ఈదురుగాలుల బీభత్సం | - | Sakshi
Sakshi News home page

ఈదురుగాలుల బీభత్సం

Published Fri, Apr 18 2025 1:51 AM | Last Updated on Fri, Apr 18 2025 1:51 AM

ఈదురుగాలుల బీభత్సం

ఈదురుగాలుల బీభత్సం

● ఏడు ఎకరాల్లో నేలకొరిగిన అరటితోట ● రూ. 20 లక్షల నష్టం

ప్యాపిలి: మండల పరిధిలోని పీఆర్‌ పల్లె గ్రామంలో గురువారం సాయంత్రం ఈదురుగాలుల బీభత్సానికి అరటితోట నేలకొరిగింది. గ్రామానికి చెందిన ప్రేమసాగర్‌ రెడ్డి తనుకున్న 10 ఎకరాల్లో అరటి సాగు చేశాడు. మంచి దిగుబడి రావడంతో మరికొద్ది రోజుల్లో పంటకోసేందుకు సిద్ధమయ్యాడు. అయితే గురువారం సాయంత్రం ఒక్కసారిగా వీచిన ఈదురుగాలులు బీభత్సాన్ని సృష్టించాయి. దీంతో ఏడు ఎకరాల్లో అరటి చెట్లు నేలకొరిగాయి. ఎకరాకు రూ.1.5 లక్షల పెట్టుబడి పెట్టి పంట సాగు చేసినట్లు రైతు వాపోయాడు. ప్రస్తుతం వచ్చిన దిగుబడిని విక్రయిస్తే దాదాపు రూ.20 లక్షల ఆదాయం వచ్చేదని తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement