Kurnool District Latest News
-
‘జీబీ సిండ్రోమ్’పై అప్రమత్తం
● పెద్దాసుపత్రిలో అవసరమైన ఏర్పాట్లు ● సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు కర్నూలు(హాస్పిటల్): గులియన్ బారే సిండ్రోమ్(జీబీ సిండ్రోమ్) అనే వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు అన్నారు. ఆసుపత్రిలోని తన చాంబర్లో వైద్యులతో గురువారం సమీక్ష నిర్వహించారు. వ్యాధికి సంబంధించి లక్షణాలపై చర్చించారు. రోగులకు అందుతున్న చికిత్స, ఇతర అంశాల గురించి తెలుసుకున్నారు. కాళ్లు, చేతులు స్పర్శ కోల్పోయినట్లు అనిపిస్తే వెంటనే ఆసుపత్రికి రావాలని ప్రజలకు సూచించారు. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ వ్యాధి సోకుతుందని తెలిపారు. ఈ వ్యాధి ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపైనే తీవ్ర ప్రభావం చూపిస్తుందని, సకాలంలో వైద్యం అందితే ముప్పు ఉండదన్నారు. చికిత్సకు అవసరమైన ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్ను అందుబాటులో ఉందని తెలిపారు. ఈ వ్యాధికి సంబంధించి నోడల్ అధికారిగా డాక్టర్ దమామ్ శ్రీనివాసులును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. సమావేశంలో సీఎస్ఆర్ఎంవో డాక్టర్ బి. వెంకటేశ్వరరావు, జనరల్ మెడిసిన్, న్యూరాలజీ, హెచ్వోడీలు డాక్టర్ ఇక్బాల్ హుసేన్, డాక్టర్ సి. శ్రీనివాసులు, పీడియాట్రిక్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రవీంద్రనాథ్రెడ్డి, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శివబాలనాగాంజన్ తదితరులు పాల్గొన్నారు. -
అనారోగ్యంపాలు
అనంతపురం జిల్లాలో పాల కల్తీ వ్యవహారం ఆ ప్రాంతాన్నే కాదు మొత్తం రాష్ట్రంలో కలకలం రేపింది. తాగుతున్న పాలు స్వచ్ఛమైనవేనా అనే సందేహం ఇప్పుడు ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతోంది. గ్రామాల్లో పశువులు గణనీయంగా తగ్గిపోవడంతో పాల ఉత్పత్తి కూడా అదే స్థాయిలో పడిపోతోంది. ఈ నేపథ్యంలో ప్యాకెట్ పాలు మార్కెట్ ను ముంచెత్తుతుండటంతో కల్తీ అధికమైంది. పాలు చిక్కగా ఉండేందుకు.. వెన్న శాతం పెరిగేందుకు అనారోగ్యకరమైన పద్ధతులు తెరపైకి వస్తుండటంతో అందోళన కలిగిస్తోంది.ఉమ్మడి జిల్లా జనాభా: 50లక్షల పైనేఅవసరమైన పాలు: 16లక్షల లీటర్లుజిల్లాలో ఉత్పత్తి: 10,82,950 లీటర్లుకర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో 2,16,590 పశువుల నుంచి రోజు పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఆవులు, బర్రెలు రోజుకు సగటున 5 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. ఈ ప్రకారం రోజుకు 10.82 లక్షల లీటర్లు మాత్రమే పాల ఉత్పత్తి ఉంటోంది. దీన్ని బట్టి చూస్తే రోజుకు 5.17 లక్షల లీటర్ల పాల కొరత ఉందన్నది వాస్తవం. ఈ కొరతను అధిగమించేందుకు కొన్ని డెయిరీలు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడం, ఉన్న పాలనే కల్తీ చేస్తున్నట్లు సమాచారం. కొన్ని డెయిరీలు పాలు ఎక్కువగా ఉన్నప్పుడు పాలను పొడిగా తయారు చేసుకుంటాయి. కొరత ఉన్నప్పుడు పొడిని ఉపయోగించి పాలుగా మార్పు చేసి కొరతను అధిగమిస్తున్నారు. పాలు ఉత్పత్తి చేసే నిజమైన రైతు లీటరు మీద పొందుతున్న లాభం రెండు, మూడు రూపాయలే. వీటిని కొంటున్న వ్యాపారులు కొందరు కల్తీ చేయడం ద్వారా లీటరుకు రూ.10పైగా లాభం పొందుతున్నారు. పశువుల సంఖ్య పడిపోవడంతో డిమాండ్కు తగ్గట్టుగా పాల ఉత్పత్తి కరువైంది. కల్తీ చేయడం ద్వారానే డిమాండ్కు తగ్గట్టుగా పాలు మార్కెట్లో లభిస్తున్నాయని తెలుస్తోంది. కల్తీ పాలు తాగుతుండటం వల్లే అధిక శాతం ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.తాగుతున్న పాలు స్వచ్ఛమైనవేనా?జిల్లాలో విజయ పాలు, పలు ప్రయివేటు డెయిరీల పాల విక్రయాలు చేపడుతున్నాయి. కొంత మంది రైతుల నుంచి పాలు సేకరించి వాటిని కల్తీ చేసి ఇటు డెయిరీలకు, అటు వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు. ఇటీవల అనంతపురం జిల్లాలో జరుగుతున్న పాల కల్తీ ఉలిక్కిపడేలా చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా వివిధ రూపాల్లో పాలు కల్తీ అవుతున్నాయనే చర్చ జరుగుతోంది. పాలల్లో నీరు కలిపి కల్తీ చేయడం కొత్తేమీ కాదు. అయితే కొంత మంది వ్యాపారులు, దళారీలు ఎక్కువ లాభం పొందేందుకు పాలల్లో నీళ్లే కాకుండా అనేక రసాయనాలను కలుపుతున్నట్లు సమాచారం. కెమికల్స్తో పాల నాణ్యత పరిమాణాన్ని కృత్రిమంగా పెంచేస్తున్నారు. నీళ్లు, డిటర్జెంటు, మొక్కజొన్న పిండి, యూరియా, పొద్దుతిరుగుడు నూనె వంటి వాటిని వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఫార్మాలిన్ లేదా బోరిక్ యాసిడ్, చిక్కగా ఉండటానికి క్లోరిన్, అమ్మోనియా సల్ఫేటు కలుపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే కాస్టిక్ సోడా, బెంజాయిక్ యూసిడ్, సాలిసిలిక్ యాసిడ్ కలుపుతున్నట్లు సమాచారం.గత ఏడాది ఐదు కల్తీ కేసులు2024లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పాలు, పాల ఉత్పత్తులకు సంబంధించి 12 శాంపుల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు. ఐదింట్లో కల్తీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇవన్నీ మార్కెట్లోకి వెళ్లిపోయాయి. కల్తీతో ప్రజారో గ్యం ఏ స్థాయిలో దెబ్బతింటుందో ఊహించుకోవచ్చు. 2024లో కర్నూలులో మార్కెట్ షేర్ ఎక్కువగా ఉన్న డెయిరీ దూద్పేడాలో కల్తీ జరిగినట్లు తేలింది. పాలు, కలాకాన్, నెయ్యి వంటి వాటిల్లో కల్తీ ఉన్నట్లు నిర్ధారణ కావడం గమనార్హం. కల్తీపై జేసీ కోర్టులో ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసులు నమోదు చేశారు.అనంతపురం జిల్లాలో వెలుగుచూసిన కల్తీ ఇలా..కొంతమేర మాల్తోటెస్టిన్ పౌడర్, పామాయిల్ 250/500 ఎంఎల్, లీటరు పలుచని పాలు, ఉప్పు తీసుకొని మిక్సీకి వేస్తారు. ఇలా చేయడం వల్ల చిక్కటి లిక్విడ్ వస్తుంది.దీనిని ప్రతి 20 లీటర్ల పాలకు అర్ధలీటరు లిక్విడ్ను కలిపి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.ఇందువల్ల పాలు చిక్కగా ఉంటాయి. వెన్న శాతం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది.ఈ కల్తీని లాక్టోమీటరు కూడా గుర్తించలేకపోవడం గమనార్హం. -
ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇవ్వాలి
కర్నూలు(అగ్రికల్చర్): పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడంలో ఆలస్యమైందని, ఉద్యోగులకు వెంటనే మధ్యంతర భృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్ వెంగళ్రెడ్డి కోరారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం కర్నూలు లోని ఎన్జీవో హోంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న అన్ని రకాల అర్థిక ప్రయోజనాలను తక్షణం విడుదల చేయాలన్నారు. సంఘం వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జవహర్లాల్, కోశాధికారి భాస్కరనాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివారెడ్డి, రమణలను సస్పెండ్ చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి విధులన్నీ కేసీహెచ్ కృష్ణుడు నిర్వహి స్తారని ప్రకటించారు. రాష్ట్ర అసోషియేట్ అధ్యక్షుడు దస్తగిరిరెడ్డి, జిల్లా కార్యదర్శి కేసీహెచ్ కృష్ణుడు, నాయకలు ఎంసీ కాశన్న, రామకృష్ణ పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్
కర్నూలు(సెంట్రల్): గ్రూపు–2 మెయిన్స్ పరీక్షలు ఈ నెల 23వ తేదీన జిల్లాలో 30 కేంద్రాల్లో నిర్వహించనున్నారని డీఆర్వో సి.వెంకట నారా యణమ్మ తెలిపారు. జిల్లాలో మొత్తం 9,993 మంది పరీక్షలు రాయనున్నారని, వారి సౌలభ్యం కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సందేహాలు ఉంటే 08518–277305 నంబర్కు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో గ్రూపు–2 మెయిన్స్ పరీక్షలపై అధికారులతో గురువారం ఆమె సమీక్షించారు. పరీక్షలు రాసే వారు సమయానికి ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూ చించారు. నిర్దేశిత సమయం కంటే నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోరని పేర్కొన్నారు. టౌన్ డీఎస్పీ బాబుప్రసా దు, ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ వి.బాబురావు, సెక్షన్ ఆఫీసర్లు బ్రహ్మేశ్వరరావు, సుధాకర్బాబు, ఏఎస్ఓలు కేఎస్ఎస్ అనిల్కుమార్, టి.ఆంజనేయులు, యోగేష్ పాల్గొన్నారు. మిర్చి ధర పతనం ● క్వింటా రూ.9,500 మాత్రమే కర్నూలు(అగ్రికల్చర్): మిర్చి క్వింటా ధర రూ.20 వేలు లభిస్తే రైతులకు గిట్టుబాటు అవుతుంది. అయితే సగం ధర కూడా రైతుకు దక్కకడం లేదు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు గురువారం 804 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాకు సగటున రూ.9,500 ధర మాత్రమే లభించింది. ఈ ఏడాది జిల్లాలో 95,477 ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు. ప్రకృతి సహకరించకపోవడంతో దిగుబడులు 50 శాతం వరకు తగ్గిపోయాయి. గత నాలుగైదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ధరలు కూడా పడిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రతి రోజు ప్రత్యేక తరగతులు ఆలూరు రూరల్: బీసీ హాస్టళ్లలో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఆలూరులోని బీసీ బాలికల, బాలుర హాస్టళ్లను గురువారం ఆయన తనిఖీ చేశారు. పదో తరగతిలో, ఇంటర్లో హాస్టల్ విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని వార్డెన్లను ఆదేశించారు. సహాయ బీసీ సంక్షేమ శాఖ అధికారి కుళ్లాయప్ప, వార్డెన్లు షాహినూర్, సంపత్ పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన శ్రీశైలంటెంపుల్: శ్రీగిరిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను గురువారం రాష్ట్ర దేవదాయశాఖ కార్యదర్శి వాడరేవు వినయ్ చంద్ పరిశీలించారు. సర్వదర్శనం, శీఘ్ర, అతి శీఘ్రదర్శన క్యూలైన్లు, పాగాలంకరణ, కల్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్యూలైన్ల నిర్వహణ పూర్తి ప్రణాళికబద్ధంగా ఉండాలన్నారు. ఉన్నతాధికారులు నిరంతరం క్యూలైన్ల నిర్వహణను పరిశీలిస్తుండాలన్నారు. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్యూలైన్లలో ఎటువంటి తొక్కిసలాట జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. క్యూకాంప్లెక్స్లో ప్రత్యేకంగా ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆయన వెంట చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్, దేవస్థానం ఎం.శ్రీనివాసరావు, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. మహానందీశ్వరుడి హుండీ ఆదాయం రూ.59.87 లక్షలు మహానంది: మహానందీశ్వరుడికి హుండీ ఆదాయం రూ.59.87 లక్షలు వచ్చినట్లు ఆల య ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహానందిలోని అభిషేకం మండపంలో గురువారం శ్రీ కామేశ్వరి దేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వార్లతో పాటు కోదండ రామాలయం, వినాయక నంది ఆలయాల హుండీలతో పాటు అన్నదాత విభాగం, గోసంరక్షణ విభాగం హుండీ కానుకలను లెక్కించారు. ఆలయాల హుండీల ద్వారా రూ.58,56,681 రాగా అన్నప్రసాదం ద్వారా రూ.99,110, గోసంరక్షణ విభాగం ద్వారా రూ.31,317 వచ్చిందన్నారు. లెక్కింపు కార్యక్రమంలో ఏఈఓ మధు, సూపరింటెండెంట్ శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతుల ఆవేదన పట్టదా?
అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు రాష్ట్ర ప్రజల తరఫున పోరాటం చేయడానికి వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నారని కాటసాని అన్నారు. జిల్లాల్లో పర్యటనలు చేస్తున్న జగన్కు కూటమి ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వలేకపోతోంద ని విమర్శించారు. రాష్ట్ర ప్రజలే జగన్కు రక్షణగా ఉంటారన్నారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా ‘సూపర్ సిక్స్’ హామీలు అమలు చేయడం లేదన్నారు. అధికారంలోకి వస్తే సరసమైన ధరలకే నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పి రేట్లు పెంచారన్నారు. విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ రేణుక, కార్పొరేటర్లు శ్వేతారెడ్డి, నారాయణరెడ్డి, వెంకటేశ్వర్లు, లక్ష్మీకాంతరెడ్డి, నాగ లక్ష్మిరెడ్డి, సాన శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కల్లూరు: పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పట్టదా అని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ప్రశ్నించారు. రైతుల ఇబ్బందులపై తన స్వగృహంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూపి టీడీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారన్నారు. గుంటూరు మిర్చి మార్కెట్లో రైతులు గిట్టుబాటు ధరరాక పడుతున్న బాధలను చూసి వారితో మాట్లాడాటానికి వెళ్లిన వైఎస్ జగన్పై కేసు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పంటల దిగుబడులు కొనుగోలు చేయాలి వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడామని, పసుపు, మిర్చి, ఉల్లితో పాటు మొత్తం 24 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించారన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో గతేడాది మిర్చి క్వింటా ధర రూ.21వేల నుంచి 22వేల వరకు లభించిందన్నారు. ప్రస్తుతం క్వింటాళ్లు రూ. 8వేల నుంచి 11వేలకు పడిపోయిందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తెగుళ్లు కారణంగా పంట దిగుబడులు తగ్గాయన్నారు. ఎకరాకు 10 క్వింటాళ్లు మించి రాలేదని, పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు సుమారుగా రూ. 1.50 లక్షలు అవుతుందన్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. రైతులు ఇంత ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం తరఫున రైతులను పలకరించే వారు లేరన్నారు. వెంటనే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకోవాలన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించరా? వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి -
భృంగి వాహనాధీశా.. పాహిమాం
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల శోభతో శ్రీగిరి క్షేత్రం ఇల కై లాసాన్ని తలపిస్తోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లు భృంగి వాహనంపై దర్శనమిచ్చారు. భక్తుల శివన్మామస్మరణతో, కళాకారుల సందడితో పరమేశ్వరుడి పరమభక్తుడైన భృంగి పులకించిపోయారు. వేలాది మంది భక్తులు భృంగివాహనాధీశులైన స్వామిఅమ్మవార్ల దివ్యమంగళస్వరూపాన్ని దర్శించి దీవెనలిమ్మని వేడుకున్నారు. ఉత్సవంలో ముందుగా భృంగి వాహనాన్ని వివిధ సుగంధ పుష్పాలతో అలంకరించారు. అలంకార మండపంలో స్వామిఅమ్మవారల ఉత్సవమూర్తులను భృంగి వాహనంపై ఉంచి అర్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్ఛారణతో ప్రత్యేక పూజా హారతులిచ్చారు. అనంతరం భృంగివాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను గ్రామోత్సవాన్ని దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు ప్రారంభించారు. పరివార దేవతామూర్తులకు కర్పూర నీరాజనాలు సమర్పించుకుంటూ ఉత్సవాన్ని ఆలయం బయటకు తీసుకొచ్చారు. ఉత్సవం ముందు పలువురు కళాకారుల నృత్యాలు, కోలాటం, నాదస్వరం, చెక్కభజనలు, రాజభటుల వేషధారణలు, కేరళ చండీమేళం, కొమ్ము కొయ్యనృత్యం, డప్పుల నృత్యాలు, బుట్టబొమ్మలు, నందికొలసేవ భక్తులను అలరించాయి. గ్రామోత్సవం గంగాధర మండపం నుంచి నందిమండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు శోభాయమానంగా సాగింది. శ్రీశైలంలో నేడు.. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవరోజు శుక్రవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లు హంస వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం ఆలయ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహిస్తారు. విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం అధికారులు శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. శ్రీగిరిలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భృంగివాహనంపై ఆదిదంపతుల విహారం స్వామిఅమ్మవార్లను దర్శించుకుని తరించిన భక్తజనం ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శన -
ఇంటర్ పరీక్షలకు 69 కేంద్రాలు
కర్నూలు(సెంట్రల్): ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు, జిల్లాలో 69 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పి.రంజిత్బాషా తెలిపారు. గురువారం సాయంత్రం అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థులు 23,098 మంది, రెండో సంవత్సర విద్యార్థులు 22,227 మంది పరీక్ష రాయనున్నట్లు చెప్పారు. ప్రశ్న పత్రాల భద్రతకు పటిష్ట ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ కేంద్రాలను మూయించాలని, అలాగే 144 సెక్షన్ విధించాల న్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. టెలీ కాన్ఫరెన్స్లో అడిషినల్ ఎస్పీ, డీఆర్వో, ఆర్ఐఓ పాల్గొన్నారు. కార్మికులకు ‘ఈ శ్రమ్’ భద్రత ఈ శ్రమ్ కార్డుతో అసంఘటితరంగ కార్మికులకు సామాజిక భద్రత లభిస్తుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా తెలిపారు. జిల్లాలోని అసంఘటితరంగ కార్మికులను ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ శ్రమ్లో నమోదు చేసుకున్న అసంఘటిత రంగ కార్మికులకు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద రూ.2లక్షల బీమా ఉచితంగా లభిస్తుందన్నారు. మండలాల వారీగా లక్ష్యాలను నిర్దేశించాలని కార్మిక శాఖ కమిషనర్ వెంకటేశ్వర్లుకు ఆదేశాలు ఇచ్చారు. మార్చి 15 వరకు ఎంఎస్ఎంఈ సర్వే జిల్లాలో మార్చి 15వ తేదీ వరకు నిర్వహించే ఎంఎస్ఎంఈ సర్వేకు పరిశ్రమల యజమానులు సహకరించాలని కలెక్టర్ పి.రంజిత్బాషా గురువారం ఓ ప్రకటనలో కోరారు. ఈ సర్వే ద్వారా పరిశ్రమల వివరాలను ప్రత్యేక యాప్ ద్వారా నమోదు చేస్తారన్నారు. కొనసాగుతున్న పీ4 సర్వే పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ4 సర్వే జిల్లాలో కొనసాగుతుంతోందని సీఎస్ విజయానంద్కు జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా వివరించారు. పీ4 సర్వే ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభమైందని, మార్చి 2వ తేదీ ముస్తుందని తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం వివిధ అంశాలపై సీఎస్ సమీక్షించారు. జిల్లాలో గ్రూపు–2 మెయిన్స్, ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం తీసుకున్న చర్యలను సీఎస్కు జిల్లా కలెక్టర్ వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో జేసీ డాక్టర్ బి.నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఆర్వోసి.వెంకటనారాయణమ్మ పాల్గొన్నారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు జిల్లా కలెక్టర్ రంజిత్బాషా -
అన్నదమ్ముల ఆస్తి పంచాయితీ
డోన్: కుటుంబంలో నెలకొన్న ఆస్తి తగాదాలను సామరస్యంగా పరిష్కరించాల్సిన పోలీసులు రాజకీయ ఒత్తిళ్లతో ఒకరికే వత్తాసు పలకడంతో వివాదం మరింత ముదిరింది. చివరకు ఓ వ్యక్తి అదృశ్యానికి కారణమైంది. టీడీపీ నాయకులు, పోలీసులు వేధిస్తుండటంతో తన భర్త నబీ రసూల్ అదృశ్యమయ్యాడని యు. కొత్తపల్లె గ్రామానికి చెందిన షాహీన్ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆమె తెలిపిన వివరాల మేరకు.. తన బావ మిన్నల్ల హుసేన్ టీడీపీ నేత కావడంతో పోలీసుల అండతో తరచూ తన భర్త నబీరసూల్ను వేధిస్తున్నారన్నారు. రెండు రోజులుగా తన భర్త కనిపించడం లేదని, అతనికి ఏదైనా ప్రాణహాని జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని టీడీపీ నాయకులు, పోలీసులను ఆమె ప్రశ్నించారు. కుటుంబ ఆస్తి వివాదంలో పోలీసులు కలుగజేసుకుని తన భర్తను వేధించడం ఎంత వరకు న్యాయమన్నారు. ఆస్తి కోసం తన భర్తను సొంత బావనే కిడ్నాప్ చేశారేమోనని అనుమానం కలుగుతుందని ఆమె ఆరోపించారు. వెంటనే తన భర్తను క్షేమంగా ఇంటికి చేర్చే విధంగా పోలీసు ఉన్నతాధికారులు చొరవ చూపాలని కోరారు. అన్న టీడీపీ నేత కావడంతో పోలీసులు అతనికే వత్తాసు పోలీసుల వేధింపులతో రెండు రోజులుగా కనిపించని తమ్ముడు ఆందోళనలో కుటుంబీకులు -
అడుగులన్నీ శ్రీగిరి వైపు..
శ్రీశైలంటెంపుల్: ఓం హరోం హరా.. శంభో శంకరా.. ఓం నమఃశివాయ.. అంటూ భక్తుల శివనామస్మరణతో నల్లమల గిరులు మారుమోగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల మల్లన్న చెంతకు పాదయాత్రగా భక్తులు చేరుకుంటున్నారు. పలువురు శివస్వాములు, సాధారణ భక్తులు నల్లమల మీదుగా శ్రీగిరికి వస్తున్నారు. ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర గోసాయికట్ట, వీరాంజనేయస్వామి గుడి, నాగలూటి వీరభద్రస్వామి దేవాలయం, దామెర్లకుంట, పెచ్చెరువు, మఠం బావి, భీమునికొలను, కై లాసద్వారం చేరుకుంటున్నారు. అక్కడి నుంచి హఠకేశ్వరం, సాక్షిగణపతి మీదుగా శ్రీశైలం చేరుకుని మల్లన్నను దర్శించుకుంటున్నారు. నల్లమలలో ఎత్తైన కొండలు, గుట్టలు, వాగులు, వంకల్లో నడుచుకుంటూ వృద్ధులు, మహిళలు దాదాపు 40 కిలోమీటర్లు పాదయాత్రగా శ్రీశైలం వైపు అడుగులు వేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మరో వైపు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తండోపతండాలుగా వాహనాల్లో శ్రీశైలానికి తరలివస్తున్నారు. వేకువజామున్నే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఉచిత, రూ.200, రూ.500 క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. అలాగే జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేసి, నిర్ధిష్ట వేళలలో మల్లన్న స్పర్శదర్శనాన్ని కల్పించారు. నల్లమల మీదుగా పాదయాత్రగా మల్లన్న చెంతకు భక్తులు -
బస్సులో బంగారు నగలు చోరీ
మహానంది: నంద్యాల నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా 13 తులాల బంగారు నగలు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. గురువారం గిద్దలూరుకు చెందిన కిషోర్, మౌనిక కుటుంబ సభ్యులు అహోబిలం ఆలయానికి వచ్చి తిరిగి వెళ్తుండగా గాజులపల్లె సమీపంలో బ్యాగు గల్లంతైనట్లు గుర్తించారు. అందులో 13 తులాల బంగారు నగలు ఉన్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా ఈ విషయంపై మహానంది ఎస్ఐ రామ్మోహన్రెడ్డికి సమాచారం అందించగా మహానంది పోలీస్స్టేషన్ పరిధిలో చోరీ జరగలేదని చెప్పారు. గిద్దలూరు వెళ్లిన తర్వాత బాధితులు గుర్తించినట్లు తమకు సమాచారం అందిందన్నారు. -
ట్రాక్టర్తో ఢీకొట్టి.. కాలువలో పడేసి
గుంతకల్లు: యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు భోగాల తిరుమలరెడ్డి (42) హత్య కేసును గుంతకల్లు రూరల్ పోలీసులు ఛేదించారు. ముందుగా ట్రాక్టర్తో ఢీకొట్టి, అనంతరం హంద్రీ–నీవా కాలవలో పడేసినట్లు గుర్తించారు. గురువారం కసాపురం పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ ఎన్.ప్రవీణ్కుమార్ వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు.. కర్నూలు జిల్లా మద్దికెరకు చెందిన తిరుమలరెడ్డి గుంతకల్లులోని తిలక్నగర్లో నివాసముంటున్నాడు. ‘బీవీఆర్ న్యూస్ టుడే’ పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహించేవాడు. గుంతకల్లు మండలం సంగాల గ్రామానికి చెందిన జీవన్కుమార్ తన నాలుగు ఎకరాల పొలం పక్కనే ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటుండగా, ఈ విషయమై తిరుమలరెడ్డి, జీవన్కుమార్కు మధ్య వివాదం చోటుచేసుకుంది. తనకు డబ్బు ఇవ్వకుంటే కథ చూస్తానంటూ జీవన్కుమార్ను తిరుమలరెడ్డి వేధించేవాడు. దీంతో ఒప్పందం కుదుర్చుకుని కొంత డబ్బును జీవన్కుమార్ చెల్లించాడు. అయితే, అక్కడితో ఆగకుండా తహసీల్దార్కు తిరుమలరెడ్డి ఫిర్యాదు చేయడంతో జీవన్కుమార్ కక్ష పెంచుకున్నాడు. బోయ రామాంజినేయులు, బోయ రామన్నతో కలిసి తిరుమలరెడ్డి హత్యకు పథకం రచించాడు. ఈ నెల 17న ఉదయం తన ఇంటి నుంచి బైకుపై పొలానికి బయలుదేరిన తిరుమలరెడ్డిని కసాపురం సమీపంలోని హంద్రీ–నీవా కాలువ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ట్రాక్టర్తో బలంగా ఢీకొట్టారు. దీంతో స్పృహ కోల్పోయిన తిరుమలరెడ్డిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి హంద్రీ–నీవా కాలువలో పడేసి పరారయ్యారు. మృతుడి భార్య రామేశ్వరి ఫిర్యాదు మేరకు డీఎస్పీ ఏ.శ్రీనివాస్ నేతృత్వంలో ముమ్మరంగా విచారణ చేపట్టినట్లు సీఐ తెలిపారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయ సమీపంలో నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు సీఐ వివరించారు. యూట్యూబ్ చానల్ నిర్వాహకుడి హత్య కేసులో ముగ్గురి అరెస్ట్ -
యూరియా పంపిణీలో విఫలం
కర్నూలు(అర్బన్): నంద్యాల జిల్లాలో రబీ రైతులకు యూరియాను అందించడంలో వ్యవసాయ శాఖ అధికారులు విఫలమయ్యారని జెడ్పీ చైర్మన్ యర్ర బోతుల పాపిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జెడ్పీలో స్థాయీ సంఘ సమావేశాలు హుందాగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతులకు అన్ని విత్తనాలు రైతు భరోసా కేంద్రా ల్లో ఎంతో పారదర్శకంగా పంపిణీ అయ్యేవని గుర్తు చేశారు. ప్రస్తుతం రైతు అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా చేయలేక పోవడంతో బహిరంగ మార్కెట్లో అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. జనవరి నెల నుంచి యూరియాకు సంబంధించిన వరుస కథనాలు పత్రికల్లో ప్రచురితమవుతున్నా .. ఎందుకు చర్యలు చేపట్టలేక పోతున్నారని నంద్యాల వ్యవసా య శాఖ అధికారి మురళీకృష్ణపై జెడ్పీ చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో వరి సాగు పెరిగిందని, సాధారణ సాగు 27 వేల హెక్టార్లు కాగా, ఈ ఏడాది సాగు విస్తీర్ణం 37 వేలకు పెరిగిందని వ్యవసాయ శాఖ అధికారి ఇచ్చిన సమాధానంపై చైర్మన్ పాపిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. డిమాండ్కు అనుగుణంగా ముందుగానే యూరియాను ఎందు కు తెప్పించలేక పోయారని అసహనం వ్యక్తం చేశారు. ఆర్బీకేల ద్వారా ఒక బస్తాను రూ.267కు అందించాల్సి ఉండగా, బయటి మార్కెట్లో రైతులు ఒక బస్తా యూరియాను రూ.350 నుంచి రూ.400 పెట్టి కొనుగోలు చేస్తున్నారన్నారు. ఇందుకు బాధ్యులెవరని ఆయన ప్రశ్నించారు. మిర్చి ధరల పతనంపై సుదీర్ఘ చర్చ జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో రాష్ట్రంలో మిర్చి ధరలు పతనం కావడంపై సుదీర్ఘ చర్చ జరిపారు. జిల్లాలో సాధారణంగా 95 వేల నుంచి ఒక లక్ష ఎకరాల వరకు మిర్చి పంటను వేసేవారని, గత ఏడాది ధరలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది 1.43 లక్షల ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారని హార్టికల్చర్ అధికారిణి సమాధానం ఇచ్చారు. గతేడాది ఒక క్వింటాలు రూ.23 వేల వరకు ధర పలికిందని, ఈ ఏడాది ఒక క్వింటాలు రూ.11 వేలు కూడా లేదని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్యాపిలి జెడ్పీటీసీ బీ శ్రీరాంరెడ్డి తెలిపారు. అధికారుల సలహాల మేరకు వాడిన మందులతో తెగుళ్లు కూడా కంట్రోల్ కావడం లేదన్నారు. ధరలు పతనమైన నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ఏమి చేస్తే బాగుంటుందో తెలియజేయాలని ఆదోని ఎమ్మెల్యే బీ పార్థసారథి కోరారు. ఎకరాకు రూ.10 వేలు నష్ట పరిహారం అందించే ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్దామన్నారు. నాపరాయి పరిశ్రమలను ఆదుకోవాలి జిల్లాలో మానవీయ కోణంలో నాపరాయి పరిశ్రమలను ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి కోరారు. మేజర్ మినరల్స్ను దృష్టిలో ఉంచుకొని ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న నాపరాయి పరిశ్రమలపై విజిలెన్స్ దాడులు చేయడం శోచనీయమన్నారు. ఈ పరిశ్రమలకు రాయల్టీ ఫీజును కూడా తొలగించాలని, కేవలం ఉపాధి రంగంగా చూస్తు అవసరమైన మేర ప్రభుత్వం రాయితీలు ప్రకటించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక పథకాలు విజయవంతం అయ్యేందుకు బ్యాంకర్లు తమ వంతు సహకారం అందించలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నీటి పారుదల, తాగునీరు, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, సీ్త్ర శిశు సంక్షేమం, గృహ నిర్మాణం, డ్వామా తదితర ప్రభుత్వ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డితో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, జెడ్పీటీసీలు హాజరయ్యారు. ఆరోగ్యశ్రీలో భారీగా అక్రమాలు నంద్యాల వ్యవసాయ అధికారిపై జెడ్పీ చైర్మన్ ఆగ్రహం మిర్చి ధరల పతనంపై సుదీర్ఘ చర్చ ఆరోగ్యశ్రీలో భారీగా అక్రమాలు: ఎమ్మెల్యే పార్థసారథి హుందాగా సాగిన జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలుపేదలకు అందించే వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీలో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ బీ పార్థసారథి ఆరోపించారు. గ్రామీణ ప్రాంత ప్రజల అమాయకత్వం, నిరక్షరాస్యత, వ్యాధి తీవ్రతను ఆసరాగా చేసుకొని పలు ఆసుపత్రులు కోట్ల రూపాయాలను అక్రమంగా ఆర్జిస్తున్నాయన్నారు. గత ఆరు నెలలుగా జిల్లాకు రూ.118 కోట్లు ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం నుంచి బిల్లుల రూపంలో విడుదలయ్యాయని, ఇంతకు రెండింతలు పలు ఆసుపత్రులు ప్రజల నుంచి అక్రమంగా వసూలు చేసి ఉంటాయన్నారు. ఆరోగ్యశ్రీపై ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖకు చెందిన అధికారులపై ఉందన్నారు. ఏ మేరకు అవగాహన కల్పించారనే విషయాన్ని వచ్చే సమావేశంలో తనకు సమాధానం చెప్పాలన్నారు. అలాగే జిల్లాకు సంబంధించిన అనేక మంది మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు వెళ్లి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, హైదరాబాద్లో ఆరోగ్యశ్రీపై వైద్యం చేసే ఆసుపత్రులకు సంబంధించి కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. -
రేపు జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
కోవెలకుంట్ల: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో జిల్లా టీ–20 క్రికెట్ జట్టును శనివారం ఎంపిక చేయనున్నట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శులు అద్వైత్, ఉసేన్వలి తెలిపారు. గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. టీ–20 క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్–16, అండర్–19, సీనియర్స్ విభాగాల్లో క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు. క్రీడాకారులు ఇతర వివరాలకు 8464942920, 9701515415 నంబర్లకు సంప్రదించాలని సూచించారు. ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని తరలించొద్దు ● రాయలసీమ అభివృద్ధి వేదిక నాయకుల డిమాండ్ కర్నూలు(అగ్రికల్చర్): ఆంధప్రగతి గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ) ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించాలని, అమరావతికి తరలించొద్దని రాయలసీమ అభివృద్ధి వేదిక నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఏపీజీబీ రీజినల్ కార్యాలయం దగ్గర వాల్ పోస్టర్లను ఆ వేదిక నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్శర్మ, నాగరాజు, భాస్కరరెడ్డి, సునయ్కుమార్, జంద్యాల రఘుబాబు, అంజిబాబు మాట్లాడుతూ.. కడపలో ఉన్న ఏపీజీబీ ప్రధాన కార్యాలయంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు, అది అక్కడే ఉంటే రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి అవకాశం ఉంటుందన్నారు. ఆర్థిక శాఖ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కూలీల కష్టం దగ్ధం ఆస్పరి: మండలంలోని బిల్లేకల్లు గ్రామంలో ఉచ్చీరప్ప, అతని భార్య కూలి పనిచేసి సంపాదించినంతా అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. కూడపెట్టుకున్న డబ్బు, బంగారం, మోటార్సైకిల్ అగ్నికి ఆహుతయ్యాయి. ఆ కుటుంబ పరిస్థితి చూసి గ్రామస్తులు అయ్యో పాపం అంటున్నారు. గత 15 రోజుల క్రితం బిల్లేకల్లు గ్రామంలోని గుడిసెకు తాళం వేసి ఉచ్చీరప్ప, అతని భార్య, కుమార్తె గుంటూరు దగ్గర మిర్చి కోతకు వలస వెళ్లారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో గుడిసె నుంచి గురువారం మంటలు చెలరేగడంతో సమీపంలోని వారు గుర్తించారు. మంటల్లో మూడు తులాల బంగారం, రూ.50వేలు నగదు, ఒక మోటార్ సైకిల్, దుస్తులు, గింజలు పూర్తిగా కాలిపోయాయి. గ్రామస్తులు విద్యుత్ సరఫరాను నిలిపి వేసి మంటలను అర్పివేశారు. నష్టపోయిన బాధితున్ని ప్రభుత్వం ఆదుకోవాలి గ్రామస్తులు కోరుతున్నారు. -
కర్నూలు వ్యవసాయ మార్కెట్ ధరలు (క్వింటాల్కు రూ.లలో)
పంట కనిష్టం గరిష్టం వేరుశెనగ 4,701 6,906 పొద్దుతిరుగుడు 5,029 5,029 ఆముదం 5,720 5,769 వాము 2,262 26,000 ఉల్లి 659 2,600 ఎండుమిర్చీ 4,129 12,910 శనగలు 2,009 5,899 కందులు 2,169 7,663 మొక్కజొన్న 2,089 2,210 మినుములు 4,709 7,729 కొర్రలు 2,163 3,281 సోయాచిక్కుడు 1,463 3,909 సజ్జలు 2,211 2,211ఫోన్ నం : 08518–257204, 257661 -
సారా తయారీ మానుకోకపోతే పీడీ చట్టం
కర్నూలు: సారా తయారీ, రవాణా, విక్రయాలు మానుకోకపోతే పీడీ చట్టంతో జైలుకు పంపుతామని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కర్నూలు అసిస్టెంట్ కమిషనర్ ఆర్.హనుమంతరావు హెచ్చరించారు. నవోదయం 2.0లో భాగంగా కర్నూలులోని బంగారుపేటలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ నీలిషికారీలు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను ఎంచుకోవాలన్నారు. సారా తయారీ మానుకోకపోతే అలాంటి వారి జాబితాను తయారు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రాజశేఖర్ గౌడ్, సీఐలు జయరాం నాయుడు, సుభాషిణి, చంద్రహాస్, ఎస్ఐ రెహనా బేగం పాల్గొన్నారు. వృద్ధుడి అనుమానాస్పద మృతి కోసిగి: స్థానిక రైల్వే గేటు సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడు (65) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రైల్వే ట్రాక్కు కొంత దూరంలో ముళ్ల పొదల మధ్య పడి ఉన్నాడు. మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు. గుండెపోటుకు గురై మృతి చెందాడా..ఇతర కారాణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం పోలీసులు తేల్చాల్సి ఉంది. మృతదేహాన్ని స్థానికులు గమనించి కోసిగి పోలీసులకు సమాచారం అందించగా స్థలానికి చేరుకున్నారు. స్థలం రైల్వే లైన్ పరిధిలో ఉండడంతో రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు దర్యాప్తు చేసి మృతికి కారాణాలు తేల్చాల్సి ఉంది. -
కుక్కల దాడిలో 15 గొర్రెల మృతి
తుగ్గలి: కుక్కలు దాడి చేయడంతో 15 గొర్రెలు మృతి చెందగా.. మరో 15 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ ఘటన జొన్నగిరి గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. రైతు ఉల్సాల అంజినయ్య షెడ్లో గొర్రెలు ఉంచగా కుక్కలు ప్రవేశించి దాడి చేశాయి. తనకు రూ.3లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు తెలిపారు. నాపరాతి గని గుంతలో పడివృద్ధుడి మృతి కొలిమిగుండ్ల: అంకిరెడ్డిపల్లెకు చెందిన వృద్ధుడు మంజుల బొజ్జన్న(72) గని గుంతలో పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఐదు రోజుల క్రితం బొజ్జన్న చింతలాయిపల్లె రోడ్డులో ఉన్న మద్యం దుకాణానికి వెళ్లి తిరిగి రాలేదు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతికినా ఆచూకీ కనిపించలేదు. గురువారం గనుల సమీపంలో గొర్రెలు కాపారులు వ్యక్తి మృతదేహాన్ని గుర్తించడంతో వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి గ్రామంలో విచారించారు. చనిపోయినది బొజ్జన్నగా అతని కుటుంబీకులు గుర్తించారు. మద్యం తీసుకొని ఇంటికెళ్తూ మార్గమధ్యలో నాపరాతి గని రాళ్లగుట్ట వద్ద కాలుజారి గని గుంతలో పడి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వృద్ధుడి ఆత్మహత్య ఆత్మకూరురూరల్: నల్లకాల్వ సమీపంలోని వైఎస్సార్ స్మృతి వనం వద్ద ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిడుతూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన జూపల్లి బాలన్న (65) గురువారం స్మృతివనం ప్రహరీకి తాడుతో ఉరేసుకుని మృతి చెందాడు. సెక్యూరిటీ సిబ్బంది గమనించి ఆత్మకూరు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్ఐ నారాయణ రెడ్డి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆత్మకూరు ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహం ఫొటోను పోలీసు, మీడియా వాట్సప్ గ్రూపుల్లో ఉంచడంతో చివరకు ఆచూకీ లభించింది. కుటుంబీకులు గుర్తించి ఆత్మకూరు చేరుకున్నట్లు సీఐ రాము తెలిపారు. వృద్ధుడి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. కాల్వలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్ ● డ్రైవర్ సురక్షితం పాణ్యం: ఓ ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ కాల్వలో దూసుకెళ్లింది. ట్రాక్టర్లో నుంచి దూకి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. మండల కేంద్రమైన పాణ్యం సమీపంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. హైవే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జాతీయ రహదారి మరమ్మతుల కారణంగా వన్వేను ఏర్పాటు చేశారు. ఎస్సార్బీసీ ప్రధాన కాల్వలపై ఉన్న బ్రిడ్జి ఇరుకుగా ఉంది. ఈ బ్రిడ్జిపైనే వన్వే ఏర్పాటు చేశారు. పాణ్యం గ్రామానికి చెందిన నడిపెన్న ట్రాక్టర్ను ఈ తోవలోనే తోలుతున్నాడు. ప్రమాదశాత్తు ట్రాక్టర్ కాల్వలోకి దూసుకెళ్లగా ఆయన కిందకు దూకడంతో ఎలాంటి గాయాలు కాలేదు. -
మల్లన్నకు పట్టువస్త్రాలు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. బుధవారం శ్రీకాళహస్తి దేవస్థాన ఉప కార్యనిర్వహణాధికారి ఎన్.ఆర్.కృష్ణారెడ్డి, ప్రధానార్చకులు సంబంధం గురుకుల్, అర్చకులు, వేదపండితులు, సిబ్బంది పట్టువస్త్రాలతో శ్రీశైలం చేరుకున్నారు. ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి శ్రీశైల దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు, అధికారులు, అర్చకులు శ్రీకాళహస్తి దేవస్థాన అధికారులకు స్వాగతం పలికారు. అనంతరం శ్రీకాళహస్తి దేవస్థాన అధికారులు, వైదిక సిబ్బంది మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి, వస్త్ర సమర్పణ చేశారు. -
స్కూటర్ మంజూరైందంటూ మోసం ..!
మద్దికెర: ‘మేము కర్నూలు నుంచి మాట్లాడుతున్నాం. గవర్నమెంట్ మీకు స్కూటర్ మంజూరు చేసింది. కొంత మొత్తం చెల్లిస్తే మీకు కేటాయిస్తాం’ అంటూ దివ్యాంగులను నమ్మించి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మద్దికెర గ్రామానికి చెందిన దివ్యాంగులు రామకృష్ణ, శ్రీలక్ష్మి, ఆదిలక్ష్మి మరో ఇద్దరికి 9642076467, 6364506562 నంబర్ల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. ‘మీకు ప్రభుత్వం త్రిచక్ర వాహనం మంజూరు చేసింది. కొంత మొత్తం చెల్లిస్తే మీ ఇంటికి స్కూటీ వస్తుంద’ని మూడు రోజుల క్రితం నమ్మించారు. వారి మాటలను నమ్మి ముగ్గురు దివ్యాంగులు మొత్తం రూ. 20 వేలు ఫోన్ పే చేశారు. ఆ తర్వాత రోజు నుంచి ఆ నంబర్లకు ఫోన్ చేసినా ఎటువంటి సమాధానం లేకపోవడంతో మోసపోయామని తెలుసుకుని బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దివ్యాంగులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వీరాంజి, అంజనేయులు, మల్లికార్జున కోరారు. -
సమష్టిగా ఆర్యూ అభివృద్ధికి కృషి
● నూతన వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ వెంకట బసవరావు కర్నూలు కల్చరల్: సమష్టిగా రాయలసీమ యూనివర్సిటీని అభివృద్ధి చేద్దామని వర్సిటీ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ వి. వెంకట బసవ రావు అన్నారు. బుధవారం వీసీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ ఎన్టీకే నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ విజయకుమార్ నాయుడు, వర్సిటీ సైన్స్, ఆర్ట్స్ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఆచార్య సీవీ కృష్ణారెడ్డి, ఆచార్య ఎన్.నరసింహులు, డీన్ ఆప్ ఎగ్గామినేషన్స్ ఆచార్య పీవీ సుందరానంద్, రీసర్స్ డైరెక్టర్ ఆచార్య సి. విశ్వనాథరెడ్డి, డీన్ ఆఫ్ అకడమిక్ అఫైర్స్ ఆచార్య ఆర్. భరత్కుమార్ ఆర్యూసీఈ ప్రిన్సిపాల్ డాక్టర్ హరి ప్రసాద్ రెడ్డి తదితరులు నూతన వీసీని కలిసి బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ రాబోయే మూడేళ్లలో విశ్వవిద్యాలయం అభివృద్ధికి పారదర్శకంగా ఉంటూ శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. వర్సిటీలో జరిగే ప్రతి విషయాన్ని సమాజం గమనిస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించాలన్నారు. అకడమిక్ క్యాలండర్ను తప్పనిసరిగా పాటించాలన్నారు. వర్సిటీ ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
సకల దేవతలూ.. రారండి!
● శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం ● యాగశాలలో ప్రత్యేక పూజలు ● ఘనంగా ధ్వజారోహణ ● నేడు భృంగివాహనసేవశ్రీశైలంటెంపుల్: శ్రీశైల మల్లన్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలూ.. రారండంటూ దేవస్థాన అధికారులు, ఆలయ అర్చకులు ఆహ్వానం పలికారు. బ్రహ్మోత్సవాలకు సారథ్యం వహించాల్సిందిగా బ్రహ్మ దేవుడిని, స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవంలో కన్యాదానం చేసేందుకు మహావిష్ణువును రావాలని ఆహ్వానించారు. పరమశివుడి వాహనమైన నందిని చిత్రీకరించిన ధ్వజపటాన్ని ఆవిష్కరించారు. శ్రీశైలంలో మల్లన్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఆగమశాస్త్రానుసారంగా ఉత్సవ ప్రారంభ పూజలు జరిపారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, అర్చకులు, వేదపండితులు, అధికారులు సంప్రదాయబద్ధంగా ఆలయ ప్రాంగణంలోని స్వామివార్ల యాగశాల ప్రవేశం చేశారు. వేదపండితులు చతుర్వేదపారాయణలు చేశారు. లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ బ్రహ్మోత్సవ సంకల్పాన్ని అర్చకులు పఠించారు. తరువాత పుణ్యాహవచనం, చండీశ్వరపూజ జరిపించారు. అనంతరం కంకణాలకు శాస్త్రోక్తంగా పూజాదికాలు జరిపి కార్యనిర్వహణాధికారి కంకణాన్ని ధరించారు. అనంతరం బ్రహ్మోత్సవ క్రతువులకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. 7గంటలకు ధ్వజారోహణ, భేరిపూజ కార్యక్రమాలు నిర్వహించి సకల దేవతలకు ఆహ్వాన సూచికగా ధ్వజాపటాన్ని ఆవిష్కరించారు. నేడు భృంగివాహనసేవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి భృంగివాహనసేవలో భక్తులకు దర్శనమిస్తారు. గ్రామోత్సవం నిర్వహిస్తారు. -
సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. వామపక్షాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్దేశాయ్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. మునెప్ప మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ను సవరించైనా ఆంధ్రప్రదేశ్కు నిధులు కేటాయించాలన్నారు. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే జోన్ల కోసం నిధులను సాధించడంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. కడప స్టీలు ప్లాంటు కోసం నిధులను రాబట్టడంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధికి రూ.10 వేల కోట్లను కేటాయించాలన్నారు. జిల్లా పశ్చిమ ప్రాంతంలోని వలసల నివారణకు వెంటనే పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు. వామపక్ష పార్టీల నాయకులు రాజశేఖర్, రామకృష్ణారెడ్డి, రాముడు, విజయ్, షరీప్, అబ్దుల్దేశాయ్, రామకృష్ణ పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా -
పెళ్లీడు వచ్చిన తర్వాతే వివాహం చేయాలి
కర్నూలు(హాస్పిటల్): అమ్మాయిలకు పెళ్లీడు (18 ఏళ్లు) వచ్చిన తర్వాతే వివాహం చేయాలని జిల్లా మాస్ మీడియా అధికారి శ్రీనివాసులు శెట్టి అన్నా రు. బుధవారం డాక్టర్స్ కాలనీలోని యూపీహెచ్సీలో జరుగుతున్న టీకాల కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణి, పిల్లలు వ్యాధుల బారిన పడకుండా వ్యాధినిరోధక టీకాలు రక్షణ కల్పిస్తాయన్నారు. వీటి వల్ల భవిష్యత్లో పిల్లలు ప్రాణాంతక వ్యాధుల బారి నుంచి రక్షణ కలుగుతుందని చెప్పారు. అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు వచ్చిన తర్వాత మాత్రమే వివాహాలు చేయాలన్నారు. టీనేజీలో గర్భధారణ వల్ల గర్భస్రావం, మృతశిశువు జననం, బరువు తక్కువ పిల్లలు జన్మించడం, తల్లికి తీవ్ర రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డెమో చంద్రశేఖర్రెడ్డి, ఆరోగ్య విద్యాబోధకురాలు పద్మావతి, ఆరోగ్య కార్యకర్తలు నిర్మలాబాయి, మయూరి, ఆశా కార్యకర్త ఉమా మహేశ్వరి పాల్గొన్నారు. శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.29 కోట్లు మంత్రాలయం: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి శ్రీమఠం హుండీ ఆదాయం రూ. 3.29 కోట్లు లభించిందని మఠం అధికారులు తెలిపా రు. గత 23 రోజులకు సంబంధించి భక్తులు సమ ర్పించిన కానుకలు లెక్కించగా రూ.3,21,05,005 నగదు, రూ.8,10,100 నాణేలు, 58.150 గ్రాము ల బంగారు బంగారం, 1,280 గ్రాముల వెండి వచ్చినట్లు తెలిపారు. నేడు జెడ్పీ స్థాయీసంఘ సమావేశాలు కర్నూలు(అర్బన్): జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వుల మేరకు గురువారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో నిర్వహించే ఈ సమా వేశాల్లో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘి క సంక్షేమం, విద్య, వైద్యం, మహిళాభివృద్ధి – శిశు సంక్షేమం, పనులు – ఆర్థిక ప్రణాళిక తదితర శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్ష చేస్తారన్నారు. ఈ నేపథ్యంలోనే వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు తమకు కేటాయించిన సమయానికి ఆయా స్థాయీ సంఘ సమావేశాలకు హాజరు కావాలని సీఈఓ కోరారు. సబ్ డివిజన్ పిటిషన్లను త్వరగా పరిష్కరించండి కర్నూలు(సెంట్రల్): రీసర్వే జరిగిన గ్రామాల్లో సబ్ డివిజన్, ఎఫ్లైన్లకు సంబంధించిన పిటిషన్లను త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సీసీఎల్ఏ కమిషనర్ జయలక్ష్మీ కలెక్టర్ను ఆదేశించారు. బుధవారం విజయవాడ నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రీసర్వేపై కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పైలట్ ప్రాజెక్టు కింద రీసర్వే జరుగుతున్న గ్రామాల్లో పెండింగ్లో ఉన్న బ్లాక్ బౌండరీలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పి.రంజిత్బాషా, జేసీ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, సర్వే ఏడీ మునికన్నన్ పాల్గొన్నారు. కృష్ణమ్మను వీడుతున్న సంగమేశ్వరుడు కొత్తపల్లి: ప్రాచీన సంగమేశ్వరాలయం మరి కొద్ది రోజుల్లో పూర్తిగా జలాధివాసం వీడనుంది. గతేడాది జూలై నెల చివర్లో ఈ ఆలయం కృష్ణాజలాల్లో మునిగింది. ప్రస్తుతం శ్రీశైల జలాశయం నీటిమట్టం తగ్గుతుండటంతో ఏడు నెలల పాటు జాలాధివాసంలో ఉన్న ఈ ఆలయ గోపురాలు బయటపడ్డాయి. బుధవారం నాటికి శ్రీశైలం డ్యామ్లో నీటి మట్టం 850 అడుగులకు చేరడంతో ప్రాచీన ఆలయం ప్రహరీ బయట పడింది. -
పొరపాట్లకు తావు లేకుండా రీసర్వే
● అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా కర్నూలు(సెంట్రల్): పొరపాట్లకు తావులేకుండా రీసర్వే చేపట్టాలని రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు నిర్వహణపై కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో రెవెన్యూ, సర్వే సిబ్బందికి బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మండలానికి ఒక గ్రామంలో రీసర్వే చేపట్టారన్నారు. స్టాండర్ ఆపరేషన్ ప్రొసిజర్ను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని సర్వేయర్లు, వీఆర్వోలకు సూచించారు. ఆస్తి బదలాయింపులో ఎన్నో జీవితాలు ఆధారపడి ఉంటాయని, ఈ ప్రక్రియను చేపట్టేటప్పుడు అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జీఓ నంబర్ 30 ప్రకారం అనధికార, అభ్యంతరం లేని ఆక్రమణల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు. జేసీ డాక్టర్ బి.నవ్య, ఆదోని సబ్కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, కర్నూలు ఆర్డీఓ సందీప్కుమార్, సర్వే ఏడీ మునికన్నన్ పాల్గొన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత శ్రీశైలంటెంపుల్/ శ్రీశైలం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు నంద్యాల జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. బుధవారం శ్రీశైలంలో ఆయన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ క్యూలు, ఆలయ పరిసరాలు, శివస్వాముల ప్రత్యేక క్యూలైన్, స్నాన ఘట్టాలు, రథ మండపం, కమాండ్ కంట్రోల్ రూం, శ్రీశైలం డ్యాం, ఘాట్రోడ్డు మొదలైన ప్రదేశాల్లో పర్యటించారు. అనంతరం భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆయన వెంట నంద్యాల అడిషనల్ ఎస్పీ యుగంధర్బాబు, ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్, శ్రీశైలం సీఐ ప్రసాదరావు, చంద్రబాబు, సురేష్కుమార్రెడ్డి, దేవస్థాన ఈఈ మురళీ పాల్గొన్నారు. వెబ్సైట్లో ఫార్మసీ ప్రొవిజనల్ మెరిట్ జాబితా కర్నూలు(హాస్పిటల్): కడప జోన్–4 పరిధిలోని ఫార్మసీ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ప్రొవిజినల్ మెరిట్ జాబితాను https://cfw.ap.gov.in వెబ్సైట్లో ఉంచినట్లు వైద్య ఆరోగ్యశాఖ ఆర్డీ డాక్టర్ రామగిడ్డయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే వెబ్సైట్లో ఉంచిన అభ్యర్థన పత్రంలో స్వయంగా కడపలోని ప్రాంతీయ కార్యాలయంలో ఈ నెల 22వ తేదీలోపు సమర్పించాలన్నారు. గడువు తీరిన తర్వాత వచ్చిన అభ్యర్థనలను పరిగణలోకి తీసుకోబడవన్నారు. ఫైనల్ మెరిట్ జాబితాను ఈ నెల 28వ తేదీన ప్రదర్శిస్తామన్నారు. -
కలెక్టర్కు ఫిర్యాదు
ఇళ్ల స్థలాల కోసం ఇచ్చిన భూమి ఆక్రమణకు గురైందని పేర్కొంటూ నాలుగు నెలల క్రితం పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి నేతృత్వంలో పేదలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదును కలెక్టర్ పరిశీలన నిమిత్తం ఓర్వకల్లు తహసీల్దార్కు సిఫారసు చేశారు. దీంతో కథ కంచికి చేరినట్లు..అక్కడి నుంచి ఒక్క అడుగు ముందుకు కదలడంలేదు. ఫిర్యాదుపై ఏమి చర్యలు తీసుకున్నారో ఎవరినీ అడిగినా అధికారులు సమాధానం చెప్పడం లేదు. దీనిపై తాము ఏమి చేయలేమని చేతులు ఎత్తేస్తున్నారు. దీంతో బాధితులు అధికారుల చుట్టూ తిరిగి అలసి పోయారు. వారికి న్యాయం మాత్రం దొరకడంలేదు. -
భూ రీసర్వేను వేగవంతం చేయాలి
కోడుమూరు రూరల్: భూ రీసర్వేను వేగవంతం చేయాలని రెవెన్యూ సిబ్బందిని జాయింట్ కలెక్టర్ నవ్య ఆదేశించారు. బుధవారం మండలంలోని ఎర్రదొడ్డిలో జరుగుతున్న భూ రీసర్వేను జాయింట్ కలెక్టర్ నవ్య, ట్రైనీ కలెక్టర్ చల్ల కళ్యాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు, రెవెన్యూ సిబ్బందితో మాట్లాడారు. భూరీసర్వే కార్యక్రమంలో చాలా నిదానంగా ఉందని, వేగవంతం చేయాలని తహసీల్దార్ వెంకటేష్ నాయక్, మండల సర్వేయర్ సునీల్ కుమార్ను జేసీ ఆదేశించారు. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో సర్వే ఏడీ మునికన్నన్, వీఆర్వోలు, సర్వేయర్లు పాల్గొన్నారు. -
రైతన్నల పరిస్థితి దుర్భరం
పాణ్యం: దేశానికి అన్నంపెట్టే రైతన్నల పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో దుర్భరంగా మారిందని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాల్సిన కూటమి సర్కారు చోద్యం చూస్తోందని మండిపడ్డారు. బుధవారం తమ్మరాజుపల్లె కొండలపై వెలసిన కొండ మల్లేశ్వరస్వామి ఆలయంలో ఆయన పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాటసాని మాట్లాడుతూ రైతును గతంలో ఎన్నడూ లేని విధంగా దళారీల చేతికి అప్పగించారన్నారు. దీంతో వారు అడిగిన ధరకే పంట ఉత్పత్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అధికారంలోకి వచ్చి 9 నెలలవుతున్నా కూటమి సర్కారు రైతుకు పైసా సాయం చేయలేదని మండిపడ్డారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 20 వేలు ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించి నేటికీ అమలు చేయకుండా రైతులను చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఉండేదని, ఏటా పంటపెట్టుబడికి రైతు భరోసా పథకం కింద సాయం అందేదని చెప్పారు. ఇప్పుడు సాయం దేవుడెరుగు కనీసం రైతుల గోడు కూడా బాబు సర్కారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీల అమలుకు రైతుల పక్షాన వైఎస్సార్సీపీ పోరాడుతుందని చెప్పారు. ఏ పంటకు మద్దతు ధర లేదు కూటమి సర్కారు పట్టనట్టు వ్యవహరిస్తోంది వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని -
మైనింగ్ యజమానులపై జీఎస్టీ భారం
కొలిమిగుండ్ల: నాపరాతి గనుల యజమానులపై జీఎస్టీ రూపంలో మరో భారం పడుతుంది. ఇప్పటికే ఈ పరిశ్రమ నష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. తాజాగా మూడేళ్ల నుంచి బకాయి ఉన్న జీఎస్టీ చెల్లించాలని యజమానులకు కర్నూలులోని జీఎస్టీ కార్యాలయం నుంచి నోటీసులు అందుతున్నాయి. నాపరాతి గనుల తవ్వకాల కోసం లీజు అనుమతి, మైనింగ్ ప్లాన్, ఎన్విరాల్మెంట్ క్లియరెన్స్ (ఈసీ) ఉన్న యజమానులు బనగానపల్లె నియోజకవర్గ వ్యాప్తంగా 40 మంది ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీరికి మాత్రమే ఆన్లైన్లో రాయల్టీలు మంజూరు చేస్తుంది. నియోజకవర్గంలో చాలా మందికి లీజులు ఉన్నప్పటికి ఈసీ, మైనింగ్ ప్లాన్ లేదనే కారణంతో ఆన్లైన్ రాయల్టీలు నిలుపదల చేసింది. 2020–21–2021–22–2022–23 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి జీఎస్టీ బకాయిలు చెల్లించాలని యజమానులకు పోస్టల్ ద్వారా నోటీసులు పంపుతున్నారు. అంకిరెడ్డిపల్లెకు చెందిన మైనింగ్ యజమాని కొప్పుల చంద్రశేఖర్రెడ్డి రూ.3.64 లక్షలు బకాయి చెల్లించాలని ఇటీవలనే నోటీసు పంపించారు. మిగిలిన యజమానులకు ఒక్కొక్కరికి నోటీసులు అందుతున్నాయి. నాపరాళ్లు వెలికి తీసి రవాణా చేసేందుకు ఆన్లైన్ రాయల్టీలు పొందాల్సి ఉంటుంది. ప్రతి రాయల్టీపై యజమానులు రాష్ట్ర ప్రభుత్వానికి సీనరేజ్, డీఎంఎఫ్ తదితర పన్నులు చెల్లిస్తుంటారు. కానీ జీఎస్టీ ఎప్పటికప్పుడు వాటితో పాటే వసూలు చేయకుండా పెండింగ్ పెట్టి ఒకే సారి లక్షల్లో చెల్లించాలని చెప్పడంతో యజమానులకు దిక్కుతోచడం లేదు. గత మూడేళ్ల నుంచి నిమ్మకుండి ఆర్థిక సంవత్సరం ముగిసే సమయంలో వసూలు చేసేందుకు సెంట్రల్ జీఎస్టీ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది. పోటీ ప్రపంచంలో నాపరాళ్ల పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా ఉన్న తరుణంలో మళ్లీ జీఎస్టీ రూపంలో యజమానులపై పిడుగు పడటంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత మూడేళ్ల బకాయిలు చెల్లించాలని నోటీసులు సర్కారు నిర్ణయంతో నాపరాళ్ల పరిశమ్ర మనుగడపై తీవ్ర ప్రభావం -
బీసీ కులగణనపై నేడు రౌండ్ టేబుల్ సమావేశం
కర్నూలు(అర్బన్): రాష్ట్రంలో బీసీ కులగణనపై ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటలకు స్థానిక బీసీ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ నక్కలమిట్ట శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కులగణనతో పాటు రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన మేధావులు, బీసీ సంఘాల నాయకులు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల్లోని బీసీ నేతలు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరు కావాలని కోరారు. -
అరకొర యూరియా.. అన్నదాత అవస్థలు
రైతులు పండించిన పంటలకు మార్కెట్లో మద్దతు ధర రావడం లేదు. వ్యవసాయ సీజన్కు కనీసం పెట్టుబడి సాయం కూడా అందడం లేదు. అవసరమైన ఎరువులు ఇవ్వడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. రైతు సేవా కేంద్రాలకు అరకొర యూరియా ఇస్తోంది. దీంతో ప్రైవేటు దుకాణాల వద్దకు వెళ్లి అన్నదాతలు అదనపు ధర చెల్లించి యూరియా తీసుకోవాల్సి వస్తోంది. రుద్రవరం మండల పరిధిలోని కోటకొండ రైతు సేవా కేంద్రానికి స్వల్పంగా 260 యూరియా బస్తాలు వచ్చాయి. అక్కడికి బుధవారం రైతులకు భారీగా తరలిరాగా.. ఒక్కొక్కరికి కేవలం మూడు బస్తాలు ఇచ్చారు. ఖరీఫ్లో తీవ్రంగా నష్టపోయామని, రబీలో వరి, మినుము, మొక్కజొన్న వేసినా యూరియా స్వల్పంగా ఇచ్చారని రైతులు అసహనం వ్యక్తం చేశారు. – రుద్రవరం -
వైభవంగా స్వాతి వేడుకలు
ఆళ్లగడ్డ: అహోబిలం క్షేత్ర పరిధిలో కొలువైన నవనారసింహ క్షేత్రాలు భక్త జనసంద్రంగా మారాయి. స్వామి జన్మనక్షత్రమైన స్వాతి వేడుకలను పురస్కరించుకుని బుధవారం భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. గోవింద నామస్మరణతో నల్లమల పులకించి పోయింది. దిగువ అహోబిలంలో ఏర్పాటు చేసిన యాగశాలలో ఉత్సవమూర్తులైన శ్రీ పావన లక్ష్మీనృసింహస్వామిని, సుదర్శనమూర్తులను దేవాలయం ప్రధాన ద్వారం ఎదురుగా యాగశాలలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకించారు. నవకలశాలతో తిరుమంజనం నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టుపీతాంబరాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం వేద పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీ స్వాతి, శ్రీసుదర్శన హోమాలు వైభవోపేతంగా నిర్వహించారు. పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలు ప్రధానార్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మద్దిలేటిస్వామి ఆలయంలో..బేతంచెర్ల: మండల పరిధిలోని వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో మాఘ మాసాన్ని పురస్కరించుకొని స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి వేడుకలను బుధవారం వైభవంగా నిర్వహించారు. ఉప కమిషనర్, ఆలయ ఈఓ రామాంజనేయులు ఆధ్వర్యంలో వేదపండితులు జ్వాలాచక్రవర్తి శ్రీదేవి, భూదేవి సమేతుడైన మద్దిలేటి నరసింహస్వామికి సుప్రభాత సేవ, విశ్వక్సేనారాధన, వాసు దేవ పుణ్యహవచనం, సుదర్శన హోమం, నవ కలశ స్నపనం, నరసింహ హోమం, పంచామృత సహిత విశేష ద్రవ్య తిరుమంజనం, ధన్వంతరి మూల మంత్ర జపం చేశారు. తర్వాత అలంకార ప్రియుడైన స్వామి వారికి సహస్రదీపాలంకరణ సేవ నిర్వహించారు. ఆలయ మాడ వీధుల్లో గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాల మధ్యన రమణీయంగా ఊరేగింపు చేపట్టారు. -
శాశ్వత లోక్ అదాలత్లో విద్యార్థికి న్యాయం
కర్నూలు(సెంట్రల్): శాశ్వత లోక్ అదాలత్ను ఆశ్రయించిన విద్యార్థికి న్యాయం జరిగిందని ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు ఎం.వెంకట హరినాథ్ తెలిపారు. నంద్యాలకు చెందిన పి.వంశీ అనే విద్యార్థి 2022లో ఆర్జీఎం కాలేజీలో ఇంజినీరింగ్ చేరాడు. అయితే అతను 6 నెలలు మాత్రమే కాలేజీకి వచ్చి కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ప్రైవేట్ ఉద్యోగంలో చేరేందుకు యత్నించాడు. అయితే కళాశాలలోనే టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లు ఉండడంతో యాజమాన్యం నాలుగు సంవత్సరాలకు సంబంధించిన రూ.3 లక్షలు కడితే తప్ప సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పారు. అతను శాశ్వత లోక్ అదాలత్ను ఆశ్రయించాడు. ఈ కేసులో ప్రతివాది ఆర్జీఎం కళాశాలకు శాశ్వత లోక్ అదాలత్ జిల్లా అధ్యక్షుడు ఎం.వెంకట హరినాథ్, సభ్యులు శివశంకర్రెడ్డి, రాజుబాబుల ఆధ్వర్యంలో బెంచ్ నోటీసులు ఇచ్చి రాజీకుదర్చాయి. దీంతో బుధవారం పి.వంశీకి సర్టిఫికెట్లను ఇచ్చారు. -
కర్నూలు వ్యవసాయ మార్కెట్ ధరలు (క్వింటాల్కు రూ.లలో)
పంట కనిష్టం గరిష్టం వేరుశెనగ 2,222 7,077 పొద్దుతిరుగుడు 5,029 5,029 ఆముదం 5,659 5,805 వాము 2,001 25,140 ఉల్లి 680 2,821 ఎండుమిర్చీ 3,469 13,301 శనగలు 2,100 5,916 కందులు 2,000 7,478 మొక్కజొన్న 2,110 2,241 మినుములు 6,509 7,911 కొర్రలు 2,300 2,891 సోయాచిక్కుడు 1,463 3,909 సజ్జలు 2,111 2,189ఫోన్ నం : 08518–257204, 257661 -
యూరియా పంపిణీలో విఫలం
రైతులకు అవసరం మేరకు యూరియాను పంపిణీ చేయడంలో కూటమి సర్కారు విఫలమైందని పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని విమర్శించారు. అధికారపార్టీ నాయకులు, కొందరు దళారులు యూరియా కొరత సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారని, బస్తాపై రూ.150–200 అదనంగా వసూలు చేస్తున్నారని చెప్పారు. దీంతో సామాన్య రైతులకు యూరియా కొనుగోలు భారమైందన్నారు. ఇప్పటికై నా సర్కారు స్పందించి రైతులకు అవసరం మేరకు యూరియా అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ జెట్పీటీసీ సభ్యుడు సద్దల సూర్యనారాయణరెడ్డి, నంద్యాల జిల్లా పంచాయతీ రాజ్ అధ్యక్షడు రామలక్ష్మీయ్య, పిన్నాపురం సర్పంచ్ ఎల్లక్రిష్ణయ్య , కందికాయపల్లె సర్పంచ్ రామచంద్రుడు, శేషారెడ్డి, బాలిరెడ్డి, శేషు, రామకిట్టు, జయచంద్రారెడ్డి, శేషయ్య, చందమామబాబు, సుమంత్రెడ్డి, అమర్నాఽథ్రెడ్డి , గగ్గటూరు శ్రీనివాసరెడ్డి,సత్యాలు, వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం
పత్తికొండ రూరల్: ఉద్యాన పంటల సాగుపై ఆసక్తి ఉన్న రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తాయని ఉద్యానవన శాఖ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ ఉమాదేవి అన్నారు. పత్తికొండ రైతు సేవా కేంద్రంలో బుధవారం రైతులకు ఉద్యాన పంటల సాగు, ప్రోత్సాహకాలు తదితర అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉమాదేవి మాట్లాడుతూ పండ్లతోటలు ఉన్న రైతులకు ప్యాక్ హౌస్కు రూ.2 లక్షలు, పాంఫౌండ్ నిర్మాణానికి రూ.75 వేలు, ఉల్లి నిల్వ గోడౌన్కు రూ.80 వేలు సబ్సిడీ ఉంటుందన్నారు. అనంతరం సూక్ష్మ సేద్య పథకం గురించి వివరించారు. బిందు సేద్యానికి ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం రాయితీ వస్తుందన్నారు. బీసీ రైతులకు 90శాతం సబ్సిడీతో పరికరాలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారులు దస్తగిరి, జయరామిరెడ్డి, నాగసునీల్, ఖాజాహుసేన్, డీలర్లు పాల్గొన్నారు. అహోబిలేశుడి సేవలో.. ఆళ్లగడ్డ: అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వార్లను ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ రామ్సింగ్ బుధవారం దర్శించుకున్నారు. అహోబిలం చేరుకున్న ఆయనకు ప్రధానార్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. అనంతరం ఎగువ, దిగువ అహోబిలం క్షేత్రాల్లోని స్వామ, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆయనకు స్వామివార్ల శేషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట నంద్యాల ఈఈ శ్రీనిసారెడ్డి, ఆళ్లగడ్డ డీఈఈ రవికాంత్చౌదరి ఉన్నారు. మాతృ మరణాల శాతం తగ్గించాలి కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో మాతృ మరణాల శాతం తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వో డాక్టర్ పి. శాంతికళ అన్నారు. బుధవారం ఆమె తన చాంబర్లో మాతృమరణాలపై సమీక్ష నిర్వహించారు. కల్లూరు, నన్నూరు, హుసేనాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో సంభవించిన మూడు మాతృమరణాలపై ఆమె వివరాలు సేకరించారు. క్షేత్రస్థాయిలోని సిబ్బంది ఆశా, ఆరోగ్య కార్యకర్త, వైద్యాధికారులు గర్భిణులను గుర్తించి వారికి సకాలంలో వైద్యసేవలు అందించినట్లయితే తల్లుల మరణాల శాతం తగ్గించవచ్చన్నారు. ఒకవేళ హైరిస్క్ గర్భిణులను గుర్తించి సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ఏరియా ఆసుపత్రులు, ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స అందించాలన్నారు. సమావేశంలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల గైనకాలజీ హెచ్వోడి డాక్టర్ పద్మజ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్గర్ సుగుణ, డాక్టర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. -
మందుబాబులకు జరిమానా
కర్నూలు: రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ తనిఖీలు విస్తృతం చేశారు. ఇందులో భాగంగా మూడవ పట్టణ పోలీసులు 20 మంది మందుబాబులను బుధవారం అరెస్టు చేసి జేఎఫ్సీఎం కోర్టులో హాజరుపరిచారు. డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన ఐదుగురికి ఒక్కొక్కరికి రూ.3,500, ఓపెన్ డ్రింకింగ్లో పట్టుబడిన 15 మందికి ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్పై జిల్లా వ్యాప్తంగా నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని, మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్షతో పాటు వాహనం సీజ్ చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు. కేసీ కెనాల్లో యువకుని మృతదేహం గడివేముల: కరిమద్దెల గ్రామ సమీపంలోని కేసీ కెనాల్లో గుర్తుతెలియని యువకుని మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్ఐ నాగార్జున రెడ్డి బుధవారం తెలిపారు. యువకుడికి 30 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉంటుందని, బ్రౌన్ కలర్ టీ షర్టు, బ్లూ కలర్ ప్యాంటు ధరించారన్నారు. యువకుని పేరు, వివరాలు వెల్లడి కాలేదని చెప్పారు. వీఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వరకట్న వేధింపుల కేసులో జైలు శిక్ష కోవెలకుంట్ల: వరకట్న వేధింపుల కేసులో న్యాయస్థానం ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి బుధవారం తెలిపారు. కోవెలకుంట్ల పట్టణానికి చెందిన షేక్ అస్మా కౌసబ్ను అదనపుకట్నం కోసం వేధింపులకు గురి చేస్తుండటంతో 2020లో భర్త షేక్ జుబేర్ అక్రమ్, అత్త షేక్ ఫర్హద్ దుల్హాన్పై ఫిర్యాదు చేసింది. స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వరకట్నం కోసమే వేధించినట్లు సాక్ష్యాలు రుజువు కావడంతో న్యాయమూర్తి అబ్దుల్ రహిమాన్ ఇరువురి నిందితులకు ఏడాది జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ. 2,500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. వలస కూలీ మృతి కౌతాళం: జీవనోపాధి కోసం కుటుంబంతో సహా గుంటూరు జిల్లాకు వెళ్లిన వలస కూలి బుధవారం మృతి చెందారు. మృతుని బంధువులు తెలిపిన వివరాల మేరకు.. కౌతాళం మండలం సుళేకేరి గ్రామానికి చెందిన నగేష్(28)కు గ్రామంలో పనులు దొరకలేదు. గత నెలలో కుటుంబంతో సహా గుంటూరు జిల్లాకు వలస వెళ్లాడు. అక్కడ మిర్చి కోత పనులకు వెళుతూ కుటుంబంతో జీవనం కొనసాగించేవాడు. బుధవారం పనులకు ట్రాక్టర్లో వెళుతుండగా ప్రమాదవశత్తు ట్రాలీపై నుంచి నగేష్ కిందకు పడిపోయాడు. తోటి కూలీలు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఊరుకాని ఊరికి పొట్టకూటి కోసం వలస వస్తే ఇలా జరిగిందని భార్య మహేశ్వరమ్మ రోదిస్తున్న తీరు అందరిని కలిచి వేస్తున్నది. నగేష్కు ఒక కుమార్తె ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణంవెల్దుర్తి: రోడ్డు ప్రమాదంలో మద్దయ్య(40) అనే రైతు బుధవారం మృతి చెందారు. బోయినపల్లి గ్రామానికి చెందిన ఈయన పొగాకు బేళ్లను అమ్మేందుకు మోటారు సైకిల్పై ఓర్వకల్లుకు వెళ్లారు. తిరిగి మోటారు సైకిల్పై వస్తుండగా కలుగొట్ల గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో రైతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మద్దయ్యకు భార్య వెంకటేశ్వరమ్మ, ఇద్దరు సంతానం ఉన్నారు. -
వైఎస్సార్సీపీ నాయకుడిపై దాడి
కృష్ణగిరి: మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు సురేంద్రకుమార్ (సుభాష్)పై ఇదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు దామోదర్నాయుడు దాడికి పాల్పడ్డాడు. గ్రామస్తులు, బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. బుధవారం మధ్యాహ్నం సుభాష్ తన బైక్పై మరో వ్యక్తితో కలిసి వెల్దుర్తికి వెళ్తుండగా కృష్ణగిరి పోలీస్స్టేషన్ వెళ్లే రహదారి వద్ద దామోదర్నాయుడు సుభాష్ బైక్ నిలిపి దాడికి పాల్పడ్డాడు. వెంటనే అతను ఆత్మ రక్షణ కోసం ఎదురుదాడికి దిగగా.. ఇంతలో టీడీపీకి చెందిన మరో వ్యక్తి అడివయ్య రాళ్లతో సుభాష్పై దాడి చేశాడు. ఈ ఘటనలో ఇరువురికి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు వచ్చి ఇద్దరిని పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. గతేడాది కూటమి పార్టీ గెలిచిన వెంటనే ఇదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అధికారపార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారు. -
‘దేవ’ చిత్రం.. అపు‘రూపం’
కర్నూలు(అగ్రికల్చర్): దేవుళ్ల చిత్రాలను రూపొందించడం.. జాతీయ నాయకుల రూపాన్ని తన చిత్రాల్లో చూపించడం.. ప్రకృతి రమణీయతను అపురూపంగా చిత్రీకరించడం... పత్తికొండ పట్టణానికి చెందిన దూపం దేవదాసు ప్రత్యేకత. చిత్రలేఖనంపై ఎనిమిదో తరగతి నుంచే మక్కువ పెంచుకొని డిగ్రీలో కూడా లలిత కళలకు సంబంధించిన కోర్సును అభ్యసిస్తున్నాడు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు, బహుమతులు పొందుతూ... అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం కడపలోని యోగి వేమన యూనివర్సిటీలో బీఎఫ్ఏ(బ్యాచలర్ ఆఫ్ ఫైన్స్ ఆర్ట్స్) మూడో సంవత్సరం చదువుతున్నాడు. ప్రఖ్యాత చిత్రకారుడిగా గుర్తింపు పొందాలనేది తన లక్ష్యమని విద్యార్ధి దూపం దేవదాసు తెలిపారు. బీఎఫ్ఏ పూర్తయిన తర్వాత పీజీలో ఇందుకు సంబంధించిన కోర్సునే తీసుకొని మరింత నైపుణ్యాలను పెంచుకుంటానని చెప్పారు. ఇదీ ప్రత్యేకత.. ● ఎడమ చేతితో రాయడం, చిత్రాలు గీయడం దేవదాసు ప్రత్యేకత. ● కళ్ల ముందే నిమిషాల వ్యవధిలో చిత్రాన్ని గీస్తాడు. ● యోగి వేమన యూనివర్సిటీలో బీఎఫ్ఏ రెండో సంవత్సరం చదువుతున్న సమయంలో జాతీయ స్థాయి ఇంటర్ యూనివర్సిటీల యూత్ ఫెస్టివల్లో ఈ యువకుడికి రజత పతకం లభించింది. ● భారతదేశంలో ప్రముఖ వేడుకను తన చిత్రంలో ఆవిష్కరించినందుకు జాతీయ స్థాయిలో సిల్వర్ మెడల్ లభించింది. ● తిరుపతి విజ్ఞాన కేంద్రం, తిరుపతి శ్రీ కళాక్షేత్ర సంయుక్తంగా నిర్వహించిన వేమన పద్య భావన చిత్ర కళా పోటీల్లో మూడో కేటగిరిలో మొదటి బహుమతి అందుకున్నారు. ● జిల్లా స్థాయిలో ఒకసారి మొదటి, మరోసారి రెండో బహుమతి అందుకున్నారు. చిత్ర లేఖనంలో రాణిస్తున్న పత్తికొండ విద్యార్ధి జాతీయ స్థాయిలో పతకాలు, ప్రశంసాపత్రాలు -
జర్నలిస్టుల రక్షణకు చట్టాన్ని తీసుకురావాలి
కర్నూలు(సెంట్రల్): జర్నలిస్టులపై దాడులు చేస్తే తక్షణమే అరెస్టు చేసేలా రక్షణ చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి, నాయకులు గోరంట్లప్ప, కేబీ శ్రీనివాసులు, జిల్లా కన్వీనర్ నాగేంద్ర కోరారు. పార్వతీమన్యం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి మండల రిపోర్టర్ రామారావుపై దాడి చేసిన టీడీపీ మండలాధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్ నాయుడును తక్షణమే అరెస్టు చేయాలన్నారు. లేదంటే ధర్నాలు, రాస్తారోకోలకు దిగుతామని హెచ్చరించారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట జర్నస్టులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో జర్నలిస్టులపై దాడులు పెరిగిపోతున్నాయన్నారు. గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం.. ‘తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే రైలు పట్టాలపై పండుకోబెడతాను’ అని బెదిరించినా ఎలాంటి చర్యలు లేవన్నారు. జర్నలిస్టులపై దాడుల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ జేసీ డాక్టర్ బి.నవ్యకు ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు సునీల్కుమార్, బ్రహ్మయ్య, శ్రీనివాసులు, నగర ప్రధాన కార్యదర్శి ఎర్రమల పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ నాయకులు -
28 నుంచి రోజా దర్గా ఉరుసు
కర్నూలు (టౌన్): తుంగభద్ర నది తీరంలో వెలసిన రోజా దర్గా ఉరుసు ఈనెల 28 నుంచి ప్రారంభమవుతుందని ఆ దర్గా పీఠాధిపతి సయ్యద్ దాదా బాషా ఖాద్రీ తెలిపారు. సోమవారం ఆ దర్గాలో ఉరుసుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం పీఠాధిపతి మాట్లాడుతూ ప్రతి ఏడాది రంజాన్ మాసంలో నెలవంక రోజు గంథోత్సవం నిర్వహించడం అనవాయితీగా వస్తుందన్నారు. ఈ నెల 28 న గంథోత్సవం, మార్చి 1వ తేదీన ఉరుసు, 2 వ తేదీ జియారత్ ఫాతెహాలు ఉంటాయన్నారు. మూడురోజుల పాటు జరిగే ఈ వేడుకలకు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచే కాకుండా బళ్లారి, మహబూబ్ నగర్, అనంతపురం బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్గాలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఉరుసు రోజు రాత్రి ఖవ్వాలి ఉంటుందన్నారు. పోస్టర్ల ఆవిష్కరణలో రోజా దర్గా జాన్ నసీన్ ఇషాఖియా సయ్యద్ జావీద్ పాషా ఖాద్రీ, సయ్యద్ నూరుల్లా హస్సైనీ సాహెబ్, సయ్యద్ మాసుంపీర్ సాహెబ్, సయ్యద్ గౌస్ ఖాద్రీ, ఎస్.కరీమ్ పాల్గొన్నారు. -
యూట్యూబ్ చానల్ విలేకరి అదృశ్యం
మద్దికెర: ఇంటి నుంచి పొలానికి ద్విచక్రవాహనంపై బయల్దేరిన యూట్యూబ్ చానల్ విలేకరి, మద్దికెర గ్రామానికి చెందిన బోగోలు తిరుమలరెడ్డి (45) బుగ్గ సంగాల వద్ద అదృశ్యమయ్యాడు. ఘటనా స్థలంలో మొబైల్, చెప్పులు పడి ఉన్నాయి. బైక్పై బండరాళ్లతో దాడిచేసిన ఆనవాళ్లున్నాయి. ఎవరో పథకం ప్రకారం దాడిచేసి.. కిడ్నాప్ చేశారా.. లేక హత్య చేసి కాలువలో పడేశారా అనేది తెలియడం లేదు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గ్రామానికి చెందిన బోగోలు వెంకటరెడ్డి, సౌభాగ్యలక్ష్మి కుమారుడైన బోగోలు తిరుమలరెడ్డి గుంతకల్లులో నివాసం ఉంటూ బీవీఆర్ టుడే న్యూస్ అనే యూట్యూబ్ చానల్కు విలేకరిగా ఉంటూనే బుగ్గ సమీపంలోని తన తోటలో వ్యవసాయ పనులు చేసేవాడు. రోజు మాదిరిగానే సోమవారం తోటకు వెళ్లాడు. కాలువ వెంబడి తోటకు వెళ్లే రస్తాలో పడివున్న బైకును చూసి రైతులు పోలీసులకు సమాచారం అందించడంతో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి విచారణ చేపట్టారు. భార్య కావ్య ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కారు – ఆర్టీసీ బస్సు ఢీ శ్రీశైలం: శ్రీశైలం సమీపంలోని రామయ్య టర్నింగ్ వద్ద కారు – తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్కు చెందిన ప్రతిక్ మిశ్రా, రష్మీ మిశ్రా దంపతులు కారులో శ్రీశైలం బయలుదేరారు. రామయ్య టర్నింగ్ వద్ద ఎదురుగా వస్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు – కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రతీక్ మిశ్రా, డ్రైవర్ వాసులకు స్వల్ప గాయాలు కాగా స్థానికులు ప్రథమ చికిత్స చేయించారు. రష్మీ మిశ్రా షాక్కు గురి కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాదుకు తరలించారు. 20 గడ్డివాముల దగ్ధం మద్దికెర: మద్దికెర గ్రామ శివారులోని కొత్తపల్లి రహదారిలో ఉన్న స్వామి, చిన్న రంగస్వామి, ఈరన్న, రాముడు, హనుమంతు, ప్రసాద్, మాణిక్యం, నాగప్ప, మల్లికార్జున అనే రైతులకు చెందిన 20 గడ్డివాములు సోమవారం తెల్లవారుజామున కాలిబూడిదయ్యాయి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ వాములుకు నిప్పు పెట్టడంతో తమకు దాదాపు రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధిత రైతులు వాపోయారు. -
విజ్ఞాన మేళా.. విద్యార్థులు భళా!
కర్నూలు కల్చరల్: విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెట్టి అద్భుత ఆవిష్కరణలు ఆవిష్కరించారు. ఇందుకు కర్నూలులోని జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల వేదిక అయ్యింది. కళాశాల ఏర్పాటు చేసి 40 సంవత్సరాల పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సోమవారం నుంచి శనివారం రూబీ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుకుంటున్నారు. అందులో భాగంగా మూడురోజుల పాటు నిర్వహించనున్న విజ్ఞాన మేళా 4.ఓ సోమవారం ప్రారంభమైంది. విజ్ఞాన మేళాను కళాశాల పూర్వ విద్యార్థి, ఏఐఎస్ అధికారి, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి. మురళీధర్ రెడ్డి, కళాశాల చైర్మన్ సుబ్బారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలను వీరు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. విజ్ఙాన మేళాలో మొత్తం 110 ప్రాజెక్ట్లు ఏర్పాటు చేశామన్నారు. జీపీఆర్ఈసీ నుంచి 58, జిల్లాలోని 15 పాఠశాలల నుంచి 33, చైన్నె ట్రిపుల్ ఐటీ, కర్నూలు ఐఐటీ డీఎం నుంచి ఒకటి, సీఎంఆర్ కళాశాల నుంచి 15 ప్రదర్శనలు వచ్చాయన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ మేళాను అందరూ సందర్శించి, విజ్ఞానం పెంచుకోవచ్చన్నారు. ప్రదర్శనలో సోలార్ పవర్డ్ హైబ్రిడ్ ఈ బైసైకిల్, మిషన్ అన్వేషన్, స్మార్ట్ గ్లాసెస్ ఫర్ బ్లైండ్ పీపుల్, రోబోటిక్ సిస్టమ్ ఫర్ బోర్వెల్ రెస్క్యూ ఆపరేషన్, ప్రోటో టైప్ డ్యామ్ ఆకట్టుకున్నాయి. -
రేపు ఉమ్మడి జిల్లాలహ్యాండ్బాల్ ఎంపిక పోటీలు
కర్నూలు (టౌన్): ఈనెల 19వ తేది ఉదయం 10 గంటలకు నంద్యాల పట్టణంలోని ఆర్జీఎం కళాశాల క్రీడా మైదానంలో సీనియర్ మహిళలు, జూనియర్స్ విభాగంలో బాలురకు ఉమ్మడి జిల్లా స్థాయి హ్యాండ్బాల్ ఎంపిక పోటీలు జరుగనున్నాయి. జూనియర్స్ విభాగం పోటీల్లో పాల్గొనే బాలురు 2005 సంవత్సరం జనవరి 1 వ తేదీ తరువాత జన్మించి ఉండాలని జిల్లా హ్యాండ్బాల్ సంఘం కార్యదర్శి డాక్టర్ రుద్రా రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు 99402–22232 సెల్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. నేడు మాల కార్పొరేషన్ చైర్మన్ రాక కర్నూలు(అర్బన్): రాష్ట్ర మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయకుమార్ ఈ నెల 18న కర్నూలుకు వస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె. తులసీదేవి తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఐదు జిల్లాల పర్యటనలో భాగంగా 17న రాత్రి కర్నూలుకు వస్తున్నట్లు చెప్పారు. 18న ఉదయం స్థానిక ఎస్సీ కార్పొరేషన్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి తర్వాత అనంతపురానికి వెళ్తారన్నారు. కొనసాగుతున్న డిగ్రీ, బీఈడీ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలు కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ, బీఈడీ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం జరిగిన పరీక్షలకు 47 మంది గైర్హాజరయ్యారు. డిగ్రీ పరీక్షలు 11, బీఈడీ పరీక్షలు 8 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. డిగ్రీ పరీక్షలకు 365 మందికి 319 మంది హాజరు కాగా 46 మంది గైర్హాజరయ్యారని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బీఈడీ పరీక్షలకు ముగ్గురికి గాను ఇద్దరు హాజరు కాగా ఒకరు గైర్హాజరయ్యారని తెలిపారు. నూర్పిడి యంత్రం బోల్తా.. కూలీ మృతి పాములపాడు: మినుము పంట నూర్పిడి మిషన్ బోల్తా పడిన ఘటనలో మండల పరిధిలోని ఇస్కాల గ్రామానికి చెందిన మిద్దె వెంకటరమణ(40) మృతిచెందాడు. ఎస్ఐ సురేష్బాబు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రైతు పుల్లయ్య పొలానికి ఆదివారం తోటి కూలీలతో కలిసి మిద్దె వెంకటరమణ మినుము నూర్పిడి పనులకు వెళ్లాడు. నూర్పిడి యంత్రం పొలంలోకి వెళ్తుండగా పొలం గట్టుపై అదుపు తప్పి మిషన్ బోల్తా పడింది. ప్రమాదంలో యంత్రంపై కూర్చున్న వెంకటరమణ కింద పడి గాయాల పాలయ్యాడు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతదేహానికి పంచనామా నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతునికి భార్య మరియమ్మ, కుమారుడు, కూతురు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు డ్రైవర్ తప్పెట రమేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
జిల్లా ట్రెజరీలో ఏజీ ఆడిట్కు శ్రీకారం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా ట్రెజరీ కార్యాలయం, సబ్ ట్రెజరీల్లో 2023–24 సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాలపై అకౌంటెంటు జనరల్ (ఏజీ) ఆడిట్కు సోమవారం శ్రీకారం చుట్టారు. సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ జి.రాజశేఖర్, అసిస్టెంటు అకౌంట్స్ ఆఫీసర్ డి.లక్ష్మణ్ కుమార్, అసిస్టెంట్ సూపర్ వైజర్ మోహన్రావులతో కూడిన బృందం ఈ నెల 17 నుంచి 2 వరకు జిల్లా ట్రెజరీ, కర్నూలు డివిజన్ సబ్ ట్రెజరీ కార్యాలయాలు, ఈ నెల 22 నుంచి 25 వరకు ఆదోని డివిజన్ సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో ఆడిట్ చేపడుతుంది. పెన్షన్ చెల్లింపులు, స్ట్రాంగ్ రూము, చెల్లింపులు, జమలు తదితర వాటిని ఏజీ టీమ్ ఆడిట్ చేసుందని జిల్లా ట్రెజరీ అధికారులు తెలిపారు. -
నంద్యాల జిల్లాలో మొత్తం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య 1300
కర్నూలు జిల్లాలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు ప్రభుత్వ ఉద్యోగుల కార్యాలయాలు సంఖ్య కర్నూలు నగర పాలక సంస్థ 1,116 ప్రభుత్వ సర్వజన వైద్య శాల 53 గృహ నిర్మాణ సంస్థ 105 రెవెన్యూ 150 డ్వామా 120 డీఆర్డీఏ 06 ఇతర ప్రభుత్వ శాఖలు 350ఉద్యోగులకు తీవ్ర నష్టం ఆప్కాస్ వ్యవస్థ సజావుగా సాగుతోంది. తిరిగి పాత పద్ధతిపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. గతంలో ఏజెన్సీలు ఉన్న సమయంలో వేతనాలను సక్రమంగా అందించేవారు కాదు. పీఎఫ్, ఈఎస్ఐ జమ చేయక కోట్లాది రూపాయలను దిగమింగారు. ప్రతి ఏడాది రెన్యూవల్ కోసం కమీషన్లు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వెళ్తే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిద్ధమవుతాం. – ఎండీ అంజిబాబు, సీఐటీయూ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆప్కాస్ విధానాన్ని కొనసాగించాలి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు బాసటగా ఉన్న ఆప్కాస్ను విధానాన్ని కొనసాగించాలి. పాత ద్ధతిలో ఏజెన్సీలను తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలి. ఏజెన్సీలు వస్తే ఉద్యోగులకు కష్టాలు ప్రారంభమవుతాయి. మొత్తం వ్యవస్థ అంతా అధికార పార్టీ నేతల గుప్పిట్లోకి పోతుంది. వారు చెప్పిందే వేదంగా ఉద్యోగులు పనిచేయాల్సి వస్తుంది. ఆప్కాస్ను రద్దు చేయాలని చూస్తే ఉద్యమాలు చేపడతాం. – మునెప్ప, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి -
మకర తోరణం, అఖండ దీపం విరాళం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానానికి భక్తులు మకర తోరణం, అఖండ దీపం విరాళంగా అందించారు. కృష్ణా జిల్లాకు చెందిన యం.రామచంద్రరావు, కుటుంబ సభ్యులు రూ.24,45,000 ఖర్చు చేసి బంగారు పూతతో తయారు చేయించిన మకరతోరణాన్ని, తెనాలికి చెందిన కొడాలి కృష్ణ చైతన్య రూ.8,46,000 ఖర్చు చేసి 8 కేజీల వెండితో తయారు చేయించిన అఖండ దీపాన్ని సోమవారం ప్రధానార్చకులు కె.శివప్రసాదస్వామి, యం.ఉమానాగేశ్వరశాస్త్రి, పర్యవేక్షకులు సి.మధుసూదన్రెడ్డి, కె.అయ్యన్న, ఆలయ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరెడ్డికి అందజేశారు. దాతలకు స్వామివార్ల శేషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు. -
విజ్ఞాన మేళా.. విద్యార్థులు భళా!
