ప్రధాన వార్తలు

మళ్లీ అదే రాజ్యాంగ ఉల్లంఘన
సాక్షి, అమరావతి: అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను తాకట్టు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా మరోసారి అదే తప్పు చేసేందుకు బరితెగించింది. హైకోర్టులో కేసు నడుస్తున్నా సరే లెక్క చేయకుండా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా రెండోసారి ఎన్సీడీ (నాన్ కన్వర్టబుల్ డిబెంచర్) బాండ్ల జారీకి సిద్ధమైంది. గత నెలలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు హక్కులిస్తూ బాండ్లు విడుదల చేసి రూ.3,489 కోట్లు సమీకరించింది. అయితే.. ఇది జరగడానికి ముందే కూటమి ప్రభుత్వ రాజ్యాంగ ఉల్లంఘనలను అడ్డుకోవాలని హైకోర్టులో పలువురు దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉంది. విషయం కోర్టు పరిధిలో ఉన్నా సరే.. మే 8న ప్రభుత్వం బాండ్లు జారీ చేసింది. తాజాగా ఈ నెల 24న రెండోసారి జారీకి ఏర్పాట్లు చేసింది. ఈ బాండ్లు కొనేవారికి రాష్ట్ర ఖజానాపై హక్కు కల్పించడమే కాకుండా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ భవిష్యత్తు ఆదాయాల పైనా ప్రత్యేక హక్కు ఇచ్చింది. రూ.2 వేల కోట్ల బేస్ వాల్యూతో బాండ్లు జారీచేయగా... రూ.3,489 కోట్ల బాండ్లను పెట్టుబడిదారులు కొనుగోలు చేశారు.అత్యధిక వడ్డీ భారం మే 8న 9.30 శాతం వడ్డీ రేటుతో ఏపీఎండీసీ బాండ్లు జారీ చేసింది. ఇది చాలా ఎక్కువ రేటు. రాష్ట్ర ఖజానాపై డైరెక్ట్ డెబిట్ హామీ ఇవ్వడంతో పాటు ఏపీఎండీసీ భవిష్యత్ ఆదాయాలపై ప్రత్యేక హక్కు కల్పించిన తర్వాత కూడా ఇంత ఎక్కువ వడ్డీ అంటే దారుణమే. బాండ్లు కొనుగోలు చేసినవారికి అన్ని రకాల ప్రయోజనాలు సమకూర్చి కూడా ఎక్కువ వడ్డీ రేటు ఇవ్వడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.⇒ మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం 6.71 శాతం వడ్డీ రేటుతో స్టేట్ డెవలప్మెంట్ లోన్ (ఎస్డీఎల్) తీసుకుంది. కానీ, అదే నెలలో దీనికంటే 2.59 శాతం ఎక్కువ వడ్డీ రేటుకు ఏపీఎండీసీ ద్వారా బాండ్లు జారీ చేశారు. ఇది ప్రభుత్వ ఖజానాపై అతి భారమైన అప్పుగా నిలిచి అనేక జవాబు లేని ప్రశ్నలను లేవనెత్తింది.⇒ గతంలో ఏపీ సీఆర్డీఏ (ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ), ఏపీ ఎస్బీసీఎల్ (ఏపీ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్)లు ఎటువటి తాకట్టులు లేకుండానే తక్కువ వడ్డీ రేటుకు ఎన్సీడీ బాండ్లు జారీ చేసి డబ్బు సమకూర్చుకున్నాయి. కానీ, ఇప్పుడు ఖనిజాభివృద్ధి సంస్థ రూ.1.91 లక్షల కోట్ల విలువైన 436 ఖనిజ గనులను తాకట్టు పెట్టి కూడా అధిక వడ్డీకి అప్పు తీసుకోవడం గమనార్హం. ⇒ రూ.లక్షల కోట్ల విలువైన గనులను తాకట్టు పెట్టిన తర్వాత కూడా అంత ఎక్కువ వడ్డీ భారాన్ని రాష్ట్రం నెత్తిన మోపడంపై తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయి. ఎస్డీఎల్ లోన్తో సమానమైన వడ్డీ రేటు ఇవ్వాల్సి ఉండగా... ఆస్తులు తాకట్టు పెట్టి మరీ ఎక్కువ వడ్డీ రేటుకు ఇవ్వాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ అప్పు ద్వారా... బాండ్లు కొనుగోలు చేసే పెట్టుబడిదారులకు ఎక్కడా లేని భద్రత, అధిక వడ్డీలు, ప్రత్యేక సదుపాయాలు దక్కుతుండగా రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం తీవ్ర నష్టం కలుగుతోంది. హైకోర్టులో కేసున్నా...ఏపీఎండీసీ బాండ్ల వ్యవహారంపై ఇప్పటికే ఒక పిటిషన్ హైకోర్టులో విచారణలో ఉంది. మే 7న కోర్టు దీనిపై ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. కేసు న్యాయ విచారణలో ఉన్నా లెక్కచేయకుండా ప్రభుత్వం మళ్లీ అదే తరహాలో బాండ్ల జారీకి ఏర్పాట్లు చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ‘కోర్టులో విచారణ జరుగుతున్న అంశంపై ముందుకెళ్లడం తప్పు. ఒకసారి ఆ తప్పు చేసి మళ్లీ మళ్లీ అదే తప్పు చేయడం నైతికంగా, నైతికంగా సరికాదు‘ అని ఒక న్యాయ నిపుణుడు వ్యాఖ్యానించారు. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను తాకట్టు పెట్టి నేరుగా అప్పు తీసుకోవడం ఆర్టికల్ 293 (1) ప్రకారం రాజ్యాంగ విరుద్ధమని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అది కూడా శాసనసభ పర్యవేక్షణ లేకుండా ప్రభుత్వ ఖర్చులకు డబ్బు సమకూర్చుకోవడం ఆర్టికల్స్ 203, 204 ప్రకారం నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తున్నారు.దేశ ఆర్థిక వ్యవస్థపై నీలి నీడలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పుల కుంపటి వ్యవహారం దేశంలో అమలవుతున్న ఫిస్కల్ కన్సాలిడేషన్ రోడ్మ్యాప్పై మాయని మచ్చగా మారుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అన్ని రాష్ట్రాలు ఇదే విధమైన అప్పుల విధానాన్ని అనుసరిస్తే కేంద్ర–రాష్ట్ర ఆర్థిక సమతుల్యత ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ విధానం ఇతర రాష్ట్రాలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కీలక ప్రశ్నలు–రాష్ట్రం పేరు మీద కాకుండా.. రాష్ట్ర ఖజానా ఆధారంగా అప్పు తీసుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా?–డైరెక్ట్ డెబిట్ మాండేట్ ద్వారా ఖజానాను అందుబాటులో పెట్టడం ఎంతమేరకు చట్టబద్ధం?–హైకోర్టులో కేసు నడుస్తుండగానే మళ్లీ అదే విధంగా బాండ్ల జారీకి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం?–ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ భవిష్యత్ ఆదాయాలను కూడా తాకట్టు పెట్టడం న్యాయం?–రూ.1.90 లక్షల కోట్ల విలువైన 436 ఖనిజ వనరులను తాకట్టు పెట్టి అధిక వడ్డీ రేటుకు అప్పు తేవడం మన రాష్ట్రానికి మంచిదా?

ఇది అమెరికా మిలటరీ విజయం.. ఇరాన్కు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: ఇరాన్ అణు స్థావరాల ధ్వంసమే అమెరికా టార్గెట్ అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. దాడులను అధికారికంగా ప్రకటించారు. ఇరాన్పై దాడులు అమెరికా మిలటరీ విజయమని ప్రశంసలు కురిపించారు. ఇదే సమయంలో శాంతిని నెలకొల్పే బాధ్యత ఇరాన్దే అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై అమెరికా దాడుల తర్వాత అధ్యక్షుడు ట్రంప్ తొలిసారిగా స్పందించారు. ట్రంప్ వైట్ హౌస్లో మీడియాతో మాట్లాడుతూ..‘ఇరాన్పై మేము దాడులు చేశాం. కీలకమైన ఇరాన్ అణు స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశాం. ప్రపంచం ఎదుర్కొంటున్న అణుముప్పును ఆపడమే మా లక్ష్యం. అమెరికా, ఇజ్రాయెల్, ప్రపంచానికి ఇది చారిత్రక క్షణం. ఇది మా మిలటరీ విజయం. మేం చేసిన దాడులు చాలా కష్టతరం. ప్రపంచంలో ఏ దేశానికి ఇది సాధ్యం కాదు. మేము ఇజ్రాయెల్తో కలిసి పనిచేస్తాం. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పే బాధ్యత ఇరాన్దే. ఇరాన్ శాంతి మార్గం వెళ్లకపోతే భవిష్యత్లో మరిన్ని ఎక్కువ దాడులు చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నా’ అంటూ వ్యాఖ్యలు చేశారు.#WATCH | US strikes Iran's three nuclear facilitiesUS President Donald Trump says, "Our objective was the destruction of Iran's nuclear enrichment capacity and a stop to the nuclear threat posed by the world's number one state sponsor of terror. Tonight, I can report to the… pic.twitter.com/KQdMgczaJo— ANI (@ANI) June 22, 2025

‘సింధు ఒప్పందం’పై పాక్కు కంగుతినిపించిన అమిత్ షా
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాక్- భారత్ మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఈ నేపధ్యంలోనే భారత్.. పాక్తో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. అయితే ఈ పరిణామంతో కంగుతిన్న పాక్ తిరిగి సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణకు వేడుకుంటోంది. దీనిపై హోంమంత్రి అమిత్ షా మరోమారు ఈ విషయంలో భారత్ వైఖరిని స్పష్టం చేశారు.ఇస్లామాబాద్తో సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం ఎప్పటికీ పునరుద్ధరించబోదని, పాకిస్తాన్కు ప్రవహించే సింధు నీటిని భారత అంతర్గత వినియోగం కోసం మళ్లించనున్నామని హోంమంత్రి అమిత్ షా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. కాశ్మీర్లో చోటుచేసుకున్న ఉగ్రదాడిలో 26 మంది మృతిచెందిన అనంతరం సింధు నదీ వ్యవస్థ వినియోగాన్ని నియంత్రించే 1960 ఒప్పందంలో భారతదేశం తన భాగస్వామ్యాన్ని నిలిపివేసింది. ఈ ఒప్పందం కింద భారతదేశంలోని మూడు నదుల నీటిని పాకిస్తాన్లోని 80శాతం పొలాలకు అందించేందలా నాడు ఒప్పందం కుదిరింది.ఈ ఒప్పందం రద్దుపై తాజాగా స్పందించిన అమిత్ షా.. ఒక కాలువ నిర్మించడం ద్వారా పాకిస్తాన్కు ప్రవహిస్తున్న నీటిని రాజస్థాన్కు మళ్లిస్తామని, అప్పుడు పాకిస్తాన్కు నీటి కొరత ఏర్పడుతుందని అన్నారు. షా చేసిన వ్యాఖ్యలు.. భవిష్యత్తులో ఈ ఒప్పందంపై చర్చల కోసం తపిస్తున్న ఇస్లామాబాద్ ఆశలను నీరుగార్చాయి. అయితే అంతర్జాతీయ చట్టం ప్రకారం ఈ ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారతదేశ నిర్ణయాన్ని చట్టపరంగా సవాలు చేయాలని ఇస్లామాబాద్ యోచిస్తున్నదని సమాచారం.ఇది కూడా చదవండి: భయంతో బంకర్లో ఇరాన్ ఖమేనీ... వారసుల రేసులో ముగ్గురు?

