Kurnool District News
-
మొక్క జొన్న పంట దగ్ధం
పాణ్యం: మండల కేంద్రమైన పాణ్యంలోని డొంగు సమీపంలో చేతికొచ్చిన మొక్కజొన్న పంట అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైంది. గ్రామంలోని రైతు వై.వి లింగమయ్యకు చెందిన 3 ఎకరాలు, లింగాల సుబ్రహ్మణ్యంకు చెందిన 3 ఎకరాలు, గుడిపాటి మద్దిలేటికి చెందిన 1.50 ఎకరాల పంట దగ్ధమైంది. పొలంలో మంటలు వ్యాపించడంతో గమనించిన రైతులు నంద్యాల అగ్నిమాపక స్టేషన్కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. మరో రోజుల్లో మూడు రోజుల్లో పంట కోత చేపట్టాల్సిన సమయంలో ప్రమాదం జరగడంతో రైతులు నష్టపోయారు. బోర్ వైర్ నుంచి మంటలు చేలరేగి పంటలకు వ్యాపించినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఎకరానికి రూ. 35వేలకు వరకు పెట్టుబడులు పెట్టామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ నరేంద్రనాథ్రెడ్డి, ఆర్ఐ రాము, వ్యవసాయ అధికారులు దగ్ధమైన పంటను పరిశీలించారు. -
ప్రభుత్వాసుపత్రిలో నాగుపాము కలకలం
ఎమ్మిగనూరురూరల్: స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని పిల్లల వార్డులో గురువారం నాగుపాము కలకలం సృష్టించింది. పిల్లల వార్డులో పామును గుర్తించిన తల్లులు కేకలు వేయటంతో అక్కడ ఉన్న బంధువులు వచ్చి పామును కర్రలతో వార్డు నుంచి బయటకు వెళ్లేలా చేశారు. అనంతరం బయటకు వచ్చిన పామును చంపటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గతంలో చాలా సార్లు పాములు ఆసుపత్రిలో వచ్చిన సంఘటనలు ఉన్నాయి. అసుపత్రి అవరణలో అపరిశుభ్రంగా ఉండటంతో పాములు వార్డుల్లోకి వస్తున్నాయని రోగులు వాపోతున్నారు. శ్రీశైలం ఘాట్లో అదుపుతప్పిన బస్సు ● డ్రైవర్కు తీవ్ర గాయాలు ● 20 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలు శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం ఘాట్ రోడ్డులో గురువారం ఉదయం ఓ ప్రైవేటు బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి కొండచరియను ఢీ కొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు తీవ్ర గాయాలు, 20 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా సిరిగుప్ప ప్రాంతానికి చెందిన 40 మంది భక్తులు తీర్ధయాత్రలకు బయలుదేరారు. గురువారం ఉదయం 8 గంటల సమయంలో చిన్నారుట్ల ఘాట్ రోడ్డులో బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ బస్సు లోయలో పడకుండా పక్కనే ఉన్న కొండ చరియలను ఢీ కొడ్డాడు. ప్రమాదంలో బస్సు డ్రైవర్ ఫయాజ్ (28) తీవ్ర గాయాలయ్యాయి. 20 మంది భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ఫయాజ్ను మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రభుత్వాసుపత్రిలో రోగి అదృశ్యం
కర్నూలు (హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం వచ్చిన ఓ రోగి కనిపించకుండా పోయాడు. కృష్ణగిరి మండలం బాపనదొడ్డికి చెందిన చిన్న ఆంజనేయులు (80)కు ఆయాసం ఉండటంతో కుమారుడు బీరప్ప బుధవారం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చాడు. తండ్రిని ఎమర్జెన్సీ వార్డు వద్దే ఉంచి స్కానింగ్ రిపోర్టు తీసుకునివచ్చే సరికి కనిపించకపోవడంతో ఆయన చుట్టు పక్కల గాలించాడు. కుటుంబ సభ్యులకు సమాచారమివ్వడంతో చెరుకులపాడు, బాపనదొడ్డి, చెట్లమల్లాపురం తదితర గ్రామాల్లో రాత్రి అంతా వెతికారు. చిన్న ఆంజనేయులు ఆచూకీ కానరాకపోవడంతో గురువారం ఉదయం కర్నూలులోని మూడో పట్టణ పోలీస్స్టేషన్లో తన తండ్రి కనిపించడం లేదని బీరప్ప ఫిర్యాదు చేశారు. తన తండ్రి ఆచూకీ తెలిసిన వారు 96664 96775, 70320 85182కు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఏసీబీ కేసులో షరాఫ్ గోపాల్ ఉద్యోగం తొలగింపు కర్నూలు(సెంట్రల్): ప్రస్తుతం కర్నూలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో షరాఫ్గా పనిచేస్తున్న గోపాల్ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ జిల్లా రిజిస్ట్రార్ ఎం.చెన్నకేశవరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 2022 ఏపిల్ర్ 27వ తేదీన కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏక కాలంలో ఏసీబీ దాడి చేసి కల్లూరులో 15 మంది డ్యాకుమెంట్ రైటర్లు, సిబ్బంది నుంచి రూ.55,660, కర్నూలులో 12 మంది డ్యాకుమెంట్రైటర్లు ఇతర ఉద్యోగుల నుంచి రూ.40,470 అనధికార నగదు ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఇందులో కల్లూరు అప్పటి సబ్ రిజిస్ట్రార్ అరుణ్కుమార్, కర్నూలులో షరాఫ్గా పనిచేస్తున్న గోపాల్లపై కేసులను ఏసీబీ నమోదు చేసింది. ఈ క్రమంలో షరాఫ్ గోపాల్పై అభియోగాలు వాస్తవమని తేలడంతో విధుల నుంచి తొలగించాలని డీఐజీని ఆదేశించింది. ఉపాధ్యాయులకు వైద్యపరీక్షలు కర్నూలు (హాస్పిటల్): బదిలీల నేపథ్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులకు గురువారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని ధన్వంతరి హాల్లో వైద్యపరీక్షలు నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వైద్య పరీక్షల్లో మొదటి రోజు 72 మందికి వైద్యులు పరీక్షించి నివేదికలు ఇచ్చారు. శుక్ర, శనివారాల్లో ధన్వంతరి హాలులో ఆర్థోపెడిక్ మినహా మిగిలిన విభాగాల వారు ఆయా విభాగాల్లోనే వైద్యపరీక్షలు నిర్వహించి నివేదికలు ఇవ్వాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. -
గ్రామీణాభివృద్ధిలో పంచాయతీరాజ్ కీలకం
● జిల్లా కలెక్టర్ రంజిత్బాషాకర్నూలు(అర్బన్): గ్రామీణాభివృద్ధి, స్థానిక పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తున్నదని జిల్లా కలెక్టర్ పీ రంజిత్బాషా అన్నారు. గురువారం జిల్లా పరిషత్ మినీ సమావేశ భవనంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2025లో ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థకు 1947 స్వాతంత్య్రం వచ్చిన అనంతరం ఉన్న పరిస్థితికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్లో 243 ఆర్టికల్ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను రూపొందిస్తూ చట్టం చేశారన్నారు. ఈ చట్టాన్ని రాజ్యసభ, లోక్సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో కూడా ఆమోదం చేసిన తరువాత 1993 ఏప్రెల్ 24వ తేదీన నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలోనే పంచాయతీరాజ్ వ్యవస్థలో పర్యవేక్షణ బలోపేతం అయ్యిందన్నారు. పంచాయతీలకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వడం, స్వయం ప్రతిపత్తి కల్పించడం వంటి సంస్కరణలు వచ్చాయన్నారు. ఫైనాన్స్ పరిధిలోకి రావడం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా సక్రమంగా ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు. స్థానిక పాలనా వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడంలో పీఆర్ సంస్థలు కీలకంగా వ్యవహరిస్తున్నాయన్నారు. నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డుకు పెరవలి ఎంపిక.. నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డుల కోసం దేశ వ్యాప్తంగా 1.40 లక్షల దరఖాస్తులు రాగా, ఇందులో ఆరు గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారని కలెక్టర్ చెప్పారు. ఎంపికై న ఆరు గ్రామ పంచాయతీల్లో జిల్లాలోని మద్దికెర మండలం పెరవలి గ్రామ పంచాయతీ ఉండడం అభినందనీయమన్నారు. అలాగే ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ కింద జిల్లాలోని మద్దికెర, హొళగుంద, చిప్పగిరి మండలాలు ఎంపికయ్యాయన్నారు. ఇందులో మద్దికెర మండలం దక్షిణ భారత దేశంలో ప్రథమ స్థానంలో ఉందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1.50 కోట్లను మంజూ రు చేసిందన్నారు. కార్యక్రమంలో పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ పర్యవేక్షక ఇంజనీర్లు వీ రామచంద్రారెడ్డి, బీ నాగేశ్వరరావు, కర్నూలు డివిజినల్ పంచాయతీ అధికారిణి టీ లక్ష్మి, పీఆర్ ఈఈ మద్దన్న, పీఏ టు ఎస్ఈ బండారు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్యూలో నిత్యం సమస్యల ‘పరీక్ష’
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరీక్షల విభాగంలో గందరగోళం వీడటం లేదు. నిత్యం ఏదో ఒక సమస్యతో నెట్టుకురావడం తప్ప పరిష్కార మార్గాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈనెల 23న బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే రెండు కళాశాలల విద్యార్థులకు పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు కూడా హాల్టికెట్లు రాకపోవడంతో ఆందోళన చెందారు. దీంతో పాటు విద్యార్థుల వివరాలతో కూడిన ప్రింటెండ్ ఓఎమ్మార్ షీట్లు ఏర్పాటు చేయలేకపాయారు. డోన్లో ఓ పరీక్ష కేంద్రం, కర్నూలులో ఓ పరీక్ష కేంద్రంలో సుమారు 90 మంది విద్యార్థులతో బఫర్ ఓమ్మార్ షీట్లలో వివరాలు నమోదు చేయించి పరీక్ష రాయించారు. వివరాలు నమోదు చేసే సమయంలో పొరపాటు చేస్తే ఆ విద్యార్థి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. గురువారం జరిగిన పరీక్షకు కర్నూలు ఉస్మానియా కళాశాల కేంద్రంలో శాంతినికేతన్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థి స్థానంలో మరో విద్యార్థి పరీక్ష రాస్తూ పట్టుబడటం పర్యవేక్షణ లోపమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిరాక్స్ ప్రశ్నపత్రాలు రెండు పరీక్ష కేంద్రాల్లో ప్రింటెండ్ కాకుండా జిరాక్స్ ప్రశ్నపత్రాలతో పరీక్షలు రాయిస్తున్నారు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి అర గంట ముందు ప్రశ్నపత్రాల షీల్డ్బండిల్ను తెరుస్తారు. అందులోంచి ప్రశ్నపత్రాలను తీసుకొని వాటిని జిరాక్స్ తీయించి పరీక్షలు రాయిస్తున్నారు. అదే సమయంలో ప్రశ్నా పత్రం లీక్ అయినా, కరెంట్ పోయినా, ప్రింటర్ పనిచేయకపోయినా ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వెబ్సైట్లో కానరాని విద్యార్థుల పేర్లు 2023–25 విద్యా సంవత్సరం బీఈడీ మూడో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫీజును శుక్రవారంలోగా చెల్లించేందుకు వర్సిటీ అధికారులు గడువు విధించారు. అయితే గురవారం అర్ధరాత్రి వరకు ఫీజు చెల్లింపుకు ఎన్ఆర్లో విద్యార్థుల పేర్లు పెట్టలేదు. దీంతో ఒక్కరోజులోనే విద్యార్థులకు ఎప్పుడు సమాచారం ఇవ్వాలి, ఫీజు ఎప్పుడు చెల్లించాలని కళాశాలల యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. ఏజెన్సీ మారడంతో సమస్యలు పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పరీక్ష నిర్వహణ ఏజెన్సీ మారడంతో కొన్ని సాంకేతిక సమస్యలు ఉత్పన్నవుతున్నాయి. త్వరలోనే పరిష్కరిస్తాం. వీసీతో చర్చించి బీఈడీ మూడో సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంచేందుకు నిర్ణయం తీసుకుంటాం. ఒక విద్యార్థి స్థానంలో మరో విద్యార్థి పరీక్ష రాస్తూ దొరకడంతో అతనిపై పోలీస్లకు ఫిర్యాదు చేశాం. – డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు, సీఈ, ఆర్యూ గురువారం ఒక విద్యార్థికి బదులు మరో విద్యార్థి పరీక్ష రాస్తుండగా గుర్తింపు బీఈడీ మూడో సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లింపు నేటితో గడువు పూర్తి ఫీజు చెల్లింపునకు వెబ్సైట్లో కానరాని విద్యార్థుల పేర్లు -
రైతుల పాలిట ‘పగా’కు!
● ఉమ్మడి జిల్లాలో 67,336 ఎకరాల్లో పొగాకు సాగు ● 50వేల టన్నుల వరకు దిగుబడి ● ఇప్పటి వరకు కొనుగోలు 20 వేల టన్నులే.. ● పత్తాలేకుండా పోయిన కంపెనీల ప్రతినిధులు ● రైతుల కష్టాన్ని పట్టించుకోని ప్రభుత్వం ● అకాల వర్షాలతో దిక్కుతోచని రైతులు -
అహోబిలం.. ‘వసంత’ వైభవం
ఆళ్లగడ్డ: దిగువ అహోబిలంలో వసంతోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. వసంత రుతువులో శ్రీ లక్ష్మీనరసింహస్వామికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు. ఎండ వేడి నుంచి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావడంతో ఉపశమనోత్సవం అని కూడా అంటారు. ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతో పాటు పలురకాల మధురఫలాలను స్వామికి నివేదిస్తారు. వేడుకల కోసం దేవాలయం ఎదరుగా భాష్యకార మండపంలో ఆకర్షణీయంగా మండపాన్ని తీర్చిదిద్దారు. అలాగే పలురకాల వృక్షాల ప్రతిరూపాలతో నల్లమల అడవిని తలపించేలా మండపాన్ని తీర్చిదిద్దారు. గురువారం ఉదయం నిత్య పూజలు అనంతరం యాగశాలకు చేరుకున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను కొలువుంచారు. ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాలు, అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య తిరుమంజనం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
సాగు పెరిగి.. నష్టాలు మిగిలి
ఉమ్మడి జిల్లాలో పొగాకు సాగు లేని మండలం లేదంటే అతిశయోక్తి కాదు. 10 ఎకరాల నుంచి 100 ఎకరాలు సాగు చేసిన రైతులు ఉన్నారు. ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు కౌలుకు తీసుకొని మరీ సాగు చేశారు. 2023–24లో రికార్డు స్థాయి ధరలు లభించడంతో ఈ ఏడాది రైతులు సాగుకు రెండు జిల్లాల్లో పోటీపడ్డారు. కంపెనీలు కూడా అదేవిధంగా ప్రోత్సహించాయి. 2024–25లో కర్నూలు జిల్లాలో 36,471 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 30,865 ఎకరాల్లో పొగాకు సాగయింది. 2023–24తో పోలిస్తే 48,959 ఎకరాల్లో అదనంగా సాగు చేయడం విశేషం. విత్తనం మొదలు పొగాకును కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లే వరకు ఎకరాకు రూ.60 వేల వరకు పెట్టుబడి పెడుతున్నారు. ఎకరాకు సగటున 4 క్వింటాళ్ల వరకు మాత్రమే దిగుబడి వచ్చింది. కంపెనీలు అరకొరగా కొనుగోలు చేసి చేతులెత్తేయడంతో రైతులు రోడ్డెక్కుతున్నారు. -
నేడు మార్కెట్యార్డుకు సెలవు
ఆదోని అర్బన్: జమ్మూ కశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని నిరసిస్తూ శుక్రవారం ఆదోని వ్యవసాయ మార్కెట్యార్డుకు సెలవు ఇవ్వాలని కమీషన్ ఏజెంట్లు, గుమస్తా, మర్చంట్ అసోసియేషన్ నాయకులు గురువారం యార్డు అసిస్టెంట్ సెక్రటరీ శాంతకుమార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు రాజాగౌడ్, లక్ష్మన్న మాట్లాడారు. ముస్లిం దేశాల్లో హిందువులకు రక్షణలేదని, హిందువులున్న దేశంలో కూడా హిందువులకు రక్షణ లేకపోవడం ఘోరమన్నారు. జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ శుక్రవారం సెలవు ప్రకటించాలని కోరారు. ఇందుకు యార్డు అధికారులు అంగీకరించారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీగా డాక్టర్ పి.చంద్రశేఖర్ కర్నూలు(హాస్పిటల్): డాక్టర్ ఎన్టిఆర్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్గా కర్నూలుకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ పి.చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గురువారం జీఓ విడుదల చేశారు. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగుతారు. ఆయన 1960 సంవత్సరం ఆగస్టు 14న జిడి.లక్ష్మణదాస్, జి.సావిత్రమ్మలకు కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామంలో జన్మించారు. తండ్రి జిడీ. లక్ష్మణదాస్ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేశారు. డాక్టర్ పి.చంద్రశేఖర్ కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్గా 38 ఏళ్ల పాటు పనిచేసి పదవీ విరమణ చెందారు. అనంతరం ఆయన కార్డియాలజి విభాగంలోనే తిరిగి ప్రొఫెసర్గా నియమితులయ్యారు. కానిస్టేబుల్ అభ్యర్థులకు జూన్ 1న రాత పరీక్ష కర్నూలు: కానిస్టేబుల్ అభ్యర్థులకు జూన్ 1వ తేదీన తుది రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు నియామక మండలి ప్రకటన విడుదల చేసింది. పోలీస్ కానిస్టేబుల్, సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో పోస్టులకు సంబంధించి ప్రాథమిక రాత పరీక్ష 2023 జనవరి 22న జరిగింది. అర్హత సాధించిన వారికి 2024 డిసెంబర్ 30 నుంచి 2025 ఫిబ్రవరి 1 వరకు కర్నూలు ఏపీఎస్పీ రెండో పటాలం మైదానంలో దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేశారు. ఇందులో అర్హత సాధించిన వారందరికీ జూన్ 1న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు htt pr://rprb.ap.gov.inను సందర్శించాలని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయురాలు సర్వీస్ నుంచి తొలగింపు కర్నూలు సిటీ: కర్నూలు నగరంలోని బి.క్యాంపు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి.శారదాదేవిని సర్వీసు నుంచి తొలగిస్తూ ఆర్జేడీ శామ్యూల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న ఆమెను అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ కింద అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బదిలీ చేశారు. గతంలో కర్నూలులో పని చేసే సమయంలో జరిగిన కొన్ని వివాదాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే శారదాదేవి అక్కడ విధుల్లో చేరకపోవడంతో సర్వీసు నుంచి తొలగించారు. తనయుడు ఫెయిల్ అయ్యాడని తల్లి ఆత్మహత్య కర్నూలు: పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో కుమారుడు భరత్బాబు ఫెయిల్ అయ్యాడనే మనస్థాపంతో తల్లి బెజవాడ లక్ష్మీజ్యోతి (39) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రవి, లక్ష్మీజ్యోతి దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం కాగా మొదటి కుమారుడు భరత్ బాబు పదవ తరగతి పరీక్షల్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. బుధవారం ఫలితాలు వెలువడగా రాత్రి తల్లి లక్ష్మీజ్యోతి కర్నూలు నగరంలోని ఇంట్లోనే చీరతో ఉరేసుకుంది. ఆమె భర్త గుర్తించి ఉరి నుంచి తప్పించి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తల్లి రేపల్లె సుగుణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండో పట్టణ ఎస్ఐ మల్లికార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కుక్కను తప్పించబోయి..
పత్తికొండ రూరల్: పత్తికొండ–కర్నూలు రోడ్డులో అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి బుధవారం కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. సిమెంట్నగర్కు చెందిన భానుప్రకాశ్, శంకరమ్మ దంపతులు, ఇద్దరు పిల్లలు కలిసి మద్దికెరలోని మామ మనవరాలి నామకరణ మహోత్సవానికి కర్నూలు నుంచి కారులో బయల్దేరారు. పత్తికొండ సమీపంలో ప్రధాన రోడ్డుకు అడ్డంగా కుక్క రావడంతో దాన్ని తప్పించబోగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్లలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. -
టీడీపీ నేత మమ్మల్ని వేధిస్తున్నాడు
● పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట పత్తికొండ మహిళల ఆందోళన కర్నూలు(రూరల్): పత్తికొండ షాడో ఎమ్మెల్యేగా చెలమణి అవుతున్న సాంబశివారెడ్డి తమను వేధిస్తున్నాడని అతనిపై పార్టీ హైకమాండ్ చర్యలు తీసుకోవాలని బాధిత మహిళలు ఆందోళనకు దిగారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ మహిళ ఐక్య వేదిక వ్యవస్థాపకురాలు పట్నం రాజేశ్వరి, రాష్ట్ర అధ్యక్షరాలు నంది విజయలక్ష్మి ఆధ్వర్యంలో వారు బుధవారం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉన్న తమను కనీసం గౌరవం ఇవ్వకపోగా ప్రతి పనిలో అడ్డు తగులుతున్నాడని పత్తికొండ రామచంద్రరెడ్డినగర్, కొండగేరికి చెందిన పార్వతీబాయి, లలితాబాయి, కురువ లలిత, కురువ వరలక్ష్మి కుటుంబాలు వాపోయాయి. పొదుపు సంఘాల్లో జోక్యం చేసుకుంటూ విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్గా తుగ్గలి మహిళను తీసుకొచ్చి పెట్టారన్నారు. ఈ అన్యాయంపై అధికారులకు కలిసి విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ ఆందోళనలో పొదుపు సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
పల్లె ముంగిట్లోనే ‘పాలన’
వైఎస్సార్సీపీ హయాంలో విప్లవాత్మక సంస్కరణలు ● దేశంలోనే ఆదర్శంగా సచివాలయ వ్యవస్థ ● ఆర్డీఓల తరహాలో డీఎల్డీఓ పోస్టులు ● నెరవేరిన ఎంపీడీఓల దశాబ్దాల కల ● జిల్లా అధికారులుగా పదోన్నతి పొందిన ఎంపీడీఓలు ● పర్యవేక్షకులను ఏఓలుగా గుర్తించి గెజిటెడ్ హోదా ● సచివాలయ ఉద్యోగులకు పేస్కేల్ అమలు ● నేడు పంచాయతీరాజ్ దినోత్సవం కర్నూలు(అర్బన్): వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వందల సంఖ్యలో ఉద్యోగులకు పదోన్నతుల పరంపర ప్రారంభమైంది. ముఖ్యంగా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పదవీ విరమణ అయ్యేంతవరకు ఎలాంటి పదోన్నతులు లేకుండా ఉన్న ఎంపీడీఓలకు పదోన్నతులు కల్పించి గత ప్రభుత్వం చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. 2022 ఆగష్టు నెలలో అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల జిల్లాలో అర్హులైన దాదాపు 17 మంది ఎంపీడీఓలు వివిధ ప్రభుత్వ శాఖల్లో జిల్లా అధికారులుగా పదోన్నతి పొందారు. వీరి కంటే ముందు ( 2020 అక్టోబర్ నెలలో ) రెవెన్యూ శాఖలో ఉన్న విధంగానే ( ఆర్డీఓ తరహాలో ) పంచాయతీరాజ్ శాఖలో కూడా డివిజన్ స్థాయిలో డీఎల్డీఓ పో స్టును క్రియేట్ చేసి అర్హులకు పదోన్నతులు కల్పించారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాకు ముగ్గురు డీఎల్డీఓలు వచ్చారు. ఎంపీడీఓలకు పదోన్నతులు ప్రారంభం కాగానే, క్షేత్ర స్థాయి (ఆఫీస్ సబార్డినేట్) నుంచి పదోన్నతుల ప్రక్రియ ఊపందుకుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అర్హత కలిగిన 17 మంది ఎంపీడీఓలు జిల్లా స్థాయి అధికారులుగా పదోన్నతిపై వెళ్లగా, వారి స్థానంలో 14 మంది ఏఓ, 13 మంది ఈఓఆర్డీలకు 2023 మే నెలలో ఎంపీడీఓలుగా పదోన్నతి కల్పించారు. వీరి స్థానంలో 9 మంది సీనియర్ అసిస్టెంట్లు, 15 మంది గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శులకు ఈఓఆర్డీలుగా పదోన్నతి లభించింది. ఈ నేపథ్యంలోనే సీనియర్, జూనియర్ సహాయకులు, టైపిస్టులు, రికార్డు అసిస్టెంట్లకు వారి అర్హతలను బట్టి పదోన్నతులు దక్కాయి. పర్యవేక్షకులను ఏఓలుగా గెజిటెడ్ హోదా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన వివిధ కార్యాలయాల్లో (ఎంపీడీఓ, జెడ్పీ, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్) పర్యవేక్షకులుగా(సూపరింటెండెంట్ ) ఉన్న వారిని పరిపాలనాధికారులుగా (ఏఓ)లుగా గుర్తించారు. వీరికి గెజిటెడ్ హోదా కల్పించిన ఘనత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కింది. దేశానికే తలమానికంగా సచివాలయ వ్యవస్థ వైఎస్సార్పీపీ పాలనలో ఏర్పాటైన సచివాలయ వ్యవస్థ ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 10వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మొత్తం 1188 గ్రామ/వార్డు సచివాలయాలు ఉండగా, వీటిలో కర్నూలు జిల్లాలో 465 గ్రామ సచివాలయాలు, 207 వార్డు సచివాలయాలు ఏర్పాటయ్యాయి. నంద్యాల జిల్లాలో 420 గ్రామ సచివాలయాలు, 96 వార్డు సచివాలయాలు ఉన్నాయి. సచివాలయాల్లో మొత్తం మంజూరైన పోస్టులు 9,878 కాగా, 8,630 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకోవడంతో పాటు డిపార్టుమెంటల్ టెస్ట్ ఉత్తీర్ణులైన 7,466 మంది ఉద్యోగుల ప్రొబేషన్ ముందుగా డిక్లేర్ కాగా, మిగిలిన వారికి విడతల వారీగా డిక్లేర్ చేశారు. ప్రొబేషన్ డిక్లేర్ కావడంతో పే స్కేల్ను కూడా అమలు చేశారు. ఉద్యోగంలో చేరిన సమయంలో నెల జీతం రూ.15 వేలు ఉండగా, ప్రస్తుతం గ్రాస్గా ప్రతి సచివాలయ ఉద్యోగి దాదాపు నెలకు రూ.30 వేల వరకు డ్రా చేస్తున్నారు. అలాగే గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులు నెలకు రూ.32 వేల వరకు డ్రా చేస్తున్నారు. జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన ఘనత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. పాలనను ప్రజలకు అత్యంత చేరువ చేసేందుకు ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ దేశానికే తలమానికంగా నిలిచిందనడలో అతిశయోక్తి లేదు. ప్రభుత్వ పథకాలను ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా పారదర్శకంగా అందించేందుకు ఏర్పాటు చేసిన వలంటీర్ వ్యవస్థను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకున్నాయి. ప్రభుత్వ పాలనలో అత్యంత కీలకమైన పంచాయతీరాజ్ శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడంతో అన్ని విభాగాల ఉద్యోగులకు న్యాయం జరిగింది. జిల్లా అధికారులుగా ఎంపీడీఓలు గత ప్రభుత్వం పదోన్నతులు కల్పించడం వల్ల అనేక మంది ఎంపీడీఓలు వివిధ ప్రభుత్వ శాఖల్లో జిల్లా అధికారులయ్యారు. పరిషత్ సీఈఓ, డిప్యూటీ సీఈఓ, జిల్లా పంచాయతీ అధికారి, డ్వామా, డీఆర్డీఏ, మెప్మా, హౌసింగ్ శాఖల్లో పీడీలుగా, పలు శాఖల్లో కీలకమైన పోస్టుల్లో పదోన్నతి పొందారు -
దేశ సమైక్యతను దెబ్బతీసే కుట్ర
● కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ కర్నూలు (టౌన్): దేశ సమైక్యతను దెబ్బతీసేందుకే ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారని, వారి కుట్రలను సమర్థవంతంగా తిప్పి కొట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ పోలిటికల్ ఆడ్వైజరీ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. పర్యాటక ప్రాంతమైన జమ్మూ కశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని బుధవారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. 26 మంది అమాయకులు ప్రా ణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఉగ్రమూకల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలన్నారు. మృతుల కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ప్రగాఢ సానుభూతి తెలుపుతుందని, కేంద్ర ప్రభుత్వం వారికిఅన్ని విధాలుగా అండగా నిలబడాలని కోరారు. మంగళగిరికి ఎంపీడీఓలు, స్థానిక ప్రజా ప్రతినిధులు కర్నూలు(అర్బన్): జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 24న ( నేడు ) మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. బుధవారం జెడ్పీలోని తన చాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రస్థాయి కార్యక్రమానికి తనతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎంపీడీఓలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు హజరవుతున్నట్లు వెల్లడించారు. గనులపై మైనింగ్ అధికారుల దాడులు కొలిమిగుండ్ల: బెలుం–బెలుం శింగవరం గ్రామా ల మధ్యలో ఉన్న నాపరాతి గనులపై బుధవారం భూగర్భ గనుల శాఖ అధికారుల బృందం దాడులు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్ చేస్తున్నారనే కారణంతో స్థానిక పోలీసులతో కలిసి మైనింగ్ అధికారులు ఈ దాడులు చేశారు. ఎంత మేర గనుల తవ్వకా లు చేశారనే వాటిపై కొలతలు సేకరించారు. నాపరాళ్ల వెలికి తీసేందుకు ఉపయోగించే ఆరు కోత మిషన్లతో పాటు ప్రొక్లెయినర్, ట్రిప్పర్ను స్వాధీ నం చేసుకొని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంచారు. అధికారులు దాడులకు వచ్చా రని తెలుసుకున్న చుట్టు పక్కల గనుల యజమానులు, కూలీలు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లి పోయారు. ఏసీబీ డీఎస్పీగా సోమన్న కర్నూలు: కర్నూలు రేంజ్ ఏసీబీ డీఎస్పీగా సోమన్న నియమితులయ్యారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఇక్కడ డీఎస్పీగా ఉన్న వెంకటాద్రి చిత్తూరు స్పెషల్ బ్రాంచ్కు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి డీఎస్పీ స్థానం ఖాళీగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల తర్వాత డీఎస్పీ పోస్టును భర్తీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. అనంతపురం జిల్లాకు చెందిన సోమన్న 1991లో ఎస్ఐ హోదాలో పోలీసు శాఖలో చేరి కర్నూలు రేంజ్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఎస్ఐగా, సీఐగా సేవలందించారు. కొంతకాలం పాటు ఆదోని డీఎస్పీగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్లో పనిచేస్తున్న ఈయన కర్నూలుకు నియమితులయ్యారు. అయితే మరో ఆరు మాసాల పాటు అటాచ్మెంట్ కింద సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్లోనే విధులు నిర్వహిస్తూ కర్నూలు పర్యవేక్షణ బాధ్యతలు కూడా చూసుకునేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెండు సీఐ పోస్టులు ఖాళీ కర్నూలు రేంజ్ ఏసీబీ విభాగంలో ప్రస్తుతం క్రిష్ణారెడ్డి, క్రిష్ణయ్య, రాజ ప్రభాకర్, శ్రీనివాసులు సీఐలుగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఇంతియాజ్, వంశీనాథ్, ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లడంతో రెండు సీఐ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖాళీ సీఐ పోస్టులను కూడా భర్తీ చేసి ఏసీబీ విభాగాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ట్రాన్స్జెండర్ల సమస్యల పరిష్కారానికి కృషి
కర్నూలు(అర్బన్): జిల్లాలో ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి తెలిపారు. బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు/జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ది ఆదేశాల మేరకు స్థానిక న్యాయ సేవా సదన్లో ట్రాన్స్జెండర్ల హక్కులపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ట్రాన్స్జెండర్లు తమకు గుర్తింపు కార్డులు, రేషన్కార్డులు లేని కారణంగా పింఛన్లు రావడం లేదని జడ్జి దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు ఆయన స్పందిస్తూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ట్రాన్స్జెండర్లు అందుబాటులోని పథకాలను తెలుసుకొని ప్రయోజనం పొందాలన్నారు. టీజీఐడీ నేషనల్ పోర్టల్లో దరఖాస్తు చేసుకుంటే గుర్తింపు కార్డులు వస్తాయన్నారు. దివ్యాంగులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా మాట్లాడుతూ ట్రాన్స్జెండర్స్కు అనేక ప్రభుత్వ పథకాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్యానెల్ న్యాయవాది హేమలత మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లకు న్యాయ సహాయం అందించేందుకు తోడ్పడతామన్నారు. సదస్సులో ట్రాన్స్జెండర్ల నాయకులు వీణారెడ్డి, శ్రీవాణి, పావని తదితరులు పాల్గొన్నారు. -
ఏపీఎస్పీ బెటాలియన్లో రేంజ్–2 స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
కర్నూలు : రాష్ట్ర విభజన తర్వాత కర్నూలు ఏపీఎస్పీ రెండవ బెటాలియన్లో రేంజ్–2 స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్– 2025 మొదటిసారిగా ప్రారంభమైంది. బెటాలియన్ కమాండెంట్ దీపిక పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై పరేడ్ గ్రౌండ్లో క్రీడాపోటీలను ప్రారంభించారు. ఈనెల 25వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. కర్నూలుతో పాటు కడప, అనంతపురం, చిత్తూరుతో పాటు స్పెషల్ ఆర్మ్డ్ రిజర్వ్ ఆఫ్ సెంట్రల్ పోలీస్ లైన్, అంబర్పేట, హైదరాబాదు (ఎస్ఏఆర్సీపీఎల్) బెటాలియన్స్కు చెందిన పోలీసు క్రీడాకారులు స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్నారు. బుధవారం ప్రారంభ రోజు జావెలిన్ త్రో, లాంగ్జంప్, 800 మీటర్ల పరుగు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజయం సాధించిన వివిధ పటాలాలకు చెందిన క్రీడాకారులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కమాండెంట్ అందజేశారు. జావెలిన్ త్రోలో 11వ బెటాలియన్కు చెందిన పీసీ యు.ప్రదీప్ కుమార్ మొదటి బహుమతి కై వసం చేసుకోగా 9వ బెటాలియన్కు చెందిన పీసీ గోపీనాథ్ రెండో బహుమతి, 11వ బెటాలియన్కు చెందిన నరసింహ మూడో బహుమతి దక్కించుకున్నారు. లాంగ్జంప్లో 11వ బెటాలియన్ పీసీ ప్రదీప్ కుమార్ మొదటి బహుమతి, రిజర్వు ఇన్స్పెక్టర్ కె.రామకృష్ణ రెండో బహుమతి, ఎస్ఏఆర్సీపీఎల్ యూనిట్ పీసీ వెంకటేశ్వర్లు మూడో బహుమతి గెలుచుకున్నారు. అలాగే 800 మీటర్ల పరుగుపందెంలో రెండో బెటాలియన్ పీసీ నరేంద్ర మొదటి బహుమతి, 9వ బెటాలియన్ పీసీ వెంకయ్య రెండో బహుమతి, పీసీ అశోక్ మూడో బహుమతి సాధించారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ నాగేంద్ర రావు, అసిస్టెంట్ కమాండెంట్లు మహబూబ్ బాషా, రవికిరణ్, వెంకటరమణ, సుధాకర్రెడ్డి, రిజర్వు ఇన్స్పెక్టర్లు, రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్లు, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి జరుగుతున్న క్రీడాపోటీలు -
జిల్లా అంతటా విజిబుల్ పోలీసింగ్
కర్నూలు: ప్రజల భద్రత, రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు జిల్లా అంతట విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం ఏకకాలంలో జిల్లా అంతటా విజిబుల్ పోలీసింగ్లో భాగంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా రోడ్డు భద్రత నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. వాహనాలు నడిపేవారు హెల్మెట్/సీటు బెల్టు ధరించాలని, డ్రంకెన్ డ్రైవ్కు దూరంగా ఉండాలని వాహనదారులకు సూచనలు చేశారు. ఆయా స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో పర్యటించి గొడవలకు దూరంగా ఉండాలని, మహిళా నేరాలు, సైబర్ మోసాలు, బాల్య వివాహాలు, పేకాట వంటి వాటిపై పోలీసులకు సమాచారమివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. గంజాయి, మత్తు పదార్థాల వాడకంతో కలిగే అనర్థాల గురించి ప్రజలకు వివరించి వాటికి దూరంగా ఉండాలని యువకులకు సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. -
మంచం పట్టిన కలపరి
● గ్రామంలో వంద మందికి పైగా జ్వరం ● ప్రతి ఇంట్లో ఇద్దరు, ముగ్గురు బాధితులు ● కన్నెత్తి చూడని వైద్యారోగ్యశాఖ అధికారులు ఆస్పరి: మండలంలోని కలపరి గ్రామం మంచం పట్టింది. ఈ గ్రామంలో 110 కుటుంబాలుండగా, ప్రతి ఇంట్లో ఇద్దరు, ముగ్గురు జ్వరాలతో బాధపడుతున్నారు. స్థానిక ఆర్ఎంపీల వద్ద చూపించుకుంటున్నా తగ్గడం లేదని వాపోతున్నారు. సమస్య ఇంత తీవ్రంగా ఉంటే వైద్యారోగ్యశాఖ అధికారులు ఇటువైపు కన్నెతి చూసిన దాఖలాలు లేవు. వెంకమ్మ అనే వృద్ధురాలు పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మల్లమ్మ, మల్లికార్జున, ఉరుకుందు, సోమన్న, లక్ష్మి, మునిస్వామి, వీరేష్, వెంకటలక్ష్మి, ఆటో ఉరుకుందప్ప, సూరి, లోకేశ్వరీతో పాటు వందమంది వంద మంది జ్వరం, కాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. దాదాపు రెండు వారాల నుంచి ఈ సమస్య ఉంది. ఇళ్లలో ఒకరి తర్వాత ఒకరు జ్వరం బారిన పడుతున్నారు. పారిశుద్ధ్య లోపమా లేక మరే కారణమో తెలియదని, అధికారులు స్పందించి వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
సచివాలయ వ్యవస్థతో వేలాది ఉద్యోగాలు
2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ ముఖ్య ఉద్దేశాన్ని గుర్తించింది. గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి వేలాది ఉద్యోగాల కల్పనకు కారణమయ్యారు. ప్రతి 2వేల జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. నూతన సాంకేతిక ఒరవడితో ఆన్లైన్ సదుపాయం కల్పించారు. ఎంపీడీఓల పదోన్నతులకు శ్రీకారం చుట్టారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల జిల్లా పరిషత్లలో పీఆర్కు చెందిన వారే సీఈఓ, డిప్యూటీ సీఈఓలుగా విధులు నిర్వహిస్తున్నారు. – జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మూడంచెల పీఆర్ వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో 1.20 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఎలాంటి అవినీతికి తావు లేకుండా వివిధ ప్రభుత్వ సేవలను గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలోనే అందించారు. ప్రతి 50 కుటుంబాలకు ఒకరు ప్రకారం ఏర్పాటు చేసిన వలంటీరు వ్యవస్థ వల్ల ఎంతో మేలు జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా పదోన్నతులకు నోచుకోని ఎంపీడీఓలకు పదోన్నతులు లభించాయి. – జీ జయపాల్రెడ్డి, రిటైర్డు జెడ్పీ సీఈఓ, ఎస్ఐఆర్డీ తెలంగాణ కన్సల్టెంట్ ● -
జర్నలిస్టులకు రక్షణ కల్పించకపోతే ప్రజాస్వామ్యానికి హాని
కర్నూలు(సెంట్రల్): సాక్షి దినపత్రిక ఏలూరు కార్యాలయంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు దాడి చేయడాన్ని సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు తీవ్రంగా తప్పుపట్టారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశాయి. జర్నలిస్టులకు రక్షణ క ల్పించకపోతే ప్రజాస్వామ్యానికి హాని కలిగే ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వెలిబుచ్చారు. బుధవారం జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషాను ఆయన కార్యాలయంలో కలసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీ డబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోరంట్లప్ప, సీనియర్ జర్నలిస్టు సత్యనారాయణ గుప్తా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర ఎంతో ఉందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ తప్పులు, ఒప్పులు, అక్రమాలు నిజాలను బయట పెట్టే బాధ్యత పత్రికలపై ఉంటుందన్నారు. అందులో భాగంగా దృష్టికి వచ్చిన అంశాలపై కథనాలు, విశ్లేషణలు చేస్తుంటాయన్నారు. అయితే ఏదైనా పత్రికలో వార్త వచ్చిన సమయంలో సంబంధిత వ్యక్తులు ఇబ్బందిగా భావిస్తే ఖండన ఇవ్వవచ్చు అన్నారు. అందుకు సంతృప్తి చెందకపోతే న్యాయస్థానాల ద్వారా లీగల్గా ప్రొసీడ్ అయ్యేందుకు వీలు ఉందన్నారు. అయితే అవేవీ పట్టకుండా ప్రభుత్వంలోని కొందరు నేతలు పత్రికల్లో వార్తలు వస్తే జర్నలిస్టులను భయపెట్టే విధంగా దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టు కార్యాలయాలను ధ్వంసం చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఇటీవల కాలంలో జర్నలిస్టులు, జర్నలిస్టు సంస్థలపై దాడులు అధికమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎం.శివశంకర్, ఎర్రమల, సీనియర్ జర్నలిస్టులు రవికుమార్, హుస్సేన్, రవిప్రకాష్, శ్రీనాథ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకు వినతిపత్రం ఇచ్చిన జర్నలిస్టులు -
‘పది’లో స్వల్పంగా పెరిగిన ఉత్తీర్ణత
● 66.1 శాతంతో చివరి నుంచి రెండో స్థానంలో జిల్లా ● మొదటి శ్రేణిలో 14,291 మంది విద్యార్థులు ● ఏడుగురు విద్యార్థులకు 597 మార్కులు ● ప్రభుత్వ యాజమాన్యాల్లోనూ విద్యార్థుల రాణింపు ● రెండు కేజీబీవీల్లో వంద శాతం ఉత్తీర్ణత ● ఫలితాల్లో బాలికలదే పైచేయి ● సత్ఫలితాలిచ్చిన ఇంగ్లిష్ మీడియం విద్య -
తల్లి కష్టంతో చదివి
తల్లి వద్ద విద్యార్థి ప్రేమ్ గణేష్ఎమ్మిగనూరుటౌన్: పట్టణంలోని వీవర్స్ కాలనీ జెడ్పీ హైస్కూల్లో చదివిన ప్రేమ్ గణేష్ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 588 మార్కులు తెచ్చుకున్నారు. కుర్ణికులానికి చెందిన తన తండ్రి ఎం.శివకుమార్ అనారోగ్యంతో మృతిచెందారు. ఎమ్మిగనూరు శివన్న నగర్లో నివాసం ఉండే తల్లి శ్రావణి టైలర్గా పనిచేస్తూ కుమారుడు ప్రేమ్ గణేష్ను చదివించింది. తల్లి కష్టంతో చదివి పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన తాను ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ తీసుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తానని ప్రేమ్ గణేష్ తెలిపారు. -
66.01 ఉత్తీర్ణత శాతం
జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు పగిడాల గీతిక (597) షేక్ మహమ్మద్ (597) వెంకట కీర్తన (597) టి.గాయత్రి (597) సలీమా (597) జి.నందు (597) హరిణి (597) సాయి నందిని (596) వెంపలి రస్మితారెడ్డి (596) రత్నపల్లి మనుచరణ్ (596) పి.రాజ్వాన (596) షేక్ తస్రీన్ (596) నేహాతాళ యాస్మిని (596) కర్నూలు సిటీ: పదవ తరగతి పరీక్షల ఫలితాల పెంపునకు కూటమి ప్రభుత్వం వంద రోజుల ప్రణాళికను తయారు చేసి అమలు చేసింది. అయితే ఆ ప్రణాళిక అమలుపై క్షేత్ర స్ధాయిలో సరైన పర్యవేక్షణ లోపించింది. కూటమి ప్రభుత్వం సంస్కరణల పేరుతో చదువులను విస్మరించింది. పశ్చిమ పల్లెల నుంచి వలస వెళ్లిన విద్యార్థులను గుర్తించి సకాలంలో వెనక్కి తీసుకు రాలేకపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో పరీక్షల ఫలితాలు అశించిన స్థాయిలో రాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఫలితాల్లో జిల్లా గతేడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత 3.53 శాతం పెరిగింది. గత నెల 17 నుంచి 30వ తేది వరకు 172 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈనెల 3 నుంచి 9వ తేది వరకు ముల్యాంకనం చేపట్టారు. గతేడాది 62.47 శాతంతో జిల్లా చిట్టచివరి స్థానం దక్కించుకోగా.. ఈ ఏడాది 66.01 శాతం ఉత్తీర్ణతతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఇక పదవ తరగతి పరీక్షలంటే సాధారణంగా బాలికలదే పైచేయి ఉంటుంది. తాజా ఫలితాల్లోనూ బాలికలే ముందంజలో నిలిచారు. మొత్తం విద్యార్థుల్లో 14,291 మంది ఫస్ట్ క్లాసు, 3,904 మంది సెకెండ్ క్లాస్, 2,389 మంది థర్డ్ క్లాసులో ఉత్తీర్ణులయ్యారు. సత్ఫలితాలిచ్చిన ఎన్సీఈఆర్టీ సిలబస్ పాఠశాల విద్యలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు ఎన్సీఈఆర్టీ సిలబస్ను ప్రవేశ పెట్టింది. ఈ సంస్కరణ తీసుకొచ్చిన తరువాత నిర్వహించిన పది పరీక్షల్లో ఫలితం స్పష్టంగా కనిపించింది. ఇంగ్లిష్ మీడియంలో రాసిన విద్యార్థులు తెలుగు మీడియం వారి కంటే అత్యధిక శాతం ఉత్తీర్ణులు కావడమే ఇందుకు కారణం. ఇంగ్లిష్ మీడియంలో రాసిన వారు సుమారు 85 శాతం ఉత్తీర్ణులు కాగా.. తెలుగు మీడియం విద్యార్థులు 40 శాతం కూడా ఉత్తీర్ణత సాధించలేకపోవడం గమనార్హం. ఇదిలాఉంటే గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లోనే అత్యధిక శాతం విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. 34 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత జిల్లాలో 517 స్కూళ్లకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాయగా, 34 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 100 శాతం ఉత్తీర్ణతలో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్(బాలికలు, బనవాసి), ఏపీ రెసిడెన్షియల్ స్కూల్(బాలురు, కాల్వ బుగ్గ), మహత్మజ్యోతిరావు ఫూలే బీసీ వెల్ఫేర్ స్కూల్(బాలికలు, ఆరేకల్లు), ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్(కర్నూలు), కేజీబీవీ క్రిష్ణగిరి, కేజీబీవీ పంచలింగాల స్కూల్కి చెందిన విద్యార్థులు 100 శాతం ఫలితాలు సాధించారు. ఈ స్కూళ్లలో చదివిన విద్యార్థులు టి.సాయి లిఖిత 592 మార్కులు(ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్), వై.దేవిక 576 మార్కులు సాధించారు. మూడు కార్పొరేట్, 23 ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. ● జిల్లాలో ఏపీ మోడల్ స్కూళ్లు 16 ఉన్నాయి. ఈ స్కూళ్ల నుంచి 1,333 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 930 మంది పాసయ్యారు. కోడుమూరు ఏపీ మోడల్ స్కూల్కి చెందిన జి.సోహాల్ 583 మార్కులు సాధించారు. కేజీబీవీల్లో.. జిల్లాలో 25 కస్తూర్బా గాంధీ విద్యాలయాలకు చెందిన 978 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 774 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో పంచలింగాల, క్రిష్ణగిరి కేజీబీవీలో 100 శాతం అత్యధికంగా, కోసిగిలో అత్యల్పంగా 43 శాతం ఉత్తీర్ణత సాధించారు. వై.దేవిక అత్యధికంగా 576 మార్కులు సాధించింది. 75 మందికి 500 మార్కులకు పైగా వచ్చాయి. మున్సిపల్ హైస్కూళ్లు.. జిల్లాలో మున్సిపల్ హైస్కూళ్లకు చెందిన 1,838 మంది విద్యార్థుల్లో 961 మంది ఉత్తీర్ణత సాధించారు. కర్నూలు నగరంలోని ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ మెమోరియల్ స్కూల్లో 43 మంది పరీక్షలు రాయగా అందరూ పాసయ్యారు. ఈ స్కూల్కి చెందిన టి.సాయి లఖిత 595 మార్కులు సాధించింది. 42 మంది 500 మార్కులకు పైగా సాధించడం విశేషం. ● ఎయిడెడ్ స్కూళ్లకు చెందిన 187 మందిలో 102 మంది పాసయ్యారు. ఈ స్కూళ్లకు చెందిన బి.హేమప్రియకు 570 మార్కులు వచ్చాయి(సెయింట్ జోసెఫ్ హైస్కూల్, చిల్డ్రన్స్ పార్క్). ● ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్ల నుంచి 91 మందిలో 60 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ఆలూరు స్కూల్కి చెందిన పి.అంజలి 564 మార్కులు అత్యధికంగా సాధించారు. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లకు చెందిన 544 మందిలో 483 మంది ఉత్తీర్ణులు కాగా.. బిక్యాంపు రెసిడెన్షియల్ స్కూల్కి చెందిన ఎం.ప్రమీలా 587 మార్కులు సాధించింది. బీసీ వెల్ఫేర్ స్కూళ్లకు చెందిన 227 మందిలో 221 మంది ఉత్తీర్ణులైయ్యారు. ఈ స్కూళ్లకు చెందిన జి.హాసిని 592 మార్కులు సాధించారు. ● ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లకు చెందిన 374 మంది పరీక్షలు రాయగా, 360 మంది పాసయ్యారు. కాల్వబుగ్గ రెసిడెన్షియల్ స్కూల్, మహత్మజ్యోతిరావు ఫూలే స్కూల్ ఆరెకల్లులో 100 శాతం ఫలితాలు వచ్చాయి. పంచలింగాల స్కూల్ విద్యార్థి 592 మార్కులు సాధించారు. ● డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులాలు 8 ఉన్నాయి. ఈ స్కూళ్లకు చెందిన 1,002 మంది పరీక్షలకు హాజరుకాగా 919 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 771 మంది మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. 31,185 పరీక్షకు హాజరైన విద్యార్థులు 20,584 ఉత్తీర్ణులైన విద్యార్థులు 60.36 బాలుర ఉత్తీర్ణత శాతం (9,854 మంది) 72.21 బాలికల ఉత్తీర్ణత శాతం (10,730 మంది)బనవాసికి గురుకులానికి మరోసారి ‘వంద’నం ఎమ్మిగనూరురూరల్: కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా బనవాసి గురుకుల పాఠశాల ఫలితాలను సాధిస్తోంది. బుధవారం ప్రకటించిన 10వ తరగతి పరీక్షల్లో ఈ పాఠశాల విద్యార్థులు వందశాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 79 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాదించి తమ సత్తా మరోసారి చాటుకున్నారు. ఎమ్మిగనూరు మండల పరిధిలోని బనవాసి గురుకుల పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ పాఠశాల 2007 నుంచి వరుసగా 18 సంవత్సరాలుగా వందశాతం ఉత్తీర్ణతను సాధిస్తూ వస్తోంది. ఈ ఏడాది వై. శ్రీవాణి 583, జి. నందిని 576, బి. కీర్తన 573, టి. బిందు 570, డీఎస్ భాగ్యశ్రీ 567, కె. సుమయ్యతప్సం 566, పి. గీతాంజలి 559, పి. నందిని 559, వై.నందిని 558 మార్కులు సాధించారు. ప్రతి సారి ఇలాంటి ఫలితాలే వస్తున్నాయని ప్రిన్సిపాల్ సామ్రాజ్యం తెలిపారు. -
ఉగ్ర దాడి హేయమైన చర్య
● వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసనకర్నూలు(టౌన్): అమాయకులపై ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అని కర్నూలు మేయర్ బి.వై.రామయ్య అన్నారు. బుధవారం రాత్రి స్థానిక వైఎస్సార్ సర్కిల్ వద్ద కశ్మీర్లో ఉగ్రవాదుల ఊచకొత ఘటనను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడిని పిరికిపందల చర్యగా అభివర్ణించారు. అమాయకులను పొట్టన పెట్టుకోవడం క్షమించరాని నేరమన్నారు. దేశంలో అలజడి సృష్టించే ఉద్దేశంతో ఉగ్రవాదులు చేస్తున్న కుట్రలను కేంద్ర ప్రభుత్వం తిప్పి కొట్టాలన్నారు. ● వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదం ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైందన్నారు. దీన్ని కూకటి వేళ్లతో పెకలించాలన్నారు. ● వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మూద్దురు సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలు, విదేశీయులను సైతం ఉగ్రవాదులు అత్యంత క్రూరంగా చంపేశారన్నారు. ఉగ్రవాదంపై కేంద్రం ఉక్కుపాదం మోపాలన్నారు. ● వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అహమ్మద్ ఆలీఖాన్ మాట్లాడుతూ కశ్మీర్ ఘటనకు కారణమైన ఉగ్ర మూకలను వెతికి పట్టుకొని కఠినంగా శిక్షించాలన్నారు. అమాయకులను అత్యంత క్రూరంగా చంపడాని సహించరాదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, జిల్లా నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
విధుల్లో అలసత్వం తగదు
ఆలూరు: విధి నిర్వహణలో వైద్య సిబ్బంది అలసత్వం వహించడం తగదని డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం స్థానిక సీహెచ్సీ కేంద్రాన్ని (ప్రజా ఆరోగ్య కమ్యూనిటీ అర్బన్ హెల్త్ కేంద్రాన్ని) ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారిలో ఎక్కువ శాతం పేదలు ఉంటారని, వారిని నిర్లక్ష్యం చేయడం మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. కోట్లాది రూపాయలతో ఆధునాతన వైద్య పరికరాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని, వాటిని సద్వినియోగం చేయాలన్నారు. ఆసుపత్రి ఆవరణను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సమావేశంలో సివిల్సర్జన్ డాక్టర్ వాహిద్, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీకాంత్, రామకృష్ణ, స్టాఫ్ నర్సులు నిర్మల, మంగమ్మ, రాజేశ్వరి, భారతి, ఎన్టీర్ ఆరోగ్య మిత్రలు కృష్ణారెడ్డి, మంజునాథ్ తదితరులు ఉన్నారు. -
క్రీడలతో పాటు వ్యాయామం తప్పనిసరి
● రేంజ్ పోలీసుల క్రీడా పోటీల్లో ఏఆర్ అడిషనల్ ఎస్పీ కర్నూలు: పోలీసు సిబ్బందికి క్రీడలు, వ్యాయామం చాలా అవసరమని, వీటి ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ అన్నారు. కర్నూలు, కడప, నంద్యాల, అన్నమయ్య జిల్లాల (రేంజ్ పరిధిలో) పోలీసులకు కర్నూలు నగరంలోని ఔట్డోర్ స్టేడియంలో మంగళవారం క్రీడల పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ క్రీడలు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. కర్నూలు డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో క్రీడాపోటీల్లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న పోలీసు సిబ్బందికి అవకాశం కల్పించారు. ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ, హ్యాండ్బాల్, షటిల్, రన్నింగ్, లాంగ్ జంప్, హైజంప్, షాట్పుట్, క్రికెట్, బాస్కెట్ బాల్ తదితర క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రస్థాయి పోలీసు క్రీడాపోటీలు త్వరలో జరగనున్న నేపథ్యంలో రేంజ్ పరిధిలో క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనపరచిన పోలీసులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ భాస్కర్రావు, ఆర్ఐలు, రేంజ్ పరిధిలోని వివిధ జిల్లాలకు చెందిన పోలీసు సిబ్బంది పోటీల్లో పాల్గొన్నారు. -
‘ఉపాధి’ పనులు 7 శాతమేనా?
● అసంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ కర్నూలు(సెంట్రల్): ఉపాధి పనుల్లో ఏప్రిల్ నెల నందవరం, గోనెగండ్ల, హాలహర్వి, ఆస్పరి మండలాలు 7 శాతంలోపే ఉండడంపై జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో పురోగతి కనిపించకపోతే షోకాజ్ నోటీసులు జారీ చేస్తానని ఎంపీడీఓలు, ఏపీఓలను హెచ్చరించారు. వేసవిలో కూలీలకు ముమ్మరంగా ఉపాధి పనులను కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి, హౌసింగ్, గ్రామ, వార్డు సచివాలయాల సేవలపై జిల్లా, మండలాల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలతో మంగళవారం జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ లోపు 8500 ఫార్మ్ఫాండ్లను పూర్తి చేయాలన్నారు. పశువుల తొట్టె నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. హౌసింగ్కు సంబంధించి జూన్1 నాటికి 11 వేల ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో ఇప్పటి వరకు 5,700 ఇళ్లను పూర్తి చేశామన్నారు. ఆదోని డివిజన్లోనే ఎక్కువగా ఇళ్ల నిర్మాణాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. టెలీకాన్పరెన్స్లో ఆదోని సబ్కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆర్డీఓలు సందీప్కుమార్, ఆర్డీఓ భరత్నాయక్, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డ్వామా పీడీ వెంకటరమణయ్య పాల్గొన్నారు. రక్షిత నీటిని సరఫరా చేయాలి కర్నూలు(అర్బన్): అన్ని పంచాయతీల్లోని ప్రజలకు రక్షిత మంచి నీటిని అందించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి జీ భాస్కర్ ఆదేశించారు. మంగళవారండీఎల్పీఓ టీ లక్ష్మితో కలిసి కోడుమూరు, గూడూరు మండలం పెంచికలపాడు గ్రామా ల్లోని తాగునీటి ట్యాంకులు, ఎస్డబ్ల్యూపీసీ కేంద్రాలను పరిశీలించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి శుభ్రం చేయాలన్నారు. -
సీహెచ్ఓల నిరసన దీక్ష
కర్నూలు(సెంట్రల్): ఆరేళ్లు దాటిన సీహెచ్ఓల సర్వీసును క్రమబద్ధీకరించాలని సీహెచ్ఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు టీఎస్ చందన డిమాండ్ చేశారు. కలెక్టరేట్ నుంచి ధర్నా చౌక్ వరకు సీహెచ్ఓలు సోమవారం ర్యాలీ నిర్వహించి అక్కడ నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23 శాతం పీఆర్సీ ఇవ్వాలన్నారు. ప్రతి నెలా జీతంతోపాటు ఇన్సెంటివ్ను ఇవ్వాలని, ప్రతి సంవత్సరం 5 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. 1,940 హెక్టార్లలో పండ్ల తోటల అభివృద్ధికి చర్యలు కర్నూలు(అగ్రికల్చర్): 2024–25 ఆర్థిక సంవత్సరంలో కొత్త తోటల అభివృద్ధి కింద 1,940 హెక్టార్లలో ఉద్యాన పంటలు అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు ఉద్యాన శాఖ జిల్లాకు లక్ష్యాలను నిర్దేశించింది. ఎంఐడీహెచ్ కింద 890 హెక్టార్లు, రాష్ట్రీయ కృషి వికాశ్ యోజన కింద 550 హెక్టార్లలో ఉద్యాన పంటలు అభివృద్ధి చేసే విధంగా ఉద్యాన శాఖ జిల్లాకు లక్ష్యాలు ఇచ్చింది. ఆయిల్ పామ్ సాగును చేపట్టాలని సూచించింది. ఈ ఏడాది జిల్లాలో 500 హెక్టార్లలో ఆయిల్పామ్ సాగు చేసేలా లక్ష్యాలు ఇచ్చింది. అర్హులైన రైతులను మే నెల చివరిలోగా గుర్తించాలని జిల్లా ఉద్యాన అధికారి పి.రామాంజనేయులు ఉద్యాన అధికారులను ఆదేశించారు. హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ కర్నూలు(హాస్పిటల్): కర్నూలు నగరంలోని కింగ్మార్కెట్ సమీపంలో ఉన్న ఈడెన్ గార్డెన్ కమ్యూనిటీ హాల్లో హజ్ యాత్రకు వెళ్లే యాత్రి కులకు మంగళవారం వ్యాక్సినేషన్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరాన్ని డీఎంహెచ్ఓ డాక్టర్ పి.శాంతికళ పరిశీలించి మాట్లాడారు. హజ్ యా త్రికులకు ఆరోగ్యపరీక్షలు నిర్వహించి అవసరమైన టీకాలు వేసి సర్టిఫికెట్ ఇస్తామన్నారు. హజ్ యాత్రికులందరూ ఎలాంటి అపోహలు లేకుండా వ్యాక్సిన్(ఓరల్ పోలియో వ్యాక్సిన్, మేనింగోకోకల్, ఇన్ఫ్లూయింజా) తీసుకుని సర్టిఫికెట్ పొందాలన్నారు. కార్యక్రమంలో డీఐవో డాక్టర్ నాగప్రసాద్బాబు, డిస్ట్రిక్ట్ ఎపడమాలజిస్టు వేణుగోపాల్, యుపీహెచ్సీ వైద్యాధికారులు, ఆరోగ్యపర్యవేక్షకులు, స్టాఫ్నర్సులు పాల్గొన్నారు. రూ.60 లక్షల బంగారం పట్టివేత ఆదోని అర్బన్: పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మహమ్మద్ ఫజల్ ఎలాంటి ఆధారాలు, బిల్లులు లేకుండా బంగారాన్ని తీసుకొస్తుండగా టూటౌన్ పోలీసులు మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో పట్టుకున్నారు. ఈ మేరకు టూటౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి స్వాధీనం చేసుకున్న బంగారం బిస్కెట్లను చూపి వివరాలను వెల్లడించారు. మహమ్మద్ఫజల్ రూ.60 లక్షల విలువ చేసే బంగారం బిస్కెట్లను ప్రొద్దుటూరు నుంచి తీసుకొస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. ఆ మేరకు ఆస్పరి బైపాస్ రోడ్డు వద్ద తనిఖీ నిర్వహించి పట్టుకున్నట్లు తెలిపారు. ఆయన వద్ద ఎలాంటి బిల్లులు, ఆధారాలు లేకపోవడంతో బంగారాన్ని స్వాధీనం చేసుకుని వాణిజ్యశాఖ అధికారులకు అప్పగించామన్నారు. 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటిపోయాయి. వడగాల్పుల తీవ్రత పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దొర్నిపాడు 43.9, మిడుతూరు 43.3 డిగ్రీలు, నందికొట్కూరు 43.3 డిగ్రీలు, పాణ్యం 43.7 డిగ్రీల ప్రకారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా కర్నూలు అర్బన్లో 43.5, కౌతాళంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గోస్పాడు, పాములపాడు, బండిఆత్మకూరు, సంజామల, శిరువెళ్ల, నంద్యాలల్లో సమాన స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
ఊరికి చేరి.. ఊపిరి పీల్చి!
వెల్దుర్తి: ఊరంటే ఎనలేని ప్రేమ.. హద్దులులేని అభిమానం.. అక్కడే పెరిగారు.. అందరితో ఆత్మీయంగా ఉండేవారు. అదే పల్లెలో ఎన్నో ఏళ్లుగా జీవనం.. అందరూ తెలిసిన వారే.. అయితే గతేడాది జరిగిన ఒక హత్య ఎనలేని కష్టాలను తెచ్చింది. గ్రామస్తుల ప్రమేయం లేకున్నా టీడీపీ నాయకులు కక్ష గట్టారు. పలు కుటుంబాలను గ్రామం నుంచి వెళ్లగొట్టారు. ఊరు వదిలిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు హైకోర్టు ఆదేశాలతో 32 మందిలో 27మంది ఈనెల 7న తిరిగి గ్రామం చేరుకున్నారు. మిగిలిన ఐదుగురు సైతం మంగళవారం పోలీసు బందోబస్తు మధ్య గ్రామానికి వచ్చారు. ఇదీ ఘటన.. వెల్దుర్తి మండలంలోని బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో జూన్ 9న టీడీపీ కార్యకర్త గిరినాథ్ చౌదరి హత్య జరిగింది. కేసులో దాదాపు 11మంది వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తల పేర్లను అక్రమంగా చేర్చారు. కేసులో ముద్దాయిలతోపాటు, సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామంలోని పలు కుటుంబాలను టీడీపీ నాయకులు గ్రామం నుంచి వెళ్లగొట్టారు. శాంతిభద్రతల పేరుతో వారికి పోలీసులు వంతపాడారు. ఈ దశలో కేసులో ముద్దాయిలు 11మందితోపాటు ఊరు విడిచి వెళ్లిన వారు మొత్తంగా 32మంది తమను తిరిగి గ్రామం చేర్చాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో జస్టిస్ హరినాథ్.. పిటిషనర్లు గ్రామంలోకి వెళ్లేలా అనుమతించాలని గత నెల తీర్పునిచ్చారు. దీంతో పోలీసులు ఈనెల 7వ తేదీన 32మందిని గ్రామంలోకి చేరుకునేలా ప్రయత్నించారు. ఆ సమయంలో పరిస్థితుల నేపథ్యంలో 27మందికి మాత్రమే అనుమతినివ్వడంతో మిగిలిన ఐదుగురు వెనుదిరిగారు. ఈ పరిస్థితులను అన్నీ ఎస్పీ విక్రాంత్ పాటిల్ సమీక్షిస్తూ వచ్చారు. గ్రామంలో రెండు దఫాలుగా పర్యటించారు. ఈ క్రమంలో మిగిలిన ఐదుగురు సైతం మంగళవారం పోలీస్ బందోబస్తు మధ్య గ్రామం చేరుకున్నారు. వీరిలో భాస్కర్ నాయుడు, రంగయ్య సోదరులు, సూర్యనారాయణ, వెంకటేశ్, రాజేశ్ ఉన్నారు. పది నెలల అనంతరం వారు ఇంటికి చేరుకుని ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రశాంతతకు పోలీసులు పికెట్ నిర్వహిస్తూనే ఉన్నారు. పది నెలల తర్వాత తెరపడిన నిరీక్షణ బొమ్మిరెడ్డిపల్లె చేరుకున్న గ్రామస్తులు -
బంగారుపేట సారా స్థావరంపై పోలీసుల దాడి
కర్నూలు: కర్నూలులోని బంగారుపేట కేసీ కెనాల్ గట్టు పొడవున ఉన్న నాటుసారా స్థావరంపై సివిల్, ఎకై ్సజ్ పోలీసులు దాడి చేసి విస్తృత తనిఖీలు నిర్వహించారు. మంగళవారం ఉదయమే రెండో పట్టణ పోలీసులు, కర్నూలు ఎకై ్సజ్ పోలీసులు పెద్ద ఎత్తున బంగారుపేటకు చేరుకోవడంతో ప్రజలు ఏమి జరిగిందోనని ఆందోళనకు లోనయ్యారు. ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, సూపరింటెండెంట్ సుధీర్ బాబు, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణారెడ్డి, సీఐలు నాగరాజరావు, మన్సూరుద్దీన్, నాగశేఖర్, ఎకై ్సజ్ సీఐలు చంద్రహాస్, జయరాం నాయుడు, కృష్ణ తదితరులు ఐదు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్కు వెళ్లే రోడ్డు నుంచి ఆనంద్ థియేటర్ వరకు దాదాపు కిలోమీటర్ పొడవున నాటుసారా స్థావరాలపై దాడులు జరిపి బట్టీలను ధ్వంసం చేశారు. 1,350 లీటర్ల నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం ఊటను ధ్వంసం చేసి 65 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. నీలి షికారి భాగ్యమ్మపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా నాటుసారా నిర్మూలన ఆవశ్యకతను, సారా వినియోగం వల్ల ఎదురయ్యే అనారోగ్య సమస్యలను వార్డు ప్రజలకు వివరించారు. – 65 లీటర్ల నాటు సారా సీజ్ -
విషాదం
● రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమార్తె మృతి ● మోటారు సైకిల్ను ఢీకొన్న లారీ ● పెద్దహోతూరు సమీపంలో దుర్ఘటన ఆలూరు/ఆస్పరి: పేదింట్లో విషాదం నెలకొంది. పేదరికం నుంచి బయట పడేందుకు నలుగురు పిల్లలను చదివిస్తున్న ఆ కుటుంబంపై విధి పగపట్టింది. లారీ రూపంలో తండ్రి వడ్డె ఈరన్న(45)ను, అతని రెండో కుమార్తె వడ్డె శ్రావణి (14)ని కబళించింది. ఈ దుర్ఘటన పెద్దహోతూరు సమీపంలో నిర్మాణంలో నిలిచిన టోల్గేట్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామానికి చెందిన ఈరన్న, రాధమ్మ దంపతులకు సెంటు భూమి లేదు. ఈరన్న టైలర్గా, రాధమ్మ కూలి పనులకు వెళ్తూ జీవనం సాగించేవారు. వీరి పెద్ద కుమార్తె హిందు తొమ్మిదో తరగతి వరకు చదువుకుని తండ్రి దగ్గర టైలరింగ్ పని నేర్చుకుంటోంది. రెండో కుమార్తె శ్రావణి (14) చిప్పగిరిలో కస్తూర్బా పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. మూడో కుమార్తె స్వాతి 6 తరగతి మండలంలోని బిల్లేకల్లు హైస్కూల్లో, చిన్న కుమారుడు విక్రమ్ 3వ తరగతి ముత్తుకూరులోనే చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యా శాఖ అధికారులు సెలవులు ప్రకటించడంతో రెండో కుమార్తె వడ్డె శ్రావణి ని తీసుకొచ్చేందుకు తండ్రి వడ్డె ఈరన్న మోటార్ సైకిల్పై చిప్పగిరి వెళ్లాడు. పాఠశాల నుంచి రెండో కుమార్తె శ్రావణితో పాటు సొంతూరుకు వస్తుండగా కర్నూలు నుంచి ఆలూరు వైపు వస్తున్న లారీ పెద్దహోతూరు సమీపంలో బలంగా ఢీ కొట్టింది. దీంతో తండ్రి, కుమార్తె ఇద్దరూ ఒక్కసారిగా టైర్లు కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఆలూరు ఎస్ఐ మహబూబ్బాషా ,హెడ్ కానిస్టేబుల్ జానీవాకర్, పోలీసులు ప్రమాద స్థలాన్ని చేరుకుని మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మృతుల కుటుంబాన్ని ఓదార్చిన ఎమ్మెల్యే ప్రమాద విషయం తెలుసుకుని ఆలూరు ఎమ్మెల్యే బి. విరూపాక్షి ఆసుపత్రికి వచ్చారు. తండ్రి, కుమార్తెల మృతదేహాలను పరిశీలించారు. వడ్డె ఈరన్న భార్య వడ్డె రాధమ్మను, కుమార్తెలు హిందు, స్వాతి, కుమారుడు విక్రమ్, సమీప బంధువులను ఓదార్చారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. నేషనల్ హైవే అఽథారిటీ అధికారులు ప్రమాద సూచికలను, రేడియం స్టిక్కర్లును ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. మృతుల కుటుంబాన్ని రాష్ట్ర ప్ర భుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. ఎమ్మె ల్యే వెంట వైఎస్సార్సీపీ నాయకులు భాస్కర్, వీరేష్, బాబు, ఆలూరు మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మల్లికార్జున, ఎంపీపీ రంగమ్మ, రాముడు ఉన్నారు. -
ఉన్నత చదువులతో రాణించాలి
● రాష్ట్ర స్థాయిలో కర్నూలు సంక్షేమ విద్యార్థుల ప్రతిభ కర్నూలు(అర్బన్): ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు 83.91 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోనే అత్యుత్తమ ప్రతిభను చాటారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లోని పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులు మరింత ఉన్నత చదువులు చదివి ఉత్తమ భవిష్యత్తును అందుకోవాలని కోరారు. విద్యార్థులు మంచి మార్కులు సాధించేందుకు సహకారం అందించిన వసతి గృహ సంక్షేమాధికారులను కూడా ఆయన అభినందించారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ మెడల్స్, నూతన వస్త్రాలను బహూకరించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ జె.రంగలక్ష్మిదేవి, సహాయ సాంఘిక సంక్షేమాఽధికారులు కె.బాబు, బి.మద్దిలేటి, వసతి గృహ సంక్షేమాధికారిణులు బి.బెన్నమ్మ, రజినమ్మ, క్రాంతికుమార్ పాల్గొన్నారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు: కె.రాఘవేంద్ర(958),కె.రోజ(955), ఎస్.సలీమా (953), ఎం.సాయిప్రసాద్(935), కె.తరుణ్(933), బి.దస్తగిరమ్మ(926), ఎం.ప్రభావతమ్మ(919). -
వైద్యానికి ‘సెలవు’
● వంద పడకల ఆసుపత్రిలో వైద్యుల కొరత ● 23 మంది వైద్యుల్లో ప్రస్తుతం ఆరుగురే ● 11 మంది సెలవులో, మరో ఆరుగురు బదిలీ ● నాడు ఓపీ 600.. నేడు 200 ● సేవలు అందక ప్రజల అవస్థలు డోన్: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన వంద పడకల ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు నానాటీకి సన్నగిల్లుతున్నాయి. పట్టణ శివారులో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.40 కోట్లతో కార్పొరేట్ తరహాలో ఆధునిక యంత్ర పరికరాలతో వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వంద పడకల ఆసుపత్రిలో వైద్యం దైవాదీనంగా మారుతోంది. ఆసుపత్రి ప్రారంభం 23 మంది వైద్యులను గత ప్రభుత్వం నియమించగా.. ఇందులో సగానికి సగం మంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక్కడి నుండి బదిలీ, సెలవులపై వెళ్లిపోయారు. గతంలో ప్రతిరోజూ 600 వరకు ఓపీ నడవగా ప్రస్తుతం 200కు పడిపోయింది. ఇందుకు కారణం ప్రస్తుతం వైద్యుల్లో ఆరు బదిలీలపై వెళ్లిపోవడం, 11 మందిలో కొందరు మహిళా వైద్యులు ప్రసూతీ సెలవు, కొంతమంది మెడికల్ లీవ్లపై వెళ్లిపోయారు. రేడియాలజిస్ట్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో డాక్టర్ల సంఖ్య ప్రస్తుతం ఆరుకు పరిమితమైంది. ఇందులో ఆర్థో డాక్టర్ను జిల్లా వ్యాప్తంగా జరిగే సదరన్ క్యాంపులకు డ్యూటీపై వేయడంతో ఆయన కూడా అందుబాటులో లేరు. ఇందుకు సంబంధించిన రోగులందరూ ప్రతిరోజూ ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి ఆసుపత్రికి రావడం, డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో వెనక్కి వెళ్లిపోవడం నిత్యకృత్యమైంది. నిన్నటి వరకు శస్త్రచికిత్సలు, ఆధునాతన వైద్య సేవలు అందించిన ఆసుపత్రిలో సేవలు మృగ్యమవుతుండటంతో పేదలు ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రి ఆవరణలో నేలపై కూర్చున్న దివ్యాంగురాలు గర్భిణుల కష్టాలు ప్రభుత్వాసుపత్రిలో అల్ట్రా సౌండ్ స్కానింగ్ వైద్యులు దీర్ఘకాలిక సెలవులపై వెళ్లిపోవడంతో ప్రైవేటు స్కానింగ్ సెంటర్లకు ఇక్కడి వైద్యులు సిఫారసు చేస్తున్నారు. ఒక్కొక్క స్కానింగ్కు రూ.1500 నుండి రూ.2వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. సాధారణ స్కానింగ్ కోసం కూడా గంటల తరబడి నేలపై కూర్చొని వేచిచూడాల్సిన దుస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా కూడా కనీసం ఆసుపత్రిలో ఫర్నీఛర్ కూడా ఏర్పాటు చేయలేదు. -
సివిల్స్లో పవన్ విజయం
● సత్తా చాటిన కర్నూలు మెడికల్ కాలేజీ విద్యార్థి ● మొదటి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లొచ్చారు ● రెండో ప్రయత్నంలో 375వ ర్యాంకు కర్నూలు సిటీ: సివిల్స్ ఫలితాల్లో కర్నూలు మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థి పవన్ కుమార్ రెడ్డి 375వ ర్యాంకు సాధించారు. కల్లూరు మండలం పర్ల గ్రామానికి చెందిన(ప్రస్తుతం కర్నూలులోని ఎన్.ఆర్పేట్లో ఉంటున్నారు) ఎం.కృష్ణారెడ్డి, ఎం.మధుమతి దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు ఎం.పవన్కుమార్ రెడ్డి కర్నూలు మెడకల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించే సమయంలోనే కుటుంబ సభ్యుల సలహా, సూచనల మేరకు సివిల్స్కు సన్నద్ధం అయ్యారు. మొదటి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లొచ్చారు. రెండో సారి 2024 నోటిఫికేషన్లో మెడికల్ సైన్స్ అప్షనల్ సబ్జెక్టు ఎంపిక చేసుకోని 375వ ర్యాంకు సాధించారు. తండ్రి ఎం.కృష్ణారెడ్డి కర్నూలు రూరల్ మండలం పంచలింగాల ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగాను, తల్లి ఎం.మధుమతి.. ఆర్.కొంతలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ టీచర్గా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు కావడంతో కుమారుడు పవన్ కుమార్ రెడ్డి.. కర్నూలు నగరంలోని ప్రైవేటు స్కూళ్లలోనే హైస్కూల్ విద్య పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ విద్య గుంటూరులోని ఓ కార్పొరేట్ కాలేజీలో చదివి, ఏపీ ఎంసెట్(అప్పటికి నీట్ ఉండేది కాదు)లో రాష్ట్ర స్థాయిలో 600వ ర్యాంకు రావడంతో కర్నూలు మెడికల్ కాలేజీలో వైద్య విద్య చదివారు. మెడిసిన్ 2022లో పూర్తి అయ్యాక సివిల్స్ ప్రిపేర్ కావాలని తల్లిదండ్రులు చెప్పడంతో 2023లో మొదటిసారి మొదటిసారి ప్రయత్నం చేసి ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. మరోసారి 2024 ఫిబ్రవరిలో ఇచ్చిన నోటిఫికేషన్కు దరఖాస్తు చేసి, గతేడాది జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష రాసి అర్హత సాధించారు. సెప్టెంబరు 20 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షలు రాసి ఈ ఏడాది జనవరి 17న ఇంటర్వ్యూకు హాజరయ్యారు. తన విజయంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంతో సహకరించారని పవన్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతి రోజు 8నుంచి 10 గంటల పాటు, పరీక్షల సమయంలో 12 గంటల పాటు చదివేవాడినని వెల్లడించారు. సివిల్స్ సన్నద్ధం కావాలనుకునేవారు ఇష్టమైన సబ్జెక్టును ఆప్షనల్గా ఎంపిక చేసుకోవాలని సూచించారు. రోజుకు కనీసం 10 గంటలు చదివితేనే సివిల్స్లో ర్యాంకు సాధించవచ్చునని తెలిపారు. తమ కుమారుడు సివిల్స్లో ర్యాంకు సాధించడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. -
చదవాలంటే ఎండకు నడవాల్సిందే!
పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు బస్సు సౌకర్యం లేక కాలినడకన పాఠశాలకు వచ్చి వెళ్తున్నారు. మండుతున్న ఎండలకు పెద్దలే తల్లడిల్లిపోతున్నారు. విద్యార్థులు మాత్రం మండుటెండలోనే పాఠశాల నుంచి ఇంటికి వెళ్లాల్సి వస్తోంది. రాచర్ల ఉన్నత పాఠశాలకు కొమ్మేమర్రి, నేరేడుచెర్ల, బొంచెర్వుపల్లి తదితర గ్రామాల విద్యార్థులు ప్రతి రోజూ కాలినడకన వచ్చి వెళ్తున్నారు. ఒంటి పూట బడులు కావడంతో మధ్యాహ్నం 12–30 గంటలకు విద్యార్థులను ఇంటికి వదులుతున్నారు. దీంతో ఆయా గ్రామాల విద్యార్థులు మంగళవారం సూర్యుడు నడినెత్తిన ఉన్న సమయంలో నడకయాతన పడుతూ ఇళ్లకు వెళ్తూ కనిపించారు. – ప్యాపిలి -
సంక్రాంతి, శివరాత్రి, ఉగాది కూడా పాయే
● ఉమ్మడి జిల్లాలో రూ.150.04 కోట్లతో 1,916 పనుల ప్రారంభం ● కర్నూలు జిల్లాలో వంద శాతం, నంద్యాల జిల్లాలో 98.84 శాతం పనుల పూర్తి ● ఇప్పటి వరకు విడుదలైన మొత్తం రూ.23.75 కోట్లు ● నాలుగు నెలలుగా పెండింగ్లో రూ.126.29 కోట్లు ● నైరాశ్యంలో చోటా కూటమి నేతలు కర్నూలు మండలం ఆర్.కొంతలపాడులో వేసిన సీసీ రోడ్డు కర్నూలు(అర్బన్): పల్లెల్లో అంతర్గత రోడ్లపై ఆర్భాటం చేశారు. గ్రామానికి ఒక రోడ్డును మంజూరు చేసి పూర్తి స్థాయిలో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ప్రచారాలను హోరెత్తించారు. పల్లె పండుగ వారోత్సవాలంటూ గత ఏడాది అక్టోబర్ 14 నుంచి 20వ తేదీ వరకు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపడుతున్న సీసీ రోడ్ల పనులకు భూమి పూజలు నిర్వహించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సింహ భాగం సర్పంచ్లు వైఎస్సార్సీపీ వర్గీయులే ఉన్నా, వారి మాటను ఖాతరు చేయకుండా చోటా కూటమి నేతలు తమ ఇష్టారాజ్యంగా రోడ్లను మంజూరు చేయించుకున్నారు. చేసిన పనులకు చేసినట్లుగా బిల్లులను విడుదల చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దాదాపు అన్ని పనులను సంక్రాంతి పండుగ నాటికి పూర్తి చేశారు. అయితే సంక్రాంతి, శివరాత్రి, ఉగాది పండుగ పోయినా, నేటికీ బిల్లులు విడుదల కాకపోవడంతో పనులు చేసిన చోటా కూటమి నేతలు తీవ్ర నైరాశ్యంలో ఉండిపోయారు. గ్రామాల్లో అప్పులు చేసి పనులు పూర్తి చేసిన వారు నేడు చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక దిక్కులు చూస్తున్నారు. నిన్న మొన్నటి వరకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించలేదని అపద్దపు ఆరోపణలు చేసిన కూటమి నేతలు ప్రస్తుతం తమ ప్రభుత్వంలో బిల్లుల విడుదలలో నెలకొన్న జాప్యంపై నోరు మెదపని స్థితిలో ఉన్నారు. చేసిన పనులకు చేసినట్లుగా ఎం.బుక్ రికార్డు చేసి బిల్లులను అప్లోడ్ చేసిన రెండు, మూడు రోజుల్లోనే బిల్లులు పడిపోతాయని చెప్పిన దానికి, ప్రస్తుత పరిస్థితికి పొంతన లేకపోవడం గమనార్హం. రూ.150.04 కోట్లతో 1,916 పనులు వారోత్సవాల్లో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.150.04 కోట్లతో మొత్తం 1,916 పనుల్లో భాగంగా 270.25 కిలోమీటర్ల మేర గ్రామాల్లో సీసీ రోడ్లు వేయాలని పనులు చేపట్టారు. ఈ పనుల్లో ఇప్పటి వరకు 268.51 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. పనులను సంక్రాతి పండుగ నాటికి పూర్తి చేయాలని నిర్ణీత గడువును కూడా విధించిన నేపథ్యంలో పల్లెల్లో కూటమి పార్టీలకు చెందిన నేతలు హడావుడిగా పనులను పూర్తి చేశారు. అదే దారిలో బీటీ రోడ్ల పనులు సీసీ రోడ్ల దారిలోనే బీటీ రోడ్లకు సంబంధించిన బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయి. కర్నూలు జిల్లాలో 4, నంద్యాల జిల్లాలో 3 పనులు మంజూరయ్యాయి. ఉమ్మడి జిల్లాలో రూ.13.30 కోట్లతో 14.89 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లను వేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 3.60 కిలోమీటర్లు మాత్రమే వేశారు. ఈ పనులకు కూడా ఇప్పటి వరకు నయాపైసా విడుదల కాని పరిస్థితి. నెలాఖరుకు బిల్లులు విడుదలయ్యే అవకాశం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, ఇతరత్రా పనులకు ఈ నెలాఖరులోగా బిల్లులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఉపాధి పనులకు సంబంధించి మెటీరియల్ కాంపోనెంట్, వేతనాలకు బిల్లులను విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే పల్లె పండుగ కార్యక్రమంలో చేపట్టిన సీసీ రోడ్ల పనుల బిల్లులు కూడా విడుదల కానున్నాయి. ఇప్పటి వరకు చేసిన పనులకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో రూ.23.75 కోట్లు విడుదల కాగా, ఇంకా రూ.126.29 కోట్లు విడుదల కావాల్సి ఉంది. చేసిన పనులకు చేసినట్లుగా బిల్లులను అప్లోడ్ చేశాం. – వి.రామచంద్రారెడ్డి, పీఆర్ ఎస్ఈ నాణ్యత కూడా అంతంత మాత్రమే.. రూ.126.29 కోట్ల వరకు బకాయిలు ఆయా గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్ల పనులకు సంబంధించి ఇప్పటి వరకు రూ.126.29 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో కర్నూలు జిల్లాకు రూ.14.80 కోట్లు, నంద్యాల జిల్లాకు రూ.8.95 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. సీసీ రోడ్లతో పాటు భవనాలు, ప్లాంటేషన్, మినీ గోకులాలు, బీటీ రోడ్లు, ఇతరత్రా పనులకు సంబంధించిన బిల్లులు కూడా కోట్ల రూపాయాల్లో పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వేగంగా చేసిన పనులకు చేసినట్లుగా బిల్లులు విడుదల కాకపోవడం వల్ల పలు ప్రాంతాల్లో చేసిన పనులకు సంబంధించిన క్వాలిటీపై కూడా దృష్టి సారించనట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. వేగంగా సీసీ రోడ్లు వేయడం, క్యూరింగ్ కూడా సరిగా చేయనట్లు తెలుస్తోంది. రోడ్ల నాణ్యత పట్ల పీఆర్ క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇంజనీర్లు కూడా అధిక రోడ్ల పనులు జరుగుతున్న నేపథ్యంలో సమయం తక్కువగా ఉండడంతో ఆయా పనుల పట్ల పూర్తి స్థాయిలో దృష్టి సారించనట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,916 పనుల్లో ఇప్పటి వరకు 50 శాతం పనులను కూడా క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు చెక్ చేయకపోవడం గమనార్హం. నాణ్యత పరిశీలించిన పనుల్లో కూడా దాదాపు 50 నుంచి 60 శాతం పనుల్లో రికవరీకి ఆదేశించినట్లు సమాచారం. కాగా పూర్తయిన పనులకు వంద శాతం బిల్లుల చెల్లింపు జరగదని, మొత్తం బిల్లులో 15 శాతాన్ని డిపాజిట్గా ఉంచుకొని, క్వాలిటీ చెక్ చేసిన అనంతరం డిపాజిట్గా ఉంచుకున్న మొత్తాన్ని విడుదల చేస్తారని ఇంజనీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. -
యువకుడిపై లాఠీ నృత్యం
● అకారణంగా చితక్కొట్టిన హెడ్ కానిస్టేబుల్సంజామల: కూటమి ప్రభుత్వంలో పోలీసుల అరాచకాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. నొస్సం గ్రామానికి చెందిన రమేష్బాబు అనే యువకుడిని కానిస్టేబుల్ విచక్షణా రహితంగా చితకబాదిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాలు.. ఈనె ల 19న నొస్సం గ్రామానికి చెందిన భరత్ మద్యం తాగి బస్టాండ్లో రోడ్డుపై అడ్డంగా బైక్ పెట్టి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించాడు. అదే క్రమంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్, మహిళా కండెక్టర్తో భరత్ వాగ్వాదానికి దిగాడు. దీంతో వారు విధులకు ఆటంకం కలిగిస్తున్నాడంటూ పోలీసుకు సమాచారం ఇచ్చారు. సమీపంలో ఉన్న రమేష్బాబు మహిళా కండెక్టర్కు భరత్తో సారీ చెప్పించి పంపించేశారు. ఈలోపు హెడ్కానిస్టేబుల్ నాగన్న, మరో ఇద్దరు పోలీసులు సాయంత్రం నొస్సం చేరుకుని భరత్ కోసం ఆరా తీశారు. అతడు కనపడకపోవడంతో రమేష్బాబును పోలీసు వాహనంలో పుచ్చయకాయపల్లె గ్రామ సమీపంలోని పొలంలోకి తీసుకెళ్లి చితక్కొట్టారు. అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. తీవ్ర గాయాలతో ఇంటికి చేరుకున్న రమేష్బాబును కుటుంబ సభ్యులు వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల పాటు చికిత్స పొంది సాయంత్రం స్టేషన్కు చేరుకుని సీఐ హనుమంత్నాయక్ను కలిసి హెడ్కానిస్టేబుల్ నాగన్నపై ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సీఐని వివరణ కోరగా విచారించి కానిస్టేబుల్పై చర్యలు తీసుకుంటామన్నారు. -
సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థుల ప్రతిభ
కర్నూలు (హాస్పిటల్): ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన వార్షిక పరీక్షల్లో కర్నూలు మెడికల్ కళాశాల సూపర్ స్పెషాలిటీ విభాగాల్లోని పీజీ వైద్య విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరచి రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. కార్డియాలజీ విభాగంలో మహేష్ పునుగుపాటి స్టేట్ ఫస్ట్ ర్యాంకు, ఆదిత్య, రంగవేణి సమాన మార్కులతో నెఫ్రాలజీ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు, కిషన్ రెడ్డి ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో స్టేట్ థర్డ్ ర్యాంకు, హిమజ యూరాలజీ విభాగంలో స్టేట్ సెకండ్ ర్యాంకు సాధించారు. వీరిని సోమవారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టి నరసమ్మ అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోనే మంచి పేరున్న కర్నూలు మెడికల్ కళాశాల పేరును ఈ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి మరోసారి నిలబెట్టారని కొనియాడారు. కళాశాల సూపర్ స్పెషాలిటీ విభాగాల్లోని కార్డియాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ విభాగాల్లో మొత్తం 9 మంది పరీక్ష రాయగా అందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారని, అందులో ఐదుగురికి స్టేట్ ర్యాంకులు రావడం ఆనందంగా ఉందని తెలిపారు. సూపర్ స్పెషాలిటీ విభాగాలు ప్రారంభమైనప్పటి నుంచి కళాశాల విద్యార్థులు స్టేట్ ర్యాంకులతో మంచి ఫలితాలు సాధిస్తున్నారన్నారు.ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్, యూరాలజీ హెచ్ఓడీ డాక్టర్ సీతారామయ్య, ప్లాస్టిక్ సర్జరీ హెచ్ఓడీ డాక్టర్ మంజుల బాయి, నెఫ్రాలజీ హెచ్ఓడీ డాక్టర్ అనంత్, గ్యాస్టో ఎంట్రాలజీ హెచ్ఓడీ డాక్టర్ మోహన్రెడ్డి అభినందించారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులు -
బసవేశ్వర పురాణంలో ఆకట్టుకున్న సీమంతం
హొళగుంద: స్థానిక సిద్ధేశ్వరస్వామి ఆలయ ఆవరణంలో జరగుతున్న కల్బుర్గి శ్రీశరణ బసవేశ్వరస్వామి పురాణ ప్రవచనంలో భాగంగా సోమవారం రాత్రి జరిగిన సీమంతం భక్తులను అమితంగా ఆకట్టుకున్నా యి. కార్యక్రమాన్ని తిలకించడానికి చుట్టు పక్కల గ్రా మాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రవచన కారుడు సిద్ధరామయ్యస్వామి హిరేమ ఠ్శాసీ్త్ర శరణ బసవేశ్వరస్వామి లీలలు గురించి వివరిస్తూ సీమంతం కార్యక్రమంపై భక్తులకు కథలు, గేయల రూపంలో చెప్పి ఆకట్టుకున్నారు. ఈనెల 30 వరకు జరిగే ఈ పురాణ ప్రవచన కార్యక్రమానికి వచ్చే చుట్టు పక్కల గ్రామాలు, దూర ప్రాంతాల భక్తులకు నిత్యం అన్నదానం చేపడుతున్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు రాజ పంపన్న గౌడ్, శివశంకర్గౌడ్, సిద్ధార్థగౌడ్, ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. -
ఆర్టీసీ బస్సులో చోరీ
● రూ.6 వేల నగదు అపహరణ ఆదోని అర్బన్: ఆర్టీసీ బస్సులో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. ఆదోని పట్టణానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ కం కండెక్టర్ మధుసూదన్రెడ్డి తెలిపిన వివరాలు.. ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి ప్రయాణికులతో ఆదోనికి బయలుదేరారు. కోడుమూరులో ఓ వ్యక్తి తన పేరు శ్రీనివాస్ అని, సత్తివీడుకు చెందిన ఆర్టీసీ ఎంప్లాయినంటూ డూప్లికేట్ ఆర్టీసీ పాస్ చూపించి బస్సు ఎక్కాడు. గోనెగండ్లలో డ్రైవర్ కం కండెక్టర్ ప్రయాణికులకు టికెట్ కొడుతుండగా శ్రీనివాస్ డ్రైవింగ్ సీటు వద్ద నగదు ఉన్న బ్యాగు, సెల్ఫోన్ తీసుకుని బస్సు దిగి వెళ్లిపోయాడు. టికెట్లు పూర్తి చేసుకుని బస్సును కాస్త ముందుకు నడుపుకుంటూ వచ్చిన కాసేపటికి బ్యాగు లేదని గమనించిన డ్రైవర్ కం కండెక్టర్ వెంటనే మరో బస్సు డ్రైవర్కు సమాచారం చేరవేశాడు. అతడు గోనెగండ్లలో బ్యాగుతో ఉన్న వ్యక్తిని పట్టుకునేందుకు వెళ్లేలోపే సెల్ఫోన్ పడేసి బ్యాగ్తో పరారయ్యాడు. బ్యాగులో రూ.6 వేల నగదు ఉందని, తెలిసిన వారితో అప్పు చేసి కౌంటర్లో కట్టానని డ్రైవర్ కం కండెక్టర్ మధుసూదన్రెడ్డి తెలిపాడు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సలహాతో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు.నువ్వుల కట్టెకు నిప్పు ఆత్మకూరు రూరల్: మండల పరిధిలోని అమలాపురం గ్రామానికి చెందిన రైతు స్వామన్న పొలంలో కోత కోసి కుప్ప నూర్చేదుకు సిద్ధంగా ఉంచిన నువ్వుల కట్టెకు సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. బాధితుడు తెలిపిన వివరాలు.. తనకు ఉన్న పొలంతో పాటు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని నువ్వుల పంట సాగుచేశాడు. పైరును ఇటీవల కోసి కుప్ప నూర్చేందుకు సిద్ధం చేశాడు. అంతలోనే గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో దాదాపు 10 క్వింటాళ్ల నువ్వులు బూడిద పాలయ్యాయని రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా స్వామన్న వైఎస్సార్సీపీ గ్రామ నాయకుడు కావడం, ఇటీవల గ్రామంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనల నేపథ్యంలోనే ఓర్వలేని వారు ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పలువురు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. వీఆర్ఓ అనుమానాస్పద మృతి హాలహర్వి: మండల కేంద్రానికి చెందిన వీఆర్ఓ కె.సత్యనారాయణరావు(44) సోమవారం అనుమానాస్పదంగా మృతిచెందారు. కె.సత్యనారాయణరావు కొంతకాలంగా మద్యానికి బానిస అయ్యాడు. ఈవిషయమై భార్య భర్తల మధ్య మనస్పర్థలు రావడంతో భార్య రూప భర్తకు దూరంగా పుట్టినిల్లు ఎమ్మిగనూరులో ఉంటోంది. కాగా మద్యం తాగి విధులకు హాజరవుతుండటంతో సత్యనారాయణరావును అధికారులు సస్పెండ్ చేశారు. ఈక్రమంలో సోమవారం ఇంట్లో విగతజీవిగా పడివున్న సత్యనారాయణరావును గుర్తించిన స్థానికులు అతని భార్యకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆమె హాలహర్వికి చేరుకుని భర్త మృతదేహంపై పడి బోరున విలపించింది. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రాధాన్యత కేటగిరి టీచర్లకు ప్రత్యేక వైద్య శిబిరం
కర్నూలు సిటీ: ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ యాజమాన్యాల స్కూళ్లలో పని చేస్తున్న అన్ని కేటగిరిల ఉపాధ్యాయులు ప్రాధాన్యత కేటగిరి, స్పెషల్ పాయింట్లకు అర్హత కలిగిన ఉపాధ్యాయులకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు డీఈఓ ఎస్.శామ్యూల్పాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(ధన్వంతరి కాన్ఫరెన్స్ హాల్) మూడో అంతస్తులో వైద్యశిబిరం ఏర్పాటు చేశామన్నారు. పర్వతారోహకుడికి ఆర్థిక సాయం కర్నూలు(సెంట్రల్): ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనా 7వ శిఖరం దౌళగిరి పర్వతాన్ని అధిరోహించిన గోనెగండ్లకు చెందిన సురేష్బాబుకు సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ పి.రంజిత్బాషా ఆర్థిక సాయం అందజేశారు. 25 ఏళ్ల సురేష్బాబు ఇప్పటి వరకు 25 శిఖరాలను అధిరోహించడమే గాకుండా ఏడు ఖండాల్లోని 5 ఎత్తైనా శిఖరాలను అతి తక్కువ సమయంలో అధిరోహించి రికార్డు సృష్టించారు. సురేష్బాబు ధైర్యసాహసాలను కలెక్టర్ మెచ్చుకుని సీఎస్ఆర్ కింద జియో మైసూరు కంపెనీతో మాట్లాడి రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందించి అభినందించారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, పీసీబీ ఈఈ కిశోర్రెడ్డి, జియోమైసూరు కంపెనీ ప్రతినిధి రామ్మోహన్ పాల్గొన్నారు. -
మరో ఆశల సాగు..
