breaking news
Kurnool District Latest News
-
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కల్లూరు: 44వ జాతీయ రహదారి చిన్నటేకూరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామానికి చెందిన వి. రాజు (31 ) దుర్మరణం చెందాడు. ఉలిందకొండ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కల్లూరు మండలం తడకపల్లె గ్రామంలో జరుగుతున్న మొహర్రం 40 రోజుల జార్తాలకు భార్య దుర్గ, మరో ఇద్దరితో కలిసి బైక్పై రాజు గురువారం వెళ్లాడు. మొక్కులు చెల్లించుకొని శుక్రవారం స్వగ్రామానికి బయలుదేరాడు. తడకనపల్లె క్రాస్ రోడ్డులో మోటర్ సైకిల్ ప్రమాదవశాత్తు అదుపు తప్పి రైలింగ్ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న రాజు అక్కడికక్కడే మృతి చెందగా.. మిగతా ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న నేషనల్ హైవే పెట్రోలింగ్ హెడ్ కానిస్టేబుల్ నూర్ అహమ్మద్, పోలీసులు వారిని 108లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రానైట్ దుకాణంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు నందికొట్కూరు: పట్టణ సమీపంలోని మై హోమ్ గ్రానైట్ దుకాణంలోకి శుక్రవారం నందికొట్కూరు డిపోకు చెందిన ఆర్టీసీ బెంగళూరు సర్వీస్ దూసుకెళ్లింది. అయితే, ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి వస్తున్న ఈ బస్సులో డ్రైవర్ కలిముల్లాకు బీపీ డౌన్ అయింది. దీంతో స్టీరింగ్ పట్టు తప్పడంతో బస్సు గ్రానైట్ దుకాణంలోకి వెళ్లి బండలను ఢీకొట్టినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయలు కాలేదని వెల్లడించారు. కాగా బస్సు ఢీకొనంతో సుమారు రూ. 9 లక్షల విలువ చేసే గ్రానైట్ బండలు పగిలిపోయినట్లు గ్రానైట్ యజమాని సద్దాం తెలిపారు. కుక్కల దాడిలో 15 గొర్రె పిల్లలు మృతి కర్నూలు(రూరల్): కుక్కల దాడి లో 15 గొర్రె పిల్లలు మృతి చెందాయి. మండల పరిధిలోని జి.సింగవరం గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన బైరి పెద్ద మద్దిలేటి జీవాలు పెంచుతుంటాడు. శుక్రవారం గ్రామ సమీపాన కేసీ కెనాల్ వంతెన దగ్గర ఉన్న దొడ్డిలో గొర్రె పిల్లలను ఉంచి మందను మేతకు తీసుకెళ్లాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో దాదాపు 6 కుక్కలు దొడ్డిలొకి దూకి గొర్రె పిల్లలపై దాడికి తెగబడ్డా యి. ఈ ఘటనలో 15 పిల్లలు అక్కడికక్కడే మృతి చెందాయి. తర్వాత దొడ్డికి వచ్చి చూడగా గొర్రె పిల్లలు చనిపోయి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ ఘటనతో రూ.90 వేలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. బైక్ అదుపు తప్పి.. ఆళ్లగడ్డ: అహోబిలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంతియాజ్ బాషా (24) అనే యువకుడు శుక్రవారం మృతి చెందాడు. నంద్యాల రూరల్ మండలం కానాల గ్రామానికి చెందిన ఇంతియాస్ బాషా ఓ శుభకార్యానికి అహోబిలం వచ్చాడు. మధ్యాహ్న సమయంలో దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలం వెళ్తుండగా మార్గమధ్యంలో మోటర్ సైకిల్ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టింది. ఈఘటనలో ఇంతియాజ్ బాషా అక్కడికక్కడే మృతి చెందగా బైక్ వెనుక కూర్చున్న వెంకట సునీల్కు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వరప్రసాద్ తెలిపారు. -
మత్స్యకారుల మధ్య కూటమి ప్రభుత్వం చిచ్చు
● వైఎస్సార్సీపీ బెస్త సాధికారిత సమితి రాష్ట్ర అధ్యక్షుడు తెలుగు అనిల్ కుమార్ కర్నూలు(టౌన్): కార్పొరేషన్ పదవుల పేరుతో కూటమి ప్రభుత్వం మత్స్యకార కులాల మధ్య చిచ్చు పెడుతుందని వైఎస్సార్సీపీ బెస్త సాధికారిత సమితి రాష్ట్ర అధ్యక్షుడు తెలుగు అనిల్ కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇటీవల 31 కార్పొరేషన్ పదవులను ప్రకటించిందన్నారు. అయితే, నిజమైన కులాలకు కాకుండా బెస్తయేతర వారికి ఆ పదవులు కట్టబెట్టి చిచ్చురాజేసిందన్నారు. బెస్త సంక్షేమ, అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్గా పట్టపు సామాజిక వర్గానికి చెందిన బొమ్మన శ్రీధర్ను ప్రకటించి నిజమైన బెస్త సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. పట్టపు రాజు లేదా పట్టపు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయ నకు బెస్త కార్పొరేషన్ చైర్మన్గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. సీమలో ఫ్యాక్షన్కు బలి అవుతున్న బెస్తలకు కనీసం కుల కార్పొరేషన్ పదవుల కేటాయింపులో కూడా న్యాయం జరగలేదన్నారు. అలాగే గత జులై నెల 7 వ తేదీ న జీవో 81 ప్రకారం కొల్లు పెద్దిరాజును మత్య్సకార కార్పొరేషన్ చైర్మన్గా ప్రకటించారన్నారు. పదవుల విషయంలోనే కాకుండా మత్స్య కార సమస్యలు పరిష్కారంలోనూ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి బెస్తలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని లేకపోతే భవిష్యత్తులో వారి ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. -
ఇంకా నీటిలోనే నల్ల బంగారం
● నిలచిపోయిన కోత పనులు ● ఆందోళనలో రైతన్నలు దొర్నిపాడు: తొలిపంటగా సాగుచేసిన నల్లబంగారం చేతికిరాని పరిస్థితి నెలకొంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పంట పూర్తిగా దెబ్బతినింది. కేవలం 90 రోజుల్లో చేతికి వస్తుందని రైతులు విస్తారంగా మినుము పంట వేశారు. ఒక్క దొర్నిపాడు మండలంలోనే దాదాపు 700 హెక్టార్లకు పైగా ఈ పంట సాగైంది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. తీరా కోత సమయంలో రైతుల ఆశలపై వర్షం నీళ్లు చల్లింది. గత పది రోజులుగా కురుస్తున్న వానలకు మినుము పంటంతా నీటిలోనే ఉంది. దీంతో కోత పనులు ఎక్కడికక్కడే నిలచిపోయాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కోతమిషన్లు పనులు లేక గ్రామంలో నిలబడిపోయాయి. రోజు ఏదో ఒక సమయంలో వర్షం కురుస్తుండటంతో కోతకు నేల అనుకూలించక రైతులు దిగాలు చెందుతున్నారు. కాసిన అరకొర గింజలు సైత నేల రాలుతున్నాయని వాపోతున్నారు. -
కర్నూలు పటాలంకు రాష్ట్రస్థాయి అవార్డు
కర్నూలు: విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో ఏపీఎస్పీ కర్నూలు రెండో బెటాలియన్కు కవాతు ప్రదర్శనలో (పెరేడ్) రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది. రాష్ట్రస్థాయిలో 8 బెటాలియన్లకు సంబంధించిన సిబ్బంది పరేడ్లో పాల్గొనగా కర్నూలు రెండవ బెటాలియన్కు సంబంధించి ఆర్ఐ అనిల్ కుమార్, ఆర్ఎస్ఐలు సర్దార్, మునాఫ్ల ఆధ్వర్యంలో చక్కటి కవాతు ప్రదర్శన(పెరేడ్) నిర్వహించారు. దీంతో రాష్ట్రస్థాయిలో కంటింజెంట్ అవార్డు లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రెండో బెటాలియన్ సిబ్బంది ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్రస్థాయి పెరేడ్లో చక్కటి నైపుణ్యత ప్రదర్శించి కంటింజెంట్ అవార్డును అందుకున్నందుకు పటాలం సిబ్బందిని కమాండెంట్ దీపిక పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు. రుద్రవరం రేంజర్గా ముర్తుజావలి రుద్రవరం: రుద్రవరం రేంజ్ అధికారిగా ముర్తుజావలి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన 2023లో రుద్రవరం రేంజ్ అహోబిలం సెక్షన్ డీఆర్వోగా విధుల్లో చేరాడు. ఇటీవలె రేంజి అధికారిగా ఉన్న శ్రీపతినాయుడు బదిలీపై వెళ్లడంతో ఇక్కడ ఖాళీ ఏర్పడింది. దీంతో అటవీ శాఖ ఉన్నతాధికారులు డీఆర్వోగా ఉన్న ముర్తుజా వలికి రేంజర్గా పదోన్నతి కల్పించి రుద్రవరానికి నియమించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. -
వేర్వేరు చోట్ల ముగ్గురు బలవన్మరణం
ఓర్వకల్లు/బనగానపల్లె/నందికొట్కూరు: వివిధ కారణాలతో వేర్వేరు చోట్ల ముగ్గురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు రైతు కాగా మరో ఇద్దరు మహిళలు ఉన్నారు. పోలీసులు, స్థానికులు తె లిపిన వివరాల మేరకు.. ఓర్వకల్లు గ్రామం పెండేకంటినగర్లో నివాసముంటున్న సుబ్బరాయుడు కొడు కు భానుప్రకాష్కు, అదే గ్రామానికి చెందిన రెడ్డిపోగు మాదన్న కూతురు భారతి(31)కి మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పాప,బాబు సంతానం. అయితే ఆటో నడిపే భాను ప్రకాష్ మద్యానికి అలవాటుపడి సంపాదనంతా మందుకే ఖర్చు చేసేవాడు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. ఈ క్రమంలోనే ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం మద్యం తాగి ఇంటికి వెళ్లడంతో భార్య భారతి తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లోని ఫ్యాన్కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు తండ్రి మాద న్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సునీల్కుమార్ పేర్కొన్నారు. అప్పులబాధతో.. బనగానపల్లె మండలం నందివర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని కై ప గ్రామానికి చెందిన రైతు వెంకటరమణరెడ్డి(37) అనే వ్యక్తి అప్పుల బాధతో శుక్రవారం ఉదయం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన గతేడాది రెండు ఎకరాల సొంత పొలంతో పాటు మరో 25 ఎకరాలు కౌలుకు తీసుకొని మిరప సాగు చేశాడు. ఇందుకు దాదాపు రూ. 20 లక్షల వరకు ఖర్చు చేశాడు. అయితే, పంట పండక తీవ్రనష్టం వచ్చింది. దీంతో చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈమేరకు మృతుడి భార్య మల్లేశ్వరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటసుబ్బయ్య తెలిపారు. మృతుడికి కుమారుడు, కుమార్తె సంతానం. జీవితంపై విరక్తి చెంది.. మిడుతూరు మండలం అలగనూర్ గ్రామానికి చెందిన షేక్ జుబేదాబేగం (20) అనే యువతి గురువారం రాత్రి బలవన్మరణం చేసుకుంది. అనారోగ్యంతో పాటు, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరి వేసుకుంది. ఈ మేరకు తండ్రి ఉసేన్బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ సుబ్బయ్య తెలిపారు. -
అంగట్లో సెక్యూరిటీ గార్డు పోస్టులు
● పోస్టుకు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు వసూళ్లు ● కర్నూలు పెద్దాసుపత్రిలో దందా కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సెక్యూరిటీ గార్డుల పోస్టుల భర్తీలో అక్రమాలు జరుగుతున్నాయి. కొందరు దళారులు ఒక్కో పోస్టుకు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు ఆశావహుల నుంచి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రిలో సెక్యూరిటీ సేవలను ఈగల్ హంటర్ సొల్యూషన్స్ అనే సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ గత జూన్ 1వ తేదీ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ ద్వారా కర్నూలు మెడికల్ కాలేజీలో 40 మంది, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మంది, ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో 11 మంది, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో 60 మంది సెక్యూరిటీ గార్డులతో సేవలందించేందుకు ఎంఓయూ చేసుకున్నారు. ప్రతి సెక్యూరిటీ గార్డుకు టోకుగా రూ.16 వేలకు పైగా జీతం వస్తుందని అధికారులకు చెప్పారు. ఒక్కో సెక్యూరిటీ గార్డు రోజుకు ఒక షిఫ్ట్ చొప్పున మూడు షిఫ్ట్లలో పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పనిచేస్తున్న వారిని కొనసాగిస్తూనే ఖాళీగా ఉన్న సెక్యూరిటీ గార్డు పోస్టులను భర్తీ చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ పోస్టుకు అభ్యర్థి కనీసం టెన్త్ చదివి ఉండాలని, 45 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలని, శారీరక ధృడత్వం ఉండాలని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో తమకు సబ్లీజుకు ఇవ్వాలని కేడీసీసీ బ్యాంకు చైర్మన్, కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జ్ విష్ణువర్దన్రెడ్డి అనుచరులు, రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అనుచరులుగా చెప్పుకునే కొందరు పంతం పట్టారు. ఈ మేరకు ఈగల్ హంటర్ సంస్థ ప్రతినిధులతో పలుమార్లు ఒత్తిడి తెచ్చి పంతం నెగ్గించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు విష్ణువర్దన్రెడ్డి అనుచరులుగా చెప్పుకునే వారు ఈ సంస్థను సబ్లీజుకు తీసుకున్నట్లు ఆసుపత్రిలో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో వీరు ఖాళీగా ఉన్న సెక్యూరిటీ గార్డు పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే 25 మందికి పైగానే భర్తీ చేశారు. ఇందులో ఒక్కో పోస్టుకు రూ.లక్షకు పైగా చేతుల మారినట్లు చర్చ నడుస్తోంది. కొందరు దళారులు రంగప్రవేశం చేసి మనం చెప్పినట్లే నడుస్తుందని చెప్పి అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో తమకూ పోస్టులు కావాలని మంత్రి టీజీ భరత్ అనుచరులుగా చెప్పుకునే కొందరు వ్యక్తులు మూడు రోజుల క్రితం ఆసుపత్రిలోని సెక్యూరిటీ కార్యాలయం వద్దకు వచ్చి గొడవ చేశారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ ఘర్షణ వాతావరణం ఆసుపత్రిలో ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో ఇంకా ఖాళీగా ఉన్న వందకు పైగా సెక్యూరిటీ గార్డు పోస్టులను ఎలాగైనా దక్కించుకోవాలని ఇరువర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వీరి మధ్యలో దళారులు సైతం చక్రం తిప్పుతున్నారు. తాము చెప్పిన వారికి పోస్టులు ఇవ్వాలని మరోవైపు కొందరు ప్రజాప్రతినిదులు సైతం ఆసుపత్రి అధికారులకు ఫోన్ చేసి చెబుతున్నట్లు సమాచారం. జీతంలోనూ భారీ కోత ఎంఓయూ ప్రకారం ఒక్కో సెక్యూరిటీ గార్డుకు రూ.16 వేలకు పైగా జీతం ఇవ్వాల్సి ఉంది. కానీ ఈ నెలలో సెక్యూరిటీ గార్డులకు రూ.12,100 మాత్రమే ఇచ్చారు. కొత్త ఏజెన్సీ వచ్చినా పాత జీతాలేనా అని సెక్యూరిటీ గార్డులు నిట్టూరుస్తున్నారు. -
వడ్లరామాపురంలో నేడు చిన్నన్న అంత్యక్రియలు
ఆత్మకూరురూరల్: మహారాష్ట్ర – ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల సరిహద్దులో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు సుగులూరు చిన్నన్న అలియాస్ విజయ్, అలియాస్ భవనాశి శంక ర్ అంత్యక్రియలు శనివారం ఆయ న స్వగ్రామం వడ్లరామాపురంలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు శుక్రవారం తెలిపారు. మహారాష్ట్ర రాజ్నంద్ గావ్ జిల్లాలోని మొహాలా ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నన్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మహారాష్ట్ర పోలీసులు మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు. శనివారం తెల్లవారే సరికి చిన్నన్న మృతదేహం గ్రామానికి చేరుకోవచ్చని భావిస్తున్నారు. 30 ఏళ్లుగా అజ్ఞాత జీవితంలో ఉన్న వ్యక్తి విగతజీవిగా గ్రామానికి చేరుకోనుండడంతో గ్రామస్తులు ఆఖరి చూపు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. -
మహానుభావుల త్యాగఫలమే స్వాతంత్య్రం
కర్నూలు(టౌన్): ఎందరో మహానుభావుల త్యాగఫలమే స్వాతంత్య్రం అని, ప్రతి ఒక్కరూ వారిని స్మరించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి అన్నారు. స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లోని వైఎస్సార్సీపీ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, నగర మేయర్ బీవై రామయ్య, మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయమనోహరి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేశారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. పాలనను గ్రామస్థాయికి చేర్చి ప్రజలకు ఎంతో మేలు చేశారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
స్వాగతం
కర్నూలు(సెంట్రల్): ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎన్.హరినాథ్ కర్నూలుకు వచ్చారు. ఆయనను రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో కలెక్టర్ పి.రంజిత్బాషా కలసి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా పరిస్థితులపై చర్చించుకున్నారు. మిత్రుల మానవత్వంకర్నూలు(అగ్రికల్చర్): 2022 సంవత్సరం డిసెంబర్ 2న క్యాన్సర్తో మరణించిన మిత్రుడి కుటుంబం పట్ల చిన్ననాటి స్నేహితులు మానవత్వం చూపారు. కర్నూలు మండ లం చిన్నబాపురం గ్రామానికి చెందిన రామకృష్ణ 2002–03లో బ్రాహ్మణకొట్కూరులో 10వ తరగతి చదివారు. ఈయన మొబైల్ షాపులో మెకానిక్గా పనిచేస్తూ క్యాన్సర్ బారిన పడి మరణించారు. భార్య, ముగ్గురు కూతుళ్లు సంతానం. మరణించిన మిత్రుడి కుటుంబానికి 10వ తరగతి బ్యాచ్ స్నేహితులు చందాల ద్వారా రూ.54 వేలు పోగుచేశారు. ఈ మొత్తాన్ని కర్నూలులోని కింగ్మార్కెట్ సమీపంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు శాఖలో మరణించిన రామకృష్ణ భార్య పేరిట డిపాజిట్ చేశారు. శుక్రవారం మిత్ర బృందం చిన్నబాపురం గ్రామానికి వెళ్లి తమ స్నేహితుని పిల్లలకు బట్టలు అందచేశారు. మిత్రుడి పట్ల మానవత్వం చూపడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. బానకచర్ల నుంచి 26 వేల క్యూసెక్కులు విడుదల పాములపాడు: బానకచెర్ల క్రాస్ రెగ్యులేటరు నుంచి శుక్రవారం 26,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ దేవేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు నుంచి ఎస్ఆర్ఎంసీ ద్వారా 26,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉందన్నారు. తెలుగుగంగ(వీబీఆర్)కు 11,000, జీఎన్ఎస్ఎస్కు 12,000, కేసీసీ ఎస్కేప్ చానల్కు 3,000 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నట్లు వివరించారు. మహానందిలో మహాలక్ష్మీ హోమాలు మహానంది: శ్రావణమాసం మూడవ శుక్రవారం పురస్కరించుకుని మహానంది క్షేత్రంలో మహాలక్ష్మి హోమాలు నిర్వహించారు. ఆలయ వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని ఆధ్వర్యంలో పండితులు, అర్చకులు స్థానిక యాగశాలలో మహాలక్ష్మీ హోమాలు నిర్వహించారు. పలు ప్రాంతాల భక్తులు ఆర్జిత సేవా టికెట్ల ద్వారా హోమంలో పాల్గొన్నారు. హోమాల అనంతరం భక్తులకు శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వారి ప్రసాదా లు అందించారు. శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి నెమలి పింఛములతో అలంకరణ చేశారు. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పండితులు, అర్చకులు అమ్మవారికి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. మహానందీశ్వరస్వామి దర్శనానికి వచ్చిన భక్తులు అమ్మవారి అలంకరణ చూసి మంత్రముగ్ధుల య్యారు. శ్రావణమాసం సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వేలాది సంఖ్యలో ఆలయానికి వచ్చారు. స్వామి అమ్మ వార్లను దర్శించుకుని పూజలు చేపట్టారు. స్థానిక కల్యాణ మండపంలో స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. రాత్రి యాగశాలలో మహానందీశ్వరుని దంపతులకు ఏకాంత సేవ పూజలతో దర్శనం సేవలు ముగిశాయి. -
చోరీకి పాల్పడిన కేర్ టేకర్ అరెస్ట్
● రూ. 6.90 లక్షల విలువ చేసే ఆభరణాలు స్వాఽధీనంఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని గాంధీనగర్లో ఓ వ్యక్తి ఇంట్లో కేర్ టేకర్గా ఉంటూ చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు రూ. 6.90 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాఽధీనం చేసుకున్నారు. గురువారం పట్టణ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ శ్రీనివాసులు కేసు వివరాలను వెల్లడించారు. గాంధీనగర్కు చెందిన కుమారస్వామి అనే వ్యక్తి తండ్రి ధనుంజయుడు రిటైర్డ్ ఉద్యోగి. కుమారస్వామి ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ తండ్రికి కొంత దూరంగా నివాసముంటున్నాడు. తండ్రి బాగోగులు చూసుకోవటానికి హైదరాబాద్లోని ఓ సంస్థ నుంచి అనంతపురం టౌన్కు చెందిన నిమ్మగంటి చరణ్సాయి అనే వ్యక్తిని ఈ ఏడాది జూన్ నెలలో కేర్ టేకర్గా నియమించుకున్నాడు. అయితే ఇంట్లో నగలు భద్ర పరిచిన చోటును పసిగట్టిన చరణ్సాయి పనిలో చేరిన 15 రోజుల్లోనే ఇంటికి కన్నం వేశాడు. అల్మారా తాళం పగలగొట్టి అందులో ఉన్న నాలుగు బంగారు గాజులు, రెండు పొరల బంగారు చైన్, రెండు ఉంగరాలు, జత కమ్మలతో పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసు లు కేసు నమోదు చేశారు. డీఎస్పీ ఎంఎన్ భార్గవి ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాసులు, ఎస్ఐలు మధుసూదన్రెడ్డి, శ్రీనివాసులు, హెచ్సీ మద్దిలేటి, క్రైం పార్టీ పోలీసులు ఉసేని, రఘునాథ్, సుధాకర్, గోపాల్ బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడి చరణ్ సాయిని అనంతపురం టౌన్ తన ఇంటి సమీపంలోని అన్న క్యాంటీన్ దగ్గర ఉండగా అరెస్ట్ చేశారు. కాగా దొంగలించిన బంగారు ఆభరణాలను ఒక గోల్డ్ ఫైనాన్స్లో తనఖా పెట్టి లోన్ తీసుకున్నాడు. దీంతో ఆ సంస్థకు నోటీసు జారీ చేసి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను బాధితులకు అప్పగించినట్లు తెలిపారు. కేసును త్వరగా ఛేదించినందుకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ టౌన్ సీఐ, ఎస్ఐలు, సిబ్బందిని అభినందించారు. ప్రజలు తమ ఇళ్లలో కొత్తవారిని పనిలో తీసుకోవాల్సి వస్తే పూర్తిగా విచారించాలన్నారు. ప్రజలు బంగారు ఆభరణాలను బ్యాంక్ లాకర్లో భద్రపరుచుకోవాలన్నారు. సమావేశంలో టౌన్ ఎస్ఐ–2 శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. -
దేశభక్తి ప్రతిబింబించేలా..
జెండా పండుగకు పిల్లలూ.. పెద్దలూ ఉత్సాహంగా.. ఉల్లాసంగా సన్నద్ధమ వుతున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దేశభక్తి, జాతీయ భావం ఉట్టిపడేలా ఏర్పాట్లలో అందరూ నిమగ్నమ య్యారు. ఓ వైపు జెండా ప్రదర్శనలు, మరో వైపు మూడు రంగుల జెండాలు, ఆకట్టుకునే అలంకరణ సామగ్రి తదితర వస్తువుల అమ్మకాలతో కర్నూలు నగరంలో సందడి నెలకొంది. – సాక్షిఫొటోగ్రాఫర్, కర్నూలుజాతీయ పతకాలు, అలంకరణ సామగ్రి కొనుగోలు చేస్తున్న దృశ్యందుకాణం వద్ద త్రివర్ణ రంగుల వస్తువుల అమ్మకాలుకలెక్టరేట్ వద్ద మాంటిస్సోరి విద్యార్థుల ప్రదర్శన -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
కర్నూలు: నగరంలోని కృష్ణానగర్లో నివాసముంటున్న ఇ.విశ్వనాథ్ గౌడ్ (35) అనుమానాస్పద స్థితి లో మృతి చెందాడు. బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన విశ్వనాథ్ గౌడ్ ఉపాధి నిమిత్తం కొన్నేళ్ల క్రితం కర్నూలుకు చేరుకున్నాడు. ఓ ప్రైవేటు సంస్థలో డీటీపీ ఆపరేటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ నెల 11వ తేదీన దుకాణానికి వెళ్తున్నట్లు చెప్పి తిరిగి ఇంటికి రాలేదు. 12వ తేదీ తన భర్త కనిపించడం లేదని భార్య నాగమణి నాల్గవ పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా గురువారం ఉదయం కోడుమూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాపురం గ్రామం వద్ద హంద్రీనీవా కాలువలో శవమై తేలాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమివ్వడంతో కోడుమూరు పోలీసులు అక్కడికి చేరుకుని నీళ్లలో తేలియాడుతున్న మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి జేబులో ఉన్న పర్సులో ఆధార్ కార్డు లభించంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అప్పటికే నాల్గవ పట్టణ పోలీస్స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదై ఉండటంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈయనకు కొడుకు, కూతురు సంతానం. భార్య నాగమణి ఫిర్యాదు మేరకు నాల్గవ పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టగా సఫా ఇంజినీరింగ్ కళాశాల వద్ద హెచ్ఎన్ఎస్ఎస్ కాల్వ గట్టుపై విశ్వనాథ్ గౌడ్ ద్విచక్ర వాహనం లభించింది. దీంతో ప్రమాదవశాత్తూ నీటిలో పడి చనిపోయాడా.. లేక ఎవరైనా హత్య చేసి పడేశారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్సీ, ఎస్టీ మెరిట్ విద్యార్థినులకు కెనరా విద్యా జ్యోతి
కర్నూలు(అర్బన్): కెనరా విద్యా జ్యోతి పథకం పేరుతో ప్రతి ఏడాది 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ మెరిట్ విద్యార్థినులను ఎంపిక చేసి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు కెనరా బ్యాంకు కర్నూలు రీజినల్ మేనేజర్ సుశాంత్కుమార్ తెలిపారు. గురువారం స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ బ్రాంచ్లో విద్యాజ్యోతి పథకం కింద ఎంపికై న విద్యార్థినులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని కెనరా బ్యాంకు శాఖల ద్వారా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాలికల విద్యాభివృద్ది దేశ ప్రాధాన్యత అయితే ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కెనరా బ్యాంకు కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే తులసీదేవి మాట్లాడుతూ.. కెనరా విద్యాజ్యోతి పథకం ద్వారా విద్యార్థినులను విద్యాపరంగా మరింత ప్రోత్సహించడంతో పాటు అమ్మాయిల భవిష్యత్తు నిర్మాణానికి తోడ్పడుతుందన్నారు. గతంలో పేద ప్రతిభావంతురాలైన ఎస్సీ విద్యార్థినికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక లాప్టాప్ను కూడా కెనరా బ్యాంకు అందించిందన్నారు. కార్యక్రమంలో డివిజినల్ మేనేజర్ సురేష్కుమార్, బ్రాంచ్ మేనేజర్ శంకర్, చైతన్య శివరాజ్ పాల్గొన్నారు. -
ముగిసిన సప్తరాత్రోత్సవాలు
మంత్రాలయం: సద్గురు రాఘవేంద్రస్వామి 354వ ఆరాధన సప్తరాత్రోత్సవాలు గురువారంతో ముగిశాయి. వేడుకల్లో భాగంగా శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో చివరిరోజు సంబరాలు కనుల పండువగా జరిగాయి. ఉదయం మండలంలోని అను మంత్రాలయం (తుంగభద్ర)లోని మఠంలో రాఘవేంద్రస్వామి రథోత్సవం చేపట్టారు. ముందుగా ఉత్సమూర్తి ప్రహ్లాదరాయలకు చామర్ల సేవతో హారతులు పట్టారు. అనంతరం రథంపై కొలువుంచి గ్రామ పుర వీధుల్లో వైభవంగా ఊరేగించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి ఆరాధన ఉత్సవాల విశిష్టతను భక్తులకు వివరించారు. రాత్రి శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో ఉత్సవమూర్తికి పంచ వాహనాలతో రథయాత్ర చేపట్టారు. ఈ వేడుకలు ఏడు రోజుల పాటు భక్తులను ఆధ్యాత్మిక చింతనలో ముంచెత్తాయి. -
వేడుకలకు ముస్తాబైన పోలీసు పరేడ్ మైదానం
కర్నూలు/కర్నూలు(సెంట్రల్): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు నగరంలోని పోలీస్ పరేడ్ మైదానం ముస్తాబైంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మైదానమంతా చిత్తడిగా మారింది. శుక్రవారం కూడా వర్షం కొనసాగితే అధికారులకు ఇబ్బంది లేకుండా రెయిన్ప్రూఫ్ షామియానాలు ఏర్పాటు చేశారు. కొండారెడ్డి బురుజు విద్యుద్దీపకాంతుల నడుమ వెలిగిపోతోంది. ఉదయం 9.05 గంటలకు మంత్రి టీజీ భరత్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఇతర అధికారులు పాల్గొంటారు. పరేడ్ మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల రిహార్సల్స్ను గురువారం ఉదయం ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వేడుకల నేపథ్యంలో నగరంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇకపోతే వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రదర్శనకు శకటాలు ముస్తాబవుతుండగా.. పలు స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన సుమారు 400 మంది ఉద్యోగులు ప్రశంసా పత్రాలు అందుకోనున్నారు. -
ప్రజాస్వామ్యంలో పులివెందుల ఎన్నికలు అపహాస్యం
కర్నూలు (టౌన్): బూత్లను ఆక్రమించి, దాడులకు తెగబడి, దౌర్జన్యాలు చేసి, అక్రమ కేసులు నమోదు చేసి, గృహనిర్బంధాలకు పాల్పడి పులివెందులలో ఎన్నికలు నిర్వహించి రాష్ట్రప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లో గురువారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పులివెందులలో ప్రజలు తమ ఓట్లు తాము వేసుకుంటామని పోలీసుల కాళ్లు పట్టుకున్నా కనికరించలేదన్నారు. ఓటర్లను భయాభ్రాంతులకు గురిచేసిన టీడీపీ గుండాలు బూ త్లను ఆక్రమించుకొని రిగ్గింగ్కు పాల్పడ్డారన్నారు. అన్ని పత్రికలు, టీవీ చానళ్లలో, సోషల్ మీడియాలో టీడీపీ ఆగడాలు స్పష్టంగా కనిపించాయన్నారు. అంతటా టీడీపీ గూండాల దౌర్జన్యం వైఎస్సార్ జిల్లాకు సంబంధం లేని మంత్రి పులివెందుల బూత్లలో ఏం పని అని ఎస్వీ మోహన్రెడ్డి ప్రశ్నించారు. దగ్గరుండి స్లిప్పులు లాక్కొని టీడీపీకి ఓట్లు వేయించారని ఆరోపించారు. మంత్రి సమక్షంలోనే వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్ను బట్టలు చించి దాడులకు తెగబడలేదా అని ప్రశ్నించారు. ఓటు ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డిని ఉదయం 5 గంటలకే పోలీసులు అరెస్టు చేశారన్నారు. పులివెందులలో టీడీపీకి 6 వేలకు పైగా ఓట్లు, వైసీపీకి 600 ఓట్లు రావడం వింతగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులను ఓట్లు వేయకుండా టీడీపీ గూండాలు కట్టెలు పట్టుకొని కాపాలా కాయలేదా అని ప్రశ్నించారు. అసలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగలేదన్నారు. దౌర్జన్యాలకు పాల్పడిన టీడీపీ గుండాలు పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచినట్లు సంకలు గుద్దుకోవడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం అరాచాకాలకు, దౌర్జన్యాలకు పాల్పడిందన్న విషయం ప్రజలందరికీ అర్థమైందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో భయానక వాతావరణం రాష్ట్రంలోనే పోలీసు వ్యవస్థ చచ్చిపోయిందని రెండు నిముషాలు సమావేశంలో మౌనం పాటించారు. ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటున్న పోలీసులు ప్రజలకు భరోసాగా ఉండాలింది పోయి లా అండ్ ఆర్డర్ను మరచిపోయి కూటమి ప్రభుత్వానికి ఏకపక్షంగా వ్యవహరించారని ఎస్వీ మోహన్రెడ్డి ఆరోపించారు. ప్రజలను చంపేందుకేనా డీఎస్పీకి తుపాకీ ఇచ్చిందని ప్రశ్నించారు. కాల్చేస్తానని డీఎస్పీ స్థాయి అధికారి బెదిరించడం పోలీసు ప్రతిష్టకే మచ్చ అన్నారు. కురు క్షేత్ర యుద్దంలో శిఖండిలను అడ్డు పెట్టుకొని గెలవడం సిగ్గుచేటైన విషయమన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో భయానక వాతవరణంలో ఎన్నికల నిర్వహించడం కన్నా .. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడిగి ఉంటే రెండు జెడ్పీటీసీలను ఇచ్చే వాడు కదా అన్నారు. స్వతంత్ర సంస్థ ఎన్నికల కమిషన్కు అరాచాకాలను, దాడులను ఫొటోలు, వీడియోలతో సహా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకపొవడం దారుణమన్నారు. సుమోటోగా తీసుకుని ఎన్నికలు రద్దు చేయాలి కూటమి ప్రభుత్వ ఆగడాలను కోర్టులు సుమోటోగా తీసుకుని పులివెందుల ఎన్నికలను రద్దు చేయాలని కోడుమూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ ఆదిమూలపు సతీష్ డిమాండ్ చేశారు. ఓటుకు నోటు, ఈవీఎంల టాంపరింగ్లో టీడీపీ అధినేత సిద్ధహస్తుడని ఆరోపించారు. అదే తరహాలోనే పులివెందుల ఎన్నికల్లో అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడి గెలిచారన్నారు. పులివెందులలో రాక్షస కాండను ప్రజలు గమనించారన్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, కార్పొరేటర్లు కృష్ణకాంత్ రెడ్డి, విక్రమసింహారెడ్డి, షాషావలీ, పార్టీ నాయకులు కిషన్, రైల్వే ప్రసాద్, ఫిరోజ్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ చచ్చిపోయింది! మంత్రి సమక్షంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లపై దాడులు చేశారు కోర్టులు సుమోటోగా తీసుకుని ఎన్నికలను రద్దు చేయాలి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్ రెడ్డి -
కూటమి ప్రభుత్వం మోసం చేసింది
దివ్యాంగులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని తుంగలో తొక్కింది. వెరిఫికేషన్ పేరిట వికలత్వం శాతం తగ్గించింది. పింఛన్ల రద్దుకు కుట్ర పన్నింది. వంద నుంచి 80 శాతం వికలత్వం సర్టిపికెట్ ఉన్న వారికి నెలకు రూ.15 వేల పింఛన్ ఇస్తున్నారు. ఇప్పుడు వికలత్వం 60 నుంచి 70 శాతానికి కుదించి రూ. 6 వేల పింఛన్ ఇవ్వడానికి కుట్ర చేశారు. గతంలో డాక్టర్లు శాశ్వత సర్థిఫికెట్లు జారీ చేశారు. అప్పుడు ఇచ్చిన డాక్టర్, ఇప్పుడు ఇచిన డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్కు తేడా ఏమిటో ప్రభుత్వమే చెప్పాలి. దివ్యాంగులకు న్యాయం చేయాలి. లేదంటే ఉద్యమం చేస్తాం. – మరియదాసు, దివ్యాంగుల ఆదరణ సేవా సమితి అధ్యక్షుడు -
స్కూటీని ఢీకొన్న కారు
● దంపతులు, బాలుడికి తీవ్ర గాయాలు ఎమ్మిగనూరురూరల్: ఆదోని – కర్నూలు రహదారిలో బనవాసి జవహార్ నవోదయ విద్యాలయం సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడితో పాటు దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. గోనెగండ్ల మండలం హెచ్.కై రవాడికి చెందిన గంగన్న, భార్య భాగ్యలక్ష్మీ కుమారుడు ఉపేంద్రలు ఉదయం స్కూటీపై దేవబెట్ట గ్రామానికి కొత్త బట్టలు పెట్టుకునేందుకు బంధువుల ఇంటికి వెళ్లారు. బట్టలు పెట్టుకొని సాయంత్రం తిరిగి స్వగ్రామానికి స్కూటీపై వస్తున్నారు. కర్నూలుకు చెందిన దినేష్రెడ్డికి కొత్తగా పెళ్లి అయ్యింది. భార్య ఆదోనిలో ఉపాధ్యాయురాలు పని చేస్తోంది. ఆ స్కూల్లో సెలవు పెట్టి తిరిగి కర్నూలుకు బయలు దేరారు. బనవాసి నవోదయ దగ్గర ముందు వెళ్తున్న స్కూటీని వెనక నుంచి అతి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో బైక్పై ఉన్న గంగన్న, భాగ్యలక్ష్మీ, బాలుడు ఉపేంద్రలు ఎగిరి పక్కనే కాలువలో పడిపోయారు. ప్రమాదానికి గురైన కారు రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. అదృష్ణవశాత్తు విద్యుత్ స్తంబం విరిగి కింద పడకపోవటంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ప్రమాదంలో దంపతులతో పాటు కుమారుడికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం 108లో ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కేసు నమోదు చేసుకున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
ఉప్పలపాడులో యువకుడి ఆత్మహత్య
ఓర్వకల్లు: ఉప్పలపాడు గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని గ్రామానికి చెందిన శ్రీనివాసులు భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. కాగా మొదటి భార్య కూతురు నందిని బేతంచెర్ల నుంచి వచ్చి ఉప్పలపాడులో నివాసముంటున్న తలారి సునీల్కుమార్ (21)తో ఏడాది క్రితం ప్రేమించి పెళ్లిచేసుకోంది. సునీల్ కొంతకాలంగా జులాయిగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో అతని భార్య నందిని కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. అయితే మూడు రోజుల క్రితం సునీల్ భార్య వద్దకు వెళ్లగా మామ, అల్లుడి మధ్య ఘర్షణ జరిగి శ్రీనివాసులు అల్లుడిపై దాడికి పాల్పడినట్లు తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన సునీల్ గురువారం తన సొంతింటిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తల్లి మహాలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సునీల్ కుమార్ తెలిపారు. -
నాల్గోసారి ఉత్తమ స్కూల్గా..
కర్నూలు సిటీ: నగరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్ రాష్ట్రస్థాయిలో ఉత్తమ స్కూల్కు ఎంపికై ంది. విజయవాడలో శుక్రవారం సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డును ప్రధానోపాధ్యాయుడు కె.శివప్రసాద్ అందుకోనున్నారు. ఈ పాఠశాల 2018లో అడ్వాన్స్ ఫౌండేషన్ స్కూల్గా ఎంపికై ంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో (2020లో) భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజీ అబ్దుల్ కలాం పేరుతో స్కూల్ ఏర్పాటుకు కర్నూలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ఈ తీర్మానం మేరకు 6 నుంచి 10వ తరగతి వరకు తరగతికి 60 సీట్ల చొప్పున అనుమతులు ఇస్తూ 2021 మార్చి 10న విద్యావాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ జీఓ ఎం.ఎస్ నంబరు 20ని జారీ చేశారు. ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లు భర్తీ చేస్తున్నారు. తొలుత 2021–22లో , తర్వాత 2022–23లో, 2023–24లో పదో తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణులు అయ్యారు. 2024–25 విద్యా సంవత్సరంలో 43 మంది పరీక్షలు రాస్తే 43 మంది పాసయ్యారు. ఈ స్కూల్కి చెందిన టి.సాయి లఖిత 595 మార్కులు సాధించింది. దీంతో వరుసగా నాల్గోసారి రాష్ట్ర స్ధాయిలో ఉత్తమ స్కూల్గా ఎంపికై ంది. ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు వెల్దుర్తి: పట్టణంలోని ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ పవన్కిశోర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడుల్లో భాగంగా ముందుగా విజిలెన్స్ సిబ్బంది రైతుల రూపంలో అన్ని దుకాణాలకు వెళ్లి ధరలను విచారించారు. ఇందులో నాలుగు దుకాణాల్లో అధిక ధరలకు అమ్ముతున్నట్లు తెలుసుకున్నారు. ఆయా దుకాణాలపై వెంటనే విజిలెన్స్ సీఐ, ఆ శాఖ ఏఓ విశ్వనాథ్, స్థానిక ఏఓ అక్బర్ బాషా దాడులు చేసి ముందుగా లైసెన్స్, రికార్డులు, స్టాకు పరిశీలించారు. ఎంఆర్పీ కంటే ఎక్కువగా అమ్ముతున్నారని గుర్తించి నాలుగు దుకాణాలలోని 390 బస్తాల రూ.3,74,407ల విలువైన ఎరువుల అమ్మకాల నిలిపివేస్తూ, నిత్యావసరాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఏఓ తెలిపారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల తగ్గింపు జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి నీటి విడుదలను 32 వేల నుంచి 22 వేల క్యూసెక్కులకు తగ్గించినట్లు ఏఈ విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. ఐదు రోజుల నుంచి నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో దిగువప్రాంతాల్లోని కాల్వలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా నీటి విడుదలను తగ్గించామన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ గేట్లను కిందికి దించి 22 వేల క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ నీటిని తెలుగుగంగ క్వాకు 8వేల క్యూసెక్కులు, ఎస్సార్బీసీ నుంచి జీఎన్ఎస్ఎస్కి 9వేలు, కేసీ ఎస్కేప్ కాల్వకు 5వేల క్యూసెక్కులు సరఫరా చేస్తున్నట్లు బానకచర్ల ఏఈ దేవేంద్ర తెలిపారు. -
రంగంలోకి అమాత్యుడు.. దోచేస్తున్న స్నేహితుడు!