ఇరాన్పై విరుచుకుపడిన అమెరికా.. బీ-2 స్పిరిట్ బాంబర్లతో ఆకస్మిక దాడులు
టెహ్రాన్: ఇరాన్, ఇజ్రాయెల్ వేళ సంచలన ఘటన చోటుచేసుకుంది. ఇరాన్పై ముప్పెట దాడి మొదలైంది. అంతా అనుకున్నట్టుగానే ఇరాన్పై తాజాగా అమెరికా విరుచుకుపడింది. ఇరాన్లోని అణు కేంద్రాలే టార్గెట్గా అమెరికా భారీ దాడులు చేసింది. దాడుల అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై అమెరికా విజయవంతంగా దాడులు చేసిందని ట్రంప్ చెప్పుకొచ్చారు.ఇక, ఇరాన్లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై అమెరికా బీ-2 స్పిరిట్ బాంబర్లతో విరుచుకుపడింది. ఈ దాడుల అనంతరం, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ క్రమంలో ట్రంప్ ట్విట్టర్ వేదికగా.. ‘ఇరాన్పై అమెరికా దాడులు చేసింది. భారీ బాంబులు ఫోర్డోపై వేశాం. ఇరాన్ గగనతలం బయట నుంచే ఈ దాడులు చేశాం. విమానాలు సురక్షితంగా అమెరికాకు తిరుగుముఖం పట్టాయి. అమెరికా యోధులకు అభినందనలు. ప్రపంచంలో మరే దేశానికి చెందిన మిలిటరీకి ఇది సాధ్యంకాదు. ఇప్పుడు శాంతికి సమయం’ అని చెప్పుకొచ్చారు.pic.twitter.com/wu9mMkxtUg— Donald J. Trump (@realDonaldTrump) June 21, 2025మరో పోస్టులో ‘ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఫోర్డో నాశనమైంది’ అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ వైమానిక సైన్యంతో కలిసి దాడి చేసినట్లు అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. తమ విమానాలు సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఇక, ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా కూడా ఇరాన్పై దాడులు ప్రారంభించడంతో భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. కాగా, ఈ దాడి నేపథ్యంలో ట్రంప్ అమెరికా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ ప్రకటించింది. ఇదిలా ఉండగా.. నిన్న రాత్రే అమెరికాలోని వైట్మన్ ఎయిర్ బేస్ నుంచి మరిన్ని బీ-2 స్పిరిట్లు, ఎనిమిది కేసీ-135 స్ట్రాటో ట్యాంకర్లు ఇండో-పసిఫిక్లోని డియాగో గార్సియా దిశగా బయల్దేరి వెళ్లాయి. ఇవి మైటీ11, మైటీ21 అనే కాల్సైన్లు వాడినట్లు ఫ్లైట్ రాడార్ 24 పేర్కొంది. గతంలో కూడా బీ-2 స్పిరిట్లు ప్రత్యేక ఆపరేషన్ల కోసం బయల్దేరిన సమయంలో ‘మైటీ’ కాల్సైన్లను వాడాయి. ఈ దాడితో అమెరికా కూడా యుద్ధ రంగంలోకి ప్రవేశించినట్లైంది. అగ్రరాజ్య ప్లానింగ్కు పూర్తిగా సహకరించినట్లు ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. ఫోర్డో అణుకేంద్రం క్వామ్ నగరానికి అత్యంత సమీపంలో ఉంది. అక్కడి ప్రజలు పేలుళ్ల చప్పుళ్లు విన్నట్లు మీడియాకు వెల్లడించారు. ఈ అణుకేంద్రం ఇరాన్కు చాలా కీలకమైంది. అక్కడి పర్వతాన్ని తొలిచి కొన్ని వందల అడుగుల లోతులో దీనిని నిర్మించారు. 1981లో బాగ్దాద్లో ఇజ్రాయెల్ ఎఫ్15, ఎఫ్16 యుద్ధ విమానాలు అణు కేంద్రాన్ని ధ్వంసం చేయడాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుజాగ్రత్తగా దీన్ని నిర్మించారు. 2023లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇన్స్పెక్టర్లు ఇక్కడ 83.7శాతం శుద్ధిచేసిన యురేనియంను గుర్తించారు. అత్యంత శక్తిమంతమైన అణుబాంబుల్లో వాడే 90శాతం శుద్ధి చేసిన యురేనియంకు ఇది చాలా దగ్గర్లో ఉంది. అణువ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసిన నేపథ్యంలో ఆ దేశం ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం.బీ-2 బాంబర్లు..ఒక చిన్న పక్షికి సమానంగా బీ-2 బాంబర్ల రాడార్ క్రాస్ సెక్షన్ ఉంటుంది. ఒక్కో బీ-2 బాంబర్ రెండు ఆయుధాలను మోసుకెళ్లగలుగుతుంది. 15 టన్నుల బరువున్న రెండు బంకర్ బ్లాస్టర్లను మోసుకెల్లే సామర్థ్యం వీటికి ఉంది. తాజాగా ఆరు బీ-2 బాంబర్లు ఇరాన్పై దాడులు చేసినట్టు తెలుస్తోంది. ఇవి ఒక్కసారిగా 11,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. B-2 Spirit Stealth Bomber🇺🇸 U.S. Air Force heavy strategic bomberDesigned for stealth, it can penetrate dense enemy air defenses undetectedCarries conventional and nuclear weaponsRange: ~11,000 km (6,800 miles) without refuelingCost: ~$2 billion per unitOnly 21 were… pic.twitter.com/IcF5FsYxED— Israel MyChannel (@IsraelMychannel) June 21, 2025అంతకుముందే ఇరాన్ను ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఇజ్రాయెల్పై ప్రశంసలు కురిపించారు. ఇజ్రాయెల్ విజయపథంలో ఉందని, ఇప్పుడు ఆ దేశాన్ని యుద్ధం ఆపమని తాను చెప్పలేనని ట్రంప్ అన్నారు. ఇజ్రాయెల్ అద్భుతంగా రాణిస్తోంది. ఇరాన్ అంతగా ప్రభావం చూపడం లేదు. ఇప్పుడు యుద్ధాన్ని ఆపడం కష్టమే అని చెప్పుకొచ్చారు. అమెరికా సాయం లేకుండా ఇరాన్కు చెందిన ఫోర్డ్ భూగర్భ అణుకేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం టెల్అవీవ్కు లేదన్నారు. ఒకవేళ వారు దాడులు చేసినా అది పెద్ద ప్రభావం చూపించవన్నారు. వారికి ఆ సామర్థ్యం లేదన్నారు.Visuals: Huge US airstrikes on Fordow, Natanz, and Esfahan Iranian nuclear facilities. pic.twitter.com/fSIcAHu3X3— Black Cobra ⚡ (@Blackcobra00007) June 22, 2025అలాగే, ఐరోపా నేతలు జరుపుతున్న చర్చలు కూడా ఫలవంతం కావని అన్నారు. వారు ఇరాన్కు ఎలాంటి సాయం చేయలేరని తెలిపారు. ఇదే సమయంలో ‘ఐరోపాతో ఇరాన్ మాట్లాడాలని అనుకోవడం లేదు. మాతో మాట్లాడాలనుకుంటున్నారు. ఈ విషయంలో ఐరోపా ఏ రకంగానూ సాయం చేయలేదు. నేను శాంతి దూతను. కొన్ని పరిస్థితుల్లో శాంతిదూత కూడా కఠినంగా ఉండాల్సి వస్తుంది’ అని పేర్కొన్నారు.

అనర్హులకు వందనం..అమ్మల ఆగ్రహం
సోమశిల: తల్లికి వందనం పథకం అర్హుల జాబితా రూపకల్పనలో అధికారులు, ఉపాధ్యాయులు చేసిన తప్పిదాలు లబ్ధిదారులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. పదుల సంఖ్యలో విద్యార్థులకు ఒకే తల్లిపేరు..ఒక్కరి పేరుతో 20 విద్యుత్ కనెక్షన్లు..విద్యార్థి ఒకరైతే వారికి సంబంధంలేని వారిని తల్లిదండ్రులుగా సూచించడం..ఇలా రోజుకో విచిత్రం వెలుగు చూస్తోంది. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గౌరవరంలో ఇలాంటి తప్పిదమే చోటుచేసుకుంది. ఇది చివరికి గ్రామంలోని మహిళల మధ్య వివాదానికి దారితీసింది.వివరాల్లోకి వెళ్తే..అనంతసాగరం మండలం గౌరవరంలో 50 మంది విద్యార్థులకు సంబంధించి 30 మంది తల్లులకు నగదు జమకాలేదు. ఆ విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో వారి తల్లుల పేర్ల నమోదులో ఉపాధ్యాయులు చేసిన తప్పిదం పథకానికి దూరమయ్యేలా చేసింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు పడకపోగా ఆ సొమ్ము అనర్హులైన వారి ఖాతాల్లో జమైంది. దీంతో పథకానికి దూరమైన వారంతా, అనర్హులైన వారిని వెళ్లి ప్రశి్నంచారు. మా ఖాతాల్లో పడాల్సిన సొమ్ము, మీకెలా జమయ్యిందంటూ ప్రశ్నించారు. దీంతో వారంతా మమ్మల్ని అడగడానికి మీరెవరు, పోయి ప్రధానోపాధ్యాయుడిని అడగండి అంటూ సమాధానమిచ్చారు. సమాధానానికి సంతృప్తి పడకపోవడంతో వారి మధ్య గొడవలదాకా దారితీసిందని గ్రామస్తులు చెబుతున్నారు.నా కొడుకు డబ్బు వేరొకరికి నా కుమారుడు తారకరామ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. మా అబ్బాయి పేరు ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో తల్లిగా నా పేరు బదులు వేరొకరి పేరు పొందుపరిచారు. దీంతో మరొకరి ఖాతాలో నగదు జమయ్యింది. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలి. – గార్లపాటి సరస్వతి, విద్యార్థి తల్లి ఇలా చేయడం మంచిది కాదు నాకు ఇద్దరు పిల్లలు. స్థానిక పాఠశాలలోనే చదువుతున్నారు. ఆన్లైన్లో విద్యార్థుల వివరాలు నమోదు చేసేటప్పుడు వివరాలు మార్చారు. దాంతో మాకు పడాల్సిన తల్లికి వందనం డబ్బు వేరొకరి ఖాతాలో జమయ్యాయి. ఇలా పదుల సంఖ్యలో పథకానికి దూరమైనవారున్నారు. – కాలువ అలివేలు, విద్యార్థి తల్లి గ్రీవెన్స్లో పెట్టుకుంటే నగదు రికవరీ చేస్తాం రెండు రోజులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వివరాలు పరిశీలిస్తున్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమకాని వారు సచివాలయంలో గ్రీవెన్స్ పెట్టుకుంటే అనర్హుల నుంచి రికవరీ చేసి మళ్లీ అర్హుల ఖాతాలోకి నగదు జమ చేస్తాం. – కాటంరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఎంఈఓ–2రూ.10,900లే!రణస్థలం: రోజులు గడుస్తున్న కొద్దీ తల్లికి వందనం డబ్బు క్రమేణా తగ్గిపోతూ బ్యాంకు ఖాతాల్లో జమవుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం జేఆర్పురం పంచాయతీకి చెందిన దుక్క లక్ష్మి అనే లబ్ధిదారు ఖాతాలో తల్లికి వందనం కింద ఇద్దరు పిల్లలకు కలిపి రూ.26 వేలు జమకావాల్సి ఉండగా, రూ.10,900 మాత్రమే జమ అయ్యాయి. దీంతో ఆమె అవాక్కయ్యారు. దీనిపై సచివాలయానికి వెళ్లి ప్రశ్నించినా లాభం లేకపోయింది. లక్ష్మి చిన్న కుమార్తె షర్మిల 9వ తరగతి చదువుతుండగా, పెద్ద కుమారుడు షారోన్ కుమార్ ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరాడు. ఇతనికి కూడా తల్లికి వందనం ఇంకా పడలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.తల్లికి వందనంలో వివక్ష కొత్తూరు: తల్లికి వందనం పథకం మంజూరులో ప్రభుత్వం వివక్ష చూపించింది. సీఎఫ్ఎంఎస్ ద్వారా ఆరి్థక లావాదేవీలు జరుగుతున్నందున పంచాయతీ సర్పంచ్లుగా ఉన్న పిల్లలకు ఈ పథకాన్ని వర్తింపజేయలేదు. శ్రీకాకుళం జిల్లాలో చాలా మంది సర్పంచ్ల పిల్లలకు నగదు అందలేదు. కానీ, కొత్తూరు మండలంలోని మెట్టూరు బిట్–1 ఆర్ఆర్ కాలనీ పంచాయతీ సర్పంచ్, టీడీపీ నాయకుడు అడపాక శంకరరావు ఇద్దరు పిల్లలకు మాత్రం ఈ పథకం మంజూరైంది. ఒక కుమార్తెకు సంబంధించి తండ్రి సర్పంచ్ శంకరరావు పేరున, మరో కుమార్తెకు తల్లి అడపాక రాణి పేరున మంజూరు కావడం మరో విశేషం. వీరు టీడీపీ నాయకులు కాబట్టే డబ్బులు అందాయని స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భయంతో బంకర్లో ఇరాన్ ఖమేనీ... వారసుల రేసులో ముగ్గురు?
న్యూఢిల్లీ: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకరయుద్ధం కొనసాగుతోంది. ఇంతలో ఇరాన్ నుంచి ఒక సంచలన అప్డేట్ బయటకు వచ్చింది. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ.. ఒకవేళ తాను హత్యకు గురైతే తన స్థానంలో ‘ఈ ముగ్గురు’ సీనియర్ మతాధికారులలో ఒకరిని చీఫ్గా ప్రకటించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారని ‘ది న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది.ఇప్పటికే రహస్య బంకర్లో తలదాచుకున్న ఖమేనీ, తనను కనుక్కోవడం మరింత కష్టతరం చేయడానికి తన చుట్టూ ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లను మూసివేయాలని అధికారులను ఆదేశించాడని ఆ వార్తాపత్రిక నివేదించింది. అయతుల్లా ఖమేనీ కుమారుడు మోజ్తాబా.. ఇతను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్కు సన్నిహితుడైన మతాధికారి. ఈయన సుప్రీం చీఫ్ రేసులో ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అతను ఖమేనీ పేర్కొన్న అభ్యర్థుల జాబితాలో లేడని, ఆయన పేర్కొన్న పేర్లలో మరో ముగ్గురు ఉన్నారని అధికారులు తెలిపారు.శుక్రవారం ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్.. ఇరాన్ సుప్రీం లీడర్ను ఇకపై ఉనికిలో ఉంచే ప్రసక్తే లేదు అని పేర్కొన్నారు. ఇరాన్ క్షిపణి టెల్ అవీవ్ సమీపంలోని పట్టణంలోని ఒక ఆసుపత్రిని ఢీకొట్టిన అనంతరం కాట్జ్ ఈ వ్యాఖ్య చేశారు. ‘ఇరానియన్ నియంత రహస్య బంకర్లో కూర్చుని ఇజ్రాయెల్లోని ఆసుపత్రులు, నివాస భవనాలపై క్షిపణులను ప్రయోగిస్తున్నాడు. ఇది తీవ్రమైన యుద్ధ నేరం. వీటికి ఖమేనీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని కాట్జ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఇరానియన్ సుప్రీంను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్)ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.ఇజ్రాయెల్కు ఎదురవుతున్న ముప్పును తప్పించేందుకు, ఖమేనీ పాలనను అంతం చేసేందుకు ఇరాన్లోని వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులను పెంచాలని ఆదేశించామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి పేర్కొన్నారు. మీడియా నివేదికల ప్రకారం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరానియన్ అణు ప్రదేశాలపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్కు మద్దతు పలకాలని భావిస్తున్న తరుణంలో యుద్ధ పరిణామాలు మరోమలుపు తిరిగాయి. ఇది కూడా చదవండి: ‘యుద్ధం’ ఆపితే నోబెల్ రాదు: ట్రంప్ అదే ‘మధ్యవర్తిత్వ’ వాదనలు

ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం....కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. మీ అంచనాలు నిజమవుతాయి. దేవాలయాలు సందçర్శిస్తారు. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు అనుకూలం. చిన్ననాటి స్నేహితులు తారసపడతారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగి ముందుకు సాగుతారు. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం. బంధువిరోధాలు. లేత నీలం, గులాబీ రంగులు.విష్ణుధ్యానం చేయండి.వృషభం....చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పరపతి పెరుగుతుంది. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. వాహనాలు కొంటారు. గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. ఇంతకాలం పడిన కష్టం ఫలితమిస్తుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలలో మరింత లాభాలు. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి. కళాకారులకు సన్మానాలు,ఊహించని అవకాశాలు. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. కుటుంబంలో చికాకులు. నలుపు, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.మిథునం...సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవర్తమానాలు. రాబడి పెరుగుతుంది. ఇంతకాలం పడిన కష్టానికి ఫలితం దక్కుతుంది. అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు. కార్యసిద్ధి. అందరిలోనూ సత్తా చాటుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారలావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం చివరిలో వృథా ఖర్చులు అధికం. మానసిక ఆందోళన. ఆకుపచ్చ, తెలుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.కర్కాటకం....పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. బంధువులు ఆపద్బాంధువులుగా ఆదుకుంటారు. కష్టాల నుంచి గట్టెక్కుతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. మీ ఆశయాలు నెరవేరతాయి. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు ఉత్సాహంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన పురోభివృద్ధి. కళాకారులకు సన్మానాలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. పసుపు, నేరేడు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.సింహం...పనులు నిదానంగా సాగుతాయి. స్నేహితులతో స్వల్ప వివాదాలు. కలహాలు. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. పాతసంఘటనలు గుర్తుకుతెచ్చుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. దూరపు బంధువులను కలుసుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కళాకారులకు అవకాశాలు కొన్ని దక్కే ఛాన్స్. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మనశ్శాంతి లోపిస్తుంది. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.కన్య..రావలసిన డబ్బు అంది ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాలలో విజయం. ఆప్తులతో వివాదాలు తీరతాయి. వాహనాలు, స్థలాలు కొంటారు. నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు ఊహించని అవకాశాలు. వారం ప్రారంభంలో బంధువులతో కలహాలు. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. పసుపు, ఆకుపచ్చ రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.తుల..అదనపు ఆదాయం సమకూరుతుంది. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పనిభారం మరింత తగ్గుతుంది. కళాకారులకు అన్ని విధాలా అనుకూలం. వారం మధ్యలో బంధువిరోధాలు. పనిఒత్తిడులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. శివారాధన మంచిది.వృశ్చికం...రావలసిన సొమ్ము అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. వాహన, గృహయోగాలు. . ఆరోగ్యం గతం కంటే మెరుగుపడుతుంది. దీక్షతో ముందుకు సాగి విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూలం. వ్యాపారాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. లాభాలు తథ్యం. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్య, కుటుంబసమస్యలు. పసుపు,నేరేడు రంగులు.దేవీఖడ్గమాల పఠించండి.ధనుస్సు...అనుకున్న ఆదాయం లభించి ముందడుగు వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ప్రముఖ వ్యక్తులు పరిచయం. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. భూవివాదాలు తీరతాయి. వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగాలలో విధులు ప్రశాంతంగా సాగుతాయి. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు. వారం చివరిలో మిత్రులతో కలహాలు. అనారోగ్య సూచనలు. శ్రమాధిక్యం. ఎరుపు, గులాబీ రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.మకరం...ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. ఆప్తుల సలహాలు పాటిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థుల శక్తిసామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు లాభాలబాట పడతారు. ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు కొన్ని విజయాలు వరిస్తాయి. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.కుంభం...ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. బంధువులతో విభేదాలు పరిష్కారమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. సేవాకార్యక్రమాలపై దృష్టి పెడతారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు. ఇంట్లో శుభకార్యాల సందడి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలలో అనూహ్యమైన లాభాలు. ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో ధననష్టం. అనారోగ్య సూచనలు. గులాబీ, తెలుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.మీనం...ఆదాయం కొంత నిరుత్సాహపరుస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు. బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. కాంట్రాక్టర్లకు కొంత నిరాశ ఎదురవుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. అనారోగ్య సూచనలు. దేవాలయ దర్శనాలు. నిరుద్యోగులకు కొంత గందరగోళం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు. . రాజకీయవర్గాలకు నిరుత్సాహం. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. హనుమాన్ ఛాలీసా పఠించండి..

డబ్బుల్లేవు.. కొత్త పథకాలెట్టా?
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలకే నానా కష్టాలు పడుతూ డబ్బులు సమకూర్చుకుంటున్న నేపథ్యంలో..ఇక కొత్త సంక్షేమ పథకాల అమలు ఇప్పట్లో సాధ్యం కాదనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. ఆర్థిక కటకట నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అమలు నిలిపివేయాలంటూ మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రతి నెలా ఖజానాకు వస్తున్న ఆదాయంతో అనివార్యంగా చేయాల్సిన ఖర్చుల సర్దుబాటు మాత్రమే జరుగుతోందని, ఇక ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలకు పెద్ద మొత్తంలో నిధులు అవసరమైనప్పుడు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని గుర్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఆసరా పింఛన్లను పెంచి ఎన్నికలకు వెళ్లాలనుకున్నా సాధ్యం కాలేదని, రైతు భరోసా నిధులు జమ చేసేందుకు మాత్రమే వెసులుబాటు దొరికిందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అదనపు ఆదాయం కావాలంటే భూముల అమ్మకమే శరణ్యమని స్పష్టం చేస్తున్నాయి. ఆదాయం అంతంత మాత్రమే.. ఖజానా లెక్కలు పరిశీలిస్తే.. రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రతి నెలా ప్రభుత్వ సొంత రాబడులు రూ.12 వేల కోట్లకు మించడం లేదు. గత రెండేళ్ల గణాంకాలు పరిశీలించినా ఇదే విషయం స్పష్టమవుతోంది. తాజాగా కాగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2025 ఏప్రిల్ నెలలో రూ.10,916 కోట్లు మాత్రమే పన్ను ఆదాయం వచ్చింది. ఇందులో జీఎస్టీ కింద రూ.4 వేల కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.1,126 కోట్లు, అమ్మకపు పన్ను రూపంలో రూ.2,700 కోట్లు, ఎక్సైజ్ ద్వారా రూ.1,300 కోట్లు, కేంద్ర పన్నుల రూపంలో రూ.1,100 కోట్లు వచ్చాయి. వీటితో పాటు అప్పులు, పన్నేతర ఆదాయం, కేంద్రం ఇచ్చే గ్రాంట్లు కలిపినా మొత్తం రాబడులు రూ.16,473 కోట్లు మాత్రమే. ప్రతి నెలా ఖర్చు ఇలా.. ఖర్చుల విషయానికి వస్తే ప్రతి నెలా సగటున రూ.6 వేల కోట్ల వరకు రెవెన్యూ పద్దు కింద ఖర్చు చేయాల్సి వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో పాటు రూ.2 వేల కోట్ల వరకు అప్పులకు వడ్డీల కింద, దాదాపు రూ.4 వేల కోట్లు (తాజాగా ప్రకటించిన డీఏతో కలిపి) ఉద్యోగులకు వేతనాల కింద, రూ.1,500 కోట్లు పింఛన్ల కింద, రూ.2,500 కోట్ల వరకు సబ్సిడీల కింద, రూ.1000–1500 కోట్లు మూలధన వ్యయం కింద ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇవన్నీ అనివార్యంగా చెల్లించాల్సినవే. ఇవన్నీ కలిపి రూ.17 వేల కోట్లు దాటుతున్నాయి. అయితే ప్రభుత్వ రాబడులు (అప్పులతో కలిపి) ఇంతకంటే తక్కువే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో కొంచెం అటుఇటుగా ఈ చేత్తో తీసుకుని ఆ చేత్తో ఇచ్చేటట్టే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉండటం గమనార్హం. కాగా రూపాయి అదనంగా ఖర్చు పెట్టాలన్నా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చెప్పినట్టు కడుపు కట్టుకోవాల్సిందేనని, ఎప్పటికప్పుడు సర్దుబాటుకు మాత్రమే నిధులు సరిపోతున్నాయని, ఏదైనా పథకానికి డబ్బులు కావాలంటే రూపాయి రూపాయి పోగేయాల్సి వస్తోందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. హెచ్ఎండీఏపై ఆశలు..‘నియోపొలిస్’పై కన్ను ప్రస్తుత పరిస్థితుల్లో భూముల అమ్మకాల ద్వారా మాత్రమే అదనపు ఆదాయం వస్తుందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పుడే లోటు రూ.9 వేల కోట్లకు చేరినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కంచ గచ్చిబౌలి భూముల అమ్మకాల ద్వారా రూ.20 వేల కోట్లు సమకూర్చుకుని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలన్న ఆలోచన కార్యరూపం దాల్చకపోవడంతో ఇక, హెచ్ఎండీఏ మీదనే ప్రభుత్వం ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా కోకాపేట్ నియోపొలిస్ భూముల అమ్మకాలను త్వరలోనే తెరపైకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ దాదాపు ఐదు ప్రాంతాల్లో భూముల అమ్మకాలకు అవకాశాలున్నట్టు ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరోవైపు 18 హెచ్ఎండీఏ లేఅవుట్లలోని 2,414 ప్లాట్లు, ఉప్పల్ భగాయత్, తుర్కయంజాల్, ఇన్ముల్ నర్వలతో పాటు లేమూరు, కుర్మాల్గూడ, బాచుపల్లి, మేడిపల్లి, మోకిల, ప్రతాప సింగారం, బహుదూర్పల్లి, పెద్ద కంజర్ల తదితర ప్రాంతాల్లోని ఓపెన్ ప్లాట్లు అమ్మడానికి కూడా సర్కారు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద 18 నెలల కాలంలో కనీసం రూ.12 వేల కోట్లను హెచ్ఎండీఏ భూముల అమ్మకాల ద్వారా రాబట్టుకోవాలని, నియోపోలిస్ భూముల అమ్మకాల ద్వారా మరో రూ.3 వేల కోట్ల వరకు సమకూర్చుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వ వర్గాలున్నట్టు సమాచారం. ఎన్నికల సమయంలో అలా... అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి అవగాహన ఉన్నట్లు చెప్పి పలు పథకాలను ప్రకటించిన కాంగ్రెస్ పెద్దలు.. ఇప్పుడు అమలు చేయాల్సి వచ్చేసరికి ఆదాయం పెరిగితే తప్ప అమలు చేయడం సాధ్యం కాదని, అప్పుల కిందే నెలకు రూ.6 వేల కోట్లు చెల్లించాల్సి రావడం వల్ల సంక్షేమ పథకాలకు నిధులు చాలడం లేదని అంటుండంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెన్షన్ల పెంపు, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఏడాదిన్నర అయినా అమలు కాకపోగా... రైతుభరోసా కింద ఎకరాకు ఏటా ఇస్తామన్న మొత్తాన్ని రూ.15 వేల నుంచి రూ.12 వేలకు కుదిండాన్ని ప్రతిపక్షాలు ఎత్తిచూపుతున్నాయి. అది కూడా సక్రమంగా చెల్లించలేదని ఆరోపిస్తున్నాయి. అలాగే ఉద్యోగులకు ఐదు డీఏలు చెల్లించాల్సి ఉండగా, రెండింటికి అమోదం తెలిపి.. ఒక డీఏ ఇప్పుడు చెల్లిస్తామని, మరో డీఏ ఆరునెలల తరవాత చెల్లిస్తామని చెప్పడం కూడా ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. ఇక వేతన సవరణ ఊసే ప్రభుత్వం ఎత్తడం లేదని ఉద్యోగులు వాపోతుండగా.. ఆదాయం పెరిగితే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఉందంటూ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పెరుగుతున్న బడ్జెట్ అంతరం ప్రస్తుత (2025–26) ఆర్థిక సంవత్సరానికి దాదాపు రూ.3.05 లక్షల కోట్ల బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అంటే సగటున నెలకు రూ.25 వేల కోట్లు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కానీ మొదటి రెండు నెలల ఆదాయ గణాంకాలను పరిశీలిస్తే అది రూ.16,500 కోట్లు దాటలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు, వాస్తవ రాబడులకు మధ్య దాదాపు రూ.8,500 కోట్ల మేర తేడా వస్తోందన్న మాట. గత అర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది ఎక్కువే. 2024–25లో ప్రతిపాదించిన బడ్జెట్ ప్రకారం ప్రతినెలా సగటున రూ 23,500 కోట్ల వరకు సమకూర్చుకోవాలి. కానీ సగటున రూ.17 వేల కోట్ల నుంచి రూ.18 వేల కోట్ల వరకే రాబడులు వచ్చాయి. అంటే ప్రతినెలా సుమారు రూ.6 వేల కోట్లు తక్కువ వచ్చింది. ఇప్పుడు ఆ తేడా ఏకంగా రూ.8,500 కోట్లకు చేరడం గమనార్హం.

