Kurnool District News
-
ప్రజలకు అందుబాటులో ఉంటా
కర్నూలు: ‘ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పటిష్ట చర్యలు చేపడతా. మహిళలు, చిన్నపిల్లల పట్ల జరి గే నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తా’ అని జిల్లా నూతన ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. ఇటీవల జరిగిన ఐపీఎస్ల బదిలీల్లో భాగంగా ఇక్కడున్న బిందుమాధవ్ కాకినాడకు, అక్కడున్న విక్రాంత్ పాటిల్ కర్నూలుకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో శనివారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలో 55వ ఎస్పీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. డీపీఓ చేరుకోగానే పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పౌరోహితుల ఆశీస్సులు అందుకున్నారు. 2012 బ్యాచ్ సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన విక్రాంత్ పాటిల్ తమిళనాడు రాష్ట్రం కేడర్కు ఎంపికై న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీపై వచ్చారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం వ్యాస్ ఆడిటోరియంలో విలేకరుల సమావేశంలో నూతన ఎస్పీ పాల్గొని విధి నిర్వహణలో తన ప్రాధాన్యతలను వివరించారు. ఆయన మాటల్లోనే..‘సైబర్ నేరాలు ఇటీవల పెరిగిపోతున్నాయి. వాటి నివారణకు గట్టి చర్యలు తీసుకుంటాం. సైబర్ నేరాలను ఛేదించడం, కట్టడితో పాటు వాటి నివారణకు అవగాహన కార్యక్రమాలు జిల్లా అంతటా విస్తృతం చేస్తాం. సైబర్ మోసాలపై వీడియో క్లిప్పింగులను కళాశాల, పాఠశాలల అధ్యాపకులు, ఉపాధ్యాయులు, మహిళా పోలీసు లు, మీడియా ద్వారా విస్తృత అవగాహన కల్పిస్తాం. సైబర్ నేరాల నివారణ, పోక్సో చట్టం గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తాం. నేర రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి గ్రామంలో, పట్టణంలో సీఎస్ఆర్ నిధులతో సీసీ కెమెరాల నిఘాను పెంచుతాం. నేరాల నివారణకు జిల్లా పోలీసు శాఖకు ప్రజలు తమ వంతు సహకారం అందించాలి’అని విజ్ఞప్తి చేశారు. సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ మహేష్ కుమార్, అడిషనల్ ఎస్పీలు హుసేన్ పీరా, కృష్ణమోహన్, డీఎస్పీలు, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, డీపీఓ సిబ్బంది నూతన ఎస్పీని మర్యాదపూర్వకంగా కలసి మొక్కలు, పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగ ప్రస్థానం...ఎస్పీ విక్రాంత్ పాటిల్ 2016లో తుల్లూరులో ఏఎస్పీగా, 2017లో పార్వతీపురం ఓఎస్డీగా పనిచేసి ఎస్పీగా పదోన్నతి పొందారు. 2018లో చిత్తూరు జిల్లా ఎస్పీగా, 2019లో విశాఖపట్నం డీసీపీగా, గుంతకల్లు రైల్వే ఎస్పీగా, విజయవాడ డీసీపీగా, 2021లో విజయనగరం 5వ ఏపీఎస్పీ బెటాలియన్, 2023లో పార్వతీపురం మన్యం ఎస్పీగా పనిచేశారు. 2024 ఏపీఎస్పీ మూడవ బెటాలియన్ కాకినాడ కమాండెంట్గా, ఆ తర్వాత కాకినాడ ఎస్పీగా పనిచేసి బదిలీపై కర్నూలుకు వచ్చారు. జిల్లా నూతన ఎస్పీ విక్రాంత్ పాటిల్ -
శ్రీకరం.. శుభకరం
గణపతి, కలశ పూజ నిర్వహిస్తున్న పండితులు● శాస్త్రోక్తంగా ఉరుకుంద క్షేత్ర కుంభాభిషేకానికి అంకురార్పణమంత్రాలయం/కౌతాళం: అణువణువునా వేదం పలికింది. తనువుతనువు ఈరన్న స్మరణ పఠించింది. ఈరన్న శరణు ఘోషతో ఉరుకుంద క్షేత్రం పరవశించింది. శ్రీకర శుభకర ప్రణవ స్వరూపుడు ఉరుకుంద ఈరన్న స్వామి కుంభాభిషేక ఘట్టానికి మొదటి రోజు శనివారం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ మేడేపల్లి విజయరాజు ఆధ్వర్యంలో శనివారం కుంభాభిషేక వేడుక ప్రారంభమైంది. ఆలయ పండితులు, అధికారులు కలశాలతో ఊరేగింపుగా మంగళవాయిద్యాలతో యాగశాల ప్రవేశం చేశారు. యాగశాలలో శైవాగమ శాస్త్ర ప్రవీణ సుబ్రహ్మణ్య స్వామి ఆధ్వర్యంలో అఖండ దీపారాధన, గోమాత, గణపతి పూజోత్సవాలు వైభవంగా చేపట్టారు. దీక్షారాధన, త్రిశూల పూజలు అనంతరం ప్రసాద వితరణ చేశారు. కుంభాభిషేక నిమిత్తం దేశంలోని సప్త నదుల నుంచి తెచ్చిన పవిత్ర జలాలను యాగశాలకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. పుణ్యాహవాచనంలో ప్రముఖ సిద్ధాంతి సీతారామానుజ ప్రసాద్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎన్.రాఘవేంద్రరెడ్డి, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ పాండురంగారెడ్డి, డివిజన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్లు వెంకటేశ్వర రావు, మల్లికార్జున,ప్రధాన అర్చకుడు ఈరన్న పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా కలాపకర్షణ కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా చేపట్టిన కలాపకర్షణ వేడుక శాస్త్రోక్తంగా సాగింది. విమాన రాజగోపురం శిఖరాగ్రానికి చేరుకుని కలాపకర్షణ క్రతువు కానిచ్చారు. వేద పఠనం గావిస్తూ జీర్ణోద్ధరణలో భాగంగా గోపురంపై పాత కలశాలను తొలగించారు. ఈరన్న స్వామి శక్తి స్వరూపాలుగా వర్ధిల్లిన కలశాల శక్తిని నూతన కలశంలోకి ఆవాహం గావించి కలాపకర్షణ చేపట్టారు. ఈ క్రతులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే యాగమంటపంలో నలుదిశలా రుగ్వేద, అధర్వణ వేద, శ్రీకృష్ణ రుగ్వేద, శుక్ల రుగ్వేద పఠన గావించారు. వేద పఠనతో క్షేత్రమంతా మార్మోగింది. -
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి
పదవులు అలంకార ప్రాయం కాకూడదు.. పార్టీ కోసం పనిచేసే వారికి ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వాలని జగనన్న నిర్ణయించారని, పదవులు అలంకార ప్రాయంగా కాకూడదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి అన్నారు. ఈ పదవులు ఎవరిపై పెత్తనం ఉండకూడదని, ప్రజలకు అండగా ఉందామన్నారు. మరోసారి జగనన్నను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఇప్పటి నుంచే పని చేద్దామని పిలుపు నిచ్చారు. ప్రత్యర్థులు ఇబ్బందులు సృష్టిస్తే వారి పేర్లను గుర్తు పెట్టుకోవాలన్నారు. సంక్షేమ పథకాల అమలులో చంద్రబాబు చేతులెత్తేశారన్నారు. పోస్టు కోసం ఫీల్డ్ అసిస్టెంట్ను హత్య చేసేంత వరకు తెలుగుదేశం పార్టీ నేతలు దిగజారారని విమర్శించారు. హామీలు అమలు చేయకుంటే కాలర్ పట్టుకోవాలన్న నారా లోకేష్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తిరుపతి తొక్కిసలాట బాధితుల పరామర్శకు జగనన్న రాకుండా పవన్ కళ్యాణ్, ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేసిందన్నారు. అయినా ప్రజాభిమానం ఉన్న నాయకుడు జగన్ అక్కడికి వెళ్లి వారిని పరామర్శించారన్నారు. కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్రెడ్డి అన్నారు. ఎనిమిది నెలల్లోనే నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు ఈ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారన్నారు. ప్రజల పక్షాన పోరాడేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. ఈనెల 5వ తేదీ కర్నూలులో చేపడుతున్న వైఎస్సార్సీపీ ఫీజు పోరును విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