‘క్లాస్మేట్ల’ బియ్యం దందా! ● వ్యాపారులు, రేషన్ డీలర్లతో సమావేశం ● తన స్నేహితునికే విక్రయించాలని హుకుం ● కొందరు నిరాకరించడంతో విజిలెన్స్ దాడులు ● ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా పేదల బియ్యం స్నేహితునికే అమ్మకం ● కర్నూలులో రెండు గోదాములు ● రాత్రిళ్లు సరిహద్దులు దాటిస్తున్న వైనం కర్నూలు(సెంట్రల్): పేదల అవసరాలను ఆసరాగా చేసుకొని అక్రమార్కులు యథేచ్ఛగా తక్కువ ధరతో బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఓ అమాత్యుడు నేరుగా తన స్నేహితుడితో(క్లాస్మేట్తో) అక్రమ బియ్యం వ్యాపారం చేయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అధికార యంత్రాంగం అటువైపు చూడడం లేదని, కనీసం తనిఖీలు చేయడం లేదని తెలుస్తోంది. ఫలితంగా అక్రమ బియ్యం జిల్లా సరిహద్దులు దాటిపోతోంది. జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ నేతల అండతో కొందరు వ్యాపారులు అక్రమ బియ్యం వ్యాపారాన్ని చేసేవారు. పేదల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని యథేచ్ఛగా జిల్లా దాటించేవారు. అయితే పరిస్థితి మారిపోయింది. తన స్నేహితుడి కోసం ఓ అమాత్యుడు రంగంలో దిగాడు. ఆయనే నేరుగా జిల్లాలో అక్రమ బియ్యం వ్యాపారం చేసే వ్యాపారులు, రేషన్ డీలర్లు, ఇతరులను పిలిపించి మాట్లాడి.. తన స్నేహితుడు, టీడీపీ నాయకుడైన ‘ఖాన్’కు అమ్మాలని సూచించాడు. ఇందుకు ఒప్పుకోకపోతే ఎవరూ వ్యాపారం చేసుకోలేరని భయపెట్టాడు. అయితే కొందరు ఒప్పుకోకపోతే విజిలెన్స్ దాడులు చేయించి వారిపై కేసులు నమోదు చేయించినట్లు సమాచారం. అంతేకాక వారి వ్యాపారంపై నిఘా ఉంచి ఇబ్బందులకు గురి చేసినట్లు తెలుస్తోంది. చివరకు అక్రమ బియ్యం వ్యాపారం చేసే వారంతా అమాత్యుడి స్నేహితుని కింద వ్యాపారం చేసేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం జిల్లా మొత్తం అమాత్యుడి క్లాస్మేట్ కనుసన్నల్లోనే అక్రమ బియ్యం వ్యాపారం కొనసాగుతోంది. ప్రతి నెలా సమీక్ష అక్రమ బియ్యం వ్యాపారంపై ప్రతి నెలా సదరు అమాత్యుడు సమీక్ష చేస్తున్నట్లు సమాచారం. జిల్లా మొత్తానికి తన స్నేహితుడే వ్యాపారం చూసుకుంటున్నా వచ్చే లాభాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలులో రెండుచోట్ల అక్రమ బియ్యానికి సంబంధించి గోదాములు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అక్కడి నుంచి నేరుగా రాత్రిళ్లు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు తరలిపోతోంది. నిద్దరోతున్న నిఘా పేదల బియ్యాన్ని అమ్మడానికి వీలు లేదు. కొనుగోలు చేయడానికి ఎవరూ సాహసించకూడదు. అయినా అమ్మేవాళ్లు అమ్ముతున్నారు.. కొనుగోలు చేసేవాళ్లు చేస్తూ వ్యాపారం సాగిస్తున్నా పౌర సరఫరాల అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే పోలీసులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. విజిలెన్స్ నిఘా ఉన్నా అమాత్యుడు, అతని స్నేహితుడు రంగంలో ఉండడంతో వారు కూడా అటువైపు చూడడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో జిల్లాలో అక్రమ బియ్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎన్ని నిబంధనలు ఉన్నా పేదల బియ్యం మాత్రం జిల్లా సరిహద్దులు దాటిపోతోంది.ఇదీ దోపిడీ..కర్నూలు జిల్లాలో 6,52,452 రేషన్ కార్డులు ఉన్నాయి. ఆయా కార్డుల్లో దాదాపు 12 లక్షల మంది కార్డుదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం 12 వేల టన్నుల బియ్యం కేటాయిస్తోంది. ఇంటి ఖర్చులు ఎక్కువ కావడంతో కొన్ని సందర్భాల్లా పేదలు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వ్యాపారులు దీన్నే ఆసరగా చేసుకొని ‘ ప్రభుత్వం ఇచ్చే బియ్యం ఏమీ బాగుండవని.. తమకు అమ్మాలి’ అని ఒత్తిడి చేస్తారు. బహిరంగ మార్కెట్లో రేషన్ బియ్యానికి బాగానే ధర ఉండగా వీరు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. కేజీ రూ.10 ప్రకారం కొనుగోలు చేసి ఆ బియ్యాన్ని అమాత్యుడి క్లాస్మేట్కు కేజీ రూ.13 ప్రకారం అమ్ముతున్నాడు. పేదల బియ్యాన్ని జిల్లా సరిహద్దులు దాటించి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. -
బాల్య వివాహాలతో అనేక అనర్థాలు
కర్నూలు(అర్బన్): బాల్య వివాహాలతో అనేక అనర్థాలు ఉన్నాయని, వాటిని తల్లిదండ్రులకు వివరించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బీ లీలా వెంకట శేషాద్రి కోరారు. రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ కబర్థి సూచనల మేరకు స్థానిక న్యాయ సేవాసదన్లో బుధవారం జిల్లాలోని ప్రభుత్వ లైన్ డిపార్టుమెంట్లకు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో చిన్నతనంలోనే ప్రెగ్నెన్సీ, ఎస్సీ, ఎస్టీ, పౌర హక్కుల రక్షణ తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన హక్కుల రక్షణ, అమలు పథకం 2015, ఆదివాసీలు, సంచార తెగలకు న్యాయం పొందే అవకాశాన్ని బలోపేతం చేసే పథకం 2025పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డా.శాంతికళ, ఆర్ వెంకటరమణ, ఐసీడీఎస్ పీడీ పీ విజయ, డీసీపీఓ శారద, జిల్లా సాంఘీక సంక్షేమం, సాధికారత అధికారిణి బీ రాధిక, నంద్యాల ఏటీడబ్ల్యూఓ హుసేనయ్య, నంద్యాల జిల్లా సీఐ పీ గౌతమి, రెండు జిల్లాలకు చెందిన రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బీ లీలా వెంకట శేషాద్రి -
నీట మునిగిన ఆశలు
పంటలకు అధిక వర్షాల గండం ● దాదాపు 2వేల హెక్టార్లలో పత్తి పంటకు నష్టం ● దెబ్బతింటున్న కంది, ఉల్లి, వేరుశనగ, సజ్జ పంటలు మండలం వర్షపాతం(మి.మీ) కర్నూలు అర్బన్ 41.4 కర్నూలు రూరల్ 39.2 కల్లూరు 36.2 చిప్పగిరి 28.4 హాలహర్వి 11.4కర్నూలు(అగ్రికల్చర్): కొద్ది రోజులుగా కురుస్తున్న అధిక వర్షాలతో రైతుల ఆశలు నీరుగారుతున్నాయి. రెండు, మూడు రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం వరకు 21 మండలాల్లో వర్షపాతం నమోదైంది. వర్షాలు అతివృష్టిగా మారడంతో పత్తి, ఉల్లి, మొక్కజొన్న, కంది, టమాట రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పంటలు నీట మునిగి కుళ్లిపోతుండటంతో కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 116.2 మి.మీ ఉండగా.. ఇప్పటి వరకు 132 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ కారణంగా ఆదోని, తుగ్గలి, ఆస్పరి, ఆలూరు, పెద్దకడుబూరు, కర్నూలు రూరల్ తదితర మండలాల్లో వేలాది హెక్టార్లలో పత్తి, కంది, ఉల్లి, వేరుశనగ, సజ్జ తదితర పంటలు దెబ్బతిన్నాయి. ఈ సారి పశ్చిమ ప్రాంతంలో 2.14 లక్షల హెక్టార్లలో పత్తి సాగయింది. అధిక వర్షాల వల్ల ఒక్క పత్తి మాత్రమే దాదాపు 2వేల హెక్టార్లలో దెబ్బతినింది. అధికార యంత్రాంగం మాత్రం వ్యవసాయ, ఉద్యాన పంటలు కలిపి 658.7 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. ఉద్యాన పంటలకు రూ.2.94 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఉల్లి పంట ఇప్పుడిప్పుడే చేతికి వస్తోంది. వందలాది హెక్టార్లలో ఉల్లి పంట కోశారు. వరుసగా అధిక వర్షాలు పడుతుండటంతో నీళ్లలో మునిగి ఉల్లిగడ్డలు కుళ్లిపోతున్నాయి. ఆలూరు, ఆస్పరి, పత్తికొండ, తుగ్గలి తదితర మండలాల్లో ఉల్లి రైతులు లబోదిబోమంటున్నారు. రానున్న రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నెల 14న కర్నూలు జిల్లాకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అల్పపీడనం ప్రభావం వల్ల పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు. -
రూ.82.79 కోట్ల ఉచిత పంటల బీమా విడుదల
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకం ● కేంద్రం వాటా బీమా నిధులు విడుదల ● చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం కర్నూలు(అగ్రికల్చర్): వైఎస్సార్సీపీ ప్రభు త్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం కింద ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించకుండానే మరోసారి రూ.82.79 కోట్ల ప్రయోజనం కలిగింది. 2022 ఖరీఫ్, 2023 ఖరీఫ్, 2023–24 రబీ, 2024 ఖరీఫ్ పంటలకు సంబంధించి ఉచిత పంటల బీమా ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ మొత్తం గత రెండు రోజులుగా విడుదలవుతోంది. ఈ పరిహారం కేవలం కేంద్ర ప్రభుత్వ వాటా మాత్రమే. కేంద్రం ద్వారా ఒక్కో రైతుకు రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు ప్రయోజనం చేకూరుతోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతుల నుంచి ప్రీమియం రూపంలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచిత పంటల బీమాను అమలు చేసింది. నోటిఫై చేసిన పంటలు ఈ–క్రాప్లో నమోదైతే చాలు బీమా వర్తింపజేయడంతో లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. ఉచిత పంటల బీమాను మరచిపోయిన రైతుల బ్యాంకు ఖాతాలకు బీమా పరిహారం విడుదలవుతుండటంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన మేలును గుర్తు చేసుకుంటున్నారు. ఇదిలాఉంటే రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా పరిహారం విడుదల చేయడంలో చేతులెత్తేసింది. దీన్నిబట్టి చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రైతులపై ఉన్న అభిమానం ఏపాటిదో అర్థమవుతోంది. -
శోభాయమానం.. ఆరాధనోత్సవం
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి 354వ ఆరాధన సప్తరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో 6వ రోజు బుధవారం ఉత్సవాలు రమణీయంగా సాగాయి. వేకువ జామున 5.30కు సుప్రభాత సేవతో వేడుకలు ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా రాఘవేంద్రుల మూల బృందావనానికి విశేష పూజలు, రాయరు పాదపూజ, మూలదేవర సంస్థాన పూజ, శ్రీరాఘవేంద్రస్వామి మఠం 13వ పీఠాధిపతి సుజ్ఞానేంద్రతీర్థుల ఆరాధనలు కనుల పండువగా సాగాయి. ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. అశ్వ వాహనంపై విశ్వ మోహనుడు బుధవారం రాత్రి 10 గంటలకు ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులు అశ్వ వాహనంపై కడు వైభవంగా ఊరే గారు. మంగళ వాయిద్యాలు, దాస సాహిత్య మండలి మహిళల భజనలు, అశేష భక్త జనం హర్ష ధ్వానాల మధ్య శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో విహరించారు. అనంతరం చెక్క, వెండి, అంబారి, స్వర్ణ రథాలపై ఉత్సవమూర్తికి రథయాత్రలు నిర్వహించారు. ఈ వేడు కలో మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతిఆచార్, ధార్మిక సహాయకాధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలక అనంతస్వా మి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వై.ప్రదీప్ కుమా ర్రెడ్డి, సర్పంచ్ తెల్లబండ్ల బీమయ్య పాల్గొన్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆరాధన సప్తరాత్రోత్సవాలు సందర్భంగా యోగీంద్ర మండపంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బెంగళూరుకు చెంది న విదూషి సంగీత కులకర్ణి దాసవాణి, సుధా స్కూలు బృందం హరిదర్శన నృత్య రూపకం భక్తులను మంత్రముగ్దులు చేసింది. నేడు సర్వ సమర్పణోత్సవం ఉత్సవాల ఆఖరిరోజు అయిన గురువారం సర్వ సమర్పణోత్సవం జరుగనుంది. ఏక కాలంలో పంచ వాహనాలపై ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులు, రాఘవేంద్రులను శ్రీమఠం మాడ వీధుల్లో ఊరేగిస్తారు. ఉద యం అనుమంత్రాలయం తుంగభద్ర గ్రామం మృత్తిక బృందావన క్షేత్రంలో ఆరాధన వేడుకలు, రథయాత్ర నిర్వహిస్తారు. అశ్వ వాహనంపై ఊరేగిన ప్రహ్లాదరాయులు వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు -
పని ఒత్తిడి పెరిగిపోయింది
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యాప్లతో అంగన్వాడీ కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో సిగ్నల్స్ పనిచేయకపోవడం, యాప్స్ సపోర్టు చేయడం లేదు. 2జీ సెల్ ఫోన్ స్థానంలో 5 జీ సెల్ ఫోన్లు అందించాలని కోరుతూనే ఉన్నాం. అలాగే వర్కర్లకు నెలకు రూ.26 వేలు, సహాయకులకు రూ.13 వేలు ఇవ్వాలని అనేక రూపాల్లో ఆందోళనలు చేస్తూనే ఉన్నాం. అయినా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ యాప్ వల్ల ఇటీవలి కాలంలో పని ఒత్తిడి పెరిగిపోయింది. ఫేస్ క్చాప్చర్ చేసేందుకే కనీసం గంట సమయం పడుతోంది. – బీ రేణుకమ్మ, జిల్లా అధ్యక్షురాలు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (సీఐటీయూ) -
ఒకే యాప్ ప్రవేశ పెట్టాలి
అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న బాల సంజీవిని, పోషణ్ ట్రాకర్ యాప్లలో ఏదో ఒకదాన్ని మాత్రమే అమలు చేయాలి. రెండు యాప్ల వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. బాల సంజీవిని యాప్తో ఒకే సారి దాదాపు 200 మంది ఫేస్ రికగ్నైజ్ చేయలంటే చాలా సమయం పడుతుంది. నాలుగైదు పర్యాయాలు లబ్ధిదారుల నుంచి ఓటీపీ కోరాల్సి ఉంది. నిరక్షరాస్యులైన మహిళల నుంచి ఓటీపీ చెప్పించుకోవడం కష్టసాధ్యంగా ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారుల ఒత్తిడి తీవ్రంగా ఉంది. సెల్ఫోన్ సామర్థ్యాన్ని పెంచడంలో భాగంగా 5జీ సెల్ఫోన్స్ అందించాలి. – కే వెంకటమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ( సీఐటీయూ ) -
మద్యం బార్లకు అధిక దరఖాస్తులొచ్చేలా చూడండి
కర్నూలు: మద్యం బార్ల పాలసీ నెలాఖరుకు ముగుస్తున్నందున కొత్త పాలసీ గురించి వ్యాపారులకు వివరించి అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చేలా చర్యలు తీసుకుని ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా చూడాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీదేవి ఎకై ్సజ్ క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. స్థానిక డీసీ కార్యాలయంలో బుధవారం కర్నూలు, నంద్యాల జిల్లాల ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్లతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందున ఇందుకు సంబంధించి మద్యం వ్యాపారుల నుంచి రుసుం వసూలు చేయాలన్నారు. లైసెన్స్ ఫీజు రూ.55 లక్షలు ఉన్న దుకాణాల నుంచి రూ.5 లక్షలు, రూ.65 లక్షలకు పైగా లైసెన్స్ ఫీజు ఉన్న దుకాణాల నుంచి ఏడాదికి రూ.7.50 లక్షలు పర్మిట్ రూమ్లకు రుసుం వసూలు చేయాలన్నారు. అలాగే నాటుసారాను సమూలంగా నిర్మూలించడానికి ప్రవేశపెట్టిన నవోదయం 2.0 కార్యక్రమంపై చర్చించారు. కర్నూలును సారా రహిత జిల్లాగా నెలాఖరుకు ప్రకటించాల్సి ఉన్నందున ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అసిస్టెంట్ కమిషనర్ రావిపాటి హనుమంతరావు, ఎకై ్సజ్ కర్నూలు, నంద్యాల జిల్లా అధికారులు మచ్చ సుధీర్ బాబు, రవికుమార్, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు రామకృష్ణా రెడ్డి, రాముడు, రాజశేఖర్ గౌడు, సీఐలు చంద్రహాస్, రాజేంద్ర ప్రసాద్, జాన్ సైదులు మంజుల, రమేష్ రెడ్డి, లలితా దేవి, స్వర్ణలత, రామాంజినేయులు, మోహన్ రెడ్డి, విజయ్ కుమార్, వరలక్ష్మి, సతీష్ తదితరులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఎకై ్సజ్ నేర సమీక్ష సమావేశంలో నోడల్ డిప్యూటీ కమిషనర్ -
మన పండు బ్రహ్మాండం!
డ్రాగన్ ఫ్రూట్. ఇటీవల కాలంలో విచ్చలవిడిగా లభిస్తున్న పండు. ఇదివరలో చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నా.. ఇప్పుడు మనపక్క జిల్లా అనంతపురంతో పాటు పలు జిల్లాల్లో విరివిగా సాగవుతోంది. అయితే ఇంతకు వెయ్యి రెట్లు బీ12, ఏ, సీ విటమిన్లు లభించే మొక్క మన దేశంలోనే ఉన్న బ్రహ్మజెముడు(పాపిచ్చి కాయ)ను విస్మరిస్తున్నాం. చైనాకు, మన పండుకు ఉన్నా తేడా ఒక్క ముళ్లు మాత్రమే. కేవలం ఈ ఒక్క కారణంతో ముళ్లు తీసుకునే సమయం లేక చైనా పండ్లను ప్రోత్సహిస్తున్నాం. పైగా ఈ పండ్లు గ్రామీణ ప్రాంతాల్లోని కొండ ప్రాంతాల్లో ఎవరూ పెంచకుండానే మొండిగా బతికేస్తుంది. అయితే చైనా పండు(డ్రాగన్ ఫ్రూట్)ను మాత్రం కేజీ రూ.100 చొప్పున కొనుగోలు చేస్తున్నాం. ఇక్కడే ఫ్రీగా లభిస్తున్న, డ్రాగన్ ఫ్రూట్ను మించి పోషకాలను అందిస్తున్న మన బ్రహ్మజెముడును పట్టించుకోకపోవడం గమనార్హం. కార్పొరేట్, కాంక్రీట్ జంగిల్స్లో విద్యను అభ్యసిస్తున్న పిల్లలకు వీటి గురించి అవగాహన లేకపోయినా.. గ్రామీణ ప్రాంతాల్లో సర్కారు పాఠశాలల్లో చదివే పిల్లలకు ఈ పాపాసికాయలు తెలియనివి కావు. పండును బండరాయికేసి రుద్దితే ముళ్లు విరిగిపోతాయి, ఆ తర్వాత తోలు తీసి గుజ్జును తినేయడమే. చివరగా వచ్చే విత్తనాలను మాత్రం పడేయటం విస్మరించొద్దు. ఈ పండ్లు తిన్నామంటే ఎట్టే గర్తుపట్టేయొచ్చు. చేతులు, నాలుక కొద్ది సమయం వరకు ఎరుపు, గులాబి రంగులోకి మారిపోవడం చూస్తే పాపాసికాయలు తిన్నావా అని అడగాల్సిందే. ఔషధ గుణాలు కలిగిన బ్రహ్మజెముడు పండ్లతో కాలేయ, క్యాన్సర్ వ్యాధులను సైతం నయం చేస్తోంది. అంతేకాదు.. స్థూలకాయం, మధుమేహం, గ్యాస్ట్రిక్ సమస్యలను కూడా తగ్గించే గుణం ఉండటం విశేషం. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
యువకుని అవయవ దానం
● ముగ్గురికి కొత్త జీవితం కర్నూలు (హాస్పిటల్): ఒక యువకుడు చేసిన అవయవ దానం ముగ్గురికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం పెద్దకొప్పెర్ల గ్రామానికి చెందిన టి.శివరామ సుబ్బయ్య (39)కు భార్య రామసుబ్బమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈయన ఈనెల 10న స్నేహితులతో కలసి దగ్గర్లోని నదికి చేపలు పట్టడానికి వెళ్లాడు. అక్కడ జారిపడటంతో తలకు పెద్ద రాయి తగిలి తీవ్ర గాయమైంది. వెంటనే అతను జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరిస్థితి బాగోలేదని చెప్పి కర్నూలుకు పంపారు. అదే రోజు ఓమ్నీ హాస్పిటల్లో చేర్చి వెంటిలేటర్పై ఉంచారు. మెరుగైన చికిత్స కోసం మరుసటి రోజు మెడికవర్ హాస్పిటల్కు తీసుకువచ్చారు. కానీ అతనిని బ్రెయిన్డెడ్గా వైద్యులు ప్రకటించారు. ఆసుపత్రిలోని జీవన్దాన్ ట్రస్టు వారు అవయవ దానం గురించి శివరామ సుబ్బయ్య కుటుంబానికి చెప్పగా వారు అంగీకరించారు. కర్నూలు మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ సాయిసుధీర్ నేతృత్వంలో డాక్టర్ అబ్దుల్ సమద్, డాక్టర్ సిద్ధార్థ హెరూర్, డాక్టర్ బి.ప్రవీణ్, డాక్టర్ శరత్ తదితరులు అవయవాలను సేకరించారు. సేకరించిన అవయవాల్లో ఒక కిడ్నీని నెల్లూరు అపోలో హాస్పిటల్కు, మరో కిడ్నీని మెడి కవర్ హాస్పిటల్లోనే ఒక రోగికి, కాలేయాన్ని కర్నూలు కిమ్స్ హాస్పిటల్కు తరలించారు. అనంతరం అవయవదానం చేసిన వ్యక్తి కుటుంబాన్ని ఆసుపత్రి యాజమాన్యం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ క్లస్టర్ హెడ్ మహేశ్వర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
మళ్లీ మొదటికొచ్చిన వీఏఏల బదిలీలు
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖలో గ్రామ వ్యవసాయ సహాయకుల(వీఏఏ) బదిలీల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. బదిలీల్లో అన్యాయంపై సుమారు 40 మంది వీఏఏలు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు మూడు వారాల క్రితం ఎక్కడి వారిని అక్కడే కొనసాగించాలని స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చింది. ఆరు జిల్లాల నుంచి కోర్టును ఆశ్రయించగా.. ఉమ్మడి కర్నూలు, కృష్ణా జిల్లాల బదిలీల్లో అక్రమాలు జరిగినట్లు హైకోర్టు నిర్ధారించింది. ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో బదిలీల కౌన్సెలింగ్ తిరిగి చేపట్టాలని ఈనెల 11న ఆదేశించడం గమనార్హం. చేతులు మారిన రూ.16లక్షలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో 474 మంది వీఏఏలు ఉండగా 447 మందిని బదిలీ చేశారు. రేషనలైజేషన్ వల్ల ఉమ్మడి జిల్లాలో 188 రైతుభరోసా కేంద్రాలు మూత పడ్డాయి. ప్రధానంగా నంద్యాల జిల్లాలో 117 ఆర్బీకేలు మూతపడ్డాయి. ఈ కారణంగా చాలామంది వీఏఏలు కర్నూలు జిల్లాకు అలాట్ అయ్యారు. అయితే బదిలీల్లో ముడుపులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.16లక్షలు చేతులు మారినట్లు వ్యవసాయ శాఖలో చర్చ జరుగుతోంది. బదిలీలకు సంబంధించి విడుదల చేసిన జీఓ(23, 5)లను ఏమాత్రం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. చిన్న ఉద్యోగులనూ దోచుకున్నారు గ్రామ వ్యవసాయ సహాయకుల(వీఏఏ) బదిలీల్లో రాజకీయ సిఫారసులకే పెద్దపీట వేశారని తెలుస్తోంది. కూటమి పార్టీల నేతలు చిన్న ఉద్యోగులను కూడా వదలకుండా అందిన కాడికి వసూలు చేసుకొని సిఫారసు లేఖలు ఇచ్చినట్లు సమాచారం. ఒక్కొక్కరి నుంచి రూ.20 వేలు ప్రకారం వసూలు చేసినట్లు చర్చ జరుగుతోంది. ఏకంగా 115 మంది వీఏఏలు ప్రజాప్రతినిధుల సిఫారుసుతో కోరుకున్న చోటుకు బదిలీ అయినట్లు హైకోర్టు గుర్తించింది. సిఫారసులు లేకుండానే కొరుకున్న చోటుకు బదిలీ చేసినందుకు కొందరు అధికారులు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. ముడుపుల వసూళ్లలో జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో పనిచేసే టెక్నికల్ ఏఓల్లో ఒకరు కీలకంగా వ్యవహరించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బదిలీలను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు 115 మందికి ప్రజా ప్రతినిధుల సిపారసు లేఖలు రూ.16లక్షల వరకు వసూలు చేసిన కూటమి నేతలు ప్రత్యేక కౌంటర్ తెరిచిన కొందరు అధికారులు నిబంధనలకు లోబడి బదిలీలు చేపట్టాలని హైకోర్టు ఆదేశం అభాసుపాలైన వ్యవసాయ శాఖ ముడుపులు ఇచ్చుకొని కోరుకున్న చోటుకు బదిలీ చేయించుకున్నాం.. మళ్లీ కౌన్సెలింగ్ నిర్వహిస్తే తమ పరిస్థితి ఏమిటని వీఏఏల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. డబ్బులు పోయి, తిరిగి పోస్టింగ్ ఆ ప్రాంతానికే వస్తుందో రాదోననే కొందరు వీఏఏలు సతమతం అవుతున్నారు. ఇటీవల చేపట్టిన మండల వ్యవసాయ అధికారులు, ఏడీఏలు, డీడీఏల బదిలీలతో వ్యవసాయ శాఖ అభాసుపాలైంది. గ్రామస్థాయిలోని వీఏఏల బదిలీల్లో సైతం ముడుపుల వ్యవహారం ఈ శాఖ పరువును బజారున పడేసింది. -
శుభకార్యానికి వచ్చి..అనంతలోకాలకు
● రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం ఎమ్మిగనూరురూరల్: బంధువుల ఇంట్లో వివాహానికి వచ్చాడు. అర్ధరాత్రి వరకు సంబరాల్లో పాల్గొన్న ఆ యువకుడు ఆదోనికి వెళ్లి వస్తానని బైక్పై బయలుదేరి మృత్యుఒడికి చేరాడు. మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఆదోని పట్టణంలోని ఇంద్రానగర్ ఎరుకుల కాలనీకి చెందిన మారెన్న కుమారుడు ఎరుకుల లక్ష్మన్న(28) కొంత కాలంగా హైదరాబాద్లో వెంట్రుకల వ్యాపారం, ఆదోనిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. మంగళవారం ఎమ్మిగనూరు పట్టణంలోని తమ బంధువుల పెళ్లికి భార్య మాధవితో కలిసి వచ్చాడు. రాత్రి పెళ్లి కుమారుడి ఇంటి దగ్గర డీజే పాటలకు నృత్యం చేస్తూ అందరితో సంతోషంగా గడిపాడు. భార్య, బంధువులు వద్దని వారించినా అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆదోనికి వెళ్లి ఉదయం వస్తానని బుల్లెట్ బైక్పై బయలుదేరాడు. మండల పరిధిలోని కోటేకల్ – ఆరేకల్ గ్రామాల మధ్య ఉన్న కోళ్ల ఫారం దగ్గర బైక్ అదుపుతప్పడంతో రోడ్డు పక్కన ఉన్న ముళ్లపొదల్లో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం ఉదయం అటుగా వెళ్తున్న వారు గమనించి విషయాన్ని రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి చేరుకొని మృతుడి దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఆధారంగా కుటుంబసభ్యుల సమాచారం తెలుసుకుని ప్రమాదం విషయం తెలియజేశారు. లక్ష్మన్న మృతదేహాన్ని చూసి బంధువులు బోరున విలపించారు. మృతదేహాన్ని రూరల్ పోలీసులు పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో పెళ్లి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ప్రమాదవశాత్తూ కుందూలో పడి.. బండి ఆత్మకూరు: ప్రమాదవశాత్తూ కుందూనదిలో పడి దివ్యాంగుడు మృతిచెందాడు. మండల కేంద్రం బండిఆత్మకూరులో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన సగిలే రమణ రెడ్డి (59) తన ట్రైసైకిల్పై బస్టాండ్ నుంచి ఊరిలోకి వెళ్తున్నాడు. స్థానిక కుందూనది వంతెనపై వెళ్తుండగా ట్రైసైకిల్ అదుపు తప్పి నదిలో పడిపోయింది. స్థానికులు గమనించేలోపే నీటి ప్రవాహంలో కొట్టుకోపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలించి నంద్యాల నందమూరి నగర్ వద్ద ఉన్న కుందూ బ్రిడ్జ్ వద్ద మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడికి భార్య లక్ష్మిదేవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా కుందూనది వంతెనకు ఎలాంటి రక్షణ గోడలు లేకపోవడంతో తరచు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. -
సూక్ష్మ సేద్యం పరికరాల ఏర్పాటులో జాప్యం చేయొద్దు
కర్నూలు(అగ్రికల్చర్): సూక్ష్మ సేద్యం మంజూరు చేసిన రైతులకు సత్వరం మెటీరియల్ సరఫరా చేయడంతో పాటు వారి పొలాల్లో అమర్చాలని, ఈవిషయంలో జాప్యం చేయొద్దని ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ కె.శ్రీనివాసులు డ్రిప్ కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. బుధవారం తన కార్యాలయంలో డ్రిప్ కంపెనీల జిల్లా కో–ఆర్డినేటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రైతులు బిందు, తుంపర్ల సేద్యం కోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారని, నాన్ సబ్సిడీ కూడా చెల్లిస్తున్నారని తెలిపారు. 2025–26లో 7000 హెక్టార్లకు సూక్ష్మ సేద్యం మంజూరు చేయాలనేది లక్ష్యం కాగా.. ఇప్పటికే 1,450 హెక్టార్లకు సూక్ష్మ సేద్యం కల్పించేందుకు పరిపాలన అనుమతులు లభించాయని తెలిపారు. పరిపాలన అనుమతులు వేగంగా లభిస్తున్నాయని, కంపెనీలు కూడా పైపులు, ఇతర పరికరాలు జాప్యం లేకుండా సరఫరా చేయాలని పేర్కొన్నారు. పరికరాల నాణ్యతలో ఏవైన తేడాలు వస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో పత్తి, మిర్చి, ఉల్లి, ఆయిల్పామ్ పెద్ద ఎత్తున సాగు అవుతున్నాయని, ఈ పంటలకు డ్రిప్ సదుపాయం కల్పించుకునేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. పరికరాలు అమర్చడం ద్వారా డ్రిప్ సదుపాయాన్ని వెంటనే సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఐపీ అదనపు పీడీ పిరోజ్ ఖాన్ పాల్గొన్నారు. కంపెనీల ప్రతినిధులకు ఏపీఎంఐపీ పీడీ ఆదేశం -
టీడీపీ గూండాగిరీకి పోలీసుల వత్తాసు
● ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ఆలూరు: అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు చేస్తున్న గూండాగిరీకి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, ఇందుకు జెడ్పీటీసీ ఉప ఎన్నికలే నిదర్శనమని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. కూటమి సర్కారు ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. బుధవారం ఆలూరు ఆర్అండ్బీ అతిథి గృహ ఆవరణలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు. దౌర్జన్యాలు చేస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. ఈ ఆగడాలను అడ్డుకోవాల్సిన పోలీసు వ్యవస్థ, ఎన్నికల కమిషన్ ప్రేక్షక పాత్ర పోషించిందన్నారు. రాష్ట్రంలో రౌడీరాజ్యం ఎన్నాళ్లు ఉండదని, ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి భాస్కర్, పార్టీ ఆలూరు మండలం అధ్యక్షుడు మల్లికార్జున, ఎంపీపీ రంగమ్మ, వైస్ ఎంపీపీ శ్రీరాములు, నాయకులు పాల్గొన్నారు. రైల్లో నుంచి పడి వ్యక్తి మృతి నంద్యాల: స్థానిక రైల్వే స్టేషన్ పరిధిలోని గుడిమెట్ట వద్ద మద్దయ్య(42) అనే వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఈయన ఈనెల 11న కర్నూలు నుంచి విజయవాడకు వెళ్లారు. అక్కడ అమ్మవారిని దర్శించుకొని మంగళవారం రాత్రి రైలులో తిరిగి వస్తుండగా మార్గమధ్యలో గుడిమెట్ట వద్ద రైలు నుంచి జారి కింద పడి మృతి చెందినట్లు బుధవారం రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. -
రూ. 5లక్షల నగదు అపహరణ
ఆలూరు రూరల్: బ్యాంకు నుంచి డ్రా చేసుకొని వెళ్తున్న రూ.5 లక్షల నగదుతో పాటు 5 గ్రాముల బంగారు కమ్మలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. స్థానిక బళ్లారి రోడ్డులోని పాండురంగ స్వామి ఆలయ సమీపంలో కట్టెల మిషన్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడు గోపాల్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. హాలహర్వి మండలం మల్లికార్జున పల్లి గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి నెల క్రితం గాలిమరల సంస్థకు పొలం విక్రయించాడు. ఆ నగదు తన ఖాతాలో జమ కావడంతో బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆలూరు స్టేట్ బ్యాంకు నుంచి రూ.5 లక్షల నగదు డ్రా చేసుకున్నాడు. నగల దుకాణం నుంచి కొనుగోలు చేసిన 5 గ్రాముల బంగారు, డ్రా చేసుకున్న నగదు సంచిలో ఉంచి తన అల్లుడుతో కలిసి స్కూటర్పై స్వగ్రామానికి బయలుదేరాడు. ఆలూరు సమీపంలోని పాండురంగ స్వామి ఆలయం వద్ద కట్టెల మిషన్ ముందు స్కూటర్ నిలిపి నగదు, ఆభరణాలు ఉన్న సంచిని దానిపై ఉంచి మూత్ర విసర్జనకు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి బ్యాగు మాయమైంది. గుర్తుతెలియని వ్యక్తులు తన నగదు,బంగారు అపహరించారని ఆలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకు ఆశ్రయించిన బాధితుడు -
యువకుడి అనుమానాస్పద మృతి
నంద్యాల: ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. పాణ్యం మండలం కౌలూరు గ్రామ సమీపంలోని రైలు పట్టాల మధ్య మృతదేహం లభించింది. రైల్వే పోలీసులు, గ్రామస్తుల వివరాల మేరకు.. గడివేముల మండలం కొర్రపోలూరుకు చెందిన రామసుబ్బయ్య కుమారుడు సూర్య (23) డిగ్రీ చదివి ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్కెళ్లాడు. ఇటీవలే అక్కడి నుంచి స్వగ్రామానికి వచ్చిన ఆ యువకుడు పని ఉందంటూ రెండు రోజుల క్రితం నంద్యాలకు వచ్చారు. ఏమైందో ఏమో తెలియదు కానీ కౌలూరు సమీపంలో రైల్వే పట్టాలపై శవమై కనిపించాడు. రైల్వే పోలీసులు గుర్తించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇదిలా ఉండగా మృతుడు ఓ యువతిని ప్రేమించాడని..అయితే ఇరువురి కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని సమాచారం. ఈ క్రమంలో యువకుడి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా చంపేసి అక్కడ పారవేశా రా లేక ప్రేమ విఫలమై యువకుడే ఆత్మహత్య చేసుకున్నాడా అన్నది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. తమ కుమారుడిది హత్యేననివిచారించి న్యాయం చేయాలని సూర్యతల్లిదండ్రులు కోరుతున్నారు. -
భువనమోహనుడికి బ్రహ్మరథం
● అశేష జనవాహిని మధ్య సాగిన రాఘవేంద్రుల రథయాత్ర ● అలరించిన కళాకారుల నీరాజనాలు అశేష భక్తజన వాహిని మధ్య రాయరు రథోత్సవ దృశ్యం మంత్రాలయం: భువనమోహనుడు మహారథంపై ఊరేగిన వేళ.. తుంగభద్రమ్మ మది పులకించిపోయింది. వేదభూమి పరవశించి ఆధ్యాత్మిక పరిమళాలతో శోభిల్లింది. భక్తజనం హర్షధ్వానాలతో జపించింది. రాఘవేంద్రస్వామి 354వ సప్తరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం మహారథోత్సవం కనులపండువగా సాగింది. ఉత్తరారాధనలో భాగంగా ముందుగా ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులు వేద పాఠశాలకు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా చేరుకున్నారు. అక్క డ పాఠశాల విద్యార్థులు ఉత్సవమూర్తికి వేద పఠనం గావించి దర్శించుకున్నారు. అనంతరం శ్రీమఠం మూల బృందావనం చేరుకోగా స్వామి వారికి విశేష పూజలు గావించి వసంతోత్సవానికి శ్రీకారం పలికారు. గర్భాలయంలో అర్చకులు, పండితులు, పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు గులాలు చల్లుకుని ఆచార వైభవాన్ని స్పృశింపజేశారు. అనంతరం ఉత్సవమూర్తిని మహారథంపై కొలువుంచగా.. భక్తజనులు గోవిందా.. గోవిందా.. అంటూ ప్రణమిల్లుతూ దర్శించుకు న్నారు. పీఠాధిపతి ప్రవచనం ముగియగానే భక్తులను ఆశీర్వచనం చేస్తూ 12.15 గంటలకు రథయాత్రకు అంకురార్పణ పలికారు. మధ్వ కారిడార్ చేరుకోగానే స్వామిజీ హెలికాప్టర్తో పుష్పవృష్టి కురిపించారు. మంగళ వాయిద్యాలు, డోలు దరువులు, రంగుల ఆటలు, యువతుల సంప్రదాయ నృత్య ప్రదర్శనలు, కోలాటాల మధ్య మహారథం ముందుకు కదిలింది. రాఘవేంద్ర సర్కిల్ వద్ద స్వామిజీ పూర్వాశ్రమ కుటుంబ సభ్యులు ఉత్సవమూర్తికి పూజలు చేసుకుని మొక్కు లు తీర్చుకున్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ రథోత్సవంలో పాల్గొన్నారు. డీఎస్పీ వెంకటరామయ్య ఆధ్వర్యంలో సీఐలు, ఎస్ఐలు సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రూ.250 కోట్లతో జలాశయం మంత్రాలయం క్షేత్రం సౌకర్యార్థం రూ.250 కోట్లతో జలాశయాన్ని నిర్మిస్తున్నట్లు పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు తెలిపారు. వేడుకలో స్వామిజీ ప్రసంగిస్తూ క్షేత్రంలో అంతర్గత రహదారులతో పాటు రింగ్ రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాఘవేంద్ర సర్కిల్ వరకు కారిడార్ నిర్మిస్తామ న్నారు. శ్రీమఠం దినదినాభివృద్ధికి అంతరంగిక భక్తుల సహకారం ఎంతో ఉందన్నారు. వేడుకల్లో పండిత కేసరి రాజా ఎస్. గిరియాచార్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ రాఘవేంద్రరెడ్డి, తహసీల్దార్ రమాదేవి, శ్రీమఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్–1 శ్రీనివాసరావు, మేనేజర్–2 వెంకటేష్జోషి, మేనేజర్–3 శ్రీపతి ఆచార్ తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకులు రుణాలివ్వవు.. ప్రభుత్వ పథకాలు వర్తించవు
కర్నూలు(అగ్రికల్చర్): కౌలుదారుల అభ్యున్నతికి చర్యలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. ఉమ్మడి జిల్లాలో ఆగస్టు 4వ తేదీ వరకు 34,258 మంది కౌలుదారులకు సీసీఆర్సీ కార్డులు జారీ చేసినా ఒక్కరికీ మేలు జరిగిన దాఖలాలు లేవు. సీసీఆర్సీ కార్డులు పొందిన సాగుదారుల్లో ఒక్కరికి కూడా అన్నదాత సుఖీభవ సాయం అందకపోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సాగుదారులకు అండగా నిలిస్తే.. కూటమి ప్రభుత్వం కౌలు రైతుల సంక్షేమానికి తూట్లు పొడుస్తోంది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా తయరవుతోంది. 2025–26 సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ, రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా గ్రామ సభలు నిర్వహించి కౌలుదారుల నుంచి దరఖాస్తులు తీసుకొని సీసీఆర్సీ(ప్రస్తుతానికి) కార్డులు జారీ చేస్తున్నా ఫలితం లేకపోతోంది. కౌలుదారులకు రుణాలు ఇవ్వాలని కోరుతూ వ్యవసాయ అధికారులు ఈ కార్డుల వివరాలను సంబంధిత బ్యాంకులకు ఎప్పటికప్పుడు పంపుతున్నా వీటిని బ్యాంకర్లు పరిగణనలోకి తీసుకోని పరిస్థితి.సీసీఆర్సీ కార్డుల జారీలో సైతం ముడుపులే..కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయి. చివరికి కౌలుదారులకు జారీ చేసే సీసీఆర్సీ కార్డుల జారీకి కూడా కొందరు వీఆర్వోలు ముడుపులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీసీఆర్సీ కార్డు జారీ కావాలంటే రూ.10 స్టాంపుపై రాసుకున్న అగ్రిమెంట్ భూ యజమాని, కౌలుదారు ఇద్దరూ సంతకాలు చేయాల్సి ఉంది. అయితే వీఆర్ఓలు మేము క్షేత్రస్థాయికి వచ్చి విచారణ జరుపుతామని నాణ్చివేత ధోరణికి పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో అవన్నీ ఎందుకు అన్నట్లుగా రూ.1,000 వరకు డబ్బులిచ్చి కార్డులు పొందుతున్నట్లు సమాచారం.బ్యాంకర్లు చెబుతన్న కారణాలు ఇవీ..● కౌలుదారులకు రుణాలు ఇవ్వలేమని వివిధ బ్యాంకులు స్పష్టంగా ప్రకటించాయి.● ఇప్పటికే కౌలుదారులు సాగు చేసుకుంటున్న భూ ములపై యజమానులు రుణాలు తీసుకున్నారు.● ఒకే భూమిపై ఇటు యజమానికి, అటు కౌలుదారులకు రుణాలు ఇవ్వలేం.● ఒకవేళ భూముల యజమానులు రుణాలు తిరిగి చెల్లిస్తే.. ఆ స్థానంలో కౌలుదారులకు రుణాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాం.తడిసి మోపెడవుతున్న కౌలుమెట్ట భూమి అయితే ఒక ఎకరా కౌలు కనీసం రూ.5వేల నుంచి 10 వేల వరకు ఉంటోంది. నీటి పారుదల సదుపాయం ఉంటే ఎకరాకు రూ.30 వేల వరకు కౌలు తీసుకుంటున్నారు. సెంటు భూమి కూడా లేని వారు భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయంలో రాణిస్తున్నారు. కౌలు, పెట్టుబడి మొత్తం కలిపి ఎకరాకు పంటను బట్టి రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు వస్తోంది. సీసీఆర్సీ కార్డులు పొందినప్పటికీ బ్యాంకులు సహకరించకపోవడంతో పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు భార్యల బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్న పరిస్థితి నెలకొంది.కౌలుదారులకు అండగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంగత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 11 నెలల కాలపరిమితితో సీసీఆర్సీ కార్డులు జారీ చేసింది. ఈ రైతులకు పెట్టుబడి సాయంగా వైఎస్ఆర్ రైతుభరోసా కింద రూ.13,500 పూర్తిగా అందించింది. కౌలుదారులతో పాటు ఆర్ఓఎఫ్ఆర్ రైతులు, దేవదాయ భూములు అనుభవిస్తున్న వారికి సీసీఆర్సీ కార్డులు జారీ చేసి రైతు భరోసాను వర్తింపజేసింది. 2023–24లో భారీ ఎత్తున సీసీఆర్సీ కార్డులు జారీ కావడంతో వైఎస్ఆర్ రైతుభరోసా కింద ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం లభించింది. ఒక్క ఏడాదే కాదు ఐదేళ్లూ కౌలుదారులకు పెట్టుబడిసాయం అందింది. మొత్తం 28,600 మంది సాగుదారులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు భరోసాతో లబ్ధి పొందడం విశేషం.కౌలు రైతులు ఎలా బతికేదిఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నా. కౌలు కింద కరెంట్ మోటార్ ఉంటే ఎకరాకు 22 బస్తాలు, లేకపోతే 18 బస్తాలు ధాన్యం ఇవ్వాల్సి ఉంది. 2024–25లో ప్రభుత్వం సీసీఆర్సీ కార్డు మంజూరు చేసింది. ఈ కార్డు 2025–26 సంవత్సరానికి రెన్యూవల్ అయ్యింది. కూటమి ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ కింద ఒక్క రూపాయి కూడా అందలేదు. బ్యాంకులకు పోతే రుణాలు ఇవ్వం అంటున్నారు. సంక్షేమ పథకాలు వర్తించకపోతే ఎలా బతికేది. – గడ్డం నరసింహుడు, పార్నపల్లి, బండిఆత్మకూరు మండలంతూతూ మంత్రంగా సీసీఆర్సీ కార్డులుఉమ్మడి జిల్లాలో 7 లక్షల మంది రైతులు ఉన్నారు. అనావృష్టి, అతివృష్టి వల్ల ఏటా పంటలు దెబ్బతింటుండటం వల్ల కొన్నేళ్లుగా రైతులు భూములను కౌలుకు ఇస్తూ వలస వెళ్తున్నారు. అనధికారికంగా జిల్లాలో కౌలు రైతులు దాదాపు 2.50 లక్షల వరకు ఉన్నారు. భూమి యజమాని సమ్మతితోనే సీసీఆర్సీ కార్డులు జారీ చేస్తారు. ఈ ప్రకారం 2025–26లో కర్నూలు జిల్లాలో 25 వేలు, నంద్యాల జిల్లాలో 30 వేల ప్రకారం సీసీఆర్సీ కార్డులు జారీ చేయాలనేది లక్ష్యం. ఖరీఫ్ సీజన్ మొదలై రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు 11 నెలల కాలపరిమితితో కర్నూలు జిల్లాలో 21,799, నంద్యాల జిల్లాలో 12,459 కార్డులు మాత్రమే జారీ అయ్యాయి. -
టోకెన్లు ఇచ్చారు.. యూరియా లేదంటారు!
కౌతాళం: అధికారుల ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతన లేదని చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. ఓ వైపు ఎరువుల కొరత లేదని అధికారులు చెబుతుంటే.. నెల రోజులుగా నిరీక్షిస్తున్నామని రైతులు రోడ్డెక్కారు. రెండు నెలల నుంచి రైతులకు రైతు సేవా కేంద్రాల చుట్టూ తిప్పకుంటున్నారే తప్ప యూరియా ఇవ్వడం లేదు. దీంతో అధికారుల తీరును నిరసిస్తూ మంగళవారం కౌతాళంలో రైతులు రోడ్డెక్కా రు. గత నెల 15వ తేదీన కొందరికి, 17వ తేదీన మరి కొంత మంది రైతులకు యూరియా కోసం డబ్బులు తీసుకుని టోకెన్లు ఇచ్చారు. ఇప్పటికే 28 రోజులు గడిచినా యూరి యా లేక పోవడంతో ఆందోళన చెందారు. మంగళవారం రైతు సేవా కేంద్రానికి యూరియా లోడ్ వచ్చిందన్న విషయం తెలుసుకున్న రైతులు తరలివచ్చారు. అయితే డబ్బులు తీసుకుని టోకెన్లు రాసి ఇచ్చిన వారికే యూరియా తక్కువ వస్తుందని, మిగతా వారికే ఎలా ఇవ్వాలని ఎంపీఈఓ కార్తీక్ రైతులను సముదాయించారు. అందరికీ యూరి యా ఇవ్వాలని, వ్యవసాయాధికారి శేషాద్రిని పిలిపించాలని రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఏఓ అక్కడికి చేరుకుని నెల క్రితమే టోకెన్లు తీసుకున్న వారికి మూడు బస్తాల చొప్పున యూరి యా ఇచ్చి మిగితాది వేరే రైతులకు ఇస్తామని చెప్పా రు. అయితే నెల రోజుల క్రితం డబ్బులు కట్టి నిరీక్షిస్తున్న తమ యూరియా ఇవ్వక పోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రైతులను కూటమి ప్రభుత్వం ఇక్కట్లకు గురి చేస్తుందని విమర్శించారు. -
రానున్న మూడు రోజులూ వర్షాలే..
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు కోసిగి, తుగ్గలి మండలాల్లో మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. అయితే వర్షాలు తేలికపాటి నుంచి ఒక మోస్తరుకే పరిమితం అయ్యాయి. వెల్దుర్తిలో 32.8, హాలహర్విలో 24.8, మద్దికెరలో 23.8, చిప్పగిరిలో 22.6, క్రిష్ణగిరిలో 18.8, ఆలూరులో 18.6, ఆస్పరిలో 15, గోనెగండ్లలో 14.2, ఓర్వకల్లో 11.2, హొళగుందలో 9.2, కల్లూరులో 7.8 మి.మీ ప్రకారం వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తం మీద సగటున 9.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 116.2 మి.మీ ఉండగా.. ఇప్పటి వరకు 124.4 మి.మీ వర్షపాతం నమోదు కావడం గమనార్హం. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ట్రిపుల్ ఐటీడీఎం రిజిస్ట్రార్ బాధ్యతల స్వీకరణ కర్నూలు సిటీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిజైన్ మ్యాను ఫ్యాక్చరింగ్(ట్రిపుల్డీఎం) రిజిస్ట్రార్గా రాజ్ కుమార్ మాంఝీవాల్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర విద్యాశాఖతో సమన్వయం చేసుకొని ట్రిపుల్ఐటీడీఎం క్యాంపస్ రెండో దశ పనులను ప్రారంభిస్తామన్నారు. క్యాంపస్ కాంపౌండ్ వాల్ను పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. దేశంలోని అగ్రశ్రేణి సాంకేతిక సంస్థలతో ట్రిపుల్ఐడీ పోటీ పడేలా తీర్చిదిద్దుతామన్నారు. ఇటీవల బదిలీ అయిన గురుమూర్తి స్థానంలో జైపూర్లోని మాలవ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డిప్యూటీ రిజిస్ట్రార్గా పని చేస్తున్న రాజస్థాన్కి చెందిన రాజ్కుమార్ మాంఝీవాల్ను నియమించారు. ఈయన ఐఐటీ జమ్మూకశ్మీర్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్లో పని చేశారు. నూతన రిజిస్ట్రార్కు క్యాంపస్ అధ్యాపకులు స్వాగతం పలికారు. 22న మాజీ సైనికుల సమస్యలకు పరిష్కారం కర్నూలు(అర్బన్): మాజీ సైనికులు, ఆయా కుటుంబాల వితంతువుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ఈ నెల 22న మద్రాసు రెజిమెంట్కు చెందిన అధికారులు ఇక్కడకు వస్తున్నట్లు జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎస్.ఆర్.రత్నరూత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో ఆ రోజున ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. మద్రాస్ రెజిమెంట్కు సంబధించిన వారు తమ సమస్యల పరిష్కారానికి పెన్షన్ పేమెంట్ ఆర్డర్, డిశ్చార్జి బుక్, అప్డేట్ బ్యాంకు పెన్షన్ పాస్ బుక్తో పాటు అవసరమైన ధృవపత్రాలతో స్వయంగా హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు సైనిక సంక్షేమ కార్యాలయ పనివేళల్లో 08518– 229445 నెంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. -
జెండా.. గుండెల నిండా!