కర్నూలు కల్చరల్: విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెట్టి అద్భుత ఆవిష్కరణలు ఆవిష్కరించారు. ఇందుకు కర్నూలులోని జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల వేదిక అయ్యింది. కళాశాల ఏర్పాటు చేసి 40 సంవత్సరాల పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సోమవారం నుంచి శనివారం రూబీ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుకుంటున్నారు. అందులో భాగంగా మూడురోజుల పాటు నిర్వహించనున్న విజ్ఞాన మేళా 4.ఓ సోమవారం ప్రారంభమైంది. విజ్ఞాన మేళాను కళాశాల పూర్వ విద్యార్థి, ఏఐఎస్ అధికారి, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి. మురళీధర్ రెడ్డి, కళాశాల చైర్మన్ సుబ్బారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలను వీరు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. విజ్ఙాన మేళాలో మొత్తం 110 ప్రాజెక్ట్లు ఏర్పాటు చేశామన్నారు. జీపీఆర్ఈసీ నుంచి 58, జిల్లాలోని 15 పాఠశాలల నుంచి 33, చైన్నె ట్రిపుల్ ఐటీ, కర్నూలు ఐఐటీ డీఎం నుంచి ఒకటి, సీఎంఆర్ కళాశాల నుంచి 15 ప్రదర్శనలు వచ్చాయన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ మేళాను అందరూ సందర్శించి, విజ్ఞానం పెంచుకోవచ్చన్నారు. ప్రదర్శనలో సోలార్ పవర్డ్ హైబ్రిడ్ ఈ బైసైకిల్, మిషన్ అన్వేషన్, స్మార్ట్ గ్లాసెస్ ఫర్ బ్లైండ్ పీపుల్, రోబోటిక్ సిస్టమ్ ఫర్ బోర్వెల్ రెస్క్యూ ఆపరేషన్, ప్రోటో టైప్ డ్యామ్ ఆకట్టుకున్నాయి. -
పోక్సో కేసుపై విచారణ
పాణ్యం: మండల పరిధిలోని ఆలమూరు ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం బి.మల్లేశ్వర్పై నమోదైన పోక్సో కేసుపై నంద్యాల ఎస్డీపీఓ జావళి విచారణ చేపట్టారు. బాధిత విద్యార్థినులను, వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని ఆమె తెలిపారు. కాగా హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఎస్సీ, ఎస్పీ మానిటరింగ్ సెల్ సభ్యుడు పి.దానం డిమాండ్ చేశారు. ఎస్డీపీఓ వెంట ఎంఈఓ సుబ్రహ్మణ్యం ఉన్నారు. పొలాల్లోకి దూసుకెళ్లిన కారు ఆలూరు రూరల్: కారు అదుపు తప్పి పొలాల్లో దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. మండలంలోని మొలగవల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మొలగవల్లి గ్రామానికి చెందిన శివరామి రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం కోసిగి గ్రామానికి బయలు దేరారు. మొలగవల్లి రైల్వే స్టేషన్ సమీపంలో కుక్క అడ్డురావడంతో కారు ఆదుపుతప్పి పొలాల్లో దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శివరామి రెడ్డి, నర్సిరెడ్డి, లక్ష్మీదేవి, సంజీవ రెడ్డి, మహిపాల్ రెడ్డికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం గుంతకల్లు ఆసుపత్రికి తరలించారు. వివాహిత ఆత్మహత్య హొళగుంద: మండలంలోని పెద్దహ్యాట గ్రామానికి చెందిన చలవాది యశోద (32) అనే వివాహిత ఆదివారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది. ఈమె గత కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధ పడుతుంది. ఆదివారం నొప్పి మరింత తీవ్రం కావడంతో భరించ లేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి ఇనుప గరాండకు చీరతో ఉరి వేసుకున్నట్లు హెడ్ కానిస్టేబుల్ లక్ష్మిరాం నాయక్ సోమవారం విలేకరులకు తెలిపారు. మృతురాలికి కుమారుడు, కూతురు సంతానం. మృతురాలి తండ్రి తిప్పేస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అగ్నిప్రమాదంలో పొట్టేళ్ల సజీవ దహనం ఆత్మకూరు: పట్టణంలోని కిషన్సింగ్ వీధిలో సోమవారం వేకువజామున జరిగిన అగ్నిప్రమాదంలో పది పొట్టేళ్లు సజీవ దహనమయ్యాయి. ఖాదర్వలికి చెందిన రేకుల షెడ్డులో మంటలు గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. రేకుల షెడ్డులో ఉన్న పది పొట్టేళ్లు మృతిచెందాయి. సీసీ కెమెరాలు, ఇంటి సామగ్రి సర్వం కాలి బూడిదైంది. ప్రమాదంలో రూ.3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు వాపోయాడు. కాగా ప్రమాదం ఎలా జరిగిందనేది తెలియాల్సి ఉంది. ఆర్ఎంపీపై కేసు నమోదుబండి ఆత్మకూరు: మండల పరిధిలోని కడమల కాలువ గ్రామంలో ఆర్ఎంపీ సుబ్బరాయుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జగన్మోహన్ సోమవారం తెలిపారు. ఆర్ఎంపీ సుబ్బరాయుడు కడమల కాలువ గ్రామంలో ఓ మహిళను కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు సుబ్బరాయుడిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. మద్యం బాటిళ్ల స్వాధీనం శ్రీశైలం: దేవస్థానం టోల్గేట్ వద్ద సోమవారం నిర్వహించిన వాహనాల తనిఖీలో మద్య బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ప్రసాద్రావు తెలిపారు. ఎస్టీ కాలనీకి చెందిన ముదావత్ తిరుపతి నాయక్, మూడవత్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 30 కేరళ మాల్టెడ్ ఫైన్ విస్కీ బాటిళ్లతోపాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తనిఖీల్లో వన్ టౌన్ పోలీసులు రాజేంద్ర కుమార్, రఘునాథుడు, మహేష్, వెంకటనారాయణ, నాను నాయక్ పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వంలో రాయలసీమకు అన్యాయం
కర్నూలు (సెంట్రల్): కూటమి ప్రభుత్వంలో రాయలసీయ, ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. సోమవారం కర్నూలులోని సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నిధులన్నీ అమరావతి, పోలవరంలకే కేటాయించి సీమ, ఉత్తరాంధ్రకు సీఎం చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రాంతాల్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి వచ్చే బడ్జెట్లోరూ.30 వేలకోట్లను కేటాయించాలన్నారు. కృష్ణానది బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారం కోసం ఈనెల 19న వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, నాయకులు రామాంజనేయులు, రామకృష్ణ పాల్గొన్నారు. -
కిడ్నాప్ చేసి ప్రాంసరీ నోటు రాయించుకున్నారు
● జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు కర్నూలు: పాత కక్షలను దృష్టిలో ఉంచుకొని పోల్కల్ గ్రామానికి చెందిన సుంకన్న, శాంసన్ మరికొందరు కలసి తనను కిడ్నాప్ చేసి రూ.1.50 లక్షలకు కర్నూలు కొత్త బస్టాండు దగ్గర ప్రాంసరీ నోటు రాయించుకొని వదిలేశారని, ఈ సంఘటనపై విచారణ జరిపి తగు న్యాయం చేయాల్సిందిగా కర్నూలు సోమిశెట్టి నగర్కు చెందిన రాజు ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. కర్నూలు టూటౌన్ పోలీసు స్టేషన్ పక్కన ఉన్న క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 102 ఫిర్యాదులొచ్చాయని, వీటిపై విచారణ జరిపి చట్టపరిధిలో త్వరితగతిన న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్పీరా, ట్రైనీ డీఎస్పీ ఉషశ్రీ, సీఐలు శ్రీనివాసనాయక్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని... ● వ్యవసాయ శాఖలోని కో–ఆపరేటివ్ సొసైటీలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి వెంకటాపురం గ్రామానికి చెందిన శేఖర్,సుధాకర్ రూ.3.50 లక్షలు తీసుకొని మోసం చేశారని దేవనకొండ మండలం బేతాపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్రెడ్డి ఎస్పీ ఎదుట వాపోయాడు ● హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని కర్నూలుకు చెందిన వీరస్వామి రూ.8 లక్షలు నగదు, 5 తులాల బంగారం తీసుకొని మోసం చేశారని కర్నూలు ఆర్కే స్ట్రీట్కు చెందిన నాగరాజు ఫిర్యాదు చేశాడు. -
అవగాహనతోనే సైబర్ నేరాల కట్టడి
కర్నూలు: అవగాహనతోనే సైబర్ నేరాలను కట్టడి చేయవచ్చని ఏపీ పరిశ్రమల మంత్రి టీజీ భరత్ అన్నారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో సోమవారం ఆర్ఎస్ రోడ్డులోని కేవీఆర్ కళాశాలలో విద్యార్ధినులకు ‘నేను సైబర్ స్మార్ట్’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి టీజీ భరత్ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరై సైబర్ నేరాల నివారణకు, అవగాహనకు పోస్టర్లు, వీడియోలు ఆవిష్కరించి మాట్లాడారు. ఇటీవల సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాల నివారణకు అవగాహన కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ఎస్పీ మాట్లాడుతూ... ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే టోల్ఫ్రీ నంబరు 1930కి కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో కేవీఆర్ కళాశాల ప్రిన్స్పాల్ వీవీ సుబ్రహ్మణ్యకుమార్, క్లస్టర్ యూనివర్సిటీ వీసీ డీవీఆర్ సాయిగోపాల్, రిజిస్ట్రార్ కట్టా వెంకటేశ్వర్లు, అడ్మిన్ అడిషన్ ఎస్పీ హుసేన్పీరా, కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్, పాల్గొన్నారు. ‘నేను సైబర్ స్మార్ట్’ అవగాహన కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ -
కూటమి ప్రభుత్వంలో నిబంధనలకు తూట్లు
కర్నూలు(సెంట్రల్): కూటమి ప్రభుత్వం నిబంధనలకు తూట్లు పొడుస్తోందని, తమను ఉత్సవ విగ్రహాలుగా మార్చి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కార్యకర్తలకే వివిధ అభివృద్ధి పనులు అప్పగిస్తుందని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. కలెక్టర్ పి.రంజిత్బాషా, జేసీ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో సత్యనారాయణమ్మతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరైన ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కలిసి ఉపాధి హామీ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులను గ్రామ, మండల పరిషత్లు, పురపాలక సంఘాల అనుమతులతో జరిగేలా చూడాలని కోరారు. కూటమి నాయకుల తీరుపై తాము హైకోర్టును ఆశ్రయించగా నిబంధనలు ప్రకారం చేపట్టాలని ఆదేశాలు ఇచ్చిందని, అయితే, స్థానిక అధికారులు పట్టించుకోవడంలేదని వాపోయారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు కలగజేసుకోవాలని గూడూరు మునిసిపల్ వైస్ చైర్మన్ అస్లాం కోరారు. లేకపోతే తాము మరోసారి కోర్టును ఆశ్రయిస్తామన్నారు. వినతుల్లో మరి కొన్ని... ●వికలాంగులకు ఉపాధి హామీ పథకంలో 150 రోజులపాటు పనులు కల్పించి 30 శాతం అలవెన్స్ ఇవ్వాలని కల్లూరు మండలం పర్లకు చెందిన 40 మంది దివ్యాంగులు వినతిపత్రం అందించారు. ● తనకు చెందిన 25 సెంట్ల భూమిని కురువ లక్ష్మన్న కుమారులైన పంపన్న, కేశవ, నాగేంద్ర దౌర్జన్యంగా ఆక్రమించుకొని సాగు చేసుకుంటు న్నారని పెద్దకడబూరు మండలం కంబలదిన్నెకు చెందిన బింగి నరసన్న అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ● 2013వ సంవత్సరంలో కల్లూరు మండలం బి.తాండ్రపాడు, మారుతీ నివాస్ కాలనీలకు నీటి కుళాయిల కోసం రూ. 90వేలు చెల్లించామని, అయితే ఇంతవరకు అధికారులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాలకు చెందిన 30 మంది ప్రజలు కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. పీజీఆర్ఎస్లో అధికారులకు విన్నవించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గ్రామ, మండల పరిషత్ల అనుమతులతోనే ఉపాధి పనులు చేపట్టాలని విజ్ఞప్తి -
వీఆర్ఏపై టీడీపీ నాయకుల దాడి
అవుకు: కొండమనాయునిపల్లె వీఆర్ఏ ఎమ్. మాబాషాపై సోమవారం టీడీపీ నాయకులు దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమనాయునిపల్లె గ్రామంలో పెద్దల కాలం నుంచి వీఆర్ఏ ఎం. మాబాషాకు సాగు భూమి ఉంది. ఆ భూమిలో మట్టిని తవ్వుకోవాలనే దురుద్దేశ్యంతో కొంతకాలంగా తేదేపా నాయకుడు ఆకుల నాగిరెడ్డి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాబాషా తెలిపారు. గ్రామ సచివాలయ సమీపంలో టీడీపీ నాయకుడు ఉండటంతో ఎందుకు ఇలా చేస్తున్నారని అడగటంతో అతనితోపాటు టీడీపీ కార్యకర్తలు ముకుమ్మడిగా తనపై దాడి చేశారన్నారు. విడిపించటానికి వచ్చిన తన సోదరి అయిన మీరాంబీపై కూడా దాడి చేశారని తెలిపారు. దెబ్బలు అధికంగా తగలటంతో చికిత్స నిమిత్తం అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చానన్నారు. అవుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, పోలీసులు విచారణ చేస్తున్నట్లు చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వీఆర్ఏ -
పదిపై పర్యవేక్షణ కరువు
పర్యవేక్షణ చేయాలని ఆదేశాలు ఇచ్చాం ఉమ్మడి కర్నూలు జిల్లాలో డిప్యూటీ డీఈఓలుగా ఎంఈఓ–1లు ఇన్చార్జ్లుగా ఉన్నారు. ఉన్నత పాఠశాలలను పర్యవేక్షణ చేయాలని ఆదేశాలు ఇచ్చాం. పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పాం. ఎంఈఓలుగా ఖాళీగా ఉన్న అర్హులైన హెచ్ఎంకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించాం. రివిజన్ టెస్ట్లు నిర్వహించి, ఇందులో వచ్చిన ఫలితాల ఆధారంగా వెనుకబడిన విద్యార్థులకు మరో సారి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని చెప్పాం. – ఎస్.శామ్యూపాల్, డీఈఓ కర్నూలు సిటీ: పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు నామమాత్రమే అన్న విమర్శలు వస్తున్నాయి. పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించడంలో డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు, హెచ్ఎంలది కీలక పాత్ర. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నత పాఠశాలలను పర్యవేక్షణ చేయాల్సిన డిప్యూటీ డీఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇవీ సమస్యలు.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 1,022 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 17 నుంచి మొదలు కానున్న పదవ తరగతి పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 64,099 మంది హాజరుకానున్నారు. మొత్తం 17 ఎంఈఓ, 4 డిప్యూటీ డీఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్తగా ఏర్పాటైన ఆత్మకూరు, పత్తికొండ డివిజన్లకు సైతం డిప్యూటీ డీఈఓలు లేరు. అలాగే 40 జెడ్పీ హైస్కూళ్లలో రెగ్యులర్ ప్రధానోపాధ్యాయులు లేరు. ఉన్నత పాఠశాలలపై డిప్యూటీ డీఈఓల పర్యవేక్షణ కీలకం. ప్రస్తుతం ఎంఈఓ–1లకు ఇన్చార్జ్ డిప్యూటీ డీఈఓ బాధ్యతలు అప్పగించారు. ● ప్రస్తుతం క్లస్టర్ విధానం, అపార్, టీఐఎస్(టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్)లతో రెగ్యులర్ పోస్టుల పనితోనే సమయం సరిపోని పరిస్థితి. ఇన్చార్జ్ బాధ్యతలతో ఉన్నత పాఠశాలలను తనిఖీలు చేయలేకపోతున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో రోజుకొక ఫార్మాట్లలో సమాచారం ఇవ్వాలని చెప్పడంతో డివిజనల్, మండల అధికారులపై పని భారం పెరిగిపోయింది. ● గతంలో ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకునేవారు. విద్యార్థులను చదివించే బాధ్యత వారికి అప్పగించే వారు. పర్యవేక్షణకు మండలాల ప్రత్యేకాధికారులకు సైతం ఉండేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా అగుపించడం లేదు. ● డీఈఓలకు ప్రతి రోజు నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు వీడియో కాన్ఫరెన్స్, వెబెక్స్, టెలీ కాన్ఫరెన్స్లతోనే సమయం సరిపోతోంది. ● సబ్జెక్టు నిపుణులు ఉన్నప్పటికీ ఈ–లెర్నింగ్ తరగతులకే పరిమితం అవుతున్నారు. ఆలస్యంలో ‘ప్రత్యేక’ం పదవ తరగతి పరీక్షలు నెల రోజుల్లో మొదలు కానున్నాయి. గతంలో కంటే ఫలితాలను పెంచాలని లక్ష్యంతో విద్యాశాఖ ఉన్నతాఽధికారులు ప్రత్యేకంగా వంద రోజుల ప్రణాళికను తయారు చేయించారు. అన్ని జిల్లాల్లో అదే ప్రణాళికను అమలు చేసేలా చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సబ్జెక్టు టీచర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఆయా సబ్జెక్టుల్లో 100 శాతం ఫలితాలు సాధించేలా వర్చువల్ ల్యాబ్ను ఏర్పాటు చేయించి ఈ–లెర్నింగ్కు చర్యలు చేపట్టారు. అయితే ఆ చర్యలు ఆలస్యంగా మొదలయ్యాయి. గతంలో సీ, డీ క్యాటగిరీలకు చెందిన పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటిరియల్ ఇచ్చే వారు. ప్రస్తుత ప్రభుత్వం పరీక్షల విభాగం తయారు చేసిన మోడల్ ప్రశ్న పత్రాలు, బిట్ బ్యాంకును పీడీఎఫ్ రూపంలో హైస్కూళ్ల హెచ్ఎంలకు పంపించారు. కానీ విద్యార్థులకు ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో ఈ ఏడాది ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికై నా ఉన్నత పాఠశాలలపై పర్యవేక్షణ పెంచితే మంచి ఫలితాలు వస్తాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. వచ్చే నెల 17 నుంచి మొదలు కానున్న పదో తరగతి పరీక్షలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆరు డిప్యూటీ డీఈఓ పోస్టులు ఖాళీ 17 మండలాలకు ఇన్చార్జ్ ఎంఈఓలు 40 ఉన్నత పాఠశాలల్లో హెచ్ఎం పోస్టులు ఖాళీ ఆలస్యంగా మొదలైన ఈ–లెర్నింగ్ -
ఉపాధి నిధుల వినియోగంపై ఆడిట్
కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల వినియోగంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆడిట్ విభాగం బృందం తనిఖీలు చేపట్టింది. సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ రాజేష్కుమార్ నేతృత్వంలో సోమవారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2021–22, 2022–23, 2023–24 సంవత్సరాల్లో మెటీరియల్, లేబర్ కాపోనెంటు కింద చేపట్టిన నిధుల వినియోగంపై ఈ టీమ్ ఆడిట్ నిర్వహిస్తోంది. కేంద్రం నుంచి వచ్చిన ఆడిట్ బృందాన్ని హోటల్ త్రిగుణలో జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రజెక్టు డైరెక్టర్ వెంకటరమణయ్య, అదనపు పీడీ మాధవీలత, పరిపాలన అధికారి విజయలక్ష్మి, ఫైనాన్స్ మేనేజర్ అదెయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్ఆర్ఈజీఎస్ నామ్స్ ప్రకారం ఉపాధి నిధులు వినియోగించారా లేదా అనే దానిని ఈ టీమ్ పరిశీలిస్తుంది. సోషల్ ఆడిట్, దుర్వినియోగం అయిన నిధుల రికవరీ తదితర వాటిని పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు. బోదకాల బాధితులకు కిట్ల పంపిణీ కర్నూలు(హాస్పిటల్): బోదకాలుతో బాధపడుతున్న ముగ్గురికి మార్బిడిటీ మానిటరింగ్ కిట్(టబ్, మగ్, సబ్బు, ఆయింట్మెంట్, టవల్)ను, అవసరమైన మాత్రలను అధికారులు అందజేశారు. సోమవారం స్థానిక జొహరాపురంలోని యూపీహెచ్సీలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ పి. శాంతికళ మాట్లాడుతూ జిల్లాలో 22 మంది బోధకాలు వ్యాధిగ్రస్తులు ఉన్నారని, వీరు తరచుగా వ్యాధిసోకిన కాలును టబ్లో ఉంచి సబ్బు నీటితో శుభ్రంగా కడిగి టవల్తో తుడిచిన తర్వాత ఆయింట్మెంట్ పట్టించాలని సూచించారు. ఈ వ్యాధి ఆడ క్యూలెక్స్ దోమకాటుతో వ్యాపిస్తుందని, నివారణ చర్యల్లో భాగంగా దోమకాటుకు గురిగాకుండా దోమతెరలు వాడాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి నూకరాజు, యుపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక, ఏఎంవో చంద్రశేఖర్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. గ్రూపు–2 మెయిన్స్కు పకడ్బందీ ఏర్పాట్లు కర్నూలు(సెంట్రల్): ఈనెల 23వ తేదీన గ్రూపు–2 మెయిన్స్కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఏపీపీఎస్సీ జిల్లా కోఆర్డినేటర్, జేసీ డాక్టర్ బి.నవ్య అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో గ్రూపు–2 పరీక్షలపై జిల్లా అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా పరీక్షకు ఏర్పాట్లు చేయాలన్నారు. లైజెన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. నేటి నుంచి అంగన్వాడీ టీచర్లకు శిక్షణ కర్నూలు కల్చరల్: సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జిల్లాలోని అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇస్తున్నట్లు సమగ్ర శిక్ష ఏపీసీ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం వాటి కి సంబంధించిన కిట్లను అంగన్వాడీలకు పంపిణీ చేసి మాట్లాడారు. జ్ఞాన జ్యోతి కార్యక్రమం ద్వా రా పూర్వ ప్రాథమిక విద్య ప్రాముఖ్యతను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. శిక్షణకు సంబంధించి జిల్లాకు వచ్చిన 1,882 కిట్ల ను ఇప్పటికే మండలాలకు సరఫరా చేశామన్నారు 25 నుంచి యాగంటిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు బనగానపల్లె: యాగంటిలో ఈనెల 25 నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ చంద్రుడు సోమవారం తెలిపారు. 25న ధ్వజారోహణంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. 26న ఉదయం మహాన్యాస పూర్వ క రుద్రాభిషేకం, రాత్రి లింగోద్భవ కాల పూజ , 27న నందికోల , 28 సాయంత్రం రథోత్సవం, మార్చి 1న రుద్రాభిషేకం ఉంటాయన్నారు. -