పత్తికొండ రూరల్: విద్యార్థి దశ నుంచే విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కలెక్టర్ రంజిత్బాషా అన్నారు. పత్తికొండలోని కస్తూర్బా గాంధీ, అంబేడ్కర్ గురుకుల బాలికల గురుకుల పాఠశాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కస్తూర్బా పాఠశాలను సందర్శించి 10వ తరగతి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పాఠశాలలో వసతుల గురించి స్పెషల్ ఆఫీసర్ షబానాను అడిగి తెలుసుకున్నారు. పది విద్యార్థులకు సిలబస్ పూర్తయిందా లేదా అన్న వివరాలు తెలుసుకున్నారు. ఏమైనా సందేహాలు తలెత్తితే వాటిని నివృత్తి చేసు కోవాలన్నారు. అనంతరం ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల చేరుకుని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అన్నం సరిగా ఉడకలేదని, నాణ్యమైన భోజనాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు. పాఠశాలలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ప్రిన్సిపాల్ సుబ్బలక్ష్మి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈయన వెంట ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి, ఆర్డీఓ భరత్నాయక్, తహసీల్దారు రమేష్, ఎంపీడీఓ సువర్ణలత ఉన్నారు. కలెక్టర్ రంజిత్బాషా -
పన్ను నుంచి మినహాయింపు
● కేంద్ర బడ్జెట్పై ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజల పెదవి విరుపు ● ప్రకటనకే పరిమితమైన ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్ ● కర్నూలు నుంచి అమరావతికి రైలు లేదు..పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు లేవు ● నిరుత్సాహం వ్యక్తం చేసిన వివిధ పార్టీల నాయకులు కర్నూలు(సెంట్రల్): కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్పై కర్నూలు, నంద్యాల జిల్లా ప్రజలు పెదవి విరిచారు. ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు. బడ్జెట్లో ఉమ్మడి కర్నూలు జిల్లా అభివృద్ధికి ఆయువుగా భావిస్తున్న ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్లో మౌలిక వసతులు కల్పించేందుకు పైసా విదల్చలేదు. కర్నూలు నుంచి అమరావతికి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలును వేయలేదు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, ఓర్వకల్లు ఎయిర్పోర్టు అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమల వృద్ధి కోసం ఎలాంటి నిధులను కేటాయించలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే ఉన్నా నిధులను సాధించడంలో విఫలమైందని ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ నాయకులు, కమ్యూనిస్టులు, ప్రజా సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. రైతులు పండించే పంటలకు మద్దతు ధర నిధుల కేటాయింపు చేపట్టలేదని ఆరోపించారు. కార్మికులకు, నిరుద్యోగులకు అన్యాయం చేసే విధంగా బడ్జెట్ ఉందని విమర్శించారు. ఉద్యోగ అవకాశాలు మృగ్యం ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్లో 2,600 ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేస్తామని 2024 జూన్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో అప్పటి ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే ప్రస్తుత బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్ ప్రస్తావన లేకపోవడంతో ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. కారిడార్ వృద్ధి పథంలోకి వస్తే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 15 లక్షలకుపైగా ఉన్న యువతీ, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. వినతులు బుట్టదాఖలు కర్నూలు నుంచి విజయవాడకు రైలును నడపాలని మంత్రి టీజీ భరత్..రైల్వే మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. అలాగే కర్నూలు ఎంపీ బస్తిపాటినాగరాజు కూడా రైల్వే మంత్రిని పలుమార్లు అభ్యర్థించారు. అయితే వారి విన్నపాలను రైల్వే శాఖ పట్టించుకోనట్లుగా ఉంది. మంత్రాలయం మార్గం, రిహబులిటీ వర్కుషాపునకు నిధులు కేటాయించలేదు. జిల్లాకు ఒక క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేశ వ్యాప్తంగా 75 వేల మెడికల్ సీట్లను వచ్చే ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి తెస్తామని తెలిపారు. పత్తి ఉత్పాదను పెంచేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక మిషన్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలపడంతో జిల్లాలోని 6,20,658 మంది రైతులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. అర్బన్ లాంచ్ ప్రోగ్రామ్ కింద పట్టణాల అభివృద్ధికి బడ్జెట్లో రూ.లక్ష కోట్లను కేటాయించారు. ఈపథకం కింద స్మార్ట్సిటీల కింద ఎంపికై న కర్నూలు, ఆదోని పట్టణాల్లో తాగునీరు, పారిశుద్ధ్య వసతులను మెరుగు పరచేందుకు అవకాశం ఏర్పడుతుంది. కర్నూలు జిల్లాలో ట్రెజరీ ద్వారా 28,895 మంది, కార్పొరేషన్ల ద్వారా 5 వేల మంది ఉద్యోగులు జీతాలు తీసుకుంటున్నారు. రూ.12.75 లక్షల వరకు పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వడం వీరికి ఊరట ఇస్తోంది. -
ఏకాగ్రతతో చదివితే ఉత్తమ ఫలితాలు