● 1.1 కిలోమీటర్ల పొడవు జాతీయ జెండా ప్రదర్శన కర్నూలు(సెంట్రల్): ఆజాదీకి అమృత్ మహోత్సవంలో భాగంగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలులో 1.1 కిలోమీటర్ల జాతీయ జెండాను విద్యార్థులు, యువతీ, యువకులు ప్రదర్శించారు. సుంకేసుల రోడ్డులో ఉన్న సెయింట్ జోసెఫ్ కళాశాల నుంచి కొండారెడ్డి బురుజు వరకు దాదాపు 2,800 మంది విద్యార్థులు మువ్వన్నెల తిరంగా ప్రదర్శించగా కలెక్టర్ పి.రంజిత్బాషా వీక్షించారు. గ్లోబల్ టౌన్షిప్ మేనేజింగ్ డైరక్టర్ ఖాజా మాలిక్, సెయింట్ జోసెఫ్ కళాశాల విద్యార్థులు, ఐ అముజయ యునైటెడ్ యంగ్ స్టార్ అసోసియేషన్ యూత్ బిగ్రేడు–2025 సహకారంతో 1.1 కిలోమీటర్ల పొడవు జాతీ య జెండాను రూపొందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి.రంజిత్బాషా మాట్లాడుతూ ఇలాంటి మువ్వన్నెల జెండాల ప్రదర్శన ద్వారా ప్రజల్లో జాతీయ సమైక్యత భావాలు కలుగుతాయని, ఆగస్టు 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించారు. కాగా, ఈ కార్యక్రమాన్ని వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు వచ్చి రికార్డు చేశారు. కార్యక్రమంలో డీఈఓ శామ్యూల్పాల్, గ్లోబల్ టౌన్షిప్ ఎండీ పవన్ సోలంకి, సెయింట్ జోసెప్ కళాశాలకు చెందిన డీన్ శౌరీలు రెడ్డి, ప్రిన్సిపాల్ శాంత పాల్గొన్నారు. -
దేవుడికి పూజారి శఠగోపం
● మట్కా ఆడి అప్పులపాలైన పూజారి ● దేవుడి వెండి ఆభరణాలు విక్రయించేందుకు యత్నం ● ఆభరణాలు తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులుఆదోని అర్బన్: దేవుడి సేవలో తరించాల్సిన పూజారి మట్కాకు బానిసై అప్పులపాలయ్యాడు. అప్పుల బాధ నుంచి బయటపడేందుకు ఏకంగా దేవుడి ఆభరణాలపై కన్నేశాడు. వాటిని గుట్టుగా అపహరించి విక్రయించేందుకు తరలిస్తుండగా పోలీసులు రంగ ప్రవేశం చేసి అరెస్ట్ చేశారు. ఆదోని డీఎస్పీ హేమలత తెలిపిన వివరాల మేరకు.. ఆదోని మండలం నారాయణపురం గ్రామంలో వెలిసిన శ్రీ వసిగేరప్ప దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్న గొర్రెల వసిగేరప్ప మట్కా ఆడుతూ అప్పులపాలయ్యాడు. బెంగళూరులో ఉంటూ మట్కా ఆడి అప్పులపాలయ్యాడు. ఈ క్రమంలో దేవుడి ఆభరణాలు అమ్మేసి బయటపడాలని భావించాడు. దీంతో గుడిలో ఉన్న విగ్రహాలను పది రోజుల క్రితం ఇంట్లో దాచి పెట్టాడు. అయితే ఆలయంలో 4.386 కేజీల వెండి ఆభరణాలు, 10 గ్రాముల బంగారు బాసింగం కనిపించడం లేదని ఆ గ్రామానికి చెందిన కురి చంద్ర ఈనెల 10వ తేదీన ఇస్వీ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పూజారి వసిగేరప్ప తన ఇంట్లో దాచిన ఆభరణాలను కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో విక్రయించేందుకు సోమవారం తరలిస్తుండగా చాగి గ్రామం శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ ముఖద్వారం సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆభరణాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కేసు వివరాలను స్థానిక డీఎస్పీ బంగ్లాలో డీఎస్పీ హేమలత మీడియాకు వివరించారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాలను ప్రదర్శించారు. కేసును ఛేదించిన ఆదోని రూరల్ సీఐ నల్లప్ప, ఇస్వీ ఎస్ఐ డాక్టర్ నాయక్, హెడ్కానిస్టేబుల్ రామయ్య, కానిస్టేబుళ్లు సుదర్శన్, ఖాసీంను డీఎస్పీ అభినందించారు. -
ముంచెత్తుతున్న వర్షాలు
మండలం వర్షపాతం (మి.మీ) కర్నూలు రూరల్ 77.2 ఓర్వకల్ 68.2 ఆస్పరి 67.2 ఆదోని 59.6 కర్నూలు అర్బన్ 56.6 వెల్దుర్తి 42.4 పెద్దకడుబూరు 38.6 కోడుమూరు 38.6 కల్లూరు 38.2 కౌతాళం 36.8 ఎమ్మిగనూరు 30.2 కర్నూలు(అగ్రికల్చర్): బంగాళఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడుతుండటంతో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 12న ఉమ్మడి కర్నూలు జిల్లాకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. 13న నంద్యాల జిల్లాకు ఆరెంజ్ అలర్ట్, కర్నూలు జిల్లాకు ఎల్లో అలర్ట్ ప్రకటించడం గమనార్హం. 14న ఉమ్మడి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్.. 15న ఉమ్మడి జిల్లాకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఆరెంజ్ అలర్ట్ అంటే రెండు, మూడు ప్రాంతాల్లో 115.6 నుంచి 204.4 మిమీ స్థాయిలోఅతిభారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. ఎల్లో అలర్ట్ అంటే మూడు, నాలుగు ప్రాంతాల్లో 64.5 నుంచి 115.5 మిమీ స్థాయిలో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. ఇప్పటికే 114.9 మి.మీ వర్షపాతం కాగా ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 116.2 మిమీ ఉండగా.. మొదటి 11 రోజుల్లోనే 114.9 మిమీ వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు హొళగుంద మినహా మిగిలిన అన్ని మండలాల్లో వర్షం కురిసింది. ఉమ్మడి జిల్లాకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ఈ నెల 12 నుంచి భారీ నుంచి కుండపోత వర్షాలు కురిసే అవకాశం -
స్వర్ణ రథంపై దివ్యతేజం
● శ్రీమఠంలో వైభవంగా శ్రీరాఘవేంద్రుల మధ్యారాధనమంత్రాలయం: సద్గురు శ్రీరాఘవేంద్రులు సశరీరంగా బృందావన ప్రవేశం చేసిన శుభదినం.. పరమగురుడి 354వ ఆరాధన పర్వదినం.. వేదభూమి పులకించి తుంగభద్రమ్మ పరవశించిన తరుణం.. చూసిన కనులదే మహాభాగ్యం. విశ్వమోహనుడి ఆరాధన సప్తరాత్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన మధ్యారాధన మహా మంగళకరం. సోమవారం శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆశీస్సులతో మధ్యారాధన దేదీప్యమానంగా సాగింది. వేడుకల్లో భాగంగా రాఘవేంద్రుల మూల బృందావనానికి మహా పంచామృతాభిషేకం చేశారు. అభిషేకం వేళ భక్తజన వాహిని శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో కిక్కిరిసింది. రెండు గంటల పాటు మంత్రోచ్ఛారణలు, భక్తజన హర్షధ్వానాల మధ్య అత్యంత పవిత్రంగా చేపట్టారు. భక్తజనుల కోసం ప్రత్యక్ష ప్రసారం, ఎల్ఈడీ తెరల ద్వారా వీక్షణ సదుపాయం కల్పించారు. రమణీయంగా రథయాత్ర మధ్యారాధన సందర్భంగా మధ్యాహ్నం శ్రీరాఘవేంద్రుడిని బంగారు రథంపై ఊరేగించారు. రాయరు బంగారు ప్రతిమను స్వర్ణ రథంపై కొలువుంచగా పీఠాధిపతి నారికేళ సమర్పణతో మంగళ హారతులు పట్టి రథయాత్రకు అంకురార్పణ పలికారు. పండితుల వేదఘోష, మంగళ వాయిద్యాలు మధ్య శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో రథయాత్ర రమణీయంగా సాగింది. వేడుకలో మేళతాళాలు, నృత్య ప్రదర్శనలు, సంకీర్తనాలాపనలు భక్తులను మైమరిపించాయి. రాఘవేంద్రస్వామి బృందావన ప్రవేశం చేసిన శుభదినం కావడంతో భక్తులు అత్యధిక సంఖ్యలో తరలి వచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి వేలకుపైగా భక్తులు తరలివచ్చినట్లు అంచనా. అలాగే రాత్రి పరిమళ తీర్థం పుష్కరిణిలో ఉత్సవమూర్తి తెప్పోత్సవం ఎంతో రమణీయంగా సాగింది. వేడుక భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. తెప్పోత్సవం అనంతరం ప్రహాదరాయలను గజవాహనంపై కడు వైభవంగా ఊరేగించారు. అలరించిన నృత్య ప్రదర్శనలుఉత్సవాల్లో భాగంగా యోగీంద్ర సభా మంటపంలో నృత్య ప్రదర్శనలకు అలరించాయి. వేడుకలో పండితకేసరి గిరియాచార్, ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్–1 శ్రీనివాసరావు, మేనేజర్–2 వెంకటేష్జోషి, జోనల్ మేనేజర్ శ్రీపతిఆచార్, ధార్మిక సహాయకాధికారి వ్యాసరాజాచార్, సంస్కృత గురుకులం ఉపకులపతి పంచముఖి, ద్వారపాలక అనంతస్వామి, వేద పాఠశాల మాజీ ప్రిన్స్పాల్ వాదిరాజాచార్, సీఐ రామాంజులు, ఎస్ఐ శివాంజులు పాల్గొన్నారు. -
ఉల్లి రైతు దిగాలు
● ఇప్పుడిప్పుడే మార్కెట్కు దిగుబడులు ● విక్రయానికి 150 నుంచి 300 క్వింటాళ్లు ● పడిపోయిన ధరతో తప్పని నష్టాలు ● క్వింటాకు గరిష్ట ధర రూ.1100 మాత్రమే ● మార్కెట్ను ముంచెత్తుతున్న మహారాష్ట్ర ఉల్లి ● గగ్గోలు పెడుతున్న రైతులుకర్నూలు మార్కెట్లో ఉల్లి కొనుగోళ్ల దృశ్యంఉల్లి సాగు మరింత పెరిగే అవకాశం ● గత ఏడాది పొగాకు, మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ● ధర లేక.. కొనే వాళ్లు లేక 2024–25లో పండించిన మిర్చి గోదాముల్లో పేరుకుపోయింది. ● పొగాకు నిల్వలు రైతుల దగ్గర భారీగా ఉండిపోయాయి. ● ఈ నేపథ్యంలో రైతులు ఈ సారి ఉల్లి సాగుపై దృష్టి సారిస్తున్నారు. ● కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ సారి ఉల్లి రైతులకు శాపం కానుంది. ● పంట పూర్తి స్థాయిలో మార్కెట్లోకి రాక ముందే ధర అధ్వానంగా ఉంటోంది. ● ఖరీఫ్లో కర్నూలు జిల్లాలో 11,825 హెక్టార్లలో.. నంద్యాల జిల్లాలో 4,500 హెక్టార్లలో సాగయింది. ● ఇంకా కర్నూలు జిల్లాలో 4,500 హెక్టార్ల వరకు, నంద్యాల జిల్లాలో 2వేల హెక్టార్ల వరకు సాగయ్యే అవకాశం ఉంది. -
గోశాలలో పశుగ్రాసం దగ్ధం
● రూ.5 లక్షల నష్టం మంత్రాలయం రూరల్: శ్రీమఠం గోశాలలో జరిగిన ప్రమాదంలో పశుగ్రాసం దగ్ధమైంది. గోశాలలో పశుగ్రాసం ఉంచిన గౌడౌన్లో సోమవారం ఉదయం విద్యుత్ షార్ట్సర్క్యూట్తో మంటలు ఏర్పడి వరిగడ్డికి వ్యాపించాయి. మంటలను గమనించిన మఠం సిబ్బంది గోవులను బయటకు వదిలేశారు. అనంతరం ఎమ్మిగనూరు ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. మంటలకు గౌడౌన్లో ఉన్న పశుగ్రాసం మొత్తం పూర్తిగా దగ్ధమైంది. దాదాపు రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక సిబ్బంది అంచనా వేశారు. మైనారిటీ హాస్టల్లో ప్రవేశం పొందండి కర్నూలు(అర్బన్): కళాశాల విద్యను అభ్యసిస్తున్న మైనారిటీ విద్యార్థులు నగరంలోని వెంకటా చలపతి నగర్లో ఉన్న ప్రభుత్వ పోస్టు మెట్రిక్ మైనారిటీ బాలుర వసతి గృహంలో ప్రవేశం పొందాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి సయ్యద్ సబీహా పర్వీన్ కోరారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి 25 సీట్లు ఖాళీగా ఉన్నాయని సోమవారం ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని దూర ప్రాంతాల నుంచి కర్నూలుకు వచ్చి కళాశాల విద్యను అభ్యసిస్తున్న పేద మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బావిలో పడి భక్తుడి మృతి కౌతాళం: ఈరన్నస్వామి దర్శనానికి వచ్చిన తెలంగాణ భక్తుడు మృతి చెందాడు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడా మండలం హనుమాపురానికి చెందిన పెద్దింటి అనిల్కుమార్ (50) శ్రావణమాసం సోమవారం సందర్భంగా ఉరుకుంద ఈరన్న స్వామి దర్శనానికి కుటుంబంతో వచ్చాడు. ఉరుకుందకు మజరా గ్రామం అయిన తిమ్మాపురం గ్రామం వద్ద బావిలో అనిల్ స్నానానికి వెళ్లి కాలుజారి పడ్డాడు. ఈత రాకపోవడంతో మునిగిపోతుండటంతో గ్రామస్తులు వెంటనే బయటకు తీయగా అప్పటికే మృతిచెందాడు. కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అందరిని కంటతడి పెట్టించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చెరువు తూములో పడి..
పెద్దకడబూరు: చిన్నతుంబళం గ్రామ రాయల చెరువు తూములో ప్రమాదవశాత్తు పడి యువకుడు పడి మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగుచూసింది. ఏఎస్ఐ ఆనంద్ వివరాల మేరకు.. మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన తెలుగు రఘు(32) పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం గ్రామానికి చెందిన లింగమ్మతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. అయితే వీరు గత 6 నెలలుగా చిన్నతుంబళం గ్రామంలోనే కార్పెంటర్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రఘు మద్యానికి బానిస అయ్యాడు. గత శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. భార్య ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో ఆందోళన చెందారు. ఆదివారం అంతటా గాలించినా ఆచూకీ లభిచంలేదు. అయితే సోమవారం మధ్యాహ్నం రాయల చెరువు తూము నుంచి కాలువలోకి మృతదేహం కొట్టుకురావడంతో బట్టలు ఉతుకుతున్న మహిళలు గమనించి గ్రామస్తులకు చెప్పారు. సమాచారం అందుకున్న సంఘటన స్థలానికి చేరుకుని గుర్తు తెలియని శవంగా భావించారు. తర్వాత మృతదేహం రఘుదిగా ఆయన కుటుంబీకులు గుర్తించారు. చెరువు తూము దగ్గర మద్యం సేవిస్తూ ప్రమాదవశాత్తూ అందులో పడిపోయి ఉంటాడని కుటుంబీకులు అనుమానిస్తున్నారు. మృతుడి భార్య లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. గల్లంతైన యువకుడి మృతి పాణ్యం: రెండు రోజుల క్రితం ఎస్సార్బీసీ ప్రధాన కాల్వలో గల్లంతైన యువకుడు శవమై తెలాడు. ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడు రాష్ట్రం తిరుపూర్ జిల్లా ఉడుమల్లై గ్రామానికి చెందిన కుమార్ పుంగుడిల కుమారుడు యువరాజ్(27) లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం కెమికల్ లోడ్తో కర్నూలు నుంచి చైన్నెకి వెళ్తుండగా పాణ్యం ఎస్సార్బీసీ ప్రధాన కాల్వ వద్ద స్నానం చేసేందుకు వాహనం నిలిపాడు. కాల్వలో దిగే క్రమంలో జారి పడి నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. క్లీనర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం నుంచి కాల్వ వెంట డ్రోన్ల సహాయంతో పాణ్యం నుంచి నందివర్గం, రామతీర్థం నందవరం వరకు గాలించుకుంటూ వెళ్లారు. నందవరం పరిసరాల్లో నీటలో మృతదేహం లభ్యం కావడంతో బయటు తీసి పరిశీలించగా యువరాజ్గా గుర్తించారు. మృతదేమాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. డ్రోన్తో శ్రీశైలంలో నిఘా శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు జూదం, గంజాయి విక్రయాలు.. తదితర అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు శ్రీశైలం పోలీసులు డ్రోన్ సేవలను ఉపయోగిస్తున్నారు. సోమవారం శ్రీశైలం సీఐ స్రసాదరావు, సిబ్బందితో కలిసి డ్రోన్ సహయంతో శ్రీశైలంలో పలు ప్రదేశాలను పరిశీలించారు. సాక్షిగణపతి, హఠకేశ్వరం, దాసరి అన్నసత్రం, దేవస్థానం టోల్గేట్, నందిమండపం, పాతాళగంగ జంక్షన్, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రదేశాలలో పరిశీలించారు. -
భక్తుల కష్టాలు కనుమా?
ఈరన్న స్వామి..కౌతాళం: శ్రావణ మాసం మూడో సోమవారం. దారులన్నీ ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రం వైపు అన్నట్లుగా భక్తులు తరలివచ్చారు. రద్దీకి తగ్గ ఏర్పాట్లలో దేవస్థానం చేతులేత్తేసింది. అదే ట్రాఫిక్.. అదే అపరిశుభ్రతతో భక్తుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయానికి ఏటా సుమారు రూ. 20 కోట్ల ఆదాయం ఉన్నా సౌకర్యాలు కల్పనలో వెనుకడుగు వేస్తోంది. ● క్షేత్రానికి సమీపంలో ఎల్లెల్సీ కాల్వ ఉన్న పుణ్య స్నానాలు చేసేందుకు కాల్వ వెంట మెట్లు వంద మీటర్ల పొడువు మాత్రమే ఉన్నాయి. దేవస్థానం ముందు చూపుతో కాల్వకు ఇరువైపులా భక్తుల రద్దీకి అనుగుణంగా మెట్లు నిర్మాణం, షవర్లు ఏర్పాటు చేస్తే స్నానానికి ఇక్కట్లు తప్పేవి. శానిటేషన్ సిబ్బంది తగినంత మంది లేక పోవడంతో క్షేత్ర పరిధిలో ఎక్కడి చూసినా అపరిశుభ్రత కనిపించింది. ● ఓ వైపు వర్షం.. మరో వైపు ట్రాఫిక్, ఇంకో వైపు పంట పొలాలు ఉండటంతో భక్తులు క్షేత్రానికి కాలి నడకన వచ్చేందుకు కూడా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ట్రాఫిక్ మళ్లింపులో అధికారులు ముందు చూపులేక పోవడంతో ప్రతి సోమవారం ఇదే సమస్య తలెత్తుతోంది. ● కౌతాళం రూట్లో ఈచనహాల్ వరకు ట్రాఫిక్ జామ్తో హాల్వి రూట్లో చిరుతపల్లి వరకు, కోసిగి రూట్లో జుమ్మలదిన్నె వరకు, ఆదోని రూట్లో రెండు కి లోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ● ఉదయం 10 గంటల ప్రాంతంలో ట్రాిఫిక్లో ఇరుక్కున వారు సాయంత్రం ఐదు తర్వాత బయట పడాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో వృద్దులు,వికలాంగులు చాలా ఇబ్బందుల పడ్డారు. ట్రాఫిక్తో చాల మంది భక్తులు కాలనడకన పొలాల వెంట ఉరుకుందకు చేరుకోగా కొంత మంది అక్కడే పొలాల్లోనే వంటలు వండి స్వామికి నైవేద్యం సమర్పించారు. ● ట్రాఫిక్ కంట్రోల్లో కేవలం కౌతాళం సీఐ అశోక్కుమార్ వారి సిబ్బందితో పాటు కొంతమంది ఎస్సైలు మాత్రమే నియంత్రించే పని చేశారే గాని బందోబస్తు వచ్చిన ఇతర సిబ్బంది చాలా వరకు కనిపించక పోవడం గమనార్హం. -
వీరభద్రస్వామికి పెళ్లి కుమార్తె నచ్చింది...
● కార్తీక మాసంలో నిశ్చితార్థంఆస్పరి: శ్రావణ మాసం ఉత్సవాల్లో భాగంగా మూడవ సోమవారం కై రుప్పల గ్రామంలో వెలసిన వీరభద్రస్వామి, కాళికాదేవిల పెళ్లి చూపులు కార్యక్రమం వైభవంగా సాగింది. మధ్యవర్తులు పుప్పాలదొడ్డి గిడ్డాంజనేయస్వామి, చెన్నంపల్లి కాత్రికేయ స్వామి సమక్షంలో సంప్రదాయం ప్రకారం చేపట్టిన పెళ్లి చూపుల్లో వీరభద్రస్వామికి కాళికాదేవి నచ్చడంతో కార్తీక మాసం ముగిసిన తరువాత వచ్చే మొదటి సోమవారం నిశ్చితార్థం ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. ఉగాది వేడుకల్లో భాగంగా వీరభద్రస్వామికి, కాళికాదేవికి పెళ్లి జరిపిస్తామని గ్రామస్తులు తెలిపారు. శ్రావణ మాసం ఉత్సవాల్లో భాగంగా సోమవారం కై రుప్పల గ్రామస్తులు తంగభద్ర జలాలు తెచ్చి వీరభద్రస్వామి, కాళికాదేవిలకు అభిషేకం చేశారు. సంప్రదాయం ప్రకా రం ప్రతి ఏటా గ్రామస్తులు భజన చేసుకుంటూ పాద యాత్ర ద్వారా తుంగభద్ర జలాలలను తీసుకొచ్చి స్వామి వారికి అభిషేకం చేస్తామని చెప్పారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లను పూల పల్లకీలో మేళతాళాలతో ఊరేగించారు. భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. -
జిల్లాకు బంగారు పతకం
కర్నూలు (సెంట్రల్): నీతి అయోగ్ గుర్తించిన ఆస్పిరేషనల్ బ్లాకుల్లో చేపట్టిన సంపూర్ణత అభియాన్ కింద కర్నూలు జిల్లాకు బంగారు పతకం వరించిందని, ఇందుకోసం కృషి చేసిన అధికారులను అభినందిస్తున్నట్లు కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. సోమవారం రాత్రి కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమారోహ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మద్దికెర, చిప్పగిరి, హొళగుంద మండలాల్లో నిర్దేశించిన ఆరు సూచికలు వంద శాతం ప్రగతి సాధించడానికి కారణమైన అధికారులను కలెక్టర్, ఎమ్మెల్సీ బీటీ నాయుడు సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశంలో నీతి అయోగ్ గుర్తించిన 500 ఆస్పిరేషన్ బ్లాకుల్లో జిల్లాలోని మద్దికెర, చిప్పగిరి, హొళగుంద మండలాలు ఎంపికయ్యాయన్నారు. అందులో భాగంగా నీతి అయోగ్ నిర్దేశించిన ఆరు లక్ష్యాలను సాధించడంతో జిల్లాకు గోల్డ్ మెడల్తో పాటు అవార్డులు లభించినట్లు చెప్పారు. అంతేకాక మద్దికెర మండలానికి రూ.1.50 కోట్లు, చిప్పగిరి మండలానికి రూ.కోటి నగదు కూడా అభివృద్ధి పనుల కోసం వరించినట్లు చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, సీపీఐ హిమ ప్రభాకర్ రాజు, హౌసింగ్ పీడీ చిరంజీవి పాల్గొన్నారు. -
ఆధార్ సెంటర్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం
కర్నూలు: ఆధార్ సెంటర్ ఇప్పిస్తానని చెప్పి కర్నూలు బుధవారపేటకు చెందిన బోయ శేఖర్ రూ.60 వేలు తీసుకుని మోసం చేశాడని మంత్రాలయంకు చెందిన వీరేష్ ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. కర్నూలు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్ఎస్కు మొత్తం 81 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నిటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పీజీఆర్ఎస్కు వచ్చిన వినతుల్లో కొన్ని... ● కర్నూలు అశోక్ నగర్కు చెందిన వినయ్ కుమార్ కడప రిమ్స్లో తన భార్యకు స్టాఫ్ నర్సు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.1.50 లక్షలు తీసుకుని మోసం చేశాడని నంద్యాల పట్టణానికి చెందిన ప్రదీప్ ఫిర్యాదు చేశారు. ● కర్నూలు మండలం పసుపుల, రుద్రవరం, నూతనపల్లె గ్రామాల రైతుల నుంచి పసుపల గ్రామానికి చెందిన పకిడి ఖాజా అనే వ్యాపారి రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేసి సొమ్ము చేసుకుని డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడని, విచారణ జరిపి తగు న్యాయం చేయాల్సిందిగా అదే గ్రామానికి చెందిన సుల్తాన్ ఫిర్యాదు చేశారు. ● నన్నూరు గ్రామానికి చెందిన గుర్రం నాగన్న, వెంకటస్వామి, వెంకటరాముడు, ఉపేంద్రలు కలసి తన పొలానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, సర్వే చేయించడానికి కూడా సహకరించడం లేదని ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన కనకమ్మ ఫిర్యాదు చేశారు. ● కర్నూలుకు చెందిన రవీంద్ర పాతబస్తీలోని పూలబజార్కు చెందిన కొంతమంది మహిళల నుంచి ఆధార్ కార్డు, పాన్ కార్డు, సిమ్ కార్డు, ఫొటోలు తీసుకుని బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయించి వారికి తెలియకుండా వారి పేర్ల మీద ఏసీలు, టీవీలు, సెల్ఫోన్లు తీసుకుని మోసం చేస్తున్నాడని కర్నూలు వడ్డెగేరికి చెందిన షేక్ సన ఫిర్యాదు చేశారు. ● రాజు, మహేష్ అనే వ్యక్తులు ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకాలు తయారు చేసుకుని తమ ఆస్తిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని, నన్ను, మా నానమ్మను కొట్టి చంపుతామని బెదిరిస్తున్నారని ఆదోని పట్టణానికి చెందిన రాహుల్ ఫిర్యాదు చేశారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు -
కిడ్నీ మార్పిడి చేయిస్తానని మోసం చేశాడు
నంద్యాల: ‘కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నాకు మా నాన్న మిత్రుడు కిశోర్ తన సోదరుడు డాక్టర్ సునీల్ ద్వారా కిడ్నీ మార్పిడి చేయిస్తానని నమ్మించి రూ. 19.84 లక్షలు తీసుకుని మోసం చేశాడు. ఆపరేషన్ చేయించకుండా డబ్బులు తిరిగి ఇవ్వకుండా భయపెడుతున్నాడు’ అంటూ నంద్యాల పట్టణానికి చెందిన ధనుంజయ్ ఎస్పీ అధిరాజ్సింగ్ను ఆశ్రయించి వినతి పత్రం అందజేశారు. సోమవారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రజా ఫిర్యా దుల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఎస్పీ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్లో 89 వినతులు వచ్చాయని, వాటిపై పూర్తిస్థా యి విచారణ చేసి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట పరిధి లో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, ఫిర్యాదులను పునరావృతం కాకుండా చూడాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు. 19.84 లక్షలు తీసుకుని బెదిరిస్తున్నాడు నంద్యాల జిల్లా ఎస్పీని ఆశ్రయించిన బాధితుడు -
‘ఆకర్ష్’ సేవలు అభినందనీయం
● కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఓర్వకల్లు: ‘అల్యూమిని అసోసియేషన్ ఆఫ్ కాల్వబుగ్గ రెసిడెన్షియల్ స్కూల్’(ఆకర్ష్) పేరుతో పాఠశాల అభివృద్ధికి చేస్తున్న సేవలు అభినందనీయమని కలెక్టర్ రంజిత్ బాషా అభిప్రాయపడ్డారు. ఆదివారం మండలంలోని కాల్వబుగ్గ గురుకుల పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. పాఠశాలకు చెందిన 1992–93, 1998–99వ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆర్థిక సౌజన్యంతో నిర్వహించిన కార్యక్రమానికి ఆకర్ష్ అధ్యక్షులు రాఘవేంద్రారెడ్డి అధ్యక్షత వహించారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి రాష్ట్ర గురుకుల పాఠశాల సొసైటీ ఛీప్ సెక్రటరీ మస్తానయ్య, కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా ప్రిన్సిపాల్ ప్రసాదరావు పాఠశాలలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధికి అసరమైన నిధుల మంజూరుకు సంబంధించిన నివేదికలను కలెక్టర్కు విన్నవించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆకర్ష్లో చేరిన ప్రతి ఒక్కరూ పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. గ్రీన్కో సంస్థ ఆధ్వర్యంలో టిడ్కో ఇళ్ల సమీపంలో రూ.5 కోట్లతో జాతీయ స్థాయిలో స్టేడియాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ప్రోత్సాహక చెక్కులను అందజేశారు. ఆకర్ష్ బోర్డు గౌరవ సభ్యులు కిరణ్కుమార్, సొసైటీ అధ్యక్షులు రాఘవేంద్రారెడ్డి, ప్రిన్సిపాల్ వరప్రసాద్, జిల్లా, రాష్ట్ర, దేశ విదేశాలల నుంచి పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
జీవించేదెలా?
మగ్గం మీదే ఆధారపడి జీవిస్తున్నాం. కూటమి ప్రభుత్వం 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదు. గత నెల 119 యూనిట్లు వినియోగించినందుకు రూ.612లు బిల్లు వచ్చింది. వందల రుపాయాలు బిల్లు కట్టాలంటే ఎలా? మా కుటుంబాలు జీవించేదెలా? మా కష్టం ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. – జ్యోతి, చేనేత కార్మికురాలు మోసం చేశారు ఎమ్మిగనూరులో 2,500 కుటుంబాలుపైగా నేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఎన్నికల ముందు మభ్యపెట్టే హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి ఏడాదైనా చేనేతలకు ఒక్క పథకాన్ని అమలు చేయలేదు. ఉచిత విద్యుత్ ఇవ్వకుండా మోసం చేశారు. కూటమి సర్కార్ తీరుతో చేనేతలు వృత్తికే దూరమవుతున్నారు. – ఎంకే శివప్రసాద్, ఎమ్మిగనూరు -
ప్రజల హక్కుల పరిరక్షణకు చర్యలు
కర్నూలు(అర్బన్): ప్రజల హక్కులను పరిరక్షించేందుకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కట్టుబడి ఉంటుందని కౌన్సిల్ రాష్ట్ర ఇన్చార్జ్ ఈదురు పద్మాకర్ అన్నారు. ఆదివారం సంస్థ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజల హక్కులకు ఎక్కడ భంగం వాటిల్లినా కౌన్సిల్ వెంటనే స్పందిస్తుందన్నారు. వారి హక్కులను కాపాడేందుకు జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులను కలిసి అవసరమైన చర్యలను చేపడుతామన్నారు. ఆయా వర్గాలకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. జిల్లాలో కొందరు వ్యక్తులు కౌన్సిల్ పేరుతో నకిలీ గుర్తింపు కార్డులు ముద్రించుకొని బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇప్పటికై నా వారు తమ పద్ధతులు మార్చుకోవాలని, లేని పక్షంలో అలాంటి వారిని గుర్తించి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ముఖ్యంగా ప్రజలు ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. తమ హక్కులను కాపాడుకోవడంలో భాగంగా తమ పరిధిలో జరిగే అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తే ఆయా సమస్యలు వెలుగులోకి రావడంతో పాటు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు అక్బర్, ప్రధాన కార్యదర్శి బెస్త గోవిందరాజులు, రమణ, సోమన్న తదితరులు పాల్గొన్నారు. ఐస్ ఫ్యాక్టరీ విషయంలో తనకు అన్యాయం జరిగిందని కౌన్సిల్కు డోన్కు చెందిన లక్ష్మణస్వామి వినతి పత్రాన్ని అందించారు. -
వైఎస్సార్సీపీలో మహిళలకు సముచిత గౌరవం
కర్నూలు (టౌన్): వైఎస్సార్సీపీలో మహిళలకు సముచిత గౌరవం ఉందని ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిండెంట్ ఎస్వీ విజయ మనోహరి అన్నారు. పార్టీలో మహిళా విభాగాన్ని మరింత బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. కర్నూలులో ఎస్వీ విజయ మనోహరిని మహిళలు ఆదివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సమయంలో మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు. ఏడాది దాటినా మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నేరవేర్చలేదన్నారు. వైఎస్సార్సీపీ బీసీ మహిళా విభాగం కార్యదర్శి భారతి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షులు సు మలత, నగర అధ్యక్షులు మంగమ్మ, నగర అంగన్వాడీ అసోసియేషన్ అధ్యక్షులు రాధి కమ్మ, స్వర్ణలత, మహేశ్వరీ, సుగుణ పాల్గొన్నారు. 17 మండలాల్లో వర్షం కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 17 మండలాల్లో వర్షం కురిసింది. కౌతాళంలో 24.2, దేవనకొండలో 19.8, పెద్దకడుబూరులో 14.8, ఆదోనిలో 13.6, హొళగుందలో 13.2, పత్తికొండలో 12.8, కోసిగిలో 12.6, సి.బెళగల్లో 9.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 4.22 లక్షల హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు 3.02 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి కర్నూలు(సెంట్రల్): ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.సుమన్, ఈ.మధుబాబు కోరారు. కర్నూలులోని రెవెన్యూ భవన్లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నెలనెలా జీతాలు సక్రమంగా పడడంలేదన్నారు. హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని, సీనియారిటీ ప్రతిపాదికన సర్వీసు రూల్స్ను వర్తింపజేయాలి కోరారు. ఏపీ జేఏసీ అమరావతి కర్నూలు జిల్లా చైర్మన్ వై.కృష్ణ , ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.రామ్భద్ర, సెక్రరటీ చారి,నాయకులు ఎం.నాగరాజు, ఎం.అమిదాబి, శ్రీధర్, సంధ్య, సరస్వతి, సోమన్న, సరోజ, సావత్రి, యశోద పాల్గొన్నారు. మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రా ష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కిక్కిరిసి కనిపించాయి. -
డెంగీ బూచీ.. రోగులను దోచి!
ఎలీసా టెస్ట్ ద్వారానే డెంగీ నిర్ధారణ చేయాలి కర్నూలు, ఆదోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వ డెంగీ నిర్ధారణకు ఎలీసా టెస్ట్ ల్యాబ్లు ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో జ్వరపీడితులకు ర్యాపిడ్ టెస్ట్లో పాజిటివ్ వస్తే వెంటనే ఆ వ్యక్తి రక్తాన్ని ఎలీసా టెస్ట్ కోసం పంపించాలి. ఎలీసా టెస్ట్లో డెంగీ నిర్ధ్దారణ అయితేనే చికిత్స చేయాలి. డెంగీగా చెప్పి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. – నూకరాజు, మలేరియా అధికారి, కర్నూలు కర్నూలు(హాస్పిటల్): దోపిడీ జబ్బు ఉన్న కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు డెంగీ బూచీతో జ్వరపీడితుల జేబులను ఖాళీ చేస్తున్నాయి. జ్వరంతో వెళ్తే చాలు ర్యాపిడ్ టెస్ట్ చేయడం, ప్లేటెలెట్స్ తగ్గాయని భయపెట్టడం, తర్వాత చికిత్స పేరుతో రూ. లక్ష నుంచి రూ. లక్షన్నర వరకు బిల్లులు బాదడం పరిపాటిగా మారింది. డెంగీ జ్వరం నిర్ధారణ ర్యాపిడ్ టెస్ట్ ద్వారా గాకుండా ఎలీసా టెస్ట్ ద్వారా చేయాలని అధికారులు చెబుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. రోగుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నా పట్టించుకునేవారు లేరు. జిల్లాలో 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటితో పాటు మరో 12 ఆరోగ్య కేంద్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. వీటితో పాటు 28 అర్బన్హెల్త్ సెంటర్లు, 5 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, రెండు ఏరియా ఆసుపత్రులు, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఉన్నాయి. వీటితో పాటు కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోనిలో 170కి పైగా రిజిస్టర్డ్ ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. జిల్లాలో గత జనవరి నుంచి ఇప్పటి వరకు 190 మంది వరకు డెంగీ వ్యాధిగ్రస్తుల సంఖ్య నమోదైంది. ఈ వ్యాధి లక్షణాలతో ఉన్న వారు దీనికి మూడింతలు ఉన్నారు. చాలా మంది పేదలు, మధ్యతరగతి ప్రజలు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు. కాస్త ఆర్థిక స్తోమత ఉన్న వారు మాత్రం ప్రైవేటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో వైద్యుల సంఖ్య పెరగడం, అందరికీ డిమాండ్ లేకపోవడం, రోగుల సంఖ్య తక్కువగా ఉంటోంది. దీంతో కొందరు వైద్యులు వచ్చిన వారి నుంచే ఎక్కువగా వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. కొందరు ఆర్ఎంపీలకు 50 శాతానికి పైగా కమీషన్లు ముట్టజెబుతూ వారి ఆసుపత్రులకు రోగులు తెచ్చేలా చేసుకుంటున్నారు. ఇలా వచ్చిన వారిని ముందుగా రూ.5వేలకు తగ్గకుండా వివిధ రకాల వైద్యపరీక్షలు చేయించి చికిత్స చేస్తున్నారు. సాధారణ జ్వరంతో వెళ్లినా రూ.6వేలకు తక్కువగాకుండా వసూలు చేస్తున్నారు. ఇలాంటి ఆసుపత్రులు ఎక్కువగా కర్నూలులోని కొత్తబస్టాండ్, ఎన్ఆర్ పేట, గాయత్రి ఎస్టేట్ వంటి ప్రాంతాల్లో ఉన్నాయి. వైద్యులకు అధిక మొత్తంలో డబ్బులు ఇచ్చుకోలేని కొందరు రోగులు ప్రైవేటు వైద్యుల వద్ద పరిస్థితిని అర్థం చేసుకుని తాము మళ్లీ వస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే చాలా మంది రోగులు జ్వరం వచ్చిందంటే ముందుగా మెడికల్షాపులకు వెళ్లి లక్షణాలు చెప్పి మందులు కొని వాడి తగ్గించుకుంటున్నారు. డెంగీ ఇలా వస్తుంది డెంగీ జ్వరం ఏడిస్ ఈజిప్టై అనే దోమకాటు వల్ల వస్తుంది. ఈ దోమ శరీరంపై నల్లటి, తెల్లటి చారలు ఉంటాయి. శరీరంపై చారలు ఉండటం వల్ల దీనిని పులిదోమ అని కూడా పిలుస్తారు. ఈ దోమ శుభ్రమైన, నిల్వ ఉన్న నీటిలో గుడ్లు పెడుతుంది. సూర్యోదయమైన రెండు గంటల వరకు, సూర్యాస్తమయానికి రెండు గంటల ముందు మాత్రమే ఇది కుడుతుంది. ఇది కేవలం రెండు వారాలు మాత్రమే జీవిస్తుంది. ఈ దోమ తన జీవితకాలంలో మూడుసార్లు మాత్రమే గుడ్లు పెడుతుంది. ప్రతిసారీ వంద గుడ్లను పెడుతుంది. ఈ దోమలు ఇంట్లో బట్టలు, పరుపులు, కర్టన్స్ వెనుక కూడా దాక్కుంటాయి. ఈ దశలోనే ఆసుపత్రిలో చేర్చాలి తీవ్రమైన కడుపునొప్పి, రక్తవాంతులు అవుతుంటే, శరీరంపై ఎర్రటి దద్దుర్లు రావడం, ముక్కు, చిగుళ్లల్లో రక్తం స్రవించడం, మలమూత్రాల్లో రక్తం పడటం, మత్తుగా ఉండటం, ఊపిరితీసుకోవడం కష్టంగా ఉన్న పరిస్థితుల్లో తప్పనిసరిగా ఆసుపత్రిలో చేర్చాలి. డెంగీ షాక్ సిండ్రోమ్, డెంగీ హెమరేజిక్ సిండ్రోమ్ దశలో ఆలస్యం చేయకుండా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాలి. సాధారణ మనిషిలో ప్లేట్లెట్లు 1.50 లక్షల నుంచి 4.50 లక్షల వరకు ఉంటాయి. డెంగీ సీజన్లో ఈ రక్తకణాల సంఖ్య 10వేలలోపు ఉంటే మాత్రమే జాగ్రత్త పడి ఆసుపత్రిలో చేరాలి. జ్వరం తగ్గినా కూడా వారం తర్వాత అప్రమత్తంగా ఉండాలి. ఈ దశలో శరీరంలో వాపులు వస్తే మాత్రం ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ర్యాపిడ్ టెస్ట్తో దోపిడీడెంగీ పరీక్ష నిర్ధారణ కోసం మొదట ర్యాపిడ్ కిట్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. అందులో డెంగీ పాజిటివ్గా నిర్ధారణ అయితే ఆ రోగి రక్తనమూనాలను కర్నూలు మెడికల్ కాలేజిలోని మైక్రోబయాలజి ల్యాబ్, ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలి. ఈ ల్యాబ్లకు ప్రతిరోజూ 30 నుంచి 40 వరకు రక్తనమూనాలు వస్తున్నాయి. ఇక్కడి నివేదికల ఆధారంగా డెంగీ నిర్దారణ చేస్తారు. ఇక్కడి వైద్యులు ఇచ్చే టెస్ట్ ఆధారంగానే వ్యాధి నిర్దారణ చేస్తారు. కానీ అధిక శాతం ప్రైవేటు ఆసుపత్రులు కేవలం ర్యాపిడ్ కిట్లో వచ్చిన నివేదికల ఆధారంగా డెంగీగా చెప్పి చికిత్స చేస్తున్నారు. రక్తంలో ప్లేట్లెట్లు(రక్తకణాలు) తగ్గాయని చెప్పి బ్లడ్బ్యాంకులకు పంపి వాటిని తెప్పించి ఎక్కిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో విచ్చలవిడిగా వసూళ్లు ర్యాపిడ్ టెస్ట్ రిపోర్టుతోనే చికిత్స ఎలీసా టెస్ట్ చేయించని ఆసుపత్రులు పలు ల్యాబ్ల్లో తప్పుడు నివేదికలు..! ప్రతి జ్వరమూ.. డెంగీ కాదంటున్న వైద్యులు -
‘కూటమి’ చేస్తున్న అప్పులను గమనించాలి
పాణ్యం: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులను, దోపిడీని ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు గమనించాలని నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయనకు అక్కడున్న ప్రవాసాంధ్రులు ఘనస్వాగతం పలికారు. అనంతరం డల్లాస్లో ఏర్పాటు చేసిన ప్రవాసాంధ్ర ప్రతినిధుల ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథులుగా కాటసాని రాంభూపాల్రెడ్డితో పాటు ఆయన కుమారుడు కాటసాని శివనరసింహారెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. జగనన్న పాలన అంటే ప్రజలకు నమ్మకమన్నారు. జగనన్న పాలనలో 15,004 గ్రామ, వార్డు సచివాయాలు ఏర్పాటయ్యాయని, 2.6 లక్షల మంది వలంటర్లీ సేవలు అందించారని, స్పందన కార్యక్రమంతో లక్షల సమస్యలు పరిష్కారం అయ్యాయన్నారు. కొత్తగా 17 మెడికల్ కళాశాలు, ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ, ఆరోగ్యశ్రీలోకి 3 వేలలకు పైగా చికిత్స చేరి సామాన్యులకు ఆరోగ్య భరోసా కలిగిందన్నారు. పదివేలకు పైగా వైఎస్సార్ఆరోగ్య క్లినిక్లు తీసుకొచ్చారన్నారు. నాడు–నేడు పథకం ద్వారా 50వేల పైగా పాఠశాలలను ఆధునికీకరణ చేశారన్నారు. మొత్తం 6.16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 28.89లక్షల ప్రయివేట్ ఉద్యోగాలు కల్పించారన్నారు. సీఎస్డీపీ వృద్ధిరేటు 11.43శాతంగా దేశంలో మొదటి స్థానంలో నిలించిందన్నారు. జగనన్న పాలనలో కాగ్ నివేదిక కేంద్ర గణాంకాలు ఉన్నాయన్నారు. టీడీపీ, జనసేన, కూటమి తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేశాయని, సోషల్ మీడియా పోస్టులతో ప్రజలకు నిజం చెప్పాలన్నారు. జగనన్న నాయకత్వం ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియాలన్నారు. నిజం మాట్లాడే గొంతులుగా ఎన్ఆర్ఐలు ముందుకు రావాలన్నారు. అమెరికా డల్లాస్లో కాటసాని ఆత్మీయ సమావేశం -
స్థల విషయంలో ఘర్షణ.. ఒకరి మృతి
ఆదోని అర్బన్: స్థల విషయంలో ఘర్షణ జరిగి ఒక వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఆదోని త్రీటౌన్ సీఐ రామలింగమయ్య తెలిపిన వివరాల మేరకు.. అరుంజ్యోతినగర్లో గిరి బాబు, వీరేష్ కుటుంబాలు పక్కపక్కనే ఉంటున్నా యి. ఇద్దరు కుటుంబాల మధ్య గతంలో స్థల వివా దం ఉంది. గిరిబాబు ఇంటిపై నుంచి నీటిని కిందకు తోడేస్తుండగా వీరేష్ కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారు. దీంతో వాగ్వాదం జరిగి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణలో గిరిబాబు బాబాయ్ లక్ష్మన్నకు గాయాలయ్యాయి. ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. కర్నూలుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ఎమ్మిగనూరు సమీపంలో లక్ష్మన్న మృతిచెందాడు. దీంతో లక్ష్మన్న కుటుంబ సభ్యులు ఆదోని త్రీటౌన్ పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. సీఐలు రామ లింగమయ్య, శ్రీరామ్ మృతుడి బంధువులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. వ్యవసాయం చేసే లక్ష్మన్నకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామలింగమయ్య తెలిపారు. పోలీస్స్టేషన్ ఎదుట మృతుడి కుటుంబ సభ్యుల ఆందోళన -
బుజ్జి పిట్ట.. చిట్టి గూళ్లు!
పిట్ట కొంచెం కూత ఘనమే కాదు.. గూడు కట్టడంలో ఎవరైనా తన తర్వాతనే అని చెప్పవచ్చు. తన పొదరిల్లు నిర్మాణంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇతర జీవాల నుంచి రక్షణగా చిటారు కొమ్మన గూడు కట్టుకుంటోంది. తేలికపాటి గడ్డి పోచలతో మెత్తని పాన్పు వల్లె అల్లుకుంటుంది. కళాత్మకమైన గిజిగాడు గూళ్లను చూస్తే ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. గార్గేయపురం సమీపంలోని ఓ వ్యవసాయ బావి గట్టుపై ఉన్న చెట్టు కొమ్మలకు బుజ్జి పిట్టలు చిట్టి గూళ్లను ఏర్పాటు చేసుకుని నివాసముంటున్నాయి. – కర్నూలు(రూరల్) -
కొండల రాయుడికి నేడు తేళ్ల నైవేద్యం
ఎక్కడైనా దేవుళ్లకు పాలు, పండ్లు, ఫలహారాలను భక్తులు నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే కోడుమూరు కొండపై వెలసిన శ్రీకొండలరాయుడికి మాత్రం భక్తులు తేళ్లను చేతులతో పట్టుకొని స్వామివారిపై వదిలి మొక్కులు తీర్చుకుంటారు. ప్రతి యేడాది శ్రావణమాసంలో వచ్చే మూడో సోమవారం ఈ వింత ఆచారాన్ని ప్రజలు దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. విషపురుగులైన తేళ్లను చూస్తే ఎక్కడైనా ప్రజలు ఆమడదూరం పరుగెడతారు. ఇక్కడ కొండమీద మాత్రం భక్తులు చిన్న రాళ్లను ఎత్తుతూ వాటికింద ఉండే తేళ్లను ఎలాంటి జంకుబొంకులేకుండా పట్టుకొని స్వామికి నైవేద్యంగా సమర్పించి కోరికలను కోరుకుంటారు. చిన్నా పెద్దా తేడా లేకుండా నిర్భయంగా తేళ్లను చేతులతో పట్టుకొని స్వామివారికి సమర్పించడం విశేషం. తేలు కుట్టినా ఏమీ కాదన్న నమ్మకం స్వామి వారికి సమర్పించేందుకు తేలును పట్టుకునే సమయంలో కుట్టినా ఏమి కాదని భక్తులు చెబుతారు. తేలు కుట్టినపుడు స్వామి వారి ఆలయం చుట్టు మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తే తగ్గిపోతుందనేది భక్తుల నమ్మకం. కొండపై వెలసిన కొండలరాయుడును దర్శించుకోవాలంటే ప్రజలు కిలోమీటర్కుపైగా ఉన్న కొండను కాలినడకన ఎక్కాలి. – కోడుమూరు రూరల్ -
సింహ వాహనంపై ప్రహ్లాదరాయలు
మంత్రాలయం: మేళతాళాల సుస్వరాలు.. పండితుల వేద ఘోషలు.. కేరళ డోలు ధ్వానాలు.. భక్తజనుల కోలాహలం మధ్య ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు సింహవాహనంపై దేదీప్యమానంగా ఊరేగాడు. శ్రీరాఘవేంద్రుడి 354వ ఆరాధన సప్త రాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో పూర్వారాధన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులకు ఊంజల మండపంలో ఊంజల, దివిటీ సేవలు చేశారు. అనంతరం ప్రహ్లాదరాయలును సింహవాహనంపై శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. ఉదయం రాఘవేంద్రుల మూల బృందావనానికి నిర్మల్య విసర్జన, పుష్పార్చన, విశేష పంచామృతాభిషేకం చేసి అలంకరించారు. పూజా మదిరంలో రాయరు, మూల, జయ, దిగ్విజయ, రాములకు సంస్థాన పూజ నిర్వహించారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు పూర్వారాధన సందర్భంగా యోగీంద్ర మండపంలో కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బెంగళూరుకు చెందిన బెట్ట వెంకటేష్ బృందం నాద తరంగిని, జుగల్బందీ చేపట్టారు. రాయచూరుకు చెందిన మంగళకలార్చన సంది నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి. అనుగ్రహ ప్రశస్థి అవార్డులు పలువురు ప్రముఖులకు రాఘవేంద్రస్వామి అనుగ్రహ ప్రశస్థి అవార్డులు ప్రదానం చేశారు. యోగీంద్ర మంటపంలో కాశి యూనివర్సిటీ రిటైర్డు వైస్ చాన్స్లర్, పండిట్ రాజారామ్ శుక్లా, కోయంబత్తూరుకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ పీఆర్ విఠల్కు పీఠాధిపతి చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి శ్రీధర్రావు, ఏఏవో మాధవశెట్టి అవార్డు గ్రహీతల బయోడేటా భక్తులకు పరిచయం చేశారు. ఘనంగా పూర్వారాధన ఉత్సవాలు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు -
చేనేతకు ‘రెండొందల’ విధాలుగా షాక్!