ఉద్యోగులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఉద్యోగ భద్రత లేకుండా ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్సింగ్ (అప్కాస్)ను రద్దు చేయడంపై వ్యతిరేకత వస్తోంది. ఏజెన్సీల పరిధిలోకి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసుకురావడంపై నిరసన పెల్లుబ
కర్నూలు(అర్బన్)/నంద్యాల(న్యూటౌన్): ‘ఆప్కాస్’ను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. తిరిగి పాత విధానం అమలైతే తమ పరిస్థితి ఏమిటనే ప్రశ్న వారిని తొలచివేస్తోంది. ఇప్పటికే పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై టీడీపీ నేతలు ఆరా తీస్తున్నారు. తమ వారికి ఆయా ఉద్యోగాలు కట్టబెట్టేందుకుమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆప్కాస్ పరిధిలో ఉన్న ఉద్యోగులను తొలగించేందుకు వీలు లేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో తమకు అనుకూలమైన ఏజెన్సీల విధానాన్ని తీసుకువచ్చేందుకు కుట్రలు పన్నుతున్నారు. గతంలోఅవినీతి, అక్రమాలు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తూ వచ్చారు. ఇందులో మితిమీరిన రాజకీయ జోక్యంతో అర్హులకు న్యాయం జరిగేది కాదు. అడ్డగోలుగా మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసులతో నియామకాలు జరిగేవి. ప్రజాప్రతినిధుల సిఫారసులతో పాటు ప్రతి ఉద్యోగానికి ఒక రేటు ప్రకారం రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు ఆయా ఏజెన్సీలు నిరుద్యోగుల నుంచి భారీగానే డబ్బులు వసూలు చేశారు. అయినా అప్పట్లో ఆయా ఏజెన్సీలు తమ ఖాతాలోకి జమ అయిన వేతనాలను సకాలంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లించకపోవడం, ఈపీఎఫ్ను సక్రమంగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయకపోవడం వల్ల అనేక మంది పలు రకాల ఇబ్బందులకు గురయ్యారు. అవినీతి, అక్రమాలకు తావులేకుండా, విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించిన చిరుద్యోగులను కూడా రాజకీయ జోక్యంతో తొలగించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో ఇలా చేశారు.. అనేక ఇబ్బందులు, ఒడిదుడుకుల మధ్య జీవితాలను వెళ్లదీస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘ఆప్కాస్’ను ఏర్పాటు చేసింది. ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు భిన్నంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే వేతనాలను వారి ఖాతాల్లో జమ చేసేందుకు నిర్ణయం తీసుకొని, అమలు చేసింది. అలాగే వేతనానికి ముందే ఈపీఎఫ్ సక్రమంగా జమ చేసే ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తిరిగి ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసి పాత విధానంలో ఏజెన్సీలకు పగ్గాలు అప్పగించేందుకు పూ నుకోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఉద్యోగులు నష్టపోతారు ఆప్కాస్ను రద్దు చేసి ఏజెన్సీల విధానం అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం మంచిది కాదు. దీనివల్ల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నష్టపోతారు. మితిమీరిన రాజకీయ జోక్యంతో ఉద్యోగ భద్రత ఉండదు. ఈపీఎఫ్ డబ్బులు గతంలో ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయకుండా ఏజెన్సీలు కాజేసిన ఘటనలు ఉన్నాయి. ప్రభుత్వం పునరాలోచించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్టు పరిధిలోకి తీసుకురావాలి. నేరుగా ఆయా శాఖాధిపతులతో జీతాలు చెల్లించాలి. – నాగరాజు, సీఐటీయూ నంద్యాల జిల్లా కార్యదర్శిచిరుద్యోగుల జీవితాలు చిన్నాభిన్నంకూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడు నెలల్లో అనేక రూపాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పలు రకాల ఆదాయ వనరులు కల్పించారు. తాజాగా అవుట్ సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై పడింది. గతంలో ప్రతి ఉద్యోగానికి ఒక ధర ఫిక్స్ చేసి మరీ వసూలు చేసిన ఏజెన్సీలను తిరిగి తెరపైకి తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంతో పారదర్శకంగా కొనసాగుతున్న ఈ వ్యవస్థపై పాత విధానాన్ని రుద్దేందుకు పూనుకుంటోంది. ఇదే జరిగితే ప్రతి జిల్లాలో వందల మంది చిరుద్యోగుల జీవితాలు చిన్నాభిన్నం అయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చు. తక్కువ వేతనంతో ఎక్కువ పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆర్థికంగా చేయూతను అందించాల్సింది పోయి, వారి ఉద్యోగాల్లో వేలు పెట్టడం సరైన చర్య కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘ఆప్కాస్’ రద్దుపై ఉద్యోగుల్లో వ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై ఆందోళన సజావుగా సాగుతున్న వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర ఏజెన్సీల పరిధిలోకి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తెచ్చేందుకు కసరత్తు టీడీపీ కార్యకర్తలకు మేలు చేసేందుకు పన్నాగం ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలపై టీడీపీ నేతల ఆరా పాత విధానం వద్దంటున్న చిరుద్యోగులు -
18 నుంచి లాంగ్వేజ్ ఫెస్టివల్స్
కర్నూలు కల్చరల్: జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు లాంగ్వేజ్ ఫెస్టివల్స్ నిర్వహించాలని డీఈఓ శామ్యూ ల్ పాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీఎస్ఎస్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 18న ఇంగ్లిష్, 19న సంస్కృతం, హిందీ, ఉర్దూ, 20న గిరిజన బాషా, కన్నడ, తమిళం, ఒరియా, 21న తెలుగు బాషా ఉత్సవాలను నిర్వహించాలని తెలిపారు. ఆదోని డివిజన్ పరిధిలో కన్నడ భాషాకృత్యాలను నిర్వహించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు పఠన పోటీలు, కథ చెప్పడం లాంటి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఈ నెల 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ కార్యక్రమాలు పండుగలా నిర్వహించాలని పేర్కొన్నారు. మల్లన్నకు నృత్యనీరాజనం శ్రీశైలంటెంపుల్: శ్రీశైల ఆలయ నిత్యకళావేదికపై ఆది వారం విజయవాడకు చెందిన నర్తన డ్యాన్స్ అకాడమీ వారి సంప్రదాయ నృత్యప్రదర్శన ఆకట్టుకుంది. గణపతి ప్రార్థన, శివాష్టకం, శివోహం, శంకర శ్రీగిరివాసా తదితర గీతాలకు, అష్టకాలకు.. సత్యశ్రీ, భవ్య, లహరి తదితరులు నృత్యం ప్రదర్శించారు. -
అధిక ధర చెల్లించి తెచ్చుకున్నాం
యూరియా కోసం అనేక ఇబ్బందులు పడుతున్నాం. మాకు సొంత భూమి 5 ఎకరాలు ఉండగా.. 20 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం. మొత్తం వరి సాగు చేశాం. ప్రస్తుతం వరి పొట్ట, కంకిదశలో ఉంది. యూరియా వాడితే బాగా వస్తుంది. కాని ఎక్కడా యూరియా బస్తా కూడా లభ్యం కావడం లేదు. చివరికి నందికొట్కూరులో బస్తా రూ.380 ప్రకారం తెచ్చుకున్నాం. బస్తాకు రూ.400 ఇస్తామన్నా లభించడం లేదు. కొంతమంది మాత్రం అవసరమైన స్థాయిలో తెచ్చుకుంటున్నారు. అదే స్థాయిలో సామాన్య రైతులకు అందని పరిస్ధితి ఉంది. యూరియా బంగారం అయింది. రానున్న రోజుల్లో బస్తా రూ.500 ప్రకారం అమ్ముతారనే ఆందోళన ఉంది. – మురళీకృష్ణ, రైతు, బండి ఆత్మకూరు సాగు పెరగడంతోనే యూరియా కొరత నంద్యాల జిల్లాలో రబీలో వరిసాగు భారీగా పెరిగింది. సాధారణ సాగు కంటే దాదాపు 15 వేల హెక్టార్లు అధికంగా వరి సాగు అవుతోంది. దీంతో కొరత తీవ్రమైంది. నిబంధనల ప్రకారం ఎకరాకు రెండు.. రెండున్నర బస్తాల వరకు మాత్రమే యూరియా ఇవ్వాల్సి ఉంది. కాని చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. 14 టన్నుల యూరియా 15 మంది రైతులు తీసుకున్నట్లు సమాచారం ఉంది. వీరికి భూములు ఉన్నా యా లేదా అనే దానిని చూస్తున్నాం. మరి కొద్ది రోజుల్లో 3,000 టన్నుల యూరియా వస్తుంది. అప్పుడు కొరత నుంచి బయటపడతాం. – మురళీకృష్ణ, డీఏఓ, నంద్యాల -
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు రబీ సాగు 2,45,466 హెక్టార్లు
ప్రభుత్వ సరఫరా చేసింది 61,985 టన్నులు మాత్రమే● అధికారపార్టీ నేతల చేతుల్లో యూరియా ● అనుకూలమైన వారికి, టీడీపీ కార్యకర్తలకే పంపిణీ ● వైఎస్సార్సీపీ ముద్రతో సామాన్య రైతులకు మొండిచేయి ● నంద్యాల జిల్లాలో 14 టన్నుల యూరియా కేవలం 15 మందికే పంపిణీ ● ప్రశ్నించే వారిపై కేసులతో వేధింపులు ● యూరియా సరఫరాలో కూటమి ప్రభుత్వం విఫలం అవసరమైన యూరియా 1,47,279 టన్నులు ఇక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతు పేరు చిన్న పుల్లయ్య. బండిఆత్మకూరు మండలం చిన్నదేవళాపురం. ఇతను 16 ఎకరాల్లో వరిసాగు చేశాడు. ఈనెల 14వ తేదీన రైతు భరోసా కేంద్రం వద్ద యూరియా కోసం వెళ్లి క్యూలో నిలబడ్డాడు. టీడీపీకి చెందిన కొందరు నేరుగా వెళ్లి ఎరువులు తీసుకుంటుండడంతో ఇదేమి న్యాయమని ప్రశ్నించగా దాడి చేశారు. తరువాత వారే పోలీసులకు ఫిర్యాదు చేసి పుల్లయ్యపై కేసు పెట్టించారు. అరెస్టు చేసేందుకు పోలీసులు ఏకంగా గ్రామానికి వెళ్లారు. పొలంలో ఉన్న పుల్లయ్యకు ఈ విషయం తెలిసి తీవ్ర ఆందోళనకు గురై పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.కర్నూలు(అగ్రికల్చర్)/బండిఆత్మకూరు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో రబీ సాధారణ సాగు 2,82,247 హెక్టార్లు కాగా ఇందులో కర్నూలు జిల్లాలో 1,10,386, నంద్యాల జిల్లాలో 1,71,861 హెక్టార్లు. ఇప్పటి వరకు ఈ రెండు జిల్లాలో 2,45,466 హెక్టార్లు సాగైంది. కేసీ కెనాల్, తెలుగు గంగ కాల్వలకు నీరు సమృద్ధిగా వస్తుండటంతో నంద్యాల జిల్లాలో 1,61187 హెక్టార్లలో పంటలు వేశారు. ఇందులో వరి సాధారణ సాగు 27,908 హెక్టార్లు ఉండగా.. ఇప్పటికే 34,940 హెక్టార్లలో సాగు అయింది. అంటే 7 వేల హెక్టార్లకుపైగా అదనంగా సాగు అయింది. మరో ఆరేడు వేల హెక్టార్లలో సాగు అయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ సాగు విస్తీర్ణాన్ని అంచనా వేయడంలో వ్యవసాయ యంత్రాంగం విఫలమైంది. దీనికితోడు డిమాండ్కు అనుగుణంగా యూరియా సరఫరా చేయడంలో కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. అంతంత మాత్రంగానే యూరియా సరఫరా నంద్యాల జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి 63,911 టన్నుల యూరియా వచ్చింది. అయితే, 53,417 టన్నుల యూరియా అమ్మకాలు జరిగాయి. రబీ సీజన్కు సంబంధించి యూరియా ఓపెనింగ్ బ్యాలెన్స్ 10 వేల టన్నులు ఉంది. ప్రస్తుతం నంద్యాల జిల్లాకు 37,483 టన్నులు మాత్రమే వచ్చింది. ఓపెనింగ్ బ్యాలెన్స్తో కలిపితే రబీ సీజన్కు మొత్తం 47 వేల టన్నుల యూనియా వచ్చినట్లు అవుతోంది. అయితే, నీటిపారుదల సదుపాయం ఉండటంతో ఇక్కడ సాధారణం కంటే 15 వేల హెక్టార్ల వరకు ఎక్కువగా పంట సాగు అవుతోంది. దీనిని అధికారులు అంచనా వేయకపోవడంతో బండిఆత్మకూరు, వెలుగోడు, నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు, శిరువెళ్ల, కోవెలకుంట్ల, అవుకు మండలాల్లో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. హైజాక్ చేస్తున్న అధికార పార్టీ నేతలు యూరియా కొరతను టీడీపీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రస్తుతం నంద్యాల జిల్లాకు వచ్చే యూరియాలో 50 శాతం మార్క్ఫెడ్కు, మిగిలిన 50 శాతం ప్రైవేటు డీలర్లకు ఇస్తున్నారు. మార్క్ఫెడ్ నుంచి రైతుసేవా కేంద్రాలు, పీఏసీఎస్లకు వెలుతున్న యూరియా మొత్తాన్ని టీడీపీ నేతలే హైజాక్ చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 45 కిలోల బస్తా ధర రూ.267 ఉండగా.. టీడీపీ నేతలు తమ కంట్రోల్లో ఉంచుకొని రూ.400 వరకు అమ్మకాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితి ప్రధానంగా బండిఆత్మకూరు, వెలుగోడు, మహానంది, ఆత్మకూరు మండలాల్లో ఎక్కువగా ఉంది. డిమాండ్ ఉన్నప్పుడు మార్క్ఫెడ్ ప్రైవేటు డీలర్లకు యూరియా ఇవ్వరాదు. అయితే రాజకీయంగా ఒత్తిడి చేసి మార్క్ఫెడ్ నుంచి ప్రైవేట్ డీలర్లకు కూడా యూరియా ఇస్తున్నారు. తర్వాత ఆ ఎరువు కూడా టీడీపీ నేతల పరం అవుతోంది. కర్నూలు జిల్లాకు అరకొరనే... జిల్లాలో నీటిపారుదల సదుపాయం అంతంతమాత్రంగా ఉండటంతో లేట్ రబీ సీజన్ కింద వరి సాగు తక్కువగా ఉంది. హాలహర్వి, కౌతాళం, హొళగుంద, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పెద్దకడబూరు తదితర మండలాల్లో ఎల్లెల్సీ కింద వరి సాగు ఉంది. జిల్లాలో 84,279 హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. 29,517 టన్నుల యూరియా అవసరం కాగా 24.502 వేల టన్నులు వచ్చింది. ప్రస్తుతం జిల్లాలోని ప్రైవేట్ డీలర్ల దగ్గర యూరియా లభించని పరిస్థితి. మార్క్ఫెడ్లో కూడా 500 టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. ఆదోని, ఎమ్మిగనూరు, పెద్దకడబూరు, కౌతాళం, మంత్రాలయం ప్రాంతాల్లో బస్తా యూరియా ధర రూ.350 పైనే అమ్మకాలు సాగిస్తున్నారు. పీఏసీఎస్లు, రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా అధిక ధరలకు విక్రయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో కొందరు రైతులు కర్ణాటకకు వెళ్లి తెచ్చుకుంటున్నట్లు సమాచారం. అధికార పార్టీ బరితెగింపు14టన్నుల యూరియా 15 మందికే... నంద్యాల జిల్లాలోని ఒక ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి నాలుగైదు రోజుల క్రితం 30 టన్నుల యూరియా ఇచ్చారు. ఇందులో 14 టన్నులు 15 మందికే పంపిణీ అయింది. ఈ యూరియా పొందిన వారికి భూములు కూడా పెద్దగా లేవు. ప్రస్తుతం సాగు చేస్తున్న దాఖలాలు కూడా లేవు. డిమాండ్కు తగ్గ సప్లై లేని సమయంలో 14 టన్నుల యూరియా 15 మంది టీడీపీ నేతల వశం కావడం పలు విమర్శలు తావు ఇస్తోంది. ఇదిలా ఉంటే నంద్యాల జిల్లాలో ఒకే ఒక్క ర్యాక్ పాయింట్ ఉండగా అక్కడ టీడీపీ నేతలే ఉంటున్నారు. దీనిని బట్టి ర్యాక్ పాయింట్ మొదలు గ్రామస్థాయి వరకు పచ్చపార్టీ నేతలదే పెత్తనం సాగుతుందని చెప్పవచ్చు. -
తండ్రిని హతమార్చిన తనయుడు
ఓర్వకల్లు: మద్యం మత్తులో ఓ యువకుడు సొంత తండ్రినే హతమార్చిన ఘటన మండలంలోని నన్నూరు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామంలోని దళిత కాలనీకి చెందిన గార్ధుల రాములమ్మ, నారాయణ(50)కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. కూతురికి పెళ్లి చేశారు. కాగా తమకు ఉన్న 3 ఎకరాల భూమిని విక్రయించాలని పెద్ద కుమారుడు నవీణ్ కొంతకాలంగా తండ్రిపై ఒత్తిడి తెస్తున్నాడు. సరైన ధర రాకపోవడంతో తండ్రి విక్రయించకుండా కాలయాపన చేస్తూ వస్తున్నాడు. ఈక్రమంలో కుటుంబంలో గొడవలు ఏర్పడ్డాయి. దీంతో గత ఏడాది నవీణ్ తన తండ్రి నారాయణ చెవిని కొరికి గాయపరిచాడు. అప్పటి నుంచి తండ్రి, కుమారిడికి తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సాయంత్రం పూటుగా మద్యం తాగిన నవీణ్.. తండ్రితో గొడవకు దిగాడు. మద్యం మత్తులో కర్రతో తలపై మోది, బండరాయితో ముఖంపై కొట్టడంతో నారాయణ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న సీఐ చంద్రబాబునాయుడు, ఎస్ఐ సునీల్ కుమార్, ట్రైనీ డీఎస్పీ ఉషశ్రీ ఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. నారాయణ మృదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య రాములమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సనీల్ కుమార్ తెలిపారు. -
తపాలా ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శిగా చంద్రశేఖర్
కోసిగి: ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శిగా కోసిగికి చెందిన చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. ఆదివారం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మధురలో జరిగిన ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం మహా సభల్లో తనను జాతీయ కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు కోసిగికి చెందిన సీనియర్ తపాలా ఉద్యోగి డి.చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రస్థాయికి 22 మంది క్రీడాకారుల ఎంపిక నంద్యాల(న్యూటౌన్): స్థానిక నంది ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఉమ్మడి కర్నూలు జిల్లా స్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో 22 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు బ్యాడ్మింటన్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.వంశీధర్ తెలిపారు. విజేతలకు ఆదివారం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరు ఈనెల 21న విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. అనంతరం క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శేషిరెడ్డి, కోచ్ నాగార్జున పాల్గొన్నారు. -
ఏ కొమ్మ రెమ్మనో!
నవ మాసాలు గర్భంలో నన్ను భద్రంగా చూసుకుంటే సంతోష పడితిని.. కానీ ప్రపంచానికి అనాథగా పరిచయం చేస్తావునుకోలేదు. పుట్టిన క్షణమే నీ వెచ్చని ఒడిలో లాలిస్తావని ఆనందపడితిని.. కానీ రక్తపు మరకలు ఆరక ముందే తల్లి ప్రేమకు దూరం చేస్తావనుకోలేదు. భూమి మీదికి చేరగానే మీ బంధుత్వాన్ని చూపిస్తావని సంబరపడితిని.. కానీ బతికుండగానే కన్నపేగును తెంచుకుంటావనుకోలేదు. ఆడ బిడ్డగా పుట్టాననో, లేక ఏ కష్టమొచ్చి నన్ను దూరం చేసుకున్నావో తెలియదు.. ఆ దేవుడి దయతో నేను క్షేమమే అమ్మా! అది జీనేపల్లె ఎస్సీ కాలనీ. ఆదివారం తెల్లవారుజామున అప్పుడ ప్పుడే జనం నిద్ర లేచి పనుల్లోకి వెళ్తున్నారు. చర్చి సమీపంలోని ఖాళీ ప్రదేశంలో ఓ శిశువు ఏడుపు వినిపించడంతో స్థానిక మహిళలు వెళ్లి చూశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆడ శిశువును అక్కడ వదిలేసినట్లు గుర్తించారు. శిశువు శరీరంపై రక్తపు మరకలు ఉండటంతో అప్పుడే పుట్టిన బిడ్డగా నిర్ధారించారు. గ్రామ ఆశా కార్యకర్తలు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో యర్రగుంట్ల పీహెచ్సీ సీహెచ్ఓ నాగార్జునరెడ్డి గ్రామానికి చేరుకుని శిశువును పరిశీలించారు. వెంటనే 108లో నంద్యాల వైద్యశాలకు తరలించారు. వైద్య పరీక్షలు అనంతరం శిశువును నంద్యాలలోని శిశు గృహం సిబ్బందికి అప్పగించారు. – శిరివెళ్ల -
రక్షిత నీటిని అందించాలి
కర్నూలు(అర్బన్): గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నీటి ట్యాంకుల ద్వారా రక్షిత మంచి నీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి జీ భాస్కర్ కోరారు. ఆదివారం కర్నూలు మండలం గార్గేయపురం ఎస్ఎస్ ట్యాంకును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరు కలుషితమైతే ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఓహెచ్ఎస్ఆర్, జీఎల్ఎస్ఆర్లను శుభ్రం చేయాలన్నారు. అనుమానం వచ్చిన నీటిని తాగకుండా ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఆ నీటిని టెస్టింగ్ కోసం ల్యాబ్కు పంపాల్సి ఉందన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లను సమన్వయం చేసుకొని నీటి సరఫరాపై అప్రమత్తంగా ఉండాలన్నారు. భూ సంరక్షణకురూ.2.70 కోట్లు మంజూరు కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖ భూసంరక్షణ విభాగానికి నిధులు విడుదల అయ్యాయి. ఉమ్మడి జిల్లాకు రూ.2.70 కోట్లు మంజూరు కాగా.. ప్రస్తుతం రూ.1.34 కోట్లు విడుదల అయ్యాయి. కర్నూలు జిల్లాకు రూ.1.50 కోట్లు మంజూరు కాగా.. మొదటి విడత కింద రూ.74.53 లక్షలు మంజూరు అయ్యాయి. నంద్యాల జిల్లాకు రూ.1.20 కోట్లు మంజూరు కాగా మొదటి విడతలో రూ.59.60 లక్షలు విడుదల అయ్యాయి. ఈ నిధుల్లో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం భరిస్తాయి. ఆర్కేవీవై కింద వర్షాధార ప్రాంతం (ఆర్ఏడీ) అభివృద్ధికి ఈ నిధులు వినియోగిస్తున్నట్లుగా భూసంరక్షణ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. వ్యవసాయంలో రైతుల సామర్ాధ్యలను పెంచడం, భూమి అభివృద్ది తదితర వాటికి ఈ నిధులు వినియోగించడం జరుగుతుందన్నారు. కర్నూలు డివిజన్ కల్లూరు మండలం బొల్లవరం, కే.మార్కాపురం గ్రామాలు, ఆదోని డివిజన్లో బైచిగేరి, బసలదొడ్డి గ్రామాలు, నంద్యాల జిల్లా డోన్ మండలం యు.కొత్తపల్లి, ఎర్రగుంట్ల గ్రామాల్లో ఆర్ఏడీ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఒక రైతుకు ఆర్కేవీవై కింద రూ.30 వేల విలువ ఇన్పుట్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయా గ్రామాల్లో రైతుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. -
పేకాట.. కాసుల వేట!