రబీలో నష్టపోతే ఖరీఫ్.. ఖరీఫ్ ముంచితే రబీ.. ఏటా అన్నదాతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంటారు. ఈ ఏడాది రబీ పంటలు అంతంత మాత్రంగానే చేతికందడంతో ఖరీఫ్పై కోటి ఆశలతో సాగుకు సిద్ధమవుతున్నారు. కల్లూరు, కోడుమూరు మండలాల్లో పంటల వ్యర్థాలను, కంప చెట్లను తొలగించి పొలాలను రూపు చేసుకునే పనుల్లో రైతన్నలు నిమగ్నమయ్యారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు స్థల వివాదంలో టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణఆత్మకూరు: మండలంలోని క్రిష్ణాపురం గ్రామంలో సోమవారం ఓ స్థల వివాదంలో ఒకే వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణ మాటలతో ప్రారంభమై చివరకు రాళ్లతో దాడులు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటాన గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. క్రిష్ణాపురం గ్రామంలో ఓ స్థల వివాదంలో కంప చెట్లు తొలగించే సమయంలో ఒకరినొకరు (రెండు వర్గాలూ టీడీపీకి చెందినవారే)దూషించుకుంటూ ఘర్షణకు పాల్పడ్డారు. కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లతో దాడులకు దిగారు. ఇరువర్గాలకు చెందిన పది మందికి రక్త గాయాలయ్యాయి. అందులో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా మారింది. సమాచారం తెలుసుకున్న ఆత్మకూరు సీఐ రాము తన సిబ్బందితో క్రిష్ణాపురం చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ప్రథమ చికిత్స అనంతరం ఇద్దరిని 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పది మందికి పైగా గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం -
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
నందికొట్కూరు: ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని ఉమ్మడి కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బీ.లీలా వెంకట శేషాద్రి సూచించారు. సోమవారం సబ్జైల్ను ఆయన తనిఖీ చేశారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు న్యాయవాదులు లేకుంటే ఉచిత న్యాయవాదులను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. 70 ఏళ్ల పైబడిన ఖైదీలకు, అనారోగ్యంతో బాధపడే వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. త్వరగా బెయిల్ మంజూరు అయ్యేలా కృషి చేయనున్నట్లు తెలిపారు. ఖైదీలు కోర్టు వాయిదాలకు కచ్చితంగా హాజరుకావాలన్నారు. ఏమైనా సమస్యలుంటే జిల్లా న్యాయసేవ అధికార సంస్థను సంప్రందించాలన్నారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్లైన్ నెంబర్ 15100కు సమచారం తెలియజేయాలన్నారు. కొందరు ఖైదీలు బెయిల్ మంజూరైనా జామీనుదారులు లేక జైలులోనే ఉన్నామని తెలియజేయడంతో విచారించి బెయిల్ మంజూరు కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఖైదీలకు అందించే ఆహారం ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో న్యాయవాదులు అరుణ్కుమార్, సూపరింటెండెంట్ పాల్గొన్నారు. సారా తయారీదారులపై బైండోవర్ కేసులు కర్నూలు: ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని గుమ్మితం తండాలో 16 మంది సారా తయారీదారులపై ఎకై ్సజ్ పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. పలుమార్లు నాటుసారా స్థావరాలపై దాడులు చేసి విక్రయ, రవాణాదారులను అరెస్టు చేసి జైలుకు పంపినప్పటికీ మార్పు రాకపోవడంతో గుమ్మితం తండా గ్రామానికి చెందిన బిలావత్ స్వామి నాయక్, బిలావత్ బాలు నాయక్, దేశవత్ రాముడు నాయక్, దశావత్ థౌరు నాయక్, లక్ష్మా నాయక్, రాము నాయక్, మల్యాల లక్ష్మీబాయి, మదిర సుభా నాయక్, ముదిరేచ బాలాజీ నాయక్, ఎం.కృష్ణా నాయక్, ఎం.సురేష్ నాయక్, ఎం.వాసు నాయక్, మున్నే నాయక్, రవి నాయక్, లక్ష్మీబాయి, ఎస్.వెంకటమ్మ తదితరులపై బైండోవర్ కేసులు నమోదయ్యాయి. వీరందరినీ ఎస్ఐ రెహనా ఆధ్వర్యంలో ఓర్వకల్లు తహసీల్దార్ ఎదుట హాజరుపరచి బైండోవర్ చేశారు. -
ఉద్యోగం పేరుతో మోసం
కర్నూలు: స్థానిక బళ్లారి చౌరస్తా వద్ద ఉన్న కరెంటు ఆఫీస్లో తన కుమారుడు రమేష్కు ఏఈ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి అందులో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగి రామాంజనేయులు రూ.22 లక్షలు తీసుకుని మోసం చేశాడని, విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా సీతారాం నగర్కు చెందిన శాంతమ్మ ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. కర్నూలు టూటౌన్ పోలీస్ స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి, వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్ఎస్కు మొత్తం 128 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నిటిపై చట్టపరిధిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పీజీఆర్ఎస్కు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని... ● ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడి పెడితే రెట్టింపు డబ్బులు వస్తాయని చెప్పి గుర్తు తెలియని వ్యక్తులు 18 విడతలుగా రూ.62 లక్షలు వారి ఖాతాలో జమ చేసుకుని మోసం చేశారని కర్నూలుకు చెందిన బాధితుడు ఫిర్యాదు చేశారు. వాట్సాప్లో లింక్ పంపి దానిని క్లిక్ చేసిన తర్వాత ఆన్లైన్ ట్రేడింగ్లో డబ్బులు పెట్టుబడి పెడితే రెట్టింపు లాభం వస్తుందని చెప్పి మొదట రూ.1.20 లక్షలు వారి ఖాతాలో వేయించుకుని తిరిగి డబ్బులు పంపి నమ్మించారని, తర్వాత భారీ మొత్తంలో డబ్బు వేయించుకుని విత్డ్రా ఆప్షన్ ఇవ్వకుండా తన మొబైల్ నెంబర్ను బ్లాక్ చేసి మోసం చేసినట్లు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైం పోర్టల్లో ఫిర్యాదు చేయగా కొంత మొత్తాన్ని ఫ్రీజ్ చేశారని, ఎఫ్ఐఆర్ చేయించి ఫ్రీజ్ చేసిన మొత్తాన్ని కోర్టు నుంచి ఇప్పించాలని బాధితుడు ఎస్పీతో మొర పెట్టుకున్నారు. ● హెచ్డీఎఫ్సీ ఏటీఎం కేంద్రంలో డ్రా చేసిస్తామని చెప్పి ఇద్దరు వ్యక్తులు తన ఏటీఎం కార్డు తీసుకుని మార్పు చేసి బ్యాంకు ఖాతాలో రూ.50 వేలు డ్రా చేసుకుని మోసం చేశారని, సీసీ కెమెరాలో వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కర్నూలు ఎన్ఆర్పేటకు చెందిన ఇక్బాల్బాషా ఫిర్యాదు చేశారు. ● కుమారుడు, కోడలు కలిసి తనను ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇంటిని కూడా వేరేవాళ్లకు రిజిస్ట్రేషన్ చేశామని చెబు తూ మోసం చేస్తున్నారని కర్నూలు నాగిరెడ్డి కా లనీకి చెందిన మహబూబ్ బాషా ఫిర్యాదు చేశారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు పీజీఆర్ఎస్కు 128 ఫిర్యాదులుసమస్యలు తక్షణమే పరిష్కరించండి ఎస్పీ అదిరాజ్సింగ్రాణా నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన వినతుల్లో చట్టపరిధిలో ఉన్న వాటిని తక్షణమే పరిష్కరించాలని నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్సింగ్రాణా అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ యుగంధర్బాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో 96 వినతులు వచ్చాయని, వీటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులకు ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన వినతులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
కోడుమూరు రూరల్: వెల్దుర్తి నుంచి కోడుమూరుకు వస్తున్న ఆర్టీసీ బస్సు, కోడుమూరు నుంచి వెల్దుర్తి వైపు వెళుతున్న లారీ వెంకటగిరి గ్రామ సమీపాన ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్కు రక్త గాయాలవ్వగా, బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో కేవలం 15 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. సింగల్ రోడ్డులో ఆర్టీసీ బస్సు, లారీ డ్రైవర్ ఇద్దరూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రయాణికులు తెలిపారు. రైలు పట్టాలపై వృద్ధుడి మృతదేహం నంద్యాల: పట్టణంలోని గురురాజ పబ్లిక్ పాఠశాల సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద ఆదివారం గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైనట్లు రైల్వే ఎస్ఐ జలీల్ తెలిపారు. వృద్ధుడి వయస్సు 70 సంవత్సరాలు ఉంటుందని, మృతుడు ఎరుపు రంగు పంచ, పచ్చరంగు చొక్కా ధరించి ఉన్నాడన్నారు. వృద్ధుడు మృతి చెంది నాలుగు రోజులు కావస్తున్నట్లు తెలుస్తోందన్నారు. మృతదేహానికి నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వైన్షాప్ సమీపంలో వ్యక్తి మృతి ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని అగ్నిమాపక కేంద్రం ఎదరుగా ఉన్న వైన్షాప్ సమీపంలో ఆదివారం రాత్రి కురవ అడివప్ప(58) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాలు..పెద్దకడుబూరు మండలం హెచ్.మురవణి గ్రామానికి చెందిన కురవ అడివప్ప(58) ఉదయం ఎమ్మిగనూరుకు వచ్చాడు. ఫైర్ స్టేషన్ ఎదురుగా వున్న వైన్ షాప్కు సమీపంలోని కూల్డ్రింక్ షాప్ పక్కన కూర్చొని ఉన్నాడు. వర్షం ప్రారంభం కావటంతో అక్కడ ఉన్న వారు తలదాచుకునేందుకు వైన్షాప్ దగ్గరకు పరుగులు తీశారు. వర్షం తగ్గాక వచ్చి చూడగా కూల్డ్రింక్ షాప్ దగ్గర కూర్చున్న కుర వ అడివప్ప స్పృహతప్పి పడిపోయి ఉండటంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మి, ముగ్గురు కుమారులు ఉన్నా రు. అడివప్ప మృతికి కారణాలపై విచారిస్తున్నా మని ఎమ్మిగనూరు రూరల్ పోలీసుల తెలిపారు. వాగులో పడ్డ ఆటో పాణ్యం: మండల పరిధిలోని అనుపూరు గ్రామం వద్ద ఉన్న కొర్రవాగులో ఓ ఆటో పడి ప్రయాణికులకు గాయాలయ్యాయి. నంద్యాల నుంచి కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో ఆటోలో ఉన్న ముగ్గురికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం నంద్యాలకు తరలించినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా దెబ్బతినింది. -
తల్లిదండ్రులకు అండగా నిలుస్తా
అనంతపురం జిల్లా పెద్దపప్పురు గ్రామానికి చెందిన వెన్నపూస రామ్మోహన్రెడ్డి, లక్ష్మీదేవిల కుమార్తె వి. వైష్ణవి ఏపీఆర్జేసీ బనవాసిలో చదివి ఎంఈసీలో 979 మార్కులు సాధించారు. రాష్ట్రస్థాయిలో మంచి మార్కులు సాధించి ప్రశంసలతో పాటు ప్రతిభ పురస్కారాన్ని అందుకున్నారు. బనవాసి ఏపీఆర్జేసీ కాలేజీలో విద్యార్థిని రాష్ట్రస్థాయిలో మంచి మార్కులు సాధించటం గత ప్రభుత్వం విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించటమే కారణమని తెలుస్తోంది. మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు అండగా నిలవాలని ఉందని విద్యార్థిని వి. వైష్ణవి చెప్పారు. -
ఏపీటీఎస్ఏ ఉమ్మడి జిల్లా శాఖ ఎన్నికలు ఏకగ్రీవం
కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీస్ అసోసియేషన్(ఏపీటీఎస్ఏ) ఉమ్మడి కర్నూలు జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఏర్పాటైంది. ఆదివారం బి.క్యాంపులోని జిల్లా ట్రెజ రీ కార్యాలయంలో నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. ఎన్నికల అధికారిగా నెల్లూరు జిల్లా ఏపీటీఎస్ఏ అధ్యక్షుడు పి.కిరణ్కుమార్ వ్యవహరించారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్ వెంగళ్రెడ్డి జిల్లా ట్రెజరీలో సీనియర్ అకౌంటెంటుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన చొరవ తీసుకోవడంతో పోటీ లేకుండా ఎన్నిక ఏకగ్రీవమైంది. ఏపీటీఎస్ఏ ఉమ్మడి జిల్లా శాఖ అధ్యక్షుడుగా డి.రవికుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్గా ఎస్.మహబూబ్బాషా, ఉపాధ్యక్షులుగా టి.వనిత, పి.సుధాకర్రెడ్డి, ఎస్.ఆంజాద్బాషా, రాకేష్, కార్యదర్శిగా టి.గురుమూర్తి, జాయింట్ సెక్రటరీలుగా కె.విజయమ్మ, జి.అరవింద్ హనోక్, ఆర్.లక్ష్మణ్ నాయక్, కోశాధికారిగా ఎన్.సునీల్బాబు. స్టేట్ కౌన్సిల్ మెంబర్లుగా ఉదయ్కుమార్, వేమచంద్రరావు, హెచ్ఎండీ అలియా ఎన్నికయ్యారు. -
ఎట్టకేలకు డీఎస్సీ!
పోస్టుల భర్తీ ఇలా.. డీఎస్సీతో ఉమ్మడి జిల్లాలో ఎస్జీటీ 1817, స్కూల్ అసిసెంట్లు లాంగ్వేజ్–182 పోస్టులు, హిందీ 114, ఇంగ్లిషు 81, గణితం 90, ఫిజికల్ సైన్స్ 66, బయోలాజికల్ సైన్స్ 74, సోషల్ స్టడీస్ 112, ఫిజికల్ ఎడ్యుకేషన్ 209 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటితో పాటు ఏపీ మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, గురుకులాల్లో జోన్–4లో ఉమ్మడి జిల్లాలో సుమారు 121 పోస్టులు భర్తీ చేయనున్నారు. కర్నూలు సిటీ: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మోగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ఆగస్టు నెలలో హడావుడి చేసింది. టెట్ పరీక్షల పేరుతో నాడు డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వేసి, టెట్ నిర్వహించి ఫలితాలను సైతం విడుదల చేశారు. అదిగో...ఇదిగో అంటూ నాలుగైదు నెలలుగా నిరుద్యోగులను ఊరించి..ఊరించి ఎట్టకేకలకు డీఎస్సీ నోటఫికేషన్ను జారీ చేశారు. ఏడాదికిపైగా నిరుద్యోగులు డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. కొంత మంది విద్యార్థులు మనస్తాపానికి గురై అనారోగ్యాల బారిన పడ్డారు. ఇదీ నిజం ● వాస్తవానికి 2018లోనే 1,393 టీచర్ పోస్టులు, 192 క్రాఫ్ట్ టీచర్ పోస్టులను రద్దు చేసి అప్పటి డీఈఓ వాటిని డీఎస్సీలో నోటిఫై చేయాలని నాటి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం నామమాత్రంగా 608 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చింది. ● 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పోస్టులను భర్తీ చేసింది. అదే విధంగా 1998 డీఎస్సీ బాధితులకు, 2008 డీఎస్సీలో ఎంపికై ఉద్యోగాలు రాని వారికి సైతం టీచర్ పోస్టులు ఇచ్చింది. ● గతేడాది జిల్లాలో సుమారు 1,693 టీచర్ పోస్టుల భర్తీకి అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే టీడీపీ నేతలు న్యాయస్థానాల్లో కేసులు వేయించారు. దీంతో నిరుద్యోగులు మరో ఏడాది పాటు డీఎస్సీ కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు వచ్చాయి. ● స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉన్నప్పటికీ ప్రస్తుత డీఎస్సీలో ఒక్క పోస్టు కూడా చూపలేదు. ● పరీక్షలను ఆన్లైన్లో నెల రోజుల పాటు నిర్వహిస్తుండడంపై నిరుద్యోగులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ● ఒకే నోటిఫికేషన్, ఒకే ప్రశ్నపత్రం ద్వారా పరీక్షలను ఆఫ్లైన్లో నిర్వహించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ● గతేడాది ఆగస్టు నెలలో నిర్వహించిన టెట్లో తక్కువ మంది అర్హత పొందారు. మిగిలిన వారికి కూడా అర్హత పొందేందుకు మరోసారి టెట్ నిర్వహించి..ఫలితాలు వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అయితే అందుకు విరుద్ధంగా చేశారు. అవసరం ఇదీ.. ● ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,843 స్కూళ్లు ఉన్నాయి. వీటిలో చదవుతున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా 4,000 టీచర్ పోస్టులు అవసరం అని గతంలో జిల్లా విద్యాశాఖ అధికారులు నివేదికలు ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం 2,645 పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ● ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధన చేసే స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు ‘టెట్’ నిర్వహించినా డీఎస్సీలో ఒక్క పోస్టును కూడా చూపలేదు. పోస్టులు భర్తీ చేయనప్పుడు ఎందుకు టెట్ నిర్వహించారని ప్రశ్నిస్తూ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ● మున్సిపల్ స్కూళ్లలో అన్ని క్యాటగిరీలకు చెందిన 98 పోస్టులను భర్తీ చేయనున్నారు. మున్సిపల్ టీచర్లకు పదోన్నతులు ఇవ్వలేక 22 పోస్టులు మాత్రమే ఇచ్చారు. ● ప్రస్తుతం విద్యాశాఖలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన క్లస్టర్, మోడల్ ప్రైమరీ స్కూల్ విధానంతో ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఇంకా 1,300 టీచర్ పోస్టులకు పైగా అవసరమని విద్యాశాఖ అధికారులు గుర్తించారు. వైఎస్సార్సీపీ చొరవతోనే... ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా పశ్చిమ ప్రాంతంలోని పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు పోస్టులు మంజూరైనా వారికి అవసరం లేని వాటిని ఉమ్మడి కర్నూలు జిల్లాకు బదలాయించారు. దీంతో సుమారు 1,845 పోస్టులకు జిల్లాకు వచ్చాయి. ఆ పోస్టుల్లో పనిచేస్తున్న వారికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇచ్చారు. దీంతో ఎస్జీటీ పోస్టులను నేటి డీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు అవకాశం కలిగింది. ఉమ్మడి జిల్లాలో 2,645 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఎస్జీటీ 1,817, స్కూల్ అసిస్టెంట్లు 828, ట్రైబల్ వెల్ఫేర్లో 33 పోస్టులు డీఎస్సీలో చూపించని స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు నెల రోజుల పాటు ఆన్లైన్లో పరీక్షలపై మండిపడుతున్న నిరుద్యోగులు -
జగన్ మామయ్య చేసిన మార్పులతోనే..
కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామానికి చెందిన బోయ స్వాములు, వరలక్ష్మి దంపతుల కుమార్తె బోయ హరిత ఓర్వకల్లు కస్తూర్బా గాందీ విద్యాలయంలో చదివారు. ఇంటర్ ఎంఈసీ గ్రూపులో 913 మార్కులు సాధించారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్బాబు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. తాను వ్యవసాయ కుంటుంబంలో పుట్టి, ఇంట్లో పనులు, పొలం పనులు చేసుకుంటూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలిచానని ఈ విద్యార్థిని తెలిపారు. ఊర్లో జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదివి మంచి మార్కులు సాధించానని, ఇంటర్లో 913 మార్కులు సాధించడం చాలా గర్వంగా ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మామయ్య ప్రభుత్వ విద్యలో మార్పులు చేసి ఆయన ప్రవేశపెట్టిన ‘బేబీ బుల్లెట్స్’ అనే పుస్తకం నా చదువుకు ఎంతగానో ఉపకరించిందని ఈ విద్యార్థిని తెలిపారు. -
రాజకీయ కక్షతోనే ఎంపీ మిథున్ రెడ్డిపై తప్పుడు కేసులు
కర్నూలు (టౌన్): రాజకీయ కక్షతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మద్దూరు సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. ఆదివారం స్థానిక సి. క్యాంపులోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మిథున్రెడ్డి కుటుంబంపై అనేక నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు. ఆధికార అండతో ప్రతి అంశంపై ఆరోపణలు చేస్తున్నారు తప్పా.. అందులో ఏ ఒక్కటి నిజం లేదని ఇప్పటికే ప్రజలకు అర్థమైందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష పూరిత రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికై న వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధించడం మాని ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. -
హాస్టల్లో చదువుకుని..
ఆదోని మండలం నాగథనహళ్లి గ్రామానికి చెందిన రాఘవేంద్ర.. క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్ మెంట్ కోర్స్లో 958 మార్కులు సాధించి రాష్ట్ర ప్రథమంలో నిలిచారు. గత మంగళవారం విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ చేతుల మీదుగా ప్రతిభా అవార్డు అందుకున్నాడు. ఈ విద్యార్థి ఎమ్మిగనూరు ఎస్సీ సంక్షేమ వసతి గృహంలో ఉండి స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో చదివారు. పదేళ్ల క్రితం తండ్రి మాల తిక్కయ్యను కోల్పోయిన ఈ విద్యార్థిని తల్లి ఆసనమ్మ కూలి పనులు చేసి చదివించింది. ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి ఇంటర్లో మంచి మార్కులు సాఽధించానని ఈ విద్యార్థి తెలిపారు. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ చేసి వ్యవసాయ శాఖలో మంచి ఉద్యోగం సాధించి రైతులకు చేయూతనందించాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. -
డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిందే!
కర్నూలు(హాస్పిటల్): ఎవ్వరికై నా జ్వరం, జలుబు, దగ్గు, వాంతులు, విరేచనాలు వంటి సాధారణ జబ్బులు వస్తే చాలా మంది డాక్టర్ వద్దకంటే మెడికల్షాపులకు ముందుగా వెళ్తారు. అక్కడ వారికి వచ్చిన అనారోగ్య లక్షణాలు చెప్పి మందులు ఇవ్వాలని కోరతారు. ఈ మేరకు రెండు, మూడు రోజులకు సరిపడా మందులు ఇస్తే చాలా వరకు తగ్గిపోతుంది. దీనివల్ల డాక్టర్ వద్దకు వెళ్లే సమయం, ఖర్చు మిగిలిపోతుందని సామాన్యుని భావన. కానీ ఇకపై ఇలా నేరుగా మందుల దుకాణానికి వెళ్లి మందులు ఇవ్వాలని కోరితే కుదరదు. అలా ఏవి పడితే ఆ మందులు ఇవ్వొద్దని మందుల దుకాణదారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. యాంటిబయాటిక్స్తో పాటు నిద్ర, ఆందోళన, డిప్రెషన్ మందులు వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా ఇస్తే లైసెన్స్ రద్దు చేస్తామని చెబుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3,100 దాకా రిటైల్ మెడికల్ షాపులు, 500 దాకా హోల్సేల్ మెడికల్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెలా రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు వ్యాపారం నిర్వహిస్తున్నారు. కర్నూలు, ఆదోని, నంద్యాల డివిజన్లకు నలుగురు డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. వీరు ఒక్కొక్కరు ప్రతి నెలా 40 దుకాణాలు తనిఖీలు చేయాల్సి ఉంది. ముఖ్యంగా దుకాణంలో ఫార్మాసిస్టు ఉన్నారా, మందుల కొనుగోలు, అమ్మకాల వివరాలు, కొనుగోలుదారులకు బిల్లు ఇస్తున్నారా, వైద్యుల ప్రిస్కిప్షన్ ఆధారంగా మందులు ఇస్తున్నారా, గడువు తీరిన, గడువు ఉన్న మందులు విక్రయిస్తున్నారా, నిషేధిత మందులను అమ్ముతున్నారా, ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారా అనే అంశాలను పరిశీలించి నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. వారు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఏడీ స్థాయి అధికారులు సదరు దుకాణాలపై చర్యలు తీసుకుంటారు.ఇటీవల దాడులతో కంగారు..ఇటీవల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు కలిసి జిల్లా వ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు నిర్వహించారు. పలు దుకాణాల్లో యాంటిబయాటిక్స్, నిద్రమాత్రలు, మత్తును కలిగించే నొప్పి మాత్రలు, ఆందోళన, డిప్రెషన్ మందులు వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు పలువురికి ముందుగా నోటీసులు ఇచ్చి వారు ఇచ్చిన సంజాయిషీ ఆధారంగా వారం రోజుల పాటు సస్పెన్షన్ విధించారు. అప్పటి నుంచి వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా యాంటిబయాటిక్స్, మత్తును కలిగించే మాత్రలు విక్రయించేందుకు దుకాణదారులు వెనుకడుగు వేస్తున్నారు. తాజాగా వైద్యులు రాసిచ్చిన చీటిని తెస్తేనే మందులు ఇస్తామని తెగేసి చెబుతున్నారు.డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయించడం నేరంరాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల గరుడ ఆపరేషన్ పేరుతో నార్కోటిక్ డ్రగ్స్ అమ్మకాలపై నిఘా ఉంచాం. ఈ మేరకు పలు దుకాణాలపై దాడులు నిర్వహించి చర్యలు తీసుకున్నాము. హెచ్ వన్ రిజిస్టర్లో ఉన్న యాంటిబయాటిక్స్, యాంటి టీబీ, మత్తుకలిగించే మందులు డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయించకూడదు. నిద్ర, ఆందోళన, డిప్రెషన్ మందులు రెగ్యులర్గా వాడుతున్న వారు డాక్టర్ రాసిన చీటిని తీసుకొచ్చి మందుల దుకాణాల్లో చూపిస్తే దానిపై సదరు దుకాణదారుడు ఇచ్చిన మందుల సంఖ్య, తేదిని రాసి సీలు వేస్తారు. దీనివల్ల నిర్ణీత సమయంలో తిరిగి అంతకుమించి మందులు వాడకుండా నియంత్రించబడుతుంది.– వి. వీరశేఖర్, డిప్యూటీ డైరెక్టర్, ఔషధ నియంత్రణ శాఖవృద్ధులు, రోగులు నరకయాతననార్కోటిక్ డ్రగ్స్ను డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులతో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఇటీవల నిర్వహించిన దాడులతో మెడికల్షాపుల వారు విక్రయాలు నిలిపివేశారు. డాక్టర్ తాజాగా రాసిచ్చిన చీటి తెస్తేనే మందులు ఇస్తామని చెప్పి వెనక్కి పంపిస్తున్నారు. దీంతో కొంత కాలంగా ఆయా మందులకు అలవాటుపడిన వారు మాత్రలు లభించక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మానసిక సమస్యలతో బాధపడుతూ వైద్యుల సూచన మేరకు కొంత కాలంగా మందులు వాడేవారు, గుండె, ఇతర ఆరోగ్య సమస్యలతో నిద్రకరువై వైద్యుల సూచన మేరకు నిద్రమాత్రలు, ఆందోళన, డిప్రెషన్ తగ్గించే మాత్రలు వాడే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరో దురలవాట్లకు బానిసలై ఇలాంటి మందులు కొంటే రెగ్యులర్గా వాడే మాలాంటి వారిని ఇబ్బందులకు గురిచేస్తే ఎలాగని వారు ప్రశి్నస్తున్నారు. దీనివల్ల ప్రతి ఒక్కరూ నిద్ర రాక, ఆందోళన, డిప్రెషన్ పెరిగి మరింత అనారోగ్యం కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన చెందుతున్నారు. రూ.50ల మాత్రలకు రూ.వెయ్యి దాకా ఖర్చు ఇప్పటి వరకు ఆయా ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు వైద్యుల సూచనలతో మత్తు కలిగించే మందులు వాడుతూ వస్తున్నారు. ఒకసారి డాక్టర్ వద్ద చూపించుకుని నెలల తరబడి అవే మందులను మెడికల్షాపుల్లో కొనుగోలు చేసి వాడుతున్న వారు ఉన్నారు. చాలా చోట్ల తాజాగా వైద్యులు రాసిచ్చిన చీటి ఆధారంగానే ఇలాంటి మందులు ఇస్తారు. కానీ పరిచయం ఉన్న కారణంగా కొందరు వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండానే మందులు ఇచ్చేస్తున్నారు. దీనికితోడు ప్రతిసారీ డాక్టర్ వద్దకు వెళ్లాలంటే ప్రయాణ చార్జీలు, సమయం, డాక్టర్ ఫీజు కలిపి రూ.500ల నుంచి రూ.1000ల దాకా అవుతోంది. అదే నేరుగా మెడికల్షాపులకు వెళ్లి గతంలో రాసిన మందులు కొంటే రూ.50ల నుంచి రూ.100లతో పని పూర్తవుతుంది. తాజా నిబందనల వల్ల ఆర్థిక భారం అధికమవుతోందని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పేద ఇంట విద్యా దీపం
కర్నూలు మండలం ఆర్.కొంతలపాడు గ్రామానికి చెందిన తెలుగు మహేష్, సువర్ణమ్మలకు రెండెకరాల భూమి మాత్రమే ఉంది. ఉన్న కాస్త భూమిలో పంటలు పడించడంతో పాటు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమార్తె మానస పంచాలింగాల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ ఓకేషనల్ (అకౌంట్స్ ట్యాక్సేషన్) సెకండియర్లో 992మార్కులు సాధించారు. విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. విద్యార్థిని మానస మాట్లాడుతూ.. తనను చదివించాడనికి తల్లిదండ్రులు ఎంతో పడ్డ కష్టపడ్డారని, ఉపాధ్యాయులు కూడా ఎంతగానో ప్రోత్సహించారన్నారు. తాను ఐఏఎస్ అయ్యి మారుమూల గ్రామాల్లోని పిల్లలకు చదువు అందించేందుకు కృషి చేస్తానని మానస తెలియజేశారు. -
కంబోడియాలో కై లాస్రెడ్డి ప్రతిభ
● ఆసియా పారాత్రోబాల్ పోటీల్లో రజత పతకం కొలిమిగుండ్ల: మలేషియాలోని కంబోడియాలో జరిగిన దివ్యాంగుల పారాత్రోబాల్ పోటీల్లో కొలిమిగుండ్లకు చెందిన గండా కై లాస్రెడ్డి ప్రతిభ చాటాడు. రజత పతకాన్ని కై వసం చేసుకున్నాడు. ఇటీవలే కంబోడియాలో ఆసియా ఖండంలోని ఎనిమిది దేశాలకు చెందిన జట్లు ఆసియా పారాత్రోబాల్ పోటీల్లో పాల్గొన్నాయి. ఈపోటీల్లో భారత జట్టు రజత పతకం సాధించినట్లు నిర్వాహకులు ఆదివారం ప్రకటించారు. పారా క్రికెట్లో ఆంధ్ర జట్టు కెప్టెన్గా వ్యవహరించిన కై లాస్రెడ్డి.. జాతీయ స్థాయి పారాత్రోబాల్ పోటీల్లోను మంచి ప్రతిభ కనపర్చి భారత జట్టు రజత పతకం సాధించేందుకు దోహదపడ్డాడు. రజత పతకం కోసం భారత్, మలేషియా జట్లు పోటీ పడ్డాయి. కై లాస్రెడ్డి విజయవాడలోని గనులు, భూగర్బ శాఖలో అవుట్ సోర్స్ కింద టైపిస్ట్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆసియా స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అండగా నిలిచిన సహచర ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. -
రాజ్యాంగానికి మోదీ తూట్లు
డోన్ టౌన్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని పలువురు వక్తలు విమర్శించారు. నూతన వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆదివారం డోన్ పట్టణంలో ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని గుత్తి రోడ్డులో ఉన్న ఖబరస్తాన్ ఈద్గా నుంచి బేతంచెర్ల సర్కిల్, రైల్వే గేట్లు, పాత బస్టాండ్, స్టేట్ బ్యాంక్, కొత్త బస్టాండ్ తదితర ప్రాంతాల మీదుగా ఈ ర్యాలీ సాగింది. జాతీయ జెండాలు, నల్ల జెండాలు చేతబట్టి వక్ఫ్ సంరక్షణ, రాజ్యాంగ పరి రక్షణ అంటూ ముస్లింలు అధిక సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు ఆధ్వర్యంలో సీపీఐ నాయకులు ర్యాలీకి మద్దతు పలికారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పలువురు ముస్లిం మత పెద్దలు, సీపీఐ నాయకులు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా పరిపాలన సాగిస్తోందని విమర్శించారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు అంతా అన్యాయమన్నారు. ఈ బిల్లుతో ముస్లింలకు ఎలాంటి ప్రయోజనం లేదని, మరింత నష్టం కల్గించే విధంగా ఉందన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కబ్జా చేసి పెట్టుబడి దారులకు కట్టబెట్టేందుకే కేంద్రం ఈ చట్టాని రూపొందించిందన్నారు. ఏపీ, బిహార్ సీఎంలు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ మద్దతుతో కేంద్ర ప్రభుత్వం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందన్నారు. నూతన వక్ఫ్ బోర్డు చట్టాన్ని వెంటనే రద్దు చేయక పోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నూతన వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాటం నిరసన ర్యాలీలో ముస్లింలు -
రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృత్యువాత
కొలిమిగుండ్ల: రాఘవరాజుపల్లె సమీపంలోని ప్రధాన రహదారిపై ఆదివారం కారు, బొలేరో జీపు ఢీకొన్న ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది. మరో ఆరుగురు గాయపడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లెకు చెందిన చంద్రమోహన్రెడ్డి తన కూతురు జోష్యహర్షిణిరెడ్డి(6)ని నంద్యాలలోని మేనమామ ఇంట్లో ఉంచి చదివిస్తుండేవాడు. చంద్రమోహన్రెడ్డి అమ్మవారికి మొక్కుబడి చేసే కార్యక్రమం ఉండటంతో చిన్నారి జోష్యహర్షిణిరెడ్డి తాతయ్య రిటైర్డ్ టీచర్ రామసుబ్బారెడ్డితో పాటు బంధువులు వెంకటసుబ్బారెడ్డి, ఏటూరి శ్రీనివాసరెడ్డి, లక్ష్మీదేవిలను కారులో నంద్యాల నుంచి తీసుకొని బయలు దేరారు. సోమవారం పరీక్ష ఉందని తాను రానని చిన్నారి మారం చేసింది. అయితే కార్యక్రమం పూర్తి కాగానే రాత్రిలోగా ఇంటికి వస్తామని చెప్పడంతో ఒప్పుకొని వారితో పాటు బయలుదేరింది. రాఘవరాజుపల్లె శివార్లలోకి చేరుకోగానే అంకిరెడ్డిపల్లె నుంచి కొలిమిగుండ్లకు వస్తున్న బొలేరో వాహనం కారును వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో కారు ఎగిరి రోడ్డు పక్కన బోల్తా పడింది. కారులో ఉన్నవారంతా అందులో ఇరుక్కు పోవడంతో స్థానికులు అతికష్టంగా బయటకు తీశారు. బొలేరోలో ఉన్న అంకిరెడ్డిపల్లె యువకులు రాజకుళ్లాయి, బాలుకు గాయాలయ్యాయి. చిన్నారి జోష్య హర్షిణి కోమాలోకి వెళ్లిపోవడంతో చికిత్స కోసం అనంతపురానికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మిగిలిన క్షతగాత్రులను 108లో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఐ రమేష్బాబు ప్రమాద స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీశారు. శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. -
గత ప్రభుత్వ చలువే
అనంతపురం జిల్లా పామిడికి చెందిన శ్రీనివాసులు, రమబాయిల కుమార్తె ఎం. దృతికబాయి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీలో 987 మార్కులు సాధించారు. ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవటం తల్లిదండ్రులు ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు చెల్లించలేక బనవాసి ఏపీఆర్జేసీ కాలేజీలో చేర్పించారు. గత ప్రభుత్వం విద్యా రంగంలో తీసుకువచ్చిన మార్పులు, విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించటంతో మెరుగైన విద్యను అందించారు. ఏపీఆర్జేసీ కాలేజీలో నాణ్యమైన విద్యనందించటంతో తమ బిడ్డ మంచి మార్కులు సాధించారని తల్లిదండ్రులు శ్రీనివాసులు, రమబాయిలు చెపుతున్నారు. -
భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు
మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు శ్రీశైలం టెంపుల్: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మ వార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే గాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేకువజామున పాతాళగంగలో పు ణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూ లైన్లలో బారులు తీరారు. క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, అల్పాహారం, బిస్కెట్స్ దేవస్థాన అధికారులు పంపిణీ చేశారు. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడుతున్నాయి. గాలులు, మెరుపులతో వాన కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలుచోట్ల ఆదివారం సాయంత్రం గాలులు, మెరుపులతో వర్షం కురిసింది. జూపాడుబంగ్లా మండలంలో 33.75, పాములపాడు మండలంలో 28.5, వెల్దుర్తి మండలంలో 21.0, నందికొట్కూరులో 16.5, గూడూరులో 13.5 మి.మీ ప్రకారం వర్షపాతం నమోదైంది. కర్నూలు నగరంలో సాయంత్రానికి ఒక మోస్తరు వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. పెనుగాలుల తీవ్రతకు పలుచోట్ల తోటల్లోని మామిడి చెట్లు నేలమట్టమయ్యాయి. మామిడి రైతుకు నష్టం వాటిల్లింది. ఇద్దరు ఏఈలకు పదోన్నతి కోడుమూరు రూరల్: గాజులదిన్నె ప్రాజెక్టు ఎడమ కాల్వ ఏఈగా పనిచేస్తున్న నారాయణ, ఎల్ఎల్సీ కోడుమూరు సబ్ డివిజన్ ఏఈగా పనిచేస్తున్న మోహన్రావులకు ఆదివారం డీఈఈలుగా పదోన్నతి లభించింది. జీడీపీ ఎడమ కాల్వ ఏఈ నారాయణ డీఈఈగా పదోన్నతిపై వైఎస్సార్ జిల్లాకు వెళ్లగా, ఎల్ఎల్సీ కోడుమూరు సబ్ డివిజన్ ఏఈ మోహన్రావును అనంతపురం హెచ్ఎల్సీ కెనాల్ డీఈఈగా నియమిస్తూ ఉన్నతాధికారులు లేఖ విడుదల చేశారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలి కర్నూలు (టౌన్): నేర ప్రవృత్తికి స్వస్తి పలికి ప్రశాంత జీవనం గడపాలని రౌటీషీటర్లకు పోలీసు అధికారులు సూచించారు. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లలో రౌడీషీటర్లకు, నేర చరిత్ర ఉన్న వారికి ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఈస్టర్ వేడుకలను ఆదివారం క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. పండుగ ప్రాముఖ్యతను మతపెద్దలు వివరించారు. పాపులను రక్షించడం గుడ్ఫ్రైడే సందేశమైతే, సత్యాన్ని అంతం చేయాలన్న ప్రతిసారీ ఏదో రూపంలో జన్మిస్తూనే ఉంటుందన్నది ఈస్టర్ నేర్పిన పాఠమని పేర్కొన్నారు. యేసుక్రీస్తు బోధనలను విశ్వసించి సన్మార్గంలో నడువాలని సూచించారు. –కర్నూలు టౌన్ -
అమరావతి పేరుతో రూ. వేల కోట్ల దోపిడీ!
కర్నూలు (టౌన్): ‘‘ ప్రపంచంలో ఎక్కడైనా లక్ష ఎకరాల్లో రాజధాని నిర్మించారా? కేవలం అమరావతి పేరు చెప్పి రూ. వేల కోట్ల దోపీడీ చేస్తుంది నిజం కాదా’’ అని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్ రెడ్డి ప్రశ్నించారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ.. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అని అందరికీ తెలుసని, అయితే సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఏపీని అమరావతి, పోలవరంగా మార్చారన్నారు. రాష్ట్రంలో ‘కూటమి’ ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతున్నా ఒక్క అమరావతి తప్ప మిగతా వెనుకబడిన 12 ఉమ్మడి జిల్లాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికే రూ. 1.60 లక్షల కోట్ల అప్పులు చేసి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల అంధ్రప్రదేశ్గా మార్చారని విమర్శించారు. అమరావతిలో రూ. 40 వేల కోట్ల పనులకు సంబంధించి ఇప్పటికే మొబలైజేషన్ పేరుతో 10 శాతం నిధులు కమీషన్ల పేరుతో కూటమి నేతలు కోట్టేశారని ఆరోపించారు. తాజాగా 52 వేల ఎకరాల భూసేకరణ చేయడం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు, వారి అనుయూయులకు రూ. కోట్లు కట్టబెట్టేందుకే అని ఆరోపించారు. ఒక కిలోమీటరు రోడ్డుకు అమరావతిలో రూ. 60 కోట్లు ఖర్చు చేస్తున్నారని, 7.29 కిలోమీటర్ల రోడ్డు పనులకు రూ.460 కోట్లు టెండర్లు పిలిచారన్నారు. అమెరికా దేశంలోని వైట్ హౌస్ వద్ద ఈ రోడ్డు వేసిన అంత ఖర్చు కాదన్నారు. పార్లమెంటుకు రూ.971 కోట్లు ఖర్చు చేశారని, అదే మన అమరావతిలో అసెంబ్లీ నిర్మాణం కోసం రూ.750 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. జ్యుడీషియల్ టెండర్ల విధానం ఎత్తేసి రూ. 4 వేల కోట్లు కమీషన్లను దండుకుంటున్నారని ఆరోపించారు. అమరావతి నిర్మాణం పేరుతో జరుగుతున్న అవినీతి కుంభకోణాలను రాబోయే రోజుల్లో వెలుగులోకి తీసుకువస్తామన్నారు. హైకోర్టు బెంచీ ఏదీ? లక్ష ఎకరాల్లో ఎక్కడైనా రాజధాని నిర్మించారా? వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డికర్నూలుకు ఏడాది నుంచి హైకోర్టు కాదు కదా బెంచీ కూడా తీసుకురాలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉందని కర్నూలు మేయర్ రామయ్య విమర్శించారు. రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో కేసులు బనాయించడం తప్ప రాష్ట్రప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని విధాలా మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
క్యాన్సర్ ఆస్పత్రిలో కార్పొరేట్ స్థాయి సేవలు
కర్నూలు (హాస్పిటల్): కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో అత్యాధునిక పరికరాలు, వసతులతో రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. శనివారం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో లీనియర్ ఆక్సిలరేటర్, సీటీ సిమ్యులేటర్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, మెడికల్ ఆంకాలజీ వార్డులను భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్తో కలిసి ఆయన ప్రారంభించారు. పలువురు రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న సేవలను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ వెనుకబడిన, కరువు ప్రాంతమైన రాయలసీమ ప్రజలు క్యాన్సర్ వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కర్నూలుకు ఈ ఆస్పత్రిని కేటాయించిందన్నారు. త్వరలోనే పూర్తిస్థాయి వైద్యులు, సిబ్బందిని నియమిస్తామన్నారు. అనంతరం ఆయన రోగుల విభాగాన్ని, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ విభాగాలను సందర్శించి అక్కడి వసతులు, సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో మెడికల్ కాలేజిలోని క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం, కోడుమూరు ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, దస్తగిరి, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ శ్రీనివాసరావు, అకడమిక్ డీఎంఈ డాక్టర్ రఘునందన్, డీఎంహెచ్వో డాక్టర్ పి.శాంతికళ, మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్కే ప్రకాష్ పాల్గొన్నారు. అబద్ధాలు వల్లె వేసిన మంత్రి ● స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు వచ్చిన మంత్రి సత్యకుమా ర్ అబద్ధాలు వల్లె వేశారు. క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి 2019లో ఎన్డీఏ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ● ఐదేళ్లు వైఎస్సార్సీపీ అధికారంలో ప్రభుత్వం పట్టించుకోవడంతో 2024 మార్చి నాటికి భవననిర్మాణం పూర్తయ్యింది. ● ఆ ప్రభుత్వ హయాంలోనే రూ.కోట్ల విలువైన లీనియర్ యాక్సిలరేటర్, సీటీ సిమ్యులేటర్ యంత్రాలు వచ్చాయి. ● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకు కూడా ఈ ఆస్పత్రిని పట్టించుకోలేదు. ● మీడియాలో కథనాలు రావడంతో స్పందించి వసతులు, సౌకర్యాలు కల్పించింది. ● ఇప్పుడు భవనమంతా తామే నిర్మించినట్లు చెప్పుకోవడంపై వైద్యులు, ఇక్కడి ప్రజలు ఇదేం చోద్యమంటూ ముక్కున వేలేసుకున్నారు. ● బోధనాస్పత్రుల్లో వైద్యుల ఖాళీలు 40 శాతం ఉండేవని, అధికారంలోకి వచ్చిన తర్వాత 6 శాతానికి తగ్గించా మని చెప్పుకోవడంపైనా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ●కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడా నియామకాలు చేపట్టలేదని బాహాటంగానే విమర్శిస్తున్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ -
అదుపు తప్పి ఆటో బోల్తా
బనగానపల్లె రూరల్: ఆటో డ్రైవ ర్ అతివేగం, నిర్లక్ష్యానికి ఓ మహిళ ప్రాణం పోయింది. ఎర్రమల కొండల్లో కటికవాని కుంట సమీపంలో శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రుద్రవరం మండలం చిన్న కంబలూరు గ్రామానికి చెందిన పది మంది తమ బంధువులకు చెందిన పుట్టెంట్రుకల కార్యక్రమం నిమిత్తం బేతంచెర్ల మండలంలోని మద్దిలేటిస్వామి క్షేత్రానికి ఆటోలో చేరుకున్నారు. మధ్యాహ్నం కార్యక్రమం ముగిసిన తర్వాత ఆటోలో స్వగ్రామానికి బయల్దేదారు. మార్గమధ్యలో ఎర్రమల కొండపై ఉన్న కటికవానికుంట గ్రామం దాటిన తరువాత మలుపు వద్ద ఆటో డ్రైవర్ అతివేగంతో వెళ్లడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఈశ్వరమ్మ(45) అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన చిన్నమ్మ, కాశమ్మ, హుస్సేనమ్మ, పెద్దక్క, ఐదేళ్ల చిన్నారి భువనసాయి, రమేష్, సుబ్బలచ్చమ్మ, ఆటో డ్రైవర్ వీరప్పను 108లో బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా చిన్నమ్మ, కాశమ్మ, భువనసాయికి తీవ్రగాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బనగానపల్లె సీఐ ప్రవీణ్కుమార్ వెంటనే సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్షతగ్రాతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. మహిళ మృతి, మరో ఏడుగురికి గాయాలు -
స్వచ్ఛ ర్యాలీలో విద్యార్థులకు శిక్ష
అధికారుల నిర్లక్ష్యంతో రుద్రవరం జెడ్పీ స్కూల్ పిల్లలు అవస్థలు పడ్డారు. స్వచ్ఛాంధ్ర.. స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల వరకు శనివారం భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించాలని భావించారు. కార్యక్రమానికి కూటమి నేతలు, అధికారులు వస్తారని మధ్యాహ్నం వరకు వేచి ఉన్నారు. ఎవరూ రాకపోవడంతో మండల పరిషత్ అధికారులు తమ కార్యాలయానికి ఎదురుగా ఉన్న జెడ్పీ పాఠశాల నుంచి విద్యార్థులను పిలిపించారు. ప్రధాన రహదారి మీదుగా అమ్మవారిశాల సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ మానవహరం చేపట్టారు. అయితే ఎండకు పాదరక్షలు లేని విద్యార్థులు కాళ్లు కాలి విలవిలలాడారు. ఎండలో నిలబడలేక నీరసించిపోయారు. ఎండలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. – రుద్రవరం -
హంద్రీ నది ఎండి .. గొంతులు తడారి
గోనెగండ్ల: హంద్రీనది పూర్తిగా ఎండిపోయింది. నదీ పరివాహక గ్రామాల్లోని బోర్లు, బావుల్లో జలం అడుగంటి పోతుంది. తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆయా గ్రామస్తులు చెబుతున్నారు. గోనెగండ్ల మండలం గంజిహళ్లి, హెచ్. కై రవాడి, వేముగోడు, తిప్పనూరు గ్రామ సమీపంలోని హంద్రీనది పూర్తిగా ఎండిపోవడంతో అక్రమార్కులు కొందరు రోజుకు 20 నుంచి 30 ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. హంద్రీ పరివాహక గ్రామాలైన హెచ్. కై రవాడి, పుట్టపాశం వేముగోడు, తిప్పనూరు తదితర గ్రామాల్లో బోర్లు పనిచేయడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. హంద్రీ నదిలో ఇసుకను అక్రమంగా తరలిస్తుండడంతో భూగర్భ జలాలు అడుగంటి తాగునీటి సమస్య తీవ్రమవుతుందని భయాందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి హంద్రీనదిలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక రావాణాను అరికట్టి, తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. -
పగలు దాచేస్తారు.. రాత్రి దాటించేస్తారు!