● డీఈఓ శామ్యూల్ పాల్ ఎమ్మిగనూరుటౌన్: పరీక్షల భయం వీడి ఏకాగ్రతతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధించ వచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ అన్నారు. శనివారం పట్టణంలోని మాచా ని సోమప్ప బాలికల జెడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. తరగతి గదులు, విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్యను హెచ్ఎం కృష్ణమూర్తిని అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి విద్యార్థినిలతో పరీక్షలపై సమావేశాన్ని నిర్వహించి సూచనలు చేశారు. ఒక లక్ష్యాన్ని పెట్టుకొని చదివి పరీక్షలు రాయాలని సూచించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో 1:25 రేషియోలో ఉపాధ్యాయులు వుండేలా చర్యలు తీసుకొని విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఆయన వెంట ఆదోని డిప్యూటీ ఈఓ వెంకటరమణారెడ్డి, ఎంఈఓలు ఆంజినేయులు, మధుసూదన్రాజు పాల్గొన్నారు. అలారు దిన్నె బ్రిడ్జిపై రాకపోకలు బంద్ కర్నూలు న్యూసిటీ: జిల్లా కేంద్రం నుంచి బళ్లారి వెళ్లే మార్గంలో అలారు దిన్నె గ్రామం వద్ద ఉన్న బ్రిడ్జి దెబ్బతినడంతో నాలుగు చక్రాల వాహనాల రాకపోకలు నిషేధించినట్లు రోడ్లు, భవనాల శాఖ డీఈఈ సురేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బళ్లారి, ఆలూరు నుంచి కర్నూలు వైపు వచ్చే వాహనాలను ఆస్పరి, పత్తికొండ, దేవనకొండ మీదుగా మళ్లించినట్లు వివరించారు. కర్నూలు నుంచి ఆలూరు, బళ్లారి వైపు వెళ్లే వాహనాలను దేవనకొండ, పత్తికొండ, ఆస్పరి మీదుగా మళ్లించినట్లు వెల్లడించారు. త్వరలో బ్రిడ్జి మరమ్మతులు పూర్తి చేసి వాహనాల రాకపోకలు పునరుద్ధరిస్తామని తెలిపారు. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి కర్నూలు(అగ్రికల్చర్): కందుల కొనుగోలు కేంద్రాలను రైతులు అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీఎంఎస్ కర్నూలు బ్రాంచ్ మేనేజర్ రాజీవ్ రైతులకు సూచించారు. శనివారం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోని డీసీఎంఎస్ కార్యాలయంలో కందుల కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పించారు. కందుల నాణ్యతను కూడ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కర్నూలు, కల్లూరు, గూడూరు మండలాల్లో డీసీఎంఎస్ ద్వారా కొనుగోళ్లు చేస్తామని వివరించారు. కందులకు మద్దతు ధర రూ.7550 ఉందని, రైతులు తగిన నాణ్యతా ప్రమాణాలతో తెస్తే మద్దతు ధర లభిస్తుందని పేర్కొన్నారు. ఎఫ్ఏక్యూ నిబంధనల ప్రకారం తేమ 12 శాతం లోపు ఉండాలని సూచించారు. నేడు వసంత పంచమి ● కొలను భారతిలో ఏర్పాట్లు పూర్తి కొత్తపల్లి: సరస్వతి దేవి అమ్మవారి పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం కొలనుభారతి దేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఆలయ ఈఓ రామలింగారెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ వెంకటనాయుడు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. చిన్నారులకు ఇక్కడ అక్షరాభ్యాసం చేయించేందుకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరానున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్లు, అక్షరాభ్యాస స్థలం, భక్తులు సేదతీరేందుకు టెంట్లు, భోజన, తాగునీటి సౌకర్యం, మహిళా భక్తులు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు ఏర్పాటు చేశారు. మహాశివరాత్రిఏర్పాట్ల పరిశీలన శ్రీశైలంటెంపుల్: ఈ నెల 19 నుంచి జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీగా ఏర్పా ట్లు చేయాలని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాలు, క్యూలు, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లడ్డూ కౌంటర్ వద్ద ప్రస్తుతం ఉన్న 15 కేంద్రాలతో పాటు అదనంగా మరో 8కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేకంగా క్యూలైన్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రసాదాల విక్రయ కేంద్రాల వద్ద తగినన్ని సూచికబోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. -
ఇంటి వద్ద పింఛన్ ఒట్టిదే!
● ఇంటి దగ్గర పింఛన్ల పంపిణీ నామమాత్రమే ● అవ్వాతాతలకు సచివాలయాల మెట్లు ఎక్కక తప్పని పరిస్థితి ● పలుచోట్ల సర్వర్ పనిచేయక కార్యాలయాల్లోనే పడిగాపులు సర్వర్ మొరాయించి.. దాడికి దారితీసి ఆదోని అర్బన్: కూటమి ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. సర్వర్ సమస్య వేధిస్తోంది. ఈ కారణంతో పలుచోట్ల సచివాలయ ఉద్యోగులు ఇళ్లవద్దకెళ్లి పింఛన్లు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, వ్యాధిగ్రస్తులు బయటకువెళ్లి తెచ్చుకోవడం సమస్యగా మారింది. ఈ విషయంలోనే శనివారం ఆదోనిలో పింఛన్దారుడి కుమారుడు, సచివాలయ ఉద్యోగి మధ్య మాటామాటా పెరిగి దాడికి దారితీసింది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని 33వ వార్డు సచివాలయ ఎడ్యుకేషన్ సెక్రటరీ చంద్రశేఖర్ శనివారం పింఛన్ పంపిణీ చేసేందుకు ఖాజీపురవీధిలోకి వెళ్లాడు. సర్వర్ రావడం లేదని వీధిలో పంపిణీ చేస్తున్నాడు. పక్షవాతంతో బాధపడుతున్న ఇబ్రహీంను బయటకు వచ్చి పింఛన్ తీసుకెళ్లాలని చెప్పడంతో అతని కుమారుడు ఖలందర్ తన తండ్రి బయటకు రాలేడని ఇంటి వద్దకు వచ్చి ఇవ్వాలని కోరాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి చేయిచేసుకునే వరకు వెళ్లింది. కాగా పింఛన్దారుడు కుమారుడు ఖలందర్ తనపై దాడి చేశాడని సచివాలయ ఉద్యోగి చంద్రశేఖర్ ఫిర్యాదు చేశాడని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ ఎస్ఐ రామస్వామి తెలిపారు. కర్నూలు(అగ్రికల్చర్): ఇంటి దగ్గరే పింఛన్ల పంపిణీ పేరుకు మాత్రమే. పింఛన్ సొమ్మును అందించేందుకు సచివాలయ ఉద్యోగులెవ్వరూ ఇంటి వద్దకు రాకపోవడంతో అవ్వాతాతలు, వికలాంగులు ఇతర పింఛన్దారులు గ్రామ, వార్డు సచివాలయాల మెట్లు ఎక్కాల్సి వచ్చింది. సచివాలయాలు, రచ్చబండల దగ్గర పింఛన్ల కోసం పడిగాపులు కాశారు. ఫిబ్రవరి నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పింఛన్ సొ మ్ము అందజేస్తున్నారని కూటమి ప్రభుత్వం చెప్పుకుంటున్నా... ఆచరణలో అది కనిపించడం లేదు. ఫిబ్ర వరి నెలకు సంబంధించి కూడా పంపిణీ ఇంటి వద్ద జరగకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.ఇటు కర్నూలు, అటు నంద్యాల జిల్లాలో సర్వర్ పనిచేయకపోవడంతో మధ్యాహ్నం వరకు అవ్వాతాతలు కాచుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నుంచి సర్వర్ పనిచేయడంతో పంపిణీ కొంత ఊపందుకుంది. 