మేకిన్ ఇండియాతో చైనాకే లాభం.. మనకు నష్టం
సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’తో మన దేశానికి ఎలాంటి లాభం లేకపోగా చైనాయే ఎక్కువగా లాభపడిందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో విపక్ష నేత రాహుల్గాంధీ తీవ్రంగా విమర్శించారు. 2014 తర్వాత భారత్లో తయారీ రంగం జీడీపీలో 14 శాతానికి పడిపోవడం, చైనా నుంచి దిగుమతులు రెట్టింపు కావడాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రధాని మోదీ నినాదాలు ఇవ్వడంలో మాస్టర్ అని.. పరిష్కారాలు చూపడంలో కాదని రాహుల్ ఎద్దేవా చేశారు. శనివారం రాహుల్ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో ఒక పోస్ట్పెట్టారు. ‘మేక్ ఇన్ ఇండియా పరిశ్రమల బూమ్కి మోదీ సర్కార్ హామీ ఇచి్చంది. అయితే తయారీరంగం ఎందుకు చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయికి దిగజారింది? యువత అత్యధిక స్థాయిలో నిరుద్యోగాన్ని ఎదుర్కొంటోంది. చైనా నుంచి దిగుమతులు రెట్టింపయ్యాయి. నినాదాలు ఇచ్చే కళలో మోదీ విపరీతమైన నైపుణ్యం సాధించారు. కానీ పరిష్కారాలు చూపడంలో ఘోరంగా విఫలమయ్యారు’’అని రాహుల్ విమర్శించారు. అంతా అసెంబ్లింగ్ ఢిల్లీలో ప్రముఖమైన ఎల్రక్టానిక్స్ విక్రయ దుకాణ సముదాయం అయిన నెహ్రూ ప్లేస్ను రాహుల్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి మొబైల్ రిపేర్ టెక్నీషియన్స్ అయిన సైఫ్, శివమ్లతో కొద్దిసేపు మాట్లాడారు. సంబంధిత వీడియోనూ ‘ఎక్స్’లో రాహుల్ షేర్చేశారు. ‘‘‘నిజం ఏంటంటే.. ఇతర దేశాల నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకుంటున్నాం. వాటికి బిగించే అసెంబ్లింగ్ పనిచేస్తున్నాం. అంతేగానీ ఇక్కడ ఉత్పత్తిచేయట్లేము. అందుకే మన కారణంగా చైనా లాభపడుతోంది. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్రక్టానిక్ మార్కెట్గా వెలుగొందుతోంది. ఇంతపెద్ద మార్కెట్ మరేచోటా లేదు. మనం ఐఫోన్ విడిభాగాలను దిగుమతిచేసుకుని అసెంబ్లింగ్ చేస్తున్నాం. ఇది అతికొద్ది మంది పారిశ్రామికవేత్తల కనుసన్నల్లో జరుగుతోంది. ఇకపై మనమే ఐఫోన్లను తయారుచేసే స్థాయికి ఎదుగుదాం. అప్పుడే ఈ పరిశ్రమ పురోగతి సాధిస్తుంది. ఇతర దేశాల వస్తువులకు భారత్ అనేది మార్కెట్గా ఉండకూడదు. స్థానికంగా ఉత్పత్తులను తయారుచేసి ఎగుమతి చేసే మార్కెట్గా భారత్ అవతరించాలి. ఇందుకోసం ప్రాథమికస్థాయిలోనే సంస్కరణలు రావాలి. లక్షల కొద్దీ తయారీదారులు తయారుకావాలి. ఇందుకు ఎంతో నిజాయతీతో కూడిన సంస్కరణలు, ఆర్థిక దన్ను అవసరం. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం(పీఎల్ఐ) ప్రయోజనాలనూ ప్రభుత్వం గుట్టుచప్పుడుకాకుండా నెమ్మదిగా ఉపసంహరించుకుంటోంది. ఇది కూడా ప్రభుత్వ వైఫల్యమే’అని రాహుల్ గాంధీ మండిపడ్డారు. విమర్శించిన బీజేపీ రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. ‘‘దేశంలో భారీ సంస్కరణలు, దేశ పురోగతిని అందరూ కళ్లారా చూస్తున్నారు ఒక్క రాహుల్ తప్ప. దేశ ప్రగతిని తక్కువ అంచనా వేయంలో రాహుల్ బిజీగా మారారు. భారత స్వావలంభనకు ఆపరేషన్ సిందూర్ తాజా తార్కాణం. చైనా తయారీ డ్రోన్లను భారత తయారీ డ్రోన్లు నేలకూల్చాయి’’అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ అన్నారు.