● దర్జాగా కూటమి నేతల ఇసుక దందా ● నది పరివాహక గ్రామాల్లో ఇసుక అక్రమ డంప్లు ● అధికారులు తనిఖీ చేయరు.. పోలీసులు పట్టుకోరు పడిదెంపాడు గ్రామ సమీపంలో తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాలతో ఏర్పడిన గోతులు కర్నూలు(రూరల్): ఉచిత ఇసుక పాలసీ కూటమి నేతలకు వరంగా మారింది. తుంగభద్ర నది పరివాహక గ్రామాల్లో దర్జాగా ఇసుక అక్రమ దందా కొనసాగిస్తున్నారు. పగలంతా నదిలో ఇసుక తోడేసి ఒడ్డున డంప్ చేస్తున్నారు. రాత్రికి రాత్రి టిప్పర్లలో ఊరి దాటించి విక్రయిస్తున్నారు. అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఇసుకాసురుల దందాకు అడ్డేలేదు. కర్నూలు మండల పరిధిలోని తీర ప్రాంతాలైన పడిదెంపాడు, పూడూరు, పంచలింగాల, దేవమడ, మునగాలపాడు, నిడ్జూరు, ఆర్. కొంతలపాడు, సుంకేసులలో ఇసుక డంపులు వెలుస్తున్నాయి. నది సమీపంలోని మామిడి తోటలు, ప్రైవేటు వెంచర్లు, కల్లం దొడ్లలో నిల్వ చేసినా అడిగేవారు లేరు. తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాల్సిన మైనింగ్, రెవెన్యూ అధికారులు నది వైపు కన్నెత్తి చూడటం లేదు. డంప్ చేసిన ఇసుకను నదితీర గ్రామాల నుంచి కర్నూలు నగరంతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఒక్కో ట్రాక్టర్ దూరాన్ని బట్టి రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పైగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కర్నూలు మండలంలో ఎక్కడా ఇసుక రీచ్లు లేవు. అయినా ఇసుక మాత్రం అక్రమ రవాణా అవుతోంది. వాస్తవంగా నది తీర ప్రాంత వాసులకు నిర్మాణాలకు ఇసుక అవసరమైతే సచివాలయం నుంచి అనుమతి తీసుకుని నదిలో తవ్వుకోవచ్చు. ఇలా అనుమతితో తవ్వుకునే వారు ఎవరూ కనిపించరు. అంతా కూటమి నేతలు ఏర్పాటు చేసిన ట్రాక్టర్లు ఉంటాయి. వీరి వద్ద నుంచే ఇసుక కొనుగోలు చేసుకోవాల్సిందే. వీరిని కాదని గుప్పెడు ఇసుక కూడా తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఉచిత ఇసుక పాలసీ పేరుతో కూటమి నేతలు తుంగభద్రనదిని తోడేస్తున్నారు. ప్రస్తుతం నదిలో నీటి ప్రవాహం లేకపోవడంతో తవ్వకాలు పగలు, రాత్రి తేడా లేకుండా జరుగుతున్నాయి. దందాకు రైట్ రైట్.. కూటమి నేతల ఇసుక దందాకు పోలీసులు, అధికారులు రైట్ రైట్ అంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రహదారులపై ఇసుక ట్రాక్టర్లు వెళ్తున్నా కనీసం అనుమతి ఉందా.. లేదా? అనేది అడగడం లేదు. ముందుగానే మామూళ్లు అందుతుండటంతో అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పడిదెంపాడు, పూడూరు వైపు వచ్చే ట్రాక్టర్లు సూదిరెడ్డిపల్లె స్టేజి నుంచి ఇటు కర్నూలు, ఇటు బ్రాహ్మణకొట్కూరు వైపు దూసుకెళ్తున్నా అడిగేవారు కరువయ్యారు. అలాగే హంద్రీ నదిలో ఇసుక ట్రాక్టర్లు వెంగన్న బావి మీదుగా రయ్.. రయ్మంటున్నాయి. అయితే కొందరు పోలీసు సిబ్బంది మామూళ్లు తీసుకుని ట్రాక్టర్లను వదిలేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణా అరికడతాం మునగాలపాడు, పంచలింగాల, నిడ్జూరు, అర్.కొంతలపాడు గ్రామాల పరిధిలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. పోలీస్, రవాణా శాఖ అధికారుల సమన్వయంతో దాడులు చేసి కేసులను నమోదు చేస్తాం. నదుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలతో భూగర్భజలాలు అడుగంటుతాయి. ఈ విషయంపై ఆయా గ్రామాల్లో అవగాహన కల్పిస్తాం. – టీవీ రమేష్ బాబు, కర్నూలు రూరల్ తహసీల్దార్ -
ఇద్దరి ప్రాణాలు తీసిన అతివేగం
● ఎన్హెచ్–44పై బోల్తాపడిన కారును ఢీకొట్టిన ట్రావెల్ బస్సు ● దంపతుల దుర్మరణం, మరో నలుగురికి గాయాలు ● బంధువుల గృహ ప్రవేశానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం ● మృతులు బండి ఆత్మకూరు మండలం కాకునూరు వాసులు ఎర్రవల్లి/బండిఆత్మకూరు: అతివేగం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. బంధువుల గృహప్రవేశానికి వెళ్లి వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తా పడటం.. అదే సమయంలో వస్తున్న ట్రావెల్ బస్సు కారును ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఎర్రవల్లి మండలం వేముల స్టేజీ సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. కోదండాపురం ఎస్ఐ మురళి వివరాల మేరకు.. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం కాకునూరుకు చెందిన దేరెడ్డి పుల్లారెడ్డి (59), ఆయన భార్య లక్ష్మి పుల్లమ్మ (51), కుమారుడు వెంకటసుబ్బారెడ్డితో పాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులు శుక్రవారం హైదరాబాద్లో బంధువుల గృహప్రవేశానికి వెళ్లారు. అక్కడ కార్యక్రమం పూర్తయ్యాక తిరిగి అదే రోజు రాత్రి 8:30 గంటలకు కారులో స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలోని ఎర్రవల్లి మండలం వేముల స్టేజీ సమీపంలో దేరెడ్డి వెంకటసుబ్బారెడ్డి కారును అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి అవతలి రోడ్డుపై బోల్తాపడింది. అదే సమయంలో కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ట్రావెల్ బస్సు కారును ఢీకొట్టడంతో భార్యాభర్తలు దేరెడ్డి సుబ్బారెడ్డి, లక్ష్మి పుల్లమ్మతో పాటు వారి బంధువు స్రవంతికి తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్తో పాటు మరో ఇద్దరు తేలికపాటి రక్త గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికి త్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే సుబ్బారెడ్డి, లక్ష్మిపుల్లమ్మ మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుల బంధువు మహేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
అదుపుతప్పితే.. కడుపుకోతే!
మండలంలోని నంచర్ల గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల ప్రాణాలకు భరోసా లేకుండాపోతోంది. నీటి కుళాయిలు మరమ్మతులకు నోచుకోక మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు సంపు పైకెక్కి నీరు తోడుకుంటున్నారు. ఈ సంపు సుమారు పది అడుగుల లోతు ఉంది. సంపు ఇనుప మూత పాడవడంతో మరమ్మతులు చేయించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ప్రమాదకర పరిస్థితుల్లో నీరు తీసుకుంటున్నారు. జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. – చిప్పగిరి సంపు పైకెక్కి నీరు తోడుకుంటున్న విద్యార్థులు -
తండ్రీకొడుకులు నోరు పారేసుకుంటున్నారు. సొంత పార్టీ లేదు, కూటమి గౌరవం లేదు.. అహంకారపూరిత మాటలతో కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఇదే సమయంలో కూటమి నేతల్లోనే అసహనం వ్యక్తమవుతోంది. మంత్రి టీజీ భరత్ ఎవరికీ అందుబాటులో ఉండకపోవడం, పీఏల పాలనతో శ్రేణులు
మంత్రి టీజీపై తమ్ముళ్ల తిరుగుబాటు ● పీఏల తీరుపై పెల్లుబికిన ఆగ్రహం ● మంత్రి వైఖరిని తూర్పారబట్టిన శ్రేణులు ● అసహనంతో మైక్ విసిరికొట్టి వెళ్లిపోయిన భరత్ ● తాజాగా టీజీ ఇంట్లో బీజేపీ సీనియర్ నేతకు అవమానం ● కర్నూలు కూటమిలో ముసలం పార్థసారధి ఆదోనికి ఎమ్మెల్యే కాదు.. కులానికి‘‘నేను ఎమ్మెల్యేను కాదు, మంత్రిని. మీ సమస్యలను పరిష్కరించేందుకు ఐదుగురు పీఏలను నియమించాం. వారి దృష్టికి తీసుకెళ్లండి.. పరిష్కరిస్తారు.’’ – కార్యకర్తల సమావేశంలో మంత్రి టీజీ భరత్ ● బీజేపీ కార్యకర్తల సమావేశంలో టీజీ వెంకటేష్ ఎత్తిపొడుపు డాక్టర్ పార్థసారధి ఆదోనికి ఎమ్మెల్యేలా కాకుండా కేవలం ఒక కులానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నట్లు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అంబేద్కర్ జయంతి వారోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం మౌర్యా ఇన్లోని పరిణయ హాల్లో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధితో పాటు టీజీ వెంకటేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీజీ మాట్లాడుతూ ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పార్థసారధి ఓ కులానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నట్లు కనపడుతోందని అనడంతో పార్థసారధి తీవ్ర మనస్థాపానికి గురైనట్లు కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. టీజీ భరత్ ఇంటి దగ్గర బీజేపీ సీనియర్ నాయకుడు హరిష్ కుమార్కు అవమానం జరగడం, సాయంత్రం కార్యకర్తల సమావేశంలో ఆదోని ఎమ్మెల్యేను టీజీ వెంకటేష్ కించపరుస్తూ మాట్లాడటం ఒకే రోజు చోటు చేసుకోవడం గమనార్హం. ‘‘పీఏలు అధ్వానంగా తయారయ్యారు. కనీసం ఫోన్లు కూడా ఎత్తరు. డబ్బున్న వాళ్లకే పనిచేసి పెడుతున్నారు. వాళ్ల వ్యవహారశైలి కూడా చాలా దారుణంగా ఉంటోంది.’’ – కర్నూలు పాతబస్తీకి చెందిన ఓ మహిళా కార్యకర్త ఆవేశం కర్నూలు: జిల్లాకు చెందిన మంత్రి టీజీ భరత్పై కర్నూలు అర్బన్ తెలుగుతమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను చెప్పుకునేందుకు అందుబాటులో ఉండడం లేదని, ఇటీవల మౌర్యా ఇన్లో జరిగిన పార్టీ ఇంచార్జీలు, కార్పొరేటర్ల సమావేశంలో పలువురు టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు నగరంలో చర్చనీయాంశమైంది. ఎన్నికలకు ముందు నియోజకవర్గంలోని ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చామని, ఓట్లు వేయించుకొని గెలుపొందిన తరువాత అందుబాటులో ఉండడం లేదని వార్డు ప్రజలు తమను నిలదీస్తున్నారని వారు వాపోయారు. ఈ నేపథ్యంలో మంత్రి కలుగజేకొని సమస్యలుంటే తన పీఏల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని చెప్పడం కార్యకర్తల ఆవేశానికి కారణమైంది. ● ఓ మహిళా కార్యకర్త లేచి తన స్థలం ఆక్రమణకు గురవుతోందని పలుమార్లు ఫిర్యాదు చేసినా, పీఏలు ఆక్రమణదారులకే వంత పలుకుతున్నారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ● కార్యకర్తలు అసహనంతో మాట్లాడుతున్న తీరుపట్ల సమావేశంలో పాల్గొన్న మెజారిటీ నేతలు, కార్యకర్తలు బహిరంగంగా చప్పట్లు, ఈలలు వేసి తమ సంఘీభావాన్ని తెలపడంతో మంత్రి టీజీ స్పందిస్తూ అమరావతి స్థాయిలో తన పనులే కావడం లేదు, నేనెవరికి చెప్పుకోవాలంటు తీవ్ర ఆవేశానికి లోనయ్యారని సమాచారం. ● మరి కొందరు కార్యకర్తలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రయత్నిస్తుండగా, తీవ్ర అసహనానికి గురై తన చేతిలో ఉన్న మైక్ను నేలకేసి కొట్టి సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయినట్లు చర్చ జరుగుతోంది. తాజాగా బీజేపీ సీనియర్ నేతకు అవమానం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ జిల్లా పర్యటన సందర్భంగా టీజీ ఇంట్లో సీనియర్ బీజేపీ నేత హరీష్కుమార్ జరిగిన అవమానం కూడా కార్యకర్తల్లో తీవ్ర చర్చనీయాంశం కావడమే గాక, టీడీపీ వర్సెస్ బీజేపీ చందంగా మారింది. శనివారం మంత్రి సత్యకుమార్ పలు అధికారిక కార్యకలాపాల్లో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ తన ఇంటికి భోజనానికి మంత్రి సత్యకుమార్ను ఆహ్వానించారు. అయితే గతంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ బదిలీ వ్యవహారంలో మంత్రులు ఇరువురి మధ్య ఆధిపత్య పోరు నడిచిందని తెలిసింది. గతంలో సూపరిటెండెంట్గా ఉన్న సి.ప్రభాకర్రెడ్డికి సత్యకుమార్ సపోర్టుగా నిలువగా, టీజీ భరత్ తన పలుకుబడిని ఉపయోగించి తనకు కావాల్సిన అధికారిని ఇక్కడకు తెచ్చుకున్నారు. దీంతో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య అగాథం చోటు చేసుకుంది. ఈ నేఫథ్యంలోనే మంత్రి టీజీ ఇంటికి భోజనానికి వెళ్లేందుకు మంత్రి సత్యకుమార్ సంశయిస్తూ కాలయాపన చేశారు. విషయం తెలుసుకున్న టీజీ వెంకటేష్ జోక్యం చేసుకొని ఎట్టకేలకు సత్యకుమార్ను తన ఇంటికి రప్పించుకున్నారు. అయితే ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్కు పీఏగా ఉన్న జిల్లాకు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు హరీష్కు తీవ్ర అవమానం జరిగిన ఘటనపై జోరుగా బీజేపీలో చర్చ జరుగుతోంది. హరీష్కుమార్ మంత్రితో పాటు టీజీ ఇంట్లోకి భోజనానికి వెళ్తుండగా, ద్వారం వద్దనే టీజీ వెంకటేష్ అడ్డుపడి లోపలికి కేవలం మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు మాత్రమే రావాలంటూ హరీష్ను చేయిపట్టుకొని బయటకు పంపడం పట్ల బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ అంశం ఇరుపార్టీల్లోని కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తోంది. -
డోన్లో ఇష్టారాజ్యం
కర్నూలు(అగ్రికల్చర్): మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరతో కొనుగోలు చేసిన కందులు గోదాముల దగ్గర తిరస్కరణకు గురవుతున్నాయి. కాసులకు కక్కుర్తి పడి వ్యాపారులు, దళారీల దగ్గర నాసిరకం కందులను సైతం కొనుగోలు చేస్తుండటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఏ పంటనైనా మద్దతు ధరతో కొనుగోలు చేయాలంటే కనీస నాణ్యతా ప్రమాణాలను పరిశీలిస్తారు. అయితే ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో టీడీపీతో పాటు కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ అనుకూల వ్యాపారులు, దళారీల నుంచి నాణ్యత లేని కందులను సైతం కొనుగోలు చేస్తున్నారనే పిర్యాదులు ఉన్నాయి. మొత్తం కొనుగోలు కేంద్రాలను ఆయా జిల్లాల మార్క్ఫెడ్ మేనేజర్లు పర్యవేక్షించాల్సి ఉంది. అయితే కొనుగోలు కేంద్రాల నుంచి జిల్లా మేనేజర్లకు గుడ్ విల్ వస్తుండటం వల్ల చూసీచూడనట్లు పోతున్నారనే విమర్శలు ఉన్నాయి. దీనిని అవకాశంగా తీసుకొని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు దళారీలు, వ్యాపారుల నుంచి కందులు మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నారు. ముడుపులు ముట్టచెబుతుండటం వల్ల నాసిరకం కందులను కూడా కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయిస్తుండటం గమనార్హం. సెంట్రల్, స్టేట్ వేర్హౌసింగ్ గోదాముల్లో నిల్వ దాదాపు మూడు నెలలుగా మద్దతు ధరతో కందుల కొనుగోలు జరుగుతోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ నెల 21వ తేదీతో కొనుగోలు కేంద్రాలను ముగించాల్సి ఉంది. అయితే కందుల కొనుగోలు ప్రక్రియను మరింత పొడిగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో 5,575 టన్నులు, నంద్యాల జిల్లాలో 5,500 టన్నులు కొనుగోలు చేశారు. కర్నూలు జిల్లాలో 25 మండలాలు, నంద్యాల జిల్లాలో 21 మండలాల్లో కందుల కొనుగోలు జరుగుతోంది. కొనుగోలు చేసిన కందులను ఆదోని, నందికొట్కూరు, డోన్ తదితర ప్రాంతాల్లోని సెంట్రల్ వేర్హౌసింగ్, స్టేట్ వేర్ హౌసింగ్ గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. గోదాముల్లో కందులు అన్లోడ్ చేసే సమయంలో నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేస్తారు. సరుకు గోదాము చేరిన తర్వాతనే రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ అవుతుంది. పండించిన కందులను రైతులు అమ్ముకోవడం దాదాపు పూర్తయింది. మార్కెట్ యార్డులకు కూడా కందులు రావడం తగ్గిపోయింది. దళారీలు, వ్యాపారులు రైతుల నుంచి తక్కువ ధరతో కొనుగోలు చేసిన కందులను గోదాముల్లో నిల్వ చేసినట్లు తెలుస్తోంది. ధర పెరిగినప్పుడు అమ్ముకోవాలనేది ఉద్దేశం. అయితే ధర మరింత తగ్గుతుండటంతో కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరతో అమ్ముకునేందుకు బయటికి తీసుకొస్తున్నారు. 2,500 క్వింటాళ్లకు పైగా కందులు రిజెక్ట్ మార్క్ఫెడ్ అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ముడుపులు ఎర వేసి మద్దతు ధరతో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ముడుపులు ముడుతుండటంతో నాణ్యతా ప్రమాణాలను పట్టించుకోని పరిస్థితి. నిజమైన రైతులు తీసుకుపోతే మూడు నాలుగు సార్లు జల్లెడ వేస్తారు. దళారీలు తీసుకెళ్తే జల్లెడ వేయకుండానే కొంటుండటం గమనార్హం. అయితే కొనుగోలు కేంద్రాల వద్ద జరిగే అక్రమాలు గోదాముల దగ్గర బయటపడుతున్నాయి. అక్కడ నిర్వహిస్తున్న తనిఖీల్లో నాణ్యత గుట్టు బయట పడుతోంది. కర్నూలు జిల్లాకు సంబంధించి దాదాపు 1,575 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు సంబంధించి 950 క్వింటాళ్ల కందులు రిజెక్ట్ అయ్యాయి. మార్క్ఫెడ్ అధికారులకు గుడ్విల్ ఇవ్వాల్సిందే.. మద్దతు ధరతో పంట ఉత్పత్తులను కొనుగోలు చేసే ప్రక్రియ మొదలవుతుందంటే మార్క్ఫెడ్ అధికారులకు పండుగే. నోడల్ ఏజెన్నీ మార్క్ఫెడ్ అయినప్పటికీ క్షేత్రస్థాయిలో డీసీఎంఎస్, పీఏసీఎస్ల ద్వారానే కొనుగోలు చేస్తారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు మార్క్ఫెడ్ అధికారులకు గుడ్విల్ భారీ మొత్తంలోనే ఇచ్చుకోవాల్సి ఉంది. లేదంటే 50 నుంచి 100 క్వింటాళ్లకు ఒక క్వింటా కందులు ముడుపుల కింద ఇవ్వాల్సిందేనని సమాచారం. ఎవరికి వారు మామూళ్ల మత్తులో పడిపోవడం వల్ల కొనుగోలు కేంద్రాల్లో టీడీపీ మద్దతుదారులైన దళారీలు, వ్యాపారుల హవా నడుస్తోంది. మద్దతు కొనుగోలు కేంద్రాలు వ్యాపారులు, దళారీలకే ఏర్పాటు చేసినట్లు అర్థమవుతోంది. ఇదీ కొను‘గోలుమాల్’ వ్యవహారం కందులు నాణ్యత లేకపోతే ఒకటి, రెండు సార్లు జల్లెడ వేయాల్సి ఉంది. అయితే ముడుపుల కారణంగా వచ్చిన వాటిని వచ్చినట్లు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల గోదాముల దగ్గర జరుపుతున్న నాణ్యత ప్రమాణాల్లో వందల క్వింటాళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి. ● నిజమైన రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నప్పుడు నాణ్యతకు పెద్దపీట వేస్తుండటం.. దళారీలు, వ్యాపారుల నుంచి కొనుగోలు చేస్తున్నప్పుడు నాణ్యతను విస్మరించడం వెనుక ముడుపుల వ్యవహారం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. మార్గదర్శకాలకు అనుగుణంగానే కొనుగోళ్లు కందుల కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది. మార్గదర్శకాలకు అనుగుణంగా మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నాం. అనంతరం సెంట్రల్, స్టేట్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ గోదాములకు తరలిస్తున్నాం. అక్కడ ప్రతి సంచి కందుల నాణ్యతను చెక్ చేస్తున్నారు. తగిన నాణ్యతా ప్రమాణాలు లేకుంటే రిజెక్ట్ అవుతాయి. రైతులు అంగీకరిస్తే మళ్లీ జల్లెడ వేసి పంపుతాం. జిల్లాకు సంబంధించి 80–90 టన్నుల వరకు రిజెక్ట్ అయ్యాయి. అంతమాత్రాన అక్రమాలు జరిగినట్లు కాదు. – జి.రాజు, జిల్లా మేనేజర్, కర్నూలు2014–2018 మధ్య కొనుగోలు కేంద్రాల్లో భారీ అక్రమాలు టీడీపీ అధికారంలో ఉన్న 2014–15 నుంచి 2018–19 వరకు దళారీలు, వ్యాపారుల నుంచి కందులు, శనగలు మద్దతు ధరతో కొనుగోలు చేసి ఆత్మకూరులోని వేర్ హౌసింగ్ గోదాముల్లో నిల్వ చేశారు. అప్పట్లో గోదాము అధికారులను మచ్చిక చేసుకోవడం వల్ల నాసిరకం సరుకును కూడా అనుమతించారు. రెండేళ్ల తర్వాత నాఫెడ్ అధికారులు పరిశీలిస్తే పుచ్చుపట్టి పనికిరాని కందులను గుర్తించారు. వందలాది టన్నుల పంట ఉత్పత్తులు పనికి రాకుండాపోయాయి. తాజాగా తిరిగి టీడీపీ ప్రభుత్వంలో నాటి పరిస్థితులే పునరావృతం అవుతున్నాయి. దళారీలు, వ్యాపారుల నుంచి మామూళ్ల మత్తులో పడి నాసిరకం కందులు కొనుగోలు చేస్తుండటం వల్ల రానున్న రోజుల్లో దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. అన్ని మండలాల్లో డీసీఎంఎస్, పీఏసీఎస్ల ప్రతినిధులు క్షేత్రస్థాయికి వెళ్లి కందులను కొనుగోలు చేస్తే డోన్లో మాత్రం రైతులు మార్కెట్ యార్డుకు తెచ్చి అమ్ముకునేలా సెంటర్ నిర్వాహకుడు షరతు విధించాడు. డోన్ మండలంలో డీసీఎంఎస్ బ్రాంచ్ కొనుగోలు కేంద్రాన్ని నిర్వహిస్తోంది. టీడీపీ వర్గీయులు బలంగా ఉన్న గ్రామాలకు వెళ్లి కందులను మద్దతు ధరతో కొనుగోలు చేశారు. ఈ విధంగా 4 గ్రామాల్లో మాత్రమే కొన్నారు. మిగిలిన అన్ని గ్రామాల రైతులు మార్కెట్యార్డుకు తెచ్చి అమ్ముకోవాలనే నిబంధన పెట్టారు. ఇందువల్ల రైతులపై రవాణ చార్జీల భారం పడింది. క్వింటాకు 2800 గ్రాముల కందులు అదనంగా తీసుకున్నారు. మద్దతు ధరతో అమ్ముకోవడానికి వెళ్లిన రైతులు దోపిడీకి గురయ్యారు. -
రుణాలు ఊరించి.. చేయూత మరిచి!
బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపులకు అరచేతిలో వైకుంఠం ● కర్నూలు జిల్లాలో 2,034 మందికి లబ్ధి చేకూర్చాలని లక్ష్యం ● 27,140 మంది దరఖాస్తు ● పూలే జయంతి రోజున 508 మందికి మెగా చెక్కు ● మిగిలిన వారి పరిస్థితి ప్రశ్నార్థకం ● వైఎస్సార్సీపీ హయాంలో నవరత్నాల పేరిట 6.97 లక్షల మందికి లబ్ధి కర్నూలు(అర్బన్): బడుగు, బలహీన వర్గాలకు ఆర్థిక చేయూతను అందించేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలను అందించునున్నట్లు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు, మైనారిటీ వర్గాలకు ఆయా కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందించి వారి ఆర్థిక స్థితి గతుల్లో మార్పు తీసుకొస్తామని ప్రకటించింది. అయితే కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడంలో ఆరంభ శూరత్వాన్ని ప్రదర్శిస్తోంది. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడిచిపోయినా, నేటికి కార్పొరేషన్ల రుణాలకు సంబంధించి స్పష్టత ఇవ్వకపోవడం శోచనీయం. జనవరి నెల మొదటి వారంలో బీసీ వర్గాలకు రుణాలు అందించేందుకు అంతా సిద్ధమైందని, వెంటనే అర్హత కలిగిన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని తేదీలు ప్రకటించి మరీ హడావుడి చేశారు. అయితే దరఖాస్తు చేసుకునేందుకు ఉద్దేశించిన ఓబీఎంఎంఎస్ వెబ్సైట్ పలు ఆర్థిక, సాంకేతిక కారణాల వల్ల ఆలస్యంగా ఓపెన్ అయ్యింది. కర్నూలు జిల్లాలో బీసీ, ఈబీసీ, కాపు వర్గాలకు చెందిన 2,034 మందికి ( బీసీ 1673, కాపు 190, ఈడబ్ల్యూఎస్ 171 ) సబ్సిడీ, బ్యాంకు రుణం కలిపి రూ.41.23 కోట్ల మేర స్వయం ఉపాధి పథకాలకు రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో అర్హులైన 27,140 మంది దరఖాస్తు చేసుకున్నారు. 508 మంది ఎంపికై నట్లు మెగా చెక్కు జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించిన లక్ష్యం మేరకు 2,034 మందికి రూ.41.23 కోట్ల మేర రుణాలను అందించాల్సి ఉంది. అయితే ఈ నెల 11న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రుణాలకు సంబంధించి 508 మంది లబ్ధిదారులు ఎంపికై నట్లు రూ.11.77 కోట్ల మెగాచెక్కును అందించారు. ఇందులో 488 మంది బీసీలు, 7గురు కాపులు, 13 మంది ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన వారు ఉన్నారు. అయితే లక్ష్య సాధనలో భాగంగా 508 మంది పోగా, మిగిలిన 1,526 మందికి రుణాలు ఎప్పుడు అందిస్తారనేది ప్రశ్నార్థకం. అందరికీ రుణాలు అందుతాయి మొదటి విడతలో ఈ నెల 11న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రోజున జిల్లాలో ఎంపికై న 508 మందికి రూ.11.77 కోట్ల మెగాచెక్కు ను లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ అందించారు. జిల్లాకు నిర్ణయించిన లక్ష్యం మేరకు మిగిలిన వారికి కూడా రుణాలు అందుతాయి.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మున్సిపాలిటీలు, మండల పరిషత్ కార్యాలయాల నుంచి లబ్ధిదారుల జాబితాలను బ్యాంకులకు పంపి ఖాతా లను ఓపెన్ చేయించి జాబితాలను తమ కార్యాలయాలకు పంపాలని కోరనున్నాం. జాబితాలు అందిన వెంటనే జిల్లా కలెక్టర్ ద్వారా ఆమో దం తీసుకొని తమ శాఖ ఉన్నతాధికారి కార్యాలయానికి పంపుతాం. – ఎస్ జాకీర్హుసేన్, ఈడీ, బీసీ కార్పొరేషన్ ఏఏ పథకాల ద్వారా ఎంతెంతంటే .... వైఎస్సార్సీపీ హయాంలో రూ.2049.22 కోట్ల లబ్ధి గడిచిన ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రకటించి అమలు చేసిన వివిధ పథకాల ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 6,97,147 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.2049.22 కోట్లు జమ అయ్యాయి. -
హోరాహోరీగా బండలాగుడు పోటీలు
బేతంచెర్ల: పట్టణంలోని చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక శేషారెడ్డి హైస్కూలు మైదానంలో రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు శుక్రవారం హోరాహోరీగా సాగాయి. ఆయా ప్రాంతాల నుంచి 18 జతల వృషభాలు ఈ పోటీల్లో పాల్గొనాయి. చెన్న కేశవ స్వామి ఆలయ కమిటీ సభ్యులు రైతు సంఘం నాయకులు బూషిరెడ్డి, సీహెచ్ నాగిరెడ్డి పోటీలను ప్రారంభించారు. మండలంలోని ఆయా గ్రామాల యువకులు, రైతులు పోటీలను తిలకించడానికి రావడంతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈలలు కేరింతల మధ్య వృభజరాజములు రంకెలు వేస్తుండగా పోటీసులు రసవత్తరంగా సాగాయి. ఈ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలుకు చెందిన అక్షరారెడ్డి, కోడుమూరుకు చెంఇన శశాంక్ శ్రేయ ఎద్దులు సంయుక్త విజేతగా నిలిచి ప్రథమ, ద్వితీయ నగదు బహుమతిని కై వసం చేసుకున్నాయి. తాండ్రపాడుకు చెందిన వరలక్ష్మి ఎద్దులు తృతీయ, ఎమ్మిగనూర్కు చెందిన సాయి వర్ధన్ వృషభాలు నాల్గొవ, సంజామలకు చెందిన గుండం చెన్నారెడ్డి వృషభాలు 5వ స్థానంలో నిలిచాయి. దాతలు సహకారంతో వరుసగా రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేల నగదు బహుమతులను దాతలు, నగర పంచాయతీ చైర్మన్ చలం రెడ్డి, రైతు సంఘం నాయకుల చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు నాగభూషణం రెడ్డి, మహేశ్వర్రెడ్డి, గౌరు వెంకటరెడ్డి, రామ్ మోహన్రెడ్డి, అన్నారావు, వీరభద్రారెడ్డి, అజయ్ పాల్గొన్నారు. -
వక్ఫ్ సవరణ చట్టంపై ముస్లింల నిరసన
ఎమ్మిగనూరుటౌన్:వక్ఫ్ సవరణ చట్టంపై శుక్రవారం ఎమ్మిగనూరులో ముస్లింలు నిరసన తెలిపారు.శివసర్కిల్లోని అబుబకర్ మసీదు లో ప్రార్థనల అనంతరం ముస్లింలు ఒక చోట చేరారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, ముస్లింలకు న్యాయం చేయాలని నినాదా లు చేశారు. ముస్లింల మనోభావాలు దెబ్బతిసే లా వ్యవహరిస్తే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. నిరసనలో మత పెద్దలు అతావుల్లా మౌలానా, మౌలానా మునీర్, పక్కీర్సాబ్, కౌన్సిలర్ వాహిద్, ముస్లింలు పాల్గొన్నారు. విద్యార్థులకు ‘ఫీజు’ పాట్లు కర్నూలు (టౌన్): ఫీజు రీయింబ్స్మెంట్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరుగారుస్తోందని వైఎస్సార్సీపీ విధ్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కటికే గౌతమ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభు త్వం ఫీజులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నా విద్యార్థులకు ఫీజు బకాయిలు అందడం లేదన్నా రు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పట్టించుకోవడం లేదన్నారు. పెండింగ్లో ఉన్న బకా యిలు చెల్లించాలని, విధ్యార్థులను వేధిస్తున్న కళ శాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలోనే విద్యార్థినీ, విధ్యార్థులకు, తల్లిదండ్రులకు మద్దతుగా ఉద్యమాల బాట పడతామన్నారు. అగ్నిప్రమాదాలపై 101కు సమాచారం ఇవ్వాలి కర్నూలు: అగ్నిప్రమాదాలు సంభవించినప్పు డు టోల్ఫ్రీ నంబర్ 101కు ఫోన్ చేసి సమాచా రం ఇవ్వాలని అగ్నిమాపక శాఖ జిల్లా సహాయ అధికారి వై.చిన్నబజారి సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం కల్లూరు ఎస్టేట్లోని దామోదర్ ఆయిల్ మిల్, హిందుస్థాన్ పెట్రోల్ బంకుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అగ్నిప్రమాదాలు అరికట్టడానికి సరిపడే నీరు, ఇసుక అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అగ్నిమాపక సిబ్బంది వెంకటరాముడు, హనుమంతు, నరసింహుడు, యు.రామాంజనేయులు, సి.రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీనగర్ ఎస్పీగా కర్నూలు వాసి
కర్నూలు: జమ్ముకాశ్మీర్లో జరిగిన ఐపీఎస్ల బదిలీల్లో కర్నూలు వాసి డాక్టర్ సందీప్ చక్రవర్తి శ్రీనగర్ ఎస్పీగా నియమితులయ్యారు. ఈయన ఎంబీబీఎస్ పూర్తి చేసి 2013లో ఐపీఎస్కు ఎంపికయ్యారు. విద్యాభ్యాసం మొత్తం కర్నూలులోనే జరిగింది. ఈయన తండ్రి డాక్టర్ రాంగోపాల్ రావు కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఆర్ఎంఓగా పదవీ విరమణ పొంది ప్రస్తుతం కర్నూలు బీ–క్యాంప్లో నివాసముంటున్నారు. సందీప్ చక్రవర్తి పోలీసు శాఖలో చేరినప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్లోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఏఎస్పీగా పూంచ్, యూరి, సోపోర్, బారాముల్లా, శ్రీనగర్ సౌత్ జోన్ ఎస్పీగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం జరిగిన బదిలీల్లో శ్రీనగర్ ఎస్ఎస్పీగా నియమితులయ్యారు. విధి నిర్వహణలో ఈయన ఆరు పీఎంజీ, నాలుగు సార్లు జేకే పీఎంజీ, ఐదు సీఆర్పీఎస్ డీజీపీ కమాండెంటేషన్, రెండుసార్లు ఇండియన్ ఆర్మీ డిస్క్, ఒక్కసారి జమ్మూకాశ్మీర్ డీజీపీ నుంచి కమాండెంటేషన్ డిస్క్, ఒకసారి ఐటీ బీపీఈడీటీ కమాండెంటేషన్ డిస్క్ పతకాలను పొందారు. -
భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం
కోసిగి/పెద్దకడబూరు: అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తుండగా దాడి చేసి పట్టుకున్నట్లు కోసిగి ఎకై ్స జ్ పోలీసులు తెలిపారు. స్థానిక ఎకై ్సజ్ స్టేషన్లో సీఐ భార్గవ్ రెడ్డి, కర్నూలు ఈఎస్టీఎఫ్ సీఐ రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మాలపల్లి నుంచి కంబాలదిన్నె గ్రామం వైపు పోవు రోడ్డు లోని మారెమ్మ గుడి వెనుక భాగం మట్టి రోడ్డులో కారులో 40 బాక్స్ల్లో టెట్రా ప్యాకెట్లు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మంత్రాల యం మండలం రచ్చుమర్రి గ్రామానికి చెందిన గోవిందు, పోలి వీరేష్, మజ్జిగ బొజ్జప్ప లు, పెద్దకడబూరు మండలం కంబదహాల్ గ్రామానికి చెందిన బోయ బాలును అదుపులో తీసుకున్నట్లు తెలిపారు. అలాగే రచ్చుమర్రి గ్రామానికి చెందిన ఆదోని శివశంకర్, కంబాలదిన్నె గ్రామానికి చెందిన బోయ ఉసేని పరారయ్యారు. పట్టుబడిన నిందితులను రిమాండ్కు తరలించామని, పరారైన వారిని త్వరలోనే పట్టుకుంటామని సీఐలు తెలిపారు. దాడుల్లో కోసిగి ఎకై ్సజ్ ఎస్ఐ కె. నాగేంద్ర, హెడ్ కానిస్టేబుల్ కిషోర్, కానిస్టేబుళ్లు భరత్, రవి కుమార్, మునిరంగడు, కర్నూలు ఈఎస్టీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సాయిబాబా, కానిస్టేబుళ్లు మధు, లాలూ, కుమార్ స్వామి రెడ్డి పాల్గొన్నారు. -
మద్దతు ధర: 7,550
కొనుగోళ్లకు ఆఖరు తేది: ఈనెల 215,575 టన్నులు కర్నూలు జిల్లాలో కొనుగోలు చేసిన కందులు5,500 టన్నులు నంద్యాల జిల్లాలో కొనుగోలు చేసిన కందులు2,500 క్వింటాళ్లు నాణ్యత లేక గోదాముల వద్ద తిరస్కరించిన కందులుకందుల కొనుగోళ్లలో మతలబు ● నాసిరకం కందులు విక్రయిస్తున్న దళారీలు, వ్యాపారులు ● సెంట్రల్, స్టేట్ వేర్హౌసింగ్ గోదాముల వద్ద వెలుగులోకి అక్రమాలు ● నాణ్యతా లోపంతో 2,500 క్వింటాళ్లకు పైగా తిరస్కరణ ● ముడుపులతోనే చూసీచూడనట్లు వ్యవహారం ● గుడ్విల్ మత్తులో మార్క్ఫెడ్ అధికారులు -
అకాల వర్షం.. అపార నష్టం
హొళగుంద/చిప్పగిరి: ఈదురుగాలులతో కురిసిన వడగండ్ల వాన రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. హొళగుంద మండల పరిధిలోని గజ్జహళ్లి గ్రామంలో కోతకు సిద్ధంగా ఉన్న వరి నేలవాలింది. కల్లాల్లో నిల్వ ఉంచిన మిరప తడిసిపోయింది. తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ) కింద వందలాది ఎకరాల్లో వరి సాగు చేశారు. పైరు గింజ దశలో ఉన్న సమయంలో వడగండ్ల వాన పడింది. దీంతో పైరులోని 90 శాతం మేర గింజలన్నీ నేలరాలాయి. అలాగే పైరు నేలకొరిగింది. ఇప్పటికే కోత జరిగి కల్లాల్లో ధాన్యం బస్తాలు ఉంచగా తడిసిపోయాయి. అదేవిధంగా మిరప, మామిడి తదితర పంటలకు నష్టం వాటిల్లింది. మామిడి పూత నేల రాలి దెబ్బ తినగా.. కల్లంలో ఉంచిన ఎండు మిరప నీటిలో నానిపోయింది. ఈదురుగాలులకు పెద్దహరివాణం రోడ్డులో, గజ్జహళ్ల్లి బీసీ కాలనీలో చెట్టు కొమ్మ లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఉరుములు, మెరుపులతో ప్రజలు బయటకు రాలేకపోయారు. చేతికందే దశలో వరిపంట దెబ్బతిందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. చిప్పగిరి మండలంలోని నేమకల్లు, రామదుర్గం, బెల్డోణ, దౌల్తాపురం నంచర్ల తదితర గ్రామాల్లో పెద్దఎత్తున మెరుపులు, ఉరుములతో వర్షం కురిసింది. నేమకల్లు, కుందనగుర్తి గ్రామాల్లో చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్ అంతరాయంతో మండలంలోని పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పగలు ఎండలు.. సాయంత్రానికి వానలు కర్నూలు అగ్రికల్చర్: ఉమ్మడి కర్నూలు జిల్లాలో శుక్రవారం ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్ర పెరిగింది. వేడి గాలులకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సాయంత్రం కర్నూలు, అటు నంద్యాల జిల్లాలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. పగలు మహానందిలో 41.5, పాణ్యంలో 41.5, గోస్పాడులో 41.6, దొర్నిపాడులో 41.7, గడివేములలో 41.1, కర్నూలులో 40.4, కోడుమూరులో 40.1 ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం హొళగుంద, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లె, కొత్తపల్లి, కోవెలకుంట్ల తదితర మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. ఆస్పరిలో పిడుగు పడిన ఘటనలో ఒక ఎద్దు మృతిచెందింది. -
అహోబిలేశుడి సేవలో కేంద్ర మంత్రి
ఆళ్లగడ్డ: అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వార్లను కేంద్ర ఆహార పౌరసరఫరాల, శుద్ధ ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం దర్శించుకున్నారు. అహోబిలం చేరుకున్న ఆయనకు ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అహోబిలం క్షేత్రంలోని శ్రీ లక్మీనరసింహస్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించా రు. అనంతరం అర్చకులు స్వామివార్ల శేషవస్త్రం, ప్రసాదాలు అందజేసి వేదశ్వీరచనాలు అందించా రు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్సింగ్ రాణా, అహోబిలం దేవస్థాన మేనేజర్ మాధవన్ తదితరులు ఉన్నారు -
జిల్లా అంతటా విజిబుల్ పోలీసింగ్
● జిల్లా కేంద్రంలో ప్రధాన కూడళ్లలో పర్యటించిన ఎస్పీ కర్నూలు: ఏపీ డీజీపీ ఆదేశాల మేరకు పోలీసులు జిల్లా అంతటా ఏకకాలంలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. గురువారం రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము వరకు అన్ని ముఖ్యమైన రోడ్లు, కూడళ్లల్లో రేడియం జాకెట్లు ధరించి పోలీసులు సరికొత్తగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులు, కూడళ్లలో పర్యటించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు శాంతిభద్రతలను పరిరక్షించేందుకు జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని ఉల్చాల వై–రోడ్ జంక్షన్లో ఎస్పీ తనిఖీల్లో పాల్గొన్నారు. అనుమానాస్పద వ్యక్తుల సంచరింపు, అసాంఘిక కార్యకలాపాలపై ఆరా తీశారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు చేపట్టారు. వివిధ కాలనీల్లోని ప్రజలతో ముఖాముఖి మాట్లాడి స్థానికంగా ఉంటున్న సమస్యల గురించి పోలీసులు ఆరా తీశారు. ప్రజలతో మమేకం కావడంతో పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెంపొందే వీలుంటుందని ఎస్పీ అభిప్రాయపడ్డారు. కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్, సీఐలు మధుసూదన్గౌడ్, నాగరాజరావు తదితరులు కూడా ఎస్పీ వెంట ఉన్నారు. -
