తారు. ఈ క్రమంలో వారంతా కింది నిబంధనలను ఫాలో అయితే 2002 జాబితాలో పేర్లు లేకపోయినా ఎన్నికల కమిషన్ ఓటరుగా ఆమోదిస్తుంది. ఆ నిబంధనలు ఏమిటంటే.. ● వీరు పుట్టిన ఊరికి వెళ్లాలి. ● అక్కడ 2002 జాబితాలో అమ్మ, నాన్న, తాత/అవ్వల పేరు ఉంటే వారి పేరు, సీరియల్ నంబర్ తెలుసుకోవాలి. ● ఆ సీరియల్ నంబర్ను మీరు ఇప్పుడు ఉంటున్న బీఎల్ఓకి ఇవ్వాలి. ● బీఎల్ఓ ఆ నంబర్తో సరిపోల్చుకొని జాబితాలో మ్యాపింగ్ చేస్తారు. ఇది చేయకపోతే ఏమి జరుగుతుంది? ● ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. ● 2002 ఓటరు జబితా ఎక్కడ దొరుకుతుంది? ● ప్రతి ఊరి తహసీల్దార్ ఆఫీసు నుంచి 2002 ఓటరు లిస్టులను ఆ ఊరి బీఎల్ఓ/అంగన్వాడీ టీచర్కు ఇచ్చారు. ● మీరు పుట్టిన ఊరి బీఎల్ఓని కలిసి జాబితాను పొందవచ్చు. -
అనాథ చెంచు యువతి పెళ్లికి సహాయం
ఆత్మకూరురూరల్: కొట్టాల చెర్వు చెంచు గూడెంకు చెందిన నాగమణికి చిన్నతనంలోనే తల్లిదండ్రి అనారోగ్యంతో మరణించారు. అనాథ అయిన నాగమణిని బంధువులు పెంచి పెద్ద చేశారే కానీ.. పెళ్లి చేసేంత స్థోమత వారికి లేదు. ఆమెకు ఇటీవల వివాహం కుదిరింది. అయితే పెళ్లికి కనీస ఖర్చులకు కూడా డబ్బుల్లేవు. ఈ విషయం తెలుసుకున్న ఇందిరేశ్వరం అటవీ సెక్షన్ ఎఫ్ఎస్ఓ మహబూబ్బాషా తన వంతుగా సహా యం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ మేర కు శనివారం ఆయన కొట్టాలచెర్వుకు వెళ్లి నాగమణికి రూ. 5 వేలు, ఒక బియ్యం ప్యాకెట్ ఉడతా భక్తిగా అందించారు. చెంచు యువతి వివాహానికి దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని ఫారెస్ట్ అధికారి మహబూబ్ బాషా కోరారు. అదుపు తప్పిన ట్రాక్టర్ సంజామల: రామభద్రునిపల్లె గ్రామ సమీపంలో శనివారం అదుపుతప్పిన ట్రాక్టర్ కల్వర్టులోకి దూసుకెళ్లింది. పేరుసోముల గ్రామానికి చెందిన షరీఫ్ ట్రాక్టర్లో నాపరాళ్ల లోడును సంజామలలో అన్లోడ్ చేశాడు. అనంతరం అక్కడి నుంచి తిరిగి వెళ్తుండగా రామభద్రునిపల్లె సమీపంలో అదుపుతప్పి కల్వర్టులోకి దూసుకెళ్లింది. డ్రైవర్కు స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెండు లారీలు ఢీ.. ఇద్దరికి గాయాలు హాలహర్వి: రెండు లారీలు ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన హాలహర్వి సమీపంలోని క్షేత్రగుడి దగ్గర శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆదోని నుంచి సిమెంట్ లోడు వేసుకుని ఒక లారీ బళ్లారికి వెళ్తోంది. బళ్లారి నుంచి ఐరన్ వేసుకుని మరొక లారీ హాలహర్వికి వస్తోంది. రెండు లారీలు హాలహర్వి సమీపంలోని క్షేత్రగుడి దగ్గర ఎదురెదురగా ఢీకొన్నాయి. ఇద్దరు లారీ డ్రైవర్లు ఉమేష్ కుమార్, జగదీష్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం బళ్లారి ఆసుపత్రికి తరలించారు. హాలహర్వి ఎస్ఐ ఈశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుని కేసు నమోదు చేశారు. -
కర్నూలులో కుమ్మేసిన వర్షం
● కర్నూలు జిల్లాలో 16, నంద్యాల జిల్లాలో 10 మండలాల్లో వర్షపాతం మండలం వర్షపాతం(మి.మీ) ఆదోని 36.4 ఓర్వకల్ 15.2 హొళగుంద 14.4 కల్లూరు 11.6 ఎమ్మిగనూరు 10 వెల్దుర్తి 9.8 మహానంది 9.6 గూడూరు 9.2 పగిడ్యాల 8.2 జూపాడుబంగ్లా 7.8కర్నూలు(అగ్రికల్చర్): నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు తేలికపాటి నుంచి ఒకమోస్తరు వర్షాలు కురిశాయి. కర్నూలు జిల్లాలో 16 మండలాలు, నంద్యాల జిల్లాలో 10 మండలాల్లో వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లాలో వర్షం తేలిక పాటికే పరిమితమైంది. అయితే కర్నూలు నగరంలో భారీ వర్షం కురిసింది. కర్నూలు రూరల్లో 56.2 మి.మీ, కర్నూలు అర్బన్లో 48.6 మి.మీ వర్షపాతం నమోదైంది. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కాలువలు పొంగిపొర్లాయి. జిల్లా మొత్తంగా సగటున 9 మి.మీ వర్షం కురిసింది. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.7 మి.మీ ఉండగా ఇప్పటి వరకు 46.1 మి.మీ వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లా మొత్తంగా సగటున 1.7 మి.మీ వర్షం కురిసింది. నంద్యాల జిల్లాలో జూన్ నెల సాధారణ వర్షపాతం 77 మి.మీ కాగా ఇప్పటి వరకు 58.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఉమ్మడి జిల్లాలో ఎల్నినో ప్రభావంతో తొలకరి నిరాశాజనకంగా సాగుతోంది. -
● గతేడాది జూన్ ప్రారంభం నాటికి జీడీపీని చేరిన వరద నీరు ● ఈ ఏడాది ఇప్పటి వరకు కనిపించని వైనం
గా‘జల’దిన్నె వెలవెల! గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్టులో నీటి నిల్వ రోజు రోజుకు తగ్గిపోతోంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 4.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.3 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. గతేడాది జూన్ నెల ప్రారంభం అయ్యే సరికి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరిది. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు చుక్కనీరు రాలేదు. గతంలో జూన్ నెలలో 2 టీఎంసీలు నీరు నిల్వ ఉండి డోన్, కృష్ణగిరి, పత్తికొండ ప్రాంతాల్లో 120 గ్రామాలకు సరఫరా అయ్యేది. కర్నూలు, కోడుమూరు, లద్దగిరి, గూడూరు, బెళగల్, గుడిపాడు ప్రాంతాలకు తాగునీటి కోసం సరఫరా చేసేవారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటితో తాగునీటి పథకాలకు ఇబ్బంది లేదని అధికారులు తెలుపుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టు కింద సాగు ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది రబీలో ప్రాజెక్టు కింద దాదాపు 13 వేల ఎకరాలలో పంటలు సాగయ్యాయి. ఈ ఏడాదైన వర్షాలు కురిసి ప్రాజెక్టుకు వరదనీరు వచ్చి చేరుతుందో లేదో వేచిచూడాలి. ఇదిలా ఉండగా ప్రాజెక్టులో ఉన్న నీటిని ఇతర ప్రాంతాల వారు తమ రాజకీయ బలంతో నీటిని మళ్లించుకుని వెళ్తున్నారు. దీంతో ప్రాజెక్టు చుట్టు పక్కల గ్రామాలకు తాగునీటి సమస్య వస్తే ఎలా అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. -
కర్నూలు డీఎస్పీగా రాఘవేంద్ర బాధ్యతల స్వీకరణ
కర్నూలు(టౌన్): కర్నూలు డీఎస్పీగా కె.వి.రాఘవేంద్ర శనివారం సాయంత్రం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆయన 1996 సంవత్సరంలో ఎస్ఐగా పోలీసు శాఖలో చేరారు. 2010 సంవత్సరంలో సీఐగా పదోన్నతి పొందారు. గత నెల మే 1న డీఎస్పీగా పదోన్నతి రావడంతో ఆయన ఇక్కడ బాధ్యతలు చేపట్టారు. ఎక్కువ కాలం ఎస్ఐగా, సీఐగా ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలో పనిచేశారు. బాధ్యతల అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ తొలిసారిగా కర్నూలు జిల్లాకు రావడం ఆనందంగా ఉందన్నారు. కర్నూలు సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. -
నమో నారసింహా
ఆళ్లగడ్డ: నవనారసింహ స్వాములు కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలం శనివారం భక్తులతో కిక్కిరిసి పోయింది. ఎగువ, దిగువ క్షేత్రాలతో పాటు పావన క్షేత్రం తెల్లవారు జాము నుంచే భక్తులతో కిటకిటలాడింది. స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించి తలనీలాలు సమ ర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా భక్తులు భక్తి పారవశ్యంతో చేసిన గోవింద నామస్మరణతో అహోబిల క్షేత్రం మార్మోగింది. -
ఉపాధి కూలీలకు రూ.180కోట్ల బకాయి
● మే నెల 4 నుంచి నిలిచిపోయిన చెల్లింపులు కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో వేలాది కుటుంబాలు వ్యవసాయ పనులు లేకపోవడంతో ఉపాధి పనులనే నమ్ముకున్నారు. అయితే రోజులు, వారాలు గడుస్తున్నా వేతనాలు అందక నిరాశకు లోనవుతున్నారు. గత మే 4వ తేదీ నుంచి వేతనాలు నిలిచిపోయాయి. వేసవిని ఉపాధి పనులకు సీజన్గా వ్యవహరిస్తారు. ఉమ్మడి జిల్లాలో మే నెలలో రోజుకు 2 లక్షల మంది శ్రామికులు హాజరయ్యారు. ఉదయమే తినీతినక వెళ్లి రెక్కలు ముక్కలు చేసుకుంటే వేతనాలు దక్కక దిక్కుతు చూస్తున్నారు. ఈ కారణంగా ప్రస్తుతం రోజుకు లక్ష మందికి పైగా శ్రామికులు మాత్రమే ఉపాధి పనులకు హాజరువుతున్నారు. వేతనాలు అందక ఆకలి బాధలతో ఉపాధి కూలీలు రోడ్డెక్కాల్సి వస్తోంది. కర్నూలు జిల్లాలోని పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, పెద్దకడుబూరు, హాలహర్వి, ఆలూరు, ఆదోని, కోసిగి, దేవనకొండ, హొళగుంద, ఆస్పరి, నంద్యాల జిల్లాలోని డోన్, ప్యాపిలి, బేతంచెర్ల, కొలిమిగుండ్ల తదితర మండలాలకు ఉపాధి పనులే ఆధారం. కర్నూలు జిల్లాలో 1.25 లక్షల కుటుంబాలు, నంద్యాల జిల్లాలో 75 వేల కుటుంబాలు వేసవిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకున్నాయి. అయితే దాదాపు నెలన్నర రోజుల్లో దాదాపు 60 లక్షల పని దినాలకు వేతనాలు చెల్లించాల్సి ఉంది. రోజుకు ఉపాధి శ్రామికుల వేతనం రూ.300 వరకు లభిస్తుంది. ఈ ప్రకారం 60 లక్షల పని దినాలకు రూ.180 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోవడం గమనార్హం. ఒక్క గ్రామానికే రూ.30 లక్షల బకాయి ఆదోని మండలం దొడ్డనగేరి గ్రామంలో ఉపాధి శ్రామికులు ఎక్కువ. మే నెల 4 నుంచి ఈ నెల 12వ తేదీ వరకు ఉపాధి శ్రామికులు 10,300 పని దినాలను వినియోగించుకున్నారు. ఈ ఒక్క గ్రామానికే దాదాపు రూ.35 లక్షల బకాయి ఉంది. ఫలితంగా ఇటీవల కాలంలో ఉపాధి పనులకు హాజరు తగ్గిపోయింది. -
క్రైస్తవ సంఘం పవిత్రతకు ప్రతీక