ఎమ్మిగనూరుటౌన్: జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3,398 మంది మగ్గాలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ‘చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్’ వస్తుందని అందరూ ఆశించారు. అయితే అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా హామీ అమలు కాలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చే వంద యూనిట్ల ఉచిత విద్యుత్ మాత్రమే నేటికీ అమలు అవుతోంది. వంద యూనిట్ల కంటే ఏ ఒక్క యూనిట్ వినియోగించినా బిల్లు చెల్లించాల్సి వస్తోంది. అప్పుల బాధతతో ముడి సరుకు కొనుగోలు చేయలేక చేనేత కార్మికులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ఫలితంగా చేనేతపురి అయిన ఎమ్మిగనూరులో మగ్గాలు మూతపడే దుస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నెలకొంది. నేతన్నకు అండగా గత ప్రభుత్వం చేనేత రంగానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. సంక్షేమ పథకాల క్యాలెండర్లో నిర్దేశించిన తేదీ మేరకు సొంత మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24వేల వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేసింది. ఐదేళ్ల కాలంలో జిల్లాలోని చేనేత కార్మికులకు రూ.40.77కోట్ల మేర సాయం అందింది. నేతన్న నేస్తంతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన ఘనత గత ప్రభుత్వానికే దక్కింది. అదేవిధంగా దివంగత నేత వైఎస్సార్ హయాంలో చేనేత సంఘాలకు రుణమాఫీ చేశారు. పావలా వడ్డికే రుణ సదుపాయం కల్పించారు. అలాగే 50 ఏళ్లకే చేనేత పింఛన్ మంజూరు చేశారు. నేటి దుస్థితి ఇదీ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేత రంగం అస్తవ్యస్తమైంది. నేత పని లేక మగ్గాలు మూతపడ్డాయి. చేనేత కార్మికులు ఇతర రంగాల్లో కూలీలుగా మారిపోయారు. కొందరు వృత్తి పని మానుకుని దూర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. కొందరి ఇళ్లలో వృద్ధుల పోషణ, పిల్లల చదువులు భారంగా మారాయి. పోరాటం చేస్తాం చేనేతలపై ఇంత నిర్లక్ష్యం వహించడం పద్ధతి కాదు. వృత్తిని కాపాడుకొని ఆర్థికంగా బలోపేతం అయి వారి కుటుంబాలు బాగుపడే విధమైన సంక్షేమ పథకాలు ఇవ్వాలి. ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ ఇవ్వకుంటే చేనేత కార్మికుల పక్షాన పోరాటం చేస్తాం. – బుట్టారేణుక, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్, ఎమ్మిగనూరు ‘‘ నేనే హామీ ఇస్తున్నా. చేనేతల 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇస్తా. మాట నిలబెట్టుకుంటా. ఎప్పుడు బాబు మాటంటే మాటే. మాట మీదుంటా. చేనేత కార్మికులను ఆదుకొంటానని తెలియజేస్తున్నా’’ – ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు టీడీపీ అధినేతగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఇదీ.. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీని అమలు చేయలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎమ్మిగనూరు పట్టణం ఎల్లమ్మబీడు చేనేత కార్మికుడు చిన్న ఆదెన్న అప్పుల బాధతతో ఆత్మహత్య చేసుకున్నాడు. అయినా రాష్ట్ర ప్రభుత్వంలో స్పందన లేదు. టీడీపీ అధినేతగా ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు మరచిపోయారు. విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తుండడంతో చేనేత కార్మికులు విలవిల్లాడుతున్నారు. అందని 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మగ్గాలు మూతపడే దుస్థితి భారంగా ముడి సరుకుల కొనుగోలు కూటమి ప్రభుత్వం చేసిన మోసంపై చేనేత కార్మికుల ఆగ్రహం -
పల్లెవించని పారిశుద్ధ్యం!
గ్రామీణ ప్రాంతాలపై కూటమి ప్రభుత్వం శీతకన్ను వేసింది. గ్రామ పంచాయతీలకు విడుదల కావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులకు ఈ ఏడాది మార్చి నుంచి గ్రహణం పట్టింది. మేజర్ మినహాయిస్తే, చిన్న పంచాయతీల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలన్నా నయాపైసా డబ్బులు లేక గ్రామీణ ప్రాంతాల్లో దుర్భక పరిస్థితి నెలకొంది. కనీసం అవసరమైన ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు కూడా లేకపోవడం వల్ల అనేక గ్రామల్లో మురుగునీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. ప్రజల రాకపోకలకు ఇబ్బందికరంగా మారడంతో పాటు రోగాల భయం వెంటాడుతోంది.కర్నూలు(అర్బన్): జిల్లాలో మొత్తం 484 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇందులో 19 మేజర్ గ్రామ పంచాయతీలు కాగా, మిగిలిన 465 మైనర్ పంచాయతీలే. మేజర్ పంచాయతీల్లో కొద్దోగొప్పో ఆదాయ వనరులు ఉన్న నేపథ్యంలో పలు రకాల పనులు చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయి. చిన్న పంచాయతీలు కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే గ్రాంట్లపైనే ఆధారపడుతున్నాయి. అన్ని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావాల్సి ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గత ఏడాది నవంబర్ నెలలో మొదటి విడతగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు రూ.33,12,42,750 విడుదలయ్యాయి. ఇదే అర్థిక సంవత్సరానికి సంబంధించి 2వ విడత నిధులు ఈ ఏడాది మార్చి నెలలో విడుదల కావాల్సి ఉంది. అయితే నేటి వరకు ఈ నిధులు విడుదల కాకపోవడం వల్ల పల్లెల్లో కనీసం చెత్తను ఎత్తివేసేందుకు కూడా అధికారులు, సర్పంచులు దిక్కులు చూడాల్సి వస్తోంది.వైఎస్సార్సీపీ సర్పంచ్లు కావడంతోనే జాప్యంగ్రామ పంచాయతీలకు నిధులను విడుదల చేయడంలో రాజకీయ కుట్ర కోణం దాగుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో మూడు వంతులకు పైగా వైఎస్సార్సీపీకి చెందిన సర్పంచులే ఉన్నారు. ప్రభుత్వం విడుదల చేసే నిధులతో పనులు చేపడితే వైఎస్సార్సీపీ సర్పంచులకు మంచి పేరు వస్తుందనే అక్కసుతో కూడా కూటమి ప్రభుత్వం నిధులను విడుదల చేయడంలో జాప్యం చేస్తుందన్నదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలలో గతంలో ఎన్నడూ ఇంత జాప్యం జరగలేదని, ఈ ప్రభుత్వంలోనే జాప్యం చోటు చేసుకుంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్థిక సంఘం నిధులు విడుదల కాకపోవడం వల్ల గ్రామాల్లో కనీసం పారిశుద్ధ్య పనులను కూడా చేపట్టలేని పరిస్థితి అనేక పంచాయతీల్లో నెలకొంది.ఐవీఆర్ఎస్ కాల్స్పై హడావుడిగ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ కమిషనరేట్ నుంచి ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) కాల్స్ చేస్తోంది. మీ గ్రామంలో వీధులు శుభ్రంగా ఉన్నాయా? ఇంటింటికి వచ్చి చెత్త తీసుకువెళ్తున్నారా? మీ గ్రామంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్డు ఉపయోగంలో ఉందా? మురుగు కాలువలు శుభ్రంగా ఉన్నాయా? ఎన్ని రోజులకు ఒకసారి డ్రైన్లు శుభ్రం చేస్తున్నారు? అంటు ప్రజలకు ఫోన్లు చేసి సమాధానాలు రాబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు సంబంధించి జెడ్పీ సీఈఓ, జిల్లా పంచాయతీ అధికారి, ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులు కోడి కూయక ముందే గ్రామాలకు వెళ్తున్నారు. ఆయా గ్రామాల్లోని చెత్తను ఎత్తివేయించేందుకు చర్యలు చేపడతున్నారు. అయినా, రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పోలిస్తే కర్నూలు జిల్లాలో వచ్చే వంద కాల్స్లో 55 శాతం మంది పాజిటివ్గా స్పందిస్తుంటే, మిగిలిన 45 శాతం మంది ప్రజలు నెగిటివ్గా సమాధానాలు ఇస్తున్నట్లు అధికారుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.జిల్లాలో పారిశుద్ధ్య కార్మికుల వివరాలుమొత్తం గ్రామ పంచాయతీలు: 484క్లాప్మిత్రలు: 1,300రెగ్యులర్, కాంట్రాక్టు వర్కర్లు: 300షెడ్ మిత్రలు: 303అంతంత మాత్రంగా చెత్త సేకరణ● మెజారిటీ గ్రామ పంచాయతీల్లో చెత్త సేకరణ అంతంత మాత్రంగానే జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.● ట్రాక్టర్లను మినహాయిస్తే ఆటోలు, మూడు చక్రాల ట్రై సైకిళ్ల నిర్వహణ లోపం కారణంగా పలు గ్రామ పంచాయతీల్లో మూలన పడ్డాయి.● ఇంటింటికి వెళ్లి ప్రతి రోజు చెత్తను సేకరించాల్సి ఉన్నా పలు పంచాయతీల్లో సంబంధిత అధికారులు మస్టర్లు వేసేందుకు కూడా తీరిక లేనట్లు వ్యవహరిస్తున్నారు.● పారిశుద్ధ్య కార్యక్రమాల భారాన్ని శానిటరీ మేసీ్త్రలపై వేసి కార్యాలయాల్లో కాలక్షేపం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.● మేజర్ గ్రామ పంచాయతీల్లోని పలు వీధుల్లో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి.● పైగా డ్రైనేజీలను కూడా నిర్ణీత సమయానికి శుభ్రం చేయకపోవడం వల్ల డ్రైన్ల నుంచి మురుగు నీరు రోడ్లపైకి ఎక్కి పారుతోంది.పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాంజిల్లాలో పారిశుద్ధ్య సమస్యను మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ముఖ్యంగా ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించేందుకు ప్రాధాన్యతను ఇస్తున్నాం. అలాగే ఐవీఆర్ఎస్ కాల్స్పై ఎప్పడికప్పుడు స్పందించి ఆయా గ్రామాలకు వెళ్లి పరిస్థితిని సమీక్షించి ప్రజల ఇబ్బందులను తొలగిస్తున్నాం. ప్రతి రోజు ఉదయమే జిల్లాలోని ఏదో ఒక గ్రామానికి వెళ్లి అక్కడి ఉద్యోగులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నాం. అలాగే పల్లె ప్రజలకు రక్షిత మంచి నీటిని అందించేందుకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడంలో భాగంగా నీటి ట్యాంకులను క్లోరినేషన్ చేయిస్తున్నాం.– జి.భాస్కర్, జిల్లా పంచాయతీ అధికారిన్యాయస్థానాలను ఆశ్రయిస్తాంగ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడితే వైఎస్సార్సీపీ సర్పంచులకు మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.1,320 కోట్లను ఇతర అవసరాలకు కూటమి ప్రభుత్వం వాడుకున్నట్లు తెలుస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 2వ విడత నిధులే ఇప్పటి వరకు విడుదల కాకుంటే, 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఎప్పుడు విడుదల అవుతాయో? గ్రామాల్లో తాము చేసిన పనులకు సంబంధించి బిల్లుల విడుదలలో జరుగుతున్న జాప్యంపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం.– కె.కేశవరెడ్డి, సర్పంచ్, చిన్నహుల్తి, పత్తికొండ మండలం -
కుందూ.. కనువిందు!
కుందూనదిలో నీటి ఉద్ధృతికి అలలు ఏర్పడిన దృశ్యం వీచే గాలి.. పారే నీరు.. పండే పైరు.. ప్రకృతిలో సహజ సిద్ధమైనవి. వీటిని మనస్సుతో ఆస్వాదిస్తే మధురానుభూతి కలుగుతుంది. శ్రీశైలం జలశాయానికి వరదనీరు పోటెత్తడంతో పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కుందూనదికి భారీగా నీటిని విడుదల చేశారు. పట్టణ శివారులో కుందూ వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిలో కొన్ని ప్రాంతాల్లో సముద్రపు అలలవలే ఎగిసి పడుతున్నాయి. ఆ దృశ్యాలు అటుగా వెళ్తున్న వారిని కనివిందు చేస్తున్నాయి. – కోవెలకుంట్ల -
కర్నూలులో కేంద్ర బలగాల కవాతు
కర్నూలు: వినాయక చవితి, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కర్నూలులో కేంద్ర సాయుధ బలగాలు (రాపిడ్ యాక్షన్ ఫోర్స్) ర్యాలీ నిర్వహించాయి. శనివారం పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పించేందుకు, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు సాయుధ బలగాలు కవాతులో పాల్గొన్నాయి. కలెక్టరేట్ నుంచి రాజ్విహార్, కిడ్స్ వరల్డ్, పూలబజార్, గాంధీ చౌక్, మించిన్ బజార్, కాంగ్రెస్ ఆఫీస్ మీదుగా కొండారెడ్డి బురుజు వరకు ర్యాలీ సాగింది. ర్యాలీలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కమాండెంట్ విజయ్ కుమార్ వర్మ, అసిస్టెంట్ కమాండెంట్ పాపారావు కీర్తి, ఇన్స్పెక్టర్లు బి.రాజు, భారతి, సివిల్ సీఐలు నాగరాజరావు, శేషయ్య, మన్సూరుద్దీన్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
గంగలో చేపల వరద!
మహానంది: నిండుగా ప్రవహిస్తున్న తెలుగుగంగలో జాలర్ల వల నిండుతోంది. వీబీఆర్ నుంచి కృష్ణా జలాలు దిగువగా విడుదల చేయడంతో కాల్వలో నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో మహానంది సమీపంలోని అయ్యన్ననగర్ గ్రామం వద్ద మహానంది ఆలయ కోనేరు నీరు వెళ్లేందుకు తెలుగు గంగ కాలువపైన ఏర్పాటు చేసిన సబ్ చానల్ వద్ద స్థానికులు వలలు ఏర్పాటు చేశారు. అక్కడే నీరు తొణుకులు తొక్కుతూ గలగల పారుతుంది. గంగ కాలువలో నుంచి పెద్దపెద్ద చేపలు ఎగిరిపడుతూ వలలో పడుతున్నాయి. ఒక్కొక్క చేప సుమారు 15 కిలోల నుంచి 20 కిలోల వరకు ఉండటంతో వారి పంట పడుతోంది. -
పెద్దాసుపత్రిలో ఇద్దరికి అరుదైన శస్త్రచికిత్సలు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఇద్దరు రోగులకు అరుదైన శస్త్రచికిత్సలు చేసి వైద్యులు ప్రాణం పోశారు. శనివారం వైద్యులను తన చాంబర్లో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, కేఎంసీ వైస్ ప్రిన్సిపాల్, జనరల్ సర్జరీ హెచ్ఓడీ డాక్టర్ హరిచరణ్ అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ రామకృష్ణ నాయక్ ఆపరేషన్ వివరాలు తెలిపారు. వివరాలు ఆయన మాటల్లోనే...‘బేతంచెర్లకు చెందిన సుమలత(25) నాలుగేళ్లు గా తరచూ రక్తపు వాంతులు, అధిక మాసిక రక్తస్రావం, ప్యాన్సైటోపెనియా కారణంగా తరచూ రక్తం ఎక్కించుకుంటూ వచ్చారు. గతంలో ఈవీఎల్ బ్యాండింగ్ చేయించుకున్న ఆమెకు గత నెల 15వ తేదీన ఆసుపత్రిలో చేరారు. అదే నెల 24న ఆమెకు స్ల్పీనెక్టమి అనంతరం స్ల్పీనోరెనల్ షంట్ శస్త్రచికిత్స చేశారు. శస్త్రచికిత్స సమయంలో ఆమె ప్లీహం పరిమాణం 20శ్రీ15 సెం.మీ,బరువు 1.5 కిలోలుగా నమోదైంది. ఆమె ప్లేట్లెట్ల సంఖ్య కేవలం 46 వేలు ఉండగా ఆపరేషన్ అనంతరం అది 5 లక్షలకు చేరుకుంది. ఆప రేషన్ తర్వాత ఆమెకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకపోవడంతో ఈ నెల 9వ తేదీన డిశ్చార్జ్ చేశాం. అలాగే గోనెగండ్లకు చెందిన రంగస్వామి(53) మద్యపానం అలవాటు ఉంది. తరచూ కడుపునొప్పితో బాధపడుతున్న ఆయన గత జూన్ 26న ఆసుపత్రిలో చేరాడు. ఆయనకు వైద్యపరీక్షలు చేయగా క్రానిక్ కేల్సి ఫిక్ పాంక్రియాటైటిస్గా నిర్ధారణ అయ్యింది. అదే నెల 29వ తేదీన ఆయనకు లాటరల్ పాంక్రియాటికో–జెజునోస్టమి అనే శస్త్రచికిత్స చేశాం. ఆపరేషన్ సందర్భంలో ఆయన పాంక్రియాస్లో 10 రాళ్లు ఉండగా అందులో ఒకటి 3శ్రీ2 సెం.మీ పరిమాణంలో ఉండటం అరుదైన విషయం. ఆపరేషన్ అనంతరం కోలుకోవడంతో జులై 5వ తేదీన ఆయనను డిశ్చార్జ్ చేశాం’ అని వివరించారు. ఆపరేషన్ చేసిన వారిలో ప్రొఫెసర్ డాక్టర్ జయరామ్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సబీరా, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రణీత్, డాక్టర్ ప్రశాంతి, పీజీలు, అనెస్తీషియా వైద్యులు హెచ్ఓడీ డాక్టర్ విశాల, ప్రొఫెసర్ డాక్టర్ సుధీర్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణలత, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సంజీవకుమార్ ఉన్నట్లు తెలిపారు. -
విస్తృతంగా పోలీసు తనిఖీలు
కర్నూలు: రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు జిల్లా అంతటా వా హన తనిఖీ కార్యక్రమాలు నిర్వహించారు. రహ దారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ప్రతి శనివారం వాహన తనిఖీలు నిర్వహించాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ల వారీగా వాహన తనిఖీలు నిర్వహించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. మైనర్లు వాహనా లు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని, బైకులు నడిపేవారు కచ్చితంగా హెల్మె ట్లు ధరించాలని సూచించారు. ఓవర్ లోడ్తో వెళ్తున్న వాహనాలను ఆపి కౌన్సెలింగ్ ఇచ్చారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ తనిఖీల్లో పట్టుబడిన వారికి రోడ్డు భద్రత ప్రాముఖ్యత గురించి వివరించి కేసులు నమోదు చేశారు. అనారోగ్యంతో విద్యార్థిని మృతి హొళగుంద: అనారోగ్య ంతో మండల కేంద్రానికి చెందిన కుమ్మరి రూప (13) అనే విద్యార్థిని శుక్రవారం రాత్రి మృతి చెందారు. ఎల్లార్తి ప్రభు త్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కుమ్మరి శరణప్ప, విశాలాక్షి దంపతులకు ఇద్దరు కుమారులతో పాటు రూప కూతురు. గ్రామానికి సమీపంలోని మాటసుగురు గ్రామం వద్ద ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. రూప గత 8 నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతూ మృతి చెందారు. ఇదిలా ఉండగా హొళగుంద గ్రామంలో శనివారం ఒక్క రోజే వివిధ కారణాలతో నలుగురు మృతి చెందారు. వృద్యాప్యం, అనారోగ్యం, ప్రమాదాలతో వారం వ్యవధిలో 20 మంది మృతి చెందడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం డోన్ టౌన్: డోన్ – అబ్బిరెడ్డిపల్లెకి రహదారిలో పెద్దవంక వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. సీసంగుంతల గ్రామానికి చెందిన మృతుడు నూర్బాషా (49) (అలియాస్ ఎర్రబాషా ఉరఫ్ వలి) లారీ డ్రైవర్గా పని చేస్తూ కొన్నేళ్లుగా పట్టణంలోని ఇందిరానగర్లో నివాసం ఉన్నాడు. శనివారం బైకు మీద అబ్బిరెడ్డిపల్లె వైపు వెళ్తుండగా.. అదే సమయంలో కృష్ణగిరి మండలం కంభాలపాడు గ్రామానికి చెందిన భాస్కర్రెడ్డి అనే వ్యకి త్వరలో జరగబోయే కూతురు పెళ్లి పత్రికలు పంచేందుకు బైకుపై వస్తుండగా పెద్దవంక వద్ద రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని చికిత్సల నిమిత్తం ఆసుపత్రికి తరలించగా నూర్బాషా తలకు తీవ్రమైన గాయాలు కావడంతో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. భాస్కర్రెడ్డిని మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. మృతుడు నూర్బాషాకు భార్య, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
పంచాయతీ కార్యదర్శుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
కర్నూలు(అర్బన్): ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శుల సంఘం కర్నూలు జిల్లా యూనిట్ నూతన కార్యవర్గాన్ని శనివారం స్థానిక ఎంపీపీ హాల్లో జరిగిన సమవేశంలో ఎన్నుకున్నారు. కార్యక్రమాని కి సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ వై.హేమంత్కుమార్రెడ్డి హాజరై నూతన కార్యవర్గాన్ని అభినందించి పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై చర్చించారు. సంఘం సభ్యులు జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. నూతన కార్యవర్గం అధ్యక్షులుగా పి.జగన్నాథం, ప్రధాన కార్యదర్శిగా ఎన్.శ్రీధరమూర్తి, అసోసియేట్ ప్రెసిడెంట్గా పీఎస్జే సిద్దు, కోశాధికారిగా కె.సురేష్, ఉపాధ్యక్షులుగా బి.సుధాకర్రెడ్డి,జి.లక్ష్మన్న, టి.రవికుమార్,సంయు క్త కార్యదర్శులుగా బి.శ్రీనివాసులు, బి.మహేష్, ఎం.హుసేన్సాహెబ్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా సి. అంకాలప్పనాయుడు, ఎం.రియాజ్బాషా, బి.బలరామ్, ప్రచార కార్యదర్శులుగా ఎం.సైఫుల్లాబేగ్, కె.సుంకన్న, జి.రాజ్కమల్, డివిజినల్ కార్యదర్శులుగా ఎల్.సురేష్కుమార్, ఎం.మధు, పి.వెంకటేశ్వర్లు, ఈసీ మెంబర్లుగా బి.జనార్దన్, ఎం.రాఘవేంధ్ర, కె.అయ్యన్న ఎన్నికయ్యారు. -
మాజీ ఆర్మీ అధికారి అరెస్టు
● 53 లిక్కర్ బాటిళ్లు స్వాధీనం కర్నూలు: దిన్నెదేవరపాడు గ్రామ శివారులోని తిరుమల గిరి టౌన్షిప్లో నివాసముంటున్న మాజీ ఆర్మీ అధికారి (బీఎస్ఎఫ్) నగేష్ రావు ఇంట్లో డిఫెన్స్ మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. ఈయన ఏడా ది కాలంగా బెంగళూరు నుంచి మిలిటరీ క్యాంటీన్లో ఇచ్చే మద్యం తీసుకొచ్చి వ్యాపారం సాగిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎకై ్సజ్ జిల్లా అధికారి సుధీర్ బాబు ఆదేశా ల మేరకు సీఐలు చంద్రహాస్, రాజేంద్రప్రసాద్ బృందాలుగా ఏర్పడి ఇంట్లో సోదా లు నిర్వహించగా 53 మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. ఇవి ఆర్మ్డ్ పారా మెడికల్ ఫోర్సెస్లో పనిచేసే అధికారులు, సిబ్బందికి మాత్రమే సరఫరా చేస్తారు. అయితే నగేష్ రావు వ్యాపారం నిమిత్తం మిలిటరీ క్యాంటీన్లో కొనుగోలు చేసి రెట్టింపు ధరలకు విక్రయాలు జరుపుతున్నట్లు దర్యాప్తులో తేలింది. దీంతో మద్యం బాటిళ్లు సీజ్ చేసి ఆయనపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు అధికారులు తెలిపారు. తనిఖీల్లో ఎకై ్సజ్ ఎస్ఐలు రెహనా బేగం, ఇంద్రకిరణ్, తేజ, సిబ్బంది రామలింగ, చంద్రపాల్, మధుకిషోర్, రాణి, బషీర్, లాలప్ప తదితరులు పాల్గొన్నారు. -
దొంగలు దొరికారు
● చోరీ కేసును ఛేదించిన పోలీసులు ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో ఈనెల 2వ తేదీన ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసును పట్టణ పోలీసులు ఛేదించారు. బాధితుడి బంధువు సహకారంతో అదే కాలనీకి చెందిన ముగ్గురు ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పట్టుబడిన నిందితులను శనివారం పట్టణ సీఐ యుగంధర్ అరెస్ట్ చూపించారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని హుశేన్రెడ్డి వీధికి చెందిన బండల వ్యాపారి సంజీవరాయుడు కూతురు పెళ్లి కోసం రూ 1.27 లక్షల నగదు, మూడు తులాల బంగారు ఆభరణాలు బీరువాలో ఉంచారు. 2వ తేదీన కుటుంబీకులతో చర్చిలో ప్రార్థనకు వెళ్లారు. వారు తిరిగి వచ్చే లోపు ఇంట్లో చోరీ జరిగి నగదు, బంగారు ఆభరణాలను అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఐ జయప్ప దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు సంజీవరాయుడుకు వరసకు కూతురు అయ్యే వరలక్ష్మీతోపాటు అదే కాలనీకి చెందిన సంతోష్, విజయ భాస్కర్, నాగేంద్ర చోరీకి పాల్పడ్డారని తెలుసుకుని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులు నేరం అంగీరించడంతో పాటు చోరీ సొమ్మును అప్పగించారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. సారా బట్టీలు ధ్వంసం అవుకు: కొండమనాయినిపల్లె గ్రామంలో నాటు సారా స్థావరాలపై శనివారం ఎకై ్సజ్ అధికారులు డాడులు చేసి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ సతీష్ మాట్లడుతూ..ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది ఏడు బృందాలుగా ఏర్పడి గ్రామాల్లో అనుమానిత ఇళ్లలో తనిఖీలు చేసి నలుగురు పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే గ్రామంలోని కొండగుట్టున సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 1,600 లీటర్ల సారా బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు. 20 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నామన్నారు. మునిపాటి రవిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. దాడుల్లో ఎస్ఐలు కమలాకర్, దౌలత్ ఖాన్రమేష్ బాబు స్పెషల్ టీం సభ్యులు పాల్గొన్నారు. -
విజ్ఞాన దర్శిని.. పుస్తకం...
● పుస్తకాన్ని ప్రేమిద్దాం... విజ్ఞానాన్ని దోచేద్దాం... ● మానవుని పురోగమనంలో పుస్తకాలది మహత్తర పాత్ర ● పుస్తక పఠనంతోనే సంపూర్ణ పరిజ్ఞానం ● ఆధునిక సాంకేతికతతో తగ్గుతున్న పుస్తక పఠనం ● పుస్తక పఠనాన్ని ఖచ్చితం చేయాలంటున్న మేధావులు ● నేడు పుస్తక ప్రేమికుల దినోత్సవం కర్నూలు కల్చరల్: పుస్తక పఠనంతో సంపూర్ణ పరిజ్ఙానం సిద్ధిస్తుంది. పుస్తకాల అధ్యయనం ఒక తపన. తీరని విజ్ఙాన దాహం. పుస్తకాలకు పుస్తక ప్రియులకు ఉండే అనుబంధం బలీయమైంది. పుస్తకాన్ని తమ జీవితాన్ని ఆదర్శంగా ముందుకు నడిపించే నిజమైన స్నేహితుడిగా.. మార్గదర్శకుడిగా భావిస్తారు. కొత్త పుస్తకం వచ్చిందంటే ఇంట్లో గ్రంథాలయంలో ఉండాల్సిందే. ఆర్థిక స్తోమత లేక కొన్ని పుస్తకాలు కొనలేకపోయినా ఏ గ్రంథాలయంలోనో స్నేహితుల వద్దో సంపాదించి చదివేదాక వారికి నిద్ర పట్టదు. ఇలాంటి గొప్ప అనుబంధాన్ని పెంచుకున్న పుస్తక ప్రియుల కోసం ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ‘పుస్తక ప్రేమికుల దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. అయితే నేటి ఆధునిక సాంకేతి పరిజ్ఙానం పరుగుల్లో పుస్తక పఠనం బాగా తగ్గిపోయిందని.. ఇది సమాజంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుస్తక పఠనం పెంచేలా చర్యలు చేపట్టాల్సి ఉందని అభిప్రాయ పడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలులో జిల్లా కేంద్ర గ్రంథాలయం ఒకటి, 58 గ్రంథాలయ శాఖలు, ఒకటి గ్రామీణ గ్రంథాలయం ఉంది. సుమారు 150 పుస్తక సంక్షిప్త కేంద్రాలు ఉన్నాయి. జిల్లా కేంద్ర గ్రంథాలయంతో పాటు ఇతర గ్రంథాలయాల్లో 6,50,400 పుస్తకాలు ఉన్నాయి. కేంద్ర గ్రంథాలయంలో 10 వేల మంది, మిగతా వాటిల్లో 70 వేల మంది శాశ్వత సభ్యులు ఉన్నారు. కేంద్ర గ్రంథాలయంలో ప్రతి రోజు సుమారు 450 మంది పఠనం చేస్తుంటారు. -
తనిష్క్లో వజ్రాభరణాల ప్రదర్శన ప్రారంభం
కర్నూలు (టౌన్): నగరంలోని స్థానిక గాంధీనగర్లో ఉన్న తనిష్క్ షోరూంలో ప్రత్యేకంగా వజ్రాభరణాల ప్రదర్శన ప్రారంభించినట్లు షోరూం నిర్వహకులు ముప్పా ధీరజ్, కృష్ణ వెల్లడించారు. షోరూంలో శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలోని 450 స్ట్రోర్ల నుంచి ఎంపిక చేసిన అద్భుతమైన డైమండ్ అభరణాలను అందుబాటులో ఉంచామన్నారు. ఈనెల 10వ తేదీ వరకు ఈ ప్రదర్శన ఉంటుందన్నారు. కార్యక్రమంలో ముప్పా భరత్, షోరూం మేనేజర్ ప్రవీణ్ పాల్గొన్నారు. ●ఈటీపీఎస్లో డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి కర్నూలు(సెంట్రల్): అన్ని శాఖల అధికారులు తమ కార్యాలయాలకు చెందిన డాక్యుమెంట్లను ఈటీపీఎస్ ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఈటీపీఎస్ ఆన్లైన్ పోర్టల్లో డాక్యుమెంట్ అప్లోడ్ చేసే అంశంపై కలెక్టర్ తహసీల్దార్లు, ఎంపీడీఓలతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు తమ కార్యాలయాలకు సంబంధించిన చట్టాలు, నియమ నిబంధనలు, కోర్టు ఆర్డర్లు, మెమోలు, జీఓలు, సర్కులర్లు, ప్రోసీడింగ్స్ తదితర ముఖ్యమైన డాక్యుమెంట్లను స్కానింగ్ చేసి ఈటీపీఎస్ ఆన్లైన్లో పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు. రియల్ టైం గవర్నెన్స్లో ఈ ప్రక్రియ నిర్వహించడం జరుగుతోందని, అన్ని శాఖల అధికారులు మూడో రోజుల్లోపు అప్లోడ్ చేయాలన్నారు. అంశంపై పర్యవేక్షణ చేయాలని డీఆర్వోను ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్లో జేసీ డాక్టర్ బి.నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, కర్నూలు, పత్తికొండ ఆర్డీఓలు సందీప్కుమార్, భరత్నాయక్, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి పాల్గొన్నారు. -
విద్యార్థి దశలోనే అలవాటు చేయాలి
మేధావుల అనుభవాలకు అక్షర రూపం పుస్తకం. ఇవి పాఠకుల్లో జ్ఞానాన్ని, నైతిక విలువలను పెంపొందిస్తాయి. విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందిస్తూ మంచి మిత్రునిలా తోడుండి సమాజాన్ని అర్థం చేసుకోవడానికి సహాయ పడతాయి. విద్యార్థులు సెల్ఫోన్లకు బానిసలుగా మారకుండా నిరంతరం సామాజిక మాధ్యమాల్లో మునిగిపోయి చుట్టూ ఉన్న మనుసులతో సంబంధాలు కోల్పోకుండా పుస్తకాలు కాపాడతాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యార్థి దశ నుంచే పుస్తకాలు చదివించడం గ్రంథాలయాలకు తీసుకొని వెళ్లడం అలవాటు చేయాలి. – డాక్టర్ ఎం. హరికిషన్, ఉపాధ్యాయులు, బాలల కథా రచయిత -
పచ్చదనంపై గొడ్డలి వేటు!
కర్నూలు సిటీ: స్థానిక ప్రభుత్వ (టౌన్ మోడల్) జూనియర్ కాలేజీ ఆవరణలోని పచ్చని చెట్లను అధికారులు తొలగించారు. చెట్లు కాలేజీ భవనం పైభాగానికి పాకాయని, కింది కొమ్మలు ఎండిపోయి రాకపోకలకు అంతరాయం కలుగుతుందనే కారణాలతో పచ్చని నీడనిచ్చే చెట్లను నరికివేసేందుకు నిర్ణయించారు. ఓ టింబర్ డిపోకు పని అప్పగించగా రూ.1500 కూలీ, భోజనం ఖర్చులు ఇచ్చేలా అంగీకారం కుందిరింది. దీంతో శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కాలేజీ ప్రధాన భవనం కుడి వైపు ఉన్న పెద్ద చెట్లు ఐదు, మధ్యస్థంగా ఉండే చెట్లు రెండు, లెక్చర్ హాల్ అండ్ అడిటోరియం భవనం ముందున్న రెండు చెట్లు, మరికొన్ని చెట్ల కొమ్మలను కోత మిషన్, గొడ్డళ్లతో నరికేశారు. వాల్టా చట్టానికి తూట్లు వాల్టా చట్టం ప్రకారం నది పరివాహక ప్రాంతాల్లో తవ్వకాలు, చెట్ల నరివేతకు పాల్పడడం నేరం అవుతుంది. అభివృద్ధి నిమిత్తం ప్రభుత్వ స్థలాల్లో పెంచిన చెట్లను తొలగించాలంటే ముందుగా తహసీల్దారు, ఫారెస్ట్ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. టౌన్ మోడల్ కాలేజీ ఆవరణలోని చెట్లను కొట్టేసేందుకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలుస్తోంది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై ఒక్కో చెట్టుకు రూ.10 వేల వరకు జరిమానా విధించి కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అభివృద్ధి కమిటీ తీర్మానంతోనే.. నేను టౌన్ మోడల్ కాలేజీకి రెండు నెలల క్రితం ప్రిన్సిపాల్గా వచ్చాను. కాలేజీని అభివృద్ధి చేసేందుకు డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో చేసిన తీర్మానాల మేరకు భవనం పైభాగానికి పాకిన కొమ్మలు, రెండు ఎండిన చెట్లు, వేర్లు భవనం పునాదుల్లోకి చొచ్చుకుపోయిన చెట్లు, అడ్డంగా ఉన్న చెట్లను తొలగించాం. కొమ్మలు కిందికు ఉండడంతో ఇటీవల ఓ విద్యార్థికి దెబ్బలు తగిలాయి. నరికేసిన చెట్ల స్థానంలో పూల మొక్కలు నాటించేందుకు చర్యలు తీసుకుంటాం. – పద్మావతి, టౌన్ మోడల్ కాలేజీ ప్రిన్సిపాల్ -
ఉరుకుంద ఈఓ విజయరాజుపై బదిలీ వేటు
మంత్రాలయం: ఉరుకుంద ఈరన్న క్షేత్రం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మేడిపల్లి విజయరాజుపై బదిలీ వేటుపడింది. గుంతకల్లులోని కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయ ఈఓగా ఆయనను బదిలీ చేశారు. అక్కడ ఈఓగా పని చేస్తున్న కె.వాణి ఉరుకుంద ఈరన్న ఆలయ ఈఓగా నియమితులయ్యారు. విజయరాజు గత ఏడాది సెప్టెంబర్ 24న ఇక్కడ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పూజన్న ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. తన సూసైడ్ నోట్లో ప్రధాన అర్చకుడు, వేదపండిట్ మాటలు విని ఈఓ తనతో పాటు ఇతర అర్చకుల పట్ల చులకన భావంతో వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఈఓ బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలాఉంటే కాంట్రాక్టర్ల అక్రమార్జనకు అడ్డుపడుతున్నాడనే కారణంతో రాజకీయ నాయకుల ప్రమేయంతో ఆయనపై బదిలీ వేటు వేసినట్లుగా చర్చ జరుగుతోంది. గతంలో ఈఓగా పని చేసిన హెచ్.జి.వెంకటేష్ కూడా అర్చకుల తట్టను తీయించి ఆలయ ఆదాయాన్ని పెంచడానికి శాఖాపరమైన నిర్ణయం తీసుకోవడం ఆయన బదిలీకి కారణమైంది. అప్పట్లో ఆయనను కూడా ఉత్సవాల వేళనే బదిలీ చేయడం గమనార్హం. తాజాగా విజయరాజు కూడా అదే తరహాలోనే బదిలీ అయినట్లు సమాచారం. నూతన ఈఓగా కె.వాణికె. వాణి -
ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా
కర్నూలు(సెంట్రల్): స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ప్రతి ఇంటిపై మువ్వన్నెల జాతీయ పతకాన్ని ఎగురవేయాలని కలెక్టర్ పి.రంజిత్బాషా జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ గాంధీ విగ్రహం ఎదుట కలెక్టర్ పి.రంజిత్బాషా దంపతులు, జిల్లా అఽధికారులు మువ్వన్నెల జాతీయ జెండాలు చేతబట్టి, క్యాండిల్ లైట్లతో తిరంగా కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా సెల్ఫీ పాయింట్లు/బూత్లు ఏర్పాటు చేసి సెల్ఫీలను www.harfharthiranfa.comలో అప్లోడ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఆగస్టు 15వ తేదీన దేశ భక్తి ఉట్టిపడేలా భక్తిగీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. తిరంగా బైక్/సైకిల్ ర్యాలీలను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాల్లో తిరంగా ప్రదర్శనలు, రంగోలి పోటీలు, రాఖీ తయారీ, వర్కుషాపులను నిర్వహించేలా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డీఈఓ శామ్యూల్పాల్ పాల్గొన్నారు. సెల్ఫీలను హర్ ఘర్ తిరంగా సైట్లో అప్లోడ్ చేయండి -
నమో.. రాఘవేంద్రాయా!
● వైభవంగా ప్రారంభమైన రాఘవేంద్రుల సప్తరాత్రోత్సవాలు ● ధ్వజారోహణతో ఉత్సవాలు ప్రారంభించిన శ్రీమఠం పీఠాధిపతి శ్రీసుబుధేంద్రతీర్థులుమంత్రాలయం: వేదభూమి వేదఘోషతో మార్మోగుతుండగా.. మంగళవాయిద్యాల సుస్వరాలు ఆలపిస్తుండగా.. భక్తజనం నీరాజనాలు పలుకుతుండగా దైవాంశ సంభూతుడు రాఘవేంద్రస్వామి మఠం శిఖరాన ధ్వజం ఎగిరింది. అమరగుడి ఉత్సవాలకు అంకురార్పణ శంఖం పూరించింది. దైవాంశ సంభూతుడు శ్రీరాఘవేంద్రుల 354వ సప్తరాత్రోత్సవాలు శుక్రవారం వైభవోపేతంగా మొదలయ్యాయి. శ్రీమఠం పీఠాధిపతి శ్రీసుబుధేంద్రతీర్థులు అమృత హస్తాలతో శ్రీమఠం శిఖరాగ్రన స్వర్ణ బృందావన ధ్వజారోహణ చేశారు. ఉత్సవాలు ప్రారంభం కావడంతో రాఘవేంద్రస్వామి మూల బృందావనం నుంచి పీఠాధిపతులు ఊరేగింపుగా ఆలయ ముఖధ్వారం ముంగిటకు చేరుకున్నారు. గోపూజ, అశ్వపూజ నిర్వహించి ధ్వజారోహణ గావించారు. ధ్వజారోహణ వేళ భక్తజనం ‘నమో.. రాఘవేంద్రా’ అంటూ స్వరించారు. అనంతరం కార్యనిర్వాహణ కార్యాలయం చేరుకుని లక్ష్మీపూజ, ఏఏఓ, మేనేజర్, జోనల్మేనేజర్ తదితర కౌంటర్లలో పూజలుచేశారు. యోగీంద్ర మంటపంలో రాఘవేంద్రుల మైనపు విగ్రహానికి పుష్పార్చన, మంగళ హారతులు పట్టి జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రాంగణ వీధుల్లో అశేషభక్తజనం మధ్య ప్రభోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. పరిమళ తీర్థం పుష్కరిణి ప్రారంభం శ్రీమఠం చరిత్రలో తొలిసారిగా రాఘవేంద్రస్వామికి తెప్పోత్సవం జరగనుంది. ఉత్సవ నిర్వహణ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన ఎంఆర్జీ గ్రూపు సీఈవోలు ఆశా ప్రకాష్, శ్రీప్రకాశ్ శెట్టి సహకారంతో రూ.3.8 కోట్ల వ్యయంతో పరిమళ తీర్థం పుష్కరిణి నిర్మించారు.. శ్రీమఠం ఈశాన్య భాగంలో ఏర్పాటు చేసిన పుష్కరిణిని పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. అలాగే భక్తుల సహకారంతో మూల బృందావన మంటప స్తంభాలకు బంగారు కవచధారణను ఆవిష్కరించారు. రూ. రూ.40 లక్షలతో నిర్మించిన కవీంద్ర నిలయ డార్మిటరీ, రూ.65లక్షలతో నిర్మించిన వాగీశ డార్మిటరీ, బెంగళూరు వాసులు ఏర్పాటు చేసిన డిజిటల్ లాకర్ సముదాయాలను ప్రారంభించారు. ఉత్సవాల్లో మఠం ఏఏవో మాధవ శెట్టి, మేనేజర్–1 శ్రీనివాసరావు, మేనేజర్–2 వెంకటేష్జోషి, జోనల్మేనేజర్ శ్రీపతిఆచార్, ధార్మిక సహాయకాధికారి వ్యాసరాజాచార్, ధ్వారపాలక అనంతస్వామి, సంస్కృత పాఠశాల ప్రధానాచార్యులు వాదీరాజాచార్ పాల్గొన్నారు. -
సాగు చేయాలంటే వాగు దాటాల్సిందే!
పాణ్యం: ఆ గ్రామ రైతులు పంటలు సాగు చేయాలంటే వాగులో పీకల్లోతు నీరున్నా దాటి అవతలకు వెళ్లాల్సిందే. లేకుంటే నాలుగైదు కిలోమీటర్లు ప్రయాణించి పొలాలకు చేరుకోవాలి. కొన్నేళ్లుగా రైతులు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. ఇక వర్షాకాలంలో రైతులు బాధలు చెప్పలేనివి. మండల పరిధిలోని అహల్యాపురంలో గ్రామంలో రైతుల పరిస్థితి ఇదీ. గ్రామం పక్కనే కొర్రవాగు ప్రవహిస్తుంది. ఈ వాగులో వేసవిలో తప్ప నిత్యం నీటి ప్రవాహం ఉంటుంది. ఇటీవల వర్షాలు కురవడం, ఎస్సార్బీసీ కాల్వలకు నీరు వదలడంతో వాగులో పీకల్లోతు వరకు నీరు ప్రవహిస్తుంది. వాగు అవతల వందల ఎకరాల సాగు భూమి ఉంది. వాగు దాటితే కిలోమీటరు.. లేదా అర కిలోమీటరు దూరంలో పొలాలకు చేరుకుంటారు. ప్రస్తుతం పొలాలకు విత్తనాలు వేసే సమయం కావడంతో రైతులు వాగులో నీటిని దృష్టిలో పెట్టుకొని ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, మహిళా కూలీలు, పనిముట్లతో చుట్టు నాలుగైదు కిలోమీటర్ల దూరం తిరిగి పొలాలకు చేరుకుంటున్నారు. అలా వెళ్లలేని రైతులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకోని పీకల్లోతు నీటిలో దిగి అతి కష్టంమీద వాగు దాటుతున్నారు. పొలంలో విత్తనాలు వేసేందుకు కూలీలను తీసుకెళ్లాలన్నా, మందుల బస్తాలు తీసుకెళ్లాలన్నా నరకయాతన అనుభవిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. గతంలో అనేక ప్రమాదాలు జరిగాయని, అధికారులు ఈ అవస్థల నుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు. వాగుపై బ్రిడ్జి నిర్మించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. వాగు అవతల వందలెకరాల భూమి వర్షాకాలం వచ్చిందటే ప్రాణాలు చేతిలో పెట్టుకొని అవతలకు.. బ్రిడ్జి నిర్మించాలని రైతుల వేడుకోలు -
గువ్వలకుంట్లను సందర్శించిన వైద్య బృందం
కొత్తపల్లి: విష జ్వరాలతో మంచం పట్టిన గువ్వలకుంట్ల గ్రామం ఎస్సీ కాలనీని గురువారం వ్యాధుల నిర్మూలన రీసెర్చ్ బృందం సందర్శించింది. బృందం సభ్యులు కాలనీలో మురికి కుంటలు, నీరు నిల్వ ఉన్న ప్రదేశాలు, కాలనీ నీటి సరఫరా చేసే బావులను, ఇళ్లలోని నీటి తొట్టిలు, డ్రమ్ములు, ఇంటి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా మైక్రో బయాలజీ వైద్యులు సచిన్ సుమంత్ మాట్లాడుతూ.. విష జ్వరాలకు కారణాలు తెలుసుకునేందుకు ముందుగా జ్వర బాధితుల నుంచి రక్త సేకరణ చేశామన్నారు. వీటిని వ్యాధి నిర్ధారణ పంపిస్తామన్నారు. గ్రామస్తులు ఇంటి పరిసరాలను శ్రుభంగా ఉంచుకోవాలన్నారు. ఆయన వెంట జనరల్ ఫిజీషియన్ శంకర్ నరేన్, కమ్యూనిటీ మెడిసిన్ డాక్టర్ జాహ్నవి, డిస్ట్రిక్ట్ ఎపిడమాలజిస్ట్ రమేష్, కొత్తపల్లె వైద్యాధికారులు దీపా నాగవేణి, మహమ్మద్ బేగ్, వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు ఉన్నారు. -
శుభకరం.. వరలక్ష్మీ వ్రతం
శ్రీశైలంటెంపుల్: ‘వర’ అంటే శ్రేష్టమైనది అని అర్థం. ప్రతీ ఒక్కరు కూడా వారి వారి రంగాలలో శ్రేష్ఠతను ఆశిస్తారు. అవిధమైన శ్రేష్ఠతను ప్రసాదించే దేవిస్వరూపమే.. వరలక్ష్మి. కేవలం ధనం, ధాన్యం, కీర్తి మొదలైన భౌతిక సంపదలనే కాకుండా, ఉత్సాహం, ఉల్లాసం, ఆనందం లాంటి మానసిక సంపదలను, ధ్యానశక్తి, యోగశక్తి, మోక్షం లాంటి ఆధ్యాత్మిక సంపదలను కూడా వరలక్ష్మి అనుగ్రహిస్తుంది. శ్రావణమాసంలో శుక్రవారం రోజున ఆచరించే వరలక్ష్మీ వ్రతానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన లక్ష్మీదేవి కృపకు పాత్రులై ఐశ్వర్యంతో పాటు సకల శుభాలు కలుగుతాయని, మహిళలకు దీర్ఘకాల సుమంగళి భాగ్యం దక్కేలా దేవతలు దీవిస్తారని పురాణ కథనం. ఈ వ్రతాచరణ గురించి శివుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్లు స్కందపురాణం, భవిష్యోత్తర పురాణాలు చెబుతున్నాయి. వ్రతం ఆచరించడం వలన పార్వతీదేవికి కుమారస్వామి జన్మించాడని చెబుతారు. శ్రావణమాసంలో పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే శ్రావణమాసంలో ఆచరించవచ్చు. వరలక్ష్మీ వ్రతాచరణ ఇలా.. వ్రతం రోజున ఉదయాన్నే ముత్తయిదువులు మంగళస్నానాలు చేసి నూతన వస్త్రాలు ధరించాలి. పూజకు నిర్ణయించుకున్న స్థలంలో మండపాన్ని ఏర్పాటు చేయాలి. మధ్యలో కలశాన్ని నెలకొల్పి లక్ష్మీదేవి ముఖాన్ని తీర్చిదిద్దిన కొబ్బరికాయ దానిపై ఉంచాలి. అనంతరం లక్ష్మీదేవిని కలశంలోకి ఆహ్వానింపజేసి వ్రత విధానంతో పూజించాలి. వివిధ రకాల పిండివంటలు, పలు రకాల పండ్లను నివేదించాలి. ఈ వ్రతంలో తోరపూజ (తొమ్మిది పోరలు కలిగిన ధారం) చేయాలి. పూజ ముగిశాక ఆ తోరణాన్ని కుడిచేతికి కట్టుకోవాలి. తరువాత ముత్తైదువులకు వాయనాన్ని ఇవ్వాలి. వాయనం అంటే రవిక, పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, గంధం మొదలైన మంగళద్రవ్యాలను, తమలపాకులు, వక్కలను చాటలో ఉంచి ముత్తైదువులకు ఇవ్వడం. శక్తిమేర ఒక్కరికి లేదా ముగ్గురు, ఐదుగురికి ముత్తైదువులకు ఈ వాయనాన్ని ఇవ్వొచ్చు. సాయంత్రం ముత్తైదువులను పిలిచి, పేరంటం చేసి, పూలు, పండ్లు, తాంబూలంగా ఇవ్వాలి. సామూహిక వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు పూర్తి శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించే వరలక్ష్మీవ్రతానికి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. శ్రీశైలంలోని చంద్రవతి కల్యాణ మండపంలో నిర్వహించే ఈ వ్రతంలో పాల్గొనే ప్రతి ముత్తైదువు కోసం వేర్వేరు కలశాలు నెలకొల్పి శాస్త్రోక్తంగా వ్రతాన్ని చేసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. వ్రతంలో పాల్గొనే ముత్తైదువల పేర్లు ముందుగా నమోదు చేసుకున్నారు. ఈ వ్రతంలో పాల్గొనే ముత్తైదువులందరికి అమ్మవారి శేషవస్త్రాలు, జాకెట్ పీస్, పూలు, గాజులు, ప్రసాదం అందిస్తారు. వ్రతాచరణకు వీలుగా శ్రీస్వామిఅమ్మవార్ల కై లాస కంకణాన్ని ధరింపజేస్తారు. వ్రతం అనంతరం శ్రీశైలప్రభ సంచికను అందిస్తారు. పూజా సామగ్రి మొత్తం దేవస్థానమే సమకూరుస్తుంది. వ్రతానంతరం ముత్తైదులందరికీ స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించబడుతుంది. దర్శనం అనంతరం దేవస్థానం అన్నపూర్ణ భవనంలో భోజన సదుపాయం కల్పిస్తారు. నేడు శ్రీశైల ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు విస్తృత ఏర్పాట్లు చేసిన దేవస్థానం శ్రావణమాసం..శుభకరం: చాంద్రమానం ప్రకారం సంవత్సరంలో ఐదవ మాసం శ్రావణమాసం. ఈ మాసంలోని పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రానికి చేరువలో ఉండడం వలన శ్రావణమాసమనే పేరు వచ్చింది. శుభకార్యాలకు ఈ మాసం చాలా అనువైంది. అందుకే శ్రావణమాసానికి శుభమాసమనే పేరు కూడా ఉంది. ఈ నెలలో నోములు, వ్రతాలు, పండుగలతో ప్రతి ఇల్లు కళ కళలాడుతుంది. రుతువుల్లో మూడోదైన వర్ష రుతువు ఈ మాసంతోనే ప్రారంభమవుతుంది. దీంతో వ్యవసాయ పరంగా కూడా ఈ మాసానికి ప్రాధాన్యత ఉంది. -
ఆటోలో 60 లీటర్ల సారా పట్టివేత
కర్నూలు: ఆటోలో భారీగా సారా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో కర్నూలు ఎకై ్సజ్ సీఐ చంద్రహాస్, ఎస్ఐ నవీన్ బాబు ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు నిర్వహించి మూడు సంచుల్లో 600 ప్యాకెట్లు (60 లీటర్లు) నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. కొల్లంపల్లి తాండాకు చెందిన జటావత్ లక్ష్మీబాయి, పెద్దకొట్టాల గ్రామానికి చెందిన మహబూబ్ బాషా ఆటోలో సారా తరలించి లక్ష్మీపురం గ్రామంలోని సందెపోగు కనక సూర్యం ఇంటి ముందు దింపుతుండగా ఎకై ్సజ్ పోలీసులు కాపు కాసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆటోతో పాటు సారాను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ చంద్రహాస్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎకై ్సజ్ సిబ్బంది ఈరన్న, మధు, వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, రాజు, చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే బంగారుపేటలోని నాటుసారా స్థావరాలపై ఈఎస్టీఎఫ్, కర్నూలు టూటౌన్ పోలీసులతో కలసి ఎకై ్సజ్ అధికారులు దాడులు నిర్వహించి సారా బట్టీలను ధ్వంసం చేశారు. -
24 మందికి 60 టన్నుల యూరియా!