95 శాతం పింఛన్ల పంపిణీ ఫిబ్రవరి నెలలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4,54, 924 పింఛన్లకు రూ.194 కోట్లు మంజూరయ్యా యి. ఇందులో కర్నూలు జిల్లాలో 2,39,332 పింఛన్లు ఉండగా 2,27,714 (95.15 శాతం)మందికి పంపిణీ చేశారు. నంద్యాల జిల్లాలో 2,15,592 పింఛన్లు ఉండగా 2,03,401 (94.35 శాతం)మందికి పంపిణీ చేశారు. అయితే,ఈ పంపిణీ కార్యక్రమంలో కర్నూలు జిల్లాలో 4,879 మంది, నంద్యాల జిల్లాలో 4,394 మంది పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో ఇంటి దగ్గరే పింఛన్ వైఎస్సార్సీపీ పాలనలో 2024 మార్చి నెల వరకు ప్రతి లబ్ధిదారుడికి ఇంటి దగ్గరే పింఛన్ సొమ్ము అందజేయడం జరిగేది. వలంటరీ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత పింఛన్లు పొందడంలో అవ్వాతాతలు, వికలాంగులు, వ్యాధి గ్రస్తులు ఎవ్వరు ఇబ్బంది పడలేదు. ఐదేళ్లు ప్రశాంతంగా పింఛన్లు పొందారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పింఛన్దారులకు ఇబ్బందులు మొదలయ్యాయి. అర్హులందరికీ పింఛన్లు దేవనకొండ: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అర్హులందరికీ పెన్షన్లు అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రంజిత్బాషా తెలిపారు. శనివారం దేవనకొండ మండలం కరివేముల గ్రామ సచివాలయ పరిధిలో పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు, వృద్ధులు, వితంతువులు, వ్యాధిగ్రస్తులకు ఆయన సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. పత్తికొండ ఆర్డీవో భరత్నాయక్, డీఆర్డీఏ పీడీ శివనాగలీల పాల్గొన్నారు. -
కర్ణాటక మద్యం పట్టివేత
కోడుమూరు రూరల్: వెల్దుర్తి మండలంలోని ఎల్.బండ గ్రామ సమీపంలో శనివారం తనిఖీలు నిర్వహిస్తుండగా కర్ణాటక మద్యాన్ని రవాణా చేస్తున్న కారు పట్టుబడినట్లు కోడుమూరు ఎకై ్సజ్ సీఐ మంజుల తెలిపారు. ఈ సందర్భంగా కర్ణాటకకు చెందిన కర్ణ గౌడ, అహమ్మద్ హుసేన్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.95 వేలు విలువ చేసే కర్ణాటకకు చెందిన 2400 విస్కీ టెట్రా పాకేట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు, కారును సీజ్ చేసినట్లు సీఐ వివరించారు. 529 మంది గైర్హాజరు కర్నూలు కల్చరల్: ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు శనివారం నైతిక మానవీయ విలువలు పరీక్షను నిర్వహించారు. జిల్లాలోని 162 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరిగింది. మొత్తం 23, 262 మందికి 22,733 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 529 మంది గైర్హాజౖరైనట్లు ఆర్ఐఓ ఎస్వీఎస్ గురువయ్య శెట్టి పేర్కొన్నారు. పలు పరీక్ష కేంద్రాలను ఆయన సందర్శించి పరిశీలించారు. బోర్డు నియమ నిబంధనల మేరకు ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆదోని, మంత్రాలయం మండలాల్లో ప్రత్యేక తనిఖీ బృందాల ద్వారా తనిఖీ చేయించామన్నారు. స్పెషల్ ఆఫీసర్ జి.లాలెప్ప, డీఈసీ సభ్యులు కె.నాగభూషణ రెడ్డి, యు. పద్మావతి, జి.ఎస్.సురేష్ చంద్ర, డి. మల్లికార్జున వివిధ పరీక్ష కేంద్రాలను సందర్శించారు. -
యువకుడిపై హత్యాయత్నం
బొమ్మలసత్రం: పాతగొడవల కారణంగా హరి అనే యువకుడిని మరో యువకుడు కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం నంద్యాల పట్టణంలో చోటుచేసుకుంది. అవుట్ పోస్ట్ పోలీసుల సమాచారం మేరకు.. రోజకుంట వీధికి చెందిన హరి పట్టణంలో రోజువారి పనికి వెళ్తాడు. ఇతనికి నందమూరినగర్ వీధికి చెందిన గౌస్తో వ్యక్తిగత గొడవలు ఉన్నాయి. ఈక్రమంలో శనివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గౌస్ కత్తితో హరిపై దాడి చేశాడు. స్థానికులు అడ్డుకోవటంతో అతను అక్కడి నుంచి పరారయ్యాడు. తర్వాత స్థానికులు బాధితుడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. ఈమేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై హత్యాయత్నం
● వేట కొడవళ్లు, ఇనుప రాడ్లతో టీడీపీ వర్గీయుల దాడి ● వివాహ వేడుకను అడ్డుకుని దౌర్జన్యంసి.బెళగల్: వివాహ వేడుకను అడ్డుకుని టీడీపీ వర్గీయులు దౌర్జన్యం చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను హతం చేసే లక్ష్యంతో వేట కొడవళ్లు, ఇనుప రాడ్లతో దాడులకు పాల్పడ్డారు. మొత్తం ఐదుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. సి.బెళగల్ మండలంలోని బ్రాహ్మణదొడ్డి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో వైఎస్సార్సీపీ వర్గీయులకు చెందిన యువకుడి వివాహ మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. రాత్రి గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన వారు పెళ్లి వేడుక ఊరేగింపు (మెరివెన)ను నిర్వహిస్తున్నారు. గ్రామంలోని తమ ఇళ్ల దగ్గర ఊరేగించేందుకు వీలు లేదని టీడీపీ వర్గీయులు ప్రధాన రోడ్డుపై అడ్డుగా రెండు చోట్ల రాళ్లను పెట్టారు. వైఎస్సార్సీపీ వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి, పోలీసుల సూచనలతో రోడ్డును అడ్డుగా ఉన్న రాళ్లను తొలగించారు. ఊరేగింపు వెనక నుంచి టీడీపీకి చెందిన పాండు కుమారుడు వెంకటేష్ ఆటోలో వస్తూ వాదనకు దిగాడు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే అప్పటికే అక్కడి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను వారికి సర్ది చెప్పి పెళ్లి ఊరేగింపు బంద్ చేయించారు. ఘర్షణకు కారణమైన పాండు కుమారుడు వెంకటేష్ శనివారం ఉదయం రెచ్చగొట్టాడు. టీడీపీ వారు మూకుమ్మడిగా వేటకొడవళ్లు, ఇనుపరాడ్లు, ఖాళీ మద్యం సీసాలు, పట్టుడు కట్టెలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీకి చెందిన మేకల రాముడు, తిమ్మన్న, బండ రాయుడు, బాలరాజులను హతం చేసేందుకు టీడీపీ వర్గీయులు యత్నం చేశారు. తల, కాలుపై వేటకొడవళ్లతో తీవ్రంగా నరికారు. ఐదుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఘర్షణలో టీడీపీకి చెందిన పాండు కుమారుడు వెంకటేష్, నరసింహుడు కుమారుడు వెంకటేష్కు స్వల్ప గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తిమ్మారెడ్డి తెలిపారు. గ్రామాన్ని సందర్శించిన డీఎస్పీ ఇరువర్గాల ఘర్షణ విషయం తెలుసుకున్న కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ బ్రాహ్మణదొడ్డి గ్రామం చేరుకున్నారు. ఘర్షణ వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడంతో పాటు శాంతి భద్రత పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. డీఎస్పీ వెంట కోడుమూరు సీఐ తబ్రేజ్, గూడూరు ఎస్ఐ తిమ్మయ్య తదితరులు ఉన్నారు. -
జిల్లాను క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దుతాం
● శాప్ చైర్మన్ రవి నాయుడు కర్నూలు (టౌన్): వెనుకబడిన కర్నూలు జిల్లాను క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దుతామని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవినాయుడు అన్నారు. శనివారం ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి శాప్ చైర్మన్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియాన్ని పరిశీలించారు. అస్తవ్యస్తంగా ఉన్న స్టేడియం నిర్వహణ పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండోర్ స్టేడియంలో టాయెలెట్ల నిర్వహణ అధ్వానంగా ఉందన్నారు. పారిశుధ్య నిర్వహణలో డీఎస్ డీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చు కోవాలన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కర్నూలులో అత్యుత్తమ క్రీడా వసతులు ఏర్పాటు చేసి కర్నూలు స్టేడియాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఫుట్బాల్ పశ్చిమ మైదానం, అథ్లెటిక్స్ సింథటిక్ ట్రాక్, వాకర్స్ ట్రాక్ ఏర్పాటు చేయాలని క్రీడా సంఘాల ప్రతినిధులు రామాంజనేయులు, హర్షవర్ధన్, వెంకటేష్, నాగరత్నమయ్య, చిన్న సుంకన్న, సురేంద్ర, స్కూల్గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి గిడ్డయ్యలు విన్నవించారు. అనంతరం శాప్ చైర్మన్ను పలు క్రీడా సంఘాలు సత్కరించాయి. -
ప్రముఖ రంగస్థల నటుడు బీసీ కృష్ణ మృతి
● బిల్వ మంగళ పాత్రలో వేలాది ప్రదర్శనలు కర్నూలు కల్చరల్: ప్రముఖ రంగస్థల నటుడు బీసీ కృష్ణ (78) మృతి చెందారు. చాలా రోజులు గా అనారోగ్యంతో ఉన్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కిడ్నీలు ఫెయిల్ కావడంతో శనివారం సాయంత్రం మరణించారు. చింతామణి నాట కంలో బిల్వమంగళుడుగా వేల నాటకాలు ప్రదర్శించి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. బిల్వమంగళుడు పాత్ర అంటే బీసీ కృష్ణ తప్పా మరొకరు అంత అద్భుతంగా ప్రదర్శించలేరనే విధంగా నటించి ప్రేక్షకులను అలరించారు. ప్రముఖ హోర్మోనిస్టు కేసీ శివారెడ్డి ముఖ్య శిష్యునిగా ఉంటూ 30 సంవత్సరాలు రంగ స్థల నాటకాల్లో కీర్తి ప్రతిష్టలు పొందారు. అప్పటి ముఖ్య మంత్రి ఎన్టీఆర్ చేత సత్కారం పొందారు. తెలుగు యూనివర్సిటీ నుంచి సత్కారం అందుకున్నారు. కందుకూరి పురస్కారం పొందారు. ఆయన మృతి రంగస్థలానికి తీరని లోటని పలువులు కళాకారులు, కళా సంస్థల నిర్వాహకులు పేర్కొన్నారు. కేసీ శివారెడ్డి రూపొందించిన ఒక ఆణిముత్యం బీసీ కృష్ణ అని టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య పేర్కొన్నారు. కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక నాయకులు బైలుప్పల షఫి, హనుమాన్ కళా సంస్థ అధ్యక్షులు హనుమంతరావు చౌదరి, కవి, రచయిత పార్వతయ్య, తదితరులు బీసీ కృష్ణ పార్థివ దేహానికి నివాళులర్పించారు. -
యూట్యూబర్ అరెస్టు
కర్నూలు: కామన్ మ్యాన్ యూట్యూబ్ ఛానెల్ అధినేత పాల్లూరి రమణను మూడవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఈయన అయ్యప్పస్వామి గుడి సమీపంలోని బీకే సింగ్ అపార్ట్మెంట్లో నివాసముంటాడు. జిల్లా మంత్రి టీజీ భరత్, ఆయన తండ్రి, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్పై వార్తలు (అనుచిత వ్యాఖ్యలు) పోస్టు చేశాడనే కారణంపై మూడో పట్టణ పోలీస్స్టేషన్లో మాజీ కార్పొరేటర్ విఠల్ శెట్టి, ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో ఆకెపోగు శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయా స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. శనివారం తెల్లవారుజామున పోలీసులు యూట్యూబర్ రమణ ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి విచారించి రిమాండ్కు పంపినట్లు సమాచారం. -
● శిఖరం.. ‘శిశిర’ సోయగం
ప్రస్తుతం శిశిర రుతువు నడుస్తోంది. మాఘమాసంలో పలు వేడుకలు సాగుతున్నాయి. శనివారం రాత్రి వేళ కర్నూలు నగరంలోని వినాయక్ ఘట్ వద్ద సుందర దృశ్యం కనిపించింది. కేసీ కెనాల్ పక్కన ఉన్న గణేశుని ఆలయం శిఖరంపై నక్షత్రం దే దీప్యమానంగా వెలిగింది. శిఖరం పక్కనే చంద్రుని సౌరభం ఆకట్టుకుంది. క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణ కాలంలో ఈ సుందరం ప్రజల్లో సరికొత్త ఆధ్యాత్మిక భావాన్ని నింపింది. – డి.హుస్సేన్, సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
No Headline
కర్నూలు (టౌన్): ‘ధైర్యంగా ఉండండి. భవిష్యత్తు మనదే. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. కూటమి ప్రభుత్వం ఇంటికే’ అని వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం స్థానిక బిర్లా కాంపౌండ్లోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాలులో జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఇటీవల పార్టీలో పదవులు దక్కిన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మండల కన్వీనర్లు, అధికార ప్రతినిధులు, సోషల్ మీడియా ఇన్చార్జ్లు, అనుబంధ సంఘాల నేతల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆర్భాటంగా నిర్వహించారు. పదవులు దక్కిన వారందరిని రీజినల్ కో ఆర్డినేటర్ శాలువాతో సత్కరించారు. అలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యేలు కంగాటి శ్రీదేవి, కాట సాని రాంభూపాల్ రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, కేడీసీసీ మాజీ చైర్ పర్సన్ విజయ మనోహరి, పార్టీ నేతలు ప్రదీప్ రెడ్డి, కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, ఆదిమూలపు సతీష్, జగన్మోహన్ రెడ్డి, అహమ్మద్ అలీఖాన్, శశికళ, నీలకంఠ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నెకల్ సురేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి మద్దూరు సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా వైఎస్సార్కు నివాళులర్పించారు. ఈ కార్యక్రమం పార్టీ నేతల్లో జోష్ నింపింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్ది రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే వారికి వైఎస్సార్సీపీలో సముచిత గౌరవం ఉంటుందన్నారు. పదవులు దక్కిన వారంతా పార్టీ అభివృద్ది కోసం మరింత కృషి చేయాలన్నారు. కలిసి కట్టుగా అంద రం జగనన్నను మళ్లీ సీఎం చేసు కుందామన్నారు. వైఎస్సార్సీపీకి రాష్ట్రంలో 40 శాతం ఓట్లు ఉన్నా యని, అదికాస్తా ఇంకా పెరగడం ఖాయమన్నారు. ఎమినిది నెలలుగా కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందన్నారు. ప్రజల పక్షాన ప్రభుత్వంపై పోరాడుదామని పిలుపు నిచ్చారు. త్వరలో జగనన్న జిల్లాల పర్యటనలు ఉంటాయన్నారు. సీఎంగా జగనన్న సంక్షే మ క్యాలెండర్ రూపొందించి ప్రతి ఏడాది చెప్పిన పథకాలు అమలు చేశారన్నారు. రూపాయి కూడా లంచం లేకుండా ఇంటింటికీ నవరత్నాలను చేర్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వానికి పేదల సంక్షేమంపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కొండంత హామీలు ఇచ్చి గోరంత కూడా అమలు చేయలేదని విమర్శించారు. -
ఆదోని మార్కెట్ యార్డులో గోదాముల స్వాధీనం
ఆదోని అర్బన్: బాడుగ చెల్లించకపోవడంతో ఆదోని వ్యవసాయ మార్కెట్యార్డులో మూడు గోదాములను పోలీసు, రెవెన్యూశాఖల అధికారుల సమక్షంలో శనివారం యార్డు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఖాదర్వలి కంపెనీ గోదాము నంబర్ 329, అహ్మద్ వలి గోదాము నంబర్ 328, ఆదిత్య ట్రేడింగ్ కంపెనీ గోదాము నంబర్ 255 ఉంది. ఈ సందర్భంగా యార్డు సెక్రటరీ రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. బాడుగ చెల్లించని గోదాములు 59 ఉన్నాయని, రూ.30 లక్షల వరకు బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు. మిగిలిన 56 మంది స్పందించి పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలన్నారు. ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ కొలిమిగుండ్ల: అంకిరెడ్డిపల్లె శివార్లలోని ప్రధాన రహదారిలో శనివారం బనగానపల్లె డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును మినీ లారీ ఎదురై ఢీ కొంది. బస్సు తాడిపత్రికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ వాహనంలో ఇరుక్కు పోవడంతో స్థానికులు బయటకు లాగారు. బస్సు డ్రైవర్తో పాటు ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఫాస్టాగ్లో నగదు లేక నిలిచిన ఆర్టీసీ బస్సులు ఓర్వకల్లు: ఫాస్టాగ్ అకౌంట్లో నగదు లేకపోవడ ంతో శనివారం నన్నూరు టోల్ప్లాజా వద్ద రెండు ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. నంద్యాల డిపో కు చెందిన ఏపీ 39 యూహెచ్ 9000, ఏపీ 39 యూజీ 8000 నెంబర్ గల ఆర్టీసీ బస్సులు నంద్యాల నుంచి కర్నూలుకు బయలుదేరాయి. మా ర్గమధ్యలో జాతీయ రహదారిపై ఉన్న నన్నూరు టోల్ప్లాజా వద్ద సంబంధిత బస్సులకు ఫాస్టాగ్ లో నగదు లేకపోవడంతో టోల్ సిబ్బంది నిలిపివేశారు. దీంతో ఆర్టీసీ డ్రైవర్లు టోల్ సిబ్బందితో వా దనకు దిగారు. తీరా చేసేదేమిలేక నగదు చెల్లించ డంతో బస్సులు ముందుకు కదిలాయి. సుమారు అర గంట సేపు వాగ్వాదం జరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయయ్యారు. -
వివాహిత ఆత్మహత్య
పగిడ్యాల: తూర్పు ప్రాతకోట గ్రామంలో ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన గొల్ల స్వాములు భార్య లక్ష్మీదేవి(36) కొంత కాలంగా థైరాయిడ్, మానసిక రోగంతో బాధపడుతోంది. పలు డాక్టర్లను చూపించినా జబ్బు నయం కాకపోవడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. శనివారం ఉదయం భర్త పొలానికి వెళ్లగా ఇంట్లో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుంది. పొలం నుంచి తిరిగి వచ్చిన స్వాములు..ఫ్యాన్కు వేలాడుతున్న భార్యను కిందికి దించి చూడగా అప్పటికే ఆమె మృతి చెంది ఉంది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే మృతురాలి అక్క అలివేలు తన చెల్లెలిని కొట్టి చంపారని అనుమానం వ్యక్తం చేశారు. కాగా ముచ్చుమర్రి ఎస్ఐ శరత్కుమార్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై ఆరా తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ఓమ్ని హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అధికారుల విచారణ
కర్నూలు(హాస్పిటల్):కర్నూలు ఓమ్ని హాస్పిటల్లో శుక్రవారం ఎన్టీఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ భాస్కరరెడ్డి విచారణ చేపట్టారు. ఆసుపత్రిలో వైద్యసేవ పథకం కింద చికిత్స పొందు తున్న రోగులను కలిసి వివరాలు సేకరించారు. చికిత్స కోసం ఎవ్వరైనా డబ్బులు ఇచ్చారా అని వాకబు చేశారు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుని గురువారం చికిత్స పొందుతూ మృతి చెందిన దేవనకొండ మండలం బండగట్టు గ్రామానికి చెందిన కురువ ఆదిలక్ష్మికి అందించిన వైద్యసేవల గురించి వైద్యులను, ఆసుపత్రి యాజమాన్యం వద్ద నుంచి వివరాలు సేకరించారు. ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. వివరాలను లిఖిత పూర్వకంగా తనకు పంపించాలని కోరారు. కాగా ఓమ్ని హాస్పిటల్లో జరిగిన మరణాలపై పూర్తిస్థాయి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఎంహెచ్ఓ డాక్టర్ పి. శాంతికళకు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాసులు, నగర కార్యదర్శి బీసన్న వినతి పత్రం సమర్పించారు. -
ప్రజల అభ్యున్నతికి విరివిగా రుణాలు
● ఎంఎస్ఎంఈ కింద రూ.150 మందికి రూ.6.75 కోట్ల రుణాల పంపిణీ ● ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ నవీన్కుమార్ వెల్లడి కర్నూలు(అగ్రికల్చర్):ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు రైతులు, స్వయం సహాయక సంఘాలు, ఇతర అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి అవసరమైన రుణాలు ఇస్తుందని రీజినల్ మేనేజర్ పీఎస్ నవీన్కుమార్ తెలిపారు. శుక్రవారం ఏపీజీబీ రీజినల్ కార్యాలయం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ శాఖ ప్రాంగణంలో రుణ విస్తరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఇందులో భాగంగా 150 మంది ఖాతాదారులకు ఎంఎస్ఎంఈ కింద రూ.6.75 కోట్ల రుణాలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ... ఏపీజీబీ జిల్లాలో 61 శాఖలతో అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తోందని తెలిపారు. రూ.5,596 కోట్లతో అధిర వ్యాపార వాటాను కలిగి ఉందని