● అసాంఘిక శక్తులపై అప్రమత్తంగా ఉండాలి ● బిషప్ ది రైట్ రెవ.డా.పి.ఐజక్ వరప్రసాద్ ఆదోని: క్రైస్తవ సంఘం అనేది ఒక క్రమాని కి, పవిత్రతకు ప్రతీక అని సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ బిషప్ ది రైట్ రెవరెండ్ డా.పి.ఐజక్ వరప్రసాద్ తెలిపారు. చర్చీల్లో చొరబడుతున్న కొన్ని అసాంఘిక శక్తులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాయలసీమలోని ఐదు జిల్లాల్లో కొన్ని సీఎస్ఐ చర్చీల్లో కొందరు కాపరులే (పాస్టర్లు) బాధ్యతలు తప్పి ప్రవర్తించటం బాధాకరమని పేర్కొన్నారు. అటువంటి వారిపై ఇప్పటికే క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కొందరు డయాసిస్ చట్ట సభలు, సమావేశాల్లోకి దౌర్జన్యంగా చొరబడి, తోటి గురువులపై భౌతిక దాడులకు పాల్పడ్డారని, ఎనిమిది మందిపై కడప వన్టౌన్లో క్రిమినల్ కేసు నమోదు చేయించామని పేర్కొన్నారు. అలాగే వాట్సాప్ ద్వారా చేస్తున్న అసత్య ఆరోపణలు, దుష్ప్రచారాలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయిస్తామని తెలిపారు. ఇప్పటికే వాట్సాప్ గ్రూపు అడ్మిన్లపై తగు చర్యల కోసం సైబర్ క్రైంకు ఫిర్యాదు చేశామన్నారు. ఇలాంటి వాట్సాప్ గ్రూపుల నుంచి గురువులు తక్షణమే వైదొలగాలని, ఇప్పటికే అల్లరిమూకలో ఉన్న కొందరిని డయాసిస్ నుంచి బహిష్కరించినట్లు తెలిపారు. -
ఉద్యోగుల ఊరు చెన్నాపురం
స్థితిగతులు మార్చిన చదువు చెన్నాపురం ఏరియల్ ఫ్యూ ఎమ్మిగనూరుసెంట్రల్: మట్టిని నమ్ముకున్న రైతులు తమ కష్టం బిడ్డలకు వద్దని వారిని బాగా చదివించారు. వివిధ రంగాల్లో ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రుల కలలను బిడ్డలు నిజం చేశారు. ఇప్పుడు చెన్నాపురం అంటే ఉద్యోగులపురంగా ఖ్యాతి గడించింది. ఎమ్మిగనూరు మండలంలోని చెన్నాపురం గ్రామంలో 320 కుటుంబాలు ఉన్నాయి. వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడ పత్తి, వరి, వేరుశనగ, మిరప పంటలను ఎక్కువగా సాగు చేస్తారు. గ్రామంలో ప్రతి ఇంట్లో డిగ్రీ, పీజీ చేసిన విద్యావంతులున్నారు. గ్రామంలో 60 మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా అధికంగా ఉపాధ్యాయ, పోలీస్ శాఖలో కొలువుదీరారు. ప్రభుత్వ పాఠశాలలోనే చదువులు గ్రామంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలోనే చదివారు. ఉత్తమ విద్య ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుందని గ్రామస్తుల నమ్మకం. గ్రామంలోని యువత తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూసి ఎటువంటి చెడు అలవాట్లకు పోకుండా చక్కగా చదువుకుని ఉన్నత విద్యావంతులుగా తయారయ్యారు. వ్యవసాయంలో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ ఒక వైపు చదువుతూనే ఉద్యోగాలు సాధించి కన్నవారి కలలను సాకారం చేశారు. గ్రామాభివృద్ధి పేరిట సేవా కార్యక్రమాలు గ్రామంలో ఉద్యోగాలు సాధించి వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన ఉద్యోగులు గ్రామాభివృద్ధి కోసం కూడా పా టు పడుతున్నారు. చెన్నాపురం గ్రామాభివృద్ధి సంఘం పేరిట వివిధ సేవా కార్యక్రామాలు చేపట్టారు. పేదల కు చీరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, పోటీ పరీక్షలకు మెటీరియల్ అందించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్లలో అత్యధిక మార్కులు సాధించిన వారికి ప్రోత్సాహక బహుమతులు ప్రదానం చేశారు. నూతనంగా ఉద్యోగాలు సాధించిన వారికి సన్మానాలు చేశారు.దశాబ్దాల క్రితం చెన్నాపురంలో నిరక్షరాస్యత అధికంగా ఉండేది. సంప్రదాయ వ్యవసాయంతో కుటుంబాలను నెట్టుకొచ్చేవారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టాల రావడంతో పిల్లలు భవిష్యత్తులో కష్టపడకూడదని బడిబాట పట్టించారు. ఇది ఆ ఊరి స్థితి గతులను మార్చింది. నాడు ఒక్కరితో మొదలైన ప్రభుత్వ కొలువు నేడు పదుల సంఖ్యకు చేరింది. ఉపాధ్యాయ వృత్తిలో 14 మంది, పోలీస్శాఖలో 25 మంది రాణిస్తున్నారు. పోలీస్ శాఖలో ఒకరు సీఐగా, మరొకరు ఎస్ఐగా ఉన్నారు. గ్రామంలో ఇద్దరు ఎంబీబీఎస్ చదువుతున్నారు. మరికొంతమంది సాఫ్ట్వేర్, ఇతర ప్రైవేట్ రంగాల్లో రాణిస్తున్నారు. -
టీబీ డ్యాంకు 365 క్యూసెక్కుల ఇన్ఫ్లో
హొళగుంద: కర్ణాటకలోని హొస్పేట్ వద్ద నిర్మించిన తుంగభద్ర రిజర్వాయర్కు శనివారం 365 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. డ్యాంలో మొత్తం 9.903 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ భాగం ఆగుంబే, తీర్థన హళ్లీ, వరనాడు, శివమొగ్గ, సాగర, శృంగేరి తదితర భాగాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఇన్ఫ్లో తొలిసారిగా శనివారం నమోదైంది. గతేడాది ఇదే సమయానికి టీబీ డ్యాంకు 8,269 క్యూసెక్కుల ఇన్ఫ్లో, జలాశయంలో 25.589 టీఎంసీల నీరు ఉండేది. ఈ ఏడాది భారీ వర్షాలు లేకపోవడంతో ఇన్ఫ్లో మందగించింది. సకాలంలో డ్యాంలో నీరు చేరితేనే జూలై ఆఖరిలో ఎల్లెల్సీకి నీటిని విడుదల చేసే అవకాశాలుంటాయి. శనివారం టీబీ డ్యాంలో 1,633 అడుగులకు గాను 1588.60 అడుగులతో అవుట్ఫ్లో 57 క్యూసెక్కులుంది. -
మద్దిలేటయ్య క్షేత్రం కిటకిట
బేతంచెర్ల: వైష్ణవ పుణ్య క్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయం శనివారం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. జ్యేష్ట మాసం శుభ దినాలను పుర స్కరించుకొని జిల్లా నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువజామున ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనానికి బారులుదీరారు. అభిషేకం, ఆకుపూజ, కుంకుమార్చన పూజ ల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు చర్యలు చేపట్టారు. -
నకిలీ సందేశాలు నమ్మవద్దు
కర్నూలు(టౌన్): వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు నకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువులు, సబ్సిడీలు, ప్రభుత్వ పథకాల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పథకాల పేరుతో నకిలీ సందేశాలు, ఫోన్ కాల్స్, వెబ్సైట్లు, మొబైల్ యాప్లు, లింకుల ద్వారా రైతుల వ్యక్తిగత, బ్యాంకు వివరాలను సేకరించే ప్రయత్నాలు చేస్తారన్నారు. లైసెన్స్ పొందిన డీలర్లు గుర్తింపు పొందిన దుకాణాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. విత్తనాల కొనుగోలు, నమోదు ప్రక్రియకు డి–క్రిషి యాప్ను మాత్రమే వినియోగించాలని, ఎరువుల కొనుగోలుకు అమలులో ఉన్న ఏపీఏఐఎంఎస్ విధానాన్ని మాత్రమే ఉపయోగించాలన్నారు. అనధికార యాప్లు, వెబ్సైట్లు, సోషల్ మీడియా ద్వారా వచ్చే సందేశాలను నమ్మవద్దని హెచ్చరించారు. కర్నూలు(సెంట్రల్): జిల్లా అధికారులు ఒక్క రోజు ప్రచారంపై చూపుతున్న శ్రద్ధ దైనందిన జీవితంలో చూపకపోవడం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంధన పొదుపు పేరిట జిల్లా అధికార యంత్రాంగం శుక్రవారం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. తుగ్గలిలో నిర్వహించిన ఒక్క నెల–ఒక్క నియోజకవర్గం–నాలుగు పర్యటలు కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారులు ఎవరికి వారు కార్లలో వెళ్లకుండా ఒకే ఆర్టీసీ బస్సులో వెళ్లారు. కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, జేసీ నూరుల్ ఖమర్తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులంతా వెళ్లడంతో ఆర్టీసీ బస్సు కిక్కిరిసింది. ఇదిలాఉంటే అంత దూరం బస్సులో ప్రయాణించిన అధికారులు.. సమీపంలోని కలెక్టరేట్కు వెళ్లేందుకు సైతం కార్లను ఉపయోగించడం పరిపాటిగా మారింది. ప్రజలకు ఆదర్శంగా నిలవాలని భావించినప్పు డు ఏదో ఒక రోజు కాకుండా దైనందిన జీవితంలోనూ పాటించి చూపినప్పుడే పొదుపు సాధ్య మనే అభిప్రాయం వ్యక్తమైంది. కాలి నడకన వెళ్లగలిగే ప్రాంతాలకు సైతం కార్లనే ఆశ్రయిస్తున్న అధికారులను ప్రతిరోజూ గమనిస్తున్న ప్రజలు ఇదేమి చోద్యమని నవ్వుకోవడం కనిపించింది. ఆర్యూ నుంచి ఇద్దరు విద్యార్థుల బహిష్కరణ కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ నుంచి ఇద్దరు విద్యార్థులను బహిష్కరిస్తూ వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. వర్సిటీ కళాశాలలో తెలుగు పీజీ నాల్గవ సెమిస్టర్ చదువుతున్న ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.శరత్కుమార్ను వర్సిటీ నుంచి బహిష్కరించారు. వర్సిటీ అధికారులపై నిందలు వేయడం, వర్సిటీ కళాశాల గురించి తప్పుడు ప్రచారాలకు పాల్పడటం, ఎలాంటి ఆధారాలు లేని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనే కారణాలతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వర్సిటీ నుంచి బహిష్కరించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరో విద్యార్థి వర్సిటీ కళాశాలలో ఇంగ్లిష్ పీజీ నాల్గవ సెమిస్టర్ చదువుతున్న రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్ ఫెడరేషన్(ఆర్పీఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షులు బి.నాగరాజును వర్సిటీ నుంచి బహిష్కరించారు. ఇతను క్రమశిక్షణ లేని ప్రవర్తనతో ప్రవర్తించాడని, వర్సిటీ అధికారులతో అసభ్య పదజాలం వాడుతూ వాగ్వివాదానికి దిగాడనే కారణాలతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వర్సిటీ నుంచి బహిష్కరించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయన్నారు. 150 ఎకరాల్లో మల్బరీ సాగు లక్ష్యం కర్నూలు(అగ్రికల్చర్): 2026–27లో జిల్లాలో 150 ఎకరాల్లో మల్బరీ సాగు లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారి విజయకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మల్బరీ మొక్కలు నాటుకోవడానికి ఎకరాకు యూనిట్ కాస్ట్ రూ.45 వేలు ఉండగా.. ఎస్సీ, ఎస్టీలకు రూ.40,500, ఇతరులకు రూ.33,750 సబ్సిడీ ఉంటుందన్నారు. జిల్లాకు 10 షెడ్లు మంజూరయ్యాయని, యూనిట్ కాస్ట్ రూ.4.50 లక్షలు ఉండగా.. ఎస్సీ, ఎస్టీలకు రూ.4.05 లక్షలు, ఇతరులకు 3,37,500 సబ్సిడీ లభిస్తుందన్నారు. రేరింగ్ ఎక్విప్మెంట్ యూనిట్ కాస్ట్ రూ.75వేలు ఉండగా.. ఎస్సీ, ఎస్టీలకు రూ.67,500, ఇతరులకు రూ.56,250 ప్రకారం సబ్సిడీ వర్తిస్తుందన్నారు. ఉపాధి హామీ పథకం కింద మల్బరీ మొక్కలు నాటుకునేందుకు ఎకరాకు రూ.87021 లభిస్తుందని, ఈ మొత్తం మూడేళ్లలో ప్రతి ఏటా రూ.29,007 ప్రకారం చెల్లిస్తామన్నారు. ఆసక్తి ఉన్న రైతులను గుర్తించేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు. -