అతి చేరువలో అమరత్వం!
అమరత్వం మానవాళి పురాకాంక్ష.. ఇంతవరకు అది ఒక అపూర్ణస్వప్నం..అమరత్వం అసాధ్యమైనదేమీ కాదు, అచిరకాలంలోనే సాధ్యమవుతుందట!అపూర్ణస్వప్నంగా మిగిలిన అమరత్వం అచిరకాలంలోనే సాధ్యమవుతుందని ఇటీవల శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రకటనలు మానవాళిలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. భౌతిక శరీరంతో యథాతథంగా అమరత్వం పొందడానికి ఇంకా చాలాకాలమే పట్టవచ్చు గాని, సాంకేతిక అమరత్వం సాధించడానికి అట్టేకాలం పట్టదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరణం తర్వాత శరీరం నుంచి వేరుపడిన మానవ చేతనను కంప్యూటర్లలోకి అప్లోడ్ చేయడం ద్వారా సాంకేతిక అమరత్వం సాధించే ప్రక్రియ మరో పాతికేళ్లలోనే అందుబాటులోకి రాగలదని అంచనా వేస్తున్నారు. ఇప్పటి ప్రమాణాల ప్రకారం ఒక మనిషి వందేళ్లు బతకడమే చాలా గొప్ప. అయితే, ఇదివరకటితో పోల్చుకుంటే, ప్రపంచవ్యాప్తంగా శతాయుష్కుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. మరో పాతికేళ్లలో వైద్యరంగం సాధించే అభివృద్ధి మానవుల ఆయుఃప్రమాణాన్ని గణనీయంగా పెంచగలదని శాస్త్రవేత్తలు నమ్మకంగా చెబుతున్నారు. మనుషులు భౌతిక అమరత్వం సాధించడానికి ఇంకెంత కాలం పడుతుందో ఇదమిత్థంగా చెప్పలేని పరిస్థితులు ఉన్నా, మనుషులు శతాయుష్షును అధిగమించడం త్వరలోనే సాధ్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక పురోగతి మరింత వేగం పుంజుకుంటే, మనుషులు దాదాపుగా భౌతిక అమరత్వం సాధించడం కూడా అసాధ్యమేమీ కాదని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమరత్వ భావన గురించి, అమరత్వ సాధన దిశగా శాస్త్ర సాంకేతిక పరిశోధకులు సాగిస్తున్న పరిశోధనలు, శాస్త్రవేత్తల అంచనాలను గురించి స్థూలంగా తెలుసుకుందాం.నాలుగేళ్లలోనే యంత్రాలతో అనుసంధానం‘మరో నాలుగేళ్లలోనే కృత్రిమ మేధ పూర్తిగా అభివృద్ధి చెంది, మానవ మేధకు దీటుగా తయారవుతుంది. మానవులు యంత్రాలతో అనుసంధానమయ్యే కొత్త శకం ప్రారంభమవుతుంది. కంప్యూటర్లు, ఆండ్రాయిడ్ శరీరాల ద్వారా మనుషులు అమరత్వం పొందే పరిస్థితులు 2045 నాటికే సాధ్యమవుతాయి. ఈ సాంకేతికత మరింతగా అభివృద్ధి చెంది 2050 నాటికి అపర కుబేరులకు అందుబాటులోకి వస్తుంది’ అని గూగుల్ ఇంజినీరింగ్ డైరెక్టర్ రే కర్జ్వీల్ చెబుతున్నారు. ఇదివరకు ఆయన వేసిన సాంకేతిక అంచనాలు పూర్తిగా నిజయం కావడంతో మనుషుల అమరత్వంపై ఆయన తాజా అంచనాలు కూడా నిజం కాగలవని ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక పరిశోధకుల్లో చాలామంది విశ్వసిస్తున్నారు. కంప్యూటర్లు చదరంగం చాంపియన్లను ఓడించగలవని, స్మార్ట్ఫోన్లు సామాన్యుల చేతుల్లోకి రాగలవని కర్జ్వీల్ దశాబ్దాల కిందటే అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన తాజా అంచనాలపై శాస్త్ర సాంకేతిక రంగంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.పన్యాల జగన్నాథదాసుఅమరత్వం పొందాలనేది మనిషి చిరకాల స్వప్నం. ఎంతటి ధైర్యశాలి మనిషినైనా భయపెట్టేవి రెండే రెండు: అవి జరా మరణాలు. పురాణకాలం నుంచే జరా మరణాలను జయించాలనే తపన మనుషుల్లో ఉంది. ప్రాక్ పాశ్చాత్య పురాణాలలో ఇందుకు సంబంధించిన గాథలు కనిపిస్తాయి. అమరత్వం కోసమే దేవ దానవులు క్షీరసాగర మథనం చేశారు. క్షీరసాగరం నుంచి పుట్టిన అమృతాన్ని సేవించడం వల్లనే దేవతలు అమరులయ్యారని మన పురాణాలు చెబుతున్నాయి. ఇలాంటి గాథ పురాతన గ్రీకు పురాణాల్లోనూ ఉంది. ‘అంబ్రోజియా’ అనే ఆహార పదార్థాన్ని ఆరగించి, ‘నెక్టర్’ అనే అమృతంలాంటి పానీయాన్ని సేవించడం వల్లనే ఒలింపస్ పర్వతంపై నివసించే దేవతలు అమరులుగా మారారని గ్రీకు పురాణాల కథనం. ప్రపంచంలోనే ఆది పురాణమైన ‘గిల్గమేష్’లో కూడా అమరత్వ భావనకు ఉంది. ‘గిల్గమేష్’ క్రీస్తుపూర్వం 2100 సంవత్సరాల నాటిది. అంటే, అప్పటి నుంచే అమరత్వం సాధించాలనే తపన మనుషుల్లో ప్రబలంగా ఉండేదనడానికి ఇదొక నిదర్శనం.ఆ తర్వాత వచ్చిన కాల్పనిక సాహిత్యంలోనూ అమరత్వంపై అనేక కల్పనలు ఉన్నాయి. ఆంగ్లో–ఐరిష్ రచయిత జొనాథన్ స్విఫ్ట్ రాసిన ‘గలివర్స్ ట్రావెల్స్’లో ‘లుగ్నాగ్’ అనే కాల్పనిక ద్వీపరాజ్యంలో ఉండే ‘స్ట్రల్బ్రగ్స్’ అనే మనుషులు ఎంత వృద్ధులైపోయినా, మరణం లేకుండా ఉంటారు. అమరత్వం చుట్టూ ఎన్ని కల్పనలు ఉన్నా, చాలామంది దానిని ఎప్పటికీ నెరవేరని కలగానే భావిస్తూ వచ్చారు. పుట్టిన వారికి మరణం తప్పదని, అది ప్రకృతి సహజ ధర్మమని చెబుతూ వచ్చారు. భగవద్గీత కూడా ఇదే విషయాన్ని ‘జాతస్య హి ధ్రువో మృత్యుః’ అని చెప్పింది. అయినా మనిషికి అమరత్వం మీద ఆశ చావలేదు. అమరత్వ సాధనకు ప్రయత్నాలనూ మానుకోలేదు.శాస్త్రవేత్తల ప్రయత్నాలుమరణానికి సవాలక్ష కారణాలు ఉంటాయి. వీటిలో అతి సాధారణమైన కారణం వార్ధక్యం. ఇప్పటికీ చాలామంది వార్ధక్యాన్ని జీవితంలో ఒక సహజమైన దశగానే పరిగణిస్తున్నారు. కొందరు వైద్య శాస్త్రవేత్తలు మాత్రం వార్ధక్యాన్ని ఒక వ్యాధిగా పరిగణిస్తున్నారు. ఎలాంటి వ్యాధికైనా నివారణ మార్గాన్ని కనుగొనడమే శాస్త్రవేత్తల పని. అంతకంటే ముందుగా వ్యాధి మూలకారణాన్ని కనుగొనడం ముఖ్యం. శరీరంలోని జీవకణాలకు వయసు మళ్లకుండా నిరోధించగలిగితే, వార్ధక్యాన్ని నివారించడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చారు. కనీసం శరీరంలోని జీవకణాల్లో వయసు మళ్లే ప్రక్రియను నెమ్మదించేలా చేయగలిగితే గణనీయంగా ఆయుర్దాయాన్ని పొడిగించడం సాధ్యమవుతుందని వారు అభిప్రాయ పడుతున్నారు. జీవకణాల్లో వయసు మళ్లే ప్రక్రియ నెమ్మదించేలా చేయడానికి, కుదిరితే పూర్తిగా వయసు మళ్లే ప్రక్రియను నిలిపివేయడానికి సాధ్యమయ్యే మార్గాలపై అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఇందుకు అనేక ప్రయోగాలను సాగిస్తున్నారు. బ్రిటిష్ ఫ్యూచరాలజిస్ట్ ఇయాన్ పియర్సన్, గూగుల్ ఇంజినీరింగ్ డైరెక్టర్ రే కర్జ్వీల్, బ్రిటిష్ జన్యుశాస్త్ర నిపుణుడు అబ్రీ డి గ్రే వంటి శాస్త్రవేత్తలు 2050 నాటికల్లా కంప్యూటర్లలోకి, రోబోలలోకి మెదడులోని ఆలోచనలను అప్లోడ్ చేసే పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందని, అప్పుడు ప్రపంచంలోని అపర కుబేరులు ఈ ప్రక్రియ ద్వారా అమరత్వాన్ని పొందగలరని అంచనా వేస్తున్నారు. మరో పాతికేళ్లలో ప్రపంచంలోని సంపన్నులు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని, మరణానంతరం తమ చేతనను కంప్యూటర్లలోకి లేదా రోబోల వంటి ఆండ్రాయిడ్ శరీరాల్లోకి అప్లోడ్ చేయడం ద్వారా అమరత్నాన్ని సాధించగలరని ఇయాన్ పియర్సన్ చెబుతున్నారు. మరో నాలుగేళ్లలోనే– అంటే, 2029 నాటికల్లా మానవ మేధకు దీటుగా కృత్రిమ మేధ అభివృద్ధి చెందుతుందని అబ్రీ డి గ్రే చెబుతున్నారు. మానవ మేధకు దీటైన స్థితికి కృత్రిమ మేధ చేరుకున్నాక మనుషులకు, యంత్రాలకు మధ్య అనుసంధానం తేలికవుతుందని, ఈ ప్రక్రియ ద్వారా 2045 నాటికే మనుషులు అమరత్వం సాధించే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. అంతేకాదు, రానున్న పాతికేళ్లలో వైద్యరంగం కూడా శరవేగంగా అభివృద్ధి సాధిస్తుందని, 2050 నాటికి వార్ధక్యాన్ని నయం చేయగలిగే పరిస్థితులు ఏర్పడతాయని, ఫలితంగా 2050 తర్వాత మనుషులు వెయ్యేళ్లకు పైగా ఆయుర్దాయాన్ని పొందగలుగుతారని కూడా గ్రే అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోని అమిత సంపన్నులు 2050 నాటికల్లా తమ భౌతిక మరణం తర్వాత కూడా అమరులుగా ఉండటానికి సాంకేతికతను వినియోగించుకుంటారని, తమ చేతనను కంప్యూటర్లలోకి, ఆండ్రాయిడ్ శరీరాల్లోకి అప్లోడ్ చేయడం ద్వారా అమరత్వాన్ని సాధించగలుగుతారని పియర్సన్ చెబుతున్నారు. తొలినాళ్లలో ఈ సాంకేతికత చాలా ఖరీదుగా ఉంటుందని, మరో దశాబ్దం తర్వాత ఎగువ మధ్యతరగతి వారికి కూడా అందుబాటులోకి వస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. కంప్యూటర్లలోకి, ఆండ్రాయిడ్ శరీరాల్లోకి మేధా చేతనను అప్లోడ్ చేసే సాంకేతికత 2060 నాటికల్లా కొంత తక్కువ ఖర్చుతోనే అందుబాటులోకి రాగలదని చెబుతున్నారు. ఇదేకాలంలో వైద్యరంగం కూడా మరింతగా అభివృద్ధి చెందుతుందని; క్యాన్సర్, గుండెజబ్బులు వంటి ప్రాణాంతకమైన వ్యాధులను పూర్తిగా నయం చేయగలిగే చికిత్స పద్ధతులు అందుబాటులోకి వస్తాయని; జన్యు సవరణ పద్ధతులు మరింతగా అభివృద్ధి చెంది, వయసు మళ్లిన కణాల వార్ధక్యాన్ని వెనక్కు మళ్లించగలిగే స్థాయికి చేరుకుంటుందని పియర్సన్ చెబుతున్నారు. త్రీడీ ప్రింటింగ్ ద్వారా కృత్రిమ అవయవాల తయారీ, కృత్రిమ మేధ సహాయంతో రూపొందే చికిత్స పద్ధతులు రానున్న కొద్ది దశాబ్దాల్లోనే మనుషుల ఆయుర్దాయాన్ని గణనీయంగా పొడిగించగలవని ఆయన అంటున్నారు.‘మ్యూటంట్’ మానవులుమనుషులకు మానవాతీత శక్తులు ఉండటం కాల్పనిక సాహిత్యంలోను, సినిమాల్లోను మాత్రమే చూసి ఉంటాం. ఇలాంటి మానవులు త్వరలోనే మన మధ్య సంచరిస్తారని, మరో ఐదేళ్లలోగా ‘మ్యూటంట్’ మానవులు మన మధ్య తిరుగాడుతారని లండన్కు చెందిన ఫ్యూచరిస్ట్, టెక్నాలజీ ఇన్వెస్టర్ హెర్బర్ట్ సిమ్ చెబుతున్నారు. కొత్తగా రాబోయే ఈ ‘మ్యూటంట్’ మానవజాతిని ‘ఎక్స్–మెన్’గా అభివర్ణిస్తున్నారు. జన్యు ఉత్పరివర్తనల ద్వారా రూపొందే ఈ ‘పరివర్తిత’ మానవులు లేదా ‘మ్యూటంట్’ మానవుల శక్తి సామర్థ్యాల ముందు ప్రస్తుతం ఉన్న మానవుల శక్తి సామర్థ్యాలు ఎందుకూ కొరగావని సిమ్ చెబుతున్నారు. త్వరలోనే ‘మ్యూటంట్’ మానవుల రాకతో ఇప్పటి ఆధునిక మానవులు వాడుకలో పనికిరాకుండా పోతారని ఆయన అంచనా వేస్తున్నారు. ‘మ్యూటంట్’ మానవుల రూపకల్పన కోసం చేపట్టే పరిశోధనలకు హెర్బర్ట్ సిమ్ భారీ ఎత్తున నిధులు వెచ్చిస్తున్నారు. హెర్బర్ట్ సిమ్ తన స్టార్టప్ సంస్థ ‘న్యూరోచిప్ డాట్ కామ్’ ద్వారా ‘మ్యూటంట్’ మానవుల రూపకల్పన కోసం ప్రయోగాలు సాగిస్తున్నారు. మెదడులోని ఆలోచనలను చదవగల హెల్మెట్పై ఆయన ప్రయోగాలు చేపడుతున్నారు. ‘మ్యూటంట్’ మానవులు ప్రాణాంతక వ్యాధులను సైతం తట్టుకుని, సులువుగా ఐదువందల ఏళ్లు బతకగలరని సిమ్ చెబుతున్నారు.అమరత్వంపై నైతిక మీమాంసలుఅమరత్వం చేరువలోనే సాధ్యమవుతుందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమరత్వ సాధన ఎలా ఉన్నా, మానవుల ఆయుర్దాయం గణనీయంగా పెరుగుతుందని పలువురు శాస్త్రవేత్తలు నమ్మకంగా చెబుతున్నారు. ఈ పరిణామాలు సంభవిస్తే, భవిష్యత్తులో తలెత్తబోయే సమస్యలపై రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మానవులు అమరత్వం సాధించినా, కనీసం శతాబ్దాల తరబడి బతకగల స్థితికి చేరుకున్నా, ప్రపంచం మరింత జటిలంగా మారుతుందని పలువురు సామాజిక శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రపంచ జనాభా అదుపు తప్పి పెరుగుతుందని, అప్పుడు వనరుల పంపిణీలో మరిన్ని వ్యత్యాసాలు తలెత్తి, మనుషుల మధ్య కీచులాటలు, నేరాలు పెరుగుతాయని, దేశాల మధ్య యుద్ధాలు పెచ్చరిల్లుతాయని వారు హెచ్చరిస్తున్నారు. మనుషులు అమరులైతే, జనాభా మరింతగా పెరగడం తప్ప ప్రపంచానికి ప్రయోజనం ఉండదని, పైగా పర్యావరణానికి తీరని హాని జరుగుతుందని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. జీవితంలో మరణం ఒక సహజ పరిణామమని, మరణం ఉన్నప్పుడే మనుషులకు జీవితం విలువ అర్థమవుతుందని, మరణమే లేకుండాపోతే జీవితానికి విలువ ఉండదని, అలా ఎంతకాలం జీవించినా దండగేనని కొందరు తత్త్వవేత్తలు పెదవి విరుస్తున్నారు. ఎవరు ఏమన్నా, ‘అమరత్వం అతి చేరువలోనే’ అని ఊరిస్తున్న శాస్త్రవేత్తలు మాత్రం తమ పరిశోధనలను మరింత ముమ్మరంగా కొనసాగిస్తూనే ఉన్నారు.త్వరలో జరగబోయే పరిణామాలుఅమరత్వ సాధన దిశగా త్వరలోనే పలు పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం ఎప్పుడెప్పుడు ఏయే మార్పులు జరుగనున్నాయో చూద్దాం.. 2029ఈ ఏడాది నాటికి మానవులకు, యంత్రాలకు అనుసంధానం ఏర్పడుతుంది. మనుషులు తమ మేధా చేతనను కంప్యూటర్లలోకి లేదా ఆండ్రాయిడ్ శరీరాల్లోకి ఎక్కించగలుగుతారు. ఆ విధంగా భౌతిక మరణం తర్వాత కూడా జీవితాన్ని కొనసాగించగలుగుతారు.2050ఈ ఏడాది నాటికి వైద్యరంగం వార్ధక్యాన్ని ఇతర వ్యాధుల మాదిరిగానే నయం చేయగలదు. జన్యు సవరణ పరిజ్ఞానం వార్ధక్యాన్ని వెనక్కు మళ్లించే స్థాయికి అభివృద్ధి చెందగలదు. అబ్రీ డి గ్రే చెబుతున్న ప్రకారం వెయ్యేళ్లు బతకగల మనుషులు ఇప్పటికే పుట్టి ఉంటారు. జీవకణాల వార్ధక్యాన్ని వెనక్కు మళ్లించే పద్ధతులపై పరిశోధనల కోసం డి గ్రే ‘లాంజివిటీ ఎస్కేప్ వెలాసిటీ ఫౌండేషన్’ నెలకొల్పి, ఇతర శాస్త్రవేత్తలతో కలసి విస్తృతంగా పరిశోధనలు సాగిస్తున్నారు.2030మనుషులకు, యంత్రాలకు మధ్య దాదాపుగా ఏకత్వం ఏర్పడుతుంది. మరణం వల్ల మనుషుల భౌతిక శరీరం అంతరించిపోయినా, యంత్ర శరీరాల ద్వారా మనుగడ సాగించగల సాంకేతికత అభివృద్ధి చెందుతుంది. మనుషులకు, యంత్రాలకు మధ్య ఏకత్వం చేరువలోనే ఉందంటూ, సరిగా ఏడాది కిందట– 2024 జూన్లో రే కర్జ్వీల్ ‘ది సింగులారిటీ ఈజ్ నియరర్’ పేరుతో పుస్తకం రాశారు.2045ఈ ఏడాదిలోగా మనుషులు మరణానంతరం ‘సైబోర్గ్’లుగా మనుగడ కొనసాగించగలరు. కంప్యూటర్లలోకి అప్లోడ్ చేసిన మేధాచేతనను ఇతర అధునాతన సాంకేతికతతో రూపొందించిన యంత్ర శరీరాల్లోకి డౌన్లోడ్ చేయడం సాధ్యమవుతుంది. ఈ యంత్ర శరీరాలు మనుషుల మాదిరిగానే పని చేస్తాయి.వార్ధక్య నివారణ సుసాధ్యంకొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నట్లుగా 2050 నాటికి అమరత్వ సాధన మాట ఎలా ఉన్నా, ‘సెనోలైటిక్’ ఔషధాలతో వార్ధక్య నివారణ సుసాధ్యమవుతుందని బ్రిటిష్ శాస్త్రవేత్త ఆండ్రూ స్టీల్ చెబుతున్నారు. ఈ అంశంపై ఆయన ‘ఏజ్లెస్’ అనే పుస్తకం రాశారు. ‘సెనోలైటిక్’ ఔషధాలు శరీరంలోని మృతకణాలను, జోంబీ కణాలను తొలగించి, జీవకణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి వార్ధక్య లక్షణాలను వెనక్కు మళ్లించడంతో పాటు ఆయుర్దాయాన్ని గణనీయంగా పొడిగించడానికి ఉపయోగపడతాయి. వార్ధక్యం వల్ల మరణం సంభవించడమనేది 2050 తర్వాత చరిత్రగానే మిగిలిపోతుందని ఆండ్రూ స్టీల్ చెబుతున్నారు.
అతి చేరువలో అమరత్వం!
భయంతో బంకర్లో ఇరాన్ ఖమేనీ... వారసుల రేసులో ముగ్గురు?
ఇరాన్పై విరుచుకుపడిన అమెరికా.. బీ-2 స్పిరిట్ బాంబర్లతో ఆకస్మిక దాడులు
10–15 ఏళ్లు దాటిన వాహనాలకు నో పెట్రోల్, నో డీజిల్..!
సేంద్రియ బాటలో డ్రాగన్ సిరులు
కార్పొరేట్ యోగా!
ఎల్పీజీ సబ్సిడీ మాకు అక్కర్లేదు
గ్రా‘నైట్’..రైట్రైట్!
నికర పన్ను వసూళ్లు డౌన్..
నాణ్యతకు తూట్లు.. జేబుల్లోకి కోట్లు
రెండో బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి సమీరా
నిర్లక్ష్యం వల్లే... ఈ ఘోర ప్రమాదం
అతడు చెప్పేదంతా అబద్ధం.. తీసుకెళ్లి పిచ్చి ఆస్పత్రిలో వేయండి: నటి
‘డిప్యూటీ సీఎం కనబడుటలేదు’
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
అబ్బే పార్టీ పరిస్థితి అలా ఉందని కాదయ్యా..! యోగా చేస్తున్నారు.
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. స్థిరాస్తివృద్ధి
Kuberaa: ‘కుబేర’ మూవీ రివ్యూ
సాక్షి కార్టూన్ 20-06-2025
దక్షిణాఫ్రికాకు కొత్త కెప్టెన్.. ఎవరంటే?
కొత్త నివాసం అనే సరికి మన వాళ్లు ఏదేదో ఊహించుకుంటున్నారు! పెళ్లి శుభవార్త అనుకుని..!
మీరు ఎవరికీ నోటీసులు ఇవ్వొద్దు.. విచారణ చేయొద్దు
ప్రధాని నెతన్యాహుకు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ ప్రజల కౌంటర్
తోడబుట్టిన బలగం
ఏపీ హైకోర్టులో సాక్షి టీవీకి భారీ ఊరట
శేఖర్ కమ్ముల కుబేర.. అసలు ఈ క్యారెక్టర్ను ఎలా ఒప్పుకున్నాడు?
సోనమ్ మేఘాలయా హనీమూన్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్..
నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!
'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?
రాత్రికి రాత్రే మిలియనీర్గా..జాలరి దశ మార్చిన చేపలు
అతి చేరువలో అమరత్వం!
భయంతో బంకర్లో ఇరాన్ ఖమేనీ... వారసుల రేసులో ముగ్గురు?
ఇరాన్పై విరుచుకుపడిన అమెరికా.. బీ-2 స్పిరిట్ బాంబర్లతో ఆకస్మిక దాడులు
10–15 ఏళ్లు దాటిన వాహనాలకు నో పెట్రోల్, నో డీజిల్..!
సేంద్రియ బాటలో డ్రాగన్ సిరులు
కార్పొరేట్ యోగా!
ఎల్పీజీ సబ్సిడీ మాకు అక్కర్లేదు
గ్రా‘నైట్’..రైట్రైట్!
నికర పన్ను వసూళ్లు డౌన్..
నాణ్యతకు తూట్లు.. జేబుల్లోకి కోట్లు
రెండో బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి సమీరా
నిర్లక్ష్యం వల్లే... ఈ ఘోర ప్రమాదం
అతడు చెప్పేదంతా అబద్ధం.. తీసుకెళ్లి పిచ్చి ఆస్పత్రిలో వేయండి: నటి
‘డిప్యూటీ సీఎం కనబడుటలేదు’
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
అబ్బే పార్టీ పరిస్థితి అలా ఉందని కాదయ్యా..! యోగా చేస్తున్నారు.
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. స్థిరాస్తివృద్ధి
Kuberaa: ‘కుబేర’ మూవీ రివ్యూ
సాక్షి కార్టూన్ 20-06-2025
దక్షిణాఫ్రికాకు కొత్త కెప్టెన్.. ఎవరంటే?
కొత్త నివాసం అనే సరికి మన వాళ్లు ఏదేదో ఊహించుకుంటున్నారు! పెళ్లి శుభవార్త అనుకుని..!
మీరు ఎవరికీ నోటీసులు ఇవ్వొద్దు.. విచారణ చేయొద్దు
ప్రధాని నెతన్యాహుకు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ ప్రజల కౌంటర్
తోడబుట్టిన బలగం
ఏపీ హైకోర్టులో సాక్షి టీవీకి భారీ ఊరట
శేఖర్ కమ్ముల కుబేర.. అసలు ఈ క్యారెక్టర్ను ఎలా ఒప్పుకున్నాడు?
సోనమ్ మేఘాలయా హనీమూన్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్..
నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!
'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?
రాత్రికి రాత్రే మిలియనీర్గా..జాలరి దశ మార్చిన చేపలు
సినిమా