కర్నూలు(అగ్రికల్చర్): ఒక బస్తా యూరియా లభించక సాధారణ రైతులు ఇబ్బందులు పడుతుంటే కొందరికి మాత్రం ఎంత కావాలంటే అంత లభిస్తోంది. జూలై నెలకు సంబంధించి జిల్లాలో 24 మంది అత్యధికంగా యూరియా వినియోగించడం గమనార్హం. వీరందరూ టీడీపీకి చెందిన వారే కావడంతో అంతటా చర్చనీయాంశమైంది. ఒక్కొక్కరు ఒక్క నెలలోనే రెండున్నర టన్నుల ప్రకారం వినియోగించినట్లు స్పష్టమవుతోంది. కేవలం 24 మంది పెద్ద రైతులు 60 టన్నుల యూరియను తరలించుక పోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు యూరియా కోసం రైతులు రోడ్డెక్కుతుంటే వచ్చిన యూరియా కూటమి పార్టీలకు చెందిన వారికి తరలుతుందనేందుకు ఇదే నిదర్శనం. 24 మందిపై విచారణ నిర్వహించాలని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. జిల్లాలో యూరియా కోసం రైతులు గగ్గోలు పెడుతున్నారు. దాదాపు అన్ని మండలాల్లో యూరియా కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం యూరియాతో సహా అన్ని రకాల రసాయన ఎరువులను ఈ–పాస్ మిషన్ల ద్వారానే ఆన్లైన్లో విక్రయించాలి. విక్రయించే ప్రతి బస్తా ఏ రోజుకారోజు ఆన్లైన్లో నమోదు కావాలి. అపుడే జిల్లాలో ఎరువుల నిల్వ ఎంత ఉందనేది తెలుస్తుంది. జిల్లాలో ప్రయివేటు డీలర్లు, రైతుసేవా కేంద్రాలు, పీఏసీఏస్లు, డీసీఎంఎస్ల్లో మాన్యువల్గానే యూరియా అమ్మకాలు సాగిస్తున్నారు. విక్రయించిన ఎరువుల వివరాలను తీరిక ఉన్నప్పుడు ఈ–పాస్ మిషన్ల ద్వారా ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. అందువల్ల ఆన్లైన్లో ఎరువులు భారీగా కనిపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఒక్క బస్తా కూడా లభించని పరిస్థితి ఏర్పడింది. ల్లాలో ఏలాంటి యూరియా కొరత లేదని కంపెనీ గోదాముల్లో 2,263 టన్నులు, హోల్సేల్ డీలర్ల దగ్గర 440, మార్క్ఫెడ్ దగ్గర 6,072, రీటైల్ డీలర్ల దగ్గర 2,527, రైతు సేవా కేంద్రాల్లో 1,112, పీఏసీఎస్, డీసీఎంఎస్ల్లో 428 టన్నుల ప్రకారం జిల్లాలో 12,842 టన్నుల ప్రకారం యూరియా ఉందని చెబుతున్నారు. ఇదే విషయాన్ని జిల్లా వ్యవసాయ యంత్రాంగం జిల్లా కలెక్టర్కు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ కూడా దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. ఆన్లైన్లో ఉన్న ఈ లెక్కలను చూసి యూరియా పుష్కలంగా ఉందనే ఉద్దేశంతో ప్రభుత్వం కర్నూలు జిల్లాకు కేటాయింపులు భారీగా తగ్గించేస్తోంది. దీంతో ఎరువుల కొరత ఏర్పడి సామాన్య రైతులు ఆందోళన బాటపడుతున్నారు. కూటమి పార్టీల నేతలకు మాత్రం పుష్కలంగా సరఫరా సామాన్య రైతులకు దొరకని యూరియా -
వైఎస్సార్సీపీలోకి టీడీపీ మాజీ కౌన్సిలర్లు
ఎమ్మిగనూరుటౌన్: పట్టణానికి చెందిన 3వ వార్డు టీడీపీ మాజీ కౌన్సిలర్ కనికె లక్ష్మీదేవి, ఆమె కుమారుడు టీడీపీ పట్టణ ఇన్చార్జ్ చేనేత మల్లికార్జున, 30వ వార్డు టీడీపీ మాజీ కౌన్సిలర్ మధుబాబు తమ అనుచరులతో గురువారం వైఎస్సార్సీపీలో చేరారు. పట్టణంలోని మాచాని సోమప్ప మెమోరియల్ హాల్లో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో వారు వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ బుట్టారేణుక సమక్షంలో టీడీపీని వీడి వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. బుట్టా రేణుకతో పాటు పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుట్టాప్రతుల్, సీనియర్ నాయకుడు బుట్టా శివ నీలకంఠ వారికి కండువాలు కప్పి పార్టీలోకి అహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన మధుబాబు మాట్లాడుతూ.. ఎమ్మిగనూరులో ఇద్దరి ఎమ్మెల్యేల పాలన సాగుతుందని షాడో ఎమ్మెల్యేని ఉద్దేశించి విమర్శలు చేశారు. చేనేత మల్లికార్జున మాట్లాడుతూ.. ఎమ్మిగనూరుకు చేనేతల కోసం క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని బుట్టారేణుకను కోరారు. టెక్స్టైల్ పార్క్తో చేనేతలను మభ్యపెట్టేందుకు ఎమ్మెల్యే బీవీ పట్టణంలో భూమి పూజ చేశారని ఆరోపించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రజా సంక్షేమ పాలనలో ప్రజలు బాగుపడ్డారని, టీడీపీ ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని విస్మరించడంతో తాము వైఎస్సార్సీపీలో చేరామన్నారు. -
రవీంద్ర విద్యార్థులకు జాతీయ స్థాయి బహుమతులు
కర్నూలు సిటీ: ఢిల్లీలో ఇటీవల జరిగిన స్టీమ్ ఇన్నోవేషన్ లీగ్ 2కే 25 ‘‘ఇండియాస్ లార్జెస్ట్ ఏఐ అండ్ రోబోటిక్స్ కాంపిటీషన్ ఫోకస్డ్ అరౌండ్ ఇన్నోవేషన్’’ పేరుతో నిర్వహించిన పోటీలలో స్థానిక అబ్బాస్నగర్లోని రవీంద్ర పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో బహుమతులు సాధించారు. ఈ మేరకు గురువారం ఆ స్కూల్లో జరిగిన అభినందన కార్యక్రమంలో రవీంద్ర విద్యా సంస్థల వ్యవస్థాపక అద్యక్షులు జి.పుల్లయ్య పాల్గొని బహుమతులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా 335 జట్లు పోటీల్లో పాల్గొన్నాయని, ఇందులో తమ స్కూల్ విద్యార్థులు హఫీపా, సమీరా, లిఖిత డ్యూయల్ పర్పస్ వీల్ చైర్ స్ట్రెచర్ బెడ్ ఫర్ హాస్పటల్స్ అనే నమూనాను తయారు చేసి జాతీయ స్థాయిలో తృతీయ బహూమతి సాధించారన్నారు. పిల్లల్లో వచ్చే అద్భుతమైన ఆలోచనలు భావితరానికి నాంది పలకాలని ఆయన విద్యార్థులకు సూచించారు. రవీంద్ర విద్యా సంస్థల చైర్మన్ జీవీఎం మోహన్ కుమార్, వైస్ చైర్మన్ జి.వంశీధర్ విద్యార్థులను అభినందించారు. కార్యకమంలో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇన్చార్జ్ వి.రమేష్ రంజిత్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ఎద్దు దాడిలో వృద్ధుడి మృతి
ఆలూరు రూరల్: వృద్ధుడిపై ఎద్దు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన గురువారం ఆలూరులో చోటు చేసుకుంది. స్థానిక బళ్లారి రోడ్డులో నివాసం ఉండే పద్మనాభ దాస్ (89) మెయిన్ బజారులోని ఓం శాంతి ధ్యాన మందిరానికి వెళ్లి వస్తుండగా ఎద్దు దాడి చేసింది. కొమ్ములతో వృద్ధుడిని ఎత్తి కింద పడేసింది. ప్రమాదంలో పద్మనాభ దాస్ తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు గమనించి ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఆదోనికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడు పద్మనాభ దాస్ ఆలూరు మాజీ ఎమ్మెల్యే గోవింద దాస్ తనయుడు. పశువుల బారి నుంచి కాపాడండి.. రహదారులపై సంచరిస్తున్న పశువుల బారి నుంచి ప్రజలను కాపడాలని సీపీఎం నాయకులు అంబేడ్కర్ సర్కిల్లో రాస్తారోకో చేపట్టారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారులు, వీధుల్లో పశువులు విచ్చలవిడిగా సంచరిస్తూ ప్రజలపై దాడులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. గతంలో పశువుల దాడిలో చాలా మంది గాయపడ్డారని రోడ్లపై అడ్డదిడ్డంగా పరిగెత్తే పశువుల వల్ల వాహనదారులు కింద పడ్డారన్నారు. గ్రామ పంచాయతీ అధికారులు ఇప్పటికై నా మేల్కొని పశువులను గోశాలకు తరలించాలని డిమాండ్ చేశారు. సీపీఎం నాయకులు హనుమంతు, నారాయణ స్వామి, మైనా, కృష్ణ, ఈరన్న, షేకూన్బీ తదితరులు పాల్గొన్నారు. -
లారీని ఢీకొన్న ప్రైౖవేట్ బస్సు
వెల్దుర్తి: కర్నూలు – బెంగళూరు జాతీయర రహదారిపై వెల్దుర్తి పట్టణ సమీపంలో గురువారం తెల్లవారుజామున ముందువెళ్తున్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదవశాత్తు ఢీకొంది. బెంగళూరు నుంచి హైదరాబాద్కు ప్రయాణికులతో వెళ్తున్న మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మార్గమధ్యలో వెల్దుర్తి సమీపంలో లద్దగిరి క్రాస్ రోడ్ హనుమాన్ జంక్షన్ వద్ద ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. జంక్షన్లో స్పీడ్ బ్రేకర్లను గమనించి లారీ డ్రైవర్ వేగం తగ్గించడంతో వెనుక వస్తున్న బస్సు డ్రైవరు అదుపు చేయలేక లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం దెబ్బతినగా, డ్రైవర్ సిద్ధు విలాస్తో పాటు పక్కన కూర్చున్న మరో డ్రైవర్ అనిల్ గాయపడ్డారు. సంఘటనాస్థలికి చేరుకున్న హైవే పోలీసులు క్షతగాత్రులను 108లో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులు ఇతర బస్సులో తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు.వైఎస్సార్సీపీ ‘మేధావుల’ కార్యదర్శిగా తిరుమలేశ్వర రెడ్డికర్నూలు (టౌన్): వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మేధావుల ఫోరం కార్యదర్శిగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రస్థాయి పదవి అప్పగించడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.నీటికుంటలో పడి వ్యక్తి మృతికొలిమిగుండ్ల: మండల కేంద్రం కొలిమిగుండ్లలోని జమ్మలమడుగు రోడ్డులో గురువారం నీటి గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు మేరకు.. కల్లూరుకు చెందిన లారీ డ్రైవర్ పీరా కుమారుడు చంద్బాషా (26)ను వెంట పెట్టుకొని ఈనెల 5వ తేదీన జమ్మలమడుగు క్రాస్ రోడ్డులోని లారీ ట్రాన్స్పోర్టు కార్యాలయం వద్ద బాడగ కోసం వేచి ఉన్నారు. రెండు రోజుల క్రితం నుంచి చాంద్బాషా కనిపించకపోవడంతో తండ్రితో పాటు తోటి డ్రైవర్లు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే పాలీస్ ఫ్యాక్టరీకి చెందిన నీటికుంటలో మృతదేహం కనిపించింది. సమాచారాన్ని పోలీసులకు అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మద్యం మత్తులో గుంతలో పడిపోయాడా.. ప్రమాదశాత్తూ పడిపోయాడా.. అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.మోసం చేశాడు.. న్యాయం చేయండిదేవనకొండ: తనను మోసం చేశాడని ప్రియుడు ఇంటి ముందు ఓ యువతి దీక్ష చేపట్టింది. మండలంలోని పాలకుర్తి గ్రామానికి చెందిన స్వర్ణకుమారి పి.కోటకొండ గ్రామానికి చెందిన బండమీది రాజు ఐదేళ్ల నుంచి ప్రేమించుకున్నారు. రాజుకు మరో యువతితో పెళ్లి సంబంధం చూస్తు న్నారు. ఈ విషయం తెలుసుకున్న స్వర్ణకుమారి గురువారం ఉదయం పి.కోటకొండకు చేరుకుని రాజు ఇంటి ఎదుట నిరాహార దీక్షకు పూనుకుంది. దీంతో యువకుడి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. రాత్రయినా యువతి అక్కడే ఉంది. ఈ విషయంపై దేవనకొండ సీఐ వంశీనాథ్ను వివరణ కోరగా రాజు తనను మోసం చేశాడని 20 రోజుల క్రితం స్వర్ణకుమారి ఫిర్యాదు చేసిందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
వానాకాలంలోనూ ఎండుతున్న గొంతులు!
వానాకాలంలోనూ ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నారు. బిందె నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. కోడుమూరు మండలం కొత్తపల్లెలో ఈ దుస్థితి నెలకొంది. గ్రామంలో 500 మంది నివాసం ఉంటున్నారు. గత రెండు వారాల నుంచి రెండు బోర్లు మరమ్మతులకు గురై నీరు రావడం లేదు. దీంతో గ్రామస్తులు కిలోమీటర్ దూరాన ఉన్న వ్యవసాయ బోర్లు, బావులు, జీడీపీ కాల్వను ఆశ్రయించి తాగునీటికి తెచ్చుకుంటున్నారు. ‘కుళాయిలకు నీరు రాక, 70 ఏళ్ల వయస్సులో కిలోమీటర్ దూరాన ఉన్న వ్యవసాయ బావికి వెళ్లలేక ఇబ్బంది పడుతున్నా’ అని గ్రామానికి చెందిన కుమ్మరి గిడ్డయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు స్పందించాలని కోరాడు. – కోడుమూరు రూరల్ -
బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య
అనంతపురం: అనంతపురంలోని గుత్తి రోడ్డులో ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో అటెండర్ రవికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అధిక వడ్డీలకు అప్పులు చేసి వాటిని తీర్చే మార్గం కానరాక బ్యాంకు బాత్రూంలో ఉరేసుకుని తనువు చాలించాడు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు నగరంలోని సీ క్యాంప్కు చెందిన సంకుల రవికుమార్ (40) గత 12 ఏళ్లుగా అనంతపురంలో ఉంటూ సెంట్రల్ బ్యాంకులో అటెండర్గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం 9.30 గంటలకు ఇంటి నుంచి బ్యాంకుకు వెళ్లాడు. 9.45 గంటలకు భార్య హరితకు ఫోన్ చేసి మనసు బాగోలేదని చెప్పాడు. 10.20 గంటలకు బ్యాంకు ఉద్యోగి పద్మజ అటెండర్ భార్యకు ఫోన్ చేసి రవికుమార్ బాత్రూంలోకి వెళ్లి లాక్ చేసుకున్నాడని పిలిస్తే పలకడం లేదని వెంటనే బ్యాంకుకు రావాలని చెప్పారు. 20 నిమిషాల్లో ఆమె అక్కడికి చేరుకుంది. కార్పెంటర్ సాయంతో బాత్రూం తలుపు పగులగొట్టి చూడగా అప్పటికే బాత్రూం కిటికీ ఇనుప కడ్డీకి నైలాన్ తాడుతో ఉరివేసుకుని రవికుమార్ విగత జీవిగా పడి ఉన్నాడు. అప్పులు అధికం కావడ ంతో మానసిక ఒత్తిడికి గురై అఘాయిత్యానికి పాల్పడినట్లు మృతుడి భార్య హరిత స్థానిక త్రీ టౌన్ పోలీ స్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతుడికి కుమారుడు సూర్యతేజ, కుమార్తెలు దీక్షిత, వీక్షిత ఉన్నారు. హరిత క్షమించు.. రవికుమార్ ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాశాడు. అందులో ఏముందంటే.. ‘హరిత నన్ను క్షమించు. నేను బతికి మీకు ఎలాంటి ఉపయోగం లేదు. పిల్లల్ని, నిన్ను వదిలి వెళ్లాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. నేను చేసిన అప్పులే నా పాలిట శాపంగా మారాయి. నేను ఎలాంటి జూదాలూ ఆడలేదు. అధిక వడ్డీలు కట్టలేక.. వడ్డీలు కట్టేందుకు మళ్లీ చేసిన అప్పులు ఒకదానికి ఒకటి తోడయ్యాయి. అమ్మా.. నువ్వు జాగ్రత్త.. పిల్లలు జాగ్రత్త. నా టైం ఇక్కడితో అయిపోయింది. గుజ్జల రాముడు అనే వ్యక్తి వద్ద రూ.50 వేలు అప్పు చేస్తే రూ.15 వేలు పట్టుకుని రూ.35 వేలు ఇచ్చాడు. ప్రతి నెలా రూ.15,000 వడ్డీ కడుతూనే ఉన్నాను. ఇప్పటివరకు రూ.1,20,000 కట్టాను. ఇక నా వల్ల కాదు. హరిత పిల్లలు జాగ్రత్త అని రాశాడు. అధిక వడ్డీలకు అప్పులు తీర్చలేక అఘాయిత్యం -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
పెద్దకడబూరు: జాలవాడి గ్రామానికి చెందిన వలస కూలీ హైదరాబాదులో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. వివరాలు..కురువ జంపాపురం ఆంజనేయులు (35) నెల రోజుల క్రితం ఇద్దరు కూతుళ్లు, కుమారుడిని గ్రామంలో తల్లి దగ్గర వదిలి భార్య లక్ష్మి తో హైదరాబాద్కు వలస వెళ్లాడు.శ్రావణమాసం కావడంతో భార్య లక్ష్మి ఉరుకుంద ఈరన్న స్వామి మొక్కు తీర్చుకునేందుకు సొంతూరుకు వచ్చింది.అక్కడే కూలీ పనులు చేసుకుంటున్న ఆంజనేయులు బుధవారం నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్కు నీళ్లు పట్టడానికి వెళ్లి బోరు వద్ద విద్యుదాఘాతానికి గురై మృతి చెందా డు. అక్కడున్న వారు ఫోన్ ద్వారా కుటుంబసభ్యులకు సమాచారం చేరవేశారు. గ్రామాల్లో ఉపాధి పనులు చేపట్టకపోవడం వల్లే కూలీలు వలస వెళ్లి మృత్యువాత పడుతున్నారని గ్రామస్తులు వాపోయారు. -
కొనసాగుతున్న విజిలెన్స్ దర్యాప్తు
ఆత్మకూరురూరల్: ఆత్మకూరు అటవీ డివిజన్ కార్యాలయంలో బుధవారం విజిలెన్స్ అధికారులు రికార్డుల పరిశీలన కొనసాగించారు. విజిలెన్స్ డీఎఫ్ఓ శివప్రసాద్ నేతృత్వంలో పరిశీలన జరిగింది. కార్యాలయంలో సూపరింటెండెంట్గా పని చేసి ఉద్యోగ విరమణ చేసిన చాంద్బాషా నాలుగు కోట్ల రూపాయల అటవీశాఖ నిధులు వేరే బ్యాంకు ఖాతాలకు మళ్లించారన్న విషయంపై ఇప్పటికే కేసు నమోదై నలుగురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా చాంద్బాషా ఉద్యోగం నిర్వహించిన కాలంలో జరిగిన లావాదేవిలన్నీ పరిశీలించాలన్న ఉన్నతాధికారుల నిర్ణయంతో ఈ పరిశీలన సాగుతోంది. చాంద్బాషా అవినీతి వ్యవహారంలో ఇతరుల ప్రమేయాన్ని కూడా గుర్తించడం తమ తనిఖీ ఉద్దేశమని విజిలెన్స్ డీఎఫ్ఓ శివప్రసాద్ తెలిపారు. అటవీశాఖ కేంద్ర కార్యాలయం నుంచి అటవీ దళాల ప్రధా నాధికారి ఈ పరిశీలనను స్వయంగా సమన్వ యం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పరిశీలనలో ఎన్ఎస్టీఆర్ సర్కిల్ కార్యాలయ అకౌంటెంట్ పద్మావతి, కర్నూలు,నంద్యాల అడ్మినిస్ట్రే ట్ అధికారులు చంద్రశేఖరరాజు, రవికుమార్, విజిలెన్స్ రేంజ్ అధికారి శంకరయ్య ఉన్నారు. పోక్సో కేసు నమోదు కోడుమూరు రూరల్: ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు కోడుమూరు ఎస్ఐ ఎర్రిస్వామి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మంగళవారం కోడుమూరుకు చెందిన ఓ మైనర్ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే కాలనీకి చెందిన 30ఏళ్ల వ్యక్తి మద్యం మత్తులో ఆ ఇంట్లోకి ప్రవేశించి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. జరిగిన విషయాన్ని బాలిక కోడుమూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మేరకు ఎస్ఐ ఎర్రిస్వామి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో పాటు, నిందితుడిని అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్కు తరలించారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించండి కర్నూలు(అగ్రికల్చర్): పీఎం సూర్యఘర్ పథ కం కింద సోలార్ విద్యుదుత్పత్తిని ప్రోత్సహించాలని ఏపీఎస్పీడీసీఎల్ (ప్రాజెక్ట్స్) డైరెక్టర్ అయూబ్ఖాన్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్ భవన్లో జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో పీఎం సూర్యఘర్ పథకం ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ పథకం సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చక్కటి అవకాశం కల్పిస్తోందని, దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇంటిపైనే సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవడానికి కేంద్రం ఆకర్షణీయమైన రాయితీలు ఇస్తోందని, బ్యాంకులు రుణ సదుపాయం కల్పిస్తాయని పేర్కొన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని సోలార్ వెండర్లకు సూచించారు. పట్టణ ప్రాంతాల్లో ఈ నెల చివరి నాటికి 100 యూనిట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 20 యూనిట్లు నెలకొల్పేందుకు అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. 200 యూనిట్ల విద్యుత్ వినియోగం ఉన్న వారందరూ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేపట్టేలా చూడాలన్నారు. అలాగే లో వోల్టేజీ, హైవోల్టేజీ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ శాఖ ఎస్ఈ ఉమాపతి, ఈఈ ఓబులేసు, జిల్లా నోడల్ అధికారి కృష్ణారెడ్డి, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ చిన్న రాఘవులు, కర్నూలు అర్బన్ ఈఈ శేషాద్రి, ఈఈ మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘చెత్త’ నగరంగా కర్నూలు
కర్నూలు(సెంట్రల్): కర్నూలులో పారిశుద్ధ్యం లోపించి చెత్త నగరంగా తయారైంది. ఇందుకు మునిసిపల్ అధికారులే కారణమని జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలుతోపాటు ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు పట్టణాల్లోనూ ఇంటింటి చెత్తసేకరణ, పారిశుద్ధ్య పనులను సజావుగా సాగేలా చూడాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో మునిసిపాలిటీల పనితీరుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కర్నూలులో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 1,200 మంది శానిటరీ వర్కర్లు ఉన్నప్పటికీ నగరాన్ని శుభ్రంగా ఉంచలేకపోతే ఎలాగని ప్రశ్నించారు. బీక్యాంపు నుంచి రాజ్విహార్ వరకు రోడ్లు శుభ్రంగా లేవని.. పలుమార్లు చెప్పినా మార్పు లేద న్నారు. ఆయా శానిటరీ ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకో వాలని మునిసిపల్ కమిషనర్ పి.విశ్వనాథ్ను ఆదేశించారు. ప్రజారోగ్య అధికారికి షోకాజ్ నోటీసు ఇవ్వాలన్నారు. రేపటి నుంచి పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగాలని, తానే స్వయంగా తనిఖీ చేస్తానన్నారు. కలెక్టర్ ఏమన్నారంటే.. ● కల్లూరు పరిధిలోని 16 వార్డులకు ప్రతిరోజూ నీరు ఇచ్చేందుకు కమిటీలు వేశాం. ఆ కమిటీ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటాం. ● నగర సుందరీకరణలో భాగంగా బీక్యాంపు నుంచి బస్టాండ్ వరకున్న డీవైడర్లకు ఆకర్షణీయంగా పెయింటింగ్ చేయించాలని కమిషనర్ను ఆదేశించారు. ● ఎన్క్యాప్ ఫండ్ రూ.7 కోట్లతో పనులు చేపట్టాలని 8 నెలల కిందట ఆదేశాలు ఇచ్చాం, పనులు నత్తనడక సాగుతుండటంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ● టౌన్ ప్లానింగ్కు సంబంధించి పత్రికల్లో ప్రతి రోజూ ప్రతికూల వార్తలు వస్తున్నాయని, వాటిపై విచారణ జరిపి తగు నివేదికలు ఇవ్వాలని సిటీ ప్లానింగ్ అధికారిని ఆదేశించారు. ● ఆదోని బసాపురం ట్యాంకుకు సంబంధించి మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాలని ఆదోని మునిసిపల్ కమిషనర్ను ఆదేశించారు. సమావేశంలో ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు కమిషనర్లు కృష్ణ, గంగిరెడ్డి, రమేష్బాబు, కర్నూలు నగర పాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
అటవీ సిబ్బంది, గిరిజనుల మధ్య వాగ్వాదం
● పొలాలకు ఉన్న కంచె తొలగించేందుకు ప్రయత్నించడంతో తోపులాట కొత్తపల్లి: పొలాలకు ఉన్న కంచెను తొలగించే క్రమంలో అటవీశాఖ సిబ్బందికి, గిరిజనులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని గువ్వలకుంట్ల మజారా గ్రామమైన పాతచదరంపెంట నల్లమల అటవీ ప్రాంతంలో సుమారు 50 ఇళ్లదాకా గిరిజనులు నివాసాలు ఏర్పాటు చేసుకోని జీవనం సాగించేవారు. పదేళ్ల క్రితం అటవీ శాఖ అధికారులు వారికి పాలెంచెరువు సమీపంలో ఐటీడీఏ శాఖతో కలిసి ఇళ్లు నిర్మించి ఇచ్చారు. అయితే పాత చదరంపెంటలో ఆ గిరిజనులు సుమారు 150 ఎకరాల పొలాన్ని సాగుచేసేవారు. అటవీ శాఖ అధికారులు ఇంటి స్థలాలు ఇచ్చారుగానీ పొలాలు ఇవ్వలేదని గిరిజనులు వాపోతున్నారు. ఈ పొలాలకు అడవి జంతువుల నుంచి రక్షణ కోసం ఐటీడీఏ సహకారంతో చుట్టూ కంచె వేసుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం కంచె ఉండడం వల్ల అడవి జంతువులకు ఇబ్బంది కలుగుతుందని ఫారెస్ట్ అధికారులు కంచె తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో గిరిజనులకు, అటవీశాఖ సిబ్బందికి మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. తమ పొలాలకు కంచె వేసుకుంటే ఫారెస్ట్ అధికారులు తొలగించేందుకు ప్రయత్నించడం దుర్మార్గం అని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐటీడీఏ వారేమో కంచె వేసుకోమంటున్నారు, ఫారెస్ట్ అధికారులు మాత్రం తొలగించాలంటున్నారని వాపోయారు. దీంతో ఫారెస్టు అధికారులు వెనక్కి వెళ్లిపోయారు. -
పెళ్లి బాజా మోగాల్సిన ఇంట్లో విషాదం
● కుమారుడి పెళ్లి పత్రికలు పంచుతూ తండ్రి మృత్యువాత ● ఎక్సెల్ను టెంపో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం ఓర్వకల్లు: పెళ్లి బాజా మోగాల్సిన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మండలంలోని సోమయాజులపల్లె గ్రామం, బేతంచెర్ల క్రాస్ రోడ్డు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సోమయాజులపల్లె వెంకటరమణ (60) కుమారుడి పెళ్లి ఈ నెల 13, 14 తేదీల్లో జరిపించేందుకు నిశ్చయం జరిగింది. ఈ క్రమంలో పెళ్లి పత్రికలను పంచేందుకు ఉదయం ఎక్సెల్ వాహనంపై సోమయాజులపల్లెకు బయలుదేరాడు. తిరుగు ప్రయాణంలో బేతంచెర్ల క్రాస్రోడ్డు వద్ద స్వగ్రామం వైపు మలుపు తిరుగుతుండగా.. తెలంగాణా రాష్ట్రం మెదక్ జిల్లాకు చెందిన టెంపో వాహనం నంద్యాల వైపు నుంచి అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో వెంకటరమణ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. టెంపో వాహనం మృతదేహాన్ని కొంత దూరం ఈడ్చుకుంటూ వెళ్లి తప్పించుకుపోగా, స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన టోల్ప్లాజా సిబ్బంది నన్నూరు టోల్ప్లాజా వద్ద టెంపోను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. మృతుడి కుంటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ సునీల్కుమార్ చెప్పారు. మృతునికి ఐదుగురు కూతుర్లు, ఒక కుమారుడు సంతానం ఉన్నారు. -
ట్రాలీ ఆటో బోల్తా : 20 మందికి గాయాలు
వెల్దుర్తి: హైవే–44పై వెల్దుర్తి పట్టణ సమీపంలో ఈద్గా వద్ద ట్రాలీ ఆటో టైర్ పేలడంతో అందులో ప్రయాణిస్తున్న 20 మంది గాయపడ్డారు. వారంతా బుధవారం డోన్ పట్టణానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. బేతంచెర్ల మండలం రుద్రవరం గ్రామానికి చెందిన 20 మంది వైఎస్సార్సీపీ శ్రేణులు ట్రాలీ ఆటోలో డోన్కు వెళ్లి వెల్దుర్తి మీదుగా తిరిగివస్తున్నారు. హైవేపై వెల్దుర్తి సమీపంలోకి రాగానే టైరు పేలి ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న యంబాయి ఎంపీటీసీ సభ్యుడు నాగేశ్వరరావుతో పాటు బాలరాజు, చంద్రశేఖర్, వరుణ్, గోవిందులకు తీవ్రగాయాలు కాగా బాలమద్దయ్య, లక్ష్మీదేవి, దిలీప్, మహేశ్, మద్దిలేటి స్వామి, శ్రీనివాసులు, పుల్లయ్య, స్వాములు, మద్దిలేటి, రాజు, మద్దయ్య, గోపాల్, ప్రతాప్, శ్రీనుకు స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెల్దుర్తి సీహెచ్సీకి తరలించారు. బాలరాజు, చంద్రశేఖర్, వరుణ్, గోవిందును మెరుగైన చికిత్స కోసం 108 వాహనంలో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మానవత్వం చాటుకున్న మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఘటనా స్థలంలో క్షతగాత్రులు పడి ఉండగా ఆ మార్గంలో వచ్చిన పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వారిని గమనించి వాహనాన్ని ఆపారు. ప్రమా ద వివరాలు తెలుసుకున్నారు. అంబులెన్స్కు సమాచారమిస్తూ, క్షతగాత్రులను పరామర్శిస్తూ ధైర్యం చెప్పారు. ఎంపీటీసీ సభ్యుడు నాగేశ్వరరావు, తీవ్ర గాయాల పాలైన మరికొందరిని ముందుగా మరో వా హనంలో వెల్దుర్తి ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ మరికొందరిని హైవే అంబులెన్స్లో తరలించారు. హైవే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంలో సహకరించారు. ప్ర మాదానికి కారణమైన వాహనాన్ని పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. -
● రేపటి నుంచి సద్గురు 354వ ఆరాధన మహోత్సవాలు ● 14వ తేదీ వరకు ఉత్సవాలు ● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
మంత్రాలయం: వేదభూమి ప్రదాత.. భవనమోహనుడు సద్గురు రాఘవేంద్రస్వామి. మధ్వమత సార్వభౌముడిగా జగద్విఖ్యాతి గడించి భక్తకోటి వేల్పువుగా వర్ధిల్లుతున్నారు. సద్గురు సశరీరంగా చింతామణి సదృశ్యులైన శ్రీరాఘవేంద్రుల 354వ ఆరాధన సప్తరాత్రోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆశీస్సులతో ఏడు రోజుల పాటు వేడుకలు వైభవంగా జరగనున్నా యి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి దాదాపు 2 లక్షల భక్తులు తరలివచ్చి వేడుకల్లో తరించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఇప్పటికే వేదభూమి విద్యుద్దీప కాంతులతో కాంతులీనుతోంది. రోజూ రాయరు రథోత్సవాలతోపాటు రాములోరి సంస్థాన పూజలు ఉంటాయి. భక్తుల కోసం యోగీంద్ర మండపంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉత్సవ విశేషాలు ● శుక్రవారం ఉత్సవాల ప్రారంభోత్సవంలో భా గంగా ధ్వజారోహణ, ధాన్యపూజ, గోవు, తురగ పూజ, ప్రార్థనోత్సవం కానిస్తారు. ఉదయం తిరుమ ల తిరుపతి దేవస్థానం, కాంచీపురం వరదరాజుల క్షేత్రం, శ్రీరంగపట్నం రంగనాథ స్వామి ఆలయాల నుంచి పట్టువస్త్రాల సమర్పణ ఉంటుంది. ● శనివారం శాఖోత్సవం, రజత మంటపోత్సవం చేపడతారు. ● ఆదివారం పూర్వారాధన సందర్భంగా సింహవాహనంపై ప్రహ్లాదరాయల ఊరేగింపు ఉంటుంది. సాయంత్రం యోగీంద్ర మంటపంలో ప్రముఖుల కు అనుగ్రహ ప్రశస్థి అవార్డు ప్రదానం గావిస్తా రు. అలాగే తొలిసారిగా క్షేత్రంలో స్వామి తెప్పోత్స వం నిర్వహించనున్నారు. ● సోమవారం మధ్యారాధన పురస్కరించుకుని రాఘవేంద్రుల మూల బృందావనానికి మహా పంచామృతాభిషేకం చేస్తారు. బంగారు పాదుక పట్టాభిషేకంతోపాటు మధ్యాహ్నం పాదుకలు, ప్రతిమలు బంగారు రథంపై ఊరేగింపు కానిస్తారు. రాత్రి గజవాహనోత్సవంతోపాటు రజత, సువర్ణ రథోత్సవాలు ఉంటాయి. ● మంగళవారం ఉత్తరారాధన సందర్భంగా క్షేత్రంలో రాఘవేంద్రుల మహా రథోత్సవం అంగరంగ వైభవంగా చేపడతారు. హెలికాప్టర్తో పుష్పవృష్టి ఉంటుంది. అలాగే రాఘవేంద్రుల మూల బృందావనానికి తొలిసారి వజ్రరత్న కవచ ధారణ కానించనున్నారు. ● బుధవారం పూర్వపు పీఠాధిపతి సుజ్ఞానేంద్రుల ఆరాధన, అశ్వవాహన సేవలు కానిస్తారు. ● గురువారం సర్వ సమర్పణోత్సవంలో భాగంగా బంగారు పల్లకీ, చెక్క, వెండి, బంగారు రథోత్సవాలు ఉంటాయి. బంగారు కాంతుల్లో శ్రీమఠం కారిడార్ భక్తులకు ఏర్పాట్లు ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం 5 లక్షల పరిమళ ప్రసాదాలు తయారు చేశారు. కాలకృత్యాలు తీర్యుకునేందుకు అన్నపూర్ణ భోజనశాల, నదీతీరం, సీఆర్వో కార్యాలయం, 200 గదుల సముదాయంతో శౌచాలయాలు ఏర్పాటు చేశారు. తుంగభద్ర నదిలో వరద నీరు ఉధృతంగా పారుతుండటంతో పుణ్య స్నానాలకు ప్రత్యేక షవర్లు ఉన్నాయి. మఠం సీఆర్ఓ, ప్రధాన ముఖధ్వారం, మఠం ప్రాకారం, అన్నపూర్ణ భోజనశాల దారిలో వాటర్ ప్లాంట్లు నెలకొల్పారు. ఉత్సవాలను మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్–1 శ్రీనివాసరావు, మేనేజర్–2 వెంకటేష్జోషి, మేనేజర్–3 శ్రీపతిఆచార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సురేష్ కోనాపూర్ భక్తులు ఏర్పాట్లు పర్యవేక్షించనున్నారు. -
ఆదోనిలో రెండిళ్లలో చోరీ
● తులం బంగారం, 4.5 కేజీల వెండి, రూ.8 వేలు నగదు అపహరణ ఆదోని అర్బన్: పట్టణ శివారు కాలనీలో బుధవారం తెల్లవారుజామున రెండు ఇళ్లల్లో చోరీ జరిగింది. స్థానిక రాజీవ్గాంధీ నగర్కు చెందిన పార్వతమ్మ అనే మహిళ మంగళవారం వర్షం కురవడంతో ఇంటికి తాళం వేసి చెల్లెలి ఇంటికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దుండగులు ఆ ఇంట్లోకి దూరి బీరువా తాళాలను పగలగొట్టి అర తులం బంగారం, రూ.6 వేలు నగదును దొంగలించారు. అందులో కుమారుడికి పదో తరగతిలో అత్యధిక మార్కులు వచ్చినందుకు బహుమతిగా ఇచ్చిన బంగారు పతకం కూడా ఉంది. అదే కాలనీకి చెందిన రంగమ్మ అనే మహిళ ఆదివారం ఇంటికి తాళం వేసి తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలంకు వెళ్లింది. బుధవారం ఉదయం ఆ ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. దుండగులు ఇంట్లోని బీరువా తాళాలు పగలగొట్టి అర తులం బంగారు కమ్ములు, నాలుగున్నర కేజీల వెండి, రూ.2 వేలు నగదు దోచుకెళ్లినట్లు తెలిసింది. స్థానికులు బుధవారం ఉదయం రెండిళ్ల తాళాలు పగలగొట్టి ఉండటాన్ని చూసి వెంటనే యజమానులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి విచారణ జరుపుతామని వెల్లడించారు. -
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
పెద్దకడబూరు: తెలుగుదేశం పార్టీ నుంచి ముచ్చగిరి గ్రామానికి చెందిన నాయకులు బుధవారం వైఎస్సార్సీపీలోకి చేరారు. ఎమ్మిగనూరులోని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి స్వగృహంలో వీరిని పార్టీ కండువా కప్పి వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వై.ప్రదీప్రెడ్డి ఆహ్వానించారు. ముచ్చగిరి సర్పంచ్ హనుంతు, నాయకులు సురేష్గౌడ్, మాజీ డీలర్ నాగప్ప ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు రామ్మోహన్రెడ్డి సమక్షంలో బోయ తాయప్ప, బోయ శివారెడ్డి, బోయ గోవిందు, రంగస్వామి, నాగరాజు, రామాంజి, గురురాజు, రంగస్వామితో పాటు మరో 20 కుటుంబాల వారు వైఎస్సార్సీపీలో చేరారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలసికట్టుగా పనిచేసి పార్టీ సత్తా ఏమిటో చూపిద్దామని వై.ప్రదీప్రెడ్డి పిలుపునిచ్చారు.ఉరుకుంద హుండీ ఆదాయం రూ.92 లక్షలుకౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఒకటైన ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో శ్రావణమాసం నాలుగు రోజులకు భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. హుండీ లెక్కింపు ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు ఆధ్వర్యంలో చేపట్టారు. ఇందులో స్వామి వారికి నగదు రూపంలో రూ.92,09,323 వచ్చిందన్నారు. అలాగే వెండి 23కిజిల 100గ్రాములు, బంగారం 19గ్రాముల 500మిల్లిగ్రాములు, కొంత విదేశీ కరెన్సీ వచ్చినట్లు వెల్లడించారు. లెక్కింపు కార్యక్రమంలో దేవాలయ సిబ్బందితో పాటు ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామి, ఉపప్రధాన అర్చకుడు మహదేవస్వామి, ముఖ్యఅర్చకుడు నాగరాజ్స్వామి, ఆదోని ఎండోమెంట్ ఇన్స్పెక్టర్, ఆలయ పర్యవేక్షకుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.చేపల పెంపకంపై మూడు నెలల శిక్షణకర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో 7వ తరగతి చదివిన నిరుద్యోగులకు చేపల పెంపకంపై మూడు నెలల శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ రంగనాథబాబు తెలిపారు. స్థానిక బంగారుపేటలోని దేశీయ మత్స్య శిక్షణా కేంద్రంలో సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు 144వ జట్టుకు శిక్షణ ఇస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ నెల 29లోగా దరఖాస్తులను బంగారుపేటలోని తమ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఈ నెల 30న ఽఉదయం 10.30 గంటలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావా లని కోరారు. వివరాలకు మత్స్య శాఖ ఉప సంచాలకులు, బంగారుపేట, రైల్వేస్టేషన్ రోడ్డులోని కార్యాలయలలో సంప్రదించాలన్నారు. -
బుగ్గన కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరైన వైఎస్జగన్
జననేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసిన వెంటనే పెల్లుబుకిన ఆనందం.. కరచాలనం చేసేందుకు ఉరికిన ఉత్సాహం... ‘సీఎం.. సీఎం..జై జగన్’ అంటూ నింగిని అంటేలా నినాదం.. ఎటు చూసినా జనమే జనం.. ఉత్తేజం.. ఉల్లాసం.. బుధవారం డోన్ పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి పర్యటన ఆద్యంతం అభిమాన సంద్రంగా సాగింది. ప్రతి చోటా జననేతపై ప్రజలంతా పూలు చల్లుతూ అభిమానం చాటుకున్నారు. ‘అమ్మఒడి పథకంతో మమ్మల్ని అందుకున్నారు ’ అంటూ మహిళలు చేతులెత్తి నమస్కరించారు. ‘మేమంతా సిద్ధం’ అనే జెండాలతో యువత కదం తొక్కారు. ‘వ్యవసాయాన్ని పండుగ చేశారు’ అంటూ కర్షకులు కదలి వచ్చారు. అడుగడుగునా ప్రజలు అభిమానాన్ని హోరెత్తించారు.డోన్: ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి కుమారుడు బుగ్గన అర్జున్ వివాహ రిసెప్షన్ వేడుక బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరై నూతన వధూవరులు బుగ్గన అర్జున్ అమర్నాథరెడ్డి, అనన్యలకు పుష్ఫగుచ్ఛం అందజేసి ఆశీర్వదించారు. డోన్ శివారులోని దత్తాత్రేయ స్వామి ఆలయ సమీపంలో ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేశారు. నూతన దంపతులకు వేదపండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఉదయం 11.30 గంటలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి నుంచి నేరుగా డోన్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డితో పాటు వైఎస్సార్సీపీ నేతలు జగన్కు స్వాగతం పలికారు. హెలిప్యాడ్ వద్ద భారీగా జనం జగన్ కోసం వేచి ఉన్నారు. హెలికాప్టర్ రాగానే ‘జై జగన్న్’ నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. అక్కడి నుంచి వివాహవేదిక వద్దకు జగన్ చేరుకున్నారు. జగన్ను చూడగానే అభిమానుల ఈలలు, కేకలు, ‘జై జగన్, సీఎం...సీఎం’ నినాదాలతో వేదిక ప్రాంగణం హోరెత్తింది. జగన్కు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ఆత్మీయంగా స్వాగతం పలికారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్పై జగన్ వస్తున్నంత సేపు జనాభిమానంతో ప్రాంగణం హోరెత్తింది. అందరికీ జగన్ ఆప్యాయంగా అభివాదం చేస్తూ, నమస్కరిస్తూ కదిలాడు. చిరునవ్వులు చిందిస్తూ, కరచాలనం చేస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. నూతన దంపతులను ఆశీర్వదించి, నూతన దంపతుల తల్లిదండ్రులైన బుగ్గన దంపతులు, చల్లా సతీశ్రెడ్డి దంపతులు, సమీప బంధువులతో ఆప్యాయంగా మాట్లాడారు. ఫొటోలు దిగారు. ఆపై వేదికపై నుంచి అందరికీ అభివాదం చేసి నేరుగా హెలిప్యాడ్కు చేరుకుని తిరుగుపయనమయ్యారు. జగన్ రాకతో డోన్ మొత్తం జనాలతో కిక్కిరిసిపోయింది. వేదిక ఏర్పాటు చేసిన ఎన్హెచ్–44 సమీపంలో రోడ్డుకు ఇరువైపులా భారీగా జనం ఉన్నారు. జగన్ కాన్వాయ్ వెళ్తుంటే జైజగన్ అంటూ హోరెత్తించారు. కారులో నుంచి జగన్ అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేశారు. వేడుకకు ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, విరూపాక్షి, ఎమ్మెల్సీలు ఇసాక్ బాషా, మధుసూదన్, కల్పలతారెడ్డి, జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, గంగుల బిజేంద్రనాథ్రెడ్డి, సాయిప్రసాద్రెడ్డి, కాటసాని రామిరెడ్డి, కంగాటి శ్రీదేవి, మాజీ ఎంపీలు బుట్టా రేణుక, పోచా బ్రహ్మానందరెడ్డి, తలారి రంగయ్య, పార్టీ నేతలు ఆదిమూలపు సతీష్, దారా సుధీర్, కోట్ల హర్షతో పాటు నంద్యాల, కర్నూలుతో పాటు పలు జిల్లాల నుంచి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.ప్రత్యేక ఆకర్షణగా బుగ్గన ఇంటి సెట్రిసెప్షన్ కోసం వేదికపై ప్రత్యేకంగా సెట్ ఏర్పాటు చేశారు. బుగ్గన సొంతూరు బేతంచెర్లలో వారి పూర్వీకులు 1923లో ఇంటిని నిర్మించారు. ఇప్పటికీ అదే ఇంట్లో బుగ్గన నివాసం ఉంటున్నారు. వేదికపై తన ఇంటి నమూనాతో సెట్ వేయించారు. అచ్చం బుగ్గన నివాసం ఎలా ఉందో అలాగే సెట్ ఉండటంతో వేడుకకు హాజరైన వారు ప్రత్యేకంగా తిలకించారు. ఇంటి ముందే రిసెప్షన్ జరిగిన భావన కల్పించారు. -
చేయూత కరువై.. చేనేత చిక్కుముడై!