బాలలతో పనిచేయించడం నిషేధం
కర్నూలు(అర్బన్): బాలలతో పనిచేయించుకోవడం, పనిలోకి అనుమంతించడం పూర్తిగా నిషేధమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి అన్నారు. జాతీయ, రాష్ట్ర సేవాధికార సంస్థ ఆదేశాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్థి సూచనల మేరకు శుక్రవారం స్థానిక న్యాయ సేవాసదన్లో బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరైనా ఈ చట్టాన్ని ఉల్లంఘించి బాలలతో పనిచేయించుకుంటే ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష తప్పదన్నారు. పారా లీగల్ వలంటీర్లు పిల్లలు పాఠశాలలకు వెళ్లేలా కృషి చేయాలన్నారు. కార్మిక శాఖ అధికారి కేశన్న మాట్లాడుతూ బాల బాలికలతో షాపులు, ఫ్యాక్టరీల్లో పనిచేయించుకోవడం నేరమన్నారు. డీసీపీఓ టి.శారద మాట్లాడుతూ ఎవరికై నా బాల కార్మికులు కనిపిస్తే 1098 లేదా లీగల్ సర్వీసెస్ హెల్త్ లైన్ నెంబర్ 15100కు కాల్ చేసి సమాచారాన్ని అందించాలన్నారు. ఎన్జీఓ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల అంతా నగరంలో పర్యటించి బాల కార్మికులను గుర్తించి వారిని తిరిగి పాఠశాలలకు వెళ్లేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ఈ నేపథ్యంలోనే బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు. అలాగే న్యాయ సేవాసదన్ నుంచి కొండారెడ్డిబురుజు వరకు ర్యాలీ నిర్వహించారు. -
టిప్పర్ను ఢీకొన్న ట్రావెల్ బస్సు
● ఐదుగురికి గాయాలుకొలిమిగుండ్ల: స్థానిక జమ్మలమడుగు రోడ్డులో శుక్రవారం రాత్రి టిప్పర్ను ట్రావెల్ బస్సు ఢీకొనడంతో ఐదుగురు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. చాగలమర్రికి చెందిన జాకీర్ తన పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించేందుకు ట్రావెల్ బస్సు అద్దెకు తీసుకొని బంధువులతో కలిసి అనంతపురం జిల్లా తలారిచెరువు సమీపంలోని హాజివలి దర్గాకు బయలుదేరారు. మార్గం మధ్యలో కొలిమిగుండ్లలోని జమ్మలమడుగు జంక్షన్ సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద ముందు వెళుతున్న టిప్పర్ను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. బస్సులో 35 మందికి పైగా ఉన్నారు. డోర్తో పాటు ముందు భాగం పూర్తిగా దెబ్బతినడంతో బయటకు వచ్చేందుకు వీలు పడలేదు. స్థానికుల సాయంతో అతి కష్టం మీద ఇరుక్కుపోయిన డోర్, ఇతర భాగాలను తొలగించడంతో బస్సులో ఉన్న వాళ్లను బయటకు పంపించారు. సీఐ రమేష్బాబు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. -
మాల్గోవా బలోపేతానికి కృషి
కర్నూలు(అర్బన్): జిల్లాలో మాల గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (మాల్గోవా)ను బలోపేతం చేసేందుకు కృషి చేయనున్నట్లు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీపీ సోమన్న, డాక్టర్ వై. రాజశేఖర్ తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. ఇటీవల పీఆర్ డీఈఈ నుంచి ఈఈగా పదోన్నతి పొందిన భాస్కర్తో పాటు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి పొందిన మాదన్న, నాగన్నను ఘనంగా సన్మానించారు. వారు మాట్లాడుతూ.. మాల్గోవాను రాష్ట్రంలో బలోపేతం చేసే ప్రక్రియలో ఇటీవల విజయవాడలో భారీ సభను నిర్వహించారన్నారు. ఈ సభకు విశ్రాంత ఐఏఎస్ విజయకుమార్తో పాటు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అనేక మంది ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరై దిశానిర్దేశం చేశారన్నారు. అందరి సలహాలు, సూచనల మేరకు మాల్గోవాను బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. పీఆర్ డీఈఈలు హెచ్డీ ఈరన్న, బండారు శ్రీనివాసులు, అధ్యాపకులు ఓబులేసు, నాగన్న, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
స్వయం ఉపాధితో గౌరవం
కర్నూలు (టౌన్): స్వయం ఉపాధి ఆత్మ గౌరవాన్ని పెంపొందిస్తుందని, మహిళలు స్వయం సమృద్ధి, సాధికారత సాధించాలని కర్నూలు డయాసిస్ బిషప్ గోరంట్ల జ్వాన్వేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం కర్నూలు డయాసిస్ సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు కుట్లు, అల్లికలకు సంబంధించి స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న 150 మంది పేద, గ్రామీణ మహిళలకు బిషప్ కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిషప్ మాట్లాడుతూ.. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కుటుంబానికి ఆర్థికంగా, వెన్నెముకగా ఉండాలన్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, పేద గృహిణులకు స్వయం ఉపాధి అవకాశాలు కొండంత ఆసరానిస్తాయని, జీవితాలలో భరోసా నింపుతాయన్నారు. కేడీఎస్ఎస్ఎస్ డైరెక్టర్ ఫాదర్ తోట జోసెఫ్, చిన్నపరెడ్డి, సిస్టర్లు కస్తూరి, విజయ, కేడీఎస్ఎస్ఎస్ సిబ్బంది ఆరోగ్య, మేరి జోసెఫ్, మోజెస్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ఐటీ డీఎంలో జాతీయ సదస్సు
కర్నూలు సిటీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ (ట్రిపుల్ఐటీ డీఎం) సంస్థ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా రెండు రోజుల పాటు జాతీయ సదస్సు నిర్వహించారు. రెండో రోజు శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ట్రిపుల్ఐటీ డీఎం డైరెక్టర్ ఆచార్య బీఎస్ మూర్తి అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి సదస్సులు పరిశోధకులు, విద్యార్థుల మద్య విజ్ఞాన మార్పిడి, పరస్పర సహకారం పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. శాసీ్త్రయ రంగాలల్లో పరిశోధన, ఆవిష్కరణల గురించి వివరించారు. సదస్సు చైర్మన్, సైన్సెస్ విభాగాధిపతి పాండియరాజన్ మాట్లాడారు. ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్ర విశ్వవిద్యాయాలు, సీఎస్ఐఆర్ ప్రయోగశాలలకు చెందిన 15 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు, నిపుణులు ఆహ్వానిత ఉపన్యాసకులుగా పాల్గొని, ఆధునాతన పదార్థాల రంగంలో తాజా పరిశోధన, పురోగతులు, అభివృద్ధి చెందుతున్న ధోరణులు, స్థిరమైన సాంకేతికతలలో వాటి వినియోగాలపై విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు. కన్వీనర్లు డాక్టర్ పవన్ ప్రకాష్, డాక్టర్ కిశోర్ మాట్లాడుతూ సదస్సు నిర్వహణకు భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖ, సీఎస్ఐఆర్, ఐఐఐటీడీఎం నుంచి ఆర్థిక, సంస్థాగత సహకారం లభించిందన్నారు. ఆంఽధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 70 మంది పరిశోధక విద్యార్థులు, పీజీ, యూజీ విద్యార్థులు పాల్గొన్నారు. -
వివాహిత ఆత్మహత్య
కొలిమిగుండ్ల: మండల పరిధిలోని బెలుంకు చెందిన కవిత (24) శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సంజామల మండలం గిద్దలూరుకు చెందిన కవితకు బెలుంకు చెందిన బంధువు నరసింహులుతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం ఉన్నారు. భర్త ట్రాక్టర్ డ్రైవర్ పని చేస్తుంటాడు. ఉదయం దంపతుల మధ్య కుటుంబ సమస్యల వల్ల గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన కవిత ఇంట్లో ఉన్న పేడ రంగును నీళ్లలో కలుపుకొని తాగింది. తర్వాత వాంతులు చేసుకుంటుండగా కుటుంబ సభ్యులు గమనించి 108 వాహనంలో అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం బనగానపల్లెకు అక్కడి నుంచి కర్నూలుకు తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రైలు కిందపడి యువతి ఆత్మహత్య ఆదోని సెంట్రల్: ఆదోని పట్టణానికి చెందిన బోగనూర్ అబ్దుల్ రఫూఫ్ కుమార్తె బోగనూర్ నజియా బాను శుక్రవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆదోని– మంత్రాలయం రైల్వే పోలీస్స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సి.శివరామయ్య తెలిపారు. వివరాలు.. నజియా బానుకు ఇష్టం లేని పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు చెప్పడంతో మనస్తాపం చెంది ఆదోని రైల్వే స్టేషన్ సమీపంలో రాయచూరు నుంచి గుత్తికి వెళ్లే గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుందని వివరించారు. తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. -
ఆర్ఎస్ఐలు బాధ్యతాయుతంగా మెలగాలి
కర్నూలు(టౌన్): ఆర్మ్డ్ రిజర్వులో ఆర్ఎస్ఐలుగా విధులు నిర్వహిస్తూ ఇటీవల సివిల్ ఎస్ఐలుగా పదోన్నతి పొందిన వారు మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ స్పష్టం చేశారు. శుక్రవారం కన్వర్షన్ కింద ఎస్ఐలుగా పదోన్నతి పొందిన సివిల్ ఎస్ఐలు కర్నూలు రేంజ్ డీఐజీని మర్యాదపూర్వకంగా కలిశారు. డీఐజీ మాట్లాడుతూ ప్రజలకు సత్వర న్యాయం అందించే విధంగా పోలీసులు కృషి చేయాలన్నారు. క్రమశిక్షణ, నిజాయితీ, అంకిత భావంతో పనిచేస్తూ శాఖ ప్రతిష్టను పెంచాలన్నారు. కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో ఈ నెల 28, 29, 30వ తేదీల్లో నిర్వహించే పల్స్పోలియో కార్యక్రమానికి వైద్యులు, సిబ్బంది సిద్ధం కావాలని డీఎంహెచ్ఓ డాక్టర్ వై.కామేశ్వరప్రసాద్ తెలిపారు. కర్నూలు మెడికల్ కాలేజిలోని ఆడిటోరియంలో పల్స్పోలియో కార్యక్రమంపై శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ 2003 అక్టోబర్ నెల 13న జిల్లాలో చివరి పోలియో కేసు నమోదైందన్నారు. ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, అయినా ముందు జాగ్రత్త చర్యగా పల్స్పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 3,52,164 మంది ఐదేళ్లలోపు పిల్లలకు పల్స్పోలియో చుక్కలు వేస్తామన్నారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఉమ మాట్లాడుతూ మొత్తం 1,630 బూత్లలో పోలియో చుక్కలు వేస్తారన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. 29, 30వ తేదిల్లో ఇంటింటికీ తిరిగి ప్రతి ఒక్క పిల్లవాడికి పల్స్పోలియో చుక్కలు వేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎల్.భాస్కర్, సంచార చికిత్స కార్యక్రమ నోడల్ అధికారి డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి, డీపీఎంఓ డాక్టర్ శైలేష్కుమార్, డీపీఓ విజయరాజు పాల్గొన్నారు. -