బీహార్ సర్పంచ్ల బృందం సందర్శన
కర్నూలు(రూరల్)/పాణ్యం: గార్గేయపురం, కౌలూరు గ్రామాలను శుక్రవారం బీహార్ సర్పంచ్ల బృందం సందర్శించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంటు హైదరా బాద్ వారి అధ్వర్యంలో దాదాపు 55 మంది ఆయా గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, గ్రామ సచివాలయ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, గ్రామం నుంచి సేకరించే తడి, పొడి చెత్త నుంచి తయారు అయ్యే సేంద్రి య ఎరువు యూనిట్ను పరిశీలించారు. ప్రజలకు ప్రభు త్వం అందజేస్తున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఎన్ఐఆర్డీ అధికారిణి ప్రత్యుష్ణ పట్నాయక్, గార్గేయపురం సర్పంచ్ సోమేశ్వరమ్మ, ఈఓఆర్డీ చంద్రమౌళీశ్వరగౌడ్, జిల్లా ప్రాజెక్టు రిసోర్సుశిక్షకులు గిడ్డయ్య తదితరులు ఉన్నారు. -
నాటుసారా స్థావరాలపై దాడులు
కర్నూలు: కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని గుమ్మితం తండా, గుడుంబాయి తండా గ్రామాల్లోని నాటుసారా స్థావరాలపై ఎకై ్సజ్ అధికారులు విస్తృత దాడులు చేపట్టారు. కర్నూలు స్టేషన్ సీఐ చంద్రహాస్, ఎన్ఫోర్స్మెంట్ సీఐ కృష్ణ, ఎస్ఐ మధు, సిబ్బంది రామలింగయ్య, చంద్రపాల్, చంద్రుడు, వీరన్న తదితరులు బృందాలుగా ఏర్పడి సారా స్థావరాలపై దాడులు చేశారు. గుమ్మితంతండాలో 400 లీటర్ల బెల్లం ఊట, 15 లీటర్ల నాటుసారా, గుడుంబాయి తండా శివారులో 600 లీటర్ల నాటుసారాకు ఉపయోగించే బెల్లం ఊట, 15 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేసి బట్టీలను పగులగొట్టారు. సారాకు వినియోగించే సామాగ్రి, ప్లాస్టిక్ డబ్బులు, బిందెలు, వంట పాత్రలన్నీ స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీబాయి, లోక్నాయక్లు కలసి సారా తయారీ చేయిస్తున్నట్లు వెలుగు చూసిందని, వారిని త్వరలో అరెస్టు చేయనున్నట్లు సీఐ తెలిపారు. అనంతరం ఆయా గ్రామాల్లో గ్రామ సభ నిర్వహించి సారా వినియోగం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయనే విషయాలను వివరించారు. నాటుసారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కోరారు. నవోదయం కార్యక్రమంలో భాగంగా దాడులు ఇకపై విస్తృతంగా కొనసాగుతాయని, సారా తయారీ, విక్రయాలు, రవాణా ఆపకపోతే పీడీ కేసులు నమోదు చేసి శాశ్వతంగా జైలుకు పంపుతామని హెచ్చరించారు. పొలం రస్తా విషయంలో ఘర్షణ.. ఇద్దరికి గాయాలు కోసిగి: మండల కేంద్రం కోసిగిలోని బాలుర ఉన్నత పాఠశాల వెనుక భాగంలో నివాసం ఉంటున్న తిమ్మాపురం ఈరన్న, దళవాయి యల్లయ్య మధ్య పొలం రస్తా విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఇరువురికి గాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం పొలంలో రస్తా విషయంలో గొడవ పడగా, అది మనస్సులో పెట్టుకుని రాత్రి ఇంటి ప్రాంగణంలో గొడపడ్డారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇందులో తిమ్మాపురం ఈరన్న మెడకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా.. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108లో ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. బెల్టు షాపు నిర్వాహకుడి అరెస్ట్ ఆదోని రూరల్: మండలంలోని పెద్దపెండేకల్ గ్రామానికి చెందిన సుభాన్ అనే వ్యక్తి బెల్టు షాపు నిర్వహిస్తుండగా అరెస్టు చేసినట్లు తాలూకా ఎస్ఐ రామాంజనేయులు శుక్రవారం తెలిపారు. సుభాన్ ఆంధ్రాకు చెందిన మద్యం అక్రమంగా అమ్ముతుండగా పట్టుకున్నామన్నారు. అతని వద్ద నుంచి 180 ఎంఎల్ల 25 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసుకుని రిమాండ్కు పంపినట్లు చెప్పారు. -
మత్స్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(అగ్రికల్చర్): నగరంలోని దేశీయ మత్స్యశిక్షణా కేంద్రంలో కార్యక్రమం మూడు నెలల పాటు నిర్వహించే శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి రంగనాథబాబు తెలిపారు. చేపల పెంపకంపై ఆసక్తి కలిగిన రాయలసీమ జిల్లాలకు చెందిన యువత సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొన్నారు. మే 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండి 35 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలని, మత్స్య సహకార సంఘాల సభ్యులు, చేపల పెంపకందారులు, లైసెన్స్ దారులు అర్హులేనని పేర్కొన్నారు. 7వ తరగతి ఉత్తీర్ణులై చేపల పెంపకం పట్ల ఆసక్తి ఉన్న వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 29వ తేదీలోపు బంగారుపేటలోని మత్స్యశాఖ అధికారి కార్యాలయానికి పంపాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 30న ఇంటర్వ్యూలు నిర్వహించి శిక్షణకు ఎంపిక చేస్తామన్నారు. శిక్షణా కాలంలో నెలకు రూ.1000 ఉపకార వేతనం చెల్లించబడుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రాయలసీమలోని జిల్లాలకు చెందిన వారు సద్వినియోగం చేసుకోవచ్చని కోరారు. కొలనుభారతిలో ప్రత్యేక పూజలు కొత్తపల్లి: సరస్వతీ క్షేత్రంగా విరాజిల్లుతున్న కొలనుభారతి క్షేత్రంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేటప్టారు. పంచమి మూల నక్షత్రం కావడంతో అమ్మవారిని అలంకరించి పంచసూక్తములతో అభిషేకాలు, కుంకుమార్చనలు, మంగళహారతి వంటి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ పురోహితులు శ్రీనివాస శర్మ అమ్మవారి సన్నిధిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులకు బీజాక్షరాలు రాయించి సుమారు 50 మంది దాక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. పిడుగు పాటుకు ఎద్దు మృతి ఆస్పరి: మండల కేంద్రమైన ఆస్పరిలో శుక్రవారం పిడుగు పాటుకు ఓ ఎద్దు మృతి చెందింది. రైతు మహబూబ్బాషా వామి దొడ్డిలో ఎద్దులను కట్టేశాడు. అయితే ఎద్దులకు సమీపంలో పిడుగు పడటంతో ఒకటి అక్కడికక్కడే మృతి చెందగా మరొకటి స్పల్ప గాయాలయ్యాయని తెలిపారు. ఎద్దు మృతి చెందడంతో రైతుకు రూ.60 వేలు నష్టం వాటిల్లింది. మహిళ అదృశ్యం బేతంచెర్ల: పట్టణంలోని శ్రీ నగర్ కాలనీకి చెందిన ఓ మహిళ రెండు రోజులుగా కనిపించడం లేదు. స్థానికంగా నివాసముంటున్న నాగమణి ఓ ప్రైవేటు ఫైనాన్స్ కార్యాలయంలో పని చేస్తోంది. గురువారం ఉదయం ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లి మధ్యాహ్నం తర్వాత బయటకు వచ్చిన మహిళ ఇంటికి రాలేదు. బంధువులు, ఆయా ప్రాంతాల్లో ఆచూకీ కోసం గాలించినా తెలియలేదు. తమ కుమార్తె కనిపించడం లేదని నాగమణి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కేసీ తిరుపాల్ తెలిపారు. -
మహాత్ముల త్యాగమే సమాజ బలం
కర్నూలు కల్చరల్: మహాత్ముల త్యాగమే సమాజ బలమని పలువురు జీయర్ స్వామీజీలు, పీఠాధిపతులు అన్నారు. ఉభయ వేదాంత పండితులు సత్సంప్రదాయ పరిరక్షణ సభ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి శత జయంతి సందర్భంగా గోదా గోకులంలో ఐదు రోజులుగా జరుగుతున్న శ్రీమద్రామాయణ మహా యజ్ఞం శుక్రవారం ముగిసింది. అందులో భాగంగా 2 వేల మందితో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి, త్రిదండి అహోబల రామానుజ జీయర్ స్వామి, త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి, త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామి, ప్రయాగ్రాజ్ నుంచి రాఘవ ప్రసన్న జీయర్ స్వామి, శ్రీశ్రీ త్రిదండి శఠగోపముని రామానుజ జీయర్ స్వామి ఆచార్య పరమాత్మానందగిరి స్వామి, విరజానంద స్వామి సందేశం ఇచ్చారు. గోదా గోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజు గుప్తు, ట్రస్టీ పల్లెర్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా సంగీత యుక్త ఇష్టలింగ మహాపూజ
హొళగుంద: స్థానిక సిద్ధేశ్వరస్వామి ఆలయ ఆవరణలో కాశీ మఠం వారణాసి పీఠాధిపతి మల్లికార్జున శివాచార్య మహా స్వామి ఆధ్వర్యంలో సంగీత యుక్త ఇష్టలింగ మహాపూజ వైభవంగా నిర్వహించారు. బసవేశ్వర జయంతి ఉత్సవాల సందర్భంగా రెండు రోజు శుక్రవారం ఉదయం జరిగిన బృహత్తర కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. సంగీత కార్యక్రమాలు, భజనలు, పూజలతో హొళగుందలో ఆధ్యాత్మిక వా తావరణ నెలకొంది. ఈ సందర్భంగా జగద్గురువు భక్తులనుద్దేశించి మాట్లాడారు. కార్యక్రమానికి జంగమర హొసళ్లికి చెందిన అజాత శంభులింగ శివాచార్య, పాల్తూరు చెన్నవీర శివాచార్య, కొట్టూరు శాకామఠానికి చెందిన మరికొట్టూరు దేశీకేంద్ర మహాస్వాములు, నందీపుర డాక్టర్ మహేశ్వరా శివాచార్య మహాస్వాములు, రౌడకుంద శివయోగి శివాచార్య మహాస్వాములు హాజరయ్యారు. లింగ పూజ పరమ శ్రేష్టం మనసు చెంచలం కాకుండా క్రమశిక్షణ, ఏక్రాగత, ప్రశాంతతకు లింగ పూజ ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుందని కాశీ జగద్గురువులు అన్నారు. కుళ్లు కుతంత్రలు వదిలి తమకు చేతనైనంత మేర పేదలకు దాన ధర్మాలు చేస్తే మనశ్శాంతి లభిస్తుందని చెప్పారు. శాంతితో ప్రశాంత జీవనం గడుపుకునేలా జీవితాన్ని తీర్చుకోవాలని ఆయన ఉపదేశం చేశారు. ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకుని మంచి మార్గాల్లో నడవాలన్నారు. నవ సమాజాన్ని నిర్మించుకోవాలని భక్తులకు ఆయన బోధ చేశారు. -
ఉచిత విద్య ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
హొళగుందలో అడ్డ పల్లకీలో ఆశీనులైన కాశీ జగద్గురువు కర్నూలు సిటీ: విద్యాహక్కు చట్టం మేరకు 2025–26 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులు ఒకటో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఎస్.శ్యామూల్ పాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించారని, వచ్చే విద్యా సంవత్సరానికి ఉచిత విద్యను అందించే జిల్లాలోని అన్ని ప్రయివేట్ పాఠశాలలు ఈ నెల 19 నుంచి 26వ తేది వరకు తమ వివరాలను విద్యాశాఖ వెబ్సైట్ https://cse.ap.gov.in/ లో నమోదు చేసుకోవాలన్నారు. విద్యార్థులు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల డేటా ఆధారంగా వచ్చే నెల 16 నుంచి 20వ తేదీ వరకు విద్యార్థుల ప్రవేశాలకు అర్హతల ఆధారంగా లాటరీ ద్వారా మొదటి విడత సీట్లు కేటాయిస్తామన్నారు. వివరాలను 21 నుంచి 24వ తేదీ మధ్య ప్రకటిస్తామని పేర్కొన్నారు. -
క్రీడలతో మానసిక ఒత్తిడి దూరం
కర్నూలు: పోలీసులు విధి నిర్వహణలో ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు దోహదం చేస్తాయని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్ మైదానంలో ఏపీఎస్పీ ఎస్డీఆర్ఎఫ్ పోలీసులకు, సివిల్, ఏఆర్ పోలీసుల జట్లకు నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ను గురువారం డీఐజీ, ఎస్పీ కలిసి ప్రారంభించారు. వారు స్వయంగా క్రికెట్ ఆడి సిబ్బందిని ఉత్సాహపరిచారు. కర్నూలు జిల్లా సివిల్, ఏఆర్ పోలీసుల జట్టుకు డీఐజీ కెప్టెన్గా, ఏపీఎస్పీ ఎస్డీఆర్ఎఫ్ పోలీసులకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ కెప్టెన్గా వ్యవహరించారు. ఇరు జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ సందర్భంగా డీఐజీ, ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం విధుల్లో ఉండే సిబ్బందికి క్రీడలు నూతనోత్సాహాన్ని ఇస్తాయన్నారు. శారీరక దృఢత్వానికి, ఆరోగ్యానికి క్రీడలు దోహదం చేస్తాయన్నారు. గెలుపు, ఓటములు సహజమన్నారు. ఏపీఎస్పీ రెండవ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ నాగేంద్రరావు, కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, అసిస్టెంట్ కమాండెంట్లు ఎస్ఎం బాషా, సుధాకర్ రెడ్డి, రవికిరణ్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
21నాటికి ప్రోగ్రెస్ కార్డులు అందించాలి
కర్నూలు(సెంట్రల్): జిల్లాలోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మార్కులతో కూడిన ప్రోగ్రెస్ కార్డును ఈనెల 21వ తేదీ నాటికి అందించాలని జేసీ డాక్టర్ బి.నవ్య అఽధికారులను ఆదేశించారు. గురువారం పాఠశాలల ముగింపునకు సంబంధించిన అంశాలపై జేసీ వెబెక్స్ ద్వారా విద్యాశాఖాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోమవారం నుంచే విద్యార్థులను ఉన్నత తరగతులకు ప్రమోట్ చేసి అదే రోజు నుంచి బోధన జరిగేలా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 4,21,632 మంది విద్యార్థులను ఉన్నత తరగతులకు ప్రమోట్ చేయాలన్నారు. 1,886 అంగన్వాడీ కేంద్రాల నుంచి పూర్వ ప్రాథమిక విద్యను పూర్తి చేసుకొని ప్రాథమిక విద్యలోకి చేరుతుండడంతో వారంతా పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో డీఈఓ శామ్యూల్పాల్ పాల్గొన్నారు. కనిష్ట స్థాయికి ఉల్లి ధర కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి ధర కనిష్టస్థాయికి పడిపోతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం అన్ సీజన్ కావడంతో అక్కడక్కడ బావులు, బోర్లు, ఇతర నీటిపారుదల కింద ఉల్లి సాగయింది. కర్నూలు మార్కెట్కు ఎనిమిది మంది రైతులు మాత్రమే 479 క్వింటాళ్ల ఉల్లి తెచ్చారు. క్వింటాకు కనిష్టంగా రూ.675, గరిష్ట ధర రూ.879 మాత్రమే లభించింది. సగటు ధర రూ.755 నమోదైంది. జిల్లాకు మహారాష్ట్రలో పండించిన ఉల్లి భారీగా దిగుమతి అవుతోంది. ఉల్లితో పాటు మిర్చి, వాము, వేరుశనగ, శనగ తదితర అన్ని పంటల ధరలు పడిపోయాయి. – క్వింటా మిర్చి ధర రూ.4వేల నుంచి రూ.7వేల వరకు మాత్రమే పలుకుతోంది. రెండు నెలల కిత్రం మిర్చి రైతులకు న్యాయం చేస్తామంటూ హడావుడి చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చివరికి నష్టాలనే మిగిల్చారు. – వాము క్వింటాకు కనిష్టంగా రూ.1880, గరిష్టంగా రూ.21,682 లభించగా.. సగటు ధర రూ.12,699 నమోదైంది. 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు గుర్తింపు కార్డులు కర్నూలు(అర్బన్): జిల్లాలో 60 సంవత్సరాల వయస్సు పైబడిన వయో వృద్ధులు సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వార్డు సచివాలయాల పరిధిలోని వారు వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రెటరీ, గ్రామ సచివాలయాల పరిధిలోని వారు డిజిటల్ అసిస్టెంట్లను సంప్రదించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఆధార్కార్డు, ఒక పాస్పోర్టు సైజ్ ఫొటో తీసుకెళ్లి దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్డుకు పురుషులు 60 సంవత్సరాలకు పైబడి, మహిళలు 58 సంవత్సరాలకు పైబడిన వారు అర్హులన్నారు. గుర్తింపు కార్డుల జారీకి ఎలాంటి ఆన్లైన్ దరఖాస్తులు తమ కార్యాలయంలో స్వీకరించబడవని ఆమె స్పష్టం చేశారు. ముఖ ఆధారిత హాజరులో అవకతవకలు ● ఏడుగురికి చార్జి మెమోలు జారీ కర్నూలు(హాస్పిటల్): వైద్య ఆరోగ్యశాఖలో ముఖ ఆధారిత హాజరులో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఏడుగురి కి చార్జి మెమోలు జారీ చేశారు. ఇందులో ముగ్గురు మెడికల్ ఆఫీసర్లు, ముగ్గురు స్టాఫ్నర్సులు, ఒక ఫార్మాసిస్టు ఉన్నారు. వీరు తమ ఐ ఫోన్ ద్వారా హాజరును మార్ఫింగ్ చేశారని, అక్రమాలకు పాల్పడ్డారని రాష్ట్ర ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ మేరకు జాబితాను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.శాంతికళకు పంపించడంతో ఆమె ఏడుగురికి చార్జి మెమోలు పంపించారు. ఈ మేరకు వివరణ ఇచ్చిన వారు సాంకేతిక లోపం కారణంగానే హాజరు తప్పుగా నమోదైందని, ఇందులో తాము కావాలని చేసిందేమీ లేదని వివరణ ఇచ్చినట్లు సమాచారం. వారు ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందకపోతే కాంట్రాక్టు వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని, రెగ్యులర్ వారిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ఎల్లెల్సీకి నీటి సరఫరా బంద్ హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి నుంచి నీటిమట్టాన్ని తగ్గిస్తూ వచ్చారు. బుధవారం పూర్తిగా నీటి సరఫరాను నిలిపివేశారు. జిల్లా సరిహద్దులోని 250 కి.మీ వద్ద కాలువలో గురువారం నీటి ప్రవాహం కనిపించలేదు. టీబీ డ్యాంలో 105.788 టీఎంసీలకు గాను ప్రస్తుతం 7.037 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాంకు ఇన్ఫ్లో ఏమీ లేక పోగా అవుట్ఫ్లో 325 క్యూసెక్కులుంది. -
ఆదోనిలో ఎమ్మెల్యే పేరుతో పీఏ, అనుచరుల దందా
● ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్లకు నెల మామూళ్లు ఫిక్స్ ● కర్ణాటక నుంచి ఏపీ, తమిళనాడుకు వెళ్లే సరుకు రవాణా వాహనాల నుంచి వసూళ్లు ● మామూళ్లు ఇవ్వని వాహనాలపై అనుచరుల దాడులు, పోలీసు కేసులు ● ప్రత్యేకంగా ఓ ముఠాను నియమించుకున్న ఎమ్మెల్యే సాక్షి ప్రతినిధి కర్నూలు: బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి పేరు చెప్పి ఆయన పీఏ నాగరాజు గౌడ్, అనుచరులు చేస్తున్న అక్రమాలపై ఆదోనిలో టీ అంగళ్లు, హోటళ్లతో పాటు ఎక్కడ నలుగురు కలిసినా ఇదే చర్చ. ఆదోనిలో ఓ ప్రత్యేక ముఠా ఉంది. ఇసుక, కర్ణాటక నుంచి ఏపీ, తమిళనాడుకు ఫ్లయాస్ వెళ్లే లారీలు ఆపి బెదిరిస్తున్నారు. అర్ధరాత్రి ఇసుక సరఫరా చేసే ట్రాక్టర్లు, టిప్పర్లను ఆపి డ్రైవర్లపై దాడులు చేసి మామూళ్ల కోసం బెదిరిస్తున్నారు.అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో రెవె న్యూ, పోలీసులను చెప్పుచేతల్లో పెట్టుకుని వారికి మా మూళ్లు ఇస్తూ, తక్కిన డబ్బు టీడీపీ నేతలు పంచుకుంటూ భారీగా ఆర్జిస్తున్నారు. వీరి దెబ్బకు ఫైనాన్స్లో ట్రాక్టర్లు తెచ్చుకుని ఇసుక అవసరం ఉన్న వాళ్లకు ఉచితంగా తోలి, టిప్పునకు రూ.400–500 బాడుగ వస్తే బతుకుతాం’ అనేవాళ్ల కడుపుపై కొడుతున్నారు. దీంతో కడుపు రగిలిన కొందరు డ్రైవర్లు బీజేపీ ఎమ్మెల్యే అనుచరులపై ఎదురు తిరుగుతున్నారు. జరుగుతున్న దందా, రౌడీయిజంపై ధైర్యంగా గళం విప్పుతున్నారు. మున్సిపాలిటీలో ఏ పని చేయాలన్నా 10శాతం కప్పం కట్టాల్సిందే.. ఆదోని మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు టెండర్ వేయాలంటే ముందుగా ఎమ్మెల్యే పీఏతో మాట్లాడాలి. 10శాతం కప్పం కట్టాలి. లేదంటే పనులు చేయలేరు. చేసినా బిల్లులు రావు. గత ప్రభుత్వంలో మొదలై పురోగతిలో ఉన్న పనుల బిల్లులు కూడా ఆపేశారు. వాటి నుంచి కూడా కప్పం చెల్లించుకుని ఆ తర్వాత మంజూరు చేయించారు. పాతబస్టాండ్ వద్ద మునిసిపల్ కాంప్లెక్స్ భవనాన్ని ఇలాగే ఆపేశారు. కాంట్రాక్టర్ వచ్చి డబ్బులు చెల్లించిన తర్వాత తిరిగి పనులకు ‘గ్రీన్సిగ్నల్’ ఇచ్చారు. ఈ సర్వేనెంబర్లలో క్రయ విక్రయాలు పూర్తిగా బంద్ ఆదోనిలో ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న సర్వే నెంబర్ 352లో పూర్తిగా రిజిస్ట్రేషన్లను ఆపేసినట్లు తెలుస్తోంది. 1922లో బ్రిటీష్ ప్రభుత్వంలోని కొందరికి హక్కుగా వచ్చిన భూమి వంశపారపర్యంగా విక్రయిస్తూ వచ్చారు. ఇందులో కొంత తమకు ఇవ్వాలని కూటమి నాయకులు వారిని డిమాండ్ చేశారు. దీనికి భూ యజమానులు ఒప్పుకోకపోవడంతో ఈ భూమి రిజిస్ట్రేషన్లు ఆపేసినట్లు తెలిసింది. అలాగే సర్వే నెంబర్ 444లో కూడా రిజిస్ట్రేషన్లు ఆపేసినట్లు సమాచారం. ప్రతీ శాఖ కార్యాలయంలో ఇక్కడి ప్రజాప్రతినిధి తమ మనుషులను నియమించుకున్నారు. దీంతో రోజు ముఖ్యమైన ఫైళ్లు ఎవి కదులుతున్నాయి? భారీ లావాదేవీల సమాచారం ప్రజాప్రతినిధికి వస్తోంది. ఆ ప్రకారం పీఏ ఫోన్ చేసి లావాదేవీని బట్టి ‘కప్పం’ నిర్ణయిస్తారు. – ఆదోని ఎస్కేడీ కాలనీలో పార్థసారథి సన్నిహితుడు డాక్టర్ రవికిరణ్ 6.71 ఎకరాల భూమిని అక్రమంగా తమ తల్లిపేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీంతో బాధితులు ఆందోళనకు దిగారు. దీంతో రిజిస్ట్రేషన్ రద్దు చేశారు. ప్రైవేటు ఆస్పత్రులకు వేధింపులు: ఆదోనిలో మదర్ అండ్ చైల్డ్ ఆస్పత్రి ఉంది. ఇక్కడ 5గురు డాక్టర్లు ఉన్నారు. నెలకు 500 ప్రసవాలు జరుగుతాయి. ఇది తెలీకుండా అక్కడ రెండు ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) ద్వారా చికిత్స అందించే రెండు ఆస్పత్రులకు ఎక్కువగా కేసులు వెళ్తున్నాయని కలెక్టర్, డీఆర్సీ మీటింగ్లో ప్రస్తావించారు. అయితే ఎమ్మెల్యే ఆరోపణల్లో వాస్తవాలు లేవని అధికారులు ఆయన ఫిర్యాదు తేలిగ్గా తీసుకున్నారు. కానీ అధికారుల విచారణలో ఆస్పత్రుల యజమానులను ‘కప్పం’ చెల్లించాలని వేధిస్తే వారు దారికి రాకపోవడంతోనే వేధింపులకు పాల్పడుతున్నారని తేలినట్లు తెలుస్తోంది. నన్ను కొట్టి, ఫోన్ లాక్కుని దౌర్జన్యం చేశారు ‘నా పేరు మహ్మద్ హుస్సేన్. నదీచాగి నుంచి ఇసుక తీసుకొస్తున్నా. రాత్రి ఒంటిగంట తర్వాత బీజేపీ వాళ్లు బండిని ఫాలో అయ్యారు. సాయి, రమాకాంత్, సాయన్న బండి నిలిపారు. నా వద్ద ఉన్న బిల్లు తీసుకుని చించేశారు. అన్లోడింగ్కు పోతున్నామని చెబుతుంటే మీ ఓనర్ ఎవరు? ఇప్పుడు ఇక్కడికి రమ్మను అని అర్ధరాత్రి చెబుతున్నారు. వారితో 7–10మంది ఉన్నారు. వారు నన్ను కొట్టి బండి ఆపి దౌర్జన్యం చేశారు. ఫోన్ లాక్కున్నారు. మేం డ్రైవర్లు ఏం చేస్తాం అన్నా వినలేదు.’ -
నెలకు రూ.10–15వేలు బీజేపీ ఎమ్మెల్యే మనుషులకు ఇవ్వాలంట
మేం గుడికంబాలి నుంచి ఇసుక తోలుతున్నాం. బతికేందుకు ఫైనాన్స్లో ట్రాక్టర్ తెచ్చుకున్నాం. ఒక ట్రిప్పు తోలితే ఖర్చులు పోనూ రూ.400–500 మిగులుతాది. ఇసుక తోలుతుంటే రాత్రి ఒంటిగంటకు, రెండు గంటలకు ట్రాక్టర్లను ఎమ్మెల్యే మనుషులు బీజేపీ వాళ్లు రమాకాంత్, విజయ్, సాయన్న వచ్చారు. నెలకు రూ.10–15వేలు ఇవ్వాలంటున్నారు. టిప్పర్లు అయితే ట్రిప్పుకు రూ.1500 ఇవ్వాలి. లేదంటే పోలీసులకు ట్రాక్టర్ అప్పగిస్తున్నారు. రాత్రంతా స్టేషన్ వద్దే ఉన్నాం. చంద్రబాబు ఇసుక ఫ్రీ అంటున్నారు. ఎక్కడ ఫ్రీ ఉంది చెప్పండి. ఇప్పుడు దీనికి ఏం చెబుతారు?’ – ఇటీవల చిన్నపెండేకల్ వాసి కృష్ణను వేధిస్తే మీడియాతో పంచుకున్న వేదన ఇది -
అక్రమ కేసులతో టీడీపీకి కొమ్ము కాస్తున్నారు!
● వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు ఎలా నమోదు చేస్తారు? ● పోలీసులపై వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ఆగ్రహం కల్లూరు: అక్రమ కేసులతో టీడీపీకి పోలీసులు కొమ్ముకాస్తున్నారని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి మండిపడ్డారు.టీడీపీ వారితో ఒక రకంగా.. వైఎస్సార్సీపీ నాయకులతో మరో రకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గురువారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాటసాని మాట్లాడారు. కర్నూలు నగరంలోని నాల్గో పట్టణ సీఐ టీడీపీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. కల్లూరు అర్బన్ పరిధిలోని 31, 34 వార్డులో జరిగిన సంఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు ఎవరిపై అన్యాయంగా కేసులు బనాయించలేదని గుర్తు చేశారు. టీడీపీ నాయకులకు ఒక న్యాయం, వైఎస్సార్సీపీకి ఒక న్యాయమా అని ప్రశ్నించారు. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండబోదని గుర్తుపెట్టుకొని పోలీసులు ఉద్యోగాలు చేయాలని హితవు పలికారు. అన్నీ అబద్ధాలే ఎన్నికల ముందు తనపై ప్రతిపక్ష నాయకులు అన్నీ అబద్ధాలు ప్రచారం చేశారని కాటసాని అన్నారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలవుతున్నా నిరూపించలేకపోయారన్నారు. జగన్నాథ గట్టుపై కబ్జా చేశానని నంద్యాల ఎంపీ శబరి అబద్ధపు మాటలు చెప్పారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు ఎవరూ బియ్యం అక్రమ వ్యాపారాలు చేయడం లేదన్నారు. వైన్ షాపులు బార్లను తలపిస్తున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుపుకుంటుంటే ఎంపీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రేషన్ బియ్యాన్ని ఏవిధంగా పట్టుకున్నారో అదే విధంగా ఎకై ్సజ్ అధికారులను తీసుకొని పోయి వైన్ షాపులపై దాడులు చేయించాలన్నారు. వైన్ షాపుల దగ్గర రోడ్లపై మహిళలు, ప్రజలు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారన్నారు. మాటమీద నిలబడాలి టీడీపీ నాయకులు మాటమీద నిలబడాలని కాటసాని అన్నారు. టీటీడీ గోశాలలో గోవుల మృతిపై టీడీపీ నాయకులు ఇచ్చిన సవాల్ను స్వీకరించి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి వస్తానన్నారని, అయితే పోలీసులు ఆయనను హౌస్ అరెస్టు చేయడం ఏమిటన్నారు. ఆవులు చనిపోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు చెబుతున్నారని, టీటీడీ ఈఓ మాత్రం 44, టీటీడీ చైర్మన్ అయితే 22 ఆవులు చనిపోయా యని చెబుతున్నారని, ఎవరిది నిజమో తెలియ డం లేదని, పొంతన లేని సమాధానాలు చెబు తున్నారన్నారు. కార్పొరేటర్లు చిట్టెమ్మ, వెంకటేశ్వ ర్లు, లక్ష్మీకాంతరెడ్డి, సాన శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
నేడు 2 వేల భక్తులతో విష్ణు సహస్రనామ పారాయణం
కర్నూలు కల్చరల్: గోదా గోకులంలో శ్రీరామాయణ మహాయజ్ఙం ముగింపు వేడుకల్లో భాగంగా శుక్రవారం 2 వేల మందితో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహిస్తున్నట్లు త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామి తెలిపారు. గురువారం గోదా గోకులంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో స్వామీజీ మాట్లాడుతూ.. సత్సంప్రదాయ పరిరక్షణ సభ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి శత జయంతి వేడుకల సందర్భంగా నాలుగు రోజులు గా గోదాగోకులంలో శ్రీమద్రామాయణ మహా యజ్ఞం అత్యంత వైభవంగా జరుగుతుందన్నారు. రఘునాఽథాచార్య తిరు నక్షత్ర పవిత్ర తిథి సందర్భంగా రామాయణంలోని అంశాలపై ప్రవచుకులచే ప్రసంగాలు ఇప్పించడం జరిగిందన్నారు. శుక్రవారం పలువురు జీయర్ స్వాములు, మఠాధిపతుల సమక్షంలో 2 వేల మందికి పైగా భక్తులచే విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహిస్తున్నామన్నారు. శ్రీమద్రామాయణ ప్రవచన యజ్ఞ సమన్వకర్త డాక్టర్ తొగట సురేష్బాబు, హిందీ అధ్యాపకురాలు పార్వతీ, తెలుగు ఉపాధ్యాయిని పసుపులేటి నీలిమ శ్రీమద్రామాయణం విశిష్టతపై ఉపన్యసించారు. సమావేశంలో ప్రయాగ్రాజ్ నుంచి రాఘవ ప్రసన్న జీయర్ స్వామీ, త్రిదండి శఠగోపముని రామానుజ జీయర్ స్వామీజీ, శ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ బృందావన రామానుజ జీయర్ స్వామీజీ, గోదా గోకులం వ్యవస్థాప అధ్యక్షులు మారం నాగరాజు గుప్తు, ట్రస్టీ పల్లెర్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
గోనెగండ్ల: గంజిహళ్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ విజయభాస్కర్ తెలిపిన వివరాల మేరకు.. గ్రా మానికి చెందిన బోయ కండ్ల వెంకటేష్(70)కు భార్య లక్ష్మి, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెంకటేష్కు గత ఆరేళ్ల నుంచి రెండు కాళ్ల బొటన వేళ్లకు కష్టు వ్యాధి వచ్చింది. అలాగే షుగర్ కూడా ఉంది. దీంతో కాళ్లనొప్పి ఎక్కువై మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపం చెంది ఈనెల 15వ తేదీన రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో గడ్డి మందు తాగి అస్వస్థతకు గురయ్యాడు. భార్య, కుమారులు గమనించి ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బుధవారం కర్నూలుకు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక గురువారం తెల్లవారు జామున మృతిచెందినట్లు సీఐ తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
దోపిడీకి ‘టెంకాయ’ కొట్టారు
జూపాడుబంగ్లా: తర్తూరు జాతరలో టెంకాయల విక్రయ దారుడు భక్తులను నిలువునా దోపిడీ చేస్తున్నాడు. వేలం పాటలో నిర్ణయించిన నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయిస్తూ భక్తుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఈనెల ఒకటోవ తేదీన ఆలయ తాత్కాలిక కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి అధ్వర్యంలో టెంకాయలు, లడ్డూ, కొబ్బరి చిప్పల వేలం పాటలు నిర్వహించారు. పెద్దసైజు టెంకాయ ఒకటి రూ.30 చొప్పున విక్రయించాలని ముందుగానే వేలం పాటదారులకు టెంకాయసైజు చూపించి వేలం పాటలు నిర్వహించారు. నందికొట్కూరు పట్టణానికి చెందిన రాజేష్ రూ.5.90 లక్షలకు పాట దక్కించుకున్నాడు. ఈనెల 6 నుంచి 20వ తేదీ వరకు టెంకాయలు విక్రయించేలా నిర్ణయించారు. విక్రయాల్లో కుళ్లిన కొబ్బరికాయకు మరో కాయ భక్తులకు ఇవ్వాలని, చిన్నసైజు టెంకాయలు అధిక ధరలకు విక్రయించరాదనే నిబంధనలు విధించారు. నిబంధనలను అతిక్రమిస్తే వేలం పాట రద్దు చేసి చెల్లించిన డబ్బులు వెనక్కి ఇవ్వమని తేల్చి చెప్పారు. అయినా నిబంధనలు పట్టించుకోకుండా చిన్న సైజ్ టెంకాయలను రూ. 35కు విక్రయిస్తున్నాడు. టెంకాయ కుళ్లిపోతే మరో టెంకాయ ఇవ్వకుండా, అధికధరలకు టెంకాయలు విక్రయిస్తూ భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నాడు. భక్తులు ఫిర్యాదు చేసినా ఆలయ అధికారు లు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. తర్తూరులో కొబ్బరి కాయల విక్రయాల్లో నిబంధనలు బేఖాతర్ చిన్న సైజ్ కాయలు అధిక ధరకు విక్రయం -
కర్ణాటక మద్యం స్వాధీనం
ఆదోని రూరల్: బైక్పై కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ ఎస్.కె.జె.సైదుల్ గురువారం తెలిపారు. మండలంలోని పెసలబండ గ్రామానికి చెందిన నర్సారెడ్డి, కపటి గ్రామానికి చెందిన ఈడిగ హరిచంద్ర బైక్పై 192 కర్ణాటక టెట్రా ప్యాకెట్లను తరలిస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. వారి వద్ద నుంచి బైక్, 192 టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అలాగే మద్యం సరఫరా చేసిన పెసలబండ గ్రామానికి చెందిన గిడ్డయ్యపై కూడా కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిన ట్లు చెప్పారు. ఎవరైనా అక్రమంగా కర్ణాటక మద్యా న్ని సరఫరా చేసినా, అమ్మినా కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. -
సాతనూరులో ఉపాధి కూలీల హాజరుపై విచారణ
కోసిగి: సాతనూరు గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రోజు వారి పనిదినాలకు వెళ్లే కూలీల సంఖ్య హాజరు శాతాన్ని అధికారులు నేరుగా గ్రామానికి వెళ్లి నమోదు చేశారు. బుధవారం సాక్షి దినపత్రికలో ‘ఉపాధి సిత్రాలు’ కథనం ప్రచురితమైన విషయం విధితమే. ఇందులో సాతనూరు గ్రామంలో 60 నుంచి 70 మందితో దొంగ పేర్లతో మస్టర్లులో నమోదు చేస్తున్నారని ఫిర్యాదు ఉన్నాయి. ఇందుకు స్పందించిన అధికారులు బుధ, గురువారాల్లో గ్రామానికి చేరుకుని నేరుగా కూలీలతో పనులు చేస్తున్న చోటుకు వెళ్లి మస్టర్లు పేర్లు పరిశీలించి హాజరు శాతం చేశారు. ఈ సందర్భంగా బుధవారం రోజు 260 మంది హాజరైనట్లు ఏపీఓ వెల్లడించారు. ఫీల్డు అసిస్టెంట్స్, మేటీలు అక్రమాలకు పాల్పడుతు దొంగ పేర్లుతో మస్టర్లు నమోదు చేస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే చింతకుంట గ్రామంలో ఈనెల 13, 14, 15వ తేదీలలో గ్రామం నుంచి 480 నుంచి 680 వరకు కూలీలు పనికి వెళ్లుతున్నట్లు మస్టర్లు పేర్లును ఆన్లైన్లోఎంట్రీ చేశారు. ఓకే ఫొటోతో 8 నుంచి 10 మస్టర్లు వరకు పేర్లు మార్పు చేస్తు హాజరు నమోదు చేశారు. ఈ విషయంపై టెక్నికల్ అసిస్టెంట్ మంజు, ఇన్చార్జ్ ఏపీఓ కాలిక్ను వివరణ కోరగా.. పూర్తి స్థాయిలో విచారణ చేసి తప్పుడు పేర్లుతో మస్టర్లు నమోదు చేసిన వాటిని తొలగించి వాస్తవంగా పని చేసిన వారి మాత్రమే ఆన్లైన్ బిల్లు వచ్చేలా ఎంట్రీ చేస్తామన్నారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
డోన్ టౌన్: చెట్టు కొట్టడానికి వెళ్లిన ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డాడు. మల్యాల గ్రా మానికి చెందిన చంద్రశేఖర్ (45) పట్టణంలో నివాసం ఉంటున్నాడు. గురువారం చంద్రశేఖర్, అతని కుమారుడు రమేష్, మరి కొంత మంది కలిసి పట్టణ సమీ పంలోని యు.కొత్తపల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పొలంలో చెట్టును కొట్టేందుకు కూలీకి వెళ్లారు. కొమ్మ లు కొడుతుండగా పక్కనే ఉన్న విద్యుత్ తీగ తెగి చంద్రశేఖర్ను తాకడంతో విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలో పడిపోయాడు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పొలం యజమాని చంద్ర, కూలీలను పనికి తీసుకెళ్లిన నాగరాజు నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని మృతుడు కుమారుడు పోలీసులు ఫిర్యాదు చేశారు. -
సహజ, కృత్రిమంగా మాగిన పండ్లకు తేడాలు...
రంగు.. ● సహజంగా మాగిన పండు కొంత పసుపు, మరికొంత ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి పండు లోపలి భాగం అంతా పరిపక్వంగా ఉంటుంది. ● కృత్రిమంగా మాగిన వాటిలో పండు మొత్తం ఒకే విధమైన కాంతివంతమైన లేత పసుపు కలిగి ఉంటాయి. పైకి మాగినట్లుగా కనిపించినా లోపల అపరిపక్వంగా ఉండి పుల్లగా ఉంటాయి. వాసన.. ● సహజంగా మాగిన పండు కొంత దూరంలో ఉన్నప్పటికీ కమ్మని మామిడి పండు వాసన వస్తుంది. కృత్రిమంగా మాగిన పండును ముక్కుకు దగ్గరగా ఉంచినప్పుడు మాత్రమే మామిడి పండు వాసన వస్తుంది. రుచి.. ● సహజంగా మాగిన పండులో తగినంత చక్కెర శాతం ఏర్పడుతుంది. కావున తియ్యగా రుచిగా ఉంటుంది. కృత్రిమంగా మాగిన పండులో తగినంత చక్కెర శాతం ఏర్పడక తక్కువ తీపిదనం, రుచి లేకకుండా ఉంటాయి. నిల్వ.. ● సహజంగా మాగిన మామిడి పండ్లు మెత్తగా ఉంటాయి. ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ● కృత్రిమంగా మాగిన వాటిలో పండ్ల తొక్క ముడతలు లేకుండా ఉండి గట్టిగా ఉంటాయి. పండు త్వరగా పాడైపోతుంది. తొక్కపై నల్లని చుక్కలు ఏర్పడతాయి. -
ఈదురుగాలుల బీభత్సం
● ఏడు ఎకరాల్లో నేలకొరిగిన అరటితోట ● రూ. 20 లక్షల నష్టం ప్యాపిలి: మండల పరిధిలోని పీఆర్ పల్లె గ్రామంలో గురువారం సాయంత్రం ఈదురుగాలుల బీభత్సానికి అరటితోట నేలకొరిగింది. గ్రామానికి చెందిన ప్రేమసాగర్ రెడ్డి తనుకున్న 10 ఎకరాల్లో అరటి సాగు చేశాడు. మంచి దిగుబడి రావడంతో మరికొద్ది రోజుల్లో పంటకోసేందుకు సిద్ధమయ్యాడు. అయితే గురువారం సాయంత్రం ఒక్కసారిగా వీచిన ఈదురుగాలులు బీభత్సాన్ని సృష్టించాయి. దీంతో ఏడు ఎకరాల్లో అరటి చెట్లు నేలకొరిగాయి. ఎకరాకు రూ.1.5 లక్షల పెట్టుబడి పెట్టి పంట సాగు చేసినట్లు రైతు వాపోయాడు. ప్రస్తుతం వచ్చిన దిగుబడిని విక్రయిస్తే దాదాపు రూ.20 లక్షల ఆదాయం వచ్చేదని తెలిపాడు. -
కార్బైడ్తో మాగిస్తే శిక్ష...