పాత పథకానికి కొత్త ‘షో’కు ఒక్క హామీ నెరవేర్చని కూటమి ప్రభుత్వం ● హామీలు మాటలకే పరిమితం ● జీఓలు విడుదల చేస్తున్నా అమలు కరువు ● ఉమ్మడి జిల్లాలో రాణించిన 4,148 చేనేత కుటుంబాలు ● కూటమి ప్రభుత్వంలో 2,842 కుటుంబాలకే పరిమితం ● గత ప్రభుత్వంలో ఆదుకున్న వైఎస్సార్ నేతన్న నేస్తం ● నేడు జాతీయ చేనేత దినోత్సవం చేనేతలకు పొదుపు నిధి ఎప్పటి నుంచో అమలులో ఉంది. చేనేత సహకార సంఘాల్లో పనిచేసే కార్మికులకు చెల్లించే వేజ్లో పొదుపు కింద 8 శాతం కట్ చేస్తే, దానికి 16 శాతం ప్రభుత్వం కలుపుతుంది. దీనినే పొదుపు నిధిగా వ్యవహరిస్తారు. అయితే కూటమి ప్రభుత్వం తామే ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించుకోవడం విమర్శలకు తావిస్తోంది.కర్నూలు(అగ్రికల్చర్) : ఒకప్పుడు వ్యవసాయ రంగం తర్వాత చేనేత పరిశ్రమ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. 2023–24 సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో 4,148 చేనేత కుటుంబాలు ఉండగా.. అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద నెలకు రూ.2వేల ప్రకారం ఏడాదికి రూ.24 వేల ఆర్థిక తోడ్పాటును అందించింది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత లేకపోవడంతో ఈ స్వల్ప కాలంలోనే 1,306 కుటుంబాలు చేనేత వృత్తికి స్వస్తి పలకడం గమనార్హం. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఉమ్మడి జిల్లాలో కేవలం 2,842 కుటుంబాలకు మాత్రమే వర్తిస్తోంది. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చేనేత పరిశ్రమ మనుగడ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. చేయూత కోసం ఎదురు చూపులు కూటమి ప్రభుత్వం ఏర్పాటై 14 నెలలు గడుస్తున్నా చేనేత కార్మికుల సంక్షేమానికి తీసుకున్న చర్యలు ఒక్కటంటే ఒక్కటీ లేదు. చేనేత పరిశ్రమను అభివృద్ధి చేసుకునేందుకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని, చేనేతకార్మికుల ఆరోగ్య భద్రతకు బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించినా అమలుకు నోచుకోలేదు. చేనేతలకు భారంగా మారిన జీఎస్టీని ఎత్తి వేస్తామని, ఇది సాద్యం కాకపోతే కట్టిన జీఎస్టీని వెనక్కు ఇస్తామన్నా ఉలుకూపలుకూ లేదు. చేనేత కార్మికులు ఇళ్లు నిర్మించుకుంటే మగ్గం ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా మామూలుగా ఇచ్చే రూ.4.30 లక్షలకు అదనంగా రూ.50 వేలు చెల్లిస్తామన్న హామీ మాటలకే పరిమితమైంది. కార్మికుల ఆదాయాన్ని పెంచేలా సమగ్ర పాలసీని తెస్తామని ప్రకటించినా కార్యరూపం దాల్చని పరిస్థితి. నేడు జాతీయ చేనేత దినోత్సవం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండవ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఈ నెల 7న నిర్వహించనున్నారు. కర్నూలు జిల్లాకు సంబందించి ఎమ్మిగనూరులోని కుర్ని ఫంక్షన్ హాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నంద్యాల జిల్లాకు సంబంధించి బనగానపల్లి మండలం నందివర్గంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వంలో అరకొర బడ్జెట్ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత శాసనసభలో రెండు సార్లు బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. అయితే రెండేళ్లలో చేనేతలకు కేటాయించిన బడ్జెట్ రూ.10 కోట్లు మాత్రమే. నామమాత్రపు బడ్జెట్తో చేనేతల సంక్షేమం ఎలా సాధ్యమనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నేతన్న సంక్షేమానికి ఏటా రూ.200 కోట్లు కేటాయించింది. ఐదేళ్లలో రూ.1000 కోట్లు వెచ్చించిన విషయాన్ని చేనేతలు గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో చేనేతలకు రూ.47.58 కోట్ల ఆర్థిక తోడ్పాటు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పింది చెప్పినట్లుగా అమలు చేసి చూపించారు. రెండేళ్లు కరోనాతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైన్పటికీ ఎక్కడా రాజీపడకపోవడం విశేషం. చేనేత మగ్గాలను అభివృద్ధి చేసుకోవడం, ఇతర మౌలిక సదుపాయాలతో సమర్థవంతంగా రాణించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతినెలా రూ.2వేలు చొప్పున ఏడాదికి రూ.24వేలు చెల్లించింది. ఒక్కో చేనేత కుటుంబానికి ఐదేళ్లలో రూ.1.20 లక్షల ఆర్థిక లబ్ధి చేకూరింది. ఐదేళ్లలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో చేనేతలకు రూ. 47.58 కోట్ల ఆర్థిక తోడ్పాటు లభించింది. చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.36 వేలు చెల్లించాలి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లు వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేసింది. నెలకు రూ.2వేల ప్రకారం ఏడాదికి రూ.24 వేలు చేయూతనిచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం చేనేతల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏడాదికి రూ.36 వేల ప్రకారం తోడ్పాటును అందించాలి. అద్దె మగ్గాలకు కూడా ఈ సాయాన్ని వర్తింపజేయాలి. 40 శాతం సబ్సిడీపై యార్న్ సరఫరా చేయాలి. – బి.మాధవస్వామి, రాష్ట్ర అధ్యక్షుడు, చేనేత కార్మిక సంఘం జీఓలు ఇవ్వడమే తప్ప కార్యాచరణ కరువు 2014–15 నుంచి 2018–19 వరకు చేనేతకారుల సంక్షేమం మాటల్లో ఊదరగొట్టడం.. జీఓలు విడుదల చేయడం మినహా ఒక్కటీ కార్యరూపం దాల్చని పరిస్థితి. చేనేతల సంక్షేమానికి విడుదల చేసిన జీఓల విలువ దాదాపు రూ.200 కోట్లు. అయితే కాగితాలకే పరిమితమైంది. 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ప్రతి ఏటా చేనేతకారులకు వేజ్లాస్ కింద నెలకు రూ.2వేల ప్రకారం మూడు నెలల పాటు పరిహారం ఇచ్చేందుకు జీఓలతో సరిపెట్టారు. ఒకప్పుడు జిల్లాలో రూ.200 కోట్ల వరకున్న చేనేత వస్త్రాల ఉత్పత్తి టీడీపీ హయాంలో రూ.40 కోట్లకు పడిపోయింది. ఒకప్పడు ఉమ్మడి జిల్లాలో 45 చేనేత సహకార సంఘాలు ఉండగా.. నేడు ఏడుకు పడిపోవడం గమనార్హం. -
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎస్వీ విజయ మనోహరి
కర్నూలు(టౌన్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎస్వీ విజయ మనోహరి నియమితులయ్యారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆమెను నియమిస్తూ మంగళవారం రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఫసల్ బీమా యోజనకు సర్వర్ సమస్య కర్నూలు(అగ్రికల్చర్): ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు సర్వర్ సమస్య రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత నెల 30వ తేదీ నుంచి సర్వర్ సమస్య వేధిస్తున్నప్పటికీ పరిష్కారానికి వ్యవసాయ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. పీఎంఎఫ్బీవై కింద ప్రీమియం చెల్లింపు గడువు జూలై 31తోనే ముగిసింది. అయితే సర్వర్ సమస్యతో రైతులు సద్వినియోగం చేసుకోలేదనే కారణంతో నాన్ లోనీ ఫార్మర్స్కు ఈ నెల 14 వరకు, లోనీ ఫార్మర్స్కు ఈ నెల చివరి వరకు ప్రీమియం చెల్లింపు గడువును పొడిగించింది. అయితే సర్వర్ సమస్య యథావిధిగా కొనసాగుతుండటం రైతులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. గడువు పెంచినప్పటికీ సర్వర్ సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆలూరు, కల్లూరు, ఓర్వకల్, వెల్దుర్తి తదితర మండలాల్లో సర్వర్ సమస్య కారణంగా షోయింగ్ సర్టిఫికెట్ జనరేట్ కావడం లేదు. ప్రీమియం చెల్లించేందుకు కేంద్రం గడువు పెంచినప్పటికీ రైతులు ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. రైతుల అవసరాలపై బ్లాంకెట్ సర్వే కర్నూలు(అగ్రికల్చర్): కూటమి ప్రభుత్వం పశుపోషణ రంగంలో రైతుల అవసరాలపై సర్వే చేపట్టింది. పశు పోషణలో రుణాలు, బీమా అవసరాలపై బ్లాంకెట్ సర్వే కార్యక్రమాన్ని పశుసంవర్ధకశాఖ కొద్ది రోజులుగా నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 15 వరకు ఈ సర్వే కొనసాగనుంది. జిల్లాలో 600 గ్రామాలు ఉండగా... 450 గ్రామాల్లో ఈ సర్వే జరుగుతోంది. ఆయా గ్రామాల్లో 85,980 హౌస్హోల్డ్ను సర్వే చేస్తారు. ఏహెచ్ఏలు, పారా సిబ్బంది 317 మంది ఈ సర్వేలో నిమగ్నమైనట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. వృద్ధుల ఇంటికే రేషన్ సరుకులు కర్నూలు(సెంట్రల్) : 65 ఏళ్లు దాటిన వృద్ధులకు కచ్చితంగా రేషన్ సరుకులను ఇళ్ల దగ్గరకే తీసుకెళ్లి ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె జిల్లా పౌరసరఫరాల అధికారి ఎం.రాజారఘువీర్, మునిసిపల్ అధికారులు, కర్నూలు తహసీల్దార్ కార్యాలయ ఉప తసీల్దార్లతో సమీక్షించారు. ప్రతి నెల 25 నుంచి నెలాఖరులోపు వృద్ధులకు కచ్చితంగా ఇళ్లకే వెళ్లి డీలర్లు సరుకులను ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. పేకాట స్థావరంపై పోలీసుల దాడి ● టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో పేకాట పాణ్యం: తమ్మరాజుపల్లె గ్రామంలో టీడీపీ నాయకులే స్వయంగా పేకాట ఆడిస్తున్నారు. మంగళవారం సాయంత్రం పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు.. గ్రామ సమీపంలోని కొండ ప్రాంతంలో పేకాట శిబిరంపై దాడి చేశారు. పేకాట ఆడుతున్న వారిని పట్టుకునేందుకు ప్రయ త్నం చేయగా పోలీసుల చేతి నుంచి పలువురు తప్పించుకొని పరారయ్యారు. పేకాట స్ధావ రంలో టీడీపీ నాయకులు ఎర్రమల నాయుడు, మీని గ శ్రీరంగడు, నాగరాజు పట్టుబడ్డారు. గ్రామ టీడీపీ నాయకులు బత్తుల శ్రీనివాసులు అలియా స్ దుబాయ్ శ్రీనుతో పాటు మరో నలుగురు పరారయ్యారు. అయితే టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఈ పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం. పరారైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టుబడిన నిందితుల నుంచి రూ.14,930, రెండు బైక్లు, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నరేంద్రకుమార్ రెడ్డి తెలిపారు. మల్లన్నకు ఊయల సేవశ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో లోక కల్యాణం కోసం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. మంగళవారం శ్రీస్వామిఅమ్మవార్లకు పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు. ముందుగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠించి, మహా గణపతిపూజ జరిపించారు. అనంతరం శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఆశీనులను చేసి శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు జరిపారు. అలాగే ఊయలలో స్వామిఅమ్మవార్లను ఉంచి షోడశోపచార పూజలు నిర్వహించారు. -
లోకల్ యాప్ ద్వారా ఉద్యోగాల పేరుతో వల
కర్నూలు: లోకల్ యాప్ ద్వారా నకిలీ నోటిఫికేషన్లు పంపి నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, యువత అప్రమతంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కర్నూలు పట్టణా నికి చెందిన ఓ యువకుడు ఉద్యోగ వేటలో లోకల్ యాప్లో ప్రైవేటు బ్యాంకు పేరుతో ఉన్న ప్రకటన చూసి సంబంధిత ఫోన్ నంబర్ను సంప్రదించగా ఫోన్లోనే ఇంటర్వ్యూ పూర్తి చేసి ఎంపికయ్యావంటూ ప్రాసెసింగ్ ఫీజు, బ్యాంకు గ్రౌండ్ వెరిఫికేషన్, యూనిఫాం, ఐడీ కార్డు పేరుతో రూ.39 వేలు డిమాండ్ చేశారని, ఆ మొత్తాన్ని చెల్లించిన తర్వాత మోసగాళ్లు టచ్లో లేకుండా పోయారన్నారు. అలాగే ఆదోని ప్రాంతానికి చెందిన మరో యువకుడు అసిస్టెంట్ మేనేజర్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోగా జాబ్ బాండింగ్ చార్జి పేరిట రూ.76 వేలు వసూలు చేసి తర్వాత నకిలీ ఆఫర్ లెటర్ పంపించి మోసం చేశారని వివరించారు. ఇలా లోకల్ యాప్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలంటూ నకిలీ ప్రకటనలు ప్రచురించి నిరుద్యోగుల వద్ద నుంచి ధ్రువపత్రాలు, ఫీజుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. కొంతమంది తాము ప్రభుత్వ అధికారులమని చెప్పుకుని నమ్మించి నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారని వెల్లడించారు. మోసం చేసే విధానం... ఆకర్షణీయమైన జాబ్ నోటిఫికేషన్లు లోకల్ యాప్ ద్వారా పంపిస్తారు. తక్కు వ అర్హతతో అధిక వేతనం అంటూ ఆకర్షిస్తారు. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు, ప్రాసెసింగ్ చార్జీలు అడగటం, నకిలీ ఇంటర్వ్యూ లు, నకిలీ ఆఫర్ లెటర్లు పంపి మోసం చేస్తారు. పోలీసు సూచనలు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల నియామక ప్రక్రియ అధికారిక వెబ్సైట్లు, నోటిఫికేషన్ల ద్వారా ప్రతిభ ఆధారంగానే జరుగుతుంది. ఉద్యోగం కోసం ఎవరూ డబ్బులు అడగరు. అడిగితే అది మోసమనే విషయం గుర్తించాలి. లోకల్ యాప్ వంటి ఫ్రీ క్లాసిఫైడ్ యాప్లలో వచ్చిన ఉద్యోగ ప్రకటనలను పూర్తిగా క్రాస్ చెక్ చేసుకోవాలి. అపరిచిత నంబర్ల నుంచి వచ్చిన కాల్స్, వాట్సాప్ సందేశాల్లో లింకులపై క్లిక్ చేయరాదు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్ నెంబర్కు, www.cybercrime.gov.inలో ఫిర్యా దు చేయాలని ఎస్పీ సూచించారు. -
స్మార్ట్ మీటర్లు రద్దు చేయాల్సిందే
● ప్రజల సొమ్మును దోచుకునేందుకు కుట్ర ● సర్దుబాటు చార్జీల పేరుతో పేదలపై భారం తగదు ● ప్రజాసంఘాల ఐక్య వేదిక నేతలు కర్నూలు(అగ్రికల్చర్): ప్రజలకు భారంగా మారే విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వెంటనే రద్దు చేయాలని ప్రజా సంఘాల ఐక్య వేదిక నేతలు డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ కొన్ని నెలలుగా ప్రజా సంఘాలు పోరాటం చేస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం స్పందికపోవడం దారుణమన్నారు. స్మార్ట్మీటర్లను రద్దు చేయాలని ప్రజా సంఘాల ఐక్య వేదిక మంగళవారం కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్భవన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. వందలాది వివిధ ప్రజా సంఘాల కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు విద్యుత్ భవన్ ఎదుట బైఠాయించి స్మార్ట్మీటర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కల్లూరు దర్వాజ, జొహరాపురం, బి.క్యాంపు, కేవీఆర్ మహిళ డిగ్రీ కళాశాల దగ్గర ఉన్న పవర్హౌస్, కల్లూరు ఎస్టేటు తదితర ప్రాంతాల్లో ఉన్న సబ్ స్టేషన్ ఎదుట ఆందోళనలు చేపట్టారు. గురుశేఖర్ అధ్యక్షతన జరిగిన ధర్నానుద్దేశించి సీఐటీయూ జిల్లా నాయకులు రాముడు, రైతు సంఘం సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు, ఏడీఐఎస్వో రాష్ట్ర నాయకులు హరీష్, నాగన్న, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అలివేలు, డీవైఎఫ్ఐ రాష్ట్ర కోశాధికారి నగేష్, సీఐటీయు ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ... ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లను పగులకొట్టమని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ నేడు వాటినే బిగిస్తుండటం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని రద్దు చేయకపోతే కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు. అనంతరం విద్యుత్ శాఖ ఎస్ఈ ఉమాపతికి వినతిపత్రం సమరించారు. – జొహరాపురం విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట జరిగిన ధర్నాలో పాల్గొన్న కార్మిక ప్రజా సంఘాల ఐక్య వేదిక జిల్లా నాయకులు గౌస్దేశాయ్ మాట్లాడుతూ... స్మార్ట్మీటర్లు బిగించడం అంటే ప్రజల సొమ్మును విద్యుత్ బిల్లుల పేరుతో కార్పొరేట్ కంపెనీలకు దోచి పెట్టడమేనని, స్మార్ట్ మీటర్ల స్థానంలో పాత మీటర్లను బిగించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే ఒక్కపైసా చార్జీలు పెంచమని చెప్పిన చంద్రబాబు నేడు అడ్డుగోలుగా టూఅప్ చార్జీలు, సర్దుబాటు పేరుతో ప్రజల నడ్డివిరుస్తున్నారన్నారు. ధర్నా కార్యక్రమాల్లో ప్రజాసంఘాల నేతలు మహమ్మద్, శేషాద్రి, అబ్దుల్లా, హుసేనయ్య, శ్రీరాములు, మధు, ఇర్పాన్ పాల్గొన్నారు. -
నేడు వైఎస్ జగన్ డోన్కు రాక
డోన్: పట్టణంలో బుధవారం జరిగే రాష్ట్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి కుమారుడు అర్జున్ అమర్నాథ్రెడ్డి, మాజీ రాష్ట్రపతి దివంగత నీలం సంజీవరెడ్డి ముని మనవరాలు అనన్యరెడ్డి వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు. తాడేపల్లిలోని హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్లో ఉదయం 9.30 గంటలకు బయలుదేరి డోన్ పట్టణ శివారులోని ఎం కన్వెన్షన్ హాల్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు 11.40 గంటలకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కంబాలపాడు సర్కిల్, ఉడుములపాడు మీదుగా 44వ జాతీయ రహదారిపై స్థానిక దత్తాత్రేయ స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో నిర్మించిన వివాహ రిసెప్షన్ వేదికకు చేరుకుంటారు. వధూవరులను ఆశీర్వదించిన అనంతరం తిరిగి కారులో ఎం. కన్వెన్షన్ హాల్ వద్దకు చేరుకుని అనంతరం హెలికాప్టర్లో బెంగళూరుకు 12.20కి ప్రయాణమవుతారు. ఏర్పాట్ల పరిశీలన.. ఎం కన్వెన్షన్ హాల్ వద్ద నిర్మించిన హెలిపాడ్తో పాటు దత్తాత్రేయ స్వామి గుడి ఆవరణలో నిర్మించిన వివాహ రిసెప్షన్ వేదిక, భోజనశాల షెడ్లను మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఆయన వెంట పట్టణ, రూరల్ సీఐలు ఇంతియాజ్ బాషా, రాకేష్, ఎస్ఐ శరత్కుమార్రెడ్డితో పాటు పార్టీ నాయకులు ఉన్నారు. మాజీ మంత్రి బుగ్గన తనయుని వివాహ రిసెప్షన్కు హాజరు -
శ్రీమఠంలో సినీనటుడు సాయికుమార్
మంత్రాలయం: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం మంగళవారం సినీనటుడు సాయికుమార్ విచ్చేశారు. ఆయన మఠం కారిడార్కు చేరుకోగా ధార్మిక అధికారి శ్రీపతి ఆచార్, సహాయ పీఆర్వో వ్యాసరాజాచార్లు సాంప్రదాయబద్ధంగా ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. ఆయన ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని అర్చన సహిత హారతులు పట్టా రు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూలబృందావనానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనకు మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు శేషవస్త్రం కప్పి, స్వామి వారి అక్షితలు అందజేసి ఆశీర్వదించారు. స్వామి వారి జ్ఞాపికను బహూకరించారు. చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహిద్దాం కర్నూలు(అర్బన్): ఈ నెల 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం స్థానిక బిర్లా కాంపౌండ్లో ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్, చేనేత కుల సంఘాల సమాఖ్య కర్నూలు యూనిట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ చేనేత దినోత్సవం సందర్భంగా 7న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ సమీపంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళి, అనంతరం 11.30 గంటలకు చేనేత జౌళి శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో చేనేత సమస్యలపై చర్చించి మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులకు వినతి పత్రాలను అందిస్తామన్నారు. చేనేత సామాజిక వర్గానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. నాయకులు చింత శ్రీనివాసులు, దాశెట్టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
అధిక వర్షాలు ఉన్నా.. రైతులకు సుఖం లేదు!
హాలహర్వి: నిట్రవట్టి గ్రామంలో మంగళవారం శ్రావణ శుద్ధ దశమి వేడుకలు ఘనంగా జరిగాయి. వసిగేరప్ప తాత భక్తుడు కె.ఏజీ భవిష్యవాణి వినిపించారు. ముంగారి వర్షాలు విశేషంగా గాలి నుంచి మేఘాల ద్వారా వస్తాయని, అయినా రైతులకు సుఖం ఉండదన్నారు. హింగారి వర్షాలు ఏడు కార్తీలు ఉరుములు, మెరుపుల ద్వారా వస్తాయన్నారు. రెండు తుపాన్లు ఉంటాయన్నారు. తెల్ల గుర్రం, ఎర్ర గుర్రం వెనుకా ముందు పరుగులు పెడతాయని చెప్పారు. ఆరు మూడు అవుతుంది, మూడు ఆరు అవుతుందని వివరణ ఇచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో భవిష్యవాణిని వినేందుకు తరలించ్చారు. భవిష్యవాణి వినిపించిన వసిగేరప్పతాత భక్తుడు -
అట్టహాసంగా బిషప్ పట్టాభిషేకం
నంద్యాల(న్యూటౌన్): నంద్యాల డయాసిస్ బిషప్గా కామనూరి సంతోష్ ప్రసన్నరావు పట్టాభిషేక కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. హోలీక్రాస్ కెథడ్రల్ సెంటినరీ చర్చి ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి నంద్యాల డయాసిస్ పరిధిలో ఉన్న పాస్టరేట్ డీనరీ చైర్మన్లు, పాస్టర్లు, కౌన్సిల్ మెంబర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా(చైన్నె) మోడరేటర్ రూబెన్ మార్క్ నూతన బిషప్ సంతోష్ ప్రసన్నరావుతో ప్రమాణ స్వీకారం చేయించి మాట్లాడారు. సంతోషరావు క్రమంగా బిషప్ స్థాయికి ఎదగడం అభినందనీయమని చెప్పారు. అవినీతికి తావు లేకుండా నంద్యాల డయాసిస్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రమాణ స్వీకారం అనంతరం బిషప్ ప్రసన్నరావును రైల్వే స్టేషన్ సమీపంలోని ఎంఎస్నగర్ నుంచి ఊరేగింపు నిర్వహించారు. హోలీక్రాస్ కెథడ్రల్ ఆలయ ఆవరణలో బిషప్ దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో బిషప్లు ఐజక్ వరప్రసాద్, జార్జికొర్నెలి, పద్మారావు, తిమోతి, రవీందర్, హేమచంద్రకుమార్, జయసింగ్ ప్రిన్సిన్స్ ప్రభాకరన్లతో పాటు డయాసిస్ వైస్ ప్రెసిడెంట్ వరప్రసాద్, డయాసిస్ సెక్రటరీ స్టాండ్లీ విలియం, సెంటినరీ చర్చి సెక్రటరీ ప్రభుదాసు, నందం ఐజక్తో పాటు అన్ని పాస్టరేట్ల డీనరీ చైర్మన్లు, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా దక్షిణ ఇండియా సంఘం చైన్నె కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. క్రీస్తు మార్గంలో నడుస్తా క్రీస్తు బోధనలు అనుసరిస్తూ ఆయన అడుగు జాడల్లో నడుస్తానని నంద్యాల డయాసిస్ అధ్యక్ష ఖండం పీఠాధిపతి(బిషప్) సంతోష్ ప్రసన్నరావు అన్నారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. డయాసిస్ పరిధిలో ఉన్న ఆస్తులను కాపాడుతూ, నంద్యాలలో విద్య, వైద్య సేవలకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. అవినీతికి తావు లేకుండా నంద్యాల డయాసిస్ అభివృద్ధికి కృషి చేయాలి నూతన బిషప్ సంతోష్ ప్రసన్నరావుకు మోడరేటర్ రూబెన్మార్క్ పిలుపు -
మాతృత్వం..దూరం!
● తగ్గిన సంతానోత్పత్తి రేటు ● కర్నూలు జిల్లాలో 1.8, నంద్యాల జిల్లాలో 1.36 రేటు ● జీవనశైలి మారడంతో తగ్గుదల ● యువతుల్లో స్థూలకాయం, పీసీఓడీ ● పురుషుల్లో తగ్గుతున్న శుక్రకణాల సంఖ్య ● 20 శాతం మందికి సంతానలేమి సమస్య ● పెరిగిన సంతాన సాఫల్య కేంద్రాలు కర్నూలు(హాస్పిటల్): సృష్టిలో ప్రతి సీ్త్ర తను ఒక బిడ్డకై నా జన్మనిచ్చి అమ్మకావాలని భావిస్తుంది. ఈ మేరకు వివాహమైన నాటి నుంచి పరితపిస్తుంది. పుట్టిన బిడ్డ ఆమె పెంపకంలో పెరుగుతూ ఎదుగుతూ ఉంటే ఆ తల్లి పడే ఆనందానికి హద్దులు ఉండవు. కానీ ఈ వరం ఇప్పుడు అందరి తల్లులకు కలగడం లేదు. కొందరికి ఆలస్యంగా పిల్లలవుతుంటే మరికొందరికి అసలు కావడం లేదు. దంపతులిద్దరిలో లేదా ఒకరిలో లోపం ఉండటం వల్లే ఇలా జరుగుతోంది. జీవనశైలిలో వచ్చిన మార్పులే దీనికి ప్రధాన కారణమని వైద్యులు భావిస్తున్నారు. ఈ క్రమంలో సంతాన సాఫల్య కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సంతానలేమి సమస్యతో బాధపడే వారి సంఖ్య అధికమైంది. ఒకప్పుడు వందలో ఒకరిద్దరు మాత్రమే సంతానలేమితో బాధపడేవారు. ఇప్పుడు ఆ సంఖ్య పట్టణాల్లో 20 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 10 శాతం వరకు ఉంటోంది. 2023–24 సంవత్సరంలో రాష్ట్రంలో సగటు సంతానోత్పత్తి రేటు 1.21 ఉండగా ఇందులో కర్నూలు జిల్లాలో 1.80, నంద్యాల జిల్లా 1.36గా నమోదైంది. కాగా జిల్లాలోని ఆదోని, పత్తికొండ వంటి ప్రాంతాల్లో సంతానోత్పత్తి 3, 3.5 రేటు ఉండగా కర్నూలు, నంద్యాల వంటి పట్టణ ప్రాంతాల్లో మాత్రం 1.5 కంటే తక్కువగా సంతానోత్పత్తి రేటు పడిపోవడం ఆందోళనకరం. పెరిగిన సంతాన సాఫల్య కేంద్రాలు పిల్లలు కలగని దంపతులు ఒకప్పుడు సమీప గైనకాలజిస్టులను కలిసి చికిత్స తీసుకునేవారు. అప్పటికీ పిల్లలు కలగకపోతే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్, చైన్నె, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లి సంతా న సాఫల్య కేంద్రాల్లోని వైద్యులను సంప్రదించేవారు. వీరి డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని సిటీల్లో ని సంతాన సాఫల్య కేంద్రాలు పట్టణాల్లోనూ ఏర్పాటవుతున్నాయి. ఈ కారణంగా కర్నూలు, నంద్యాల, ఆదోని వంటి ప్రాంతాల్లోనూ సంతానసాఫల్య కేంద్రాలు వెలిశాయి. కర్నూలు జిల్లాలోనే వైద్య ఆరోగ్యశాఖ వద్ద రిజిస్టర్ అయిన సంతాన సాఫల్య కేంద్రాలు 16 ఉన్నాయి. ఆయా కేంద్రాలకు ప్రస్తుతం ప్రతిరోజూ 50 నుంచి 60 మంది దాకా దంపతులు చికిత్స కోసం వెళ్తున్నారు. కాగా కొన్ని కేంద్రాలు వీరి ఇబ్బందులను ఆసరాగా తీసుకుని అధిక మొత్తంలో డబ్బును డిమాండ్ చేస్తున్నారు. వెళ్లిన ప్రతిసారి రూ.4వేల నుంచి రూ.5వేలు ఖర్చు అయ్యేలా చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని కేంద్రాలు సంతానం కలగకపోవడానికి గల కారణాన్ని బట్టి గంపగుత్తగా రూ.1లక్ష నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. సంతానలేమికి కారణాలు ఇటీవల కాలంలో చాలా మంది యువతీయువకులు జీవితంలో స్థిరపడ్డాక వివాహం చేసుకుంటున్నారు. దీనికితోడు చదువుకున్న అమ్మాయిలు అధి కం కావడం, వారికి సరిపడా అబ్బాయిలు లభించకపోవడం, అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడం వంటి కారణాల వల్ల ఆలస్యంగా వివాహం చేసుకోవడం, మారిన జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, స్థూలకాయం, సీ్త్రలలో పీసీఓఎస్ (అండాశయంలో తిత్తులు), ఎండోమెట్రియాసిస్ సమస్యలు, రాత్రివేళల్లో ఆలస్యంగా నిద్రపోవడం,జంక్ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, మొబైల్ఫోన్ స్క్రీన్ ఎక్కువగా చూడటం వల్ల, అన్యోన్య దాంపత్యం లేకపోవడం వల్ల సంతానలేమికి కారణాలు. అయితే గ్రామాల్లో ఇప్పటికీ త్వరగా వివాహాలు కావడం, చిన్న వయస్సులోనే (టీనేజిలో) పిల్లలు అవుతున్నారు. ఈ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి రేటు ఎక్కువగా కనిపిస్తోంది. పట్టణాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటోందని వైద్యులు చెబుతున్నారు.ఇలా చేయాలి... సమతుల ఆహారం తీసుకోవాలి. రోజూ తగినంత వ్యాయామం చేయాలి. బయటి ఆహారానికి ముఖ్యంగా జంక్ఫుడ్, ఫాస్ట్ఫుడ్కు దూరంగా ఉండాలి. స్థూలకాయం తగ్గించుకోవాలి. ఇందుకోసం జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. దూమపానం, మద్యపానం మానేయాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. ఇందుకోసం యోగా, ధ్యానం చేయాలి. వివాహమై ఏడాది దాటినా గర్భం దాల్చకపోతే వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి. ఇలా చేయాలితప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా వైద్య ఆరోగ్యశాఖలో రిజిస్టర్ చేసుకోవాలి. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు మాత్రమే వాటిని నిర్వహించాలి. రిజిస్ట్రేషన్ చేయకుండా ఏఆర్టీ కేంద్రాలు నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము. జిల్లాలో గతంలో కంటే ఇప్పుడు సంతాన సాఫల్య కేంద్రాలు పెరిగాయి. సంతానోత్పత్తి రేటు తగ్గడమూ దీనికి ఒక కారణం కావచ్చు. –డాక్టర్ పి.శాంతికళ, డీఎంహెచ్ఓ, కర్నూలు జీవనశైలిలో మార్పులే కారణం జీవనశైలిలో వచ్చిన మార్పులే సంతానోత్పత్తి రేటు తగ్గడానికి కారణం. ఇది పురుషుల్లో 30 శాతం, మహిళల్లో 30 శాతం ఉంది. పురుషుల్లో వీరకణాల సంఖ్య తక్కువగా ఉండటం, మహిళల్లో ఇన్ఫెక్షన్లు, పీసీఓఎస్, స్థూలకాయం, మానసిక ఒత్తిడి కారణాలు. పట్టణాల్లో ఆలస్యంగా వివాహం చేసుకోవడం, ఆలస్యంగా పిల్లలను కనాలనే ప్రణాళిక వేసుకోవడం కూడా సంతానోత్పత్తి రేటు తగ్గడానికి మరో కారణం. –డాక్టర్ ఎస్.సావిత్రి, హెచ్ఓడీ, గైనకాలజి విభాగం, జీజీహెచ్, కర్నూలు -
● విద్యార్థుల జీవితాలతో కూటమి సర్కారు చెలగాటం ● ఇంటర్ ఫలితాలు విడుదలై నాలుగు నెలలు కావస్తున్నా వెలువడని నోటిఫికేషన్ ● ఆందోళనలో విద్యార్థులు
కర్నూలు కల్చరల్: ఇంటర్ ఫలితాలు వచ్చి నాలుగు నెలులు కావస్తున్నా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశ ప్రక్రియ ప్రారంభం కాలేదు. నేటికీ నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంకెంతకాలం నిరీక్షించాలని కూటమి సర్కారును ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 82 డిగ్రీ కళాశాలలున్నాయి. ఇంటర్ పూర్తయిన విద్యార్థుల్లో సగం మంది ఇంజినీరింగ్ వైపు వెళితే మిగతా వారు డిగ్రీలో ప్రవేశానికి ఆసక్తి చూపుతారు. సివిల్స్, సర్వీస్ కమీషన్, పోలీస్ శాఖ, అగ్ని మాపక, అటవీ శాఖ, బ్యాంకింగ్, రైల్వే ఉద్యోగాలు సాధించేందుకు అవకాశం ఉండటంతో డిగ్రీ కోర్సులపై దృష్టి సారిస్తారు. అయితే. గతంలో ఎప్పుడూ లేని విధంగా కూటమి సర్కారు ప్రవేశాల ప్రక్రియలో తీవ్ర జాప్యం చేస్తోంది. ఈనెల 18 నుంచి ప్రవేశాలకు నోటిిఫికేషన్ ఇస్తామని ప్రకటించింది. ఆ ప్రకారం నోటిఫికేషన్ వస్తుందా.. లేదా అనే సందిగ్ధంలో విద్యార్థులున్నారు. ఇప్పటికే అకడమిక్ క్యాలెండర్ దెబ్బతిందని భవిష్యత్తులో ఉద్యోగాల నియామక నోటిఫికేషన్లు, పీజీ ప్రవేశాలకు అర్హత కోల్పోతామని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఎమ్మిగనూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముఖ ద్వారం ఆర్యూ పరిధిలో డిగ్రీ కళాశాలల వివరాలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 14 పైవేట్ డిగ్రీ కళాశాలలు 68 మొత్తం కళాశాలల సంఖ్య 82 గత ఏడాది ప్రవేశాలు పొందిన విద్యార్థులు సంఖ్య 9,204 అబ్బాయిల సంఖ్య 4,714, అమ్మాయిల సంఖ్య 4,490 బీఏ 1,469 బీకాం 3,291, బీఎస్సీ 3,367, బీబీఏ 380 బీఏసీ 697 మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. ఇప్పటికే పలు అసంబద్ధ నిర్ణయాలు అమలు చేయడంతో విద్యా రంగం గాడితప్పింది. ఇంటర్ ఫలితాలు విడుదలై నెలలు గడుస్తున్నా డిగ్రీ ప్రవేశాల్లో నిర్లక్ష్యం ప్రదర్శించడం ప్రభుత్వానికి విద్యా వ్యవస్థపై ఏమాత్రం ప్రేమ ఉందో అర్థమవుతోంది. విద్యార్థుల జీవితాలతో ఆటలాడటం మాని అకడమిక్ క్యాలెండర్ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి. – భాస్కర్, రాష్ట్ర అధ్యక్షులు, పీడీఎస్యూ సమన్వయ లోపంతోనే ఇలాంటి పరిస్థితి ఉన్నత విద్యా శాఖ, ఉన్నత విద్యా మండలి మధ్య సమన్వయ లోపంతోనే డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ ఆలస్యమవుతోంది. సింగిల్ లేదా డ్యూయల్ మేజర్ సబ్జెక్టులపై స్పష్టత ఇవ్వడంలో, అవగాహన కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. దీంతో మెరిట్ విద్యార్థులు ఇతర రాష్ట్రలకు వెళుతున్నారు. డిగ్రీ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దాలి. లేని పక్షంలో ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ విద్యార్థులను ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. – స్వామి, ఏబీవీపీ కర్నూలు విభాగ్ కన్వీనర్ -
విద్యుదాఘాతంతో వలస కార్మికుడి మృతి
ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని చెన్నాపురం గ్రామం సమీపంలోని స్టోన్ క్రస్రర్ మిషన్ ఫ్యాక్టరీ దగ్గర మంగళవారం ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్కు గురై సంతోష్ (22) అనే యువకుడు మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ యువకుడు కొన్ని రోజు క్రితం తమ ప్రాంతానికి చెందిన మేసీ్త్ర ద్వారా చెన్నాపురం స్టోన్ క్రస్రింగ్ మిషన్ ఫ్యాక్టరీలో పనిలో చేరాడు. రోజు మాదిరిగానే ఉదయం ఫ్యాక్టరీ దగ్గర వెల్డింగ్ వర్క్ చేస్తున్నారు. అయితే, ఆ సమయంలో వర్షం రావడంతో షార్ట్ సర్క్యూట్కు గురై కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి కార్మికులు సంతోష్ను చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీస్స్టేషన్ ట్రైనీ ఎస్ఐ మల్లికార్జున ప్రభుత్వాసుప్రతికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును, మృతదేహాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. పోస్టుమార్టుం కోసం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులకు ప్రమాదం విషయం తెలియజేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు విలేకరులకు తెలిపారు. కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య జూపాడుబంగ్లా: కుటుంబ కలహాలతో మండలంలోని తర్తూరు గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల మేరకు.. సి.బెళగల్కు చెందిన గనిమల్లేశ్వరి (23)కి తర్తూరు గ్రామానికి చెందిన మధు అనే వ్యక్తితో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కొడుకు, కుమార్తె సంతానం. భర్త మతిస్థిమితం లేకపోవటం, మామ వెంకటేశ్వర్లు దివ్యాంగుడు కావడంతో కుటుంబపోషణ భారమంతా గనిమల్లేశ్వరిపై పడింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల మధ్య మన స్పర్థలు తలెత్తడంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె మంగళవారం పురుగుమందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు చికిత్స నిమిత్తం నందికొట్కూరుకు తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు గ్రామానికి చేరుకొని బోరున విలపించారు. మల్లేశ్వరి మృతికి భర్త, మామే కారణమని వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మెట్లపై నుంచి జారి లారీ డ్రైవర్ మృతి బేతంచెర్ల: పట్టణంలోని బైటిపేట కాలనీకి చెందిన ఓ లారీ డ్రైవర్ మెట్లపై నుంచి జారీ పడి మృతి చెందాడు. హెడ్ కానిస్టేబుల్ చంద్ర శేఖర్ వివరాల మేరకు.. సానె దుశ్యంత్ కుమార్ (33) సోమవారం ఇంటి పైనుంచి కిందికి వచ్చే క్రమంలో మెట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తూ జారి పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం నంద్యాల శాంతిరామ్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య పద్మావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ చంద్ర శేఖర్ మంగళవారం వెల్లడించారు. డివైడర్ను ఢీకొన్న కారు కర్నూలు (రూరల్): కారు అతివేగంతో డివైడర్ను ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వివరాలు.. హైదరాబాదుకు చెందిన సోదరులు శివ, మంజునాథ్, శివ సతీమణి, కూతురుతో కలిసి బెంగళూరులో గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరై తిరుగు పయనమయ్యారు. సోమవారం అర్ధరాత్రి పంచలింగాల సమీపాన శివ కారును వేగంగా నడపడంతో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో పక్కన కూర్చున్న సోదరుడు మంజునాథ్ (42) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో శివ, ఆయన భార్య, కూతురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు తాలూకా అర్బన్ సీఐ శ్రీధర్ తెలిపారు. -
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
నంద్యాల(అర్బన్): రైతు సేవా కేంద్రాలు, సొసైటీల్లో రెండు వారాలుగా పేర్లు నమోదు చేసుకున్నా యూరియా సరఫరా కాలేదంటూ సోమవారం నంద్యాల మండలం కానాల గ్రామ రైతులు ఏపీ రైతు సంఘం, సీపీఎంల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. గ్రామ సచివాలయం ప్రధాన రహ దారి వద్ద రైతులు గంట పాటు రాస్తారోకో చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు స్పందిస్తూ.. గ్రామానికి సరఫరా అయ్యే యూరియాను ప్రతి రైతుకు మూడు బస్తాల చొప్పున పంపిణీ అయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విమరించారు. అనంతరం ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రుడు, సీపీఎం మండల కార్యదర్శి బాలవెంకట్ మాట్లాడుతూ కానాల గ్రామ రైతులు రెండు వారాలుగా ఆర్ఎస్కే, సొసైటీల్లో పేర్లు నమోదు చేసుకున్నారని, అధికారులు కూటమి నేతలు చెప్పిన వారికే యూరియా సరఫరా చేస్తున్నారన్నారు. యూరియా కోసం రైతులు ఎదురు చూడాల్సి వస్తుందని చెప్పారు. యూరియా పంపిణీలో రాజకీయ నాయకుల జోక్యం వల్ల అధికారులు ఇష్టానుసారంగా పంపిణీ చేస్తున్నారన్నారు. జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని జిల్లా అధికారులు చెప్పడం దుర్మార్గమన్నారు. ప్రైవేటు వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్న రైతులకు నిరాశ ఎదురవుతుందని, యూరియాతో పాటు ఇతర కాంప్లెక్స్ ఎరువులు కొనాలని నిబంధనలు పెడుతున్నారన్నారు. మధ్య దళారుల దోపిడీతో రైతాంగం నష్టపోవడంతో పాటు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు అవసరమైన యూరియాను వెంటనే సరఫరా చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో దస్తగిరి, జాకీర్హుసేన్, యూసుఫ్, హుసేన్వలి, సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
అమెరికా ఐవీఎల్పీకి డాక్టర్ వినూషారెడ్డి ఎంపిక
కర్నూలు కల్చరల్: రాజకీయాలలో మహిళల పాత్రపై అమెరికాలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ పోగ్రామ్(ఐవీఎల్పీ)కు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి డాక్టర్ బి.వినూషారెడ్డి ఎంపికయ్యా రు. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఈ ఏడాది నిర్వహిస్తున్న బహు ళ ప్రాంతీయ సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేయబడ్డ 20 మంది విశిష్ట మహిళా నాయకురాళ్లలో ఏకై క భారత ప్రతినిధి డాక్టర్ బి.వినూష రెడ్డి. ఈనెల 11 నుంచి 30వ తేదీ మధ్య మూడు వారాల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. -
జనని బ్యాంకు సీఈఓ అరెస్ట్
కోవెలకుంట్ల: ఎక్కువ వడ్డీ ఆశ చూపి ఖాతాదారులను మోసం చేసి బోర్డు తిప్పేసిన జననీ బ్యాంకు కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న బ్యాంకు సీఈఓ వెంకటరమణను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ హనుమంతు నాయక్ కేసు వివరాలను వెల్లడించారు. 2021 జనవరి నెలలో వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం సోమవాండ్లపల్లెకు చెందిన ఆకుల వెంకటరమణ, కోవెలకుంట్లకు చెందిన గువ్వల పద్మావతి మరికొంత మందితో కలిసి పట్టణంలోని ఓంశాంతి భవన సమీపంలో జనని మ్యూచువల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ పొదుపు, పరపతి సొసైటీని ఏర్పాటు చేశారు. బ్యాంకు సీఈఓగా వెంకటరమణ, కార్యదర్శిగా పద్మావతి, ఆమె కుమారుడు రవీంద్రారెడ్డి సలహాదారుడిగా, ఆమె కోడలు సౌజన్య మేనేజర్గా, యత్తపు వాణిదేవి గౌరవాధ్యక్షురాలిగా, హరిప్రియ కోశాధికారిగా, సుజాత అధ్యక్షరాలిగా కొనసాగుతున్నారు. సొసైటీలో డబ్బులు డిపాజిట్ చేస్తే మిగతా ప్రైవేట్ బ్యాంకుల కంటే ఎక్కువ శాతం వడ్డీ ఇస్తామని, డిపాజిట్లపై రుణాలు తీసుకోవచ్చని ప్రజలను నమ్మబలికించారు. 800 మంది నుంచి రూ.1.10 కోట్ల డిపాజిట్లు.. జననీ బ్యాంకు నిర్వాహకులు మాటలు నమ్మి అధిక వడ్డీ ఆశతో కోవెలకుంట్లతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 800 మంది ఖాతాదారులుగా చేరి దాదాపు రూ.1.10 కోట్లు సేవింగ్స్, ఫిక్స్డ్, రికరింగ్ డిపాజిట్లు చేశారు. డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాదారుల బాండ్లకు గడవు తీరిపోవడంతో డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు సొసైటీ వద్దకు వెళ్లగా సంస్థ యాజమన్యం బోర్డు తిప్పేసింది. బాధితురాలిగా ఉన్న పట్టణానికి చెందిన రిటైర్డ్ అధ్యాపకుడి భార్య సావిత్రమ్మ ఫిర్యాదు మేరకు ఈ ఏడాది జూన్ 2వ తేదీన కోవెలకుంట్ల పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి కేసును చేధించారు. బ్యాంకు సీఈఓ కోవెలకుంట్లతోపాటు చాగలమర్రి, బనగానపల్లె, నంద్యాల పట్టణాల్లో బ్రాంచ్లు ఏర్పాటు చేసి అక్కడ ప్రజలను మోసం చేసి డబ్బులు స్వాహా చేసినట్లు విచారణలో తేలింది. కోవెలకుంట్లలో 300 మంది, చాగలమర్రిలో 250, బనగానపల్లె 100 , నంద్యాలలో 40 మంది డబ్బులు పోగొట్టుకొని మోసపోయినట్లు గుర్తించారు. కోవెలకుంట్ల మెయిన్ బ్రాంచ్లో రూ. 1.10 కోట్లు స్వాహా చేయగా సీఈఓ వెంకటరమణ ఒక్కడే చాగలమర్రిలో ఒక మాజీ సైనిక ఉద్యోగికి చెందిన ఫిక్స్డ్ డిపాజిట్ రూ. 17.50 లక్షలతో కలిపి రూ. 30 లక్షలు, బనగానపల్లెలో రూ. 10 లక్షలు, నంద్యాలలో కొంత మొత్తం తన సొంతానికి వాడుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇప్పటికే ఈ కేసులో గువ్వల పద్మావతి, ఆకుల భరద్వాజ్, బ్యాంకు అధ్యక్షురాలు సుజాతను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. గువ్వల పద్మావతమ్మ బ్యాంకుఖాతాలో ఉన్న రూ. 37 లక్షలను ప్రీజ్ చేసినట్లు పేర్కొన్నారు. సీఈఓ వెంకటరమణను పట్టణంలోని గాంధీసెంటర్ వద్ద అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుచగా మేజిస్ట్రేట్ రిమాండ్కు ఆదేశించినట్లు తెలిపారు. మరో ఇద్దరు నిందితులు కేసులో బెయిల్పై ఉండగా మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ వివరించారు. సమావేశంలో కోవెలకుంట్ల ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, ట్రైనీ ఎస్ఐ అనిల్కుమార్ పాల్గొన్నారు. ఎనిమిది మందిపై కేసు నమోదు నిందితురాలి ఖాతాలోని రూ. 37 లక్షలు ప్రీజ్ కేసులో ఇప్పటి వరకు నలుగురి అరెస్ట్ మరో ఇద్దరు నిందితులు పరారీ బెయిల్పై మరో ఇద్దరు -
గర్భిణి మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
నందికొట్కూరు: నాలుగు నెలల గర్భిణి శ్రీవాణి మృతికి కారణమైన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రమణ్యం తెలిపారు. సోమవారం పట్టణంలోని రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గడివేముల మండలం గని గ్రామానికి చెందిన గర్భిణి శ్రీవాణి అబార్షన్ వికటించి గత నెల 30వ తేదీన మృతి చెందింది. ఈ కేసులో అబార్షన్ చేసిన నందికొట్కూరుకు చెందిన ఆర్ఎంపీ గీతారాణి, అబార్షన్ చేయించిన శ్రీవాణి భర్త లోకేష్, అత్తా నాగేంద్రమ్మను అరెస్ట్ చేశారు. ముగ్గురిని కోర్టులో హాజరు పరుచగా మెజిస్ట్రేట్ రిమాండ్కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు. అలాగే ఈ కేసులో కర్నూలులోని కొత్తబస్టాండ్ వద్ద ఉన్న రక్ష హాస్పిటల్లో లింగనిర్ధారణ జరిగిందని, ఈ మేరకు ఆస్పత్రి స్కానింగ్ సెంటర్ టెక్నిషీయన్ శేఖర్, ఆసుపత్రి మేనేజ్మెంట్పై దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. టీడీపీ నాయకునిపై కేసు నమోదు సంజామల: ఆకుమల్ల గ్రామంలో టీడీపీలో వర్గపోరు తారా స్థాయికి చేరుకుటుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకుని కేసులు పెట్టు కున్న సంగతి అందరికీ తెలిసింది. తాజాగా గత నెల 31న ఆకుమల్లకు రైతు సేవా కేంద్రానికి ఒక లారీ యూరియా బస్తాలు వచ్చాయి. టీడీపీకి చెందిన ఒక వర్గమే అన్ని బస్తాలు తీసుకుంటుందని టీడీపీకి చెందని మరో వర్గం వ్యక్తిగత ధూషణలు చేయడంతో పంచాయితీ పోలీసు స్టేషన్ చేరింది. ఈ మేరకు దుబ్బా వెంకటేశ్వర్ రెడ్డిపై బొమ్మిరెడ్డి నాగేశ్వర్రెడ్డి ఫిర్యాదు చేయ డంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమణ య్య సోమవారం తెలిపారు. పొలాలకు ఒంటరిగా వెళ్లొద్దు గోనెగండ్ల: చిరుత సంచరించే గ్రామాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు పొలాలకు ఒంటరిగా వెళ్లొద్దని ఆదోని ఫారెస్టు రెంజ్ ఆఫీసర్ తేజశ్విని సూచించారు. సోమవారం సాయంత్రం డిప్యూటీ రెంజ్ ఆఫీసర్ నూర్జహాన్, బీటీ ఆఫీసర్ రవి కుమార్తో కలసి తేజశ్విని గంజిహళ్లి గ్రామానికి చేరుకుని చిరుత సంచారంపై ఆరా తీశారు. చిరుత సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంట పొలాల్లో సంచరిస్తున్నది చిరుతనా... ఇతర అటవీ జంతువా అనేది తేలే వరకు ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. త్వరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుతను గుర్తించి, బంధించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
నిర్మాణాలు చేపట్టకపోతే స్థలాలు రద్దే!