రూ.51కే బీఎస్ఎన్ఎల్ 4జీ సిమ్
కర్నూలు(హాస్పిటల్): స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీసులను అతి తక్కువ ధరలో ప్రజలకు చేరువ చేయడానికి ప్లాన్ ఎఫ్ఆర్సీ 51ను ప్రవేశపెట్టినట్లు బీఎస్ఎన్ఎల్ కర్నూలు బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ జి.రమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రీమియం నంబర్లను ఈ–వేలం ద్వారా పొందవచ్చన్నారు. ప్రీమియం నంబర్లు పొందేందుకు http://eauction.bsnl.co.in వెబ్సైట్లో మొబైల్ నంబర్ గాని, ఈ మెయిల్ ఐడీ ద్వారా కానీ రిజిస్టర్ చేసుకుని కావాల్సిన నంబర్ను రిజర్వ్ చేసుకోవచ్చని తెలిపారు. పిన్ జనరేట్ అయిన తర్వాత దగ్గర్లోని వినియోగదారుల సేవా కేంద్రాన్ని సంప్రదించి బిడ్ అమౌంట్ చెల్లించి సిమ్ను పొందవచ్చన్నారు. ఈ–వేలం విండో జూన్ 15వ తేదీ వరకు ఉంటుందన్నారు. రూ.899కే అధిక స్పీడ్తో ఇంటర్నెట్ కేవలం రూ.899కే 175 ఎంబీపీఎస్తో 5 వేల జీబీ వరకు ఇంటర్నెట్,అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యాలతో కొత్త ఎఫ్టీహెచ్ ప్లాన్ ఫైబర్ వాల్యూ అడ్వాన్స్ను ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. ఇందులో ఇంటర్నెట్ సౌకర్యం, జియో హాట్స్టార్ సూపర్ప్లాన్, సోనీ లైవ్, జీ5, హంగామా యాప్, లయన్స్గేట్, షిమారో మీ, ఎపిక్ ఆన్ ఓటీటీలు ఉంటాయన్నారు. అతి తక్కువగా రూ.220కే ఫైబర్ టీవీ బేసిక్ ప్లాన్ ద్వారా 20 ఎంబీపీఎస్ స్పీడుతో 500 జీబీ వరకు ఇంటర్నెట్, రూ.140 రీచార్జ్ చేసుకోవడం ద్వారా టీవీ ఛానళ్లు, ఓటీటీలు వీక్షించవచ్చని వెల్లడించారు. వాహన దొంగల ముఠాలో విరుపాపురం వాసి? ఆలూరు: ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో బైక్లు, బొలెరోలు, ప్రొక్లెయినర్లను అపహరించిన ముఠాలో హాలహర్వి మండలం విరుపాపు రానికి చెందిన చెన్నబసప్పను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను 20 ఏళ్ల క్రితం కర్ణాటకలోని చెలగనూరుకు వెళ్లి అక్కడే ఉంటున్నాడు. కర్ణాటకలోని బళ్లారి, సింధనూరు, శిరుగుప్ప ప్రాంతాల్లో బైక్లు అపహరించి ఆంధ్రలోని హాలహర్వి మండలం విరుపాపురం గ్రామంలో బైక్ మెకానిక్ లతీఫ్, జీరా చెన్న తదితరుల ద్వారా విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. దీనిపై సమగ్ర విచారణ జరిపిన కర్ణాటక పోలీసులు నిందితుడు చెన్నబసప్పను అరెస్టు చేసి, హాలహర్వి మండలంలోని లతీఫ్, జీరా చెన్న వద్ద విచారణ జరిపారు. స్థానికంగా వారు విక్రయించిన దాదాపు 50 బైక్లను మూడు రోజులు క్రితం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై హాలహర్వి ఎస్ఐ ఈశ్వరరావును శుక్రవారం విచారించగా మోటార్ వాహనాల అపహరణ కేసులో కర్ణాటక పోలీసులు హాలహర్వి మండలంలో విచారణ జరుపుతున్న విషయం వాస్తవమేనని వెల్లడించారు. 18న వైద్యుల పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ కర్నూలు(హాస్పిటల్): డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్(డీసీహెచ్ఎస్), ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు(10), సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్(6) పోస్టులకు ఈ నెల 18న వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు డీసీహెచ్ఎస్ డాక్టర్ జఫ్రుల్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్టు ప్రాతిపదిక భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికై న వారికి సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టుకు నెలకు జీతం రూ.1,10,000, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్కు రూ.61,960జీతం ఇస్తారన్నారు. వివరాలుకు kurnool.ap.gov.in, nandyal.ap. gov.in వెబ్సైట్లలో చూడాలన్నారు. హైస్కూల్లో నాగుపాము కోడుమూరు రూరల్: పాఠశాలలు పునఃప్రారంభమైన వేళ కోడు మూరు మండలంలోని కల్లపరి హైస్కూల్లో ఆరడు గుల నాగుపాము ప్రత్యక్షమైంది. వంట ఏజెన్సీ మహిళలు భోజనం తయారు చేసేందుకు పాఠశాల వంటగదిలోకి వెళ్లగా బియ్యం సంచుల మాటున పాము తిష్ట వేసి ఉంది. గమనించిన మహిళలు పరుగున బయటకు వచ్చి విషయాన్ని హెచ్ఎం శాంతమూర్తికి తెలిపారు. పులకుర్తి గ్రామంలో పాములపట్టే వ్యక్తిని హెచ్ఎం పిలిపించి పామును పట్టించడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు పీల్చుకున్నారు. ప్రహరీ లేకపోవడంతో చుట్టు పక్కల పొలాల నుంచి పాములు పాఠశాలలోకి వస్తున్నాయని, వెంటనే పాఠశాలకు కాంపౌండ్ వాల్ నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇరువర్గాల ఘర్షణ బేతంచెర్ల: మండలంలోని బుగ్గానిపల్లె సర్వే నంబర్ 827లోని రెండు ఎకరాల భూమి విషయమై తమదంటే తమదంటూ ఇరువర్గాలు ఘర్షణకు దిగిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. సదరు సర్వే నంబర్ పక్కన పట్టణానికి చెందిన ఓ వ్యక్తి క్రషర్ నిర్వహిస్తున్నారు. క్రషర్ పక్కనే ఉన్న భూమికి సంబంధించి 2010లో కొలుములపల్లెకు చెందిన కొందరికి డీ–పట్టా ఇవ్వడంతో వారు అక్కడ చీని చెట్లు నాటారు. అయితే, తమ పొలంలో చెట్లు ఎలా నాటుతారంటూ 2024లో డీ–పట్టా పొందిన క్రషర్ యజమాని ఆ చెట్లను తొలగించారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ విషయమై తహసీల్దార్ నాగమణిని వివరణ కోరగా.. సదరు సర్వే నంబర్లో 2010లో ఒకరికి, మళ్లీ అదే నంబర్లో 2024లో మరొకరికి పట్టా ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఈ పొలాన్ని ఎవరూ సాగు చేయలేదని, ఆన్లైన్లోనూ ఎవరి పేరూ లేదని పేర్కొన్నారు. రీ–సర్వేలో ఈ సర్వే నంబర్లోని 15 ఎకరాలను ప్రభుత్వ భూమిగా గుర్తించినట్లు వెల్లడించారు. -
కుక్కల దాడిలో 44 గొర్రెలు మృతి
● రూ.4 లక్షలు నష్టంగోనెగండ్ల: మండలంలోని ఐరన్బండ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున వీధికుక్కల దాడిలో 44 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. వివరాలు.. ఐరన్బండ గ్రామానికి చెందిన బజారి, చంద్ర, రమేష్ గొర్రెల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవారు. కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండలో శని, ఆది, సోమవారాల్లో గొర్రెల వ్యాపారం చేసేందుకు ముగ్గురు వ్యాపారులు గురువారం తెలంగాణలోని పెబ్బేరు సంతకు వెళ్లి రూ.4 లక్షలతో గొర్రెలను కోనుగోలు చేసి రాత్రి ఐరన్బండ గ్రామంలో నిర్మాణంలో ఉన్న పంచాయతీ కార్యాలయం భవనంలో వాటిని ఉంచారు. కార్యాలయం నిర్మాణంలో ఉండటంతో గదులకు తలుపులు లేవు. గేటు వద్ద తడికను అడ్డంగా పెట్టి రాత్రి ఇళ్లకు వెళ్లారు. తెల్లవారుజామున గొర్రెలను గుర్తించిన దాదాపు 10 వీధికుక్కలు వాటిపై దాడి చేసి కొరికి చంపాయి. ఆ సమయంలో గొర్రెలు అరవడంతో సమీపంలోని వచ్చి చూడగా అప్పటికే గొర్రెలు మృతిచెందాయి. విషయం తెలుసుకుని వ్యాపారులు బజారి, చంద్ర, రమేష్ కన్నీటి పర్యంతం అయ్యారు. అప్పులు చేసి గొర్రెలను కొని తెచ్చామని, రూ.4 లక్షలు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు. -
డూప్లికేట్ తాళాలతో బైకుల చోరీ
● నలుగురు దొంగలు అరెస్ట్ ● నాలుగు బైకులు స్వాధీనం మహానంది: దేవస్థానం ప్రాంగణంలోని ఆలయ గేటు వద్ద ఉంచిన రెండు బైకులను చోరీ చేసిన నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు నంద్యాల ఏఎస్పీ మందాజావళి ఆల్ఫోన్స్ తెలిపారు. సీఐ శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మహానంది దేవస్థానం సూపరింటెండెంట్ పి.సుబ్బారెడ్డి, మరో ఉద్యోగి గురుప్రసాద్కు చెందిన పల్సర్, హెచ్ఎఫ్ డీలక్స్ బైక్లు ఈ నెల 9వ తేదీన చోరీకి గురయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీసీఎస్ పోలీసుల సహకారంతో నిందితులను పట్టుకున్నారు. నిందితులు నంద్యాల పట్టణంలోని ఎంఎస్ నగర్ బర్మశాలకు చెందిన పాల్తీ గోపీనాయక్, మేనుగ రాజు (కర్నూలు) ఎన్జీఓస్ కాలనీ, డోన్ మండలం చిన్నమల్కాపురానికి చెందిన దొడ్డగాళ్ల ప్రకాష్, దేవనగర్కు చెందిన షేక్ సాబిర్ హుసేన్గా తెలిసింది. వారి నుంచి మహానందితో పాటు నంద్యాల త్రీటౌన్, ఆళ్లగడ్డ టౌన్ పరిధిలో చోరీ చేసిన నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బైకుల విలువ రూ. 2.70 లక్షలు ఉంటుందని వెల్లడించారు. డూప్లికేట్ తాళాలతో చోరీలు మద్యం, చెడు అలవాట్లకు బానిసలైన నిందితులు తప్పుదారి పట్టి బైక్ల దొంగతనాలకు పాల్పడుతున్నారని ఏఎస్పీ మందా జావళి తెలిపారు. డూప్లికేట్ తాళాలు ఉపయోగించి బైకులను చోరీ చేస్తున్నారని చెప్పారు. సీసీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి బైకులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కేసును చేధించిన సీసీఎస్, మహానంది పోలీసులను ఎస్పీ సునీల్ షెరాన్ అభినందించారు. -
కేఎంసీని సందర్శించిన అకడమిక్ డీఎంఈ