జూద గృహాల వైపు కన్నెత్తి చూడని పోలీసులు ఆదోని పట్టణంలో గత రెండు నెలలుగా ఎక్కడ చూసినా పేకాట స్థావరాల చర్చ జరుగుతోంది. కూటమి నేతనే ఈ స్థావరాలను నడుపుతున్నట్లు పోలీసులకు తెలిసినా అటువైపు ఎందుకు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. సంబంధిత కూటమి నేత ఓ పోలీసు అధికారితో నెల మామూళ్లు ఇచ్చేలా డీల్ చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో జూద స్థావరాలపై ఎవరూ దాడులు చేయడం లేదు.ఆదోని అర్బన్: ‘రండి బాబూ రండి.. ఆటాడుకోండి.. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి’ అంటూ పేకాటరాయుళ్లకు కూటమి నేత ఆఫర్ ప్రకటిస్తున్నాడు. అధికారం మాదే.. అడ్డుకునేదెవరంటూ దర్జాగా పట్టణ నడిబొడ్డున జూద స్థావరాలు నిర్వహిస్తూ రూ. లక్షలు ఆర్జిస్తున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదోని పట్టణంలో మూడు పార్టీల నేతలు అక్రమార్జనపై దృష్టి సారించారు. ఇప్పటికే కొందరు నాయకులు డీలర్షిప్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితర కాంట్రాక్ట్ పోస్టులు ఇప్పిస్తామని రూ. లక్షలు వసూలు చేయగా, ఇందులో ఒక నేత అందరి కంటే ఒక అడుగు ముందుకేశాడు. పట్టణంలో పేకాట స్థావరాలను నిర్వహిస్తూ నా రూటే సపరేటు అంటున్నాడు. పట్టణంలోని ఓ పోలీస్స్టేషన్ పరిధిలో నాలుగుచోట్ల ప్రాంతాలు మార్చి గ్యాంబ్లింగ్ (అందర్బహర్) ఆడిస్తున్నట్లు తెలిసింది. రోజుకు రూ. లక్షలు చేతులు మారుతున్నాయి. ఉదయం పూట ఆట ఆడిస్తే రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో అందరికీ తెలుస్తుందని మధ్యాహ్నం 3 గంటలకు ఒక షో ప్రారంభించి సాయంత్రం 5 నుంచి 6 గంటల్లో ముగిస్తారు. రెండో షో రాత్రి 8 నుంచి 9 గంటలకు మొదలెట్టి 11 గంటలలోపు ముగిస్తున్నారు. ఆట ఆడాలంటే ముందుగా ఎంట్రెన్స్ రుసుం రూ.2 వేలు కట్టాల్సిందే. ఒక షోకు ఇలా 15 నుంచి 20 మంది వరకు ఆటగాళ్లు వస్తున్నారు. ఇలా రోజుకు రెండు షోలు కలపి మొత్తం రూ. 80 వేల వరకు కూటమి నేత జూద నిర్వహణలో సొమ్ము చేసుకుంటున్నాడు. రూ. వేలు తీసుకుని పేకాటరాయుళ్లకు కేవలం ‘గ్లాసు’ నీళ్లు, పేకాట కార్డులు సమకూర్చుతున్నట్లు తెలుస్తోంది. ఓ లాడ్జిలో నిర్వహించే స్థావరం పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఉంది. మరో ప్రాంతం బైపాస్ రహదారి వద్ద, ఇంకోటి కూటమి నేత స్వగృహం వద్ద, మరొకటి నిర్మాణంలో ఉన్న భవనంలో ఆడిస్తున్నారు. అక్కడికక్కడే అధిక వడ్డీకి అప్పులు.. పేకాట స్థావరాల వద్ద డబ్బులు పోగొట్టుకున్న వారికి మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకోండి అంటూ అక్కడే వడ్డీ వ్యాపారులు డబ్బులు చేతపట్టుకుని ఆశ పెడతారు. అప్పటికప్పుడు రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకు అప్పులిచ్చే వ్యక్తులే అక్కడే ఉంటున్నారు. వీరి వద్ద కొందరు ఇప్పటికే రూ. లక్షల్లో అప్పు చేసినట్లు తెలుస్తోంది. అధిక వడ్డీలకు అప్పులు తీసుకున్న పేకాట రాయుళ్లు తిరిగి చెల్లించేందుకు ఆస్తులు తాకట్టు పెడుతు న్నారు. ఈ జూద కూపంలో మునిగిన వారిలో కొందరు బంగారు నగలు, ఇళ్ల స్థలాలు అమ్ముకు న్నట్లు తెలుస్తోంది. దర్జాగా కూటమి నేత జూదం నిర్వహణ అనుమానం రాకుండా స్థావరాల మార్పు ఎంట్రీ ఫీజు రూ. 2 వేలు ‘గ్లాసు’ మంచినీళ్లు, కార్డులు మాత్రమే ఉచితం అప్పులు ఇచ్చేందుకు వడ్డీ వ్యాపారులు అక్కడే తిష్ట జూద కూపంలో మునిగి సర్వం కోల్పోతున్న వ్యసనపరులు -
పునర్జన్మ నమ్మకాలపై ఆధారం
● ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి కర్నూలు(హాస్పిటల్): మనిషికి పునర్జన్మలు ఉన్నాయా లేదా అనేది వ్యక్తుల నమ్మకాలపై ఆధార పడి ఉంటాయని, ఆ నమ్మకం మనిషిలో తృప్తి మిగిలిస్తుందని, అదే లేకపోతే మనిషిలో అసంతృప్తి పెరిగిపోయి జీవించినంత కాలం కుంగుబాటుకు గురవుతారని విజయవాడకు చెందిన ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి చెప్పారు. కర్నూలు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం(అలుమ్ని) ఆధ్వ ర్యంలో రెండురోజుల పాటు నిర్వహించిన నిరంతర వైద్య విజ్ఞాన సదస్సు, అలుమ్ని మీట్ ఆదివారం ముగిశాయి. ఈ కళాశాలలో చదివి దేశ,విదేశాల్లో స్థిరపడిన ప్రముఖ వైద్యులు స్పెషాలిటీ, సూపర్స్పెషాలిటీ అంశాలపై సబ్జెక్టుల్లో ఆధునిక వైద్యవిధానాలు, అభివృద్ధి గురించి వివరించారు. పునర్జన్మలు – నమ్మకాల గురించి డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి మాట్లాడారు. పునర్జన్మలపై కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నా సరైన ఫలితాలు కనిపించడం లేదన్నారు. పునర్జన్మలపై తీసిన సినిమాలు మాత్రం సూపర్హిట్ అవుతున్నాయని, దీనిని బట్టి మనుషులకు వాటిపై ఎంతటి నమ్మకం ఉందో అర్థం అవుతుందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు మల్లికార్జున గోఖలే, సదాశివారెడ్డి, సంపత్, ప్రసాద్బాబు, గణేష్, చందనారెడ్డి, డాక్టర్ కేజీ గోవిందరెడ్డి, డాక్టర్ నరసింహులు, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కుమారస్వామిరెడ్డి, సెక్రటరి డాక్టర్ బాలమద్దయ్య, ట్రెజరర్ డాక్టర్ మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
కేఆర్ఎంబీ ఏర్పాటుపై సీఎం నిర్లక్ష్యం
కర్నూలు న్యూసిటీ: కర్నూలులో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఏర్పాటుపై సీఎం చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వహిస్తున్నారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. కర్నూలు నగరం బళ్లారి చౌరస్తాలోని ఒక హోటల్లో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాయలసీమలో ఉపాధిలేక పేద ప్రజలు వలస పోతుంటే సీఎం చంద్రబాబు అమరావతిలో 47 అంతస్తుల ఐకానిక్ భవనా లు నిర్మించి ఎన్ఆర్ఐలకు అమ్ముతామని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. 2018లో గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణానికి పాలన అనుమతులు ఇచ్చిన బాబు ఇప్పుడు దానే ఊసే ఎత్తక పోవ డం దారుణమన్నారు. అనంతరం రాయలసీమ సాధ న సమితి నాయకులు బొజ్జా దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు నియంత పాలన సాగిస్తూ రైతుల హక్కులను కాలరాస్తున్నారన్నారు. రాయలసీమ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను విస్మరించి వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమొత్తారు. సాగునీటి ప్రాజెక్టులపై అఖిలపక్షాలతో చర్చించకుండా ప్రభుత్వం సొంత నిర్ణయాలతో స్వలాభం కోసం అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో కర్నూలు ఏర్పాటైన జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, లోకాయుక్త, మానవ హక్కుల సంఘం కార్యాలయాలను అమరావతికి తరలిస్తుండటం సీమకు ద్రోహ ం చేయడమేన్నారు. వాటిని ఇక్కడే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కడపలో ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీ ణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అక్కడే కొనసాగించాలని అన్నారు. కార్యక్రమంలో రాయలసీమ సాగునీ టి సాధన సమితి అనంతపురం జిల్లా నాయకులు రాంకుమార్, రైతు సంఘం నాయకులు, రామకృష్ణ, రామచంద్రారెడ్డి, మందా జగన్నాథం పాల్గొన్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు -
సమాజ హితానికి రచనలు దోహద పడాలి
కర్నూలు కల్చరల్: సమాజ హితానికి రచనలు దోహద పడాలని, యువ రచయిత్రులు, కవయిత్రులు సాహిత్య రచన చేసేందుకు ముందుకు రావాలని పలువురు సాహితీ వేత్తలు, వక్తలు అభిప్రాయపడ్డారు. ఆదివారం సీక్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం (నరసం) వార్షికోత్సవంలో ప్రముఖ భాషా వేత్త డాక్టర్ జీవీ పూర్ణచంద్, సాహితీ వేత్త కురాడి చంద్రశేఖర కల్కూర, క్లస్టర్ యూనివర్సిటీ వైస్చాన్సలర్ ఆచార్య డీవీఆర్ సాయిగోపాల్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, నరసం రాష్ట్ర అధ్యక్షరాలు లక్ష్మీకళావతి, కార్యదర్శి పాతూరి అన్నపూర్ణ, ఒరిస్సా బరంపురం సాహితీ వేత్త తుర్లపాటి రాజేశ్వరి మాట్లాడారు. రచయిత్రులు సమకాలీన అంశాలపై రచనలు చేసి సమాజానికి ఇతోధికంగా సేవలందించాలన్నారు. నరసం ఏర్పాటు అయ్యాక అనేక సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు భాషకు, సాహిత్యానికి విశేష కృషి చేయడం అభినందనీయమన్నారు. కుటుంబం బాగుంటేనే సమాజం బాగుంటుదన్నారు. కుటుంబంలో ప్రతి ఒక్కరు ఒకరికొకరు గౌరవించుకుంటూ సీ్త్ర పురుషులు సమానంగా ఎదగాలన్నారు.టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య, రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి.పుల్లయ్య, తెలుగు భాషా వికాస ఉద్యమం కార్యదర్శి జేఎస్ఆర్కే శర్మ మాట్లాడారు. కవి సమ్మేళనాలు అలరించాయి. పలువురు రచయిత్రులు రచించిన పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలకు బహుతులను అందజేశారు. నరసం జిల్లా అధ్యక్షులు కా.వెం. సుబ్బలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ దండెబోయిన పార్వతీ దేవి, సభ్యులు పసుపులేటి నీలిమ, చంద్రమౌళిని, హైమావతి, కవులు, రయితలు హరికిషన్, అజీజ్, లక్ష్మయ్య, గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి, ఎలమర్తిరమణయ్య పాల్గొన్నారు. -
చికెన్ సెంటర్లు వెలవెల!
కర్నూలు(అగ్రికల్చర్): బర్డ్ప్లూ ఎఫెక్ట్తో చికెన్ సెంటర్లు వెలవెలబోతున్నాయి. కర్నూలులో ఒక్క ఎన్ఆర్పేటలోనే కాదు.. నగరమంతా చికెన్ విక్రయాలు 10 శాతానికి పడిపోయాయి. కర్నూలు నగరంలో దాదాపు 200 వరకు చికెన్ సెంటర్లు ఉన్నాయి. సగటున ఒక్కో చికెన్ సెంటరు ద్వారా 200– 300 కిలోల వరకు అమ్మకాలు జరుగుతాయి. ఈ ప్రకారం నగరం మొత్తం మీద దాదాపు 6,000 కిలోల వరకు చికెన్ అమ్మకాలు ఉంటాయి. అయితే బర్డ్ప్లూ వెలుగు చూసిన తర్వాత ఆదివారం చికెన్ అమ్మకాలు 10 శాతానికి పడిపోయాయి. దీంతో పౌల్ట్రీ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. చికెన్/గుడ్లను 100 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉడికించి తినవచ్చని అధికారులు ప్రచారం చేస్తున్నప్పటికీ వినియోగదారుల్లో బర్డ్ప్లూ భయం పోవడం లేదు. కర్నూలులో చికెన్ కిలో ధర రూ.200/220 ఉండగా.. ఇతర ప్రాంతాల్లో రూ.150–180కి తగ్గించారు. అయినా వినియోగదారులు ఆసక్తి చూపడంలేదు. ఈక్రమంలో మాంసం, చేపలకు డిమాండ్ పెరిగింది. మటన్ కిలో ధర రూ.800/840 ఉండగా.. తాజాగా రూ.900/1000 పెంచేశారు. అయినా మటన్ అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయి. చేపల అమ్మకాలు నాలుగైదు రెట్లు పెరిగాయి. 6 కిలోలే విక్రయించాం గత ఆదివారం 220 కిలోల చికెన్ విక్రయించాం. ఈ ఆదివారం చికెన్ అడిగే వారే లేరు. కేవలం మూడు కోళ్లు మాత్రమే కోసి ఆరు కిలోల చికెన్ విక్రయించాం. ఇంత దయనీయమైన అమ్మకాలు ఎపుడూ లేవు. కర్నూలులో బాతులకు మాత్రమే బర్డ్ప్లూ వచ్చింది. కోళ్లకు ఎలాంటి బర్డ్ప్లూ లేదు. కోళ్లలో మరణాలు కూడా లేవు. తగిన జాగ్రత్తలతో చికెన్ నిర్భయంగా తినొచ్చు. కానీ వినియోగదారులు మాత్రం భయపడుతున్నారు. – కిశోర్ యాదవ్, చికెన్ సెంటర్ నిర్వాహకుడు వెంకటరమణ కాలనీ, కర్నూలు 10 శాతానికి పడిపోయిన చికెన్ విక్రయాలు ధరలు తగ్గించినప్పటికీ చికెన్పై ఆసక్తి చూపని వినియోగదారులు మటన్, చేపలకు భారీగా పెరిగిన డిమాండ్ అడ్డగోలుగా మటన్ ధరల పెంపు -
రైలు ప్రయాణం రయ్..రయ్
చార్జీలు తక్కువనో, క్షేమంగా గమ్యం చేరుకోవచ్చనో ఏమో కానీ రైళ్ల ప్రయాణానికే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో ప్రయాణికుల రద్దీ పెరిగిపోతోంది. రోజూ నడిచే డెమో కిక్కిరిసిపోతోంది. ఫలితంగా బోగీలు పెంచాలనే డిమాండ్ ప్రయాణికుల నుంచి రోజురోజుకూ పెరిగిపోతోంది. మరిన్ని రైళ్లు నడపాలి నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో ప్రస్తుతం ప్రతి రోజు ఒక డెమో, రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. డెమో రైలు ఉదయం, ఎక్స్ప్రెస్ రైళ్లు రాత్రి వేళ్లల్లో రోజులో ఒకసారి మాత్రమే తిరుగుతున్నాయి. బస్సు ప్రయాణాలకంటే రైలు ప్రయాణం చేసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆయా జిల్లాల ప్రయాణికుల సౌకర్యార్థం ఎక్స్ప్రెస్ రైళ్లు పగటి వేళల్లో నడపటంతోపాటు మరిన్ని రైలు సర్వీసులను ఏర్పాటు చేయాలి. డెమో రైలుకు కూడా అదనపు బోగీలు ఏర్పాటు చేయాలి – దస్తగిరి, సౌదరదిన్నె, కోవెలకుంట్ల మండలంకోవెలకుంట్ల: ఉమ్మడి కర్నూలు– వైఎస్సార్ జిల్లాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు నంద్యాల నుంచి వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల వరకు 130 కిలోమీటర్ల రైల్వేలైన్ ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఉప్పలపాడు, నొస్సం, సంజామల, కోవెలకుంట్ల, బనగానపల్లె, మద్దూరు ప్రాంతాల్లో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. రెండు జిల్లాల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2016 ఆగస్టు నుంచి ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. నంద్యాల నుంచి చిత్తూరు జిల్లా రేణిగుంట వరకు డెమో, అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి రాష్ట్ర రాజధాని అమరావతి మీదుగా మచిలీపట్నం వరకు, గుంటూరు నుంచి తిరుపతికి ప్రతి రోజు ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు ఆయా జిల్లాల పారిశ్రామిక అభివృద్ధికి గూడ్స్ రైళ్లు తిరుగుతున్నాయి. ప్రయాణికులకు రైలు ప్రయాణం మరింత సులభతరం చేసేందుకు రూ.50 కోట్లతో విద్యుత్ లైన్ ఏర్పాటు చేశారు. 2023 మార్చి 29 నుంచి ఈ మార్గంలో విద్యుత్ రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. డీజిల్ ద్వారా నడిచే రైలు ప్రయాణం కంటే విద్యుత్ రైళ్లతో ప్రయాణం వల్ల సమయం ఆదా అయి త్వరగా గమ్యస్థానాలు చేరుకుంటుండటంతో ప్రజలు రైలు ప్రయాణం వైపు మొగ్గు చూపుతున్నారు. కిక్కిరిసిపోతున్న డెమో రైలు నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో మొదట్లో నంద్యాల ఉంచి కడప వరకు డెమో రైలు నడిచేది. రైలు రాకపోకలు ప్రారంభమైన కొన్ని నెలలకు రైలును కడప నుంచి అదే జిల్లా పెండ్లిమర్రి వరకు పొడగించారు. ప్రయాణికుల సౌకర్యార్థం గత ఏడాది నుంచి చిత్తూరు జిల్లా రేణిగుంట వరకు రైలు సేవలను విస్తరించారు. నంద్యాల నుంచి ప్రతి రోజు ఉదయం 6.30 గంటలకు రైలు బయలుదేరుతుండటంతో నంద్యాల, బనగానపల్లె, కోవెలకుంట్ల, సంజామల, వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట తదితర ప్రాంతాల ప్రజలకు రైలు ప్రయాణం సులభతరంగా మారింది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు అనువైన సమయం కావడంతో రైలు ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారు. ఉదయం వెళ్లేందుకు సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరుకునేలా రైలు నడుస్తుండటంతో ప్రతి రోజు డెమో రైలు ప్రయాణికులతో కిక్కిరిసి పోతోంది. నంద్యాల మొదలుకుని చిత్తూరు జిల్లా రేణిగుంట వరకు రైలు బోగీలు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులతోపాటు ఆయా జిల్లాల్లోని వివిధ ముఖ్య పట్టణాలకు బస్సు ప్రయాణం కంటే రైలు ప్రయాణం దగ్గరి మార్గం కావడంతో ఆయా పట్టణాల్లో బంగారు ఆభరణాలు, వస్త్ర వ్యాపారాల నిమిత్తం ప్రజలు, వ్యాపారాలు రైలు ప్రయాణం సాగిస్తున్నారు. ప్రతి రోజు బోగీల్లో సీట్లు నిండిపోయి నిలబడి ప్రయాణాలు సాగిస్తున్నారు. డెమో రైలుకు కనీసం రెండు బోగీలు అదనంగా ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. మరికొన్ని రైళ్లు నడపాలని ప్రతిపాదన కేంద్ర మాజీ హోం సహాయ మంత్రి, బిహార్, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్గా పనిచేసిన సంజామల వాసి దివంగత పెండేకంటి వెంకటసుబ్బయ్య కలల సాకారమైన నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలు క్రమంగా పెరుగుతున్నాయి. రాకపోకలు ప్రారంభమైన మొదట్లో నంద్యాల నుంచి కడప వరకు వారంలో ఆరు రోజులు డెమో రైలు నడిచేది. తర్వాత ఆరు నెలలకు ధర్మవరం నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి వారంలో మూడు రోజుల మాత్రమే ఎక్స్ప్రెస్ రైలు తిరిగేది. 2018 నుంచి డెమో రైలును వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి వరకు పొడిగించడంతోపాటు ఎక్స్ప్రెస్ రైలుతో సహా రెండు రైళ్లు ప్రతి రోజు నడిచేలా రైల్వే అధికారులు చర్యలు తీసుకున్నారు. వీటితో పాటు రెండేళ్ల నుంచి తిరుపతికి ఎక్స్ప్రెస్ రైలు నడుస్తోంది. అలాగే ఉత్తర భారదేశానికి రైలు కనెక్టివిటిని విస్తరించేందుకు 2020వ సంవత్సరం నుంచి ఈ మార్గంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు నడపాలని ప్రతిపాదన ఉండేది. ఆ ఏడాది కరోనా వైరస్ విజృంభించడంతో ఆ ప్రాతిపాదనను రైల్వే అధికారులు రద్దు చేశారు. తిరిగి ఈ ప్రతిపాదనపై రైల్వే శాఖ దృష్టి సారించింది. రాబోయే రోజుల్లో ఈ రైలు పట్టాలెక్కితే నంద్యాల, ఉమ్మడి వైఎస్సార్ జిల్లాల ప్రజలకు రైలు ప్రయాణం మరింత చేరువకానుంది. ఈ రైలుతోపాటు నంద్యాల–ఎర్రగుంట్ల మార్గంలో మరిన్ని రైళ్లను నడిపేందుకు కేంద్ర రైల్వేశాఖ కసరత్తు చేస్తుండటంతో ఆయా జిల్లాల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి రైలుకు తగ్గని రద్దీ నంద్యాల–ఎర్రగుంట్ల మార్గంలో 2022 ఆగస్టు 18 నుంచి గుంటూరు నుంచి తిరుపతికి ఎక్స్ప్రెస్ రైలు నడుస్తోంది. గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లె, ప్రొద్దుటూరు, కడప, రాజంపేట, రేణిగుంట రైల్వేస్టేషన్లలో మాత్రమే ఎక్స్ప్రెస్ రైలు ఆగేది. రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల అభ్యర్థన మేరకు నంద్యాల జిల్లా కోవెలకుంట్ల, వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు రైల్వేస్టేషన్లలో స్టాపింగ్ ఏర్పాటు చేశారు. తిరుపతి వెంకన్నస్వామి దర్శనానికి రైలు ప్రయాణం దగ్గరి మార్గం కావడంతో అదనంగా జనరల్ బోగీలు ఏర్పాటు చేయాలని ఆయా జిల్లాల ప్రయాణికులు రైల్వేశాఖ అధికారులను కోరుతున్నారు రైలు ప్రయాణానికే ప్రయాణికుల మొగ్గు నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో తగ్గని రద్దీ ప్రతి రోజు డెమో హౌస్ఫుల్ బోగీలు పెంచాలని బలపడుతున్న డిమాండ్ -
భార్య డబ్బులివ్వలేదని భర్త బలవన్మరణం
నందికొట్కూరు: మద్యం తాగేందుకు భార్య డబ్బులివ్వలేదని బైరెడ్డి నగర్కు చెందిన బోయ నాగన్న(37) ఇంట్లో ఉరేసుకుని బలవనర్మరణానికి పాల్పడ్డాడు. రామచంద్ర తెలిపిన వివరాలు.. నాగన్న కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో ఆదివారం మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వాలని భార్య వరలక్ష్మిని కోరగా లేవని చెప్పి ఆమె బయటకు వెళ్లింది. తిరిగి వచ్చేలోపే ఉరికి వేళాడుతూ కనిపించాడు. కుటుంబ సభ్యులు కిందకు దించి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. ఆటో చోరీ డోన్ టౌన్: పట్టణంలోని తారకరామనగర్కు చెందిన తిక్కయ్య తన ఆటోను ఇంటి బయట పార్కు చేసి ఉంచగా గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి అపహరించుకెళ్లారు. ఆదివారం ఉదయం బాధితుడు నిద్ర లేచి చూడగా ఇంటి బయట ఆటో కన్పించక పోవడంతో చుట్టుపక్కల గాలించాడు. ఎలాంటి సమాచారం లభించకపోవడంతో చోరీకి గురైనట్లు నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తిక్కయ్య తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య కొలిమిగుండ్ల: మండల పరిధిలోని ఎస్.చెన్నంపల్లెలో బోయ అంజి(39) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ రమేష్బాబు తెలిపిన వివరాలు.. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న అంజి కుటుంబ పోషణ భారం కావడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య మధుసుప్రియ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. 190 కోళ్లు మృతి గడివేముల: మండల కేంద్రంలోని పలు చికెన్ దుకాణల్లో ఆదివారం కోళ్లు మృతి చెందాయి. నాలుగు చికెన్ సెంటర్లు ఉండగా రెండు రోజుల క్రితం ఓ చికెన్ సెంటర్లో 120 కోళ్లు, మరో చికెన్ సెంటర్లో 70 కోళ్ల దాకా మృతి చెందడంతో ఆ సెంటర్లను మూసివేశారు. బర్డ్ఫ్లూ భయంతో చికెన్ తినేవారి సంఖ్య తగ్గడంతో మిగతా దుకాణాలు కూడా బోసిపోయాయి. దళితులను విడగొట్టేందుకు కుట్ర కర్నూలు(అర్బన్): దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలు, దళితులను విడగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని మాల మహానాడు వ్యవస్థాపకులు, స్వర్గీయ పీవీ రావు సోదరుడు, మాజీ ఐడీఏఎస్ అధికారి పీఎస్ఎన్ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక ఓ హోటల్లో మాల జేఏసీ ముఖ్య నేతలతో ఆయన సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది ఆగస్టు 1న ఎస్సీ ఉప వర్గీకరణకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు రాజ్యాంగబద్ధత లేదన్నారు. దేశంలోని ఏపీ, తెలంగాణ, పంజాబ్, హర్యాణ, తమిళనాడు రాష్ట్రాలు మినహా మిగిలిన 24 రాష్ట్రాలు ఈ తీర్పును వ్యతిరేకిస్తున్నాయన్నారు. సుప్రీం తీర్పు అనంతరం ప్రాంతీయ సమస్యగా ఉన్న ఈ అంశం ప్రస్తుతం జాతీయ సమస్యగా మారిందన్నారు. ఈ తీర్పు వల్ల దేశ వ్యాప్తంగా 30 లక్షల మంది దళితులు రోడ్డు పైకి వచ్చారన్నారు. ఒక కులాన్ని జాబితాలో చేర్చాలన్నా, తొలగించాలన్నా కేవలం పార్లమెంట్కు మాత్రమే అధికారం ఉందన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా ఈనెల 23న కర్నూలులో, మార్చి 23న తిరుపతిలో రాయలసీమ మాలల యుద్ధ గర్జన సభలు నిర్వహిస్తున్నారన్నారు. మాలలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభలను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం యుద్ధ గర్జన కరపత్రాలను విడుదల చేశారు. సమావేశంలో మాల జేఏసీ నేతలు గోన నాగరాజు, మాధవస్వామి, పి.రాజీవ్కుమార్, నరసప్ప తదితరులు పాల్గొన్నారు. -