శ్రీశైలంటెంపుల్: భక్తుల సౌకర్యార్థం పలు నిర్మాణాలు చేపడతామని కొన్ని ధార్మిక సంస్థలు శ్రీశైల దేవస్థాన స్థలాలను పొందాయి. కొన్ని సంవత్సరాలుగా నిర్మాణాలు చేపట్టకపోవడంతో దేవదాయశాఖ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టని ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. దీంతో శ్రీశైల దేవస్థాన అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టని సుమారు 25 ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందిన తరువాత కూడా నిర్మాణాలు ప్రారంభించకపోతే స్థలాన్ని రద్దు చేసి, దేవస్థానం స్వాధీనం చేసుకుంటుందని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. స్థలాలు ఇచ్చారు ఇలా.. స్థలాలు ఇవ్వాలని పలు ధార్మిక సంస్థలు శ్రీశైల దేవస్థానానికి అభ్యర్థనలు పెట్టుకుంటాయి. ఆయా సంస్థల అభ్యర్థనలను పరిశీలించి వాటికి స్థలాలు కేటాయించాలని రాష్ట్ర దేవదాయశాఖ కమిషనరు అనుమతులిస్తారు. కమిషనర్ అనుమతుల మేరకు క్షేత్రంలో స్థలాన్ని దేవస్థాన ఈఓ కేటాయిస్తారు. ● ఓ ప్రముఖ సంస్థ ఆయుర్వేద వైద్యశాల, వేదపాఠశాల నిర్మాణం చేపట్టి భక్తులకు సేవలందిస్తామని ప్రతిపాదనలు పంపడంతో ఆ సంస్థకు దేవస్థానం 20 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. సుమారు ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా కాంపౌండ్ వాల్ తప్ప, ఇంతవరకు ఎటువంటి నిర్మాణం చేపట్టలేదు. ● ఓ ప్రముఖ మఠం వైద్యశాల, పాఠశాల నిర్మాణం చేపడతామని ముందుకు రావడంతో ఆ మఠానికి 10ఎకరాల స్థలాన్ని కేటాయించారు. రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఆ మఠం కూడా ఇంతవరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. దేవస్థాన ఈఓ ఆ మఠం వారిని పిలిచి మాట్లాడడంతో ఇప్పుడిప్పుడే పనులు ప్రారంభించారు. కమిషనర్ అదేశాల మేరకు చర్యలు దాతలు, ధార్మిక సంస్థలు తీసుకున్న స్థలాల్లో నిర్మాణాలు లేవు. కొందరు పునాదులకే పరిమితం చేశారు. అందరికి నోటీసులు జారీ చేశాం. అగ్రిమెంట్ కానీ వారికి, అగ్రిమెంట్ అయినా నిర్మాణాలు చేపట్టని వారికి అగ్రిమెంట్ రద్దు చేసేందుకు రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్కు ప్రతిపాదనలు పంపాం. కమిషనర్ అదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతాం. – ఎం. శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన ఈఓ ధార్మిక సంస్థలకు నోటీసులు -
ఉరుకుంద క్షేత్రం.. భక్తజన సంద్రం
శ్రావణ మాసం రెండవ సోమవారం సందర్భంగా జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రం భక్తజనంతో కిటకిటలాడింది. జిల్లా నుంచే కాక తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి స్వామి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సోమవారం ఒక్క రోజు రెండు లక్షలకు పైగా భక్తులు క్షేత్రానికి చేరుకున్నట్లు అంచనా. క్షేత్ర పరిసరాల్లో భక్తుల రద్దీ ఉండటంతో భక్తులు ఎల్లెల్సీ కాల్వ పరిసరాల్లో, కొండ ప్రాంతంలో, పొలాల్లోనే స్వామి వారికి నైవేద్యం తయారు చేసి పూజలు చేశారు. తలనీలాలల, దర్శన, ప్రసాద కౌంటర్ల వద్ద భక్తులు గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సి వచ్చింది. వాహనాల రద్దీతో భక్తులు అవస్థలు పడ్డారు. ఉరుకుందలో కోసిగి వైపు వెళ్లే వాహనాలు ఎదురెదురుగా రాకపోకలు సాగడంతో ఇరుక్కుపోయాయి. వాహనాలు ఎటు కదలకుండా రెండు నుంచి మూడు గంటలకు పైగా ట్రాఫిక్ స్తభించిపోయింది. ఎమ్మిగనూరుకు చెందిన ఆర్టీసీ బస్సులు సైతం లోపలికి వెళ్లేందుకు వీలు లేకుండా ఉండి పోయాయి. కోసిగిలో రైల్వే గేటు వద్ద కిలో మీటర్ మేరకు బారులుదీరాయి. ఒక రైలు వెళ్లి గేటు తెరిచే కొన్ని వాహనాలు ముందుకు సాగేలోపు మరో రైళ్ల రాకకు గేటు పడుతుండడంతో గంటల కొద్ది నిలిచి పోయాయి. – కోసిగి -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
కోసిగి: చిన్న భూంపల్లి గ్రామానికి చెందిన దుద్ది రామలక్ష్మీ (50) అనే మహిళను దారుణంగా హత్య చేసిన భర్త నరసింహులును పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో సీఐ మంజునాథ్, ఎస్ఐ హనుమంత రెడ్డి సోమ వారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. గత నెల 30వ తేదీన నరసింహులు మద్యం తాగి భార్య రామలక్ష్మితో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో భార్య తలపై భర్త రోకలిబండతో మోదడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందింది. మృతుడి కుమారుడు ఉసేన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సోమవారం ఉదయం గ్రామ శివారులోని ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ఉన్న నిందితుడు నరసింహులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. క్రషర్లో యువకుడి మృతి కర్నూలు (రూరల్): ఇ.తాండ్రపాడు గ్రామంలో కంకర క్రషర్లో జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిటన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్ ప్రాంతానికి చెందిన అన్సర్ (18) స్థానిక స్టోన్ క్రషర్లో కొన్నాళ్లుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం క్రషర్లో పని చేస్తుండగా అక్కడ ఉన్న వాహనం రివర్స్ అయ్యే క్రమంలో డ్రైవర్ గమనించకపోవడంతో ప్రమాదవశాత్తూ అన్సర్ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతుని సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కర్నూలు అర్బన్ పోలీసులు సోమవారం తెలిపారు. ఆటో అదుపు తప్పి బోల్తా పత్తికొండ రూరల్: పత్తికొండ–ఆదోని రోడ్డులోని దర్గా సమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఆస్పరి మండలం చిరుమాన్దొడ్డికి చెందిన రైతులు కూరగాయలను విక్రయించి ఆటోలో తిరిగి ప్రయాణమయ్యారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో బాలముని, సుంకన్న, ఈరన్న, రాజు, బాలరాజు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం స్థానికులు పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సలహా మేరకు కుటుంబీకులు కర్నూలుకు తరలించారు. అంతర్రాష్ట్ర సెల్ఫోన్ దొంగల అరెస్ట్ ● రూ.8లక్షలు విలువైన 56 ఫోన్లు స్వాధీనం కోడుమూరు రూరల్: నలుగురు అంతర్రాష్ట్ర సెల్ఫోన్ల దొంగలను కోడుమూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.8 లక్షల విలువైన 56 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సాయంత్రం కోడుమూరు సీఐ తబ్రేజ్ విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నంద్యాల జిల్లా డోన్ మండలం చిగుర్మాన్పేటకు చెందిన ఎరుకలి శశికుమార్, శ్రీను మరో ఇద్దరు మైనర్లతో కలసి ముఠాగా ఏర్పడ్డారు. నలుగురు తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని రద్దీ ప్రాంతాల్లో చాకచక్యంగా సెల్ఫోన్లను దొంగలించి వాటిని అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసే వారన్నారు. అనుమానంతో వీరిపై నిఘా పెట్టామన్నారు. సోమవారం ఉదయం కోడుమూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్నారని సమాచారం రావడంతో ఎస్ఐ ఎర్రిస్వామితో కలిసి నలుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న 56 సెల్ఫోన్లన్ని కర్ణాటకలోని బళ్లారి, చిక్ బళ్లాపూర్, హొస్పేట్, బెంగళూరు ప్రాంతాల్లో దొంగలించినట్లు విచారణలో తేలిందన్నారు. స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లన్నింటిని ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా బాధితులను పిలిపించి త్వరలో అందజేస్తామన్నారు. సమావేశంలో ఎస్ఐ ఎర్రిస్వామి, ట్రైనీ ఎస్ఐ నీలకంఠ, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
ఎమ్మిగనూరురూరల్: పెసలదిన్నె గ్రామంలో విద్యుదా ఘాతంతో కౌలు రైతు మృత్యువాత పడ్డాడు. గ్రామానికి చెందిన నరసింహుడు కుమారుడు బోయ కృష్ణమూర్తి(34) తనకు ఉన్న ఎకరన్నరతో పాటు 5 ఎకరాలు కౌలు తీసుకోని పత్తి పంటను సాగు చేస్తున్నాడు. ఆదివారం రాత్రి భోజనం అనంతరం పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. పొలం దగ్గర ట్రాన్స్ ఫార్మర్ కింద నున్న బోర్డులో ఉన్న స్విచ్ వేసే క్రమంలో కరెంట్ షాక్కు అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రయినా ఇంటికి రాకపోవటం, కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానంతో తండ్రి నరసింహుడు, మరో వ్యక్తితో కలసి పొలం దగ్గరకు వెళ్లి చూశారు. ట్రాన్స్ ఫార్మర్ సమీపంలో విగత జీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించాడు. మృతుడుకి భార్య సరోజ, కుమార్తె మానస(1) ఉన్నారు. సోమ వారం విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు గ్రామానికి వెళ్లి జరిగిన సంఘటనపై వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
యూరియా కోసం రైతుల పాట్లు
హొళగుంద: మండలానికి కేవలం 560 బస్తాల యూరియా రావడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండలంలో సుళువాయి, సమ్మతగేరి, ముగుమానుగుంది గ్రామాలకు సంబంధించి దాదాపు 5 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఈ గ్రామాలకు వేలాది బస్తాలు యూరియా అవసరముంటే సోమవారం రెండు లోడ్లు మాత్రమే వచ్చాయి. ఎవరికి పంచాలో తెలియక వీఏఏలు(విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు) తలలు పట్టుకున్నారు. కొన్ని గంటల్లోనే యూరియా పంపిణీ అయి పోయింది. మండలంలో అన్నీ గ్రామాల రైతులకు యూరియాను అందించడానికి 378 టన్నుల కోసం ఇండెంట్ పెట్టామని వ్యవసాయాధికారి ఆనంద్ లోకాదల్ చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఆ మేర యూరియాను పంపించకపోవడంతో సమస్య వచ్చింది. ప్రభుత్వం స్పందించి యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
వైఎస్సార్సీపీ పాలనలో ఐదేళ్లూ పెరగని ధరలు
ఎరువుల భారం పెరిగిపోతోంది మాకు 3.50 ఎకరాల భూమి ఉంది. కంది, సజ్జ పంటలు సాగు చేశాం. కందిలో ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువులు వేయాలి. ఇందుకోసం 14–34–14 ఎరువులు అవసరం. 50 కిలోల బస్తా రూ.1,800 ప్రకారం కొన్నాం. గతంలో రూ.1,600 ఉన్న ఈ ధరను అమాంతం పెంచేశారు. ఎరువులపై పెడుతున్న ఖర్చు వల్లే పంటల సాగులో పెట్టుబడి వ్యయం అధికమైంది. ధరల పెరుగుదల వల్ల కనీసం రూ.5వేల వరకు అదనపు భారం పడుతోంది. – షేక్ ఖాశీం, ఆర్.కొట్టాల గ్రామం, తుగ్గలి మండలం అడ్డగోలుగా ధరలు పెంచేస్తున్న కంపెనీలు ● నోరు మెదపని కూటమి ప్రభుత్వం ● ఇప్పటికే మూడుసార్లు పెరిగిన ధరలు ● ఒక్కో రైతుపై రూ.4వేల నుంచి రూ.6వేల భారం ● పెట్టుబడిలో రసాయన ఎరువుల ఖర్చే అధికం ● గగ్గోలు పెడుతున్న రైతులుకర్నూలు(అగ్రికల్చర్): మోతాదుకు మించి రసాయన ఎరువులను వినియోగంతో వ్యవసాయంలో పెట్టుబడి వ్యయం పెరిగిపోతోంది. ఎరువుల వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సి ఉండగా కాగితాలకే పరిమితం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఎరువుల ధరలు అడ్డుగోలుగా పెరిగిపోవడం పట్ల రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో ఎరువుల ధరలు పెంచే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. అయితే ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా ధరలు పెంచుకునే వెసులుబాటును కేంద్రం ఫర్టిలైజర్ కంపెనీలకు ఇవ్వడంతో ధరలు ఏడాదిలో రెండు, మూడు సార్లు పెంచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ, జనసేన మద్దతు ఇస్తున్నాయి. రాష్ట్రంలోనూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. అయినప్పటికీ ధరల పెరుగుదలను నిలువరించే ప్రయత్నం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఏటా దాదాపు 5 లక్షల టన్నుల రసాయన ఎరువులు వినియోగిస్తున్నారు. ఒక టన్ను అంటే 50 కిలోల బస్తాలు 20 ఉంటాయి. బస్తాపై కనిష్టంగా రూ.50 నుంచి రూ.330 వరకు ధర పెరిగింది. అంటే టన్నుపై కనిష్టంగా రూ.1000 నుంచి గరిష్టంగా రూ.6వేల వరకు ధర పెరగడం ఆందోళన కలిగిస్తోంది. త్వరలోనే డీఏపీ ధర కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం ఈ సారి ముందస్తు వర్షాలతో ఖరీఫ్ సీజన్ కూడా ముందుగానే మొదలైంది. ఈ కారణంగా జిల్లాలో ఎరువుల వినియోగం గణనీయంగా పెరిగింది. ఖరీఫ్లో సాగు చేసిన పత్తి, మొక్కజొన్న, ఉల్లి, టమాట, కంది తదితర పంటలకు యూరియాతో పాటు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. జిల్లాలో ఈ సారి పత్తి సాగు భారీగా పెరుగుతోంది. ఇప్పటికే 1,63,792 హెక్టార్లలో సాగయింది. హంద్రీనీవా కాల్వకు నీళ్లు పారుతుండటం వల్ల కూరగాయల సాగు కూడా పెరుగుతోంది. పలు మండలాల్లో ప్రతి 10 మంది రైతుల్లో 6గురు ఒక్కొక్కరు 20 నుంచి 30 బస్తాల వరకు ఎరువులు స్టాక్ పెట్టుకున్నారు. అంటే ఎరువులకు డిమాండ్ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఎరువుల ధరలు భారీగా పెరగడం రైతులకు శాపంగా మారింది. ధరల పెరుగుదల వల్ల ఒక్కో రైతుపై రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు భారం పడుతోంది. ప్రధానంగా 14–35–14, 20–20–0–13, 16–20–0–13, 10–26–26 ఎరువులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. పెరిగిన రసాయన ఎరువుల ధరలు ఇలా.. ఎరువు పేరు పాత ధర కొత్త ధర (రూ.లలో) పోటాష్ 1535 1800 20–20–0–13 1300 1425 (ప్యాక్ట్) 20–20–0–13 1300 1350 (గ్రోమర్) 20–20–0–13 1300 1400 (పీపీఎల్) 10–26–26 1470 1800 12–32–16 1470 1720 (ఇప్కో) 16–16–16 1450 1600 14–35–14 1700 1800 (గ్రోమర్) సింగల్ 580 640 సూపర్ పాస్పేటు 16–20–0–13 1250 13002014–15 నుంచి 2018–19 వరకు టీడీపీ అధికారంలో ఉంది. అప్పట్లో కూడా టీడీపీ బీజేపీ కొమ్ము కాసింది. ఆ సమయంలో ఏకంగా నాలుగైదు సార్లు రసాయన ఎరువుల ధరలు పెరిగాయి. 2019–20 నుంచి 2023–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉంది. ఆ సమయంలో రసాయన ఎరువుల ధరలు ఒక్కసారి కూడా పెరిగిన దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 14 నెలల్లోనే రైతుల నడ్డి విరిగే విధంగా ఽమూడు దఫాలుగా ధరలు పెంచడం గమనార్హం. ఎరువుల ధరలు పెంచడంలో టీడీపీ, జనసేనలు కేంద్రానికి పూర్తి మద్దతు ఇచ్చాయనే ప్రచారం జరుగుతోంది. -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే యూరియా కొరత
● కలెక్టర్ పి.రంజిత్బాషాకు వినతిపత్రం ఇచ్చిన వైఎస్ఆర్సీపీ నేతలుకర్నూలు(సెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జిల్లాలో యూరియా కొరత ఏర్పడిందని వైఎస్సార్సీపీ ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షి, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆరోపించారు. జిల్లాలోని రైతులందరికీ యూరియాను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషాను కలసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బి.విరూపాక్షి మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వంలో అన్నదాత తీవ్రకష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఏ గ్రామంలో అక్కడే రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు, మందులు, విత్తనాలను అందుబాటులో ఉంచి రైతులకు ఇబ్బంది లేకుండా చేసినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసిందన్నారు. సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, మందులు బ్లాక్ మార్కెట్కు తరలిపోతుండడంతో అన్నదాతలు అధిక రేట్లకు కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. తక్షణమే బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకు డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. అధిక ధరలకు ఎరువులు, ఇతర మ ందులను అమ్మే వ్యాపారులపై లైసెన్స్లు రద్దు చేయాలన్నారు. రూ.5 వేలు ఇచ్చి మోసం పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తానని చెప్పి రూ.5 వేలు ఇచ్చి మోసం చేస్తున్నారని చెప్పారు. కేంద్రం ఇచ్చే సాయంతో సంబంధంలేకుండా రాష్ట్ర ప్రభుత్వమే రూ.20 వేలు ఇవ్వాలన్నారు. రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల భరత్కుమార్రెడ్డి మాట్లాడుతూ..ఉచిత పంటల బీమా ఇవ్వడం లేదని, పాలకులకు రైతుల ఉసురు తగులుతుందన్నారు. రైతు కన్నీరు కారిస్తే రాష్ట్రానికి మంచిది కాదన్నారు. రాష్ట్ర కార్యదర్శి సురేందర్రెడ్డి మాట్లాడుతూ..అన్నదాత సుఖీభవలో 7 లక్షల మంది రైతులకు పరిహారం ఎగ్గొట్టడం తగదన్నారు. నాయకులు రాఘవేంద్రనాయుడు, షరీఫ్, మోహన్, రామాంజనేయులు, నరసింహారెడ్డి, సర్వేశ్వరరెడ్డి, నాగేంద్ర పాల్గొన్నారు. -
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
శ్రీశైలంటెంపుల్: దేవస్థానం పరిధిలో హోటల్ నిర్వాహకులు ఆహార పదార్థాలను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు హెచ్చరించారు. సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘భక్తుల జేబుకు చిల్లు’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు స్పందించారు. క్షేత్ర పరిధిలోని పలు హోటల్స్లో ఆహర పదార్థాలు అధిక ధరలకు విక్రయించకూడదని, ధరల పట్టికను హోటల్ ముందు ప్రదర్శించాలని ఆదేశించారు. దేవస్థాన మైక్తో హోటల్ నిర్వాహకులకు తెలిసే విధంగా సూచనలు జారీ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. -
కాలం తీరిన పదార్థాలతో విద్యార్థులకు భోజనం
కర్నూలు(హాస్పిటల్): కాలం తీరిన సరుకులతో పాఠశాలలో చదివే విద్యార్థులకు భోజనం వండి వడ్డిస్తున్నారు. తనిఖీల్లో ఈ విషయం తేలడంతో ఆహార నియంత్రణ విభాగం అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కూర్మానాయకులు ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ టి.రాజగోపాల్ నోటీసులు జారీ చేశారు. వెల్దుర్తిలోని ఎంజెపీఏపీడబ్ల్యుఆర్ స్కూల్లో గత జూన్లో ఆహార నియంత్రణ విభాగం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజగోపాల్ తనిఖీ చేశారు. ఆ సమయంలో అక్కడ లభించిన 56 ధనియాల పొడి ప్యాకెట్లు, ఆరు జబర్దస్త్ టీ పొడి ప్యాకెట్లు కాలం తీరినట్లు గుర్తించారు. వాటిని వండి పిల్లలకు వడ్డించారని తెలుసుకుని జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసును ఫైల్ చేశారు. జేసీ ఆదేశాల మేరకు పాఠశాల ప్రిన్సిపల్ షబానాబేగంకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన అధికారులు -
8 నుంచి శ్రీ రాఘవేంద్రుల ఆరాధనోత్సవాలు
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ రాఘవేంద్ర స్వామి 354వ ఆరాధన ఉత్సవాలకు సకల ఏర్పాట్లు పూర్తిచేసినట్లు శ్రీ మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు తెలిపారు. ఈనెల 8 నుంచి 13వ తేది వరకు రాఘవేంద్ర స్వామి సప్తరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈనేపథ్యంలో సోమవారం శ్రీ మఠం గురునివాస్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పీఠాధిపతి మాట్లాడుతూ ఆరు రోజుల పాటు జరిగే వేడుకల్లో భాగంగా 10వ తేదీన పూర్వరాధన, సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం, కాంచీపురం వరదరాజులు, శ్రీరంగపట్నం రంగనాథ స్వామి ఆలయాల నుంచి పట్టువస్త్రాల సమర్పణ ఉంటుందన్నారు. 11వ తేదిన మద్యారాధనలో భాగంగా మూలబృందావనానికి మమాపంచామృతాభిషేకం, పాదుకా పట్టాభిషేకం, స్వర్ణరథోత్సవం నిర్వహిస్తామన్నారు. 12వ తేదిన ఉత్తారారాధనలో భాగంగా మూలబృందావనానికి వజ్రరత్నకవచధారణ, వసంతోత్సవం, మహారథోత్సవం కనులపండువగా చేపడతామన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక దర్శన క్యూలైన్లు ఏర్పాటు చేశామని.. వయోవృద్ధులు, దివ్యాంగులు, గర్భిణిలు, వీఐపీల కోసం ప్రత్యేక క్యూలైన్ సదుపాయం కల్పిస్తామన్నారు. -
నాణ్యతలేని ఫోన్లు మా కొద్దు
ఎమ్మిగనూరురూరల్: ‘ ప్రభుత్వం 2జీ ఫోన్లకు ఇచ్చి 5జీ ఉండే పనులను చేయమంటే ఎలా.. నాణ్యత లేని సెల్ఫోన్లు మాకొద్దు’ అంటూ సోమవారం ఐసీడీఎస్ కార్యాలయంలో అంగన్వాడీ వర్కర్లు తమ ఫోన్లను సూపర్వైజర్లకు అందజేశారు. పోషణ్ ట్రాకర్, బాల సంజీవిని యాప్స్ రాక ఇబ్బంది పడుతన్నామని తెలిపారు. గర్భవతుల, బాలింతల, 0–5 సంవత్సరాల పిల్లల సమాచారం, ఫొటోలు, ఓటీపీ రావాలని ఐసీఐసీ అధికారులు ఒత్తిడి చేస్తుండటంతో ఫోన్లను వెనక్కి ఇచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్, సీఐటీయూ ప్రాజెక్ట్ కార్యదర్శి గోవర్ధనమ్మ, సహాయ కార్యదర్శి నాగలక్ష్మి, అధ్యక్షురాలు శైలజ, ఉపాధ్యక్షురాలు నీరజ మాట్లాడారు. అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, రూ. 5 లక్షలు గ్రాట్యుటీ ఇవ్వాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. -
ఆరు పీఏసీఎస్లకు అవార్డులు
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)కు అవార్డులు లభించాయి. ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు (ఆప్కాబ్) 62వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం సోమవారం విజయవాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ పనితీరు కనబరిచిన సంఘాలకు అవార్డులు అందజేశారు. 2023–24 సంవత్సరానికి కడిమెట్ల, కొండాపురం, పాములపాడు పీఏసీఎస్లు, 2024–25 సంవత్సరానికి సంబంధించి పోలూరు, మద్దికెర, సి.బెళగల్ పీఏసీఎస్లకు అవార్డులు లభించాయి. వ్యవసాయ అనుబంధ శాఖల మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా ఆయా సహకార సంఘాల పర్సన్ ఇన్చార్జీలు అవార్డులను అందుకున్నారు. ఓపీఐల పదవీ కాలం పొడిగింపు కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు జిల్లా గవర్నమెంట్ ప్రెస్, కర్నూలు డాక్టర్స్ కో–ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీలకు ప్రస్తుతం ఉన్న అఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్ (ఓపీఐ)ల పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లా గవర్నమెంట్ ప్రెస్ సీహెచ్బీఎస్ పర్సన్ ఇన్చార్జీ పదవీ కాలం మార్చి 5వ తేదీతో ముగిసింది. పదవీ కాలాన్ని ఆ రోజు నుంచి సెప్టెంబరు 4 వరకు పొడిగించింది. కర్నూలు డాక్టర్స్ సీహెచ్బీఎస్ అఫీషియల్ పర్సన్ ఇన్చార్జీ పదవీ కాలం ఏప్రిల్ 25వ తేదీతో ముగిసింది. ఆ రోజు నుంచి అక్టోబరు 24 వరకు పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం వేరువేరు జీవోలు జారీ చేసింది. 11న ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా కర్నూలు కల్చరల్: ఐటీఐలో ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీ యువకులకు ఈనెల 11న బి.తాండ్రపాడు ప్రభుత్వ ఐటీఐ(బాలికలు) కళాశాలలో అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్, కళాశాల ప్రిన్సిపాల్ ఎల్.నాగరాజు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పారిశ్రామికవేత్తలు హాజరై అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారన్నారు. నిరుద్యోగులు ఆన్లైన్ పోర్టల్ http://apprenticeshipindia.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకొని తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని తెలిపారు. ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులు కర్నూలు(సెంట్రల్): కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ఇద్దరు ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గుర్తింపు కార్డులతో ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు, స్కాలర్షిప్లు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఇతర ప్రయోజనాలు అందుకోవచ్చని తెలిపారు. జేసీ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, విభిన్నప్రతిభావంతుల శాఖ అధికారి రాయిస్ ఫాతిమా పాల్గొన్నారు. దత్తత ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి కర్నూలు(సెంట్రల్): బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా ఎంపీడీఓలను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లతో సమీక్షించారు. డివిజన్ల వారీగా సాధించిన పురోగతిపై ఆదోని సబ్ కలెక్టర్.. పత్తికొండ, కర్నూలు ఆర్డీఓలతో సమీక్షించారు. బంగారు కుటుంబాలకు ఏఏ అవసరాలు ఉన్నాయన్న నీడ్ అసెస్మెంట్ సర్వేపై కూడా కలెక్టర్ సమీక్షించగా ఎమ్మిగనూరు, ఓర్వకల్, హలహర్వి మండలాలు తప్ప మిగిలిన మండలాలన్నీ వెనకబడ్డాయని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదోనిలో ఒక్క శాతం, కోసిగి, మంత్రాలయం, సీబెళగల్, దేవనకొండ మండలాల్లో అసలు పురోగతే సాధించలేదని, సంబంధిత మండలాల అధికారులకు షోకజ్ నోటీసులు ఇవ్వాలని జెడ్పీ సీఈఓను ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్లో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, కర్నూలు, పత్తికొండ ఆర్డీఓలు సందీప్కుమార్, భరత్నాయక్, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, సీపీఓ హిమప్రభాకరరాజు పాల్గొన్నారు. -
జలుబు చేస్తే.. జ్వరం వస్తే.. విపరీతమైన నొప్పులు బాధిస్తుంటే... స్థానికంగా డాక్టర్లు ఉండరు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తే వైద్య పరీక్షలు చేసే వారు కనిపించరు.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని చాలా మంది ఆర్ఎంపీల వద్దకు వెళ్తున్నారు. అక్కడ ప్రథమ చికిత్స చ
● ఇష్టానుసారంగా ఆర్ఎంపీల వైద్యం ● ఇటీవల నందికొట్కూరులో మహిళకు అబార్షన్ ● గత నెలలో కల్లూరులో ఓ మహిళకు వికటించిన వైద్యం ● తరచూ జిల్లాలో ఎక్కడో చోట ఇలాంటి ఉదంతాలు ● పట్టించుకోని వైద్య ఆరోగ్య శాఖ కర్నూలు(హాస్పిటల్): ఆర్ఎంపీలు చేస్తున్న వైద్యానికి అమాయకులైన పేదల ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. వెళ్లిన వెంటనే పనైపోతుందని, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతో వారు ఆర్ఎంపీల వద్ద చికిత్స చేయించుకుంటున్నారు. అర్ధరాత్రి అయినా వీరు అందుబాటులో ఉండటం, ఏ రోగమైనా రెండు ఇంజెక్షన్లు వేస్తే తగ్గిపోతుందని ప్రజల్లో నమ్మకం బలంగా ఏర్పడటంతో ప్రజలు ఆర్ఎంపీలను నమ్ముకుంటున్నారు. అధిక శాతం అప్పటికప్పుడు వ్యాధి నయం అవుతున్నా...కొందరికి భవిష్యత్తులో, మరికొందరికి కొన్ని రోజుల తర్వాత రియాక్షన్ వస్తోంది. ఇలాంటి వారు చివరి దశలో నిపుణులైన వైద్యుల వద్దకు చికిత్స చేయించుకుంటున్నారు. నకిలీ వైద్యుల చికిత్సతో సైడ్ఎఫెక్ట్ వచ్చి మెరుగైన వైద్యం కోసం వచ్చే వారి సంఖ్య కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోజురోజుకూ పెరుగుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఐదు వేల మందికి పైగా ఆర్ఎంపీలు రోగులకు చికిత్స అందిస్తున్నారు. వీరి నిర్వహించే క్లినిక్లకు ఎలాంటి అనుమతులు ఉండవు. అవసరమైన మందులు, వైద్యపరీక్షల పరికరాలు, స్కానింగ్ మిషన్లు వీరి వద్ద ఉన్నా కూడా ఎవ్వరూ అడగరు. ఇలాంటి అనుమతి లేని ఆసుపత్రుల కారణంగా ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. నాడు మారుమూల పల్లెకూ వైద్యం ప్రజలకు నిపుణులైన వైద్యనిపుణులు అందుబాటులో ఉండేందుకు గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతా ల్లో విలేజ్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేసింది. గ్రామీ ణ ప్రాంత ప్రజలకు ఎలాంటి అనారోగ్యం వచ్చినా ప్రథమ చికిత్స కోసం వీటిని సంప్రదించేలా చర్యలు తీసుకుంది. అక్కడ ప్రాథమిక వైద్యపరీక్షలతో పాటు బీఎస్సీ నర్సింగ్ చదివిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు జిల్లా లో 450లకు పైగా విలేజ్హెల్త్ క్లినిక్లు ఏర్పాటయ్యా యి. వీరి స్థాయికి మించిన వ్యాధి వస్తే ముందుగా పీహెచ్సీల్లోని వైద్యాధికారిని సంప్రదిస్తారు. వారికీ అర్థం గాకపోతే టెలిమెడిసిన్ ద్వారా కర్నూలు జీజీహెచ్, నంద్యాల జీజీహెచ్లలోని టెలిమెడిసిన్ వైద్యులకు వీడియో కాల్ ద్వారా కలిసి రోగికి ఉన్నచోటే అవసరమైన వైద్యాన్ని అందించేలా ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా రోగి వద్దకే వైద్యులు వచ్చి చికిత్స అందించేవారు. ఆరోగ్య రక్ష కార్యక్రమం ద్వారా ఊళ్లోనే వైద్యశిబిరాలు ఏర్పా టు చేసి చికిత్స అందించేవారు. అలాగే పట్టణాల్లో మురికివాడల్లో సైతం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మరింతగా పెంచి అక్కడ ఎంబీబీఎస్ చదివి న వైద్యులను నియమించారు. బేసిక్ వ్యాధులన్నింటికీ అక్కడ వైద్యపరీక్షలు నిర్వహించేలా ఏర్పాటు చేశారు. అవసరమైన ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టులు సైతం ఇక్కడ ఉన్నారు. మురికివాడల్లోని పేదలు ఆర్ఎంపీల వద్దకు వెళ్లకుండా ఇక్కడే వారికి ప్రాథమిక స్థాయి వైద్యం అందుబాటులోకి తెచ్చారు. అల్లోపతి వైద్యుల ఖర్చుకు భయపడి! వైద్యం ప్రస్తుత పరిస్థితుల్లో భారంగా మారింది. పట్టణాల్లోని వైద్యుల వద్దకు జ్వరం వచ్చిందని వెళ్లినా రూ.3వేల నుంచి రూ.5వేల దాకా ఖర్చు వస్తోంది. పెద్దరోగమైతే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అందుకే ఏ చిన్నరోగమొచ్చినా మందుగా ఆర్ఎంపీలనే ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్ఎంపీలు తెలిసీ తెలియని వైద్యంతో వారికి చికిత్స చేసి ప్రాణాల మీదుకు తీసుకొస్తున్నారు. కొందరు సైలెన్లు(ఫ్లూయిడ్స్) ఎక్కించడంతో పాటు ప్రసవాలు, అబార్షన్లు, స్కానింగ్, మైనర్ సర్జరీలు నిర్వహిస్తున్నారు. కర్నూలు, కోడుమూరు, గూడూరు, ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు వంటి ప్రాంతాల్లో ఆసుపత్రులు కూడా తెరిచి ఆర్ఎంపీలు వైద్యం చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మృతులు వీరే.. విచ్చలవిడిగా ఆర్ఎంపీల వైద్యం గ్రామాల్లో సాయంత్రం దాటితే విలేజ్ హెల్త్ క్లినిక్లో కమ్యూనిటీ ఆఫీసర్లు, యుపీహెచ్సీల్లో వైద్యాధికారులు అందుబాటులో ఉండటం లేదు. ప్రజలు ఉదయం పనులకు వెళ్లిన సాయంత్రం మాత్రమే ఇళ్లకు చేరుకుంటారు. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతో స్థానికంగా ఉండే ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. వైద్యం చేయడానికి వీరికి ఎలాంటి అర్హత లేకపోయినా రోగులకు చికిత్స చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కర్నూలులోని పలు ప్రాంతాల్లో కొందరు ఆర్ఎంపీలు ఇష్టానుసారం వైద్యం చేస్తున్నారు. గూడూరు, కోడు మూరు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూ రు, కౌతాళం, హాలహర్వి, ఆలూరు మండలాల్లో 5వేల మందికి పైగా ఆర్ఎంపీలు ఉన్నారు. గడివేముల మండలం గని గ్రామానికి చెందిన శివమ్మ కుమార్తె శ్రీవాణి గత నెల 28న నందికొట్కూరు పట్టణంలోని గీతారాణి అనే మహిళకు ఆర్ఎంపి వద్ద అబార్షన్ చేయించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో 30వ తేదీన ఆమె మృతి చెందారు. ఆమెకు కర్నూలులోని కొత్తబస్టాండ్ వద్ద ఉన్న ఓ హాస్పిటల్లో లింగనిర్ధారణ చేసినట్లు సమాచారం. శనివారం వరకు ఆ స్కానింగ్ సెంటర్ను అధికారులు తనిఖీ చేయని పరిస్థితి నెలకొంది. కర్నూలు నగరంలోని కల్లూరు ప్రాంతానికి చెందిన ఓ మహిళకు జ్వరం రావడంతో స్థానికంగా ఉండే ఆర్ఎంపీ ఇంజెక్షన్లు ఇచ్చారు. అవి వికటించి ఆమె మృతి చెందారు. కౌతాళానికి చెందిన రాణమ్మకు కీళ్లనొప్పి ఉండటంతో స్థానికంగా ఉన్న ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. ఆమెకు వరుసగా మూడు రోజుల పాటు ఇంజెక్షన్లు ఇవ్వడంతో వికటించి మృతిచెందారు. పత్తికొండ పట్టణానికి చెందిన వై.రంగస్వామి(35) ఛాతీలో మంటగా ఉండటంతో గత నెల 30న స్థానికంగా ఉన్న ఒక క్లినిక్కు వెళ్లగా అసిస్టెంట్ వైద్యం చేశాడు. ఇంటికి వెళ్లిన వెంటనే రంగస్వామి ప్రాణాలు కోల్పోయాడు. గత ఏడాది గోనెగండ్ల మండలం గంజిహల్లి గ్రామంలో రాజేష్(12) జ్వరం రావడంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీని సంప్రదించారు. అతను బాలునికి ఇంజెక్షన్ వేయడంతో అక్కడ గడ్డ ఏర్పడింది. దాని నుంచి చీము, రక్తం కారడంతో ఆసుపత్రిలో చేరగా కోలుకోలేక మృతి చెందాడు. చర్యలు తీసుకుంటాం ఆర్ఎంపీలు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. కనీసం ఇంజెక్షన్ కూడా వేయకూడదు. సర్జరీలు, ప్రసవాలు, అబార్షన్లు అసలే చేయకూడదు. ఎంబీబీఎస్ చదివిన వారు మాత్రమే అల్లోపతి వైద్యం చేయాలి. ఇతరులు వైద్యం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. ఇకపై జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక దాడులు నిర్వహిస్తాం. స్థానికంగా విచారణ చేసి వారిపై చర్యలు తీసుకుంటాం. –డాక్టర్ పి.శాంతికళ, డీఎంహెచ్ఓ, కర్నూలు శ్రీవాణి (ఫైల్) -
ఉరుకుందలో దోపిడీల జాతర!