కర్నూలు(హాస్పిటల్): డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(అకడమిక్) డాక్టర్ సత్యనారాయణ మూర్తి గురువారం కర్నూలు మెడికల్ కాలేజీ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లను సందర్శించారు. కాలేజీలోని పెండింగ్లో ఉన్న ఎగ్జామినేషన్ సెక్షన్, ఆడిటోరియం, లెక్చరర్ గ్యాలరీ, స్కిల్ ల్యాబ్, నిర్మాణంలో ఉన్న ఐపీ బ్లాక్ పనులను పరిశీలించారు. ఆసుపత్రిలో పారిశుధ్య, సెక్యూరిటీ గార్డుల విధులపై ఆరా తీశారు. అనంతరం కౌన్సిల్ హాలులో హెచ్ఓడీలు, ప్రొఫెసర్లు, సిబ్బందితో సమావేశం నిర్వహించి వారి సమస్యలు, అత్యంత ముఖ్యమైనవి, అత్యవసరంగా చేయాల్సిన పనుల గురించి చర్చించారు. లెక్చరర్ గ్యాలరీ త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని, ఐపీ బ్లాక్ కనీసం రెండు ఫ్లోర్లైనా అందుబాటులోకి తెస్తే అనేక విభాగాలకు మేలు చేసినట్లు అవుతుందని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ కోరారు. అనంతరం స్కిల్ల్యాబ్ వద్ద ఆయన మొక్కలు నాటారు. పీజీలకు నిర్వహిస్తున్న జీఎల్పీ, జీసీపీ, ఎథిక్స్ సమావేశంలో పాల్గొని వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఆసుపత్రిలో ముఖ్యమైన సమస్యలను సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు వివరించి చెప్పారు. -
చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగులకు వేధింపులు
కర్నూలు(సెంట్రల్): చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగులకు వేధింపులు పారిపాటిగా మారాయని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వీఆర్ఏ, వీఆర్వో విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి రాజు రవీంద్రరాజు ఆవేదన వ్యక్తం చేశా రు. గురువారం కర్నూలు వచ్చిన ఆయన ఇటీవల పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న వీఆర్వో టి.మహ్మద్హుస్సేన్ కుటుంబ సభ్యులను వారి ఇంట్లో పరామర్శించారు. హుస్సేన్ మరణానికి అధికారుల వేధింపులే కారణమని వారు చెప్పడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...టీడీపీ ప్రభుత్వంలో వీఆర్వోలపై దాడులు నిత్యకృత్యమమయన్నారు. ఉన్నతాధికారుల పని ఒత్తిడి కూడా పెరిగిపోయిందన్నారు. దీని కారణంగా చాలా మంది వీఆర్వోలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు. వీఆర్వో టి.మహ్మద్ హుస్సేన్ కుటుంబానికి ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఏపీ గవర్నమెంట్ ఎంప్లా యీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బంగిశ్రీధర్, సురేష్రెడ్డి, టౌన్ అధ్యక్ష,కార్యదర్శు లు మురళీధర్నాయుడు, చిన్న కృష్ణ పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ హయాంలో ఇలా..
ఆదోనిలోని ఆర్ఆర్ కాలనీలో రెండేళ్లుగా నిలిచిపోయిన హైస్కూల్ భవనం పనులు అద్భుతమైన ప్రవేశ ద్వారాలు.. ఆకర్షణీయమైన బెంచీలు.. తళుక్కున మెరిసే గ్రీన్ బోర్డులు.. ‘స్మార్ట్’ బోధన.. ఇదీ ప్రభుత్వ పాఠశాలల్లో ఒకప్పటి మాట. విద్యార్థుల కాళ్లకు బూట్లు రాలేదు.. టైలు, బెల్టులు లేవు.. యూనిఫాం ఎప్పుడు వస్తుందో తెలియదు.. నిర్మాణంలో ఉన్న తరగతి గదులు ఎప్పుడు పూర్తవుతాయో చెప్పలేం.. ఇదీ నేటి మాట. అర్ధంతరంగా నిలిచిపోయిన తరగతి గదుల నిర్మాణం..‘చిక్కీ’పోయిన మధ్యాహ్న భోజనం.. కనీసం పాఠ్యపుస్తకాలు కూడా అందించని దౌర్భాగ్యం.. ఇలా ఎన్నో సమస్యలతో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అద్వితీయమైన అభివృద్ధి కనిపించింది. నేడు సర్కారు స్కూళ్లలో ప్రగతి తడబడి కనీస సౌకర్యాలు కరువయ్యాయి.గోనెగండ్ల మండల వీరంపల్లి గ్రామంలో మరుగుదొడ్డి దుస్థితి కర్నూలు సిటీ: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యింది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులు కనిపించడమే లేదు. వాటిలో చదివే పేద విద్యార్థులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. చాలీచాలని తరగతి గదులు.. శిథిలావస్థకు చేరిన భవనాలే దిక్కయ్యాయి. యూనిఫాం, బూట్లు, పాఠ్య, నోటు పుస్తకాలు అందని దుస్థితి అంతటా కనిపిస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన నాడు–నేడు పనులను అర్ధంతరంగా ఆపేశారు. అదనపు తరగతి గదులు అందుబాటులోకి రాకపోగా.. డిజిటల్ విద్య దూరమై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాడు ఒక్కొక్కరికి రూ.2,419 విలువైన విద్యా కానుక విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే జగనన్న విద్యాకానుకను విద్యార్థుల చేతికి అందజేసిన ఘనత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుంది. ఏటా జూన్ 12వ తేదీకి ప్రతి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు విద్యాకానుక పేరిట మూడు జతల యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, స్కూల్ బ్యాగ్, బెల్ట్లు ఇచ్చేవారు. అలాగే 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ డిక్సనరీలు, 1 నుంచి 5 తరగతులకు పిక్టోరియల్ డిక్సనరీలు అందించేవారు. ఒక్కొక్కరికి రూ.2,419 విలువైన విద్యాకానుకను అందించేవారు. నేడు కినుక వహించిన ‘విద్యార్థి మిత్ర’ జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 2.64 లక్షల మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం కింద కిట్లను పంపిణీ చేయాల్సి ఉంది. ఇందులో పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, బెల్టులు, డిక్షనరీలు, బ్యాగులు, స్కూల్ యూనిఫాం, వర్క్ బుక్స్ ఇవ్వాల్సి ఉంది. పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్లు మాత్రమే పునఃప్రారంభం రోజున ఇవ్వనున్నారు. మిగిలినవి ఎప్పుడు ఇస్తారో విద్యాశాఖ అధికారులకే స్పష్టత లేదు. ● నోట్ బుక్స్ 14,82,441 గాను 5,88,513, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు 28,298 వచ్చాయి. అన్నీ జిల్లా కేంద్రంలోనే ఉన్నాయి. ● బెల్టులు 1 నుంచి 10 వరకు బాలురు, 1 నుంచి 5 వరకు బాలికలకు 1,85,471 అవసరం కాగా ఇప్పటి వరకు ఒక్కటీ కూడా రాలేదు. ● వర్క్బుక్లు 1,80,153గాను 1,69,465 మాత్రమే రాగా,25 మండలాలకు పంపించారు. ● టెక్ట్స్ బుక్లు 11,90,147 రాగా వాటిలో 9,79,822 26 మండల కేంద్రాలకు పంపించారు. ఇందులో సగం కూడాస్కూల్ పాయింట్కు చేరలేదు. ● బూట్లు 2,64,885 అవసరం ఉండగా ఒక్కటి కూడా రాలేదు. ● పిక్టోరియల్ డిక్షనరీలు (ఫస్ట్ క్లాస్) 17,926 అవసరం ఉండగా 4,880 మాత్రమే జిల్లాకు వచ్చాయి. వాటిని ఎనిమిది మండలాలకు పంపిణీ చేశారు. ● యూనిఫాం 2,64,885 మందికి ఒక్కొక్కరికి మూడు జతల చొప్పున రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 44,572 మందికి మాత్రమే రావడంతో నాలుగు మండలాలకు సరఫరా చేశారు. ‘చిక్కీ’పోయి! ఆరోగ్యంగా ఉంటేనే బాగా చదువుతారని భావించిన గత ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పేరిట విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించింది. రోజుకో మెనూతో విభిన్న వంటకాలు, వారానికి మూడు రోజులు చిక్కీ, మూడు రోజులు రాగి జావ, వారానికి ఐదు రోజులు కోడిగుడ్డు ఇచ్చేవారు. విద్యార్థులు జావ తాగేందుకు వీలుగా స్టీలు గ్లాసులు సైతం నాటి ప్రభుత్వం సమకూర్చింది. ఈ పథకం పేరును కూటమి ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంగా మార్చింది. ఈ పథకం కింద స్కూళ్లకు కేవలం బియ్యం మాత్రమే చేరాయి. కోడిగుడ్లు, చిక్కీలు స్కూళ్లకు చేరలేదు. దీంతో పాటు రాగిపండి, బెల్లం సైతం స్కూళ్లకు పూర్తి స్థాయిలో చేరలేదు. ప్రగతిని ‘నీరు’గార్చారు! కర్నూలు కేవీఆర్ గార్డెన్లోని ఉర్దూ హైస్కూల్లో రెండేళ్లుగా నిరుపయోగంగా ఆర్వో ప్లాంట్ చంద్రబాబు ప్రభుత్వంలో పడిగాపులు‘బడి’ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మనబడి నాడు– నేడు పనులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పేరొస్తుందని ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన పనులను నిలిపివేశారు. దీనికి తోడు పాఠశాల విద్యలో తీసుకొచ్చిన సంస్కరణలను సైతం మార్పులు చేసి అశాసీ్త్రయంగా తొమ్మిది రకాల బడులుగా విభజించారు. విద్య వ్యవస్థలను మంత్రి లోకేష్ అస్తవ్యస్తం చేశారు. డీఎస్సీ ద్వా రా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీకి చేసి నా కూడా సర్కార్ బడుల్లో ప్రామాణికమైన విద్య పతనావస్ధకు చేరిందని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. పీఎంశ్రీ పథకం కింద చేపట్టిన పనులు చేస్తున్నప్పటికీ బిల్లులు సకాలంలో రాక అగుతూ..సాగుతున్నాయి. కేజీబీవీల్లో చేపట్టిన అదనపు తరగతి గదుల పనులు, డార్మెటరీల పనులు సైతం పూర్తి కాలేదు. జిల్లాలో అన్ని యాజమాన్యాల బడులు 2,254 ఉండగా వాటిలో 4.57 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం ప్రభుత్వ యాజమాన్య స్కూళ్లు 1,445 ఉండగా వాటిలో 2.49 లక్షల మంది పిల్లలు ఉన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మన బడి నాడు–నేడు ద్వారా రెండు విడతలుగా పనులు చేపట్టింది. మొదటి విడతలో 594 పాఠశాలల్లో రూ. 166.25 కోట్లు ఖర్చు చేసి తొమ్మిది రకాల మౌలిక సదుపాయాలు కల్పించారు. రెండో విడతలో 1,051 స్కూళ్లలో రూ.504.16 కోట్లతో పనులు చేపట్టారు. కార్పొరేట్ పాఠశాలల తరహాలో ప్రవేశ ద్వారాలు, ఆర్చీలు, ఆకర్షణీయమైన బెంచీలు, విద్యుత్ సదుపాయం, తాగునీరు, రన్నింగ్ వాటర్తో టైల్స్తో కూడిన టాయిలెట్ల వంటివి ఏర్పాటు చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జిల్లాలో రూ.24.47 కోట్లు వెచ్చించి 567 పాఠశాలల్లో మొదటి విడతలో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసింది. రెండో విడతలో 709 పాఠశాలల్లో రూ.23.05 కోట్లు ఖర్చు పెట్టి ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని పనులు మొదలుపెట్టారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్లాంట్ల నిర్వహణను పట్టించుకోలేదు. దీంతో జిల్లాలో వందకుపైగా ఆర్వో ప్లాంట్లు మూలకు చేరాయి. మిగిలిన వాటిలో సగానికిపైగా ఇంత వరకు ఇన్స్టాలేషన్ చేయలేదని తెలుస్తోంది. -
రిషీ.. పలకవేమీ?
గోనెగండ్ల: ‘రిషీ.. పలకవేమీ’ అంటూ తల్లిదండ్రులు బోయ రాజు, అరుణమ్మ రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. గోనెగండ్ల మండలం బైలుప్పల గ్రామానికి చెందిన వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరికి మగపిల్లవాడు లేకపోవడంతో రాజు భార్య అరుణమ్మ చెల్లెలు నాగమణి కుమారుడు రిషీనిమూడేళ్ల క్రితం దత్తత తీసుకుని ప్రేమగా పెంచుకుంటున్నారు. అయితే విధి వక్రీకరించించి గురువారం ఉదయం బాత్రూములో ఉన్న హీటర్ను పట్టుకుని రిషీ అక్కడికక్కడే మృతిచెందాడు. ఎంతో ప్రేమతో పెంచుకున్న బాలుడు మృతిచెందడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కర్నూలు టౌన్ డీఎస్పీగా రాఘవేంద్ర కర్నూలు (టౌన్): కర్నూలు టౌన్ డీఎస్పీగా కేవీ రాఘవేంద్ర నియమితులయ్యారు. గురువారం రాత్రి డీజీపీ కార్యాలయ వర్గాల నుంచి నియామాక ఉత్తర్వులు వచ్చాయి. ప్రకాశం జిల్లాకు చెందిన ఆయన ఎస్ఐగా, సీఐగా గుంటూరు జిల్లా పరిధిలో పనిచేశారు. కర్నూలులో డీఎస్పీగా పనిచేస్తున్న బాబు ప్రసాద్ వారం రోజుల క్రితం అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందారు. -
సారూ.. జీతాలు ఇవ్వండి!
ఆదోని సెంట్రల్: తమకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వలేదని, ఎలా బతకాలని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జీతాలు ఇవ్వాలని అడిగితే మూడు నెలలకు ఒక సారి ఎప్పుడో ఇచ్చిన జీతాలను చూపుతున్నారన్నారు. ఎప్పుడో ఇస్తే అవి ఇప్పుడు ఇచ్చినట్లు ఎలా అవుతాయని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై న అధికారులు స్పందించి పెండింగో ఉన్న జీతాలను ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా హనుమంతురెడ్డి కల్లూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేర కు పార్టీ కేంద్ర కార్యా లయం పాణ్యం నియో జకవర్గ పరిధిలోని అక్కి మి హనుమంతురెడ్డిని పార్టీ రాష్ట్ర సంయుక్త కా ర్యదర్శిగా నియమించా రు. ఈ సందర్భంగా అక్కిమి హనుమంతురెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో బాధ్యతాయుతంగా పనిచేస్తానని తెలిపారు. వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, పా ర్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాట సాని శివనరసింహారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ఎంతో మేలు కోడుమూరు రూరల్: రైతులకు ప్రకృతి వ్యవసాయం ఎంతో మేలు చేస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలిపారు. గూడూరులో ఎరువుల అమ్మకాలను గురువారం ఆమె పరిశీలించారు. ఎరువుల అమ్మకాల్లో యాప్లో సాంతికేతిక సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. ప్రకృతి వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయంతో భూమి సారవంతమవుతుందని, మంచి దిగుబడులు వస్తాయని తెలిపారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి వరలక్ష్మి, ఆర్డీఓ సందీప్కుమార్, గూడూరు తహసీల్దార్ వెంకటేష్ నాయక్, ఏఓ దస్తగిరిరెడ్డి పాల్గొన్నారు. 18002332447కర్నూలు(సెంట్రల్): పీసీ అండ్ పీఎన్డీటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడంలో భాగంగా గర్భస్థ శిశువుల లింగ నిర్ధారణ సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 18002332 447కు ఫిర్యాదు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అక్రమంగా కొన్ని హాస్పిటళ్లు, ల్యాబ్ల్లో లింగ నిర్ధారణలు చేస్తున్నారని, అలాంటి సమాచా రం ఉంటే చెప్పితే వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఆడ, మగ అనే తేడా చూడ డం మంచికాదని, ఆడైనా, మగైనా ఒక్కటే అన్న భావన ప్రజల్లో కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 28న పల్స్పోలియో కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో ఈ నెల 28వ తేదీన పల్స్పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. ఇందుకు సంబంధించి గత 5వ తేదీ నుంచే అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అలాగే 12వ తేదీన మెడికల్ ఆఫీసర్లతో సమావేశం కూడా ఏర్పాటు చేసి వారికి కార్యక్రమంపై శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ మీటింగ్ 22న, సిటీ/అర్బన్, మండలస్థాయి టాస్క్ఫోర్స్ మీ టింగ్ 24న నిర్వహించనున్నారు. బూత్ల వారీ గా పల్స్పోలియో కార్యక్రమంలో భాగంగా 28వ తేదీన ఐదేళ్లలోపు చిన్నారులకు వ్యాక్సిన్ చుక్కలు వేయనున్నారు. వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి 29, 30వ తేదిల్లో పల్స్పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
రూ.4 కోట్ల జెడ్పీ నిధులతో 110 పనులు
● పాలనా అనుమతులు మంజూరు చేసిన పాలకవర్గం కర్నూలు(అర్బన్): జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు, ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ప్రజలకు ఉపయోగపడే పలు రకాల మౌలిక వసతులు కల్పించేందుకు జిల్లా పరిషత్ సాధారణ నిధులు రూ.4.06 కోట్లతో 110 పనులు చేపట్టేందుకు జెడ్పీ పాలకవర్గం పాలనా అనుమతులు మంజూరు చేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాలు, ఎస్సీ, ఎస్టీల కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, తాగునీటికి సంబంధించిన పైప్లైన్ల విస్తరణ, మోటార్ల రిపేరి, బోర్వెల్స్, అంగన్వాడీ భవనాల మరమ్మతులు, అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాలను పూర్తి చేసేందుకు ఈ నిధులను వెచ్చించనున్నారు. అలాగే అసంపూర్తిగా ఉన్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లీనిక్స్ భవనాలను పూర్తి చేసేందుకు సెక్టోరియల్ ఆక్టివిటీస్ కింద ఈ నిధులను వినియోగించుకోనున్నారు. ఈ పనులకు సంబంధించి 1వ స్థాయీ సంఘ సమావేశంలో చర్చించి సభ్యులు ఆమోదం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 10న జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆమోదం తీసుకొని పాలనా అనుమతులు మంజూరు చేశారు. 23 శాతం జెడ్పీ నిధులతో రూ.96 లక్షలతో 21 పనులు 12 శాతం ఆర్డబ్ల్యూఎస్ నిధులు రూ.122.09 లక్షలతో 51 పనులు 10 శాతం సెక్టోరియల్ నిధులు రూ.69.25 లక్షలతో 16 పనులు 15 శాతం ఎస్సీ ఈఎంఎఫ్ నిధులు రూ.56.20 లక్షలతో 13 పనులు 15 శాతం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నిధులు రూ.15 లక్షలతో 03 పనులు 6 శాతం ఎస్టీ ఈఎంఎఫ్ నిధులు రూ.47.60 లక్షలతో 06 పనులు జెడ్పీ పాలనా అనుమతులు పొందిన పనుల వివరాలు.. -
నేడు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలు
కర్నూలు (టౌన్): చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న నిరసన ర్యాలీలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చాలన్న డిమాండ్తో నిర్వహిస్తున్న ఈ ర్యాలీల్లో పెద్ద ఎత్తున పార్టీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని పేర్కొన్నారు. కర్నూలులో ఉదయం 10:15 గంటలకు స్థానిక ఐదు రోడ్ల కూడలి నుంచి మౌర్య ఇన్ మీదుగా జిల్లా పరిషత్తు కార్యాలయం వరకు ర్యాలీ చేపడుతున్నట్లు తెలిపారు. దోమల నివారణ చర్యలు తీసుకోండి కొత్తపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో దోమల నివారణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మలేరియా అసిస్టెంట్ డైరెక్టర్ హుసేనమ్మ, జిల్లా మలేరియా అధికారి చంద్రశేఖర రావుఅన్నారు. గురువారం ఎరమ్రఠం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కపిలేశ్వరం గ్రామాన్ని ఆరోగ్య విస్తరణ అధికారి నిత్య పూజారి ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
బంగారానికి మెరుగు పెడతామంటూ బురిడీ
● మెరుగు పెడుతూ బంగారాన్ని కాజేసిన కేటుగాడు.. ● బాధిత మహిళలు లబోదిబో కోడుమూరు రూరల్: స్థానిక కొండపేటలో గుర్తు తెలియని వ్యక్తి ఇద్దరు మహిళలను క్షణాల్లో బురిడీ కొట్టించి నాలుగున్నర తులాల బంగారాన్ని కాజేశాడు. బాధితుల కథనం మేరకు.. కోడుమూరులోని కొండపేటకు చెందిన శేఖర్ భార్య పద్మావతి, వెంకటేశ్వర్లు భార్య చంద్రకళలు వరుసకు వదినా మరదళ్లు. బుధవారం మధ్యాహ్నం వీరంతా ఇంట్లో పనులు చేసుకుంటుండగా ఓ కేటుగాడు ఇంటి వద్దకు వచ్చి ‘కంపెనీ ప్రచార నిమిత్తం వచ్చాం.. బంగారు, వెండి ఆభరణాలిస్తే.. మీ ముందే ఫ్రీగా మెరుగు పెట్టించి తళతళ మెరిసేలా చేస్తాం’ అంటూ నమ్మబలికారు. అయితే ఆ మహిళలు మొదట తమకు వద్దని చెప్పినప్పటికీ వినకుండా ఆ కేటుగాడు ‘మీ కళ్ల ముందే మెరుగు పెట్టి ఇస్తా’నంటూ పదేపదే చెప్పడంతో చంద్రకళ తన వెండి పట్టిని ఇవ్వగా, మెరుగు పెట్టి ఇచ్చాడు. దీంతో నమ్మకం కుదిరిన ఆమె తన మెడలోని రెండున్నర తులాల తాళి చైన్ను మెరుగు పట్టేందుకు ఇచ్చింది. ఆ కేటుగాడు చంద్రకళ తాళి చైన్కు మెరుగుపెడుతూనే పక్కనే ఉన్న పద్మావతి మహిళకు చెందిన రెండు తులాల తాళిచైన్కు కూడా మెరుగుపెడతానంటూ ఇప్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో కొద్దిసేపు వివిధ రకాల కెమికల్స్, పౌడర్లు కలిపి తాళిచైన్లకు మెరుగుపెడుతున్నట్లుగా ఆ దుండగుడు నటించాడు. అనంతరం ఆ తాళి చైన్లను వారి ముందరే పసుపురంగు ద్రావణంలో వేసి కొద్ది సమయం తర్వాత తీసుకోవాలని చెప్పి ఆ కేటుగాడు అక్కడి నుంచి ఉడాయించాడు. కొద్ది సమయం తర్వాత తాళి చైన్లను పసుపునీటి ద్రావణంలో చూసిన ఆ మహిళలు నిశ్చేష్టులయ్యారు. రెండు తాళిచైన్లు పరిమాణం సగానికి పైగా తగ్గిపోవడంతో పాటు, బంగారు చైన్లు తుంటలు తుంటలుగా తెగి ఉండడంతో లబోదిబోమంటూ ఆ మహిళలు కోడుమూరు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి అచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. -
దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు సిటీ: ఏపీ మోడల్ స్కూళ్లలో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఎల్.సుధాకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని తరగతుల ప్రవేశాలకు(ఇంటర్తో కలిపి)ఈ నెల 20వ తేదీలోపు రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించాలని పేర్కొన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారి జాబితా 23న ప్రచురించి, 6 నుంచి 9వ తరగతులకు 24న పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ఎంపికై న విద్యార్థుల జాబితాలను 25న ప్రకటించి, 26న సర్టిఫికెట్లను పరిశీలించి ప్రవేశాలు కల్పిస్తామని డీఈఓ పేర్కొన్నారు. పశుసంవర్ధక శాఖ జేడీగా రాజశేఖర్ కర్నూలు(అగ్రికల్చర్): పశుసంవర్ధక శాఖ జిల్లా ఇన్చార్జ్ జాయింట్ డైరెక్టర్గా డాక్టర్ కే రాజశేఖర్ను నియమిస్తూ ఆ శాఖ డైరెక్టర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పశుసంవర్ధక శాఖలో డిప్యూటీ డైరెక్టర్ అయిన రాజశేఖర్ నాలుగేళ్లుగా ఉమ్మడి జిల్లా పశుగణాభివృద్ధి కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నారు. ఈయనను పూర్తి అదనపు బాధ్యతలతో జిల్లా జాయింట్ డైరెక్టర్గా నియమించగా గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ‘మత్తు’తో యువత భవిష్యత్తు నాశనం కర్నూలు: మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, వాటికి పూర్తి దూరంగా ఉండాలని హోంగార్డ్స్ సదరన్ రీజియన్ కమాండెంట్ మహేష్ కుమార్, అడిషనల్ ఎస్పీలు హుసేన్ పీరా, కృష్ణమోహన్ సూచించారు. డ్రగ్స్కు సంబంధించిన సమాచారం ఉంటే ఈగల్ టోల్ఫ్రీ నబర్ 1972కు తెలియజేయాలన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో బుధవారం డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన బ్రోచర్లు, వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. అలాగే పోలీసు అధికారులు, సిబ్బందితో యోగాసనాలు నిర్వహించారు. హోంగార్డ్స్ డీఎస్పీ ప్రసాద్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, ఈగల్ టీమ్ సిబ్బంది ఎలీషా, రమేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు కర్నూలు కల్చరల్: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రధానిగా 12 సంవత్సరాల పూర్తి చేసుకోవడంతో బీజేపీ ఓబీసీ మోర్చా ఆఽఽధ్వర్యంలో బుధవారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలులోని బళ్లారి చౌరస్తాలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఉల్చాల లక్ష్మణ్ నాయుడు ఆధ్వర్యంలో పూజలు చేశారు. మోదీ 12 ఏళ్ల పాలనా కాలంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మంజునాథ్, ఉపాధ్యక్షులు మస్తాన్, వీరప్ప, అనిత, రఘు, విజయ్, పాండు, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు. ఉరుకుంద హుండీ ఆదాయం రూ. 1.27 కోట్లు కౌతాళం: ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయానికి హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలకు బుధవారం లెక్కించారు. నగదు రూపంలో రూ.1,27,68,230 వచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి తెలిపారు. అలాగే వెండి14 కేజీల 420 గ్రాములు, బంగారం 46 గ్రాముల 280 మిల్లీ గ్రాములు వచ్చినట్లు చెప్పారు. లెక్కింపు కార్యక్రమంలో హుండీ పర్యవేక్షణ అధికారిగా జిల్లా ఎండోమెంట్స్ అధికారి సుధాకర్రెడ్డి వ్యవహరించారు. ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామి, ఉపప్రధాన అర్చకుడు మహదేవస్వామి, ఆలయ పర్యవేక్షకులు వెంకటేష్ మల్లికార్జున పాల్గొన్నారు. -
దోపిడీ దొంగల అరెస్ట్
కర్నూలు: దొపిడీ దొంగలను మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. చాకలి శేఖర్ బి.క్యాంప్ శివారు డాక్టర్స్ కాలనీలోని వీసీ ప్లాజా అపార్ట్మెంట్లో నివాసముంటాడు. ఈనెల 5వ తేదీన మధ్యాహ్నం 12 గంటల సమయంలో మాధవీనగర్లో శిల్పా క్యాటరింగ్ ముందు శేఖర్ తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా బంగారుపేటకు చెందిన దాదపోగు శివకృష్ణ, బాలాజీ నగర్కు చెందిన సయ్యద్ ఇక్బాల్ బాషా, షేక్షావలి అలియాస్ టిల్లు, కొత్తపేటకు చెందిన సయ్యద్ రహిమాన్ తదితరులు కారులో చాకలి శేఖర్ను వెంబడించి చంపుతామని బెదిరించి రూ.5 వేలు లాక్కుని ఉడాయించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పక్కా ఆధారాలతో నిందితులను బుధవారం జొహరాపురం గ్రామ పరిధిలోని సీపీఎం కొట్టాల వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా దోపిడీకి పాల్పడినట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి రూ.3 వేలు నగదుతో పాటు కారును సీజ్ చేసి స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు పంపినట్లు మూడో పట్టణ సీఐ శేషయ్య తెలిపారు. రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య ఆదోని సెంట్రల్: రైలు కింద పడి బుధవారం పెద్దకడబూరు మండలం నౌటేకల్ గ్రామానికి చెందిన సి. మల్లయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదోని–మంత్రాలయం రైల్వే పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సి. శివరామయ్య తెలిపిన వివరాల మేరకు.. సి. మల్లయ్య భార్య రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఒంటరి జీవితం భరించలేక మనస్తాపం చెంది సమీపంలోని ఆదోని–నగరూర్ అర్ఎస్ఎస్ మధ్యలో గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్యహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
చెరువులో అక్రమ తవ్వకాలు
సి.బెళగల్: బ్రాహ్మణదొడ్డి గ్రామ చెరువులో కొంతమంది దుండగులు అక్రమ తవ్వకాలను చేపట్టి, మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. చెరువులో నిబంధనలు విరుద్ధంగా జేసీబీతో తవ్వకాలు చేపట్టి, ట్రాక్టర్ల ద్వారా చెరువు మట్టిని తరలిస్తున్నారు. రైతుల పేరు చెప్పి వారి చాటున బ్రాహ్మణదొడ్డికి చెందిన కొంతమంది దుండుగులు రైతుల నుంచి ఒక్క ట్రాక్టర్ ట్రిప్పుకు అదనంగా డబ్బులు వసూళ్లు చేసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. పైగా తమకు మండల రెవెన్యూ అధికారుల అనుమతులు ఉన్నాయంటూ దగాకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత రెండు రోజులుగా దాదాపు వంద ట్రాక్టర్ల ట్రిప్పుల చెరువు మట్టి నిబంధనలు విరుద్ధంగా అక్రమార్కులు కొలుగొడుతున్నా అధికార యంత్రాంగం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెనరువు పరిసర గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.తాము ఎవరికి చెరువులో మట్టి తరలించుకునేందుకు అనుమతి ఇవ్వలేదని ఆర్ఐ తరుణ్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం ఓర్వకల్లు: మండలంలోని జాతీయ రహదారిపై గడివేముల క్రాస్రోడ్డు సమీపంలో బుధ వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నన్నూరు గ్రామానికి చెందిన కురువ రంగస్వామి (50) అనే వ్యక్తి పసుపుల రుద్రవరం గ్రామంలో నివాసం ఉంటున్నాడు. సోమయాజులపల్లె గ్రామంలో సమీప బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో రోడ్డుపై నడుచుకుంటు వెళ్తున్న సన్నియాదవ్, ఆసిఫ్ యాదవ్ను బైక్ అదుపు తప్పి ఢీకొంది. ఈ ఘటనలో ఆ ఇద్దరితో పాటు రంగస్వామి కిందపడ్డాడు. అదే సమయంలో గుర్తు తెలియని వాహనం అతనిపై ఎక్కి వెళ్లడంతో రంగస్వామికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సునీల్కుమార్ తెలిపారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గుండ్రేవులపై పాలకులు నిర్లక్ష్యం కర్నూలు సిటీ: రాయలసీమ జిల్లాలకు జీవనాడీ లాంటిదైనా గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. బుధవారం నగరంలో రాయలసీమ విద్యార్థి సంఘాల సమావేశం నిర్వహించారు. రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రవికుమార్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు భరత్కుమార్ ఆచారి, రాయలసీమ యువజన విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రంగముని నాయుడు మాట్లాడుతూ గురువారం కోడుమూరులోని పరప్ప కాంప్లెక్స్ ఎదుట కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో జల సమరం పేరుతో దీక్ష చేపడుతున్నారని, ఉమ్మడి జిల్లా ఆయకట్టు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తుంగభద్ర నదిపై 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మిస్తే కేసీ కెనాల్తో పాటు, పశ్చిమ పల్లె కరువును శాశ్వతంగా తరిమేందుకు అవకాశం ఉంటుందన్నారు. గుండ్రేవుల సాధన కోసం ఎవరు ఆందోళన చేసినా రాయలసీమ విద్యార్థి సంఘాలు సంపూర్ణ మద్దతు ఇస్తాయని ప్రకటించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
ఎమ్మిగనూరు రూరల్: ఆదోని నుంచి ఎమ్మిగనూరుకు వస్తూ బైచీగేరి సమీపంలోని మలుపు దగ్గర మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన జేరుబండి ఉదయ్కుమార్ (20) అనే యువకుడు దుర్మరణం చెందాడు. వివరాలు..పట్టణంలోని సోగనూరు రోడ్డులో నివాసముండే ఈ యువకుడు ఆదోనిలో బజాజ్ ఫైనాన్స్లో పనిచేస్తాడు. ప్రతి రోజు పల్సర్ బైక్పై ఆదోని వెళ్లి జాబ్ చూసుకొని రాత్రి ఎమ్మిగనూరుకు వచ్చేవాడు. మంగళవారం రాత్రి పనిముగించుకొని ఇంటికి వస్తుండగా బైచీగేరి సమీపంలోని మలుపు వద్ద బైక్ అదుపుతప్పి సిమెంట్ కల్వర్ట్ను ఢీకొంది. ఈ ఘటనలో ఎగిరి కిందపడిపోయిన యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మోటార్ బైక్ బలంగా కల్వర్టుకు ఢీ కొట్టడంతో పెట్రోల్ లీకై ఆ వాహనం కాలిబూడిదైంది. అటుగా వెళ్తున్న వారు గమనించి అంబులెన్స్లో ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బుధవారం మృతదేహానికి పోస్టుమార్టుం నిర్వహించి మృతుడి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఉదయ్కుమార్ తండ్రి లక్ష్మన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కుటీర పరిశ్రమలకు విద్యుత్ రాయితీ
● విద్యుత్ శాఖ ఏఏఓ ఎస్జే చంద్రబోస్రావు కర్నూలు (అర్బన్) : కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేవారికి 20 కేవీ వరకు విద్యుత్ రాయితీ వర్తిస్తుందని విద్యుత్ శాఖ ఏఏఓ ఎస్జే చంద్రబోస్రావు చెప్పారు. బుధవారం స్థానిక బీసీ భవన్లో అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు దేవపూజ ధనుంజయ ఆచారి అధ్యక్షతన విశ్వ బ్రాహ్మణుల సంక్షేమం–ఆర్థిక పారిశ్రామికాభివృద్ధి అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన ఏఏఓ మల్లికార్జున మాట్లాడుతూ.. విద్యుత్ రాయితీ కోసం యూడీవైఏఎం రిజిస్ట్రేషన్ తప్పక చేసుకోవాలన్నారు. బీసీ కార్పొరేషన్ ఏఈఓ నాగరాజు మాట్లాడుతూ ఆదరణ పథకం ద్వారా కమ్మరి, వడ్రంగి, కంచరం, శిల్పం, స్వర్ణకార వృత్తుల వారికి 90 శాతం సబ్సిడీతో ఆధునిక పనిముట్లు అందించేందుకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. పరిశ్రమల శాఖ అధికారి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పీఎంఈజీపీ, పీఎం విశ్వకర్మ పథకం, రాష్ట్ర ప్రభుత్వ ఎంఎస్ఎంఈ పథకాల ద్వారా వడ్డీ లేని రుణాలు, 35 శాతం సబ్సిడీ, నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. నూతన కమిటీల ఎన్నిక విశ్వకర్మ పరిషత్ కర్నూలు, నంద్యాల జిల్లాలకు నూతన కమిటీలను ఎన్నుకున్నారు. కర్నూలు జిల్లా అధ్యక్షులుగా కమ్మరి తిమ్మయ్య ఆచారి, ప్రధాన కార్యదర్శిగా రమేష్ ఆచారి, కోశాధికారిగా ప్రదీప్ ఆచారి, ఉపాధ్యక్షులుగా వీరన్న ఆచారి, గిడ్డయ్య ఆచారి, కార్యదర్శిగా శ్రీరాం, కార్యనిర్వాహక కార్యదర్శిగా జీకే సతీష్ ఎన్నికయ్యారు. నంద్యాల జిల్లా అధ్యక్షులుగా విరాట్ వీరబ్రహ్మచారి, ప్రధాన కార్యదర్శిగా నాగమహేశ్వరాచారి, కోశాధికారిగా వీర మహేంద్రాచారి, కార్యదర్శిగా చిన్నపుల్లయ్య ఆచారి ఎన్నికయ్యారు. -
హామీల అమలుకు ఉద్యోగుల పోరాటం
● ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ కేవై కృష్ణ కర్నూలు(సెంట్రల్): ఉద్యోగుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం విస్మరిస్తోందని, అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఒక్క హామీని నెరవేర్చలేదని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ కేవై కృష్ణ విమర్శించారు. హామీల అమలు కోసం పోరాటాలకు దిగాలని ఉద్యోగులు నిర్ణయించారని తెలిపారు. ఈ క్రమంలో ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగి మేలుకో–నీ భవిష్యత్ను కాపాడుకో అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. బుధవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో అత్యవసరంగా ఏపీ జేఏసీ అమరావతి సమావేశమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉద్యోగుల సంక్షేమం, భవిష్యత్ భద్రతకు సంబంధించిన ఎనిమిది ప్రధాన డిమాండ్లను అజెండాగా తీసుకుని సమావేశంలో సుధీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. గ్రామ, మండల, తాలూకా, డివిజన్, జిల్లా స్థాయిల్లోని ప్రతి ఉద్యోగి ఏకతాటిపైకి వచ్చి రాష్ట్ర నాయకత్వం చేపట్టే ఉద్యమ కార్యక్రమాలను విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర నాయకత్వం భవిష్యత్లో ఎలాంటి కార్యాచరణకు పిలుపునిచ్చినా కర్నూలు జిల్లాలో విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అనంతరం ఉద్యోగి మేలుకో..నీ భవిష్యత్ను కాపాడుకో పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు లక్ష్మీరాజు, ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, కర్నూలు డివిజన్ అధ్యక్షుడు రామాంజనేయులు, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షుడు వెంకటరాజు, నాయకులు నాగరమణయ్య, శ్రీనివాసులు, సతీష్, సర్దార్, శంకరప్ప, బాను పాల్గొన్నారు. -
అన్యాయం చేయొద్దు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైఎస్సార్ చేయూత పథకాన్ని విజయవంతంగా అమలు చేసింది. ఆదే పథకాన్ని చంద్రబాబు ఆడబిడ్డనిధి పేరుతో అమలు చేసేందుకు 2024 ఎన్నికల సమయంలో నిర్ణయించారు. 18–59 ఏళ్లలోపు మహిళలు ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ నెలకు రూ.1,500 ప్రకారం బ్యాంకు అకౌంటుకు జమ చేస్తామని విస్పష్టంగా హామీ ఇచ్చారు. ఈ నెల 12 నాటికి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి అవుతోంది. ఇంతవరకు ఆడబిడ్డ నిధి అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టకపోవడం అన్యాయం. – పద్మావతి, వెంకటాపురం, డోన్ మండలం -
భారీగా గంజాయి పట్టివేత
● ఏడుగురు అరెస్ట్, ఆటో స్వాధీనం ● పెద్దకొత్తిలి భంభం ఆశ్రమం సమీపంలో గంజాయి సాగు ఎమ్మిగనూరు రూరల్: గంజాయిని గుట్టుగా సాగు చేస్తూ విక్రయించే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వాహనాల తనిఖీలో గంజాయి తరలిస్తున్న నిందితులను పట్టుకోగా ముఠా పట్టుబడింది. నందవరం మండలం పెద్దకొత్తిలి భంభం ఆశ్రమం సమీపంలో గంజాయి సాగును గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితులు, స్వాధీనం చేసుకున్న గంజాయిని రూరల్ పోలీస్స్టేషన్ ఆవరణలో బుధవారం సీఐ చిరంజీవి, నందవరం ఎస్ఐ తిమ్మారెడ్డి మీడియా ఎదుట హాజరుపరిచారు. అనంతరం డీఎస్పీ ముర్రవాడ భార్గవి నిందితుల వివరాలను వివరించారు. కనకవీడు పోలీస్చెక్ పోస్ట్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తున్న రూరల్ సీఐ చిరంజీవి, నందవరం ఎస్ఐ తిమ్మారెడ్డికి ఓ ఆటోపై అనుమానం వచ్చి తనిఖీలు చేయగా 3 కేజీల గంజాయి పట్టుబడింది. ఆటోలో ఉన్న ఎమ్మిగనూరు పట్టణం శాంతినగర్ షేక్షావలి, మైనార్టీ కాలనీ షేక్చాంద్బాషా, కటికె వీధికి చెందిన వడ్డే భీమేష్, మరో బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురు నందవరం మండలం నాగలదిన్నె గ్రామ శివారులోని మిట్టసోమపురం క్రాస్ రోడ్డు సమీపంలో అదే గ్రామానికి చెందిన బెస్త తిప్పన్న దగ్గర గంజాయి కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. అలాగే పెద్దకొత్తిలి గ్రామంలోని భంభం ఆశ్రమం సమీపంలో చాకలి రాముడు, చాకలి నాగార్జున గంజాయి సాగుచేస్తున్నట్లు తెలుసుకున్నారు. వీరిద్దరూ గంజాయిని పండిస్తూ ఆశ్రమం దగ్గర ఆరబెట్టి పొడిచేసి ఎమ్మిగనూరు, ఇతర ప్రాంతాల వారికి విక్రయించి సొమ్ముచేసుకుంటునట్లు వెలుగు చూసింది. వెంటనే ఆశ్రమం దగ్గరకు వెళ్లి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 2.340 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులతో పాటు ఓ మైనర్ను అరెస్ట్ చేసి వారి నుంచి మొత్తం 5.340 కిలోల గంజాయి, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ముఠాను పట్టుకున్న సీఐ, ఎస్ఐ, సిబ్బందిని డీఎప్పీ ముర్రవాడ భార్గవి అభినందించారు. సమావేశంలో రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు, నందవరం పీఎస్ హెచ్సీ కోదండరాముడు, సుభాన్, పీసీలు వీరేష్, భాస్కర్, వెంకటేష్, సుధాకర్, ఏవో సరిత, డిప్యూటీ తహసీల్దార్ మహేష్ తదితరులు ఉన్నారు. గంజాయి మత్తు పదార్థాలకు యువత బానిసలు కావొద్దు. గంజాయి మత్తులో అనేక నేరాలకు పాల్పడే అవకాశం ఉంది. మాదకద్రవ్యాల మత్తులో ఏమి చేస్తున్నారో తెలియని స్థితిలోకి వెళ్తారు. ఇటీవల గంజాయి మత్తు పదార్థాలకు యువత ఎక్కువ మొగ్గుచూపుతూ భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారు. తమ పిల్లల నడవడికను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. – ముర్రవాడ భార్గవి, డీఎస్పీ -
ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి
వెలుగోడు: ట్రాక్టర్ అదుపుతప్పి కాలువలో పడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన బుధవారం వెలుగోడు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వేల్పనూరు గ్రామానికి చెందిన కొల్ల వెంకటేశ్వర్లు (49) తన కొత్త ట్రాక్టర్తో వ్యవసాయ పనుల నిమిత్తం బయలుదేరాడు. లింగాపురం శివ (42) అనే వ్యక్తి ట్రాక్టర్ను నడుపుతున్నాడు. ఒప్పి వాగు సమయంలో ట్రాక్టర్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదంలో వెంకటేశ్వర్లు, శివ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. వెంకటేశ్వర్లకు భార్య పద్మావతి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. శివకు భార్య వెంకటలక్ష్మమ్మ, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. శివ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఘటనపై వెంకటేశ్వర్లు భార్య పద్మావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. -
సాక్షిగణపతికి విశేష పూజలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో లోక కల్యాణార్థమై బుధవారం సాయంత్రం సాక్షిగణపతి స్వామికి అభిషేకం, ఆలయ ప్రాంగణంలోని జ్వాలా వీరభద్రస్వామికి విశేష పూజలు నిర్వహించారు. సాక్షిగణపతి స్వామికి పంచామతాలతోను, ఫలోదకాలతోను, హరిద్రోదకం, గంధోదకం, పుష్పోదకం, కలశోధకం, శుద్ధజలంతో అభిషేకం చేసి విశేషపుష్పార్చన, నివేదన కార్యక్రమాలను చేపట్టారు. అలాగే జ్వాలా వీరభద్రస్వామి వారికి అభిషేకం, విశేషపుష్పార్చన జరిపించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని బైకర్ మృతి ఆత్మకూరురూరల్: ఆత్మకూరు పట్టణ శివారులో ఉన్న 340సీ జాతీయ రహదారి బైపాస్లో సిద్ధపల్లె క్రాసింగ్ వద్ద బుధవారం రాత్రి 10 గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో మోపెడ్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆత్మకూరు పోలీసులు తెలిపిన మేరకు వివరాల మేరకు.. ఆత్మకూరు మండలంలోని బాపనంతాపురానికి చెందిన వెంకటేశ్వర్లు (50) సిద్ధపల్లె గ్రామంలో జరుగుతున్న ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నాడు. తన మోపెడ్ను హైవే నుంచి సిద్ధపల్లె రస్తాకు మరలిస్తున్న సమయంలో వేగంగా వెళ్తున్న గుర్తు తెలియని వాహనమేదో ఢీకొంది. దీంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కర్నూలు వ్యవసాయ మార్కెట్ ధరలు (క్వింటాల్కు రూ.లలో)
వేరుశెనగ 6,755 7,950 ఆముదం 5,940 6,269 ఎండుమిర్చీ 8,699 10,899 శనగలు 3,119 5,601 కందులు 6,870 7,712 మొక్కజొన్న 1,754 1,940 మినుములు 2,500 1,352 కొర్రలు 1,602 1,602ఫోన్ నం : 08518–257204, 257661