అ‘పూర్వ’ సమ్మేళనం
వెల్దుర్తి: రామళ్లకోట జిల్లా పరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. పాఠశాల 1981–82 పదవ తరగతి బ్యాచ్తోపాటు 1977 నుంచి 82 వరకు చదువుకున్న చుట్టుపక్కల గ్రామాల వారు సమావేశానికి హాజరయ్యారు. 42 ఏళ్ల తర్వాత కలుసుకున్న బాల్య స్నేహితులందరూ ఒకరినొకరు చూసుకుని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్య, వైవాహిక, ఉద్యోగ జీవిత విశేషాలు, కుటుంబ నేపథ్యాల గురించి ఒకరికొకరు తెలుసుకుంటూ ఆత్మీయంగా గడిపారు. తమకు చదువు చెప్పిన నాటి ఉపాధ్యాయురాలు సుశీలమ్మను సన్మానించారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. నిర్వాహకులుగా సురేంద్రనాథ్, రాముడు, చిన్నయ్య, దస్తగిరి, మియ్యబాష, లలిత, రామస్వామి వ్యవహరించారు. -
ప్రశాంతంగా ఎన్సీసీ ‘సీ’ సర్టిఫికెట్ పరీక్ష
కర్నూలు కల్చరల్: ఎన్సీసీ ‘సీ’ సర్టిఫికెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. కర్నూలు గ్రూప్లోని 9 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్, 28 ఆంధ్ర బెటాలియన్ కేడెట్స్కు ఆదివారం మెడికల్ కళాశాలలోని పరీక్ష కేంద్రంలో సీ సర్టిఫికెట్కు సంబంధించి థియరీ, ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. 322 మంది బాయ్స్ కేడెట్స్, 340 గర్ల్స్ కేడెట్స్ పరీక్షకు హాజరయ్యారు. కర్నూలు ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ అలోక్ త్రిపాఠి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీ సర్టిఫికెట్ కలిగిన వారు మిగతా వారి కంటే ఎక్కువ ప్రయోజనాలు పొందుతారన్నారు. అన్ని యూనిఫాం సర్వీసుల్లో చేరేందుకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. సాఫ్ట్వేర్, మెడిసిన్, ఐటీ, సివిల్ సర్వీసెస్లకు సంబంధించి కానీ ఏదైనా కంపెనీ ఇంటర్వ్యూలకు వెళ్లినప్పుడు ఎన్సీసీ హోల్డర్కు ప్రాధాన్యత ఇస్తారన్నారు. ఆయనతో పాటు 9 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ గ్రూప్ కమాండింగ్ ఆఫీసర్ జోబి ఫిలిప్, 28 ఆంధ్ర బెటాలియన్ లెఫ్ట్నెంట్ కల్నల్ ప్రసాద్, సెంట్రల్ అబ్జర్వర్ కల్నల్ పార్మర్ ఉన్నారు. -
ఎస్టీ రిజర్వేషన్ కోసం పోరాడతాం
● ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ కర్నూలు న్యూసిటీ: వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ కోసం పార్టీలకు అతీతంగా పోరాడతామని ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ తెలిపారు. బళ్లారి చౌరస్తాలోని ఓ హోటల్లో న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళం–ప్రజాపతినిధుల సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని 70 ఏళ్లుగా పోరాడుతున్నామన్నారు. వాల్మీకుల బలగం వల్లే తమకు ఈ రాజకీయ పదవులు లభించాయన్నారు. కులానికి న్యాయం చేయాలనేదే తమ జీవిత ఆశయమన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో శాసన మండలిలో వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్లపై చర్చించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఆదోని ఎమ్మెల్యే పార్ధసారధి మాట్లాడుతూ ప్రస్తుతం వాల్మీకులు నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉండడం గర్వకారణమన్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది రాజకీయంగా ఎదిగేలా కృషి చేయాలన్నారు. 13 టిప్పర్లు స్వాధీనం బనగానపల్లె రూరల్: బనగానపల్లె ప్రాంతం నుంచి పలు చోట్లకు అధిక మోతాదులో సుద్ద పౌడర్ను రవాణా చేస్తున్న 13 టిప్పర్లను స్వాధీనం చేసుకునట్లు ఎస్ఐ దుగ్గిరెడ్డి ఆదివారం తెలిపారు. బేతంచర్ల రోడ్డు, యాగంటిపల్లె రోడ్లపై వాహనాలను తనిఖీ చేస్తుండగా సుద్ద పౌడర్ టిప్పర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని, వీటిని మైనింగ్ అఽధికారులకు అప్పగించనున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పేరుకుపోతున్న గుడ్ల నిల్వలు
బర్డ్ఫ్లూ వెలుగు చూసిన తర్వాత గుడ్ల వినియోగం భారీగా పడిపోయింది. జనవరి నెల చివరి వరకు 100 గుడ్ల ధర రూ.500 పైబడి ఉంది. బర్డ్ఫ్లూ ప్రచారం మొదలైన తర్వాత గుడ్లకు డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది. కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో గుడ్ల ఫారాలు ఉన్నాయి. ఇక్కడి ఫారంలో రెండు లక్షల కోళ్లు ఉన్నాయి. రోజుకు 40 వేల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. గుడ్లను అడిగే వారు లేరు. బాగా ఉడికించి తినే అవకాశం ఉన్నప్పటికీ వినియోగదారులు భయపడుతుండటంతో డిమాండ్ పడిపోయింది. నేడు 100 గుడ్ల ధర రైతు దగ్గర రూ.370కి పడిపోయింది. జిల్లా నుంచి గుడ్లు బయటికి వెళ్లకుండా చెక్పోస్టులు పెట్టడంతో నిల్వలు పేరుకపోతున్నాయి. -
ఐకమత్యంతో నగరాభివృద్ధికి పాటుపడదాం
కర్నూలు (టౌన్): ‘నగర పాలక సంస్థ ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. పాలకవర్గ సభ్యులందరూ ఐకమత్యంతో నగరాభివృద్ధికి పాటుపడదాం’ అని వైఎస్సార్సీపీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి పిలుపు నిచ్చారు. శనివారం సాయంత్రం గుత్తి పెట్రోల్ బంకు సమీపంలోని ఓ హోటల్లో ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు, మాజీ జిల్లా అధ్యక్షు రాలు సిట్రా సత్యనారాయణమ్మ కలిసి కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో సుదీర్ఘంగా పలు సమస్యలపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు, నగర మేయర్, డిప్యూటీ మేయర్లు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, కార్పొ రేటర్లతో ప్రత్యేక సమావేశం కానున్నారని వెల్లడించారు. ఈ సమావేశంలో రాజకీయ అంశాలు, నగరాభివృద్ధి, అధికార పార్టీ కుట్రలు, కుతాంత్రాల ను దీటుగా ఎదుర్కోవడంపై చర్చించనున్నట్లు తెలి పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కర్నూ లు నగరంలో నాలుగేళ్లుగా రూ. 720 కోట్లతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపించామన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో నగరంలో అభివృద్ధి పనులు అటకెక్కాయన్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం కింద ఆయా వార్డుల్లో రూ.34 కోట్లతో చేపట్టాల్సిన 160 పనులను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ఇంకా ఏడాది పాటు వైఎస్సార్సీపీ పాలకవర్గానికి గడువు ఉందని, అందరూ కలిసి కట్టుగా పనిచేసి ప్రజలకు అండగా నిలుద్దామన్నారు. సమావేశంలో నగరపాలక వర్గ సంస్థ స్టాండింగ్ కమిటీ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. 18న మాజీ సీఎం జగన్తో పాలక వర్గ సభ్యుల భేటీ వైఎస్సార్సీపీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు ఎస్వీ, కాటసాని -
స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దుదాం
గోనెగండ్ల: అందరి భాగస్వామ్యంతో స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దుదామని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అన్నారు. శనివారం మండల కేంద్రం గోనెగండ్లలో నిర్వహించిన స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం లక్ష్మీపేటలో ఆయన అధికారులతో కలసి చీపురు చేతపట్టి చెత్తను ఊడ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేయడంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. మన ఊరు.. మన ఇళ్లు.. వీధి శుభ్రంగా ఉంచుకోవాలనే సంకల్పం ప్రజల్లో ఉండాలన్నారు. స్వచ్ఛ గోనెగండ్లగా తీర్చిదిద్ది అవార్డు పొందాలన్నారు. చెత్త సంపద తయారీ కేంద్రాలు గ్రామ పంచాయతీలకు ఆదాయ వనరులుగా మారాలని సూచించారు. గ్రామస్తులకు సొంత స్థలాలు ఉంటే వాటిలో కంపోస్టు పిట్లు తవ్వుకుని వర్మీకంపోస్టు తయారు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం క్లాప్ మిత్రలను శాలువతో సత్కరించారు. చెత్త సంపద తయారీ కేంద్రంలో కలెక్టర్ కొబ్బరి మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారిణి వరలక్ష్మి, డీపీఓ భాస్కర్, డీఎల్పీఓ నూర్జహాన్, తహసీల్దార్ కుమారస్వామి, ఈఓఆర్డీ అనంతసేన, సర్పంచ్ హైమావతి తదితరులు పాల్గొన్నారు. తడి, పొడి చెత్త వేరుపై అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా -
కేఎంసీ మానవతా విలువలు నేర్పింది
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కళాశాల ఎంతో మందికి మానవతా విలువలు నేర్పిందని రిటైర్డ్ డీజీపీ డాక్టర్ డీటీ నాయక్ అన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం(అలుమ్ని) ఆధ్వర్యంలో రెండురోజుల పాటు నిర్వహించే నిరంతర వైద్యవిజ్ఞాన సదస్సు, అలుమ్ని మీట్ శనివారం కళాశాలలో ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన కేఎంసీ పూర్వ విద్యార్థి డాక్టర్ డీటీ నాయక్ మాట్లాడుతూ తాను ఈ జిల్లాకు చెందినవాడినేనని, అందుకే ఈ ప్రాంతమంటే తనకు ప్రత్యేక అభిమానముందన్నారు. త్యాగమంటే ఈ ప్రాంతం వారిదేనన్నారు. ఏకంగా రాజధానినే ఈ ప్రాంతం త్యాగం చేసిందని, అందుకే ప్రతిఫలంగా కేఎంసీ దక్కిందన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారని, ఎక్కడికి వెళ్లినా కేఎంసీ పేరు వినిపిస్తుందని తెలిపారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ సాధించిన డాక్టర్ నాగేశ్వరరెడ్డి కూడా ఈ కళాశాల పూర్వ విద్యార్థి కావడం తనకు ఎంతో గర్వంగా ఉంటుందన్నారు. ● మాజీ ఎంపీ డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి మాట్లాడుతూ తాను నాలుగు దశాబ్దాల క్రితం 1966 బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థిగా ఈ కాలేజీలో చదివాననన్నారు. అప్పట్లో వైద్యవిద్యార్థి సంఘం నాయకునిగా తాను ఎన్నికై నట్లు గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఎన్నో నాయకత్వ విలువలు నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. ● అమెరికాలో స్థిరపడిన పూర్వ విద్యార్థి, గైనకాలజిస్టు డాక్టర్ గురురాజ మాట్లాడుతూ ఈ కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సహకరించాలని, ఒక్కరు ఇవ్వడం మొదలు పెడితే అందరూ ముందుకు వస్తారని సూచించారు. ● కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ మాట్లాడుతూ ఈ కళాశాల 50 సీట్ల నుంచి 250 ఎంబీబీఎస్ సీట్లకు చేరుకుందని, పీజీ సీట్లు కూడా ప్రస్తుతం స్పెషాలిటీ 175, సూపర్స్పెషాలిటీ 19 సీట్లు ఉన్నాయన్నారు. ● ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మంచి వైద్యసేవలు అందించడం పట్ల అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వ్యాధినిర్ధారణ పరీక్షలపై ఎక్కువ దృష్టిసారించామన్నారు. ● అనంతరం దేశ, విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులచే నిరంతర వైద్య విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆయా రంగాల్లో వారు సాధించిన ప్రగతి, ఆధునిక వైద్యవిజ్ఞానం గురించి వివరించారు. ● కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ పి. శాంతికళ, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ బి.కుమారస్వామిరెడ్డి, సెక్రటరి డాక్టర్ జి. బాలమద్దయ్య, సైంటిఫిక్ కమిటి మెంబర్ డాక్టర్ విక్రమకుమార్రెడ్డి, అలుమ్ని చైర్మన్ డాక్టర్ సదాశివారెడ్డి, అలుమ్ని పూర్వ ప్రెసిడెంట్ డాక్టర్ నరసింహులు, ట్రెజరర్ డాక్టర్ మహేశ్వరరెడ్డి, డాక్టర్ ఐ. రమేష్, డాక్టర్ సి. ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. రిటైర్డ్ డీజీపీ డాక్టర్ డీటీ నాయక్ అట్టహాసంగా అలుమ్ని మీట్ ప్రారంభం -
కోళ్లు, గుడ్ల సరఫరా నిలిపివేత
నందవరం: బర్డ్ఫ్లూ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో కోళ్లు, గుడ్ల సరఫరాను నిలిపివేసినట్లు వెటర్నరీ డాక్టర్ వరలక్ష్మి, ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. నాగలదిన్నె గ్రామంలోని ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టులో శనివారం వాహనా ల తనిఖీ చేపట్టారు. ఎమ్మిగనూరు నుంచి ఎలాంటి అనుమతులు లేని 30 వేల గుడ్లతో వచ్చి బొలెరో వాహనాన్ని తనిఖీ చేసి వెనక్కి పంపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతానికి సరఫరా చేయాలంటే తప్పనిసరిగా ఉన్నతాధికారుల అనుమతి పత్రాలు చూపించాలన్నారు. ఎలాంటి అనుమతులు లేని గుడ్లు, కోళ్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు వెటర్నరీ డాక్టర్ వెల్లడించారు. తనిఖీలో వెటర్నరీ అసిస్టెంట్ సుధాకర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
మేలుజాతి దూడల ప్రదర్శన
డోన్: సీసంగుంతల గ్రామంలో మేలు జాతి గేదె, ఆవు దూడల ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనను ఉమ్మడి కర్నూలు జిల్లా పశువైద్యశాఖ కార్యనిర్వాహక ముఖ్య అధికారి డాక్టర్ రాజశేఖర్ పరిశీలించారు. ప్రాంతీయ పశువైద్యశాల వైద్యులు డాక్టర్ నాగరాజు, శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ.. మేలుజాతి పాడి పశువులకు కృత్రిమ గర్భధారణతో పశుపోషకులు లబ్ధి పొందవచ్చన్నారు. ఈతకు ఈతకు మధ్య దూరం తగ్గించాలన్నారు. పాడిరైతులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. పశువైద్యులు ఉసేన్బాషా, డాక్టర్ హరీష్, డాక్టర్ భాను, సిబ్బంది రఫి, కృష్ణా, నవ్య, డాక్టర్ సాయికీర్తి తదితరులు పాల్గొన్నారు. -
బాలల్లో నేర స్వభావాన్ని నియంత్రించాలి
● జిల్లా జడ్జి కబర్ధి కర్నూలు: బాల నేరస్తుల్లో ఉండే నేర స్వభావాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించి వారికి కౌన్సెలింగ్, విద్యాబోధన ద్వారా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి కబర్ధి అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కబర్ధి, కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి శనివారం జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్లో బాలుల న్యాయ చట్టం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కబర్ధి మాట్లాడుతూ అంతర్జాతీయ బాలల ఒడంబడిక ప్రకారం రాజ్యాంగంలో పొందుపరచిన ప్రత్యేక నిబంధనలపై పోలీసు అధికారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కర్నూలు డీసీపీఓ శారద, నంద్యాల డీసీపీఓ స్వప్న ప్రియదర్శిని, జేజేబీ మెంబర్లు మాధవి, సునిత, ఉమ్మడి జిల్లాల ప్రత్యేక జ్యువైనల్ పోలీసు యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు. -
రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు కల్చరల్: కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్బాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు అందజేయాలన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్తో పాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం వెల్దుర్తి: సూక్ష్మ, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తున్నాయని ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఉమాదేవి అన్నారు. శనివారం ఆమె మండల కేంద్రంలో పీఎమ్ఎఫ్ఎమ్ఈ స్కీం కింద ఏర్పాటు చేసుకున్న దాల్ మిల్, మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మార్కెటింగ్ అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయం, పాడి, మత్స్య సంపదలకు అనుబంధంగా ఆహార ఉత్పత్తి పరిశ్రమల ఏర్పాటుతో అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. 18 నుంచి 55 ఏళ్లలోపు వారికి సబ్సిడీతోపాటు యూనిట్ కాస్ట్లో కేవ లం 10 శాతం పెట్టుబడితో బ్యాంకుల ద్వారా 90 శాతం రుణ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఆసక్తి ఉన్న వారికి సాంకేతిక శిక్షణ అందించడంతోపాటు, వారి ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్, బ్రాండింగ్ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇంటింటి ఫీవర్ సర్వే కర్నూలు(హాస్పిటల్): బాతులకు బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో కర్నూలు నగరంలోని ఎన్ఆర్ పేటలోని ఒక కిలోమీటర్ పరిధిలో వైద్య ఆరోగ్యశాఖ వైద్య సిబ్బంది శనివారం ఇంటింటి ఫీవర్ సర్వే చేపట్టింది. ఎన్ఆర్ పేటలోని 47, 47ఏ, 48 వార్డుల్లోని 89 గృహాల్లో 320 మందికి ఎనిమిది బృందాలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ నాగప్రసాద్ బాబు మాట్లాడుతూ ఇప్పటి వరకు నిర్వహించిన సర్వేలో జ్వర లక్షణాలు కలిగిన వారు లేరన్నారు. కాలానుగుణంగా వచ్చే శ్వాసకోశ వ్యాధులు, సురక్షిత తాగునీటి ప్రాముఖ్యత, ఆహార శుభ్రత , చేతుల శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే సమీప పట్టణ/ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వద్ద, అర్హతగల వైద్యుల మాత్రమే చికిత్స చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఎంవో డాక్టర్ ఉమా, వైద్యాధికారులు డాక్టర్ ఫాతి మా, డాక్టర్ నందిని, ఎపిడమాలజిస్టు వేణుగోపాల్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇంగళదహాళ్ పాఠశాలను స్కూల్ కాంప్లెక్స్గా కొనసాగించాలి హొళగుంద: ఇంగళదహాళ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను స్కూల్ కాంప్లెక్స్గా యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పలు గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. శనివారం హెబ్బటం గ్రామంలో జరిగే స్కూల్ కాంప్లెక్స్ సమా వేశానికి హెచ్ఎంలు వెళ్లకుండా ఇంగళదహాళ్, ఎండీ హళ్లి, పెద్దగోనెహాళ్ గ్రామాల పరిధిలో వచ్చే పాఠశాలల హెచ్ఎంలను ఆయా గ్రామాల సర్పంచ్లు, పాఠశాలల విద్యా కమిటీ చైర్మన్లు, గ్రామస్తులు అడ్డుకున్నారు. సర్పంచ్లు ప్రమిదావతమ్మ, వెంకటరెడ్డి, వెంకట్రామిరెడ్డి, ఎంపీటీసీ మల్లికార్జున, ఎస్సెమ్సీ చైర్మన్లు, విద్యార్థుల తల్లిదండ్రులు.. తమ గ్రామాల్లోని పాఠశాలల హెచ్ఎంలకు వినతి పత్రాలు అందజేశారు. కాంప్లెక్స్ సమావేశానికి వెళ్లవద్దని హెచ్ఎంలను కోరారు. పెద్దగోనెహాళ్లో సర్పంచ్ కొత్తింటి వెంకటరెడ్డి, వెంకట్రామిరెడ్డి, గ్రామస్తులు పాఠశాల గేటుకు తాళం వేసి హెచ్ఎం, టీచర్లు సమావేశానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న హొళగుంద ఎస్ఐ బాల నరసింహులు ఆ గ్రామానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. చాలా కాలంగా స్కూల్ కాంప్లెక్స్గా ఉన్న ఇంగళదహాళ్ పాఠశాలను తొలగించారని, దాన్ని తిరిగి యథావిధిగా కొనసాగించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. సమస్యను డీఈఓ దృష్టికి తీసుకెళ్తామని గ్రామస్తులకు ఎస్ఐ నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. అనంతరం హెచ్ఎంలు సమావేశానికి వెళ్లారు.