పేర్కొన్నారు. రైతులకు పంట రుణాలతో పాటు టర్మ్లోన్లు, ఇతరత్రా అనేక రుణ సదుపాయం కల్పిస్తున్నామని, స్వయం సహాయ సంఘాలు కూడా వివిధ వ్యాపా రాల్లో రాణించేందుకు వీలుగా రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ రుణాలే కాకుండా గృహ, వాహన, వ్యక్తిగత, విద్య రుణాలతో పాటు ఆస్తి తనఖా రుణాలు అతి తక్కువ వడ్డీకే పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు ప్రత్యేక రాయితీలు ఉన్నాయని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాలో మూడు సరళ రుణ కేంద్రాలు ప్రారంభించి అతి తక్కువ, స్థిర వడ్డీరేటుతో రుణాలు ఇస్తున్నామని తెలిపారు. అక్టోబరు నుంచి ఇప్పటి వరకు రూ.24 కోట్ల రిటైల్ రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. రుణ విస్తరణ కార్యక్రమాన్ని అన్ని బ్రాంచీలో నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రీజినల్ కార్యాలయం అధికారులు, కర్నూలు నగరంలోని వివిధ బ్రాంచి మేనేజర్లు పాల్గొన్నారు. -
దౌలత్ఖాన్ మృతి బాధాకరం
● నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిశోర్రెడ్డి నంద్యాల(అర్బన్): ఇంటి పన్ను మినహాయింపునకు మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ గుండెపోటుతో మాజీ జవాన్ దౌలత్ఖాన్ మృతి చెందడం బాధాకరమని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిశోర్రెడ్డి అన్నారు. మృతుని కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం వచ్చేలా తనవంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నంద్యాల మండలం చాపిరేవుల గ్రామంలో ఇటీవల గ్యాస్ పేలిన దుర్ఘటనలో పేలిపోయిన ఇంటిని శుక్రవారం నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిశోర్రెడ్డి పలువురు వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. దుర్ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడి నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న లింగమయ్య, సుబ్బరాయుడు కుటుంబాలకు సంబంధించిన బాధితులను పరామర్శించారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం మాజీ జవాన్ దౌలత్ఖాన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే వెంట ఎమ్మెల్సీ ఇసాక్బాషా, వైఎస్సార్సీపీ నాయకులు పీపీ మధుసూదన్రెడ్డి, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్, పురుషోత్తంరెడ్డి, గోవిందరెడ్డి, శివారెడ్డి, శివనాగిరెడ్డి, సుబ్బన్న, మల్లేశ్వరరెడ్డి, జాకీర్హుసేన్, 6వ వార్డు కౌన్సిలర్ పురందర్కుమార్, సోమశేఖర్రెడ్డి, కలాంబాషా, సమ్మద్, జలీల్, దౌలత్ఖాన్ పోరాట కమిటీ సభ్యులు సోహేల్రాణా, మహబూబ్బాషా, ఖాజాహుసేన్, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న సెపక్తక్రా పోటీలు
నంద్యాల(న్యూటౌన్): పట్టణంలోని పీజీ కళాశాలలో శుక్రవారం మూడో రోజున సెపక్తక్రా పోటీలు కొనసాగాయి. మణిపూర్, బిహార్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్కు చెందిన బాలురు, మణిపూర్, హ ర్యానా, బిహార్, కేరళకు చెందిన బాలికలు పోటీ ల్లో పాల్గొన్నారు. నంద్యాలలో సెపక్తక్రా జూనియర్స్ నేషనల్ పోటీలు నిర్వహించడం సంతోషకరమని రామకృష్ణారెడ్డి అన్నారు. క్రీడా భారతి సభ్యుడు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సర్టిఫికెట్ల పంపిణీ కర్నూలు సిటీ: ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్పై పోస్టు గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ కోర్సు ట్రైనింగ్ పూర్తి చేసిన అధ్యాపకులకు శుక్రవారం సర్టిఫికెట్లు అందజేశారు. ఢిల్లీలో ఏఐసీటీఈ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. దేశ వ్యాప్తంగా 21 ప్రముఖ విద్యా సంస్థలకు చెందిన అధ్యాపకులు ఈ శిక్షణకు ఎంపికకాగా, తెలుగు రాష్ట్రాల నుంచి కర్నూలు ట్రిపుల్ఐటీడీఎం మాత్రమే సర్టిఫికెట్ కోర్సుకు ఎంపికై ంది. ఈ విద్యా సంస్థలోని ఈసీఈ,సీఎస్ఈ, ఎంఈ విభాగాల నుంచి 15 మంది నిపుణులు 26 మల్టీడిసిప్లీనరీ ప్రాజెక్టులలో పాల్గొన్నారు. రెండు ఇంక్యుబేట్లు, 2 పేటెంట్స్, 5 కాన్ఫరెన్స్లు, జర్నల్ పబ్లికేషన్ల పరంగా మంచి ఫలితాలు సాధించారు. ట్రైనింగ్లో రాణించిన 48 మందికి ఏఐసీటీఈ చైర్మన్ ఆచార్య టీజీ సీతారం సర్టిఫికెట్లు అందజేశారు. దేశంలో ప్రస్తుతం పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలను విద్యార్థులకు అందించాలని ఆయన సూచించినట్లు ట్రిపుల్ఐటీడీఎం అధ్యాపకులు తెలిపారు. ప్రాణం తీసిన విద్యుత్ తీగలు గోనెగండ్ల: పాత ట్రాన్స్ఫార్మర్ తీసి కొత్తది ఏర్పాటు చేసి తీగలు లాగుతుండగా విద్యుత్ షాక్కు గురై గోనెగండ్లకు చెందిన బోయ రంగస్వామి(45) అనే వ్యక్తి మృతిచెందాడు. ఈ దుర్ఘటన కులుమాల గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. గోనెగండ్ల కిందిగేరికి చెందిన బోయ రంగస్వామికి భార్య లక్ష్మి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కులుమాల గ్రామంలో ఆర్డీఎస్ విద్యుత్ మరమ్మతులు జరుగుతుండటంతో రంగస్వామి వెళ్లాడు. పాత ట్రాన్స్ఫార్మర్ తీసి కొత్తది ఏర్పాటు చేసి విద్యుత్ తీగలు లాగుతుండగా షాక్కు గురయ్యాడు. తోటి కూలీలు రంగస్వామిని చికిత్స కోసం కర్నూలు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. -
ఆర్టీసీ బస్సును ఢీకొని ఇద్దరికి గాయాలు
కోసిగి: మండల కేంద్రం కోసిగిలోని సాయి బాబా గుడి సమీపంలో ఎమ్మిగనూరుకు చెందిన ఆర్టీసీ బస్సును ఢీకొని ఇద్దరు గాయపడ్డారు. శుక్రవారం రాత్రి కోసిగి నుంచి ఉరుకుంద గ్రామానికి బస్సు వెళ్తుంది. దుద్ది గ్రామానికి చెందిన భీమయ్య, తిమ్మప్ప అనే వ్యక్తులు అతిగా మద్యం తాగి బైక్ పై వస్తున్నారు. సాయిబాబా గుడి సమీంపంలో బస్సును ఢీకొని కిందపడిపోయారు. గాయాలు కావడంతో వారిని కోసిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను అక్కడి వైద్యులు ఆదోని ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశారు. -
ఉసూరుమని‘పింఛన్’