మనమధ్య ఎన్నో గొడవలు.. మరణం తర్వాత కూడా..: కాజల్ ఎమోషనల్
ఈ సంవత్సరం తనకెంతో స్పెషల్ అంటోంది నటి ఆర్జే కాజల్ (RJ Kajal). బిగ్బాస్ సీజన్ 5తో బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన భర్త విజయ్ శీలం శెట్టికి బర్త్డే విషెస్ చెప్తూ తమ జర్నీని రాసుకొచ్చింది. నా విజయ్కు హ్యాపీ బర్త్డే.. నువ్వు లేకుండా ఈ జీవితాన్ని ఊహించుకోలేను. 2025.. ఈ ఏడాదికి నా మనసులో ప్రత్యేక చోటు దక్కింది. ఎందుకంటే మన జీవితంలోనే కీలకమైన మైలురాయి అయిన సొంతింటి కలను నెరవేర్చుకున్నాం.ఎన్నో గొడవలుఇంకా ఆ ఇంట్లోకి మనం షిఫ్ట్ కాలేదనుకో.. కానీ, మనిద్దరం కలిసి ఆ ఇంటిని కొన్నందుకు ఆల్రెడీ అక్కడే ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఒకప్పుడు మనం చీకట్లో గుసగుసలాడుకునేవాళ్లం. ఇప్పుడవే గుసగుసలను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటుంటే సంతోషంగా అనిపిస్తోంది. అలా అని మనమెప్పుడూ ఇంతే సంతోషంగా ఉండేవాళ్లం కాదు. ఎన్నోసార్లు పోట్లాడుకునేవాళ్లం. ఇంటీరియర్స్ గురించి, దిండుల గురించి, సమయపాలన గురించి.. కొన్నిసార్లయితే మరీ అనవసరమైన విషయాల గురించి కూడా గొడవపడేవాళ్లం. పిచ్చోళ్లలా నవ్వుకునేవాళ్లంఆ రోజులో ఎన్ని గొడవలు పడ్డా కూడా రాత్రయ్యేసరికి దాన్ని పరిష్కరించుకునేవాళ్లం. ప్రశాంతంగా నీ కౌగిలిలో నిద్రపోతుంటే మన ప్రేమ కంటే ఏ గొడవా పెద్దది కాదనిపించేది. మరికొన్నిసార్లు పిచ్చోళ్లలా నవ్వుకునేవాళ్లం. ఒకరి కాలు మరొకరు పట్టుకుని లాగేవాళ్లం. కొట్టుకుని అంతలోనే కలిసిపోయేవాళ్లం. మన బంధాన్ని మరింత ధృడంగా నిర్మించుకున్నాం. నువ్వు లేని జీవితం? అన్న ఆలోచనను కూడా నా దరిదాపుల్లోకి రానివ్వను.మరణం తర్వాత కూడా..కానీ సరదాగా ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు మనమేం అనుకునేవాళ్లం? మనిద్దరి శవాలను పక్కపక్కనే సమాధి చేసి మరణం తర్వాత కూడా కలిసే ఉండాలనుకునేవాళ్లం. అంత గొప్ప ప్రేమను మనం ఒకరికొకరం పంచుకున్నాం. మన లవ్ పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చేమో కానీ, అందమైన ప్రేమను ఆస్వాదిస్తున్నాం. ఈ రోజు, నీ పుట్టినరోజున ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వే నా ప్రపంచం.. నువ్వు నాకోసమే పుట్టావు. నాకు భర్తగా దొరికినందుకు థాంక్యూ.. అని కాజల్ రాసుకొచ్చింది. ఈ పోస్ట్కు భర్తతో కలిసి దిగిన ఫోటోలను జత చేసింది. View this post on Instagram A post shared by RJ Kajal️️️️️️ (@kajalrj) చదవండి: దృశ్యం నటితో విడాకులు.. త్వరలోనే డైరెక్టర్ రెండో పెళ్లి

నా కూతురి జోలికొస్తే కారుతో తొక్కేస్తా.. కాజోల్ వార్నింగ్
నా జోలికొస్తే ఊరుకుంటానేమో కానీ నా కూతురి జోలికొస్తే మాత్రం అంతు చూస్తానంటోంది హీరోయిన్ కాజోల్ (Kajol). ప్రస్తుతం ఆమె మా సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉంది. ఈ మూవీ జూన్ 27న విడుదల కానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాజోల్.. తన కూతురిని ట్రోల్ చేసేవారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా.. నా కూతుర్ని విమర్శించేవాళ్లెవరూ నా కారు ముందుకు రావొద్దు. నా కారు ముందుకొచ్చారంటే..ఒకవేళ వచ్చారే అనుకోండి.. నా కారుతో మిమ్మల్ని ఢీ కొట్టి మీ శరీరాలపై నుంచే నా కారును పోనిస్తాను. సోషల్ మీడియాలో వెయ్యి మెసేజ్లు వస్తే అందులో 999 తను అందంగా ఉంది, మీరు అమేజింగ్.. ఇటువంటి కామెంట్లే ఉంటాయి. కానీ ఏదో ఒక్కటి మాత్రం బ్యాడ్ కామెంట్ ఉంటుంది. అలా చెత్త వాగుడు వాగేవారు ఎందుకున్నారో అర్థం కాదు. అయినా నేను మంచి గురించే ఎక్కువగా పట్టించుకుంటాను. చెడు గురించి కాదు అని చెప్పుకొచ్చింది.హారర్ సినిమాహారర్ సినిమాలను మ్యూట్లో పెట్టుకునే చూసే కాజోల్.. తొలిసారి ఈ జానర్లో నటిస్తోంది. విశాల్ ఫ్యురియా దర్శకత్వం వహిస్తున్న మా చిత్రంలో రోనిత్ రాయ్, ఇంద్రనీల్ సేన్గుప్తా, కెరిన్ శర్మ, నితిన్, సూర్జ్యశిఖ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాజోల్ చివరగా క్రూ సినిమాలో నటించింది. కాజోల్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్.. 1999లో పెళ్లి చేసుకున్నారు. 2003లో వీరికి కూతురు నైసా జన్మించింది. 2010లో కుమారుడు యుగ్ పుట్టాడు.చదవండి: ఎయిరిండియాకు నటుడి సపోర్ట్.. ఫ్రీ టికెట్ ఇచ్చారా?

వివాహ బంధానికి గుడ్ బై చెప్పిన ప్రముఖ బుల్లితెర జంట
ఇటీవల సినీ ఇండస్ట్రీలో విడాకుల వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు స్టార్ నటీనటులు సైతం తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. తాజాగా మరో జంట తమ పెళ్లి బంధానికి ఎండ్ కార్డ్ పడేసింది. ప్రముఖ సీరియల్ నటి లతా సబర్వాల్.. తన భర్త సంజీవ్ సేథ్తో విడిపోతున్నట్లు ప్రకటించారు. సుదీర్ఘమైన చర్చల తర్వాత నేను.. నా భర్త విడిపోవాలని నిర్ణయించుకున్నాం. నాకు అందమైన కొడుకును ఇచ్చినందుకు అతనికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. అతని భవిష్యత్తు బాగుండాలని శుభాకాంక్షలు' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాదాపు పెళ్లైన 16 ఏళ్లకు తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. ఈ విషయంపై ఎటువంటి ప్రశ్నలు అడగకుండా తనను, తన కుటుంబాన్ని గౌరవించాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థించింది. వీరిద్దరు బుల్లితెర నటీనటులు కాగా.. 'యే రిష్టా క్యా కెహ్లతా హై' సీరియల్ సెట్స్లో కలుసుకున్నారు. ఈ సీరియల్ బాలీవుడ్లో అత్యంత ఆదరణ దక్కించుకున్న వాటిలో ఒకటిగా నిలిచింది. ఇందులో భార్య, భర్తల పాత్రల్లో వీరిద్దరు నటించారు. అంతేకాకుడా ఈ జంట 2013లో 'నాచ్ బలియే 6' అనే డ్యాన్స్ షోలో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రేమలో పడిన జంట 2009లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఈ జంటకు 2013లో ఓ కుమారుడు జన్మించారు. మరోవైపు సంజీవ్ సేత్ గతంలోనే నటి రేషమ్ టిప్నిస్ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2004లో ఈ జంట విడిపోయారు. అయితే పలు సీరియల్స్లో తనదైన నటనతో మెప్పించిన లతా సబర్వాల్ 2021లో నటనకు గుడ్బై చెప్పేసింది. ఆమె సీరియల్స్తో పాటు 'వివా', 'ఇష్క్ విష్క్' వంటి చిత్రాలలో కూడా కనిపించింది.