● రెండు టెంకాయలు రూ.100 చొప్పున విక్రయం ● గుండుకు రూ.100 వసూళ్లు ● రాత్రికి రాత్రే గమనిక ఫ్లెక్సీలు మాయం ● కాంట్రాక్టర్లకు ‘రాజకీయ’ అండ మంత్రాలయం: కౌతాళం మండలం ఉరుకుంద గ్రామంలో వెలసిన ఈరన్న స్వామి క్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలు వైభవోపేతంగా జరగుతుండగా.. కాంట్రాక్టర్ల మాత్రం ‘రాజకీయ’ అండతో దోపిడీ జాతరకు తెరతీశారు. ప్రతి శ్రావణ మాసంలో ఇక్కడ భక్తులు 20 లక్షల నారీకేళాలు కొడుతున్నట్లు అంచనా. అందులో కాంట్రాక్టర్ ద్వారా రూ. 15 లక్షలకు పైగా విక్రయిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వాస్తవంగా ఇక్కడ టెండర్ దారుడు ఒక్క టెంకాయి రూ.20 మాత్రమే విక్రయించాలని నిబంధన. అయితే కాంట్రాక్టర్ ఒక్కో టెంకాయను రూ.40కు దుకాణాలకు వేస్తున్నాడు. దుకాణ దారులు ఇక్కడ రెండు ఊది బత్తీలు, విభూతి, రెండు పూలు, రెండు టెంకాయలు కలిపి రూ.100 చొప్పున భక్తులకు విక్రయిస్తున్నారు. విక్రయదారుల దోపిడీని పక్కన పెడితే కాంట్రాక్టర్ దోపిడీ చాలా ఎక్కువ. జోడు టెంకాయలపై ఆయన రూ.40 ఆదాయం పొందుతున్నాడు. టీడీపీ నేత అండదండలతో స్థానికుడు టెంకాయల విక్రయ వేలం కై వసం చేసుకున్నాడు. నిరుడు కూడా ఆయనే టెండర్ సొంతం చేసుకున్నాడు. క్వింటా కొబ్బరి రూ.13 వేలు ధర పలుకుతోంది. దాదాపు 20 లక్షల చిప్పలకు గానూ 180 టన్నులు బరువు వస్తోంది. ఈ లెక్కన టెంకాయ చిప్పల నుంచి రూ.2.34 కోట్లు వస్తోంది. అయితే ఇక్కడ ముత్తన్న అనే టెండర్ దారుడు మాత్రం కేవలం రూ.60.13 లక్షలకు టెండర్ దక్కించుకున్నారు. కల్యాణ కట్ట దోపిడీ రూ.9 కోట్లు టెంకాయల దోపిడీ ఒక ఎత్తు ఉంటే. ఇక్కడ కల్యాణకట్ట దోపిడీ మరీను. ఇక్కడ భక్తుడు తలనీలాలు ఇవ్వడానికి తలకు రూ.40 టిక్కట్ చెల్లించాల్సి ఉంది. అందులో రూ.35 కాంట్రాక్టర్కు కేటాయిస్తారు. తలనీలాల్లో వచ్చిన వెంట్రుకలు ఆయనే విక్రయిస్తాడు. ఇక్కడ దాదాపు 10 లక్షల మంది భక్తులు తలనీలాలు ఇస్తున్నట్లు అంచనా. టిక్కెట్ ధర చెల్లించడమే కాకుండా కల్యాణ కట్ట క్షురకులు గుండుకు రూ.100 వసూలు చేస్తున్నారు. దాదాపు రూ.9 కోట్లకు పైగా అక్రమార్జన సాగిపోతోంది. కల్యాణ కట్ట టెండర్ దారుడు కరోనా నష్టం పేరుతో కేవలం 10 శాతం అధికంతో ఇక్కడ రెండేళ్లుగా తన టెండర్ను కొనసాగిస్తూ వస్తున్నాడు. రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు మాయం భక్తుల అవగాహన నిమిత్తం ఆలయ ఈవో విజయరాజు క్షేత్రంలో ప్రత్యేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. ముఖ్యంగా టెంకాయ రూ.20కు మాత్రమే కొనుగోలు చేయాలని, లేని పక్షంలో తమకు ఫిర్యాదు చేయాలని వీధుల్లో, టెంకాయ దుకాణాలతో ఫ్లెక్సీలు పాతించారు. అయితే రాత్రి రాత్రే ఫ్లెక్సీలు మాయమయ్యాయి. క్షేత్రంలోని ఫ్లెక్సీలన్నీ తొలగించి దోపిడీకి తెర తీశారు. భక్తులకు అసలు గుట్టు తెలియకుండా మాయాజాలం చేశారు. ఆలయ ఆవరణలో దుకాణాలు రూ.కోట్ల వెనుక వాటాల మూటలు ఉరుకుంద ఈరన్న స్వామి హుండీ ఆదాయాన్ని మించి ఇక్కడ రూ.కోట్లతో దోపిడీ సాగిపోతోంది. దోపిడీ మూటలో వాటాల మాట దాగి ఉండటం బహిరంగ రహస్యం. రాజకీయ నాయకుల వత్తాసుతోనే కాంట్రాక్టర్ల దోపిడీ పర్వం నడుస్తోంది. టీడీపీ నియోజకవర్గ ముఖ్య నేతల నుంచి గ్రామ స్థాయి నేతల వరకు వాటాల మూటలు ముడుతున్నట్లు తెలుస్తోంది. తిలా పాపం తలా పిడికెడు పంపకాలు బాగానే సాగిపోతున్నాయి. ఈ దోపిడీని అడ్డుకునేందుకు ఇక్కడి అధికారులు ప్రయత్నం చేయకుండా సంకెళ్లు వేసేశారు. నోరు మెదిపితే ఇక్కడి నుంచి సాగినంపుతామన్న సంకేతాలు సైతం ఉన్నట్లు సమాచారం. కాగా.. భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారని దేవాదాయ ముఖ్య కార్యదర్శికి సైతం అధికారికంగా ఫిర్యాదులు వెళ్లాయి. ఫెస్టివల్ ఆఫీసర్గా సబ్ కలెక్టర్ను నియమించగా ఆయన దృష్టికి కూడా దోపిడీ వ్యవహారం వెళ్లింది. అయితే రాజకీయం అడ్డు రావడంతోనే అధికారులు మిన్నకుండి పోయారనే చర్చ ఉంది. -
జెడ్పీలో నలుగురికి కారుణ్య నియామకాలు
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ పరిధిలో నలుగురికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలను కల్పించి వివిధ కార్యాలయాలకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. జెడ్పీలో జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు కారుణ్య నియామకాల కింద మృతిచెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యో గం కల్పించామన్నారు. జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి మాట్లాడుతూ.. జెడ్పీ యాజమాన్య పరిధిలోని ఆయా కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న కార్యాలయ సహాయకుల పోస్టుల్లో వీరిని నియమించామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగాలు పొందిన వారిలో బీ నీరజాబాయి (జెడ్పీహెచ్ఎస్, నొస్సం, సంజామల మండలం), పీ శేఖర్ (ఎంపీపీ, ఓర్వకల్లు ), ఎన్ రమాదేవి (పీఆర్ పీఐయు డివిజన్, నంద్యాల), ఎస్ విజయకుమారి (జెడ్పీహెచ్ఎస్, గార్గేయపురం) ఉన్నారు. జీడీపీ నుంచి నీరు విడుదల గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ) నుంచి కుడి, ఎడమ కాలువలకు నీరు విడుదల చేసినట్లు ఏఈ మహమ్మద్ ఆలీ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టుకు 110 క్యూసెక్కుల నీరు వస్తోందని, కుడి కాలువకు 100 , కోడుమూరు పట్టణానికి తాగునీటి కోసమని ఎడమ కాలువకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. జీడీపీ నిల్వ సామర్థ్యం 4.5 టీఎంసీలు కాగా ఆదివారం సాయంత్రానికి ఒక టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు చెప్పారు. బోధనలో మెలకువలు అవసరం కర్నూలు(సెంట్రల్): విద్యా బోధనలో ఉపాధ్యాయులు నిరంతరం మెలకువలు నేర్చుకోవాలని సమగ్ర శిక్ష అభియాన్ అదనపు రాష్ట్ర పథక సంచాలకులు డాక్టర్ ప్రసన్నకుమార్ సూచించారు. ఆదివారం రాఘవేంద్ర బీఈడీ కాలేజీలో తొమ్మిది జిల్లాల కేజీబీవీ పీజీటీలకు ఇన్ సర్వీసు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతను ముఖ్యఅ అతిథిగా హాజరై మాట్లాడుతూ.. కేజీబీవీల్లో పేద విద్యార్థినులు ఉంటుండడంతో వారి వ్యక్తిగత పరిస్థితులను తెలుసుకోని బోధన చేయాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులకు ఆరుగురు రిసోర్స్పర్సన్లు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డీఈఓ శామ్యూల్పాల్, జీసీడీఓలు సువర్చల, స్నేహలత పాల్గొన్నారు. సీమ ప్రాజెక్టులకు పూర్తిస్థాయి నీటిని విడుదల చేయాలి నంద్యాల(అర్బన్): రాయలసీమ ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. తెలుగుగంగ, గాలేరునగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు నేటికి పూర్తి కాకపోవడం, పంట కాల్వలు లేకపోవడంతో ప్రాజెక్టుల కింద ఉన్న లక్షలాది ఎకరాలకు నేటికి సాగునీరు అందలేదన్నారు. వాస్తవ పరిస్థితి ప్రపంచానికి తెలియజేసేందుకు ఆలోచన పరుల వేదిక నాయకులు విశ్రాంత ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావు నేతృత్వంలో రైతు సేవా సంస్థ అధ్యక్షుడు భవానీప్రసాద్ సాగునీటి రంగ విశ్లేషకులు లక్ష్మీనారాయణ, సామాజిక వేత్త రామారావు రాకపై ఆదివారం స్థానిక కార్యాలయంలో ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టులకు సాధారణం కంటే నెల రోజుల ముందే వరదలు వచ్చినా సీమ ప్రాజెక్టులకు ప్రభుత్వం నీటిని విడుదల చేయలేదన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నీటిని దిగువకు విడుదల చేయడం అన్యాయమన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా గాలేరునగరి, ఎస్సార్బీసీ, తెలుగుగంగ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు వైఎన్రెడ్డి, రామచంద్రారెడ్డి, వెంకటేశ్వరనాయుడు, సుధాకర్కుమార్, అసదుల్లా, భాస్కరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
భక్తుల జేబుకు చిల్లు
శ్రీశైలంటెంపుల్: భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనార్థం శ్రీశైలం వచ్చే భక్తులకు జేబులకు చిల్లులు పడుతున్నాయి. క్షేత్రంలో ఆహార పదార్థాల ధరలు అకాశాన్ని అంటుతున్నాయి. దేవస్థాన అధికారులు, సివిల్ సప్లయ్ అధికారులు ధరల నియంత్రణలో విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో మల్లన్న దర్శనార్థం వచ్చే భక్తులకు అధిక ధరల పోటు తప్పడం లేదు. శ్రీగిరి క్షేత్రంలో చిన్న, పెద్దహోటళ్లు అన్ని కలిపి 50 వరకు ఉంటాయి. క్షేత్రంలో ప్రైవేట్ హోటళ్లలో టిఫిన్, భోజనం చేద్దామంటే భక్తుల జేబుకు చిల్లులు పడే ధరలు దర్శనమిస్తున్నాయి. భక్తుల అవసరాలను అసరాగా చేసుకుని స్థానిక ప్రైవేట్ వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు లేకుండా అధిక ధరలకు విక్రయిస్తున్నా అడిగేవారు లేరు. శివరాత్రి, ఉగాది ఉత్సవాల సమయంలో మాత్రమే సివిల్ సప్లయ్ అధికారులు ధరలను ఫిక్స్ చేసి ధరల పట్టిక ఏర్పాటు చేస్తారు తప్పా..మిగతా రోజుల్లో అంతా వ్యాపారుల చేతుల్లోనే ధరలు ఉంటాయి. హోటల్లో ఆహార పదార్థాలలో నాణ్యమైన పదార్థాలు వినియోగిస్తున్నారా? లేదా? అని తనిఖీలు చేసే అధికారులు కరువయ్యారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు జిల్లా కేంద్రంలో ఉండడం, జిల్లా కేంద్రానికి శ్రీశైలం సుదూర ప్రాంతం కావడంతో ఇక్కడికి వచ్చి ఆహార పదార్థాల శాంపిల్స్ తనిఖీ చేసే అధికారులు కరువయ్యారు. తక్కువ ధరకు వచ్చే వస్తువులతో ఆహార పదార్ధాలు తయారు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆహార పదార్థాల తయారీలో శుచీ, శుభ్రతను సైతం పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై న దేవస్థానం, సివిల్ సప్లయ్ అధికారులు స్పందించి శ్రీశైల మహాక్షేత్రంలో ఆహార పదార్థాలను అధిక ధరలకు విక్రయించకుండా, సామాన్య భక్తులకు సైతం అందుబాటులో ఉండేవిధంగా ధరలను నిర్ణయించి, ధరల పట్టికను హోటల్ నిర్వాహకులు ప్రదర్శించేలా ఏర్పాటు చేసి భక్తుల జేబులకు చిల్లులు పడకుండా తగు చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు కోరుతున్నారు. శ్రీశైల ఆలయం శ్రీగిరిలో అధికరేట్లకు ఆహార పదార్థాలు హోటళ్లు, దుకాణాలపై కొరవడిన అధికారుల పర్యవేక్షణ -
హాస్టళ్లలో సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి
కర్నూలు (అర్బన్): జిల్లాలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల్లో సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా బీసీ సంక్షేమం సాధికారత అధికారిణి కె ప్రసూన ఆదేశించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం జిల్లాలోని బీసీ వసతి గృహాల్లో మెగా పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వసతి గృహ సంక్షేమ అధికారులు హాస్టళ్ళ పరిసరాలు, తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నా, తాగునీరు కలుషితమైనా విద్యార్థులు అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే హెచ్డబ్ల్యూఓలందరూ పరిశుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు. తరచూ హాస్టళ్లను పరిశీలిస్తుంటామని, ఎక్కడైనా అపరిశుభ్ర వాతావరణం నెలకొంటే సంబంధిత వసతి గృహ సంక్షేమ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అదుపు తప్పి కారు బోల్తా
కొలిమిగుండ్ల: గొర్విమానుపల్లె సమీపంలో ఆదివారం రోడ్డు పక్క న కారు అదుపు తప్పి బోల్తా పడింది. పెట్ని కోట వైపు నుంచి తాడిపత్రికి వెళ్తున్న సమయంలో మార్గమధ్యలో గొర్విమానుపల్లె దాటాక లొక్కిగుండం సమీపంలో అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ప్రమాద సమయంలో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి మాత్రమే ఉండటంతో సురక్షితంగా బయటపడ్డారు. కారులో ఇరుక్కుపోయిన ఆ వ్యక్తిని స్థానికులు అద్దాల పగుల గొట్టి బయటకు తీశారు. ఆళ్లగడ్డలో చోరీ ఆళ్లగడ్డ: పట్టణంలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బొరుగుల బట్టి వీధికి చెందిన సంజీవరాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రాత్రి పట్టణంలోని ఓ ప్రార్థనా మందిరానికి వెళ్లారు. రాత్రి 9.30 గంటల సమయంలో ప్రార్థన ముగించుకుని ఇంటికి వచ్చేసరికి దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువాను పగులగొట్టి అందులో ఉన్న రూ.1.50 లక్షల నగదు, రెండు తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. సంజీవరాయుడు కుమార్తెకు ఇటీవల వివాహం నిశ్చయం కాగా.. అందుకు సంబంధించి బంగారు, నగదు సిద్ధం చేసుకున్నాడు. ఇంతలో చోరీ జరగడంతో కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ యుగంధర్ తెలిపారు. ఏపీహెచ్ఎంఏ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక కర్నూలు(సెంట్రల్): ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయు సంఘం ( ఏపీహెచ్ఎంఏ) జిల్లా నూ తన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఏపీహెచ్ఎంఏ భవన్లో ఏర్పాటు చేసిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో 2025–27 కాల వ్యవధికి నూత న కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా వై. నారాయణ, డీసీ హుస్సేన్, ట్రేజరర్గా రమేష్నాయుడులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర పూర్వపు అధ్యక్షుడు జి.ఒంకార్ యాదవ్ పాల్గొన్నారు. స్నేహితుల ఆపన్న హస్తం మంత్రాలయం రూరల్: స్నేహితుల దినోత్స వం స్నేహభావం పరిమళించింది. స్నేహితుడు మృత్యువాత పడగా తోటి మిత్రులు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. మంత్రాలయానికి చెందిన డి.భీమేష్ అనారోగ్యంతో మృత్యువాత పడ్డాడు. విషయం తెలుసుకున్న 2003 కు చెందిన 10 తరగతి బ్యాచ్ స్నేహితులు రూ.60 వేలు స్నేహితుడి కూతురు దీక్షిత పేరుపై ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు.బాండ్ను మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మృతుడి భార్య రాధ భర్త స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు. మద్దికెరలో.. మద్దికెర: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో 2004 –05లో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు తమతో పాటు చదువుకొని కొందరు మిత్రులు మృతి చెందగా వారి కుటుంబ సభ్యులకు రూ.72 వేలు అందజేశారు. మాజీ ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యాయులు రంగస్వామి, శ్రీనివాసులు పాల్గొన్నారు. పొలంలో అక్రమ తవ్వకాలు చిప్పగిరి: రైతులను సంప్రదించకుండా, కనీస సమాచారం ఇ వ్వకుండా గాలి మరల కంపెనీ తమకు ఇష్టం వచ్చినట్లు అక్రమంగా తవ్వకాలు జరుపుతోంది. చిప్పగిరి మండలంలోని నేమకల్లు గ్రామానికి చెందిన తలారి నెట్టికల్లుకు 0.99 ఎకరాల పొలం ఉండగా అందులో పెద్దకాలువ తవ్వి వదిలేశారు. తహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చినా ఫలితం రాలేదని, జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్య తీసుకెళతానని రైతు తెలిపారు. -
నంద్యాల డయాసిస్ బిషప్గా రెవరెండ్ సంతోష్ ప్రసన్నరావు
నంద్యాల(న్యూటౌన్)/కర్నూలు (టౌన్): చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా నంద్యాల అధ్యక్ష ఖండం పీఠాధిపతి(బిషప్)గా రెవరెండ్ సంతోష్ ప్రసన్నరావును నియమించినట్లు నంద్యాల డయాసిస్ సెక్రటరీ స్టాండ్లీ విలియమ్స్ ఆదివారం పేర్కొన్నారు. గత ఏడాది ఏప్రిల్ 11వ తేదీన నంద్యాలలో జరిగిన బిషప్ ఎన్నికల్లో నలుగురు బిషప్ అభ్యర్థులుగా విజయం సాధించారు. వీరిలో రెవరెండ్ సంతోష్ ప్రసన్నరావును చైన్నెలోని మోడరేటర్ కార్యాలయంలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మోడరేటర్ రూబెన్మార్క్ అధ్యక్షతన ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. దాదాపు ఏడాది నుంచి పెండింగ్లో ఉన్న బిషప్ ఎంపిక ప్రక్రియ నేటితో ముగిసింది. దీంతో నంద్యాల డయాసిస్ పరిధిలోని సంఘాల పాస్టరేట్ చైర్మన్లు, హోలీక్రాస్ కెథడ్రల్ పాస్టరేట్–1, 2, 3, 4, 5, 6 గురువులు హర్షం వ్యక్తం చేశారు. నంద్యాల అధ్యక్ష ఖండం పీఠాధిపతులుగా నియమితులు కావడంతో పరిపాలన సౌలభ్యం ముందుకు సాగుతుందన్నారు. హోలీక్రాస్ కెథడ్రల్ చర్చి డీనరీ చైర్మన్ కొత్త మాసి జోసెఫ్, ఇమ్మానియేల్, నందం ఐజక్, విజయ్కుమార్, సంజీవ్కుమార్, పాస్టరేట్–1 సెక్రటరీ ప్రభుదాసుతో పాటు కమిటీ సభ్యులు, పాస్టరేట్–2 బాలయ్య, కిరణ్కుమార్, కమిటీ సభ్యులతో పాటు ఆయా సంఘాల కాపర్లు, కమిటీ పెద్దలు, క్రైస్తవులు నంద్యాల అధ్యక్ష ఖండం బిషప్ ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేశారు. 5న పట్టాబిషేకం గత బిషప్గా ఉన్న పుష్పాలలిత పదవీ విరమణ చెందడంతో నూతన బిషప్గా రెవరెండ్ సంతోష్ ప్రసన్నరావును ఎంపిక చేశారు. ఈయన వైఎస్సార్ జిల్లా ముద్దనూరులో పాస్ట్రేట్లో డినరీ చైర్మన్గా విధులు నిర్వహిస్తున్నారు. కర్నూలులోని చిల్డ్రన్స్ పార్కు సీఎస్ఐ చర్చి ప్రాంగణంలో రెవరెండ్ సంతోష్ ప్రసన్నరావును అభినందించారు. ఈనెల 5వ తేదీ నంద్యాల కేథడ్రల్ చర్చిలో సంతోష్కు బిషప్ పట్టాభిషేకం జరుగుతుందని చర్చి నిర్వాహకులు తెలిపారు. -
మిక్సీలు, స్టవ్లు రిపేర్ చేస్తానంటూ చోరీలు
● దొంగను అరెస్టు చేసిన పోలీసులు ● బంగారు, వెండి నగలు స్వాధీనం ప్యాపిలి: మిక్సీలు, గ్యాస్ స్టవ్లు రిపేరు చేస్తానని సైకిల్పై గ్రామాల్లో తిరుగుతూ ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు అపహరించేవాడు. వాటిని విక్రయించి సొమ్ము చేసుకుని గోవా తదితర ప్రాంతాల్లో జల్సాలు చేసేవాడు. ఈ దొంగను, అతనికి సహకరించిన వ్యక్తిని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. ప్యాపిలి సర్కిల్ కార్యాలయంలో సీఐ వెంకటరామిరెడ్డి, జలదుర్గం ఎస్ఐ నాగార్జున ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా యాడికి పట్టణానికి చెందిన జోగి రాజ అలియాస్ రాజ కుళ్లాయప్ప, గుత్తి మండలం తొండపాడు గ్రామానికి చెందిన మునగాల సుంకన్నను బావిపల్లి క్రాస్ రోడ్డు వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి నుంచి ఐదు తులాల బంగారు నగలు, 10 తులాల వెండి కాళ్ల పట్టీలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపామనానరు. జోగి రాజు.. హుసేనాపురం గ్రామంలో రెండు ఇళ్లలో, మామిళ్లపల్లి గ్రామంలోని ఒక ఇంటిలో గత రెండు, మూడు నెలల క్రితం చోరీకి పాల్పడినట్లు తెలిపారు. అపహరించిన సొమ్ములో కొంత సొమ్మును విక్రయించడానికి మునగాల సుంకన్నకు ఇచ్చినట్లు వెల్లడించారు. జోగి రాజు మిక్సీలు, గ్యాస్ స్టవ్లు రిపేరు చేస్తానని సైకిల్పై తిరుగతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించి దొంగతనాలకు పాల్పడేవాడని తెలిపారు. అపహరించిన నగలను విక్రయించి వచ్చిన సొమ్ముతో గోవా తదితర ప్రాంతాల్లో జల్సాలు చేసేవాడని తెలిపారు. గతంలో జోగి రాజుపై తాడిపత్రి టౌన్ పోలీస్స్టేషన్లో కూడా కేసులు నమోదైనట్లు తెలిపారు. కేసు ఛేదించిన ఎస్ఐ నాగార్జున, హెడ్ కానిస్టేబుల్ నీలకంఠ, పీసీలు మాధవరెడ్డి, వెంకటరాజు, మాదన్న, నరసయ్య, మద్దిలేటి, అశోక్కుమార్, హోంగార్డులు హుసేన్బాష, మహబూబ్ బాషాలను సీఐ అభినందించారు. -
ఇళ్లపై కూలిన విద్యుత్ స్తంభాలు
● తెగిన విద్యుత్ లైన్లు ఆదోని అర్బన్: రాయచోటి నుంచి నెల్లూరుకు ఆదోని మీదుగా వెళ్తున్న కంటైనర్ లారీ ఎల్బీ లైన్ను ఢీకొట్టింది. దీంతో మూడు విద్యుత్ స్తంభాలు ఇళ్లపైన కూలాయి. విద్యుత్ లైన్లు తెగిపడ్డాయి. ఆ సమయంలో కాలనీవాసులు, ఆ రోడ్డున వెళ్లే పాదచారులు, వాహనదారులు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం మరమ్మతులు చేపట్టారు. కాలనీలో ఒకచోట విద్యుత్ స్తంభం పక్కకు ఒరిగి ఇంటిపై పడింది. మరో రెండు స్తంభాలు ఒరిగి విద్యుత్ లైన్లన్నీ కిందకు పడిపోయాయి. ఒక్కసారిగా విద్యుత్ స్తంభాలు ఒరగడంతో పెద్ద శబ్దం రావడంతో కాలనీవాసులు భయబ్రాంతులకు గురయ్యారు. ఎంఎం కాలనీకి విద్యుత్ అధికారులు ఎల్బీ లైన్ ఏర్పాటు చేసేటప్పుడు రోడ్డు ఉందని తెలిసినా కూడా ఎత్తులో పోల్ వేయలేకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని కాలనీవాసులు మండిపడుతున్నారు. ప్రాణనష్టం జరిగితే ఎవరు బాధ్యులని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ ప్రధాన రహదారుల్లో పెద్ద పెద్ద వాహనాలు వెళ్తుంటాయని, అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
స్ఫూర్తి కెరటం
రిజ్వర్ బ్యాంక్లో ఉద్యోగం...ఆరు అంకెల జీతం.. మెట్రో నగరాల్లో జీవితం..ఇంతకుమించి ఇంకేం కావాలనుకుంటారు ఎవరైనా..! కానీ ఇవేవి ఆమెకు సంతృప్తిని ఇవ్వలేదు...ప్రజా సర్వీసుల్లో తన కూతురుని చూడాలన్న తండ్రి ఆశయం ముందు.! అందకే ఆమె ఓ వైపు కుటుంబాన్ని, మరోవైపు ఉద్యోగం నిర్వహిస్తూనే సివిల్ సర్వీసెస్కు సన్నద్ధమయ్యారు. కఠోర శ్రమతో గ్రూప్–1 పరీక్షలో సత్తా చాటి తండ్రి కల నేరవేర్చారు ఎం.ఎన్. భార్గవి. ఎమ్మిగనూరు డీఎస్పీగా తొలి పోస్టింగ్ను అందుకుని, విధుల్లో చేరిన ఆమె ప్రయాణం యువతరానికి స్ఫూర్తిదాయకం. – ఎమ్మిగనూరు రూరల్ ● బ్యాంక్ ఉద్యోగం చేస్తూ సివిల్స్కు ప్రిపేర్ ● తండ్రి కోరికను నెరవేర్చిన కుమార్తె ● ఎమ్మిగనూరు డీఎస్పీగా భార్గవికి మొదటి పోస్టింగ్ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు ఉద్యోగాలను వద్దనుకుని తన కల నెరువేర్చుకున్నారు ఇటీవల ఎమ్మిగనూరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఎం.ఎన్ భార్గవి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం చెందిన జానార్దన్రావు, లలిత దంపతులకు ఎంఎన్. భార్గవి, దివ్య, మురళీకృష్ణ సంతానం. జానార్దన్రావు జనరల్ ఇన్సూరెన్స్లో పనిచేస్తూ రిటైర్డ్ అయ్యారు. తల్లి లలిత గృహిణి. వీరి మొదటి కుమార్తె ఎంఎన్.భార్గవి 10వ తరగతి వరకు తాడెపల్లిగూడెంలో, ఇంటర్ విజయవాడలో చదువుకున్నారు. ఆ తర్వాత వరంగల్లో ఈసీబీటీసీ (ఎన్ఐటీ)లో పూర్తి చేశారు. తన చెల్లెలు డాక్టర్ దివ్య హైదరాబాద్లో హోమియో ఎండీగా పనిచేస్తుండగా, తమ్ముడు డాక్టర్ మురళీకృష్ణ గ్యాస్టో ఎండీగా హైదరాబాద్లో పనిచేస్తున్నారు. చెల్లి, తమ్ముడు డాక్టర్లు అయినా తను ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా తన లక్ష్యం గ్రూప్స్పైనే ఉండేది. వరంగల్లో ఈసీబీటీసీ చదువతుండగానే క్యాంపస్ సెలెక్షన్లో మోటో సెల్ ఫోన్ కంపెనీలో ఉద్యోగం పొంది హైదరాబాద్లో ఒక సంవత్సరం చేశారు. ఆ ఉద్యోగం చేస్తూనే సివిల్స్కు సన్నద్ధమయ్యారు. గ్రూప్స్కు ప్రిపేర్ అవుతూ బ్యాంక్ ఉద్యోగాలకు పరీక్ష రాయగా ఓరియంటెల్ బ్యాంక్లో ఉద్యోగం సాధించి 8 నెలలు పని చేశారు. ఆ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ముంబాయిలోని రిజర్వ్ బ్యాంక్లో నాలుగున్నరేళ్లు పనిచేసి హైదరాబాద్ ఆర్బీఐకు బదిలీపై వచ్చారు. అక్కడ విధులు నిర్వహిస్తూనే సివిల్స్ మెయిన్స్కు ఎంపికై ఐఆర్టీసీ (రైల్వేశాఖ)లో ఉద్యోగం వచ్చినా అందులో చేరలేదు. పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకోవాలి ఎవరైనా అనుకున్న లక్ష్యానికి చేరుకోవాలంటే పట్టుదలతో చదవాలి. నేను గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుకడుగు వేయలేదు. ఇప్పుడు ఉన్న సౌకర్యాలు అప్పుడు మాకు లేవు.. ఉన్న దాంట్లో కష్టపడి చదివాను. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నా లక్ష్యాన్ని చేరుకున్నా. డీఎస్పీగా బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తా. – ఎం.ఎన్. భార్గవి, డీఎస్పీ, ఎమ్మిగనూరు -
రామ్కోలో కార్మికుడి మృతి
కొలిమిగుండ్ల: కల్వటాల సమీపంలోని రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీలో జీవనోపాధి కోసం పని చేసేందుకు వచ్చిన ఓ కార్మికుడు శనివారం ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా లొడ్డపుట్టి గ్రామానికి చెందిన దోలుపద్ర దాల్చిని (49) రామ్కోలో రాజవర్దన్ కాంట్రాక్టర్ కింద పనులు చేసేందుకు వచ్చాడు. రోజు మాదిరిగానే పనికి వెళ్లిన అతను పని చేసే సమయంలో అకస్మాతుగా కింద పడిపోవడంతో తలకు గాయమైంది. తోటి కార్మికులు ఫ్యాక్టరీ ఆవరణలోని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు. మెరుగైన చికిత్స కోసం తాడిపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందింంచగా ఆదివారం సాయంత్రానికి ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. 108 సిబ్బంది నిజాయితీ ఆస్పరి: రోడ్డు ప్రమాదంలో గాడపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించడమే కాకుండా ఆయన దగ్గరున్న డబ్బులను బంధువులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నారు ఆస్పరి 108 సిబ్బంది. అట్టెకల్లు గ్రామానికి చెందిన హరికృష్ణ శుక్రవారం పనిమీద ఆస్పరికి వచ్చి రాత్రి స్వగ్రామానికి బైక్పై బయలుదేరాడు. అట్టెకల్లు సమీపంలో బైక్ అదుపు తప్పడంతో కింద పడ్డాడు. ఈ ఘటనలో హరికృష్ణకు రక్తగాయాలయ్యాయి. సమాచారంతో ప్రమాద స్థలానికి చేరుకున్న 108 పైలెట్ వీరస్వామి, ఈఎంటీ వీరేష్ క్షతగాత్రుడికి ప్రాథమిక చికిత్స చేసి ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుడి వద్దనున్న రూ.1.68 లక్షలను అతని తమ్ముడు ధనుంజయను పిలిపించి ఆసుపత్రిలోనే పైలెట్, ఈఎంటీ అప్పగించారు. దీంతో 108 సిబ్బందిని పలువురు అభినందించారు. బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు(అర్బన్): జిల్లాలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన బాలల నుంచి కేంద్ర ప్రభుత్వ జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ విజయ శనివారం ఒక ప్రకటనలో కోరారు. సామాజిక సేవ, సంకేతిక పరిజ్ఞానం, పర్యావరణం, ధైర్య సాహసాలు, క్రీడలు, కళలు, సంస్కృతి తదితర వాటిలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారు ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలోనే ఆసక్తి, అర్హత కలిగిన వారు https://awards. gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కేంద్ర కమిటీ ద్వారా ఎంపికై న బాలలకు రాష్ట్రపతి చేతుల మీదుగా బహుమతితో పాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని అందించడం జరుగుతుందన్నారు. గృహ హింసపై అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు ... గృహ హింస చట్టంపై కొన్ని స్వచ్చంధ సంస్థలు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఐసీడీఎస్ పీడీ విజయ కోరారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన కొన్ని స్వచ్చంధ సంస్థలు గృహ హింస చట్టం 2025 అమలుకు సంబంధించి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇది పూర్తిగా అవాస్తవమని, మహిళలకు రక్షణ కల్పించే గృహ హింస చట్టం అమలు బాధ్యత పూర్తిగా మహిళా శిశు సంక్షేమ శాఖకు మాత్రమే ఉందని ఆమె స్పష్టం చేశారు. -
6న డోన్కు వైఎస్ జగన్ రాక
డోన్: డోన్ పట్టణానికి ఈనెల 6వ తేదీన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి కుమారుడు బుగ్గన అర్జున్ అమర్నాథ్రెడ్డి, మాజీ రాష్ట్రపతి, దివంగత నీలం సంజీవరెడ్డి ముని మనవరాలు అనన్యరెడ్డి వివాహ రిసెప్షన్కు వైఎస్ జగన్ హాజరై నవ దంపతులను ఆశీర్వదించనున్నారు. ఈ మేరకు వివాహ రిసెప్షన్ వేదికతో పాటు వెంకటాపురం రోడ్డులో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ ప్రాంతాన్ని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి శనివారం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఆయన వెంట రాష్ట్ర మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు సోమేష్ యాదవ్, మల్లికార్జునరెడ్డి, పార్టీ నాయకులు గజేంద్రనాథ్రెడ్డి, క్వాలిటీ అబ్దుల్లా, చంద్రశేఖర్ రెడ్డి, దినేష్గౌడ్, కురుకుందు హరి, మల్యాల శ్రీనివాసరెడ్డి, బొబ్బల శివరామిరెడ్డి తదితరులు ఉన్నారు. -
సంక్షేమ విద్యార్థినులకు బంగారు పతకాలు
కర్నూలు(అర్బన్): కర్నూలులో జరిగిన ఇంటర్ డిస్ట్రిక్ అథ్లెటిక్స్ మీట్లో నగరంలోని నెంబర్ 1 ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు బంగారు పతకాలు సాధించడం గర్వ కారణమని కర్నూలు, నంద్యాల జిల్లాల సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారిణులు బీ రాధిక, చింతామణి అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పతకాలు సాధించిన విద్యార్థినులకు వారు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అండర్ 20 అథ్లెటిక్స్ మీట్లో జే అనిత 100 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్, లాంగ్ జంప్లో సిల్వర్ మెడల్ సాధించారన్నారు. అలాగే మరో విద్యార్థిని ఎం రజిత షార్ట్ పుట్, లాంగ్ జంప్లో గోల్డ్ మెడల్స్ సాధించారని చెప్పారు. సంక్షేమ శాఖ వసతి గృహాల్లోని విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా జాతీయ స్థాయిలో రాణించడం గర్వ కారణమన్నారు. హాస్టల్ విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న వసతి గృహ సంక్షేమాధికారి బీ బెన్నమ్మను వారు ప్రత్యేకంగా అభినందించారు. బంగారు పతకాలు సాధించిన విద్యార్థినులను వారు శాలువాలు కప్పి, సర్టిఫికెట్లను అందించి సన్మానించారు. -
కేఎంసీలో ర్యాగింగ్పై మంత్రి ఆరా
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాల (కేఎంసీ)లో ర్యాగింగ్ ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరా తీశారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ర్యాగింగ్ జోలికి వెళ్లాలంటేనే భయపడేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. యాంటి ర్యాగింగ్ కమిటి నివేదికను అందజేయాలని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మను ఆదేశించారు. ఆమెతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దీంతో కళాశాల ప్రిన్సిపల్, యాంటి ర్యాగింగ్ కమిటీ సభ్యులు శుక్రవారం రంగంలోకి దిగి వార్డెన్ను, హాస్టల్లో ప్రథమ, మూడవ సంవత్సరం విద్యార్థులతో చర్చించారు. ర్యాగింగ్కు పాల్పడితే విద్యార్థులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వినాయక చవితి చందాల కోసమే వివాదం.. కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరగలేదని, కేవలం వినాయక చవితి చందాల కోసమే వివాదం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ శుక్రవారం ప్రకటించారు. తాను, ర్యాగింగ్ కమిటీ సభ్యులు కలిసి విద్యార్థులతో కూర్చుని మాట్లాడినట్లు తెలిపారు. వారితో లిఖిత పూర్వక సమాధానాలు తీసుకున్నామని, ఎక్కడా కూడా విద్యార్థులు ర్యాగింగ్ చేసినట్లుగా లేదన్నారు. మొదటి సంవత్సవరం విద్యార్థులు వార్షిక పరీక్షలకు సిద్ధం అవుతున్నారని, ఈ సమయంలో ఉత్సవాల అంశాన్ని ర్యాగింగ్ పేరుతో ప్రచారం చేశారని, ఇది విద్యార్థులకు నష్టం కలిగిస్తుందని అన్నారు. విద్యార్థులు ఎవ్వరైనా ర్యాగింగ్కు గురైనట్లు తమ దృష్టికి తీసుకొస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశం -
తాగి తూగిన ‘తెలుగు తమ్ముళ్లు’
మంత్రాలయం: అన్నదాత సుఖీభవ మాట దేవుడెరుగు. రాఘవేంద్రుడి సాక్షిగా.. అధికారుల ఎదుట తెలుగు తమ్ముళ్లు తాగి తూగారు. మత్తులో జోగుతూ సభా స్థలిలో హంగామా చేశారు. నిండు సభ జరుగుతున్న సమయంలో ఓ కార్యకర్త ఏకంగా స్టేజీపైకి ఎక్కి తాగిన మైకంలో ఈలలు వేశాడు. అదే వ్యక్తి వక్తలు ప్రసంగిస్తున్న సమయంలో స్టేజీ వైపు తూలుతూ పోతుండగా పోలీసులు వారించి నెట్టివేశారు. విచిత్రమేంటంటే క్షేత్రం పవిత్రతను మరిచి తమ్ముళ్లు నడుచుకోవడం స్థానికుల్లో చర్చగా మారింది. అంతేకాదండోయ్.. ఇక్కడ మరీ ముఖ్యంగా నాటుసారా టిన్లు సైతం దర్శనమిచ్చాయి. కొందరు టిన్లలో నాటుసారా తెచ్చుకుని ఏకంగా రెవెన్యూ కార్యాలయం ఎదుటే తాగుతూ కానిచ్చారు. మరికొందరు కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు తెచ్చుకుని ఫూటుగా తాగారు. ఓ కార్యకర్త ఏకంగా జాతీయ రహదారిపై పడుకుని వాహనాలకు అంతరాయం కల్గించాడు. టీడీపీ కార్యకర్తలు తూలడం చూసి స్థానికులు విస్తుపోయారు. -
అధిక ఫీజు వసూళ్లపై విచారణ
ఎమ్మిగనూరుటౌన్: నిబంధనలు పాటించకుండ విద్యార్థుల నుంచి అధిక ఫీజు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులపై పట్టణంలోని పలు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై శనివారం డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వెంకటరమణారెడ్డి విచారణ జరిపారు. ఇందులో భాగంగా స్థానిక భాష్యం పాఠశాలలో విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసిన వివరాలను పాఠశాల ప్రిన్సిపాల్ కవితను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీఈ యాక్ట్ కింద విద్యార్థులకు ఎన్ని సీట్లు కేటాయించారని, వారిని ఫీజులెందుకు అడిగారని ప్రశ్నించారు. పాఠశాలలో ఫీజు పట్టికను నోటీసు బోర్డ్లో ఎందుకు ప్రదర్శించ లేదని ప్రిన్సిపాల్ను నిలదీశారు. ఎంఈఓలు ఆదేశించినా ఎందుకు స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల యాజమాన్యం నిబంధనలు పాటించకుండ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని జైభీమ్ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్యతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు డిప్యూటీ డీఈఓ దృష్టికి తీసుకొచ్చారు. ఆయన వెంట ఎంఈఓ 2 మధుసూదన్రాజు తదితరులు ఉన్నారు. -
ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం
కర్నూలు(సెంట్రల్): విద్యాశాఖలో ఇటీవల పదోన్నతి, బదిలీలపై వెళ్లిన ఉపాధ్యాయులకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం వేధిస్తోంది. అధికారులను కలిసినా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఫ్యాప్టో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సేవాలాల్ నాయక్, భాస్కర్ విమర్శించారు. శనివారం కలెక్టరేట్ ఎదుట ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన ధర్నాను రాష్ట్ర ఫ్యాప్టో కో చైర్మన్ కాకి ప్రకాష్రావు ప్రారంభించగా జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఫ్యాప్టో జిల్లా అధ్యక్ష, కార్యదర్శు లు మాట్లాడుతూ ఏడాది గడిచినా 12వ పీఆర్సీని నియమించలేదని, నాలుగు పెండింగ్ డీఏలు ఇవ్వలేదని, ఈపీఎఫ్, ఇతర అలవెన్స్లను జమ చేయడంలేద ని విమర్శించారు. 30 శాతం ఐఆర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ 1938 జిల్లా అధ్యక్షుడు ఇస్మాయిల్, డీటీఎఫ్ రాష్ట్ర నాయకుడు కరే కృష్ణ, ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కార్యదర్శి నారాయణ, మండల విద్యాధికారుల సంఘం నాయకులు శ్రీనివాసులు పాల్గొన్నారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా -
ఉమ్మడి జిల్లాకు ఎల్లో అలర్ట్
● 5, 6 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కర్నూలు(అగ్రికల్చర్): రుతుపవనాల ప్రభావం వల్ల ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ నెల 6 తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అనంతపురం వాతావరణ కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. ఈ నెల 5వ తేదీ ఉమ్మడి కర్నూలు జిల్లాకు విశాఖపట్టణంలోని వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ప్రకటించిందని, 6వ తేదీన కర్నూలు జిల్లాకు ఎల్లో అలర్ట్ ఉందన్నారు. రుతుపవనాలు చురుగ్గా ఉండటం వల్ల ఆయా తేదీల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రోజుకు 64.5 నుంచి 115.5 మి.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నప్పుడు ఎల్లో అలర్ట్ ప్రకటిస్తారన్నారు. రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్బాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీరిస్తారన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం 1100 నెంబర్కు కాల్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in అనే వెబ్సైట్లో కూడా అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. జిల్లాకు 2,520 టన్నుల యూరియా కర్నూలు(అగ్రికల్చర్): యూరియా కొరత నేపథ్యంలో జిల్లాకు కోరమాండల్ నుంచి 2,520 టన్నులు వచ్చింది. కర్నూలు ర్యాక్ పాయింట్ నుంచి యూరియా ఆయా ప్రాంతాలకు తరలించారు. ఇందులో 300 టన్నులు నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు, డోన్, ఆత్మకూరు ప్రాంతాల్లోని ప్రయివేటు డీలర్లు, మన గ్రోమర్ సెంటర్లకు ఇచ్చారు. మిగిలిన యూరియాలో మార్క్ఫెడ్కు 1,260 టన్నులు, 960 టన్నులు ప్రయివేటు డీలర్లు, మన గ్రోమర్ సెంటర్లకు కేటాయించారు. ప్రయివేటు డీలర్లకు ఇచ్చిన యూరియాను బ్లాక్లో అమ్మేసినట్లు సమాచారం. గూడూరు, వెల్దుర్తి, సీ.బెళగల్, దేవనకొండ తదితర మండలాల్లో డీలర్లు జోరుగా బ్లాక్లో అమ్మకాలు సాగించినట్లు తెలుస్తోంది. మరోవైపు మార్క్ఫెడ్ నుంచి యూరియా పీఏసీఎస్లు, డీసీఎంఎస్, రైతు సేవా కేంద్రాలకు వెళ్తోంది. దీనిని కూటమి పార్టీల నేతలు తరలించుకపోతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్క రూపాయికే 30 రోజుల ఉచిత కాల్స్ కర్నూలు(హాస్పిటల్): బీఎస్ఎన్ఎల్ నుంచి ఆజాద్ కా ఆఫర్ ద్వారా రూ.1కే 30 రోజుల పాటు ప్రతిరోజూ 2జీబీ డేటా చొప్పున ఉచిత కాల్స్, ఉచిత సిమ్ అందజేస్తున్నట్లు ఆ సంస్థ జనరల్ మేనేజర్ జి.రమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వాత్రంత్య్ర దినోత్సవం మాసమైన ఆగస్టు నెలలో బీఎస్ఎన్ఎల్ ఆజాద్ కా ఆఫర్ను ప్రవేశపెట్టిందన్నారు. ఇతర ఆపరేటర్ నుంచి బీఎస్ఎన్ఎల్కు పోర్ట్ అయిన వారికి కూడా నూతన ఆఫర్ వర్తిస్తుందన్నారు. వినియోగదారులు దగ్గరలోని బీఎస్ఎన్ఎల్ సేవా కేంద్రాన్ని/రిటైలర్ను సందర్శించి ఈ ఉచిత ఆఫర్ను పొందాలన్నారు. 4జిని ప్రారంభించిన తర్వాత డేటా స్పీడులో మంచి వృద్ధి నమోదు చేసుకున్న తరుణంలో ఈ ఆఫర్ వినియోగదారులకు ఎంతో ఉపయోగకరమన్నారు. ‘కస్తుర్బా’ విద్యార్థినులకు అస్వస్థత బేతంచెర్ల: పట్టణానికి సమీపంలోని కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇద్దరు విద్యా ర్థినులు శనివారం అస్వస్థకు గురయ్యారు. బేతంచెర్లలోని జెండాపేటకు చెందిన 9వ తరగతి విద్యార్థిని విజయలక్ష్మికి చేతులు కాళ్లు పట్టేసి ఆయాసం వచ్చింది. అలాగే 7వ తరగతి విద్యార్థిని నాగ భవానికి ఫిట్స్ వచ్చాయి. వీరికి స్థానిక పీహెచ్సీలో ప్రాథమిక వైద్యం చేశారు. విషయం తెలిసి విద్యార్థి సంఘం నాయకులు ఆసుపత్రికి వెళ్లి విద్యార్థినులను పరామర్శించారు. ఇదే విద్యాలయంలో గత నెలలో 9వ తరగతి విద్యార్థిని లలిత మాధురి మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. పోషకాహారం అందకపోవడంతోనే ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. అస్వస్థతకు గురైన ఇద్దరు విద్యార్థులను 108 వాహనంలో కర్నూలుకు తరలించారు. -
వరద నీటి సద్వినియోగంలో విఫలం
కర్నూలు(అర్బన్): ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని సద్వినియోగం చేసుకోవడంలో జల వనరుల శాఖ ఇంజనీర్లు పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. ఇంజనీర్ల నిర్లక్ష్యం వల్ల ప్రస్తుత ఖరీఫ్లో కూడా పంటలు ఎండిపోయి, తాగునీరు అందని పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది. శ్రీశైలంలో 854 అడుగుల మేరకు నీరు ఉంటే పోతిరెడ్డిపాడుకు నీటిని విడుదల చేసుకునే అవకాశం ఉన్నా, ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్లోని మినీ సమావేశ భవనంలో నీటి పారుదల అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ సకాలంలో చర్యలు చేపట్టకపోవడం వల్ల గత మూడు రోజులుగా 20 నుంచి 30 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నీటి విడుదలకు సంబంధించి కేఆర్ఎంబీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పలువురు ఇంజనీర్లు చెప్పగా, వరద ప్రవాహాన్ని ముందుగానే అంచనా వేసి ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాల్సిన బాధ్యత మీకు ఉంది కదా ? అని ఆయన ప్రశ్నించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి తెలంగాణ వారు ఏ విధంగా నీటిని వినియోగించకుంటున్నారో మీకు తెలియదా అని ప్రశ్నించారు. మే చివరి నాటికి హెచ్ఎన్ఎస్ఎస్ పనులను పూర్తి చేసి ఉంటే, ఇప్పటికే గాజులదిన్నెలో కనీసం మూడు టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉండేది కదా, జూన్ నెలాఖరు వరకు కాలువ వైడనింగ్, లైనింగ్ పనులు చేపట్టడం వల్ల ఇప్పటి వరకు కేవలం 0.2 టీఎంసీల నీరు కూడా జీడీపీకి చేరలేదని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా మనకు అరకొర వర్షాలు కురుస్తున్నా, దేవుని పుణ్యాన ఎగువన వర్షాలు కురవడంతో మనకు వరద నీరు వస్తోందని, అనుకోకుండా వరద నీరు ఆగిపోతే ఎలా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే పలువురు ఇంజనీర్లు చెప్పిన సమాధానాల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పండ్ల తోటల పెంపకంపై అవగాహన పెంచాలి కరువు జిల్లా అనంతపురం నేడు పండ్ల తోటల పెంపకంలో అగ్రగామిగా ఉందని, అన్ని రకాల పండ్లను అక్కడి రైతులు పండిస్తున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూధన్ చెప్పారు. అయితే కర్నూలు జిల్లాలో మాత్రం మిర్చి, ఉల్లి, టమోటా, పత్తి తదితర పంటలపైనే రైతులు మొగ్గు చూపుతున్నారన్నారు. వివిధ రకాల పండ్ల తోటలను సాగు చేసుకునేందుకు ఇక్కడి రైతులకు అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే ఆయా పండ్లకు సంబంధించిన మార్కెటింగ్పై కూడా రైతులకు తెలియజేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈలు మహేశ్వరరెడ్డి, శ్రీధర్రెడ్డి, పీఆర్ ఎస్ఈ మద్దన్న, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈలు బి.నాగేశ్వరరావు, సీహెచ్ మనోహర్, సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణులు బీ రాధిక, చింతామణి, జెడ్పీటీసీలు సుధాకర్రెడ్డి, సుంకన్న, రఘునాథరెడ్డి, మౌలాలి, ప్రసన్నకుమార్, జగదీశ్వరరెడ్డి, మహేశ్వరరెడ్డి, శివశంకర్రెడ్డి, రామక్రిష్ణ, రంగనాథ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మినరల్ వాటర్ ప్లాంట్ కూల్చివేతపై చర్యలేవి బనగానపల్లె పాత బస్టాండ్ ప్రాంతంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు అప్పటి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ను కూల్చివేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని చైర్మన్ పాపిరెడ్డి ప్రశ్నించారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను కూడా పనిచేయకుండా చేసి పోలీసుల సాయంతో మినరల్ వాటర్ ప్లాంట్ను కూల్చారనే వాదనలు వినిపిస్తున్నాయని, ఈ ఘటనపై ఏమి చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా పంచాయతీ అధికారిణి లలితాబాయి మాట్లాడుతూ జరిగిన ఘటనను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని.. అలాగే పంచాయతీ కార్యదర్శి, డిప్యూటీ ఎంపీడీఓ ఆధ్వర్యంలో నివేదికలు తయారు చేస్తున్నారన్నారు. సకాలంలో యూరియా అందక ఇబ్బందులురైతులకు సకాలంలో యూరియా అందకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బ్లాక్ మార్కెట్లో ఒక బస్తా యూరియాను రూ.500 పెట్టి కొనాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని కొత్తపల్లి జెడ్పీటీసీ సుధాకర్రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి కలుగజేసుకుంటు రబీ సీజన్లో యూరియా కొరత తీవ్ర రూపం దాల్చిన సమయంలోనే రానున్న ఖరీఫ్లోనైనా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియాను అందించాలని స్థాయీ సంఘ సమావేశాలు, జనరల్ బాడీ సమావేశాల్లోను అధికారులను కోరామన్నారు. అయినా, ప్రస్తుత ఖరీఫ్లో యూరియా లభించక రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఇంజనీర్ల నిర్లక్ష్యంతో 20 నుంచి 30 టీఎంసీల నీరు సముద్రం పాలు సకాలంలో రైతులకు యూరియా అందక ఇబ్బందులు మినరల్ వాటర్ ప్లాంట్ కూల్చివేతపై చర్యలేవి జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి -
సారూ.. న్యాయం చేయండి
ఎమ్మిగనూరురూరల్: పొలం తక్కువ ఉందని చూపారని.. సారూ.. మీరే న్యాయం చేయాలని బనవాసి కేవీకేకు వచ్చిన జిల్లా కలెక్టర్ రంజిత్బాషాకు పార్లపల్లి గ్రామానికి చెందిన రైతు చిన్నహనుమన్న అర్జీ ఇచ్చారు. తనకు 7.75 ఎకరాల భూమి ఉండగా రీ సర్వేలో 50 సెంట్లు తక్కువగా అధికారులు చూయిస్తున్నారని, తహసీల్దార్కు ఎన్ని సార్లు విన్నవించుకున్నా పట్టించుకోవటం లేదని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తమ భూమి 50 సెంట్ల భూమి వేరే వారి పేరున ఆన్లైన్లో చూపుతోందని, సమస్యను పరిష్కరించాలని ఆర్జీని ఇచ్చారు. దానిని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్కు అప్పగించి విచారించి న్యాయం చేస్తామని రైతుకు జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. -
పట్ట పగలే చోరీ
పాణ్యం: మండల కేంద్రమైన పాణ్యం విజయానికేతన్ పాఠశాల సమీపంలో ఓ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. గ్రామానికి చెందిన జక్కుల మద్దిలేటి డొంగు వద్ద ఉన్న హోటల్ వంట మాస్టర్గా పని చేస్తున్నారు. రోజులాగే తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు భార్యాభర్తలు హోటల్కు వెళ్లారు. ఆ సమయంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించి మూడు బీరువాలను పగులగొట్టి రూ. 60 వేలు నగదు, ఒక ఉంగరాన్ని అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు క్లూస్టీమ్ను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. దొంగలు చోరీకి ఉపయోగించిన సుత్తి, ఇనుపరాడ్డును అక్కడే వదిలేయడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సంతెకూడ్లూరులో ఘర్షణ
ఆదోని అర్బన్: సంతెకూడ్లూరు గ్రామంలో టీడీపీ, బీజేపీ వర్గీయుల మధ్య బుక్ కీపర్ విషయంలో శుక్రవారం ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీకి చెందిన మహేష్ భార్య గాయత్రీ బుక్ కీపర్గా పనిచేస్తోంది. గత నెల నుంచి ఆమెను తీసివేసి టీడీపీకి చెందిన వీరేష్ భార్య సువార్తమ్మను నియమించారు. ప్రస్తుతం టీడీపీకి చెందిన సువార్తమ్మ గ్రామంలో ఫేష్ యాప్ ద్వారా వివరాలు రికార్డు చేస్తున్నారు. బీజేపీకి చెందిన వారు ఎవరు ఫేష్ యాప్ చేసుకోవద్దని ప్రచారం చేసినట్లు తెలిసింది. ఇలా ప్రచారం చేయడం తెలుసుకున్న టీడీపీకి చెందిన వారు నేరుగా బీజేపీ వారిని నిలదీశారు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు. దాడిలో బీజేపీకి చెందిన మహేష్, టీడీపీకి చెందిన మదిరె వీరేష్కు గాయాలయ్యాయి. వెంటనే కుటుంబీకులు గాయపడిన వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
వైఎస్సార్సీపీ ‘మైనార్టీ’ విభాగం అధ్యక్షుడిగా హఫీజ్ ఖాన్
కర్నూలు (టౌన్): వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్సీపీ పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ సభ్యులుగా హఫీజ్ఖాన్ ఉన్నారు. జిల్లాకు కొత్తగా 3,502 వితంతు పింఛన్లు కర్నూలు(సెంట్రల్): జిల్లాకు కొత్తగా 3,502 వితంతు పెన్షన్లు మంజూరయ్యాయి. కాగా, భర్తలు చనిపోయిన వృద్ధులకు మాత్రమే కొత్తగా వితంతు పెన్షన్లను మంజూరు చేశారు. అయితే 60 ఏళ్లు దాటిన వారికి కొత్తగా పింఛన్లు మంజూరు చేయకపోవడం గమనార్హం. కొత్తగా పెన్షన్లు మంజూరైన కల్లూరు మండలం చిన్నటేకూరుకు చెందిన కురువ అంజనమ్మ, బోయ లక్ష్మీదేవిలకు కలెక్టర్ తన చాంబర్లో పెన్షన్ను అందజేశారు. పీఆర్ ఎస్ఈగా మద్దన్న కర్నూలు(అర్బన్): పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీరు (ఎఫ్ఏసీ)గా ఎస్సీఈ మద్దన్నకు బాధ్యతలు అప్పగిస్తూ ఆ శాఖ ఇంజనీరు ఇన్ చీఫ్ బాలునాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. రెగ్యులర్ ఎస్ఈగా విధులు నిర్వహించిన వి.రామచంద్రారెడ్డి జూలై 31న పదవీ విరమణ పొందారు. ఈ నేపథ్యంలోనే కర్నూలు పీఆర్ ఈఈగా విధులు నిర్వహిస్తున్న మద్దన్నకు ఎఫ్ఏసీపై ఎస్ఈగా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా పలువురు డీఈఈ, ఏఈలు, కార్యాలయ సిబ్బంది ఆయనను కలిసి అభినందనలు తెలిపారు.టెంకాయ రూ.20 ప్రకారం అమ్మాలి కౌతాళం: ఉరుకుంద ఈరన్నస్వామి ఆలయం వద్ద ఒక టెంకాయ రూ.20 ప్రకారం విక్రయించాలని ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రూ.20కే టెంకాయ అమ్మాలని పాటదారుడికి నోటీసు జారీ చేశామన్నారు. భక్తుల నుంచి ఫిర్యాదు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నేరుగా అంబేద్కర్ గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీ కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులాల్లో మిగిలిపోయిన సీట్లను నేరుగా భర్తీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల కోఆర్డినేటర్ డాక్టర్ ఐ.శ్రీదేవి తెలిపారు. కౌన్సెలింగ్ అనంతరం కంబాలపాడు (బాలికలు), అరికెర (బాలురు) కళాశాలల్లో ఆర్ట్స్ గ్రూపుల్లో సీట్లు ఖాళీగా ఉన్నట్లు ఆమె శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతిలో రెగ్యులర్, సప్లిమెంటరీగా ఉత్తీర్ణులైన వారు నేరుగా ప్రవేశాలకు అర్హులన్నారు. అరికెర బాలుర కళాశాలలో సీఈసీలో ఎస్సీలకు 49, కంబాలపాడు బాలికల కళాశాలలో సీఈసీలో ఎస్సీలకు నాలుగు సీట్లు, బైపీసీ జనరల్ విభాగంలో ఒక సీటు ఖాళీగా ఉందన్నారు. అలాగే కర్నూలు జిల్లాలో 10వ తరగతిలో 24, సీనియర్ ఇంటర్మీడియట్లో 202, నంద్యాల జిల్లాలో 10వ తరగతిలో 16, సీనియర్ ఇంటర్మీడియట్లో 88 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హత కలిగిన వారు సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్స్ను సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు 9866616633/ 9010070219 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.