● ఈ ఏడాది ఆగస్టు వరకు కొత్త పింఛన్లు లేనట్టే! ● నేడు ఫిబ్రవరి నెల పింఛన్ల పంపిణీ కర్నూలు(అగ్రికల్చర్)/నంద్యాల(న్యూటౌన్): ఉ మ్మడి కర్నూలు జిల్లాలో కొత్తపింఛన్ల కోసం వృదు ్ధ లు, వితంతువులు, దివ్యాంగులు, చేనేతకార్మికులు, మత్స్యకారులు ఎదురు చూస్తున్నారు. అయితే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వడంపై ఎలాంటి ఆసక్తి చూపడం లేదు. పింఛన్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయి అనర్హత పేరుతో తొలగింపుల పర్వం పూర్తి అయ్యే వరకు కొత్త పింఛన్లకు అవకాశం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏడాదికి రెండుసార్లు కొత్త పింఛన్లు ఇచ్చేవారు. అర్హత కలిగిన వారందరికీ రాజకీయాలకు అతీతంగా పింఛన్లు మంజూరయ్యేవి. కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వకుండా ఉసూరుమనిపిస్తోంది. వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్న పలువురు 2024 జనవరిలో మృతిచెందారు. లబ్ధిదారు భార్యకు మరుసటి నెలలోనే వితంతు పింఛన్ ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో వేలాది మంది వితంతు మహిళలు పింఛన్లకు దూరం అయ్యారు. ఇదీ దుస్థితి.. ● నెలల క్రితమే భర్తలు మృతి చెందినా నంద్యాల మండలంలోని అయ్యలూరు గ్రామంలో లక్ష్మి, అప్పయ్యమ్మ, రమణమ్మలకు వితంతు పింఛన్ రాలేదు. ● పోలూరు, మిట్నాల, పెద్దకొట్టాల తదితర గ్రామాల్లో వృద్ధులు, వితంతువులకు నేటికీ పింఛనకు నోచుకోలేదు. అర్హత ఉన్న దివ్యాంగులు, వృద్ధులు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. మండల పరిషత్ కార్యాలయాల చుట్టూ వందలాది మంది ప్రదక్షిణలు చేస్తున్నారు. ● పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి సచివాలయాలకు అర్హులు వెళ్తున్నా వెబ్సైట్ ఓపెన్ కాలేదని చెప్పి వెనక్కి పంపిస్తున్నారు. రచ్చబండల వద్ద పింఛన్ల పంపిణీ? ఇంటి దగ్గర పింఛన్ల పంపిణీ అంటూ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పిన మాటలు అమలు కావడం లేదు. ప్రతి నెలా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటి దగ్గరే పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొంటున్నా.. అది నోటిమాటలకే పరిమితం అవుతోంది. గత ఏడాది జూన్ నుంచి 2025 జనవరి నెల వరకు ఒక్క సచివాలయం పరిధిలో కూడా 100 శాతం పింఛన్లు ఇంటి దగ్గరే పంపిణీ చేయలేదు. రచ్చబండలు, సచివాలయాల్లో పంపిణీ చేశారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో 4,54,924 మంది పింఛన్ లబ్ధిదారులకు రూ.194 కోట్లు మంజూరు అయ్యాయి. కర్నూలు జిల్లాలో 2,39,332, నంద్యాల జిల్లాలో 2,15,592 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీకి నిధులు విడుదల అయ్యాయి. ఫిబ్రవరి నెలలో కూడా ఇంటి దగ్గరే పంపిణీ అనేది నామమాత్రానికే పరిమితం కానుంది. పింఛన్ల తొలగింపు కుట్ర ! ఉమ్మడి కర్నూలు జిల్లాలో 56,518 మంది దివ్యాంగులకు పింఛన్ వస్తోంది. ప్రతి పింఛన్ను రీ వెరిఫికేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వారంలో మంగళ, బుధ, గురువారాల్లో పింఛన్లను వెరిఫికేషన్ చేపట్టింది. ఫిబ్రవరి నెలలో కూడా వారంలో మూడు రోజుల పాటు పింఛన్ వె రిఫికేషన్ కోసం అధికారులు ప్రణాళికలు రూపొందించారు. దివ్యాంగులకు కర్నూలు, ఆదోని, నంద్యాలలో పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం వితంతు, ఒంటరి మహిళలు, వృద్ధాప్య పింఛన్లులు కూడ పరిశీలించే కార్యక్రమం చేపడుతారు. ఈ నేపథ్యంలో పాత పింఛన్లను తొలగించే కుట్ర చేస్తున్నారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. తొలగింపుల తర్వాతనే కొత్త పింఛన్లకు అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
నిర్మాణ రంగం కుదేలే..
రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచి తే నిర్మాణ రంగం కుదేలవుతుంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా దెబ్బతినడంతో ప్రభుత్వా నికి ఆదాయం తగ్గింది. ఈ సమయంలో స్థిర, చరాస్థుల విలువను పెంచడం అనాలోచిత నిర్ణయం. వ్యవసాయ రంగం తర్వాత రియల్ ఎస్టేట్ రంగమే అతి పెద్దది. దానిని ఆదుకోవడం కోసం పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. – బ్రిజేష్ సింగ్, బిల్డర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కర్నూలు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు తగదు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చార్జీ లు చాలా ఎక్కువగా ఉన్నా యి. రెండు, మూడు సెంట్ల స్థలం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు రూ.40 వేలకు చేరుకుంటుంది. పట్టణాల్లో రూ.60 వేల నుంచి రూ.70 వేల మధ్య ఉంటుంది. ఈ సమయంలో రేట్లను పెంచితే ఆ విలువలు మరింత ఎక్కువై ప్రజలపై భారం పడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీలను తక్షణమే ఉప సంహరించుకోవాలి. లేదంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కానుంది. – రజనీకాంత్ రెడ్డి, రియల్ ఎస్టేట్ వ్యాపారి, కర్నూలు పెంచిన విలువల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు జిల్లాలో శనివారం నుంచి పెరిగిన విలువల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు చేస్తారు. క్రయ, విక్రయదారులు సహకరించాలని కోరుతున్నాం. సరాసరిగా 20 నుంచి 45 శాతం వరకు విలువలు పెరిగాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు నెలలు మదింపు చేసి ప్రజలకు భారం లేకుండా విలువలు పెంచాం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం. –ఎం. చెన్నకేశవరెడ్డి, జిల్లా రిజిస్ట్రార్, కర్నూలు ● -
ఫిల్టర్ పైపుల ధ్వంసం
కృష్ణగిరి: మండల పరిధిలోని చుంచుఎర్రగుడి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మండల యూత్ కన్వీనర్ లక్ష్మీకాంతరెడ్డి పొలంలో బుధవారం రాత్రి ఫిల్టర్ పైపులతోపాటు మోటర్ పైపులను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గత ఐదు రోజుల క్రితం కూడా ఇతని ఇంటి మీదకు అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి వెళ్లగా ఆ విషయంపై స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంతలోనే పొలంలోని పైపులు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఆలస్యంగా గుర్తించిన లక్ష్మీకాంతరెడ్డి కావాలనే కొందరు తనపై దాడులకు ఉసిగోల్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఈ దాడులకు పాల్పడుతున్న వారిని పోలీసులు గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.