'గతం నిశ్శబ్దంగా ఉండదు'.. మోహన్ లాల్ దశ్యం-3 ఎప్పుడంటే?
దృశ్యం సినిమా సిరీస్కు ఆడియన్స్లో అద్భుతమైన క్రేజ్ ఉంది. ఈ సిరీస్లో ఇప్పటికే రెండు పార్టులు విడుదలై అభిమానులను అలరించాయి. మలయాళంలో వచ్చిన ఈ సినిమాను అటు తెలుగులో.. ఇటు బాలీవుడ్లోనూ రిలీజ్ చేయగా సూపర్హిట్గా నిలిచాయి. ఇప్పటికే ఈ సూపర్ హిట్ మూవీ సిరీస్లో దృశ్యం-3 కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే తాజాగా దృశ్యం-3 రిలీజ్ ఎప్పుడనేది కూడా మేకర్స్ తాజాగా రివీల్ చేశారు. ఈ ఏడాది అక్టోబర్లో థియేటర్లలో విడుదల కానుందనిప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.దృశ్యం మూవీపై మోహన్ లాల్ మాట్లాడుతూ.. 'దృశ్యం సినిమా మలయాళ పరిశ్రమకు గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది. కొవిడ్ మహమ్మారి సమయంలో మేము ఆ చిత్రాన్ని నిర్మించాం. ఆ చిత్రాన్ని భారతదేశమంతా వీక్షించింది. ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా మలయాళ పరిశ్రమ గురించి తెలుసు. దృశ్యం తర్వాత మరిన్ని మలయాళ చిత్రాలను చూడటం ప్రారంభించారు. ఇది మా పరిశ్రమకు, అంతర్జాతీయంగా కూడా ఒక వరంలా మారింది." అని సంతోషం వ్యక్తం చేశారు.'దృశ్యం సూపర్ హిట్ తర్వాత హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, సింహళీ, చైనీస్ భాషలలో కూడా రీమేక్ చేశారు. మరోవైపు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో 'దృశ్యం 3' హిందీ వర్షన్ సైతం అక్టోబర్లో సెట్స్ పైకి వెళ్లనుందని టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మలయాళ సినిమాను రీమేక్ చేస్తారా? లేదంటే సొంతగా కథను తెరకెక్కిస్తారా అనేది తెలియాల్సి ఉంది. తొలి రెండు భాగాలు మలయాళం నుంచి రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. October 2025 — the camera turns back to Georgekutty.The past never stays silent.#Drishyam3 pic.twitter.com/8ugmxmb2wO— Mohanlal (@Mohanlal) June 21, 2025
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

ఓర్నీ.. క్రికెట్ గ్రౌండ్లో నీకేమి పని? ఫోటో వైరల్
గాలే వేదికగా శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి టెస్టు సందర్భంగా ఓ విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. ఐదో రోజు ఆటలో పాములు పట్టే వ్యక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. స్నేక్ క్యాచర్ రెండు పాములను తీసుకొచ్చి ప్రశాంతంగా నేలపై కూర్చుని మ్యాచ్ను వీక్షించాడు. అతడి వద్ద పాములతో పాటు ఓ కోతి కూడా ఉంది. ఇది చూసిన మిగితా ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది.తొలి టెస్టు డ్రా.. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లా, శ్రీలంక మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. మొదటి ఇన్నింగ్స్లో పర్యాటక బంగ్లాదేశ్ జట్టు 495 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో(148), ముష్ఫికర్ రహీం(163) అద్బుతమైన సెంచరీలతో చెలరేగగా.. లిట్టన్ దాస్ 90 పరుగులతో రాణించాడు.అనంతరం శ్రీలంక కూడా బంగ్లాకు ధీటుగా బదులిచ్చింది. శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 485 పరుగుల భారీ చేసింది. లంక బ్యాటర్లలో ఓపెనర్ పాథుమ్ నిస్సాంక(187) భారీ శతకం సాధించగా.. చండీమల్(54), కుమిందు మెండిస్(87) రాణించారు. అనంతరం బంగ్లా జట్టు తమ రెండో ఇన్నింగ్స్ను 285-6 వద్ద డిక్లేర్ చేసింది.దీంతో తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని జోడించి ప్రత్యర్ధి ముందు 296 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా జట్టు ఉంచింది. ఆఖరి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 4 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. దాంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. View this post on Instagram A post shared by Mufaddal Vohra (@mufastweet)

గిల్, జైశ్వాల్, పంత్ సెంచరీలు.. తొలి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోర్
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు జూలు విదిల్చారు. మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా 471 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 359/3 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన గిల్ సేన. అదనంగా 112 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్ను ముగించింది.రెండో రోజు ఆటలో టీమిండియా బ్యాటర్లు మెరుగ్గా రాణించలేకపోయారు. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్ (147, 227 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్), రిషబ్ పంత్ (134, 178 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (101 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగారు.సుదర్శన్, కరుణ్ నాయర్ అట్టర్ ప్లాప్.. ఇక ఈ మ్యాచ్లో భారత తరపున అరంగేట్రం చేసిన సాయిసుదర్శన్ తీవ్ర నిరాశపరిచాడు. మొదటి ఇన్నింగ్స్లో డకౌట్గా వెనుదిరిగాడు. అతడితో పాటు తొమ్మిదేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్ సైతం ఖాతా తెరవకుండా పెవిలియన్కు చేరాడు. ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్స్టోక్స్, జోష్ టంగ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. బ్రైడాన్ కార్స్, షోయక్ బషీర్ చెరో వికెట్ సాధించారు.చదవండి: నాకు అది అలవాటు..! నువ్వే గుర్తు చేస్తూ ఉండాలి!.. నో చెప్పడం వల్లే ఇలా..

రిషబ్ పంత్ వరల్డ్ రికార్డు..
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ అద్బుతమైన సెంచరీ సాధించాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన పంత్.. వన్డే తరహాలో తన ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు.ఈ క్రమంలో పంత్ 146 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్ల సాయంతో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. పంత్కు ఇది ఏడో టెస్టు సెంచరీ కావడం విశేషం. రిషబ్ సెంచరీ సాధించగానే సంతోషంతో మరోసారి ఫ్లిప్ జంప్ చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది.106 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 451 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్(113)తో పాటు కెప్టెన్ రవీంద్ర జడేజా(1) ఉన్నాడు. కాగా ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్..👉టెస్టు క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత వికెట్ కీపర్ బ్యాటర్గా పంత్ చరిత్ర సృష్టించాడు. పంత్ ఇప్పటివరకు టెస్టుల్లో 7 సెంచరీలు సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా లెజెండ్ ఎంఎస్ధోని పేరిట ఉండేది. ధోని తన కెరీర్లో 6 టెస్టు సెంచరీలు సాధించాడు. తాజా శతకంతో ధోనిని పంత్ అధిగమించాడు.👉సేనా (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక టెస్టు రన్స్ చేసిన పర్యాటక జట్టు వికెట్ కీపర్గా పంత్ నిలిచాడు. పంత్ ఇప్పటివరకు సేనా దేశాల్లో 49 ఇన్నింగ్స్లలో 1746 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ వరల్డ్ రికార్డు కూడా ఎంఎస్ ధోని పేరిటే ఉండేది. ధోని తన కెరీర్లో సేనా దేశాల్లో 60 ఇన్నింగ్స్లు ఆడి 1731 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో ధోని వరల్డ్ రికార్డును పంత్ బ్రేక్ చేశాడు.👉విదేశీ గడ్డపై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన మూడో వికెట్ కీపర్గా ఇంగ్లండ్కు చెందిన లెస్ అమెస్ రికార్డును పంత్ సమం చేశాడు. అమీస్ విదేశాల్లో ఐదు టెస్టు సెంచరీలు చేయగా.. పంత్ కూడా సరిగ్గా ఐదు సెంచరీలు చేశాడు. ఈ పర్యటనలో మరో సెంచరీ చేస్తే అమీస్ను అధిగమిస్తున్నాడు. ఈ జాబితాలో ఆసీస్ లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడమ్ గిల్క్రిస్ట్(10) అగ్రస్ధానంలో ఉన్నాడు.

'శుబ్మన్ గిల్ ఒక అద్బుతం'.. యూటర్న్ తీసుకున్న భారత మాజీ క్రికెటర్
టీమిండియా టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ తన తొలి మ్యాచ్లోనే సత్తాచాటాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మొదటి టెస్టులో గిల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. తొలి రోజు ఆటముగిసే సమయానికి 127 పరుగులతో గిల్ అజేయంగా నిలిచాడు.ఇంగ్లండ్ గడ్డపై గిల్కు ఇదే మొదటి టెస్టు సెంచరీ కావడం గమనార్హం. ఈ క్రమంలో కెప్టెన్గా అతడిని ఎంపిక చేయడాన్ని విమర్శించిన నోళ్లే ఇప్పుడు శెభాష్ అంటున్నాయి. తొలుత కెప్టెన్గా గిల్ను వ్యతిరేకించిన భారత క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్లో గిల్ అద్బుతమైన టెక్నిక్తో బ్యాటింగ్ చేశాడని మంజ్రేకర్ కొనియాడాడు."కొన్ని రోజుల కిందట భారత టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ను ఎంపికచేయడాన్ని నేను వ్యతిరేకించాను. గిల్ కంటే జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్గా బెటర్ అని అభిప్రాయపడ్డాను. ఆ సమయంలో సెలక్టర్లు సరైన నిర్ణయం తీసుకోలేదని నేను చెప్పుకొచ్చాను. కానీ నేను ఎక్కడా కూడా గిల్ కెప్టెన్గా విఫలమవుతాడని మాత్రం చెప్పలేదు.కెప్టెన్సీ భారం తన బ్యాటింగ్కు పడకుండా గిల్ చూసుకుంటాడని నేను ముందే ఊహించాను. కానీ విదేశాల్లో మాత్రం అతడి ప్రదర్శన ఇంకా మెరుగు పడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో మాత్రం గిల్ అసాధరణ ప్రదర్శన కనబరిచాడు.శుబ్మన్ తన బ్యాటింగ్లో టెక్నికల్ లోపాలను సరిదిద్దుకున్నాడు. అందుకే విదేశీ గడ్డపై భారీ సెంచరీసాధించగలిగాడని" జియో హాట్స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
బిజినెస్

రూ.43 వేల కోట్ల పడపై పెళ్లి...
ప్రపంచంలోనే మూడో అత్యంత ధనవంతుడి ప్రతి కదలికా వార్తే.. విశేషమే. మరి ఆయన పెళ్లి చేసుకుంటుంటే... ఆర్భాటం కాకుండా ఉంటుందా? అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, కాబోయే భార్య లారెన్ శాంచెజ్ పెళ్లి చేసుకుంటున్నారు. ఇటలీలోని చారిత్రక వెనిస్ నగరంలో మూడు రోజులపాటు వివాహ వేడుక జరగనుంది.61 ఏళ్ల బెజోస్, 55 ఏళ్ల సాంచెజ్ లకు ఇదివరకే వేరొకరితో వివాహాలు జరిగి పిల్లలు ఉన్నారు. జెఫ్ బెజోస్ తాజా వివాహం జూన్ 24 నుండి 26 వరకు జరుగుతుందని వెనిస్ మేయర్ ప్రతినిధి ఒకరు సీఎన్ఎన్తో చెప్పారు. శాన్ జార్జియో మాగియోర్ ద్వీపంలో జరిగే ఈ వేడుకకు సుమారు 200 మంది అతిథులు హాజరుకానున్నారు.ఈ మెగా వెడ్డింగ్ తీసుకురానున్న టూరిస్ట్ ట్రాఫిక్ పై స్థానికులు నిరసన వ్యక్తం చేస్తుండగా, అధికార యంత్రాంగం వైఖరి మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటాలియన్ దినపత్రిక ఇల్ గాజెట్టినో ప్రకారం, వెనిస్ కౌన్సిల్ డైరెక్టర్ జనరల్ మోరిస్ సెరాన్ దీని కోసం గట్టిగా ప్రయత్నించారు. వేడుక కోసం డోల్స్ అండ్ గబ్బానాకు చెందిన డిజైనర్ డొమెనికో డోల్స్ ను కూడా రంగంలోకి దింపారు. గత శతాబ్దంలో ఇప్పటికే 5.9 అంగుళాలు మునిగిపోయిన వెనిస్ నగరం వేడుకకు వచ్చే జనంతో మరింత ఒత్తిడి ఎదురవుతుందన్నది స్థానికుల ఆందోళన.విలాసవంతమైన నావపై..వెనీషియన్ సరస్సులో లంగరు వేయనున్న బెజోస్కు చెందిన 500 మిలియన్ డాలర్ల (సుమారు రూ.43 వేల కోట్లు) సూపర్ యాచ్ (విలాస నౌక) కోరులో అసలు వేడుక జరుగుతుందని భావిస్తున్నారు. దీంతోపాటు అబియోనా అనే మరో సహాయక నౌక కూడా ఉంటుంది. వెనిస్ అంతటా పలు ప్రాంతాలు వివాహ కార్యక్రమాలకు నేపథ్యంగా పనిచేస్తాయి. కాక్టెయిల్ రిసెప్షన్లు, వేడుకలు గ్రాండ్ కెనాల్ పై ఉన్న 15 వ శతాబ్దపు ప్యాలెస్ పాలాజ్జో పిసాని మోరెట్టా, పునరుజ్జీవన కళాఖండమైన స్కూలా గ్రాండే డెల్లా మిసెరికోర్డియా, అడ్రియాటిక్ సముద్రం నుండి వెనిస్ మడుగును వేరుచేసే ద్వీపమైన లిడోలోని ఐకానిక్ హోటల్ ఎక్సెల్సియర్ వద్ద జరుగుతాయని భావిస్తున్నారు.గెస్ట్ లిస్ట్ లో ఎవరెవరున్నారంటే..పూర్తి జాబితా గోప్యంగా ఉన్నప్పటికీ, ప్రపంచంలోని నలుమూలల నుండి ప్రముఖులు, వ్యాపార, రాజకీయ అధి నాయకులు ఇందులో ఉంటారని భావిస్తున్నారు. ఆహ్వాన జాబితాలో బ్రిటీష్ నటుడు ఓర్లాండో బ్లూమ్, అతని కాబోయే భార్య కేటీ పెర్రీతో పాటు మిక్ జాగర్, కిమ్ కర్దాషియాన్, క్రిస్ జెన్నర్, ఓప్రా విన్ఫ్రే, ఈవా లాంగోరియా, లియోనార్డో డికాప్రియో ఉన్నారు. ఈ కార్యక్రమంలో టెక్ దిగ్గజాలు బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్ కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. వీరు బస చేసేందుకు అత్యంత విలాసవంతమైన హోటళ్లు బుక్ అయినట్లు తెలుస్తోంది. ఇవాంకా ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.భారీగా పెళ్లి ఖర్చువెనిస్ లో బెజోస్, సాంచెజ్ల వివాహానికి భారీగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. టెలిగ్రాఫ్ నివేదించిన ఒక వివరణాత్మక అంచనా ప్రకారం.. ఈ వివాహానికి ఖర్చు సుమారు 16 మిలియన్ డాలర్లు (రూ.132 కోట్లు) కావచ్చు. పూల ఏర్పాట్లు, వేదిక అలంకరణ కోసం 1 మిలియన్ డాలర్లు, వెడ్డింగ్ ప్లానింగ్ సేవలకు 3 మిలియన్ డాలర్లు, చారిత్రాత్మక ప్రదేశాల అద్దెకు 2 మిలియన్ డాలర్లు, క్యాటరింగ్ కోసం మరో 1 మిలియన్ డాలర్లు, సాంచెజ్ వార్డ్ రోబ్ కోసం 1.5 మిలియన్ డాలర్లు కేటాయించారు. ప్రఖ్యాత అమెరికన్ సింగర్ లేడీ గాగా ప్రదర్శన ఉంటుందని భావిస్తున్నారు.