● ఇథిలీన్ వాయువుతో మంచి ఫలితం ● కాల్షియం కార్బైడ్తో మాగిస్తే ప్రజల ఆరోగ్యంపై ప్రభావం ● జిల్లా ఉద్యానశాఖ అధికారి రామాంజనేయులుకర్నూలు(అగ్రికల్చర్): ఏటా వేసవిలో అందరినీ ఊరించే పండు మామిడి. జూన్ వరకు మార్కెట్లో మామిడిదే పైచేర ుు. సంపన్నులైనా.. సామాన్యులైనా.. మామిడి రుచిని ఆస్వాదించాల్సిందే. బంగినపల్లి (బేనీసా) రకం మామిడి అంటే దానికి ఉన్న డిమాండే వేరు. మామిడి ఇప్పుడిప్పుడే మార్కెట్లో పసుపుపచ్చగా కనువిందు చేస్తోంది. రంగు బాగా ఉంది కదాని తింటే అనారోగ్యాలను కొని తెచ్చుకోవాల్సిందే. ప్రఽమాదకరమైన కాల్షియం కార్బైడ్ను ఉపయోగించి మాగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మామిడి ఆరోగ్యకరమైన పద్ధతుల ద్వారా మాగించాల్సిన అవసరం ఉందని కర్నూలు జిల్లా ఉద్యానశాఖ అధికారి పి.రామాంజనేయులు తెలిపారు. ఈ ఏడాది మామిడి దిగుబడులు ఒక మోస్తరుగా ఉన్నాయని వీటిని ఆరోగ్యవంతమైన పద్ధతిలో మాగించుకుంటే మంచి డిమాండ్, ధర లభిస్తుందని తెలిపారు. మార్కెట్లో మామిడి పండ్లు కొనుగోలు చేసే ముందు సూక్ష్మంగా పరిశీలించాలన్నారు. పండ్లు కొనేటప్పుడు, తినేటప్పు డు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కార్బైడ్కు ప్రత్యామ్నాయంగా పండ్లు మాగించే పద్ధతులను వివరించారు. పండ్లు ఎలా మాగుతాయి... సాధారణంగా పండ్లు పక్వానికి వచ్చినప్పుడు ప్రకృతి సిద్ధంగా పండ్ల నందు ఉత్పత్తి అయ్యే ఇథలీన్ వల్ల మాగడం జరుగుతుంది. ఇథలీన్ పండు పక్వానికి వచ్చినప్పుడు దాని నిర్మాణ, రంగు, రుచి వంటి మార్పులకు ఉపయోగపడుతుంది. ● తప్పని పరిస్థితుల్లో కాయలు మాగబెట్టుటకు ఎథిలిన్ వాయువు 100 పీపీఎం మాత్రమే ఉపయోగించాలి. 100 పీపీఎం ఎథిలిన్ వాయువు 24 గంటలు తగిలేటట్లుగా ఉంచితే 5 రోజులలో సహజత్వానికి దగ్గరగా ఎలాంటి హాని లేకుండా మాగుతాయి. ● ఇంటిలో అయితే మాగని కాయల్లో కొన్ని మాగిన పండ్లను గాలి చొరవ డబ్బాలో ఉంచాలి. పక్వానికి వచ్చిన కాయలను ఒక రూములో వరిగడ్డి లేదా బోదగడ్డిలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల సహజ సిద్ధంగా మాగుతాయి. కొనేటప్పుడు ఇలా చూడాలి.. సీజన్ రాకముందే అపరిపక్వముగా ఉండి కృత్రిమంగా మాగబెట్టిన రంగు వచ్చేటట్లు చేసిన పండ్లు కొనరాదు. రంగు చూసి మోసపోరాదు. సీజన్లో పండ్లు పరిపక్వత చెంది సహజముగా మాగినపండ్లు కొనడం ఆరోగ్యదాయకం. తినేటప్పుడు ఇలా చేయాలి.. పండ్లను ముందుగా ఉప్పు కలిపిన నీటిలో 15–20 నిముషాలు ఉంచి, తిరిగి వాటిని మంచినీటిలో కడిగి తడి లేకుండా తుడిచిన తర్వాత వాటిని తినాలి. లేదా ఫ్రిజ్లో ఉంచుకోవాలి. సాధ్యమైనంత వరకు పండ్ల తొక్కను తీసి తినడం మంచిది. ఆహార సురక్షణ ప్రమాణాల చట్టం–2006 ప్రకారం కార్బైడ్ వాడి పండ్లు మాగబెట్టిన వారికి, అమ్మే వారికి ఒక ఏడాది జైలు శిక్ష, మూడు లక్షల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. కార్బైడ్ వాడిన పండ్లను తినడం వల్ల అనేక వ్యాధులు, ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఈ విషయంశాసీ్త్రయంగా నిర్ధారణ అయింది. -
అక్షరాస్యతలో జిల్లాను అగ్రగామిగా నిలపాలి
కర్నూలు(సెంట్రల్): ఉల్లాస్ పథకంతో నిరక్ష్యరాసులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని జిల్లాను అగ్రగామిగా నిలపాలని డీఆర్వో వెంకట నారాయణమ్మ అధికారులకు సూచించారు. వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉల్లాస్ కార్యక్రమంపై బుధవారం జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని డీఆర్వో తన చాంబర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతేడాది ఉల్లాస్ కార్యక్రమంలో మొదటి విభాగంలో 28,872 మందికి గాను 27,200 మందికి ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసి అసెస్మెంట్ టెస్టుకు హాజరవ్వగా.. అందులో 25,257 మంది పాసైనట్లు తెలిపారు. అదేవిధంగా 2025–26 విద్యాసంవత్సరంలో 30,005 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేలా లక్ష్యాన్ని నిర్ధేశించినట్లు చెప్పారు. ఉల్లాస్ కార్యక్రమం కింద ఏప్రిల్ 16 నుంచి 24వ తేదీ వరకు 9 రోజులపాటు సర్వే మొదలు పెట్టి నిరక్షరాస్యులను గుర్తించాలన్నారు. అనంతరం వారికి మే 5 నుంచి సెప్టెంబర్18వ తేదీ వరకు టీచర్లతో తరగతులు నిర్వహించి సెప్టెంబర్ 21 ఎఫ్ఎల్ఎస్ఏ టెస్టును నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వయోజన విద్య శాఖ డీడీ చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. ఉల్లాస్ కార్యక్రమం పొదుపు గ్రూపు మహిళలు, వంట ఏజెన్సీ నిర్వాహకులు, వాచ్మెన్లు, సహాయకులు, అంగన్వాడీ సహాయకులు, ఉపాధి కూలీల్లో నిర్లక్ష్యరాసులను గుర్తించి చదువు నేర్పించాలన్నారు. సమావేశంలో డీఈఓ శామ్యూల్పాల్, డీఆర్డీఏ ఏపీడీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఇసుక ట్రాక్టర్లు పట్టివేత నందవరం: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఐదు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్ఐ ఎం.కేశవ తెలిపారు. అక్రమంగా ఇసుక తరలింపుపై బుధవారం పోలీసులు దాడులు చేపట్టారు. నాగలదిన్నె గ్రామంలోని తుంగభద్ర నది నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న గోనెగండ్ల మండలం అల్వాల గ్రామానికి చెందిన రెండు ట్రాక్టర్లు, నదికై రవాడి గ్రామానికి చెందిన ట్రాక్టర్, ఎమ్మిగనూరు టౌన్కి చెందిన రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీసులు స్టేషన్కు తరలించారు. నాగలదిన్నెలో ఇసుక రీచ్ లేదని, అక్రమంగా తరలిస్తే ట్రాక్టర్ల ఓనర్లు, డ్రైవర్లపై కేసు నమోదు హెచ్చరించారు. -
దురలవాట్లకు దూరంగా ఉండాలి
కర్నూలు: హోంగార్డులు దురలవాట్లకు దూరంగా ఉండి క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ మహేష్ కుమార్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని హోంగార్డు కార్యాలయంలో బుధవారం రాయలసీమ జిల్లాల (8 జిల్లాలు) హోంగార్డు ఇన్చార్జి పోలీసు అధికారులతో మహేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోంగార్డుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టి వారు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అందరికీ ఒకే విధమైన నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విధి నిర్వహణలో మృతిచెందిన వారి ప్లిలలకు కారుణ్య నియామకాల ఉద్యోగాలు, ఎక్స్గ్రేషియా త్వరితగతిన పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. హోంగార్డు ఇన్చార్జిలు, ఆర్ఐలు వారి విధులు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ రాఘవేంద్ర, హోంగార్డ్స్ డీఎస్పీలు కేవీవీ ఎస్వీ ప్రసాద్, కేజేఎం చిరంజీవి, భాస్కర్ రావు, ఆర్ఐ జావెద్, హోంగార్డ్స్ ఆర్ఐలు సోమశేఖర్ నాయక్, పోతల రాజు తదితరులు పాల్గొన్నారు. సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ -
మద్యం బాబులకు కిక్కు దిగేలా జరిమానా
కర్నూలు: పోలీసు తనిఖీల్లో పట్టుబడిన మందుబాబులకు కిక్కు దిగేలా న్యాయస్థానం జరిమానా విధిస్తోంది. మద్యం మత్తులో వాహనాలు నడపటం వల్లే ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కవయ్యాయని భావించిన పోలీసులు జిల్లా అంతటా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు విస్తృత్తం చేశారు. నిబంధనలు పాటించకుండా మద్యం సేవించి వాహనం నడిపిన వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నారు. గతంలో ఒక్కొక్కరికి రూ.3 వేలు జరిమానా విధించిన న్యాయస్థానం మందుబాబుల్లో మార్పు రావడం లేదని గుర్తించి రూ.10 వేలు జరిమానా విధించారు. మూడవ పట్టణ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్లో ఐదుగురు మందు బాబులు పట్టుబడ్డారు. బుధవారం వారిని కోర్టులో హాజరుపర్చగా ఒక్కొక్కరికి రూ.10 వేలు జరిమానా విధిస్తూ కర్నూలు జేఎఫ్సీఎం కోర్టు జరిమానా విధించింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజాశాంతికి భంగం కలిగించిన 18 మందిపై ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరుపర్చగా ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా విధించింది. ఒక్కొక్కరికి రూ.10 వేలు విధిస్తూ న్యాయస్థానం తీర్పు -
ఉన్నత పదవిని కట్టబెట్టిన పార్టీని కాదని, అధికారం కోసం బీజేపీ పంచన చేరిన ఆదోని మునిసిపల్ చైర్పర్సన్ బోయ శాంతకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు గుణపాఠం చెప్పారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఆమెను పదవి నుంచి దింపేశారు. ఆ పార్టీకే చెందిన బోయ లోకేశ్వరిని చైర్
వైఎస్సార్సీపీలో గెలిచి బీజేపీ పంచన చేరిన ఆదోని మునిసిపల్ చైర్పర్సన్ శాంత ● ఎమ్మెల్యే పార్థ సమక్షంలో బీజేపీ కండువా వేసుకున్న శాంత భర్త నాగేంద్ర ● పార్టీకి ద్రోహం చేయడంపై కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానం ● శాంతకు వ్యతిరేకంగా 36 ఓట్లు, విశ్వాసం కోల్పోయిన వైనం ● కొత్త చైర్పర్సన్గా లోకేశ్వరిని రేపు ఎన్నుకోనున్న కౌన్సిలర్లు ● ఫిరాయింపు రాజకీయాలకు చెంప పెట్టుగా ఆదోని కౌన్సిలర్లు ● బీజేపీ ప్రలోభాలకు లొంగకుండా నిలిచిన కౌన్సిలర్లకు వైఎస్సార్సీపీ అభినందనలు ఆదోని టౌన్: ఆదోని మునిసిపల్ ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీకి మునిసిపల్ పీఠం దక్కితే రెండున్నరేళ్లు బోయ శాంత, ఆ తర్వాత లోకేశ్వరి కొనసాగాలని అప్పటి ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఎన్నికలకు వెళ్లారు. మొత్తం 42 వార్డులలో 41 వార్డులు వైఎస్సార్సీపీ, ఒక వార్డు టీడీపీ దక్కించుకున్నాయి. మెజార్టీ స్థానాలు దక్కించుకున్న వైఎస్సార్సీపీ తరపున శాంత మునిసిపల్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. రెండున్నరేళ్ల తర్వాత రాజీనామా చేయాల్సి ఉంది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ వ్యవహారంపై పార్టీ దృష్టి సారించలేదు. ఎన్నికల తర్వాత ఒప్పందం ప్రకారం రాజీనామా చేయాలని శాంతకు, ఆమె భర్త నాగేంద్రకు సాయిప్రసాద్రెడ్డి సూచించారు. వైఎస్సార్సీపీ అధికారం కోల్పోవడం, కూటమి అధికారంలోకి రావడంతో అధికార కాంక్షతో నాగేంద్ర ఎమ్మెల్యే పార్థసారథి సమక్షంలో బీజేపీ కండువా వేసుకున్నారు. ఆ తర్వాత మరో నలుగురు కౌన్సిలర్లను బీజేపీలోకి చేర్చుకున్నారు. వైఎస్సార్సీపీకి నాగేంద్ర, శాంత దూరంగా ఉంటూ ఎమ్మెల్యే కనుసన్నల్లో నడుస్తున్నారు. ఆదోని అభివృద్ధికి పాటుపడకుండా ఎమ్మెల్యే కనుసన్నల్లో నడిచారు. ఈక్రమంలో కౌన్సిలర్లు మార్చి 19న కలెక్టర్ రంజిత్బాషాను కలిసి శాంతపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. అవిశ్వాస తీర్మానం నెగ్గిన వైఎస్సార్సీపీ బుధవారం ఉదయం ప్రత్యేక బస్సులో కౌన్సిలర్లు ఉదయం 10.30 గంటలకు కౌన్సిల్ హాలుకు చేరుకున్నారు. ఎన్నికల అధికారి సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ రాగానే అవిశ్వాస తీర్మానంపై ప్రకటన చేశారు. శాంతపై అవిశ్వాస తీర్మానాన్ని కౌన్సిలర్ బాలజీ యాదవ్ ప్రవేశపెట్టారు. దీన్ని మరో కౌన్సిలర్ సందీప్రెడ్డి బలపరిచారు. ఆ తర్వాత 35 మంది కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే మధుసూదన్ మొత్తం 36మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేతులెత్తారు. దీంతో చైర్పర్సన్ బోయ శాంతపై అనర్హత వేటు వేస్తున్నట్లు సబ్ కలెక్టర్ ప్రకటించారు. త్వరలోనే నూతన చైర్పర్సన్ ఎన్నిక జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ ఎం.కృష్ణ తెలిపారు. ఆదోని అభివృద్ధి కోసమే అవిశ్వాస తీర్మానం ఆదోని అభివృద్ధి కోసం పలు అభివృద్ధి పనులు కౌన్సిల్ దృష్టికి, చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లినా శాంత నిర్లక్ష్యం చేశారని, అందుకే తాము అవిశ్వాసం ప్రవేశపెట్టామని మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు, కౌన్సిలర్లు సందీప్రెడ్డి, నరసింహులు, రాజేశ్వర్రెడ్డి, నాగరాజ్, ఎన్.పి.లక్ష్మిదేవి, లోకేశ్వరి తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యేతో కుమ్మకై ్క వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ పాలకవర్గాన్ని ఛిన్నాభిన్నం చేయాలనే లక్ష్యంతో ఉన్న చైర్పర్సన్పై తాము అవిశ్వాస తీర్మానం పెట్టి పదవి నుంచి తొలగించినట్లు వారు తెలిపారు. ఇదిలా ఉండగా ఆదోని కొత్త చైర్పర్సన్గా బోయ లోకేశ్వరిని కౌన్సిలర్లు ఎన్నుకోనున్నారు. రేపు సబ్ కలెక్టర్, మునిసిపల్ కమిషనర్ ఈ ఎన్నికను నిర్వహించనున్నారు. కౌన్సిలర్లకు సెల్యూట్ బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగన్మోహన్రెడ్డిపై, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీపై విధేయత చూపి పార్టీ వైపు నిలబడిన 35మంది కౌన్సిలర్లను జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి అభినందించారు. కౌన్సిలర్ల వ్యక్తిత్వం పార్టీలో పదవులు దక్కించుకున్న ప్రతీ వ్యక్తికి ఆదర్శమని కొనియాడారు. -
డీజిల్ దొంగలు దొరికారు
● 11 మంది అరెస్ట్.. మరో ముగ్గురు పరారీ ● రూ.10.35 లక్షల నగదు, 350 లీటర్ల డీజిల్, నాలుగు వాహనాలు స్వాధీనం ● ముఠా సభ్యులంతా తెలంగాణ వాసులే ఆదోని అర్బన్: గత ఎనిమిదేళ్ల నుంచి డీజిల్ చోరీని వృత్తిగా ఎంచుకున్న ముఠా సభ్యులు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డారు. బుధవారం సిరుగుప్ప చెక్ పోస్టు వద్ద అనుమానాస్పదంగా ఉన్న 11 మంది దొంగలను ఆదోని వన్టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా డీజిల్ దొంగలుగా తేలింది. ఈ మేరకు ఆదోని డీఎస్పీ హేమలత, ఆదోని వన్టౌన్ సీఐ శ్రీరామ్ మీడియా ఎదుట నిందితులను హాజరుపరిచారు.. తెలంగాణ రాష్ట్రం నారాయణ పేట ప్రాంతానికి చెందిన రమేష్నాయక్ అలియాస్ చోటా నాయక్, పాండు నాయక్, పాపా నాయక్, రవి నాయక్, మహేష్ నాయక్, కిషన్ నాయక్, పాల్తియారవి నాయక్ అలియాస్ బిల్లా రవి, సభావత్ రవి నాయక్, చావన్సురేష్ నాయక్ అలియాస్ దేశముదురు, వర్త కిషన్ నాయక్, రవికుమార్ రాథోడ్లు కలిసి డీజిల్ చోరీని వృత్తిగా ఎంచుకున్నారు. దొంగలించిన డీజిల్ను ఇతర ప్రాంతాల్లో విక్రయించగా వచ్చిన డబ్బుతో జల్సాలకు పాల్పడేవారు. డీజిల్ చోరీకి నాలుగు వాహనాలను వినియోగిస్తూ ఎక్కడైనా పార్కింగ్లో లారీలను ఆపిన చోటుకు వాహనాల్లో వెళ్లి డీజిల్ దొంగతనం చేసి కార్లలో తరలించేవారు. ఇలా మొత్తం డీజిల్ దొంగతనంలో 10,620 లీటర్లు దొంగతనం చేసినట్లు విచారణలో తేలింది. గత నెల మార్చి 11వ తేదీన సర్దార్బాషా, ఈనెల 8వ తేదీన మైల రామకృష్ణ, సయ్యద్సమీర్ వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశామన్నారు. నెల రోజులుగా ఈ ముఠాను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామన్నారు. బుధవారం అందిన సమాచారం మేరకు సీఐ శ్రీరామ్, సిబ్బందితో కలిసి స్థానిక సిరుగుప్ప చెక్పోస్టు వద్ద 11 మందిని అరెస్టు చేశారని తెలిపారు. వారి నుంచి రూ.10,30,140 నగదు, 350 లీటర్ల డీజిల్, నాలుగు వాహనాలు (కార్లు), 10 ఖాళీ క్యాన్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. వీరిపై వన్టౌన్ పోలీస్స్టేషన్లో నాలుగు, టూటౌన్ పోలీస్స్టేషన్లో ఒకటి, ఆలూరు పోలీస్స్టేషన్లో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయన్నారు. కేసును త్వరితగతిన చేధించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు. -
మాదక ద్రవ్యాల దుష్ఫలితాలపై విస్తృత ప్రచారం
● పోలీస్ స్టేషన్లు, గ్రామాల్లో క్యూఆర్ కోడ్ స్కానర్ వాల్ పోస్టర్లు కర్నూలు: మాదక ద్రవ్యాల దుష్ఫలితాల గురించి జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాలైన డ్రగ్స్, గంజాయి వంటివి ఆయా ప్రాంతాల్లో అక్రమంగా పండిస్తున్నా, విక్రయిస్తున్నా దుర్వినియోగానికి పాల్పడుతున్నా ఆ సమాచారం తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్ను పోలీస్స్టేషన్లు పబ్లిక్ ప్రదేశాల్లో అతికించి ప్రజలు, యువకులు మొబైల్స్ నుంచి క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేయించి సమాచారం సేకరిస్తున్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత ఆయా ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల గురించి సమాచారం తెలిసినట్లయితే క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా తెలియజేయాలని ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. పిడుగు పడి మహిళ మృతి చిప్పగిరి: పిడుగు పడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన ఏరూరు గ్రామంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రజియాబీ (50) గ్రామ సచివాలయం పక్కన ఉన్న పొలాల్లో ఆరబోసిన మిరపకాయలు సంచులకు ఎత్తుతుండగా ఒక్క సారిగా ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షం పడింది. అదే సమయంలో సమీపంలో పిడుగు పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఐదుగురు కుమార్తెలు, కుమారుడు, భర్త ఉన్నారు. తహసీల్దార్ ఇజాజ్ అహ్మద్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. బియ్యం గోడౌన్ సీజ్ పాణ్యం: మండల కేంద్రం పాణ్యం సమీపంలోని గోరుకల్లు తండాలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచిన లక్ష్మానాయక్కు చెందిన గోడౌన్ను సీజ్ చేశారు. బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో గోరుకల్లు తండాలోని గోడౌన్ను ఎంపీ శబరి ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి, రెవెన్యూ అధికారులతో చేరుకుని తనిఖీ చేశారు. దాదాపు 500 బస్తాల వరకు రేషన్ బియ్యం ఉండటంతో వెంటనే గోడౌన్, బియ్యాన్ని సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారిలో పడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. క్షేత్ర స్థాయిలో రెవెన్యూ, సివిల్ సప్లయి అధికారుల పర్యవేక్షణ లోపించడంతో బియ్యం బ్లాక్ మార్కెట్కు తరులుతుందన్నారు. అనంతరం మేకల బండ వద్ద ఉన్న రేకుల షెడ్డును పరిశీలించారు. అక్కడి నుంచి తమ్మరాజుపల్లె సమీపంలో ఉన్న రైస్మిల్లును తనిఖీ చేశారు. ఎంపీ వెంట సివిల్ సప్లయి డైరెక్టర్ మహేష్ నాయుడు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
వక్ఫ్ బిల్లుపై సుప్రీం కోర్టులోనే తేల్చుకుంటాం
కర్నూలు(టౌన్): ముస్లింల ప్రాథమిక హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వక్ఫ్ బిల్లును సుప్రీం కోర్టులోనే తేల్చుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ అన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తాను మొదటి, రెండవ పిటిషన్లు వేశామన్నారు. బుధవారం స్థానిక పాతబస్తీలోని రాయల్ ఫంక్షన్ హాలులో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లిం సమాజాన్ని నిర్వీర్యం చేయాలని దేశంలో బీజెపీ కూటమి కంకణం కట్టుకుందన్నారు. దేశ వ్యాప్తంగా ఈ బిల్లును ముస్లిం సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, కడప, కర్నూలు వంటి అనేక జిల్లాలో పెద్ద ఎత్తున్న ఆందోళనలు ప్రారంభమయ్యాయన్నారు. రాబోయే రోజుల్లో మరింత ఉద్ధృతం అవుతాయన్నారు. వక్ఫ్ ఆస్తులను కొట్టేయాలని, భూములను స్వాధీనం చేసుకొవాలన్న కుట్ర జరుగుతోందన్నారు. తాజాగా కేంద్రం ప్రతిపాదించిన వక్ఫ్ బిల్లులో ఇతర మతస్థులను చేర్చడం వెనుక ఉద్దేశమేంటని ప్రశ్నించారు. బిల్లుకు పార్లమెంటులో 232 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయంటే వ్యతిరేకించినట్లు కాదా అన్నారు. ముస్లింల ఓట్లు వద్దన్న బీజెపీతో చంద్రబాబు దోస్తీ రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, బహిరంగంగా ముస్లింల ఓట్లు వద్దన్న భారతీయ జనాతా పార్టీతో చంద్రబాబు నాయుడు దోస్తీ కట్టారన్నారు. బిల్లుకు ఆమోదం వ్యక్తం చేసిన చంద్రబాబు సిగ్గు లేకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం రాజ్యసభలో ఆమోదం వ్యక్తం చేసినట్లు చెప్పడం దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. మీ మద్దతు లేకుండా బిల్లు పాస్ అయ్యేదా అన్నారు. తమ పార్టీ నుంచి ఎంపీ వైవీ.సుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తూ మాట్లాడిన విషయం కనిపించలేదా అని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడు హఫీజ్ఖాన్ -
డ్రోన్ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
కర్నూలు కల్చరల్: యువత డ్రోన్ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని క్లస్టర్ యూనివర్సిటీ ఇన్చార్జ్ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ వి. వెంకట బసరావు అన్నారు. హైదరాబాద్ ఐఐటీ, తిహాన్ ఫౌండేషన్, కర్నూలు ఐఐటీ డీఎం ఆధ్వర్యంలో క్లస్టర్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధిపై శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం వీసీ ప్రారంభించి మాట్లాడారు. నేటి తరం విద్యార్థులు ప్రతి ఒక్కరు డ్రోన్ నైపుణ్యం కలిగి ఉండడం వల్ల మంచి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయన్నారు. వందల ఎకరాల్లో డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన కంపెనీని స్థాపించడం ఇక్కడి విద్యార్థులకు వరమన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈనెల 20వ తేదీ వరకు జరిగే శిక్షణలో 50 మంది ఎస్సీ విద్యార్థులకు ‘రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్ –డ్రోన్స్’ అనే అంశంపై, ఇతర కులాలకు చెందిన 50 మంది విద్యార్థులకు ‘బూట్ క్యాంప్ డ్రోన్ టెక్నాలజీ’ అనే అంశంపై శిక్షణ ఉంటుందన్నారు. వర్సిటీ సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీఎస్ కుమార్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ దేవికా రాణి మాట్లాడారు. డాక్టర్ మొహమ్మద్ వాయిజ్, డాక్టర్ ఎం.పద్మావతి, లక్ష్మణ గుప్త శిక్షణ కన్వీనర్లుగా వ్యవహరించారు. వర్సిటీ డీన్ అక్తర్ బాను, ట్రిపుల్ ఐటీ అధ్యాపకులు డాక్టర్ పి.కిషోర్, తదితరులు పాల్గొన్నారు. -
ఆయకట్టులో పారింది కన్నీళ్లే!
సమావేశాల్లో ఎవరేమన్నారంటే ... ● దివ్యాంగుల పెన్షన్ల వెరిఫికేషన్ వల్ల ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయి. గతంలో ఇచ్చిన సదరం సర్టిఫికెట్ ఆధారంగానే పెన్షన్లు మంజూరు చేశారు కదా, ఇప్పుడెందుకు వెరిఫికేషన్ చేస్తున్నారు.మేజర్, మైనర్ మినరల్స్కు ఒకే రకమైన నిబంధనలు విధించడం వల్ల మైనర్ మినరల్స్ చాలా ఇబ్బంది పడుతున్నాయి. – జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి ● రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది కావస్తోంది. కొత్త పెన్షన్లు ఎప్పుడిస్తారు. – సుంకన్న, వెల్దుర్తి జెడ్పీటీసీ ● పచ్చ చొక్కాల వారికే మినీ గోకులాలను మంజూరు చేస్తున్నారు. పశువులు ఉన్న రైతులకు మంజూరు చేస్తే బాగుంటుంది. – బి.పులికొండనాయక్, తుగ్గలి జెడ్పీటీసీ ● ముచ్చుమర్రి నుంచి ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్కు నీటిని నందికొట్కూరు ఊరుబయట నుంచి తీసుకువెళ్లాలి. ఊర్లో పైప్లైన్లు వేస్తే తాగునీటికి సంబంధించిన సిస్టమ్ డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంది. ట్రాఫిక్, వ్యాపారాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. – పి.జగదీశ్వరరెడ్డి, జూపాడుబంగ్లా జెడ్పీటీసీ ● గడివేముల–బూజనూరు రోడ్డును బాగు చేయండి. – గడివేముల జెడ్పీటీసీ ఆర్బీ చంద్రశేఖర్రెడ్డికేసీ, తెలుగుగంగ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో అందని నీరు ● జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో చైర్మన్ పాపిరెడ్డి ● ఉమ్మడి జిల్లా తాగునీటి అవసరాలకు రూ.1.54 కోట్ల జెడ్పీ నిధులు ● జెడ్పీ ముందున్న హోర్డింగ్స్ తొలగింపుకు ఆమోదం ● కోరం లేక 4, 5, 6 స్థాయీ సంఘాలు వాయిదాకర్నూలు(అర్బన్): ‘‘కేసీ కెనాల్, తెలుగుగంగ నుంచి పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయకపోవడం వల్లే ఆయకట్టు రైతులు నష్టపోయారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కేసీ కెనాల్ కింద లక్ష ఎకరాలకు, తెలుగుగంగ కింద 84 వేల ఎకరాలకు నీరిచ్చామని అధికారులు చెబుతున్నారు. ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు అందిస్తే రైతులు ఎందుకు ఇబ్బంది పడతారు. రైతుల కష్టాలను పత్రికలు ప్రధానంగా ప్రచురించాయి. ఆ కథనాలు అవాస్తవమా?’’ అని జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేఆర్ఎంబీ నిబంధనల మేరకు కొంత ఒడిదుడుకుల మధ్య నీటిని అందించామని ఇరిగేషన్ అధికారులు చెప్పిన సమాధానం పట్ల చైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ మినీ సమావేశ భవనంలో జరిగిన స్థాయీ సంఘ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగుల కంటే తక్కువ ఉన్న సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వం పవర్ జనరేట్ చేయరాదనే అంశాన్ని కేఆర్ఎంబీ సమావేశంలో ప్రభుత్వం ద్వారా ఎందుకు చెప్పించలేకపోయారని ప్రశ్నించారు. జూరాల నుంచి 1700, సుంకేసుల నుంచి 300 టీఎంసీలు (మొత్తం 2 వేల టీఎంసీలు) శ్రీశైలానికి వెళ్లినా, మనం ఉన్న రిజర్వాయర్లలో ఎందుకు నీటిని నిల్వ చేసుకోలేకపోయామరు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గడిచిన స్థాయీ సంఘ సమావేశాల్లో చర్చించిన నేపథ్యంలోనే గాజులదిన్నె ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడం వల్ల కోడుమూరు, తదితర ప్రాంతాల రైతులు, ప్రజలకు ఎంతో ఉపయోకరంగా ఉందన్నారు. తాగునీటి అవసరాలకు జెడ్పీ నిధులు రూ.1.54 కోట్లు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రస్తుత వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు జిల్లా పరిషత్ నుంచి రూ.1.54 కోట్లను మంజూరు చేస్తున్నట్లు జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి 46 పనులను గుర్తించి మంజూరు చేశామన్నారు. ఈ పనులను మే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లను ఆయన కోరారు. మొత్తం పీఆర్, ఆర్డబ్ల్యూఎస్కు 352 పనులు కేటాయించామని, ఇందులో ఇప్పటి వరకు 21 పూర్తయ్యాయని, మిగిలిన 331 పనులను జూన్, జూలై నాటికి పూర్తి చేయాలన్నారు. జెడ్పీ ముందున్న హోర్డింగ్స్ తొలగింపునకు ఆమోదం జిల్లా పరిషత్ భవనం ముందు భాగాన ఉన్న హోర్డింగ్స్ను తొలగించేందుకు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ హోర్డింగ్స్కు సంబంధించి ఒక చదరపు అడుగు రూ.212 ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇదే ఏడాది జూన్ 30వ తేదీ వరకు చెల్లించాలని జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో తీర్మానం చేశారు. అయితే హోర్డింగ్స్ ఏజెన్సీ ఒక చదరపు అడుగుకు రూ.100 మాత్రమే చెల్లించగలమని చెప్పడం వల్ల ఈ నెల 16వ తేది వరకు ఒక చదరపు అడుగుకు రూ.212 ప్రకారం చెల్లించి హోర్డింగ్స్ తీసివేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కోరం లేక 4, 5, 6 స్థాయీ సంఘ సమావేశాలు వాయిదా జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించేందుకు అవసరమైన కోరం (సభ్యులు) లేకపోవడం వల్ల విద్య, వైద్యం, మహిళా శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం ( 4,5,6 ) శాఖలకు సంబంధించిన స్థాయి సంఘ సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి ప్రకటించారు. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల గైర్హాజరుజిల్లా పరిషత్ పరిధిలోని ఏడవ స్థాయీ సంఘంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన్రెడ్డి, ఒకటవ స్థాయీ సంఘంలో న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఉన్నారు. మిగిలిన ఐదు స్థాయీ సంఘాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్నారు. అయితే బుధవారం జరిగిన జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలకు ప్రజా ప్రతినిధులతో పాటు మెజారిటీ జెడ్పీటీసీ సభ్యులు కూడా హాజరు కాకపోవడం గమనార్హం. -
ఉమ్మడి జిల్లాకు 80 డ్రోన్లు
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాకు 80 డ్రోన్లు మంజూరయ్యాయి. కర్నూలు జిల్లాకు 40, నంద్యాల జిల్లాకు 40 ప్రకారం కేటాయించారు. టీడీపీ కార్యకర్తలతో ఏర్పాటైన ఎఫ్ఎంబి కిసాన్ డ్రోన్ గ్రూపులకు మంజూరు చేస్తోంది. వీటిని సరఫరా చేసేందుకు డ్రోగో, విహంగ కంపెనీలను ఎంపిక చేసింది. డ్రోగో కంపెనీ డ్రోన్ పూర్తి ధర రూ.9.80 లక్షలు, విహంగ కంపెనీ డ్రోన్ ధర రూ.9.81 లక్షలు ఉంటుంది. ఇందులో ప్రభుత్వం 80 శాతం సబ్సిడీ ఇస్తుంది. అయితే 50 శాతం మొత్తానికి బ్యాంకులు రుణాలు ఇస్తాయి. మిగిలిన 50శాతం కిసాన్ డ్రోన్ గ్రూపులు భరిస్తాయి. ఎఫ్ఎంబీ కిసాన్ డ్రోన్ గ్రూపులో 5గురు సభ్యులు ఉంటాయి. గ్రూపు సభ్యులు పైలెట్గా ఎంపిక చేసుకొన్న వారికి ప్రభుత్వం ఇప్పటికే శిక్షణ ఇచ్చింది. డ్రోన్ల సామర్థ్యం 25 లీటర్లు ఉంటుందని వ్యవసాయ అధికారులు తెలిపారు. సీయూలో పీజీ పరీక్షలు కర్నూలు కల్చరల్: క్లస్టర్ యూనివర్సిటీ (సీయూ) పరిధిలో పోస్ట్గ్రాడ్యుయేషన్ (పీజీ) నాల్గో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలను బుధవారం వర్సిటీ ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ వి. వెంకట బసరావు పరిశీలించారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. రిజిస్ట్రార్ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ నాగరాజ్ శెట్టి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ బాల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ పాలక వర్గాల ఏర్పాటుకు ప్రతిపాదనలు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని ఎమ్మిగనూరు, పత్తికొండ వ్యవసాయ మార్కెట్ కమిటీలకు త్వరలో పాలక వర్గాలు ఏర్పాటు కానున్నాయి. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇది వరకు కూటమి ప్రభుత్వం మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తి స్థాయి పాలక వర్గాల ఏర్పాటుకు మార్కెటింగ్ శాఖ ప్రతిపాదనలు పంపింది. ఎమ్మిగనూరు మార్కెట్ కమిటీకి కురువ మల్లేష్, పత్తికొండ మార్కెట్ కమిటీకి ఎస్.నబీసాహెబ్ చైర్మన్లుగా నియమితులు కానున్నారు. వైస్ చైర్మన్, పాలక వర్గం సభ్యులతో జీవోల కోసం ప్రతిపాదనలు పంపినట్లు మార్కెటింగ్ శాఖ ఏడీ నారాయణ మూర్తి తెలిపారు. జల్జీవన్ పనుల పరిశీలన మద్దికెర: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.84 కోట్ల నిధులతో మద్దికెరలో చేపట్టిన జల్జీవన్ మిషన్ పనులను కేంద్ర బృందం సభ్యుడు మాదేశ్వరన్ బుధవారం పరిశీలించారు. ట్యాంకు త్వరలో పనులు పూర్తి చేసి నీటిని అందిస్తారని తెలిపారు. గ్రామీణ ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడకుండా జల్జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంజూరు చేస్తోందని తెలిపారు. ఈయన వెంట ఆర్డబ్ల్యూఎస్ డీఈ ఎండీ ఖాన్, ఏఈ మయాంక్, ఈఓఆర్డీ మద్దిలేటిస్వామి, సచివాలయ ఏఈలు విష్ణు, చంద్రశేఖర్, బండారి ఆంజనేయులు ఉన్నారు. -
రైతుబజార్లు, మార్కెట్ యార్డుల్లో తనిఖీలు
కర్నూలు(అగ్రికల్చర్): రైతుబజార్లు, కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వివిధ శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. జిల్లా జాయింట్ కలెక్టర్ నవ్య ఆదేశాల మేరకు జిల్లా పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ, తూనికలు, కొలతల శాఖ, ఫుడ్ సేప్టీ అధికారులు బుధవారం తనిఖీలు చేశారు. సి.క్యాంపు, అమీన్ అబ్బాస్నగర్, కొత్తపేట రైతుబజర్లలో కాటాలను పరిశీలించారు. ఫుడ్ సేప్టీ అధికారులు మామిడి పండ్లలో శ్యాంపుల్స్ సేకరించారు. రైతుబజార్లలోని దుకాణాల్లో కూడా వంట నూనె లు, ఇతర వస్తువుల నాణ్యత ప్రమాణాలను కూడా తనిఖీ చేసి శ్యాంపుల్స్ తీశారు. మార్కెట్ యార్డులో వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలకు సంబంధించి కాటాలను పరిశీలించారు. కాల్షి యం కార్బైడ్తో మాగించిన మామిడి మార్కెట్లోకి వస్తున్న నేపథ్యంలో ఫుడ్ సేప్టీ అధికారులు శ్యాంపుల్స్ సేకరించారు. నగరంలోని వివిద వాటర్ప్లాంట్లతో కూడా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో డీఎస్వో రాజారఘువీర్, మార్కెటింగ్ శాఖ ఏడీ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఏడీఏ వేదమణి గిన్నీస్ రికార్డు
● గంటలో 1,046 సరళీ స్వరాలు ఆలపించి ఇన్స్ట్రాగామ్లో అప్లోడ్ కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా వ్యవసా య వనరుల కేంద్రంలో ఏడీఏగా పనిచేస్తున్న వేదమణికి సంగీతంలో అరుదైన గౌరవం లభించింది. చిన్నతనం నుంచే సంగీతంపై మక్కువ పెంచుకున్న ఆమె.. హల్లెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకుడు అగస్టీన్ దగ్గర ఏడాది నుంచి ఆన్లైన్లో సంగీతం నేర్చుకున్నారు. ఈ క్రమంలో అనేక క్రైస్తవ పాటలను చర్చిల్లో పాడటమే కాకుండా సొంతంగా పాటలు రాసి ఆలపించారు. గత ఏడాది డిసెంబరు 1వ తేదీన కేవలం ఒక గంట సమయంలో 1,046 మంది సరళీ స్వరాలు ఆలపించి వీడియోలను ఇన్స్ట్రాగామ్లో అప్లోడ్ చేశారు. ఇందుకు గిన్నీస్ వరల్డ్ రికార్డు వారు సర్టిఫికెట్, పతకం బహుకరించారు. వీటిని ప్రపంచ క్రైస్తవ బోధకులు అనిల్కుమార్ ఈ నెల 14న హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో అందజేశారు. గిన్నీస్ రికార్డు లభించడం పట్ల ఆనందంగా ఉందని ఏడీఏ వేదమణి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆమెను అభినందించారు. -
టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
● సొంత పార్టీ నాయకులే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ● నందివర్గం పోలీసులు కొట్టడంతో మనస్తాపం కొలిమిగుండ్ల: బెలుం శింగవరానికి చెందిన టీడీపీ కార్యకర్త వరదరాముడు మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వారం రోజుల క్రితం బనగానపల్లె మండలం నందవరంలో విందు ఉండటంతో అక్కడికి వెళ్లాడు. అక్కడే బెలుం శింగవరంకు చెందిన టీడీపీ నాయకులతో వాగ్వావాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై వాళ్లు నందివర్గం పోలీస్ స్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం పోలీసులు స్టేషన్కు పిలిపించి వరదరాముడిని కొట్టడంతో కాళ్లకు గాయాలయ్యాయి. తర్వాత వారం రోజుల పాటు ఊర్లోకి వెళ్లకూడదని హెచ్చరించారు. అప్పటి నుంచి నంద్యాల సమీపంలోని అత్తగారింట్లో ఉంటున్నాడు. అంతటితో ఆగకుండా టీడీపీ నాయకులు మళ్లీ కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేశారు. నందివర్గం తరహాలో ఇక్కడ పోలీసులు తమను కొడతారనే భయాందోళన చెందాడు. మంగళవారం అత్తగారి ఊరు నుంచి వస్తూ మార్గమధ్యలో సంజామల మండలం ఆకుమల్లలో క్రిమిసంహారక మందు కొనుగోలు చేసి బెలుం శింగవరానికి చేరుకున్నాడు. సొంత పొలంలోకి వెళ్లి ఫేస్బుక్ లైవ్లో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి మందు తాగి చెట్టు కింద పడిపోయాడు. లైవ్లో చూసిన గ్రామస్తులు కొలిమిగుండ్ల సీఐ రమేష్బాబుకు సమాచారం ఇచ్చారు. బాధితుడి సెల్ ఫోన్ ఆధారంగా సాంకేతిక సాయంతో లోకేషన్ గుర్తించి సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అప్పటికి అపస్మారక స్థితిలో ఉండగా చికిత్స కోసం అవుకు సీహెచ్సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు కర్నూలుకు తీసుకెళ్లారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు శంకరరెడ్డి, రామ్మోహన్, వెంకటసుబ్బయ్య వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించానని బాధితుడు ఫిర్యాదు చేశారు. పూర్తి స్థాయిలో విచారణ చేపడుతామని సీఐ పేర్కొన్నారు. -
నందుల పంట పండించిన కళాకారులు
కర్నూలు లలిత కళా సమితి, నంద్యాల కళారాధన సంస్థలు కొత్త తరహాలో నాటకాలను రూపొందించి ప్రదర్శిస్తూ నంది పురస్కారాలను కై వసం చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు రెండు సంస్థలు సుమారు 45 దాకా నంది పురస్కారాలు వరించి ఉంటాయి. ఇందులో 20 దాకా బంగారు నంది పురస్కారాలు ఉండటం విశేషం. లలిత కళా సమితి ఆధ్వర్యంలో రాయలసీమ ముఠా కక్షలపై పులిస్వారి నాటకం 130 ప్రదర్శనలు ఇచ్చి సంచలనం సృష్టించింది. ఇదే సంస్థ అత్యధికంగా 38 నంది అవార్డులు సాధించింది. జిల్లా కళాకారులు అత్యుత్తమ నటనా ప్రతిభతో నంది అవార్డులతో పాటు జాతీయ స్థాయి గరుడ, కందుకూరి పురస్కారాలు కై వసం చేసుకున్నారు. -
తెలుగు నాట కళా వైభవం!
● నాటక సమాజాలతో సామాజిక చైతన్యం ● రంగ స్థలానికి వన్నె తెచ్చిన ఉమ్మడి జిల్లా కళాకారులు ● సంచలనం సృష్టించిన పులిస్వారీ నాటకం ● నేడు తెలుగు నాటక రంగ దినోత్సవం ● కందుకూరి వీరేశలింగం జయంతి పల్లె సీమల్లో 1960 నుంచి1990 వరకు నాటక కళ ఒక మహా వైభవాన్ని కలిగి ఉండేది. ప్రతి పల్లెలో దసరా, సంక్రాంతి, తిరునాళ్ల సందర్భంగా పౌరాణిక నాటక ప్రదర్శనలు వైభవోపేతంగా నిర్వహించే వారు. ఉమ్మడి జిల్లాలో తెలుగు నాటకం ఒక వెలుగు వెలిగింది. జిల్లాలోని లొద్దిపల్లె అల్లాబక్ష్, వెల్దుర్తి వెంకటనర్సు నాయుడు, రజనీబాయి లాంటి రంగస్థల కళాకారులు రాష్ట్ర వ్యాప్తంగా నాటక ప్రదర్శనల్లో పాల్గొని రంగస్థలాన్ని సుసంపన్నం చేశారు. ఈ కళాకారులు సినీ కళాకారులకు సైతం ఆదర్శంగా మారిన సందర్భాలు ఉన్నాయి. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన నాటక రంగం నిన్న మొన్నటి వరకు తారా స్థాయిలో ఉంది. నేడు వివిధ కారణాలతో తిరోగమన దశలో ఉంది. తెలుగు నాట మొదటి నాటక రచయిత, సంఘ సంస్కర్త కందూకూరి వీరేశం లింగం పంతులు. మొదటి నాటక ప్రదర్శన కర్త కూడా ఆయనే. అందుకే ఆయన జన్మదినాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన ‘తెలుగు నాటక రంగ దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పౌరాణిక, సాంఘిక నాటకాల వేదికగా అలరారుతోంది. 1940 ప్రాంతం నుంచే జిల్లాలో పౌరాణిక నాటకాలను నేర్పించి ప్రదర్శించే వారు. నంద్యాలలో బాల్కొండ థియేటర్, కర్నూలులో జిల్లా పరిషత్లోని ఆడిటోరియం, మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్, జిల్లా కోర్టు సమీపంలో యునైటెడ్ క్లబ్, సీక్యాంప్లోని లలిత కళాసమితి (టీజీవీ కళాక్షేత్రం), నంద్యాల కళారాధన, జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం, విజేత ఆర్ట్స్, ప్రజా నాట్యమండలి, తదితర నాటక సంస్థలు ఇప్పటికే నాటక రంగానికి వన్నె తెస్తూ పనిచేస్తున్నాయి. ఈ నాటక సమాజాలు విభిన్న కథాంశాలతో నాటకాలను రూపొందించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రదర్శితమై ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు. నంది నాటక పోటీల్లో జిల్లా నాటక సమాజాలు అగ్రభాగాన నంది పురస్కారాలను అందుకుంటున్నారు. జిల్లాలో రాష్ట్ర స్థాయి కళాకారులు కర్నూలు జిల్లాలో నాటక రంగ పరిస్థితి చూస్తే తురిమెల్ల గ్రామానికి చెందిన వెంకటాద్రి సోదరులు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చక్కని సెట్టింగులు, లైటింగ్లతో నాటక ప్రదర్శనలు ఇచ్చారు. 1940 ప్రాంతంలో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆర్థిక వనరుల లేమితో ఈ సంస్థ మూత పడింది. బండి ఆత్మకూరుకు చెందిన బీకే రామసుందర్ రావు, చెలిమెల్ల గ్రామానికి చెందిన కేసీ శివారెడ్డి, వెల్దుర్తి వెంకటన నర్స నాయుడు, లొద్దిపల్లె అల్లాబక్ష్, రజనీబాయి, మల్లారెడ్డి, పత్తి ఓబులయ్య, బీసీ కృష్ణ, సంజన్న, గుర్రపుసాల అంకయ్య, పత్తికొండ రంగారెడ్డి, నంద్యాల బుర్రా వెకంటేశ్వర్లు, పులిపాటి రామమకృష్ణ, శారద, డాక్టర్ రవికృష్ణ, ఎస్ఆర్ఎస్ ప్రసాద్, వి.వి. రమణారెడ్డి వంటి నటులు నాటక రంగ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. నాటకం సమకాలీన సమస్యలకు దర్పణం. ‘నాటకం.. చిటికెడు వినోదాన్ని, గుప్పెడు అనుభవాలు, దోసెడు అనుభూతులు, చారెడు విజ్ఙానాన్ని ప్రేక్షకులకు పంచి పెడుతుంది’.. అని చెప్పాడో రచయిత. చరిత్రకు ప్రతిబింబం. సంఘ పరిణామాలను పసిగట్టి దగ్గరగా చూపెట్టే చుక్కాని. విజ్ఞానాన్ని, వినోదాన్ని, మానసిక చైతన్యాన్ని ప్రసాదించే వేదిక నాటకం. ఇంతటి అమోఘమైన రంగం చవి చూసిన అటుపోట్లెన్నో.. అయినా ఇప్పటకీ తన ప్రాభవాన్ని చాటుతూనే ఉంది. తెలుగు నాటక రంగ స్థల వైభవం సుస్థిరం.. సుమధరం.. నవరస భరితం. – కర్నూలు కల్చరల్ -
పత్తి విత్తన ప్రాసెసింగ్ యూనిట్లలో తనిఖీలు
కర్నూలు(అగ్రికల్చర్): బీటీ పత్తి విత్తనాల ప్రాసెసింగ్ ప్రక్రియ చురుగ్గా జరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ కమిషనరేట్ నుంచి వచ్చిన అధికారులు తనిఖీలు చేపట్టారు. పత్తిలో హెచ్టీ విత్తనాలను గుర్తించేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. హెచ్టీ పత్తి విత్తనాలు పర్యావరణానికి, జీవవైవిద్యానికి హాని కలిగిస్తాయనే ఉద్దేశంతో వీటికి కేంద్రం అనుమతులు ఇవ్వలేదు. హెచ్టీ విత్తనాల గ్లైపోసేట్ అనే కలుపు మందును తట్టుకుంటాయి. హెచ్టీ విత్తనాలతో పత్తి సాగు చేసినపుడు కలుపు సమస్య ఏర్పడితే గ్లైపోసేట్ మందు పిచికారి చేస్తే కలుపు మొక్కలు నశిస్తాయి.. పత్తి పంటకు ఏమీ కాదు. గ్లైపోసేట్ కలుపు మందు పిచికారి చేస్తే పర్యావరణం దెబ్బతింటుందనే ఉద్దేశంతో అనుమతులు లేవు. కాని హెచ్టీ పత్తి విత్తనాలు మార్కెట్లో ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కమిషనరేట్ నుంచి ఏడీఏ కల్యాణ్కుమార్, ఏవో లక్ష్మిరెడ్డిలతో కూడిన టీమ్ కర్నూలులో తనిఖీలు చేపట్టింది. కర్నూలులో బీటీ పత్తి విత్తనాల ప్రాసెసింగ్ ప్రక్రియ ప్రస్తుతం శ్రీరామ సీడ్స్, కర్నూలు సీడ్స్, ధనలక్ష్మి సీడ్స్, మహలక్ష్మి సీడ్స్, విజయసాయి, గౌతమీ సీడ్స్లో జరుగుతోంది. ప్యాకింగ్కు ముందే హెచ్టీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు ఆయా ప్రాసెసింగ్ కేంద్రాల్లో లాట్ల వారీగా హెచ్టీ పరీక్షలు నిర్వహించారు. అక్కడికక్కడే 11 పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది.అంటే హెచ్టీ విత్తనాలు లేవని నిర్ధారణ అయింది. కర్నూలులో తనిఖీలు పూర్తి అయిన తర్వాత ఈ టీమ్ అధికారులు ఆదోనిలో పరీక్షలు నిర్వహించారు. వారి వెంట కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, కల్లూరు ఏవో శ్రీనివాసరెడ్డి ఉన్నారు. -
గోరుకల్లు పెండింగ్ పనులు పూర్తి చేయాలి
పాణ్యం: రాయలసీమకు గుండెకాయగా భావించే గోరుకల్లు జలాశయం పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి, ఆయకట్టు రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం ఎస్సార్బీసీ ఆయకట్టు సాధన సమితి నాయకులు, ఆయకట్టు రైతులు, ప్రజాసంఘాల నాయకుల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా బొజ్జ దశరథరామిరెడ్డి మాట్లాడుతూ రాయలసీమకు తాగు, సాగునీటిని అందించే ప్రాజెక్టులలో గోరుకల్లు జలాశయం కీలకమైందన్నారు. అలాంటి ప్రాజెక్టు అసంపూర్తి పనులతో ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరందక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 12.44 టీఎంసీలు కాగా కేవలం 11 టీఎంసీలకే పరిమితమైందన్నారు. వరద జలాలను నిల్వ చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కళ్ల ముందు వరద నీరు సముద్రం పాలవుతున్నా పాలకులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రభు త్వం తక్షణమే గోరుకల్లు పెండింగ్ పనులు పూర్తి చేసి రైతులు, ప్రజల్లో నెలకొన్న భయాన్ని తొలగించాలన్నారు. రిజర్వాయర్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అనంతరం తహసీల్దార్ నరేంద్రనాథ్రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్సార్బీసీ ఆయకట్టు సాధన సమితి నాయకలు మురళీనాథ్రెడ్డి, గోపిరెడ్డి, యాగంటి, బసవేశ్వర రైతు సంఘం కన్వీనర్ కొండారెడ్డి, శేషిరెడ్డి, సమాజ్పార్టీ నాయకులు శివ కృష్ణయాదవ్, ఏఐఎఫ్బీ నాయవకులు వెంకటాద్రి, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు ప్రతాప్, ప్రసాద్రెడ్డి, సీతక్క, సూర్యమహేశ్వరరెడ్డి, ఎరువ రాచంద్రారెడ్డి, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. -
నక్కవాగుల పల్లెలో పూరిగుడిసె దగ్ధం
● రూ.3 లక్షల ఆస్తినష్టం డోన్: కొత్తకోట మజరా గ్రామమైన నక్కవాగులపల్లె గ్రామంలో మంగళవారం ఉదయం మహమ్మద్ రఫి అనే వ్యక్తికి చెందిన పూరిగుడిసె దగ్ధమైంది. కుటుంబీకులు పనికెళ్తూ గుడిసెకు తాళం వేసి వెళ్లారు. అయితే కొద్ది సేపటి తర్వాత గుడిసె దగ్ధమవుతుండటంతో గ్రామస్తులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఫైరింజన్ వచ్చే లోగా గుడిసె పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 4 తులాల బంగారు నగలతో పాటు ఏడాదిపాటు నిల్వ ఉంచిన నిత్యావసర వస్తువులు, కొంత నగదు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయని బాధితుడు మహమ్మద్ రఫి కుటుంబం కన్నీరుమున్నీరైంది. దాదాపు రూ. 3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ చంద్రన్న యాదవ్ తహసీల్దార్ నాగమణిని కోరారు. చెరువులో వ్యక్తి గల్లంతు పాణ్యం: భూపనపాడు గ్రామ చెరువులో అదే గ్రామానికి చెందిన బొని గెని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గల్లంతైనట్లు కుటుంబీకులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 13వ తేదీన వెంకటేశ్వర్లు గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో కలసి చెరువులో చేపట్టేందుకు వెళ్లి తిరిగి రాలేదు. రెండు రోజులుగా గాలిస్తున్నా ఆచూకీ తెలియలేదని పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కర్ణాటక మద్యం స్వాధీనం కృష్ణగిరి: మండల కేంద్రమైన కృష్ణగిరికి చెందిన పడిగే సుధాకర్ అనే వ్యక్తి నుంచి 13 బాక్స్ల కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక పోలీస్స్టేషన్లో మీడియాకు వివరించారు. గ్రామ శివారులోని ఉప్పరి మాదన్న పొలం సమీపంలోని చేపల గుంత వద్ద పడిగే సుధాకర్ అక్రమంగా మద్యాన్ని దాచినట్లు సమాచారం రావడంతో సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. 1,248 టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్ని నిందితున్ని అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మద్యాన్ని సరఫరా చేసిన తుగ్గలి మండలం కొత్తపల్లి గుడిసెల గ్రామానికి చెందిన రాజేంద్రపై కూడా కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
యువత ముందుకు రావాల్సిన అవసరం ఉంది
నాటక రంగం పుంజుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవలి కాలంలో సాంకేతిక విప్లవంతో నాటక రంగం పోటీ పడలేకపోయింది. పల్లెటూర్లలో ఇప్పటికీ జరిగే తిరునాళ్లు జాతర్లలో తెల్లవార్లు నాటకాలు వేస్తున్న పరిస్థితి ఉంది. సాంఘిక నాటకాలు అంతగా ప్రదర్శితం కావడం లేదు. పద్య నాటకాలకే ఆదరణ ఉంది. ఇప్పటికే సినిమా, టీవీలు లాంటి వాటి వల్ల కొంత మోజు తగ్గింది. రంగస్థల కళలోకి యువతీ యువకులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – పత్తి ఓబులయ్య, అధ్యక్షుడు, టీజీవీ కళాక్షేత్రం కళాకారులను ప్రోత్సహించాలి కళాకారులను ప్రోత్సహిస్తూ కళలను బ్రతికించుకోవాల్సిన అవసరం ఉంది. మా కళారాధన సంస్థ ద్వారా నటనలో శిక్షణ ఇవ్వడంతో పాటు నాటకాలను ప్రదర్శిస్తున్నాం. నాటక పోటీలు నిర్వహించి ప్రోత్సహిస్తున్నాం. మరికొందరు కళా పోషకులకు ముందుకు వస్తే రంగస్థలం లాంటి కళలను భావితరాలకు అందించేందుకు అవకాశం ఉంటుంది. – డాక్టర్ గుర్రాల రవికృష్ణ, కళారాధన సంస్థ అధ్యక్షుడు, నంద్యాల కళాకారులకు చేయూత ఇవ్వాలి మూడు దశాబ్దాలకు పైగా నేను నాటకాల్లో పాత్రలు వేస్తున్నాను. ప్రస్తుతం నాటక ప్రదర్శనలు బా గా తగ్గిపోయాయి. కళాకారులకు నాటకాలు లేక బతుకుదెరువు కష్టంగా మారింది. ప్రభుత్వం, కళా సంస్థలు కళా పోష కులు చేయూత అందిస్తే కళను నమ్ముకుని జీవిస్తున్న వారికి జీవనోపాధి లభిస్తుంది. – ఎం.ఆర్.రాధిక, సీనియర్ రంగస్థల కళాకారిణి ● -
ఇంటర్ విద్యార్థినికి కమాండెంట్ అభినందన
కర్నూలు: రెండేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతూ కూడా ఇంటర్ బైపీసీలో 420 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనపరచిన విద్యార్థి సృజనామృతను ఏపీఎస్పీ కర్నూలు బెటాలియన్ కమాండెంట్ దీపిక పాటిల్ అభినందించారు. రెండో పటాలంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఉరుకుంద, జానకి దంపతుల కూతురు సృజనామృత ఇంటర్ (బైపీసీ) ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరచినందుకు కమాండెంట్ దీపిక పాటిల్ అభినందన సభ ఏర్పాటు చేశారు. బెటాలియన్ జ్ఞాపికతో సృజనామృతను ఘనంగా సత్కరించారు. క్యాన్సర్ జబ్బుతో బాధ పడుతూ కూడా ఇంతటి విజయాన్ని సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచిందని కమాండెంట్ ప్రశంసించారు. జీవితంలో ఇలాంటి విజయాలు మరిన్ని సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కమాండెంట్ ఆకాంక్షించారు. అడిషనల్ కమాండెంట్ నాగేంద్రరావు, రిజర్వు ఇన్స్పెక్టర్లు, సృజనామృత తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. హౌసింగ్ పీడీగా చిరంజీవి కర్నూలు(అర్బన్): జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్గా డిప్యూటీ కలెక్టర్ టి.చిరంజీవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం సాయంత్రం జీఓ 713 జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే చిరంజీవికి ఇక్కడకు పోస్టింగ్ ఇచ్చారు. గతంలో ఈయనకు హౌసింగ్ పీడీగా ఇక్కడే పనిచేసిన అనుభవం ఉంది. -
వైభవంగా సుశమీంద్రతీర్థుల ఆరాధన
మంత్రాలయం: నడిచే రాఘవేంద్రులుగా పేరుగాంచిన శ్రీరాఘవేంద్రస్వామి మఠం పూర్వ పీఠాధిపతి సుశమీంద్రతీర్థుల ఆరాధన వేడుకలు వైభవంగా నిర్వహించారు. మంగళవారం శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థుల నేతృత్వంలో స్వామిజీ ఆరాధన వేడుకలు కనుల పండువగా చేపట్టారు. ముందుగా సుశమీంద్రతీర్థుల మూల బృందావనానికి విశేష పంచామృతాభిషేకం గావించి విరుల అలంకరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన చిత్ర పటాన్ని బంగారు రథంపై శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. గురుసార్వభౌమ సాహిత్య మండలి భజనలు, కీర్తనలు, వేద పాఠశాల విద్యార్థుల వేద ఘోష, మంగళవాయిద్యాల మధ్య రథయాత్ర కనుల పండువగా కొనసాగింది. వెంకన్న పట్టువస్త్రాల సమర్పణ నడిచే రాఘవేంద్రుల ఆరాధన సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు సమర్పించారు. స్థానిక టీటీడీ కల్యాణ మంటపం నుంచి ఆలయ ఏఈఓ మోహన్రాజు పట్టువస్త్రాలతో మంగళవాయిద్యాలతో శ్రీమఠం చేరుకున్నారు. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలు స్వీకరించారు. అనంతరం సుశమీంద్రతీర్థుల మూల బృందావనం చెంత పట్టువస్త్రాల పూజోత్సవం కానిచ్చారు. వేడుకలో ఏఏవో మాధవశెట్టి, మేనేజర్–ఎ వెంకటేష్జోషి తదితరులు పాల్గొన్నారు. -
పోషకాహారాన్ని ప్రోత్సహించడమే పోషణ్ పక్వాడ లక్ష్యం
కర్నూలు(సెంట్రల్): చిన్నారులు, మహిళలకు ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని అందించడమే పోషణ్ పక్వాడ లక్ష్యమని జాయింట్ కలెక్టర్ బి.నవ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో జిల్లాస్థాయి పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ డెలివరీ అయిన తరువాత 3 సంవత్సరాల వరకు పిల్లలకు తల్లులే పాలు ఇవ్వాలన్నారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అర్జేడీ రోహిణి మాట్లాడుతూ తల్లులు తమ పిల్లలను శక్తివంతులను చేసేందుకు చక్కర, మైదా పిండిలేని ఆహార పదార్థాలను అందివ్వాలని సూచించారు. ఐసీడీఎస్ పీడీనిర్మల మాట్లాడుతూ ఈనెల 8 నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్న పోషణ్ పక్వాడా అవగాహన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యంపై సూచనలు, సలహాలు అందిస్తామన్నారు. అంతకముందు మిల్టెట్లతో తయారు చేసిన పోషకాహార పదార్థాల ప్రదర్శన స్టాళ్లను జేసీ పరిశీలించారు. అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణులకు సామూహిక సీమంతాలలను నిర్వహించారు. డీఎంహెచ్ఓ శాంతికళ, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, డీఆర్డీఏ పీడీ వైవీ రమణారెడ్డి పాల్గొన్నారు. -
సొంత గూటికి కౌన్సిలర్
● ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్సీపీలోనే ఆదోని టౌన్: ‘‘వార్డుల్లో అభివృద్ధి పనులు చేయిస్తామని ఆశ పెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు పూర్తయినా రూ.10 పని కూడా చేయలేదన్నారు. వార్డుల్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బీజేపీలో చేరడం వల్ల చీవాట్లు తప్ప ఏమీ ఒరగలేదు.’’ అని 11, 12 వార్డుల కౌన్సిలర్ వాసీం అన్నారు. మంగళవారం ఆయన మాజీ ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ సమక్షంలో తిరిగి వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇకపై ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానన్నారు. సాయిప్రసాద్రెడ్డి అడుగుజాడల్లోనే నడుస్తానన్నారు. వార్డులో పెద్దల మాటలను గౌరవించి, జరిగిన పొరపాటు తెలుసుకొని తిరిగి సాయన్న సమక్షంలో పార్టీలోకి వచ్చానన్నారు. 2029లో వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా తన వంతు కృషి చేస్తానన్నారు. కూటమి నేతలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. -
టీడీపీ సానుభూతిపరులకే ఉపాధి పనులు
● రాజకీయాలకు అతీతంగా అడిగిన వారందరికీ ఉపాధి పనులు కల్పించాల్సి ఉంది. ● అయితే ఉపాధిలో నేడు రాజకీయాలదే పైచేయి. పలు మండలాల్లో టీడీపీ మద్దతుదారులకు మాత్రమే పనులు కల్పిస్తున్నారు. ● పశ్చిమ ప్రాంతం నుంచి ఈ సారి వలసలు అధికంగా ఉన్నాయి. ● ఆయా గ్రామాల్లో పనులు పెట్టి ఇబ్బడిముబ్బడిగా బోగస్ హాజరుతో మస్టర్లను నింపేశారు. ● కూలీలు, చిన్న రైతులను టీడీపీ, వైఎస్ఆర్సీపీలుగా విభిజించి పనులు కల్పిస్తున్నారు. ● టీడీపీ అనుకూలం అయితే గరిష్ట వేతనం రూ.300, వైఎస్ఆర్సీపీ అనుకూలమైతే అతి తక్కువ వేతనం ఇస్తున్నటున్ల చర్చ ఉంది.తుగ్గలి మండలం ఎద్దులదొడ్డి గ్రామ పంచాయతీలో పాత పనులకే మెరుగులు దిద్దుతున్న దృశ్యం● తుగ్గలి మండలం ఎద్దులదొడ్డి పంచాయతీ నుంచి ఈ సారి వందలాది మంది కూలీలు, చిన్న, సన్నకారు రైతులు వలస వెళ్లారు. ఆ సమయంలో ఉపాధి పనులు పెట్టి పెద్ద ఎత్తున బోగస్ మస్టర్లు వేసుకున్నారు. 20 మంది వస్తే 200 మంది హాజరైనట్లు మస్టర్లు వేసి ఒకటి, రెండు ఫొటోలనే అటు, ఇటు చేసి అన్ని మస్టర్లకు అప్లోడ్ చేసినట్లు సమాచారం. ఇటీవల వలస వెళ్లిన వాళ్లు తిరిగొచ్చినా ఉపాధి కల్పించడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. 2022లో చేపట్టిన పనులకే మెరుగులు దిద్ది ఉపాధి నిధులు స్వాహా చేస్తున్నారనే ఫిర్యాదు ఉన్నాయి. కర్నూలు(అగ్రికల్చర్): ఫీల్డ్ అసిస్టెంట్లు.. మేట్లు.. సీనియర్ మేట్లు టీడీపీ కార్యకర్తలే. సాంకేతిక సహాయకులు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు, ఏపీఓలు టీడీపీ అనుకూలురే. ఈ నేపథ్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. కూటమి పార్టీల నాయకులు, ఉపాధి సిబ్బంది ఏకమై నిధులను కొల్లగొడుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతోనే టీడీపీ నేతల దృష్టి ఎన్ఆర్ఈజీఎస్పై పడింది. కొన్నేళ్లుగా ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారిని తప్పించి తమ వారిని నియమించుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 859 ఫీల్డ్ అసిస్టెంటు పోస్టులు ఉండగా.. 10 నెలల్లోనే 85 శాతం మందిని తప్పించారు. మాట వినని వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఆలూరు నియోజక వర్గంలో ఫీల్డ్ అసిస్టెంటు రాజీనామా చేయడం లేదనే కారణంగా కత్తులు, కొడవళ్లతో నరికి చంపారు. కొందరు టీడీపీ నేతలు ఈ పోస్టులను అమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం, ఆదోని, డోన్, నందికొట్కూరు నియోజక వర్గాల్లో రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అమ్ముకున్నట్లు సమాచారం. పాత పనులకే మెరుగులు జేబులు నింపుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు ఇతర ఉపాధి సిబ్బంది టీడీపీ నేతల అక్రమాలకు ఇతోధికంగా సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పత్తికొండ, తుగ్గలి, కౌతాళం, దేవనకొండ, మంత్రాలయం, హాలహర్వి, పెద్దకడుబూరు, కర్నూలు, కల్లూరు, క్రిష్ణగిరి, కోసిగి, ఆదోని, నందవరం, డోన్, ప్యాపిలి, బేతంచెర్ల, కొలిమిగుండ్ల, నందికొట్కూరు, మిడుతూరు తదితర మండలాల్లో పాత పనులకే మెరుగులు దిద్ది నిధులను కొల్లగొడుతుండటం గమానార్హం. 2022, 2023 సంవత్సరాల్లో చేసిన పనులనే ఇప్పుడు చేసినట్లు మస్టర్లు వేసుకొని నిధుల స్వాహాకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 75 శాతం పాత పనులతోనే మమ అనిపిస్తున్నా చర్యలు శూన్యం.ముడుపులు ఇస్తేనే జాబ్ కార్డులు అడిగిన వారందరికీ జాబ్కార్డులు ఇచ్చి పనులు కల్పించాలి. ఎలాంటి రుసుం లేకుండా జాబ్ కార్డు జారీ చేయాలి. జాబ్కార్డు జారీలో ఫీల్డ్ అసిస్టెంటు, కంప్యూటర్ ఆపరేటర్ ముఖ్యం. జాబ్ కార్డుకు రెకమెండ్ చేయడానికి రూ.1,500 నుంచి రూ.2వేల వరకు ముడుపులు వసూలు చేస్తున్నారు. ఈ పరిస్థితికి తుగ్గలి, పత్తికొండ, కౌతాళం, ప్యాపిలి, కోసిగి తదితర మండలాల్లో అధికంగా ఉన్నట్లు సమాచారం.ఒక్క ఫొటొతో లెక్కలేనన్ని మస్టర్లు తమ్ముళ్ల జేబు నింపుతున్న ఉపాధి పనులు ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు టీడీపీ కార్యకర్తలే.. దొంగ హాజరుతో నిధుల స్వాహా పాత పనులకే మెరుగులు దిద్దుతున్న వైనంఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 15వేల ఫాంపాండ్స్ నిర్మించాలనేది లక్ష్యం. ఇప్పటికే వీటికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. పనులను లేబర్తోనే చేయించాల్సి ఉన్నా పలు మండలాల్లో యంత్రాలతో కానిచ్చేస్తున్నారు. జేసీబీతో పనులు చేయించిన తర్వాత ఒకటి, రెండు రోజులు లేబర్తో పనులు చేయించి బిల్లులు కొల్లగొడుతున్నారు. ఒక్కో ఫాంపాండ్ సైజును బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోంది. రాత్రికి రాత్రే యంత్రాలతో ఈ తతంగం నడుస్తోంది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వైఎస్ఆర్సీపీ వర్గీయులుగా ముద్ర వేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. -
జగన్మాత.. దీవించమ్మా!
● శ్రీశైలంలో శాస్త్రోక్తంగా కుంభోత్సవం ● గుమ్మడి, కొబ్బరి, నిమ్మకాయలతో భ్రమరాంబదేవికి సాత్వికబలి శ్రీశైలంటెంపుల్: లోక కల్యాణం కోసం జగన్మాత అయిన శ్రీశైల భ్రమరాంబాదేవికి సంప్రదాయబద్ధంగా మంగళవారం వార్షిక కుంభోత్సవం నిర్వహించారు. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ, శుక్రవారాలలో ఏ రోజు ముందుగా వస్తే ఆ రోజు అమ్మవారికి సాత్వికబలిని సమర్పిస్తారు. ఈ సందర్భంగా శ్రీభ్రమరాంబాదేవి ఆలయాన్ని నిమ్మకాయల దండలతో ప్రత్యేకంగా అలంకరించారు. కుంభోత్సవంలో భాగంగా ముందుగా ఉదయం అమ్మవారి ఆలయంలో రజకునితో ప్రత్యేక రంగవల్లిని వేయించారు. కుంభోత్సవాన్ని పురస్కరించుకుని అర్చకులు ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ఉత్సవ సంకల్పం పఠించి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆచారాన్ని అనుసరించి ఈ పూజలన్నీ అమ్మవారికి ఏకాంతంగా జరిపించారు. శాంతి ప్రక్రియగా అధిక పరిమాణంలో పసుపు, కుంకుమలను కూడా అమ్మవారికి సమర్పించారు. అమ్మవారికి ఏకాంతంగా పూజాదికాలను జరిపిన తరువాత సాత్వికబలికి సిద్ధం చేసిన రెండు వేలకుపైగా కొబ్బరికాయలు, ఐదు వేల గుమ్మడికాయలు, 60వేలకుపైగా నిమ్మకాయలు, వండిన అన్నం (కుంభం)కు కూడా పూజాదికాలు జరిపించారు. స్థానిక వ్యాపార సంఘం వారు గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, వండిన అన్నం అమ్మవారికి సాత్వికబలిగా సమర్పించారు. అనంతరం హరిహరరాయగోపుర ద్వారం వద్దగల మహాషాసురమర్ధిని అమ్మవారికి (కొటమ్మవారికి) ప్రత్యేక పూజాదికాలు జరిపి, సాత్వికబలిగా కొబ్బరికాయలు, గుమ్మడికాయలు సమర్పించారు. అమ్మవారి ఆలయంలో రజకునితో ప్రత్యేక ముగ్గు వేయించిన శ్రీచక్రం వద్ద విశేషపూజలు నిర్వహించారు. సాయంకాలం శ్రీమల్లికార్జున స్వామివారికి ప్రదోషకాలపూజల అనంతరం అన్నాభిషేకం జరిపించారు. అలాగే సాయంకాలం అమ్మవారికి ఎదురుగా ఉండేవిధంగా సింహమండపం వద్ద వండిన అన్నాన్ని కుంభరాశిగా సమర్పించారు. అమ్మవారికి కుంభహారతి సంప్రదాయాన్ని అనుసరించి సీ్త్ర వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించారు. దీంతో ఉత్సవంలో ప్రధానఘట్టం ప్రారంభమైంది. అనంతరం రెండో విడత సాత్వికబలిగా గుమ్మడికాయలు, కొబ్బరికాయలు సమర్పించారు. అమ్మవారి నిజరూపదర్శనం శ్రీభ్రమరాంబాదేవికి విశేషపూజాదికాలు నిర్వహించిన అనంతరం అమ్మవారి నిజరూప దర్శనం భక్తులకు కలిగించారు. చివరిగా అమ్మవారికి పునఃపూజలను చేసి పలు రకాల వంటకాలతో అమ్మవారికి మహానివేదన చేశారు. ఈ ఉత్సవంలో భాగంగానే గ్రామదేవత అంకాళమ్మకు కూడా ఉదయం ప్రత్యేక పూజలను నిర్వహించారు. -
శుభగాత్రీ.. గిరిజాపుత్రి
● శ్రీశైల శ్రీభ్రమరాంబాదేవికి వార్షిక కుంభోత్సవం ● నాటి చెంచుల ఉత్సవం.. నేడు సకల జనుల వేడుక ● అమ్మవారి నిజరూపదర్శనంతో పులకించనున్న భక్తజనం ● మల్లన్నకు అన్నాభిషేకం నిజరూప దర్శనం.. ఎనిమిది చేతులలో వివిధ ఆయుధాలను ధరించి ఉన్న భ్రమరాంబాదేవి వారు రోజూ అలంకారమూర్తిగా దర్శనమిస్తారు. అమ్మవారికి స్వర్ణముఖకవచం అలంకరించి ఉంటుంది. అయితే సంవత్సరంలో ఒక్క కుంభోత్సవం రోజున మాత్రమే అమ్మవారి ముఖానికి కవచాలంకరణ ఉండదు. ఆ రోజున భక్తులు అమ్మవారి నిజరూప దర్శనాన్ని చేసుకోవచ్చు. అమ్మవారి నిజరూప దర్శనముతో భక్తులందరూ పులకించిపోతారు. భక్తుల దర్శనాలు పూర్తయ్యాక రాత్రి 10 గంటల సమయంలో అమ్మవారికి పునఃపూజలు చేసి 9 రకాల పిండివంటలతో చేసే మహానివేదన చేయనున్నారు.శ్రీశైలంటెంపుల్: అష్టాదశశక్తి పీఠాలలో ఒకటైన శ్రీశైలంలో వెలసిన శ్రీభ్రమరాంబాదేవికి మంగళవారం వార్షిక కుంభోత్సవం నిర్వహించేందుకు దేవస్థానం సర్వం సిద్ధం చేసింది. స్థానికులైన చెంచులకు అతి ముఖ్యమైన ఉత్సవం అమ్మవారి వార్షిక కుంభోత్సవం. చెంచుల ఆచారాలు, సంప్రదాయాలు నేడు కనుమరుగవుతుండగా, చెంచుల ఉత్సవం ఇప్పుడు సకల జనులందరి కుంభోత్సవంగా మారింది. 6వ శతాబ్దంలో సాక్షాత్తు ఆదిశంకరులే వామాచార (బలుల) సంప్రదాయానికి స్వస్తి చెబుతూ దక్షిణాచార (సాత్వికబలి) సంప్రదాయాన్ని కొనసాగేలా అమ్మవారి ఉగ్రరూపాన్ని ఉపసంహరించి శ్రీచక్రాన్ని ఏర్పాటు చేశారని పురాణాలు చెబుతున్నాయి. ఉగాది తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి తరువాత వచ్చే మంగళ, శుక్రవారాలలో ఈ కుంభోత్సవం నిర్వహిస్తారు. శ్రీశైల మహాక్షేత్రంలో దాదాపు 2000 సంవత్సరం వరకు కూడా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో, కోటగోడ అమ్మవారి వద్ద కోళ్లు, మేకలను బలి ఇచ్చేవారు. అనంతర కాలంలో జంతు సంరక్షణ సమితితో పాటు మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు, జంతుప్రేమికులు జంతు బలులను నిషేధించాలని విన్నవించారు. దీంతో దేవస్థానం పరిధిలో జంతు బలులు నిషేధిస్తూ దేవదాయ చట్టం రావడంతో కాలక్రమేణా సాత్వికబలి దిశగా ఈ కుంభోత్సవం చేరుకుంది. ప్రస్తుతం సాత్వికబలి ఇవ్వడం అనవాయితీగా మారింది. ఇందులో భాగంగా వేలకొద్ది నిమ్మకాయలు, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు సమర్పిస్తున్నారు. దేవస్థానం వారితో పాటు స్థానికులు, వ్యాపారులు గ్రామం, ఊరు సుభిక్షంగా ఉండాలని కొరుకుంటూ వందల కేజీల అన్నం, పెసరపప్పుతో కూడిన కుంభాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నారు. నేడు శ్రీశైల ఆలయంలో పూజలు ఇలా.. కుంభోత్సవం రోజున అమ్మవారికి ప్రాతఃకాల పూజలు యథావిధిగా జరిపించబడతాయి. తరువాత అర్చకులు నవావరణపూజ, త్రిశతి, ఖడ్గమాల, సహస్రనామ, అష్టోత్తరపూజలను, జపపారాయణలను చేస్తారు. అయితే సంప్రదాయాన్ని అనుసరించి ఈ పూజలన్నీ అమ్మవారికి ఏకాంతంలో నిర్వహిస్తారు. కుంభోత్సవం కారణంగా తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయ తలుపులు మూసివేస్తారు. సాయంత్రం అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. కుంభోత్సవంలో భాగంగా సాయంత్రం స్వామివారి ప్రదోషకాల పూజల అనంతరం విశేషంగా అన్నాభిషేకాన్ని జరిపిస్తారు. అనంతరం స్వామివారి మూలమూర్తిని పూర్తిగా పెరుగన్నంతో కప్పివేస్తారు. స్వామివారి ఆలయ ద్వారాలు మూసివేయబడతాయి. కాలానుగుణంగా మార్పుసంప్రదాయాలు, సంస్కృతి, ఆచారాలు, వ్యవహరాలలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. చెంచులు నాగరికత దిశగా అడుగులు వేయడంతో నాటి సంప్రదాయాలు, సంస్కృతి నేడు మనకు కనిపించడం లేదు. అలాగే గతంలో స్థానికులు తెలిపిన సమాచారం మేరకు పాలుట్ల నుంచి ఓ యువతి దీపం తీసుకువచ్చేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఆ ఆచారం కనిపించడం లేదు. దీనికి బదులుగా స్వామివారి ఆలయంలో పనిచేస్తున్న వ్యక్తి మహిళా వేషధారణలో దీపంతో అమ్మవారి ఆలయానికి చేరుకుని కుంభహారతి ఇస్తారు. ఏడాదిలో 365 రోజులలో ఈ కుంభోత్సవం ఒక్క రోజు మాత్రమే అమ్మవారి మూలవిరాట్ దర్శనం భక్తులకు లభిస్తుంది. అయితే అమ్మవారు ఉగ్రరూపంలో ఉండడంతో కుంభహారతి ఇవ్వగానే భ్రమరాంబాదేవి మూలవిరాట్పై పసుపు, కుంకుమలను ఏకధాటిగా చల్లి అమె క్రోధ నేత్రాల చూపులు భక్తులపై ప్రసరింపజేయకుండా చేస్తారు. -
లారీని ఢీకొని బాలుడి మృతి
వెల్దుర్తి: కర్నూలు – బెంగళూరు జాతీయ రహదారిపై స్థానిక లిమ్రాస్ ఫ్యాక్టరీ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. పట్టణ ంలోని ఐజీ నగర్కు చెందిన గౌండ రమేశ్, సుజాత దంపతులు గేదెలు పెంచుకుంటూ పాలు విక్రయిస్తూ జీవిస్తున్నారు.వీరికి ఇద్దరు రుషిబాబు(14), విక్కీబాబు కుమారులు. సోమవారం తెల్లజామున వినియోగదారులకు పాలు పోసి వస్తానంటూ తమ్ముడుతో బైక్పై వెళ్లాడు. అయితే ముందు వెళ్తున్న కంటైనర్ను ఓవర్ టేక్ చేయబోతుండగా వాహనం ఢీకొనడంతో రుషిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ విక్కీ బాబును కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. రుషిబాబు కృష్ణగిరి మోడల్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంట్లో చెప్పకుండా బైక్ తీసుకెళ్లి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. విద్యుదాఘాతంతో రైతు మృతి డోన్ రూరల్: కామగానిగుంట్ల గ్రామానికి చెందిన వడ్డే రమేష్ (40) అనే రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని తన సొంత తోటలో నీరు వదలడానికి మోటర్ స్విచ్ ఆన్ చేస్తుంగా కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. పొలానికి వెళ్లిన రమేష్ ఇంటికి రాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో కుటుంబీకులు అనుమానంతో పొలం వద్దకు వెళ్లి చేశారు. బోరు వద్ద విగత జీవిగా పడి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహన్ని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య ఈశ్వరమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. యువకుడి దుర్మరణం ● పుదుచ్చేరి వద్ద రోడ్డు ప్రమాదం కోవెలకుంట్ల: కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కోవెలకుంట్లకు చెందిన ఓ యువకు డు దుర్మరణం చెందాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. పట్టణంలోని సంతమార్కెట్ సమీపంలో నివాసం ఉంటున్న పవన్కల్యాణ్(26) ఇదే పట్టణానికి చెందిన స్నేహితుడు శ్రీకర్రెడ్డితో కలిసి తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం క్షేత్ర దర్శనానికి కోవెలకుంట్ల నుంచి బైక్పై ఈ నెల 11వ తేదీన బయలుదేరారు. శనివారం రాత్రి దర్శనం ముగించుకుని పుదుచ్చేరికి వెళ్తుండగా ఆదివారం తెల్లవారుజామున బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొంది. బైక్ నడుపుతున్న పవన్కల్యాణ్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. బైక్ వెనుక ఉన్న శ్రీకర్రెడ్డి స్వల్పగాయా లతో బయటపడ్డాడు. స్నేహితుడి మరణవార్తను కుటుంబ సభ్యులకు చేరవేయగా కుటుంబ సభ్యు లు అక్కడికి బయలుదేరి వెళ్లారు. కాగా సుంకన్న, సుబ్బమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. కాగా ఎనిమి దేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో సుంకన్న మృత్యువాతపడ్డాడు. ఇప్పుడు ఒక్కగాననొక్క కుమారుడిని మృత్యువు కబళించడంతో తల్లి సుబ్బమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. -
గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి
మహానంది: మహానంది సమీపంలోని అరటి పొలాల్లో గుర్తు తెలియని ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడా...? లేక ఎవరైనా ముందే హతమార్చి తీసుకొచ్చి నిప్పటించారా...? అనే విషయాలు తేలాల్సి ఉంది. నంద్యాల – మహానంది రహదారిలో ఎన్టీఆర్ విగ్రహం ఎదురుగా ఉన్న అరటి తోటల్లో ఉదయం మంటలు కనిపించడంతో కొందరు వెళ్లి చూడగా ఓ వ్యక్తి తగలబడుతున్నట్లు గుర్తించారు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ శ్రీనివాసులు రెడ్డి, మహానంది, బండిఆత్మకూరు ఎస్ఐలు రామ్మోహన్ రెడ్డి, జగన్మోహన్లు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం నంద్యాల జిల్లా ఫోరెన్సిక్ అధికారులు మృతదేహం వద్దకు చేరుకుని ఆధారాలు సేకరించే క్రమంలో వేలిముద్రలు, మృతుడు ధరించిన ఆంజనేయస్వామి డాలర్, కొన్ని కీలక భాగాలు సేకరించారు. వ్యక్తి అనుమానాస్పద మృతిపై జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ ఆరా తీసినట్లు సమాచారం. ఎస్పీ ఆదేశాల మేరకు డాగ్స్క్వాడ్ను రప్పించారు. కుడికాలికి నల్లని ధారం, బట్టతల ఉండటంతో పాటు వయసు సుమారు 40 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉంటుందని ఎస్ఐ రామ్మోహన్రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా మృతి చెందిన వ్యక్తి టవల్తో అరటిచెట్టుకు నడుమును కట్టినట్లు కనిపించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతి చెందిన వ్యక్తి ఎవరనేది తెలిస్తే కానీ పూర్తి వివరాలు తెలియని పరిస్థితి నెలకొంది. మృతదేహానికి ఘటనా స్థలం వద్దే పోస్టుమార్టం నిర్వహించి మహానందిలోనే అంత్యక్రియలు పూర్తి చేశారు. రంగంలోకి ఫోరెన్సిక్ అధికారులు, డాగ్స్క్వాడ్ -
వడదెబ్బతో ఉపాధి కూలి మృతి
పత్తికొండ రూరల్: హోసూరు గ్రామానికి చెందిన ఉపాధి కూలీ అడవి లక్ష్మన్న (58) సోమవారం వడదెబ్బతో మృతి చెందాడు. ఉదయం భార్య లక్ష్మీదేవితో కలిసి ఉపాధి పనులకు వెళ్లి కూలీలతో కలిసి కుంట తవ్వకం పనిచేసుకుంటూ ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం ఇంటికి తీసుకొచ్చేలోగానే మృతి చెందినట్లు ఉపాధి కూలీలు తెలిపారు. పనిప్రదేశంలో ఉపాధి కూలీలకు టెంట్లు, నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సరఫరా లాంటి సౌకర్యాలు కల్పించకపోవడం కూలీలు వడదెబ్బకు గురవుతున్నారు. రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్ట్వేర్ ఉద్యోగి మృతి శిరివెళ్ల: గుంప్రమాన్దిన్నె– యర్రగుంట్ల రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంప్రమాన్దిన్నెకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి వరకూటి రేణుకుశవరెడ్డి (32) మృతి చెందాడు. ఈ నెల 13న స్వగ్రామం నుంచి యర్రగుంట్లకు బైక్పై వస్తూ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలలో పడి మృతి చెందాడు. సోమవారం తెల్లవారు జామున వాకింగ్కు వచ్చిన వ్యక్తులు చూసి తల్లి దండ్రులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి గోపాల్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్ఐ చిన్న పీరయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్రెడ్డి గ్రామానికి చేరుకొని గోపాల్రెడ్డిని పరామర్శించరు. రిమాండ్కు సెల్ దొంగలు డోన్ టౌన్: చోరీచేసిన 52 సెల్ఫోన్లు, 40 లీటర్ల నాటాసారాను కారులో తరలిస్తుండగా ఈ నెల 11వ తేదీ డోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నిందితులు నగనూరి వంశీ, హాజీవలి అలియాస్ అజ్జూ, నగనూరి వసంత అనే ముగ్గరిపై కేసు నమోదు చేశారు. సోమవారం జడ్జి ఎదుట హాజరుపరచగా రిమాండ్కు ఆదేశించినట్లు పట్టణ సీఐ ఇంతియాజ్బాషా తెలిపారు. ఆయన వెంట ఎస్ఐ నరేంద్రకుమార్, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
పూలమాలలతో సరిపెట్టారు!
కర్నూలు(అర్బన్): కూటమి ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను పూలమాలలతో సరిపెట్టింది. బహిరంగ ప్రదేశాల్లో కాకుండా జయంతి కార్యక్రమలను సంక్షేమ వసతి గృహాల్లో నిర్వహించాలని ఈ నెల 4న రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసింది. దీంతో ప్రతి ఏడాది ఎంతో ధూంధాంగా నిర్వహించే అంబేడ్కర్ జయంతి ఈ ఏడాది కళ తప్పింది. ప్రతి ఏడాది ఏప్రిల్ 5న బాబూ జగ్జీవన్రామ్, 14న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ ఉత్సవాలను సంక్షేమ వసతి గృహాల్లోనే నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల దళిత, ప్రజా సంఘాల నేతలు, మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నిర్వహణ ఇలా.. ● వారం ముందు నుంచే సన్నాహక సమావేశాలు నిర్వహించి సభల నిర్వహణకు సంబంధించి ఆయా సంఘాల నేతల సలహాలు, సూచనలు తీసుకునేవారు. ● కరపత్రాలు, పోస్టర్లు, షామియానాలు, భోజనాలతో జిల్లా కేంద్రంలో పండుగ వాతావరణం కనిపించేది. ● సభా ప్రాంగణం రంగు రంగుల తోరణాలు, లైటింగ్తో అందంగా తీర్చిదిద్దేవారు. ● సభ ఉదయం 10 గంటలకు ప్రారంభమై ఒకానొక సందర్భంలో మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగేది. ● జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, సంఘాల నాయకులు జయంతి సభల్లో పాల్గొనేవారు. ఈ విడత ఇలా.. ● రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ పీ రంజిత్బాషా తదితరులు స్థానిక పాత బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ● జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా మండల కేంద్రమైన వెల్దుర్తి సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని బాలుర వసతి గృహంలో బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ● బహిరంగ సభలు నిర్వహిస్తే ప్రజా సంఘాల నేతలు ప్రభుత్వాల చర్యలను ఎండగడతారనే భయంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ● రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాలకు దండలు వేయడం సరిపెట్టిన ప్రభుత్వ తీరును దళిత, ప్రజా సంఘాలతో పాటు ప్రజలు కూడా తప్పుపడుతున్నారు.నామమాత్రంగా అంబేడ్కర్ జయంతి హాస్టళ్లలో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం మెమో పూలమాలలతో సరిపెట్టిన అధికార యంత్రాంగం నివాళులర్పించిన మంత్రి టీజీ భరత్, ఎంపీ నాగరాజు, జిల్లా కలెక్టర్ రంజిత్బాషా కూటమి ప్రభుత్వ తీరుపై దళిత, ప్రజా సంఘాల ఆగ్రహం -
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం
కర్నూలు(అర్బన్): భారతదేశానికి దశ, దిశ చూపిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తూతూ మంత్రంగా నిర్వహించడం ఆయనను అవమానించడమేనని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలు కావడం లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందన్నారు. అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా ఆయన వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి స్థానిక పాతబస్టాండ్ సమీపంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించామన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అంబేడ్కర్ జయంతిని నామమాత్రంగా నిర్వహించేందుకు ఈ నెల 4న సర్కులర్ పంపిందన్నారు. హాస్టళ్లలోని విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు పంచి జయంతి ఉత్సవాలను నిర్వహించడం చాలా దుర్మార్గమైన చర్య అన్నారు. ఎన్టీఆర్ జయంతిని మహానాడు పేరుతో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్న టీడీపీ, అంబేడ్కర్ జయంతి పట్ల ఎందుకు చిన్న చూపు చూస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కార్యక్రమంలో డీవీఎంసీ సభ్యులు గద్ద రాజశేఖర్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, కార్పొరేటర్లు విక్రమ్ సింహారెడ్డి, గాజుల శ్వేతారెడ్డి, గడ్డం రామక్రిష్ణ, సీహెచ్ మద్దయ్య తదితరులు పాల్గొన్నారు.డాక్టర్ బీఆర్ అంబేడ్కర్కు తీరని అవమానం చాక్లెట్లు, బిస్కెట్లు పంచి తూతూ మంత్రంగా జయంతి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి -
ఒంటిమిట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
స్కార్పియో మితిమీరిన వేగమే కారణం రోడ్డు ప్రమాద స్థలాన్ని కడప ఆర్టీసీ ఆర్ఎం పి.గోపాల్రెడ్డి పరిశీలించారు. అక్కడ ఉన్న పరిస్థితిని చూస్తే స్కార్పియో వాహనం నడిపిన వారిదే తప్పుగా తెలుస్తోందన్నారు. మితిమీరిన వేగంతో బస్సు మోటును ఢీకొట్టడంతో స్పీడ్ మీదు తిరుగుకుంటూ వెళ్లి బస్సు వెనుక వైపు వస్తున్న పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టి ఉంటారన్నారు. పూర్తిగా తెలుసుకునేందుకు ఎలక్ట్రిక్ బస్సుకు ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలిస్తామని తెలిపారు.ఒంటిమిట్ట/నంద్యాల: వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని కడప–చైన్నె జాతీయ రహదారి సోమవారం నెత్తురోడింది. స్కార్పియో, బస్సు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. తిరుపతి నుంచి నంద్యాలకు వెళ్తున్న స్కార్పియో(ఏపీ31 సిడబ్ల్యు 7479) వాహనం ఒంటిమిట్ట మండల పరిధిలోని నడింపల్లి వద్దనున్న కడప–చైన్నె జాతీయ రహదారిపైకి రాగానే తిరుపతికి వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు(ఏపీ 39 యుఎం 9771)ను వేగంగా ఢీకొంది. స్కార్పియో పల్టీకొట్టి ఎలక్ట్రిక్ బస్సు వెనుక వస్తున్న పెట్రోలింగ్ వాహనాన్ని కూడా ఢీ కొట్టింది. ప్రమాదంలో స్కార్పియోలోని నలుగురిలో తేజనాయుడు(19), ధర్మారెడ్డి(26), వినోద్(25)లు అక్కడికక్కడే మరణించారు. మహానంది పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్న సునిల్నాయుడుకి తీవ్రగాయాలు అయ్యాయి. ఇతనితో పాటు పెట్రోలింగ్ వాహనం నడుపుతున్న కానిస్టేబుల్ రఘురాంరెడ్డి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడు ధర్మారెడ్డిచేత మద్యం మాన్పించేందుకు తిరుపతికి నాటుమందు కోసమని వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సీఐ బాబు, ఎస్ఐ శివప్రసాద్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని 108లో కడప రిమ్స్కు తరలించారు. ప్రమాదం జరిగిన సమాచారాన్ని కడప డీఎస్పీ వెంకటేశ్వర్లకు చేరవేయడంతో ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పరిశీలించి, ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. ఘటనపై రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల వివరాలు ● తేజనాయుడు స్వస్థలం నంద్యాలలోని హౌసింగ్ బోర్డు కాలనీ. తల్లిదండ్రులు భద్ర, రాజేశ్వరి. ఇతను పట్టణంలోని ఓ కళాశాలలో ఐటీఐ చదువుతున్నాడు. ● వినోద్ స్వస్థలం బండిఆత్మకూరు మండలంలోని సోమయాజులపల్లె. తల్లిదండ్రులు వెంకటలక్ష్మమ్మ, వెంకటరాముడు. టవర్ల వద్ద జనరేటర్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. ● ధర్మారెడ్డి స్వస్థలం చాగలమర్రి మండలం డి.కొత్తపల్లె. తండ్రి శివశంకర్రెడ్డి వ్యవసాయం చేస్తుండగా, తల్లి అన్నమ్మ ఉన్నారు. నంద్యాలలోని జియో కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవల అక్క జ్యోతి వివాహం కాగా, తమ్ముడు శ్రీనివాసరెడ్డి ట్రాన్స్ఫారం కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడికక్కడే ముగ్గురి మృతి మృతులు నంద్యాల జిల్లా వాసులుగా గుర్తింపు ఇద్దరికి తీవ్ర గాయాలు -
హొళగుందలో సామూహిక వివాహాలు
హొళగుంద: మండల కేంద్రమైన హొళగుందలో సోమవారం సామూహిక వివాహాలు నిర్వహించారు. మొత్తం ఎనిమిది జంటలు ఒక్కటయ్యాయి. వధూవరుల బంధువులు, కుటుంబ సభ్యులతో పాటు గ్రామపెద్దలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎమ్మార్పీఎస్, దళిత సంఘాలు, సామూహిక వివాహాల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిపించారు. నూతన వధూవరులను ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ఆశీర్వదించారు. ఆలూరు నియోజకవర్గంలో ప్రజలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మార్పీఎస్, దళిత సంఘాలు ఈ కార్యక్రమం చేయడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. రక్తదానం మహా దానం ● హాల్వి మఠం పీఠాధిపతి మహాంతస్వామి కౌతాళం: రక్తదానం మహాదానమని హాల్వి మఠం పీఠాధిపతి మహాంతస్వామి అన్నారు. బుధవారం జరగనున్న మహాంతస్వామి జాతరను పురస్కరించుకుని సోమవారం మఠం వారి ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి విశేష స్పందన లభించి 580 మంది రక్తం దానం చేశారు. ఇంత పెద్ద మొత్తంలో రక్తదానం చేయడం ఆదోని డివిజన్ చరిత్రలోనే మొదటిసారి కావడం విశేషం. ఈ శిబిరానికి కర్నూలుతో పాటు బళ్లారి, గుంతకల్, ఆదోని నుంచి వైద్యులు తరలివచ్చి రక్త సేకరణ చేశారు. కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, పెద్దలు మహంతస్వామి శిష్యరిక బృందం వారు పాల్గొన్నారు. చేరిన నెల రోజులకే జాబ్స్ మేనేజర్గా ప్రమోషన్ ● డీఆర్డీఏలో చర్చనీయాంశంగా మారిన నియామకం కర్నూలు(అగ్రికల్చర్): డీఆర్డీఏలో జాబ్స్ మేనేజర్ నియామకం విమర్శలకు తావిస్తోంది. ఎన్.అశోక్కుమార్ అనే వ్యక్తి ఈ ఏడాది జనవరి మొదటి పక్షం వరకు ప్రయివేటు కంపెనీల్లో పనిచేశారు. జనవరి 18న కూటమి పార్టీల నేతల సిపారసుతో సీడాప్లో డీఆర్డీఏకు చెందిన టీటీడీసీలో జాబ్స్కు సంబంధించి ఎస్ఆర్టీపీగా(ట్రైనర్) నియమితులయ్యారు. ఒక నెల వేతనం మాత్రమే పొందారు. ఉన్నట్టుండి ఆయనను ఏకంగా జాబ్స్ మేనేజర్ పోస్టింగ్ వరించడం డీఆర్డీఏలో సంచలనంగా మారింది. 10–15 ఏళ్ల సీనియర్లు ఎందరో ఉండగా జనవరిలో చేరిన వ్యక్తిని ఏకంగా కీలకమైన జాబ్స్ మేనేజర్గా నియమించడం చర్చనీయాంశమవుతోంది. ముడుపులు భారీగా ముట్టబెబితే తప్ప ఇది సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వంలో డబ్బుంటే ఏదైనా సాధ్యమనేందుకు ఈ నియామకం తాజా ఉదాహరణగా నిలుస్తోంది. కుంగిన ‘గోరుకల్లు’ కట్ట పాణ్యం: గోరుకల్లు రిజర్వాయర్ కట్ట సోమవారం కుంగింది. దీంతో స్థానికులు, రైతులు భయందోళన చెందుతున్నారు. ప్రస్తుతం గోరుకల్లు జలాశయంలో 5.2 టీఎంసీల నీరు ఉంది. ఈ నెలలో కట్ట భారీగా కుంగినట్ల అధికారులు గర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి స్థాయి పనులు చేయకుండా కేవలం నిర్వహణకు ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం గోరుకల్లు పెండింగ్ పనుల కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. కేవలం నిర్వహణ పనులు చేయిస్తున్నారు. దీంతో సోమవారం జలాశయం ఓటీ రెగ్యులేటర్ సమీపంలోని 3,200 మీటర్ల వద్ద 30 మీటర్ల మేర కట్ట కుంగిపోయింది. జలాశయం నీటిమట్టం 245 నుంచి 250 మీటర్లు వద్ద కట్ట కుంగినట్లు అధికారులు తెలిపారు. కట్ట కుంగిపోవడంపై అంచనా వేసిన మరమ్మతు కోసం జిల్లా కలెక్టర్కు రూ. 2కోట్లకు ప్రతిపాదనలు పంపినట్లు ఈఈ సుభకుమార్ తెలిపారు. కాగా.. ఈ కట్ట కుంగడం ఇది మూడోసారి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇదే చోట కట్ట కుంగిపోవడంతో యుద్ధప్రాదిపదికన రూ. కోటితో పనులు చేయించి రైతులకు ఇబ్బంది లేకుండా చేశారు. -
ముస్లింల పట్ల అంకితభావం చాటుకున్న వైఎస్సార్సీపీ
● వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కర్నూలు(టౌన్): వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముస్లింం పట్ల అంకితభావం చాటుకుందని ఆ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. సోమవారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వక్ఫ్ బిల్లు విషయంలో తెలుగుదేశం పార్టీ ద్వంద్వ విధానాలను అనుసరిస్తోందన్నారు. ముస్లింలకు మంచి చేసే సంస్థలను నీరుగార్చే విధంగా కేంద్రంలోని బీజేపీ కూటమి కుయుక్తులకు పాల్పడుతోందన్నారు. దేశ వ్యాప్తంగా ముస్లిం సమాజం వక్ఫ్ బిల్లుపై అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. ఇప్పటికే ఎన్నో రాజకీయ పార్టీలు, రాజకీయేతర సంఘాలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయన్నారు. అయితే ఈ విషయంలో కూటమి ప్రభుత్వ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు మౌనం వీడటం లేదని ప్రశ్నించారు. నేటి నుంచి చేపలవేట నిషేధం శ్రీశైలం ప్రాజెక్ట్: మత్స్యసంపద అభివృద్ధి కోసం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు రాష్ట్రం వ్యాప్తంగా చేపల వేటను ప్రభుత్వం నిషేధించింది. చేపల పునరుత్పత్తి ఈ రెండు నెలల్లో అధికంగా ఉంటుంది. మత్స్యకారులు వేట కొనసాగిస్తే పెద్ద చేపలతో పాటు చిన్న చేపలు కూడా అంతరించే ప్రమాదం ఉంది. కృష్ణా నదీ తీరం వెంట, శ్రీశైలండ్యాం ఎగువ, దిగువ ప్రాంతాల్లో చేపల వేటకు మత్స్యకారులు వెళ్లరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. -
యాక్సిడెంట్ చేసి చాకచక్యంగా పారిపోతున్నాం.. నిర్మానుష్య ప్రాంతాల్లో మద్యం, గంజాయి తాగుతున్నాం... మమ్మల్ని పోలీసులు గుర్తించలేరని భ్రమపడితే మీకు మూడినట్లే. మీకు తెలియకుండా మూడో కన్ను మిమ్మల్ని వెంటాడుతోంది. మీకంటే వేగంగా.. మీ వెంటే కలియతిరుగుతోంది. ఆకాశంల
కర్నూలు: కర్నూలు నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. దీంతో నిర్మానుష్య ప్రాంతాలకు కొదువ లేదు. మద్యం, గంజాయి తాగేవారి కార్యకలాపాలకు ఆయా ప్రాంతాలు నిలయాలుగా మారుతున్నాయి. యువత రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు ఎంత నిఘా పెట్టినా పూర్తిస్థాయిలో నియంత్రణ సాధ్యపడని పరిస్థితి. దీంతో క్లౌడ్ పెట్రోలింగ్ పేరుతో డ్రోన్ కెమెరాలను రంగంలోకి దింపారు. లైవ్లో చూస్తూ పోలీసులు అక్కడి పరిస్థితులను అంచనా వేస్తున్నారు. అనుమానం వస్తే వెంటనే సమీప పోలీసు బృందాలను అప్రమత్తం చేసి పనిపడుతున్నారు. ట్రాఫిక్ పరిరక్షణకు... నేర నియంత్రణతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ నిఘాను అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లాలో నాలుగు పోలీస్ సబ్ డివిజన్లు, 39 పోలీస్ స్టేషన్లు ఉండగా, ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు వినియోగించేందుకు అత్యాధునిక టెక్నాలజీ కలిగిన 6 డ్రోన్ కెమెరాలు ఉన్నాయి. ఈ డ్రోన్లు కిలోమీటర్ ఎత్తు, నగర పరిధిలో 2 కి.మీల చుట్టూ నిఘా ఉంచుతాయి. ఖాళీ ప్రదేశంలో 3 కి.మీల దూరం కూడా వెళ్తాయి. రాత్రివేళల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కెమెరా ద్వారా మనుషులను, వాహనాలను లెక్కిస్తుంది. మరికొన్ని కెమెరాలు తెప్పించేందుకు పోలీసు శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. వినియోగంపై పలువురికి శిక్షణ పోలీసింగ్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి పోలీసు శాఖ పెద్దపీట వేస్తూ దూకుడు ప్రదర్శిస్తోంది. జిల్లా వ్యాప్తంగా డ్రోన్లను విస్తృతంగా వినియోగిస్తూ అక్రమాలకు చెక్ పెడుతున్నారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ వీటి వినియోగంపై ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వినియోగంపై ఇప్పటికే ప్రతి పోలీస్ స్టేషన్కు ఇద్దరు చొప్పున శిక్షణ తీసుకున్నారు. ప్రతి పోలీస్ కానిస్టేబుల్ను డ్రోన్ పైలెట్గా తీర్చిదిద్దే కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలో ఇందుకోసం ఆరుగురు శిక్షకులు ఉన్నారు. విడతల వారీగా స్టేషన్ల నుంచి కానిస్టేబుళ్లను జిల్లా కేంద్రానికి రప్పించి శిక్షణ ఇచ్చే కార్యక్రమం కొనసాగుతున్నట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. స్టేషన్ పరిధిలో ఎక్కడైనా, ఏదైనా అసాంఘిక కార్యక్రమం చోటు చేసుకున్నట్లు సమాచారం అందితే డ్రోన్లను రంగంలోకి దింపుతున్నారు. ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా పండుగలు, దేవరలు, తిరునాలలు, భారీ వేడుకల సందర్భంగా ఇకపై డ్రోన్లతో నిఘా ఉంచనున్నారు. డ్రోన్తో నిశిత గస్తీ సమస్యాత్మక కాలనీలు, విద్యాసంస్థలు, జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో గస్తీ అమలు చేస్తున్నాం. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించేందుకు క్లౌడ్ పెట్రోలింగ్కు శ్రీకారం చుట్టాం. అనుమానం వచ్చిన ప్రాంతాల్లో డ్రోన్లను వినియోగించి నిందితులను పట్టుకుంటాం. వేగంతో దూసుకెళ్లే వాహనదారులపై డ్రోన్లతో నిరంతరం నిఘా ఉంటుంది. – విక్రాంత్ పాటిల్, జిల్లా ఎస్పీ అసాంఘిక కార్యకలాపాలపై నిఘా డ్రోన్ల రాకతో నిర్మానుష్య, అనుమానిత ప్రాంతాలు, సమస్యాత్మక కాలనీలపై నిఘా పెరిగింది. ఆయా కాలనీల పరిసర ప్రాంతాల్లో డ్రోన్లను ఎగురవేసి చిత్రాలు, వీడియోలు తీస్తున్నారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు డ్రోన్ సేవలు దోహదపడుతున్నాయి. ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణపై కర్నూలులో డ్రోన్ సేవలకు శ్రీకారం చుట్టారు. స్టేషన్ నుంచే లైవ్లో చూస్తూ సుదూర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లను గుర్తించి అక్కడి పరిస్థితులను అంచనా వేస్తున్నారు. నగరంలోని ఏ మూలన ట్రాఫిక్ సమస్య తలెత్తినా ఎప్పటికప్పుడు గుర్తించేందుకు డ్రోన్ సేవలు ఉపయోగపడుతున్నాయి. -
రేపు శ్రీశైల భ్రామరీకి కుంభోత్సవం
శ్రీశైలంటెంపుల్: లోక కల్యాణం కోసం శ్రీశైలంలో వెలసిన భ్రమరాంబాదేవికి మంగళవారం కుంభోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం ప్రాతఃకాల పూజల అనంతరం అమ్మవారికి ఆలయ అర్చకులు ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుంకుమ పూజలు, జపపారాయణలను నిర్వహిస్తారు. అనంతరం భ్రమరాంబాదేవికి కొబ్బరికాయలు, నిమ్మకాయలు, గుమ్మడికాయలతో తొలి విడత సాత్వికబలి సమర్పిస్తారు. కుంభోత్సవంలో భాగంగానే హరిహరరాయగోపురం వద్ద ఉన్న మహిషాసురమర్థిని అమ్మవారికి (కోటమ్మవారికి) ప్రత్యేక పూజలు జరిపించి సాత్వికబలి సమర్పిస్తారు. సాయంత్రం మల్లికార్జున స్వామివారికి ప్రదోషకాల పూజల అనంతరం అన్నాభిషేకం జరిపించి ఆలయ ద్వారాలు మూసివేస్తారు. అనంతరం అమ్మవారి ఆలయానికి ఎదురుగా సింహ మండపం వద్ద అనాన్ని రాశిగా పోసి సీ్త్ర వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పిస్తాడు. రెండోవిడత సాత్వికబలిని సమర్పించిన తర్వాత భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. అలాగే అమ్మవారికి ప్రత్యేక పూజలను చేసి తొమ్మిది రకాల పిండివంటలతో మహా నివేదన చేస్తారు. కుంభోత్సవాన్ని పురస్కరించుకుని స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం, ఏకాంతసేవ, అన్ని ఆర్జిత సేవలు నిలుపుదల చేశారు. -
ప్రభుత్వ ఇంటర్ విద్య.. ఇక మిథ్య!
కర్నూలు సిటీ: రాష్ట్ర పెద్దలు ప్రభుత్వ ఇంటర్ విద్యను నిర్వీర్యం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలను బలోపేతం చేయకుండా పరోక్షంగా కార్పొరేట్, ప్రైవేటు కళాశాలలకు మేలు చేసేలా సంస్కరణల తీసుకొచ్చారు. కార్పొరేట్, ప్రైవేటు కాలేజీలో అదనపు సెక్షన్లకు అనుమతులు సైతం ఇచ్చారు. విద్యను సామాజిక సేవగా భావించకుండా కొన్ని ‘కార్పొరేట్’ సంస్థలు వ్యాపారంగా మార్చాయి. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన మంత్రిగా పనిచేస్తున్న నారాయణకు చెందిన విద్యా సంస్థల ప్రతినిధిని ఇంటర్మీడియట్ బోర్డులో నియమించారు. బోర్డు చరిత్రలో ఎప్పుడు కూడా కార్పొరేట్ కాలేజీలకు చెందిన ప్రిన్సిపాల్ను మెంబరుగా నియమించలేదు. గత ప్రభుత్వం మండలానికి రెండు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకుంది. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ప్రభుత్వ ఇంటర్ విద్యను పేద బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకు దూరమయ్యేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు అవకాశం కల్పించారు. ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్ ఇవ్వాలంటే కచ్చితంగా పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. అయితే హాల్ టికెట్పై అడ్మిషన్ ఇవ్వాలని బోర్డు చెప్పింది. అయినప్పటికీ ‘పది’ పరీక్షల ఫలితాలు రాకుండా ఎలా అడ్మిషన్ ఇవ్వాలో అర్థంకాక ఇంత వరకు దరఖాస్తులు ఇచ్చినా అడ్మిషన్ చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ‘నారాయణ’ పెత్తనం ఇంటర్మీడియట్ బోర్డు అడ్మినిస్ట్రేటివ్ మెంబర్లుగా, ఎక్స్ ఆఫిషియో మెంబర్లుగా పది మందిని, యూనివర్సిటీ వీసీలుగా పని చేస్తున్న వారిని నలుగురిని నామినేట్గా ఎంపిక చేస్తారు. వీరితో పాటు ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, కేజీబీవీ, రెసిడెన్షియల్ కాలేజీలకు చెందిన వారిని మెంబర్లుగా నియమించాలి. అయితే ప్రైవేటు కాలేజీలకు చెందిన వ్యక్తిని నియమించాలని ఎక్కడా లేదని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ఎప్పుడూ లేకపోయినా బోర్డులో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎ.ఆనంద కిరణ్ అనే నారాయణ విద్యా సంస్థలకు చెందిన ప్రిన్సిపాల్ను నియమించారు. ఆయన సూచనల మేరకే అకడమిక్ క్యాలెండర్లో మార్పులు చేసి, పది పరీక్షల ఫలితాలు రాకముందే అడ్మిషన్ల షెడ్యూల్ జారీ చేశారు. సర్వత్రా విమర్శలు ప్రతి ఏటా జూన్లో జూనియర్ కాలేజీల తరగతులు పునఃప్రారంభం అయ్యేవి. కానీ కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణల ప్రకారం అంటూ ఈ నెల 1వ తేదీ నుంచే జూనియర్ కాలేజీల తరగతులు పునఃప్రారంభించారు. ఫస్ట్ ఇయర్ తరగతుల అడ్మిషన్ల కోసం ఇచ్చిన షెడ్యుల్ ప్రకారం ఈ నెల 7 నుంచి 23వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. పది తరగతి పరీక్షల మూల్యాంకనం ఇటీవలే పూర్తి అయ్యింది. ఫలితాలు రావాలంటే మరో పది, పన్నెండు రోజులు పడుతుంది. అసలు ఫలితాలే రాకుండా జూనియర్ కాలేజీల్లో ఎలా అడ్మిషన్లు ఇస్తారో తెలియక ఇంత వరకు ప్రభుత్వ కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ కూడా రాలేదని తెలుస్తోంది. సంస్కరణల పేరుతో కార్పొరేట్ కాలేజీలు ఏటా ముందస్తూనే అనధికారికంగా అడ్మిషన్లు చేసుకునే వారు. వీటిపై ఏటా విమర్శలు వస్తుండడంతో కూటమి ప్రభుత్వం అధికారికంగా అడ్మిషన్లకు అనుమతులు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉత్తర్వులను అమలు చేస్తున్నాం ఇంటర్మీడియట్ విద్యలో ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చింది. ఈ నెల 1వ తేదీ నుంచే సెకండ్ ఇయర్ తరగతులు ప్రారంభించాం. ఫస్ట్ ఇయర్కు 7వ తేదీ నుంచి ప్రవేశాలు కల్పిస్తున్నాం. అకడమిక్ ఇయర్ క్యాలెండర్ను జారీ చేసి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేస్తున్నాం. – గురవయ్య శెట్టి, ఆర్ఐఓ, ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి ఈ నెల 7 నుంచి 23 తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలను పట్టించుకోని బోర్డు అధికారులు కార్పొరేట్ కాలేజీల్లో ప్రవేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన యాజమాన్యాలు ఇంటర్ బోర్డులో మెంబర్గా నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్ఉమ్మడి కర్నూలు జిల్లాలో జూనియర్ కళాశాలల వివరాలు.. కళాశాల పేరు సంఖ్య ప్రభుత్వ జూనియర్ 44 ఏపీ మోడల్ 35 కేజీబీవీ 53 ఏపీ రెసిడెన్షియల్ 02 సోషల్ వెల్ఫేర్ 14 జ్యోతిరావు పూలే 04 ఎయిడెడ్ 04 ట్రైబల్ వెల్ఫేర్ 03 వొకేషనల్ 03 హైస్కూల్ ఫ్లస్ 04 ప్రైవేటు 147 మొత్తం 313 -
ట్రాన్స్జెండర్లకూ ఉపాధి చూపాలి
కర్నూలు(హాస్పిటల్): ట్రాన్స్జెండర్లకూ సంక్షేమ పథకాలు అందించాలని, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని బెంగళూరులోని వైదేహి మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ హెచ్ఓడీ డాక్టర్ ఎన్. జగదీష్ అన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలో రెండురోజులుగా కొనసాగుతున్న ఫోరెన్సిక్ వైద్యుల రాష్ట్రస్థాయి సదస్సు ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా డాక్టర్ ఎన్. జగదీష్ మాట్లాడుతూ.. ట్రాన్స్జెండర్స్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ యాక్ట్ 2020లో వచ్చిందన్నారు. ఇతరుల మాదిరిగానే ట్రాన్స్జెండర్లకూ ఆరోగ్య సమస్యలు ఉంటాయని, వాటి గురించి వైద్యులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇటీవల కాలికట్లో ఓ ట్రాన్స్జెండర్ ప్రసవనొప్పులతో వచ్చారని, ఇలాంటి వారికి ఏ విధమైన చికిత్సను అందించాలో వివరించారు. కొందరు పోలీస్ అధికారులు మాట్లాడుతూ.. కొంత మంది ట్రాన్స్జెండర్స్ భిక్షాటన చేస్తూ అల్లరి చేస్తున్నారని, వారిని ఎలా నియంత్రించాలో అర్థం కావడం లేదని చెప్పారు. దీనిపై డాక్టర్ జగదీష్ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ట్రాన్స్జెండర్స్ అభివృద్ధి కోసం ప్రణాళిక రూపొందించిందన్నారు. వారికి సంక్షేమ పథకాలు అందించడమే గాక నైపుణ్యాలు పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. చాలా మంది ఆరోగ్య సమస్యలున్నా ఆసుపత్రికి వచ్చి చెప్పుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారని, ఇలాంటి వారికి ఆన్లైన్ ద్వారా ఉన్నచోటే వైద్యుల సలహాలు, సూచనలతో వైద్యం అందుకునే వెసలుబాటు ప్రభుత్వం తెచ్చిందన్నారు. ఇందుకు వారు జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అనాఽథలైన ట్రాన్స్జెండర్లకు ఆశ్రయం కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం గరీమా గృహ ప్రారంభించిందని తెలిపారు. ట్రాన్స్జెండర్ అని చెప్పడానికి ఎలాంటి సర్టిఫికెట్ అవసరం లేదని, సంక్షేమ పథకాలు పొందాలంటే మాత్రం గుర్తింపుకార్డు ఉండాలన్నారు. అనంతరం వివిధ అంశాలపై పలువురు ఫోరెన్సిక్ వైద్యులు ప్రసంగించారు. కార్యక్రమంలో ఫోరెన్సిక్ హెచ్ఓడీ డాక్టర్ సాయిసుధీర్, ప్రొఫెసర్ డాక్టర్ బ్రహ్మాజీ మాస్టర్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వైకేసీ రంగయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ కె. నాగార్జున, డాక్టర్ వి. కోటేశ్వరరావు, డాక్టర్ పి. హరీష్కుమార్, డాక్టర్ వి.సురేఖ, డాక్టర్ మహమ్మద్ సాహిద్ పాల్గొన్నారు. ఫోరెన్సిక్ హెచ్ఓడీ డాక్టర్ జగదీష్ -
ప్రభుత్వ బడిని కాపాడుకోవాలి
కర్నూలు సిటీ: ఉపాధ్యాయులందరూ పోరాటాలు చేసి ప్రభుత్వ బడిని కాపాడుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని సీక్యాంపులో ఆదివారం యూటీఎఫ్ నూతన జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. ముందుగా ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్కుమార్ అధ్యక్షతన విద్యా రంగ సవాళ్లు–కర్తవ్యాలపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నూతన జాతీయ విద్యా విధానం ప్రశ్నించేతత్వం లేకుండా చేస్తోందన్నారు. పాలక వర్గాల ప్రయోజనాల కోసమే విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారని ఆరోపించారు. ఉపాధ్యాయులతో పాఠాలు చెప్పించకుండా ఇతర పనులు చేయిస్తున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే 117 జీఓ రద్దు చేస్తామని పాదయాత్రలో లోకేష్ హామీనిచ్చారని, దాన్ని రద్దు చేయకుండా ప్రత్యామ్నాయం కోసం కసరత్తు చేస్తున్నారన్నారు. 2018లో 38 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉండేవారని, కానీ నేడు అది 32.61 లక్షల మందికి తగ్గిందన్నారు. ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ.. పీఆర్సీ ఏర్పాటు చేయాలన్నారు. ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శులు జయచంద్రారెడ్డి, లక్ష్మీరాజు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, నవీన్ పాటి, పూర్వ గౌరవ అధ్యక్షులు నరసింహూలు, ఆడిట్ కమిటీ సభ్యులు ఎం.వి రమణయ్య, సుబ్బారెడ్డి, పూర్వ సహాధ్యక్షుడు నాగమణి, పూర్వ కార్యదర్శి కోటేశ్వరప్ప, జిల్లా ఉపాధ్యక్షుడు హేమంత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వర్లు -
జిల్లా విద్యార్థినులకు సన్షైన్ స్టార్ అవార్డులు
కర్నూలు సిటీ: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలల్లో చదువుతూ ఇంటర్మీడియట్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో సన్షైన్ అవార్డులను ఇవ్వనున్నారు. ఇంటర్మీడియట్లో 7 రకాల గ్రూప్లకు ఒక్కో గ్రూప్లో అత్యధిక మార్కులు సాధించిన ఒక విద్యార్థికి అవార్డులను రేపు(మంగళవారం) విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అందించనున్నట్లు సమగ్ర శిక్ష అదనపు కో–ఆర్డినేటర్ టి.శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గూడూరు కేజీబీవీలో ఇంటర్మీడియట్ సెకండియర్ ఎంపీసీ గ్రూప్ చదువుతూ ఉప్పరి సునీత 983 మార్కులు సాధించి సన్షైన్ అవార్డుకు ఎంపిక అయ్యారన్నారు. ఓర్వకల్లు కేజీబీవీలో ఎంఈసీ గ్రూప్ చదువుతున్న బోయ హరిత 913 మార్కలు సాధించి, పంచలింగాల కేజీబీవీలో అకౌంట్స్ అండ్ టాక్సెషన్ గ్రూప్లో టి.మానస 992 మార్కులు సాధించి అవార్డులకు ఎంపికయ్యారన్నారు. సర్వీస్ వివరాలతో పదోన్నతులు కర్నూలు సిటీ: సర్వీసు ప్రొఫైల్ వివరాల ఆధారంగానే భవిష్యత్తులో ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు ఉంటాయని డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో పని చేస్తున్న గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సర్వీస్ ప్రొఫైల్ వివరాలను టీఐఎస్(టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం)ఫేషియల్ యాప్లో ఉన్నాయని, మరోసారి సరి చూసుకోవాలని పేర్కొన్నారు. అభ్యంతరాలు ఉంటే సోమవారం సాయంత్రం 5 గంటలలోపు అధారాలతో హెచ్ఎం, ఎంఈఓల ద్వారా డీఈఓ ఆఫీస్లో అందజేయాలని తెలిపారు. -
ఆయుష్ వైద్యుల సంఘం అడహక్ కమిటీ ఎన్నిక
కర్నూలు(హాస్పిటల్): రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ (రామా) జిల్లా అడహక్ కమిటీ ఎన్నికై ంది. ఆదివారం అసోసియేషన్ సమావేశం స్థానిక గౌరిగోపాల్ హాస్పిటల్ వద్ద ఉన్న డాక్టర్ సులోచన ఎమర్జెన్సీ హోమియో హాస్పిటల్లో నిర్వహించారు. అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ బండారు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అడహక్ కమిటీ ఎన్నిక చేశారు. జిల్లా ప్రెసిడెంట్గా పీవీ నాగరాజ, వైస్ ప్రెసిడెంట్గా డీఏ పద్మనాభరెడ్డి, ప్రసాద్, జనరల్ సెక్రటరీగా జె.యధుభూషణ్రెడ్డి, జాయింట్ సెక్రటరీగా నవీన్కుమార్, ట్రెజరర్గా రజాక్బాషా, ఉమామహేశ్వరి, మహిళా శాఖ అబ్జర్వర్లుగా స్వర్ణలత, లక్ష్మీషాలిని, లీష్మా, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా సురేష్కుమార్, నాగరాజు, ఫయాజ్, అమర్నాథ్, చీఫ్ అడ్వయిజర్గా డీఏ పద్మనాభరెడ్డి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో టి. చంద్రశేఖర్రెడ్డి, మురళీధర్, స్వర్ణలత, అఖిల, పి. ప్రభాకర్రెడ్డి, అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. యువకుడి ఆత్మహత్య తుగ్గలి:మండల పరిధిలోని రామాపురం గ్రామానికి చెందిన వెంకటేష్(30) అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జొన్నగిరి ఎస్ఐ ఎన్సీ మల్లికార్జున తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడుకు చెందిన రాజేశ్వరితో స్నేహం ఏర్పడడంతో వెంకటేష్ రెండేళ్ల క్రితం ఆమెను స్వగ్రామానికి తీసుకొచ్చాడు. సహ జీవనం చేస్తూ జీవిస్తున్న వీరి మధ్య మనస్పర్థలు రావడంతో గత నెల 14వ తేదీన రాజేశ్వరి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన వెంకటేష్ ఒంటరి జీవితంపై విరక్తి చెంది శనివారం రాత్రి ఇంటి పైకప్పు గరండాకున్న ఇనుప కొక్కీకి చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి తండ్రి మల్లికార్జున ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆదివారం తెలిపారు. సెల్ఫోన్ల దొంగల అరెస్ట్ డోన్ టౌన్: సెల్ఫోన్లను చోరీ చేసే దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 11వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున కారులో సెల్ఫోన్లు తరలిస్తుండగా అనుమానం వచ్చిన బీట్ కానిస్టేబుల్ తనిఖీ చేశారు. కారులో ఉన్న వంశీ, ప్రేమ్ అనే ఇద్దరిని, చోరీ చేసిన సెల్ ఫోన్లను, కారును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కారులో ఉన్న సెల్ఫోన్లు, నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు వారి ఇంటిలో సోదాలు చేశారు. మరికొన్ని సెల్ఫోన్లను స్వాధీనం చేసుకోని విచారణ చేపట్టారు. ఈ విషయంపై పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా మాట్లాడుతూ.. విచారణ చేస్తున్నది వాస్తవమేనని, సోమవారం నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ప్రాణం తీసిన ఈత సరదా ● ఎల్లెల్సీలో పడి యువకుడి మృతి హాలహర్వి: సరదాగా ఈతకు వెళ్లిన ఓ యువకుడు మృతి చెందాడు. గూళ్యం గ్రామంలో ఆదివారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గూళ్యం గ్రామానికి చెందిన శివప్ప(18) అనే యువకుడు పొలం పనులు ముగించుకుని తోటి స్నేహితులతో కలిసి ఎల్లెల్సీలో ఈతకు వెళ్లాడు. స్నేహితులు కాలువలో ఈత కొడుతుండడం చూసి తాను కూడా ఈత నేర్చుకోవాలని శివప్ప మెల్లగా ఈదుకుంటూ కాలువలోకి వెళ్లాడు. ఎక్కువ దూరం వెళ్లి నీటిలో మునిగి గల్లంతయ్యాడు. గమనించిన తోటి స్నేహితులు కాలువలో గాలించగా శివప్ప శవమై తేలాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గంగమ్మ, మారెప్పలు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
పెద్ద దిక్కులేదు!
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల అందరికీ పెద్ద దిక్కులాంటిది. జిల్లా నలుమూలలతో పాటు ఇతర జిల్లాల నుంచి సైతం ఈ ఆసుపత్రిని నమ్ముకుని చికిత్స కోసం రోగులు వస్తుంటారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వైద్యం అందించాల్సిన ప్రభుత్వం తూతూ మంత్రంగా సేవలందిస్తోంది. సగానికి పైగా మందులు, వైద్యపరీక్షలు బయటకు వెళ్తున్నాయి. నాలుగో తరగతి ఉద్యోగుల మామూళ్ల దందా ఆగడం లేదు. మధ్యలో ఆగిపోయిన ఐపీ బిల్డింగ్ నిర్మాణంతో పడకలు చాలక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏడాదిన్నర తర్వాత నేడు ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక కథనం. మందుల కొరత తీవ్రం ఆసుపత్రిలో ప్రస్తుతం 324 రకాల మందులు అందుబాటులో ఉండగా 47 రకాల మందుల కొరత ఉంది. ప్రధానంగా ఆల్బుమిన్స్, ఇన్సులిన్, పలు రకాల యాంటిబయాటిక్స్ మందులు, ఇంజెక్షన్లు, బ్లడ్శాంపిల్ ట్యూబ్లు, కొన్ని మాత్రమే ఇస్తున్నారు. ఎక్కువగా బయటకు రాస్తున్నారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి మందుల సరఫరా సరిగ్గా లేకపోవడంతో స్థానికంగానే అధికారులు మందులు అత్యవసరంగా కొనుగోలు చేస్తున్నారు. ఇన్సులిన్, ఆల్బుమిన్ ఇంజెక్షన్లు ఎక్కువగా స్థానికంగానే కొనుగోలు చేస్తున్నారు. అవి కూడా రోగులకు అరకొరగా ఇస్తున్నారు. గతంలో ఇన్సులిన్ను నెలకు సరిపోయే బాటిళ్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఒకటి మాత్రమే చేతిలో పెట్టి పంపిస్తున్నారు. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు జిల్లా నుంచే గాక నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, రాయచోటి, ప్రకాశం జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి రోజూ 2,500 మంది దాకా ఓపీ, 1,500 మంది ఇన్ పేషంట్లు చికిత్స పొందుతున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీ నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు పీజీ వైద్య విద్యార్థులు ఆయా విభాగాల్లో అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించాల్సి ఉంది. కానీ అనేక ఓపీ విభాగాల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండటం లేదు. వచ్చినా కొద్దిసేపు ఉండి వెళ్తున్నారు. మరికొన్ని సూపర్స్పెషాలిటీ విభాగాల్లో అసలు ఓపీ నిర్వహించడం లేదు. నేరుగా వార్డుకు రమ్మని చెబుతున్నారు. అక్కడ వైద్యులు సకాలంలో ఉండటం లేదు. పీజీ వైద్యులే వారికి చికిత్స అందించి పంపిస్తున్నారు. ఆగిన ఐపీ భవనం నిర్మాణంతో ఇక్కట్లు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా బోధనాసుపత్రిని రూ.500 కోట్లతో ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇన్పేషంట్ భవనాన్ని నిర్మించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఆసుపత్రిలోని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వెనుక వైపున దీని నిర్మాణం 2023లో జోరుగా సాగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిధుల లేమితో పనులు ఆగిపోయాయి. 80వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ భవనం నిర్మాణం పూర్తయితే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జికల్ విభాగాలన్నీ ఇందులోకి వస్తాయి. ప్రస్తుతం పాత భవనాలన్నీ కూల్చివేయడంతో ఇతర విభాగాల్లో అసౌకర్యాల మధ్య రోగులు చికిత్స అందుకుంటున్నారు. వైద్యసేవ కార్డు ఉంటేనే ఉచితం ప్రభుత్వ సర్వజన వైద్యశాల అంటే ఉచితంగా వైద్యసేవలు అందించాలి. ఈ మేరకు అవసరమైన నిధులను ప్రభుత్వం పన్నుల ద్వారా ప్రజల నుంచే సేకరిస్తుంది. ఆ సొమ్ముతోనే వైద్యులు, ఉద్యోగులు, వైద్య సిబ్బందికి, ఆసుపత్రి నిర్వహణకు ఖర్చు పెడుతుంది. కానీ ఈ ఆసుపత్రిలో మాత్రం ఎన్టీఆర్ వైద్యసేవ కార్డు లేకపోతే కొన్ని విభాగాల్లో సేవలు అందడం లేదు. వైద్యుల సేవలు మాత్రం ఉచితంగా అందిస్తున్నారు. శస్త్రచికిత్సకు అవసరమైన పరికరాలు, మందులు, సర్జికల్స్ రోగులే బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఖర్చుచేసే స్థోమత లేకపోతే వెనక్కి పంపిస్తున్నారు. ముఖ్యంగా సూపర్స్పెషాలిటీ విభాగాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. తెలంగాణ, కర్ణాటక ప్రాంతానికి చెందిన రోగులకు కేవలం వైద్యుల సేవలు మాత్రమే అందుతున్నాయి. ఆసుపత్రిలో చేరితే ఇతర ఖర్చులన్నీ వారు పెట్టుకోవాల్సిన పరిస్థితి. వైద్యుల పోస్టుల ఖాళీలతో ఇబ్బందులు బోధనాసుపత్రిలో 224 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మంజూరు కాగా అందులో ప్రస్తుతం 45 పోస్టులు ఖాళీ గా ఉన్నాయి. అలాగే 71 ప్రొఫెసర్ పోస్టులకు గాను 63 మంది పనిచేస్తుండగా 8 పోస్టులు ఖాళీగా ఉన్నా యి. 69 మంది అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు గా ను 57 మంది పనిచేస్తుండగా 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ కారణంగా ఆయా విభాగాల్లో వైద్యులు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎప్పటికప్పుడు పోస్టులు భర్తీ చేసేవారు. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యథేచ్ఛగా ప్రైవేటు ల్యాబ్లకు పరీక్షలు ఆసుపత్రిలోని డయాగ్నోస్టిక్ బ్లాక్లో అన్ని పరీక్షలు చేయాలి. ఈ మేరకు అవసరమైన కిట్లను సైతం అధికారులు అందుబాటులో ఉంచారు. కానీ కొందరు వైద్యులు, పీజీ వైద్య విద్యార్థులు పలు రకాల వైద్యపరీక్షలు బయటకు రాస్తున్నారు. ప్రత్యేకంగా ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఒక ప్రైవేటు ల్యాబ్ పేరు చెప్పి పంపిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఆసుపత్రి రివాల్వింగ్ గేటు వద్ద సదరు ల్యాబ్కు చెందిన వ్యక్తులు కాపుకాసి మరీ వారిని ల్యాబ్కు తీసుకెళ్లి పరీక్షలు చేసి పంపిస్తున్నారు. రాత్రి పూట అయితే అత్యవసరంగా డయాగ్నోస్టిక్ బ్లాక్లో చేయరని సాకుగా చూపి ప్రైవేటుకు వైద్యపరీక్షలు పంపిస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పెద్దాసుపత్రి మందులు, వైద్యపరీక్షలు బయటకే...! తూతూ మంత్రంగా వైద్యసేవలు ప్రైవేటులో రోగుల జేబులు ఖాళీ నేడు ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశం -
క్యాన్సర్ను జయిస్తూ.. చదువులో రాణిస్తూ!
గోనెగండ్ల: ఓ విద్యార్థిని క్యాన్సర్ను జయిస్తూ ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటింది. గోనెగండ్లకు చెందిన ఉరుకుందు గౌడ్, జానకి దంపతులకు కుమార్తె సృజనామృత, కుమారుడు భగీరథ్ గౌడ్లు ఉన్నారు. ఉరుకుందు ప్రస్తుతం కర్నూలు రెండో బెటాలియన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. కర్నూలులోనే నివాసం ఉంటున్నారు. గత ఏడాది సృజనామృత పదో తరగతి చదువుతుండగా క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు బయటపడింది. మహమ్మారితో పోరాడుతూనే చదువు కొనసాగిస్తోంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఉదయం రాసి మధ్యాహ్నం నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందింది. పరీక్షల్లో ప్రతిభ చాటుతూ 493 మార్కులు సాధించింది. అప్పటి నుంచి క్యాన్సర్తో బాధపడుతూనే కర్నూలులో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇంటర్ పరీక్షలు రాసింది. శనివారం విడుదలైన ఫలితాల్లో 420 మార్కులు సాధించింది. ఎంబీబీఎస్ సీటు సాధించి పేద ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని సృజనామృత చెబుతోంది. బైపీసీలో 420 మార్కులు సాధించిన సృజనామృత -
వైభవంగా శ్రీవారి రథోత్సవం
సి. బెళగల్: మండల పరిధిలోని క్రిష్ణదొడ్డి గ్రామంలో శ్రీ కోన వేంకటేశ్వర స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. మండలంలోని చుట్టుపక్కల గ్రామాలతో పాటు గూడూరు, కోడుమూరు, గోనెగండ్ల, ఎమ్మిగనూర్ మండలాల భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రథోత్సవానికి ముందు ఆలయ పూజార్లు గణపతి పూజ, పుణ్యహవాచనం, సంప్రోక్షణ గావించి అర్ధరాత్రి 12 గంటలకు కుంభంను ప్రారంభించారు. ఆదివారం తెల్లవారు జామున 5 గంటలకు భక్తజనం మధ్య మహారథోత్సవం జరిగింది. తర్వాత పార్వేట నిర్వహించారు. శ్రీవారు, అమ్మవారి సమేత ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఆశీనులు చేసి గ్రామంలో ఊరేగించారు.కాగా సోమవారం ఆది దంపతులకు వసంతోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
ఆర్టీసీ డిపో మేనేజర్ ఇంట్లో భారీ చోరీ
కర్నూలు: కర్నూలు ఆర్టీసీ 2వ డిపో మేనేజర్గా పనిచేస్తున్న జమృద్ సర్దార్ హుసేన్ ఇంట్లో దొంగలు పడి అందినకాడికి మూటగట్టుకొని ఉడాయించారు. ఆయన నగరంలోని గణేష్నగర్ పక్కన ఉన్న సాయి వైభవ నగర్లో నివాసం ఉంటున్నారు. మనువరాలికి ఆరోగ్యం సరిగా లేదని తెలియనడంతో కుటుంబ సభ్యులతో కలిసి సర్దార్ హుసేన్ శనివారం హైదరాబాద్కు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటి గ్రిల్ తాళాలతో పాటు ప్రధాన తలుపులకు ఉన్న తాళాలను పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. పడకగదిలో ఉన్న బీరువాను బద్దలు కొట్టి అలమారాలో ఉన్న 42 తులాల బంగారు నగలు, రూ.50 వేల నగదును మూటగట్టుకొని ఉడాయించారు. ఆదివారం ఉదయం పనిమనిషి ఇళ్లు శుభ్రం చేసేందుకు వచ్చే సరికి తలుపులు తెరచి ఉండడంతో ఫోన్ చేసి ఇంటి యజమానికి సమాచారం ఇచ్చింది. హుటాహుటిన ఆయన హైదరాబాద్ నుంచి కర్నూలుకు చేరుకొని చోరీ జరిగిందని నిర్ధారించుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, 3వ పట్టణ సీఐ శేషయ్య, ఎస్ఐ రహమాన్, సీసీఎస్ సీఐ శ్రీనివాసనాయక్ తదితరులు అక్కడికి చేరుకొని నేరం జరిగిన తీరును పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ సిబ్బందిని రప్పించి ఆధారాలు సేకరించారు. డాగ్ చోరీ జరిగిన ఇంటి వద్ద నుంచి కాలనీ చివరి వరకు వెళ్లి ఆగిపోయింది. చోరి జరిగిన విషయాన్ని తెలుసుకున్న కాలనీ ప్రజలు ఇంటి వద్దకు వచ్చి చూడడంతో పాదాల అచ్చులు పడి సరైన ఆధారాలు క్లూస్ టీంకు లభించలేదు. కాలనీలోని సమీపంలోని సీసీ పుటేజ్లను క్రైం పార్టీ సిబ్బంది సేకరించి పాత నేరస్తుల ఫొటోలతో జతపరిచి దొంగలను గుర్తించే పనిలో ఉన్నారు. బాధితుడు సర్దార్ హుసేన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మాజీ సైనికుడి ఇంట్లో దొంగతనం డోన్ టౌన్: పట్టణంలోని శ్రీరామ్నగర్లో నివసిస్తున్న మాజీ సైనికుడు ధర్మారెడ్డి ఇంట్లో పట్ట పగలు చోరీ జరిగింది. ఈయన భార్యతో కలిసి శనివారం ఇంటికి తాళం వేసి బంధువుల ఊరు పత్తికొండకు వెళ్లాడు. గమనించిన గుర్తు తెలియని దుండగులు ఇంటి వెనుక భాగం నుంచి గోడ దూకి తాళం పగుల గొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉన్న 10 తులాల బంగారు నగలు, రూ.30 వేల నగదు అపహరించకుపోయారు. బాధితుడు శనివారం రాత్రి 9 గంటలకు ఇంటికి చేరుకొని చూడగా తాళం తెరిచి ఉండటంతో చోరీ జరిగిందని నిర్ధారించుకుని పోలీసులకు సమాచారమిచ్చాడు. దీనిపై వారు ఆదివారం విచారణ చేపట్టారు. 42 తులాల బంగారు, రూ.50 వేల నగదు అపహరణ -
గాయపడిన వ్యక్తి మృతి
మహానంది: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గంగవరం గ్రామానికి చెందిన గాలి శ్రీనివాసులు(62) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...నందిపల్లె మెట్ట వద్ద శుక్రవారం రాత్రి నంద్యాలకు వెళ్తున్న ఓ ఆటో ఎదురుగా బైక్పై వస్తున్న గోపవరం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో డ్రైవర్ పక్కన కూర్చున్న శిరివెళ్ల మండలం గంగవరం గ్రామానికి చెందిన శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డాడు. 108 ద్వారా నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు సర్వజన ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించినట్లు ఎస్ఐ రామ్మోహన్రెడ్డి తెలిపారు. మృతి చెందిన శ్రీనివాసులు కుమారుడు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఏపీ మోడల్ హాస్టల్లో నాగుపాము మహానంది: మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురంలోని ఏపీ మోడల్ హాస్టల్లో శనివారం రాత్రి నాగుపాము కనిపించడంతో విద్యార్థినులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. నాగుపామును చూసిన సిబ్బంది వెంటనే అయ్యన్ననగర్ గ్రామానికి చెందిన స్నేక్క్యాచర్ మోహన్కు సమాచారం అందించగా మోహన్ వెంటనే హాస్టల్ వద్దకు చేరుకుని నాగుపామును పట్టుకుని నల్లమల అటవీ ప్రాంతంలో వదిలేశాడు. -
సేల్స్మ్యాన్ కూతుళ్లకు ఉత్తమ మార్కులు
కల్లూరు షరీఫ్ నగర్కి చెందిన రాజశేఖర్, జ్యోతి దంపతులకు ముగ్గురు కూతుళ్లు సంతానం. రెండో కూతురు డి.నందిని, మూడో కూతురు నవీనాలు ఇద్దరు ప్రభుత్వ టౌన్ మోడల్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించారు. నందిని బైపీసీలో 980 మార్కులు, నవీనా 937 మార్కులు సాధించారు. ముగ్గురు కూతుళ్లను ఉన్నత చదువులు చదివించేందుకు సేల్స్మ్యాన్గా పని చేస్తున్నారు. నీట్ ప్రవేశ పరీక్షకు అధ్యాపకులు కోచింగ్ ఉచితంగా ఇప్పిస్తున్నారని, డాక్టర్ కావాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు నందిని తెలిపారు. -
పోలీస్, న్యాయ శాఖలకు ‘ఫోరెన్సిక్’ వారధి
కర్నూలు(హాస్పిటల్): పోలీస్, న్యాయ శాఖలకు ఫోరెన్సిక్ విభాగం వారధి వంటిదని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ డీఎస్ఎల్వీ నరసింహులు అన్నారు. కర్నూలు మెడికల్ కాలేజిలో ఫోరెన్సిక్ విభాగం ఆధ్వర్యంలో రెండురోజుల 6వ రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ వైద్యుల సదస్సు శనివారం ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన డీఎంఈ డాక్టర్ నరసింహులు మాట్లాడుతూ.. ఫోరెన్సిక్ విభాగంలో మెడికో లీగల్ డాక్యుమెంటేషన్ అధిక ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. క్లినికల్ ఫోరెన్సిక్ మెడిసిన్ను ఓపీ విభాగంలో చేర్చేందుకు ప్రభుత్వానికి నివేదించామని, అనుమతి లభించిన వెంటనే ఓపీ విభాగంలో కూడా సేవలందిస్తామని చెప్పారు. అధునాతన టెక్నాలజీతో కచ్చితమైన ఫలితాలను అందించవచ్చన్నారు. ఎంఎల్సీ కేసుల్లో ఫోరెన్సిక్ విభాగం ఇచ్చే నివేదికతో నిందులను గుర్తించవచ్చన్నారు. ● విశిష్ట అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ.. మెడికో లీగల్ కేసుల్లో ఫోరెన్సిక్ విభాగం సేవలు మరువలేనివన్నారు. ఆ విభాగం అందించే నివేదికలతోనే నేర పరిశోధనలో వాస్తవ విషయాలు వెలుగు చూస్తున్నాయన్నారు. నేర పరిశోధనలో ‘రియల్ హీరోస్’ ఫోరెన్సిక్ విభాగ వైద్యులేనని అన్నారు. ● మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ మాట్లాడుతూ గతంతో పోలిస్తే ఫోరెన్సిక్ విభాగం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. సాంకేతిక సదుపాయాలు కూడా ఫోరెన్సిక్ విభాగానికి తోడ్పాటునందిస్తున్నాయని చెప్పారు. ● కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తనకి ఫోరెన్సిక్ సబ్జక్టు ఎంతో ఇష్టమని, ఈ సబ్జక్టులో ప్రతి విషయానికి ఒక కథతో అనుసంధానించబడి ఉంటుందన్నారు. ● కార్యక్రమంలో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్కే. ప్రకాష్, రిటైర్డ్ ఫోరెన్సిక్ ప్రొఫెసర్ డాక్టర్ వీరనాగిరెడ్డి, ఫోరెన్సిక్ హెచ్ఓడీ, ప్రొఫెసర్ డాక్టర్ సాయిసుధీర్, ప్రొఫెసర్ అండ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ బ్రహ్మాజీ మాస్టర్, అసోసియేట్ ప్రొఫెసర్, ఆర్గనైజింగ్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ కేసీ రంగయ్య, ఏపీఏఎఫ్ఎంటీ జనరల్ సెక్రటరీ డాక్టర్ సుబ్బారావు, ప్రాంతీయ కంటి ఆసుపత్రి ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ యుగంధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలు సంతృప్తి చెందాలి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందించే ఆరోగ్యసేవలపై ప్రజలు సంతృప్తి చెందాలని, అప్పుడే ప్రభుత్వ లక్ష్యం సిద్ధించినట్లు అవుతుందని డీఎంఈ డాక్టర్ డీఎస్ఎల్వీ. నరసింహులు చెప్పారు. శనివారం సాయంత్రం ఆయన కర్నూలు మెడికల్ కాలేజీ కాన్ఫరెన్స్ హాలులో హెచ్వోడీలు, ప్రొఫెసర్లతో సమావేశమయ్యారు. కాలేజీ, హాస్పిటల్ మధ్య సమన్వయం ముఖ్యమని, రోగులకు ఇబ్బంది లేకుండా ఆయా విభాగాలు సర్దుబాటు చేసుకుని సేవలు అందించాలని కోరారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ సీఎస్కే. ప్రకాష్ పాల్గొన్నారు. డీఎంఈ డాక్టర్ నరసింహులు -
వైభవంగా అక్కమహాదేవి జయంతోత్సవం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మల్లికార్జున స్వామివారి పరమ భక్తులలో ఒకరైన శివశరణి అక్కమహాదేవి జయంతోత్సవం శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి వారికి పంచామృత అభిషే కం, జలాభిషేకం తదితర విశేషపూజలు చేపట్టారు. పూజల్లో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. శ్రీశైల మల్లికార్జునుడిలో ఐక్యం కావాలనే సంకల్పంతో అక్కమహాదేవి తన జీవితపు చివరి రోజులను శ్రీశైలంలోనే గడిపారని పండితులు తెలిపారు. ప్రస్తుతం అక్కమహాదేవి గుహలుగా పిలువబడుతున్న ఇక్కడి గుహలలో కొంతకాలం, కథళీవనంలో కొంతకాలం తపస్సు చేసి సిద్ధి పొందారన్నారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి వారికి ప్రతిరోజు కూడా పూజలు నిర్వహిస్తామన్నారు. అక్కమహాదేవి జయంతిని పురస్కరించుకుని సాయంత్రం భ్రామరీ కళావేదికపై అక్కమహాదేవి జీవిత విశేషాలపై డాక్టర్ ఎం.మహంతయ్య వారి ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. -
దమ్ముంటే అక్రమాలు నిరూపించండి
పొలం సమాజం స్థలం కొనుగోలు చేశాం.. లీజ్ కాదు ● క్రైస్తవ ఆస్తులను టీజీ, కేఈ కుటుంబాలు లీజుకు తీసుకోలేదా? ● ఆధారాలతో నిరూపించ లేకుంటే ఈనాడుపై పరువు నష్టం దావా ● మసీదు ఇనాం భూముల్లో ఈనాడు కార్యాలయం నిర్మించలేదా ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ధ్వజం కర్నూలు(టౌన్): ‘‘50 ఏళ్లుగా ఎస్వీ కుటుంబం రాజకీయాలు చేస్తోంది. ఏనాడు అవినీతి అక్రమాలకు పాల్పడలేదు. ఈ విషయం జిల్లా ప్రజలకు తెలుసు. ఐదు రోజుల క్రితం ఈనాడు యజమాన్యం కేవలం తమపై బురుద జల్లేందుకు ఇసుకలో అక్రమాలు, పొలం సమాజం ఆస్తుల కొనుగోలులో అక్రమాలు చేసినట్లు కథనాలు రాశారు. మీ ప్రభుత్వమే కదా.. దమ్ముంటే అక్రమాలు నిరూపించండి. రాజకీయాలు వదులుకుంటా’’ అని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. శనివారం ఆయన స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎస్వీ కాంప్లెక్స్ లీజు ప్రాపర్టీ కాదని, ఇన్కంట్యాక్స్ చెల్లించి లీగల్గా కేపీబిపిఎస్ సంస్థ నుంచి కోనుగోలు చేశామన్నారు. అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నా యని, ఎప్పుడైన తన ఇంటికి వస్తే రికార్డులు చూపించేందుకు సిద్ధమన్నారు. ఇవే భూములను అప్పట్లో టీజీ కుటుంబం, కేఈ కుటుంబాలు లీజుకు తీసుకోలేదా అని ప్రశ్నించారు. అక్రమాలు నిరూపించకుంటే దావా వేస్తా ఇసుక అక్రమాలు నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. మీ ప్రభుత్వమే ఉంది కదా.. విచారణ చేయించండన్నారు. తనపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని రాశారని, మీరైమెన కలగన్నారా? అని ప్రశ్నించారు. గతంలో ఎప్పుడో ఇసుక, లిక్కర్ వ్యాపారం చేశామన్నారు. తాము వ్యాపారం చేసినప్పుడు ఇసుక లీజు రూ.2 లక్షలు ఉంటే రూ.16 లక్షలు పాడి ప్రభుత్వానికి గణనీయంగా ఆదాయం సమకూర్చామన్నారు. రూ.16 లక్షల టెండర్ ఉంటే రూ.1.5 కోట్లు చెల్లించి ఇసుక వ్యాపారం చేశామన్నారు. ఇప్పటి వరకు ఎక్కడా ఒక్క కేసు తమపై లేదన్నారు. తమపై ఆరోపణలను నిరూపించకపోతే ఈనాడు యజమాన్యంపై పరువు నష్టం దావా వేస్తామన్నారు. మసీదు ఇనాం భూముల్లో ఈనాడు కార్యాలయం మామిదాల పాడు వద్ద సర్వే నెంబర్ 80లోని 4 ఎకరాల్లో నిర్మించిన ఈనాడు కార్యాలయం మసీదు ఇనాం భూములు కాదా అని ప్రశ్నించారు. ముస్లింల అభివృద్ధికి ఉన్న ఆ భూములను ఆక్రమంగా కొట్టేయలేదా? అన్నారు. రామోజీరావు చనిపోయారని, కేసులు తొలగించాలని కోర్టును ఆశ్రయించ డం సిగ్గుచేటన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, బీసీ సంఘం నా యకులు రాఘవేంద్ర నాయుడు, అధికార ప్రతినిధి మల్లి, కార్పొరేటర్లు జుబేర్, యూనుస్, మహిళా నాయకురాలు కల్లా నాగవేణి రెడ్డి పాల్గొన్నారు. -
గజ వాహనంపై రంగనాథుడు
జూపాడుబంగ్లా: తర్తూరు శ్రీ లక్ష్మీరంగనాథుడు స్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి మూల విగ్రహానికి, ఉత్సవ విగ్రహానికి అర్చకులు పంచామృతాభిషేకం, పుష్పార్చన, కుంకుమార్చన వంటి విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం చెక్కబొమ్మ రూపంలో ఉన్న స్వామివారి ఉత్సవ విగ్రహానికి పన్నీటితో స్నానం చేయించి వెండితొడుగు పట్టువస్త్రాలతో స్వామివారిని అలంకరించారు. అనంతరం ఉత్సవమూర్తిని గజవాహనంతో అలంకరించిన గ్రామోత్సవం నిర్వహించారు. తర్తూరు శ్రీలక్ష్మీరంగనాథస్వామి రథోత్సవం ఆదివారం నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. -
దినకూలీ ఇంట.. చదువుల తల్లి
కల్లూరు అర్బన్లోని ముజఫర్ నగర్లోని వెంకటచలపతి కాలనీకి చెందిన యు.రాముడు, యు.భాగ్యమ్మ దంపతులకు యు.శ్రావణి, యు.మానస సంతానం. శ్రావణికి వివాహమైంది. మానస పంచలింగాల కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయంలో చదువుతోంది. అకౌంటెన్స్ అండ్ టాక్సేషన్లో ఇంటర్మీడియేట్ చదువుతూ ఫస్ట్ ఇయర్లో 500కి 495 మార్కులు సాధించింది. సెకండియర్లో 991 మార్కులు సాధించింది. తండ్రి రాము కరోనా సమయంలో చనిపోగా.. తల్లి భాగ్యమ్మ కుమార్తెను బాగా చదివించాలని కొన్నాళ్లు హోటళ్లలో పనిచేసింది. ఆ తర్వాత మట్టి పనికి దినసరి కూలీకి వెళ్తోంది. సీఏ చదివి చార్టెడ్ అకౌంటెంట్గా రాణించాలనేది మానస ఆశాభావం. -
ఏపీఎస్పీ రెండో పటాలంలో ప్రక్షాళన
కర్నూలు: ఏపీఎస్పీ కర్నూలు రెండో పటాలంలో ప్రక్షాళన దిశగా బదిలీలకు నూతన కమాండెంట్ దీపిక పాటిల్ శ్రీకారం చుట్టారు. ఏళ్ల తరబడి పాతుకుపోయిన, ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురిపై బదిలీ వేటు వేశారు. ప్రత్యేక పోలీసు విభాగం చీఫ్ కార్యాలయ ఉత్తర్వుల మేరకు సాధారణ బదిలీల్లో భాగంగా వివిధ హోదాల్లోని 112 మంది సిబ్బందికి స్థానచలనం కల్పిస్తూ శుక్రవారం రాత్రి కమాండెంట్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 13 మంది ఏఆర్ఎస్ఐలు, 28 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 71 మంది పోలీసు సిబ్బందిని వారున్న చోటు నుంచి బదిలీ చేశారు. వెంటనే విధుల్లో చేరిపోవాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నెల రోజుల పాటు బదిలీల జాబితాపై ఆయా కంపెనీల ఆర్ఐలు కసరత్తు చేసి జాబితాను రూపొందించగా, దాని ఆధారంగా జూమ్ మీటింగ్ నిర్వహించి బయటి కంపెనీల్లో పనిచేస్తున్న వారితో కూడా కమాండెంట్ మాట్లాడి బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు. టర్న్ ప్రకారం హెడ్ క్వార్టర్కు నియామకం బదిలీల వ్యవహారంలో గతంలో ధన ప్రవాహం కీలకంగా పనిచేసేది. పటాలంలో పనిచేసే సిబ్బందికి టర్న్ ప్రకారం హెడ్ క్వాటర్ విధులకు అవకాశం కల్పించాలి. పటాలంలో హెడ్ క్వార్టర్తో కలిపి మొత్తం 9 కంపెనీలు ఉన్నాయి. ఏళ్ల తరబడి కుటుంబాలకు దూరంగా బయటి కంపెనీల్లో పనిచేసినవారికి ఈ బదిలీల్లో హెడ్ క్వార్టర్ విధులు నిర్వహించే అవకాశం దక్కిందని సిబ్బంది సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఆరోగ్య సమస్యలున్న వారికి ప్రాధాన్యత ప్రతి ఒక్కరినీ ఏడాదికొకసారి ఉన్న కంపెనీ నుంచి మరో కంపెనీకి బదిలీ చేయాలనే నిబంధన ఉంది. ఏళ్ల తరబడి బయటి కంపెనీల్లో పనిచేసినవారికి ఈ బదిలీల్లో న్యాయం జరిగిందని సిబ్బందిలో చర్చ జరుగుతోంది. అయితే అనారోగ్య కారణాలు సాకుగా చూపి హెడ్ క్వార్టర్లోనే కొనసాగాలని ఎక్కువమంది సిబ్బంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించి వైద్యుల చేత కమాండెంట్ వారికి వైద్యపరీక్షలు జరిపించారు. అనారోగ్య కారణాలతో వాస్తవంగా బాధ పడుతున్నట్లు డాక్టర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా అలాంటి వారికి ప్రాధాన్యతనిచ్చి హెడ్ క్వార్టర్లో కొనసాగేలా చర్యలు చేపట్టారు. అలాగే పదవీ విరమణకు దగ్గరగా ఉన్న వారిని కూడా కోరుకున్న స్థానాల్లో నియమించారు.13 మంది ఏఆర్ఎస్ఐలు, 28 మంది హెచ్సీలు, 71 మంది పీసీలు బదిలీ హెడ్ క్వార్టర్లో పాతుకుపోయిన ఫెవికాల్ వీరులందరికీ స్థానచలనం ఆరోగ్య సమస్యలున్న వారికి ప్రాధాన్యత నెల రోజుల పాటు కసరత్తు చేసి బదిలీల జాబితా విడుదల -
తల్లిదండ్రులకు అపు‘రూప’ బహుమానం
ఆదోని సెంట్రల్: జూనియర్ ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు తెచ్చుకుని ఒక విద్యార్థిని తన తల్లిదండ్రులకు అపురూప బహుమానాన్ని అందించారు. ఆదోని పట్టణానికి చెందిన మల్లనగౌడు, రాజేశ్వరిలు గిఫ్ట్షాపు నిర్వహిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా.. మొదటి అమ్మాయి చైతన్య ఇడుపాలయలోని త్రిబుల్ ఐటీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నారు. రెండో అమ్మాయి రూప ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఆదోని పట్టణంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో చదివారు. తల్లిదండ్రుల కష్టాలను చూసిన ఈ విద్యార్థిని చదువులో ప్రతిభను చాటారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో 470కు గాను 466 మార్కులను సాధించారు. ఈ విద్యార్థినిని ఆదోని పట్టణ ప్రజలు, మల్లనగౌడు బంధువులు అభినందించారు.