ఇప్పుడు ఇల్లు.. ఇలా కొనడమే ఇష్టం
గృహ కొనుగోలుదారుల అభిరుచి మారింది. గతంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనేందుకు ఆసక్తి చూపిన కస్టమర్లు.. ప్రస్తుతం లాంచింగ్ ప్రాజెక్ట్లలో కొనేందుకు ఇష్టపడుతున్నారు. 2023లో రెడీ టూ మూవ్, లాంచింగ్ ప్రాజెక్ట్లలో కొనుగోళ్ల నిష్పత్తి 46:18 శాతంగా ఉండగా.. 2024 నాటికి 23:24 శాతానికి చేరింది. అలాగే రూ.కోటిన్నర ధర ఉన్న లగ్జరీ గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. 2023లో 20 శాతం మంది లగ్జరీ ఇళ్లకు ఆసక్తి చూపించగా.. 2024 నాటికి 35 శాతానికి పెరిగిందని ఫిక్కీ, అనరాక్ సర్వేలో వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోబాల్కనీ మస్ట్.. 1, 2, 3 బీహెచ్కే.. ఇళ్లు ఏదైనా సరే బాల్కనీ ఉండాల్సిందే. గృహ కొనుగోలుదారులు నిర్మాణం నాణ్యత, ప్రాంతం, ధర, వసతులతో పాటు బాల్కనీకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో ఇంటిలోని ప్రతి అంగుళం స్థలాన్ని వినియోగించాలని భావించిన కస్టమర్లు.. ప్రస్తుతం ఎక్కువ ఓపెన్ స్పేస్ ఉండాలని కోరుకుంటున్నారు. 75 శాతం మంది బాల్కనీ ఉండే ఇళ్ల కొనుగోళ్లకే ఆసక్తి చూపించగా, 74 శాతం మంది కస్టమర్లు నాణ్యమైన నిర్మాణాలకే మొగ్గు చూపిస్తున్నారు. అనరాక్ రీసెర్చ్ దేశంలోని పలు నగరాలలో 5,510 మందిపై ఆన్లైన్లో సర్వే నిర్వహించింది. గృహాల ధరలు పెరుగుతున్నప్పటికీ కొనుగోలుదారుల విశాలమైన ఇళ్లకే ఆసక్తి చూపిస్తున్నారు. 50 శాతం మంది కస్టమర్లు 3 బీహెచ్కే కొనుగోలుకు ఆసక్తి చూపిస్తే.. 38 శాతం మంది 2 బీహెచ్కే గృహాలకు మొగ్గు చూపిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఎన్సీఆర్ నగరాలలో 3 బీహెచ్కే యూనిట్లకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అధిక ధరల కారణంగా ముంబైలో 44 శాతం మంది కస్టమర్లు 2 బీహెచ్కేలకు, 17 శాతం 1 బీహెచ్కేలకు ఆసక్తి చూపిస్తున్నారు. పుణేలో 10 శాతం కొనుగోలుదారులు 1 బీహెచ్కే జై కొడుతున్నారు.పెట్టుబడులకు రియలే బెటర్.. ఏటా దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఫ్లాట్ల విస్తీర్ణాలు 11 శాతం మేర పెరుగుతున్నాయి. 2022లో 1,175 చ.అ.లుగా ఉన్న సగటు ఫ్లాట్ల సైజు.. 2023 నాటికి 1,300 చ.అ.లకు పెరిగాయి. 58 శాతం మిలీనియల్స్, 39 శాతం జెన్స్–ఎక్స్ కస్టమర్లు ఇతర పెట్టుబడుల నుంచి వచ్చిన లాభాలతో ఇళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 57 శాతం మంది రియల్ ఎస్టేట్ అత్యంత ప్రాధాన్య పెట్టుబడిగా విశ్వసిస్తున్నారు. ఇందులోనూ 36 శాతం మంది నివాస విభాగంలో పెట్టుబడులకే ఆసక్తి చూపిస్తున్నారు. గృహ రుణ వడ్డీ రేట్లు 8.5 శాతం కంటే తక్కువగా ఉన్నంత కాలం ఇంటి కొనుగోలు నిర్ణయంపై ప్రభావం ఉండదని చెప్పారు.

బీఎస్ఎన్ఎల్ కొత్త సర్వీస్..
ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సరికొత్త 5జీ ఇంటర్నెట్ సర్వీస్ను ప్రారంభించింది. దేశంలోనే తొలిసారి క్యూ-5జీ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (Q-5G FWA) లాంచ్ చేసింది. ఇది సంస్థలకు, కార్యాలయాలకు సిమ్ రహిత, వైర్లెస్ పరిష్కారాన్ని అందిస్తుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.ఏమిటీ క్యూ-5జీ?క్యూ-5జీ.. ఇక్కడ క్యూ అంటే క్వాంటమ్. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ చాలా అరుదుగా ఉండే టైర్-2, టైర్-3 నగరాలను లక్ష్యంగా చేసుకుని బీఎస్ఎన్ఎల్ కొత్త క్యూ-5జీ ఎఫ్డబ్ల్యూఏ సేవలను ప్రారంభించింది. భారతదేశంలో అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా బీఎస్ఎన్ఎల్ రూపొందించిన ఈ సరికొత్త సర్వీస్ వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, నెట్వర్క్ లేని నివాస ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించడంలో సహాయపడుతుంది.అయితే, ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా అందించే సాధారణ 5జీ సేవల మాదిరిగా కాకుండా బీఎస్ఎన్ఎల్ క్యూ -5జీ ఎఫ్డబ్ల్యూఏలో వాయిస్ సదుపాయం ఉండదు. అంటే దీని ద్వారా వినియోగదారులు కాల్స్ చేయలేరు. సిమ్ లేదా వైర్లు లేకుండా వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ మాదిరిగానే ఇది ఉంటుంది.క్యూ-5జీ ప్లాన్లుమిగిలిన వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీసుల మాదిరిగానే బీఎస్ఎన్ఎల్ క్యూ -5జీ తీసుకున్న కస్టమర్లకు వారి ఇళ్లపై సీపీఈ పరికరాలను ఏర్పాటు చేస్తారు. బీఎస్ఎన్ఎల్ కొత్త క్యూ-5జీ సర్వీస్ 100 ఎంబీపీఎస్ కనీస వేగాన్ని అందిస్తుంది. ఇందుకోసం నెలకు రూ .999 ఖర్చు అవుతుంది. అదే 300 ఎంబీపీఎస్ వేగం కావాలంటే రూ.1,499 ప్లాన్ ను అందిస్తోంది.ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ క్యూ-5జీ ఎఫ్డబ్ల్యూఏ హైదరాబాద్కే పరిమితం కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి బెంగళూరు, పాండిచ్చేరి, విశాఖపట్నం, పుణె, గ్వాలియర్, చండీగఢ్ వంటి నగరాలకు ఈ సేవలను విస్తరించాలని యోచిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే తెలిపింది.

అదే జరిగితే పెట్రోల్, డీజిల్ రేట్లకు రెక్కలే!
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంతో ముడిచమురు రేట్లు భగ్గుమన్నాయి. యుద్ధం మొదలైన గత శుక్రవారం నాడు (జూన్ 13న) ఒకే రోజున ఏకంగా 11 శాతం ఎగిసింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ రేటు ఎకాయెకిన 70.50 డాలర్ల నుంచి 78.50 డాలర్లకు పెరిగి, ఆరు నెలల గరిష్టానికి చేరింది. వారం రోజులుగా ఆ గరిష్ట స్థాయిలోనే తిరుగుతోంది.యుద్ధం ఇదే విధంగా కొనసాగి, చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి (Strait of Hormuz)ని ఇరాన్ గానీ మూసివేస్తే ముడి చమురు రేట్లు 120–130 డాలర్ల వరకు కూడా ఎగిసే అవకాశం ఉందని అంచనాలు నెలకొన్నాయి. ఒకవేళ అదే జరిగితే, దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లకూ రెక్కలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. భారతదేశం ఇరాన్ నుండి నేరుగా చమురు దిగుమతి చేసుకోకపోయినా, మధ్యప్రాచ్య స్థిరత్వం ప్రభావం భారతీయ మార్కెట్పై పడుతుంది.పర్షియన్ గల్ఫ్ ను గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియా సముద్రంతో కలుపుతూ హర్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు రవాణా కేంద్రాలలో ఒకటిగా ఉంది. ఇది ఇరాన్, ఒమన్ మధ్య ఇరుకైన జలమార్గం. పర్షియన్ గల్ఫ్ నుండి ముడి చమురు ఎగుమతుల్లో 85% కంటే ఎక్కువ దీని ద్వారా వెళుతుంది. 2024లో ఈ జలసంధి రోజుకు సగటున 20 మిలియన్ బ్యారెల్స్ ప్రవాహాన్ని చూసింది. ఇది ప్రపంచ పెట్రోలియం వినియోగంలో ఐదవ వంతు. ఇరాన్ ఈ జలసంధిని అడ్డుకోవడం గానీ, ఏదైనా అంతరాయం జరిగితే చమురు కొరత తీవ్రమై ధరల పెరుగుదలకు దారితీస్తుంది. భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఈ మార్గం గుండా వెళ్ళే చమురును అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నందున, సరఫరాలో అంతరాయాల వల్ల ఈ దేశాలు ఏదైనా ఎక్కువగా ప్రభావితమవుతాయి.
ఫ్యామిలీ

World Music Day నాదమే జీవనం
కోయిల ఊరికే ఉండదు... పాడుతుంది. గాలి కూడా కామ్గా కూర్చోదు... సవ్వడి చేస్తుంది. వినాలే గానీ... కిటికీ పరదా చప్పుడు కూడా సంగీతమే! ఆనందమో, చిరు సంతోషమో కలిగినప్పుడు... ప్రతి గొంతూ కూని రాగం తీస్తుంది. సంగీతం లేకపోతే... ఈ జగతి ఉత్త శూన్యం. సప్త స్వరాలే... ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ‘వరల్డ్ మ్యూజిక్ డే’ సందర్భంగా ఒక పాటకో, ఒక గళానికో, ఒక స్వరానికో కృతజ్ఞత చెప్పుకోకపోతే ఎలా..? నాదమే జీవనంగా బతుకుతున్న నలుగుర్ని కలవకపోతే ఎలా..!ఊపిరి ఉన్నంతవరకూ పాటే నా ప్రపంచం– సంగీతదర్శకురాలు శ్రీలేఖ→ మ్యూజిక్ డైరెక్టర్గా ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి రోజూ సంగీతాన్ని ఆస్వాదిస్తాను... ఆనందిస్తాను. ఊపిరి ఉన్నంతవరకు పాటలతో సెలబ్రేట్ చేసుకుంటాను. పాటే నా ప్రపంచం. సంగీతం తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. సంగీతాన్ని రోజూ ఇష్టపడుతున్నప్పటికీ ‘వరల్డ్ మ్యూజిక్ డే’ సందర్భంగా నాకు నచ్చిన పాటలను మరింత ఎక్కువగా వింటాను. నేను కంపోజ్ చేసిన పాటలను నెమరు వేసుకుంటాను... ఇలా చేసి ఉంటే బాగుండేది, అలా చేసి ఉంటే బాగుండేది... ఇలా రకరకాలుగా నా పాటలను విశ్లేషించుకుంటాను. → అప్పట్లో లైవ్ ఇన్స్ట్రూమెంట్స్ ఎక్కువగా ఉండేవి. ప్రొడ్యూసర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్లు ఎక్కువగా కోరుకునేవారు కూడా. పాటలు కూడా అలాగే ఉండేవి. రికార్డింగ్, సాంగ్ రికార్డింగ్లో నేను కూడా లైవ్ ఇన్స్ట్రూమెంట్స్ ఉపయోగించాను. వివిధ లైవ్ ఇన్స్ట్రూమెంట్లతో హాల్ మొత్తం సందడిగా, పండగ వాతావరణంతో ఉండేది. ప్రతిరోజూ ఒక పండగలా ఉండేది. ఎవరికి వారు బిజీ కావడం, లైవ్ ఇన్స్ట్రూమెంట్ రిక్వైర్డ్ సాంగ్స్ రాకపోవడం, డీజే టైప్ పాటలు, రెట్రో, హిప్ హాప్లాంటివి వచ్చి లైవ్ అవసరం లేకుండా పోయింది. ఒకవేళ అవసరం ఉన్నా ఎక్కడున్న వారు అక్కడ, ఎవరికి టైమ్ ఉన్నప్పుడు వారు పాడి, వాయించి పంపుతున్నారు. వాటిని తరువాత మిక్స్ చేస్తున్నారు. అంతా డిజిటలైజ్డ్ అయిపోయింది. ఇది ఎంతవరకు వెళుతుందో మాత్రం తెలియదు. → ఫుల్ ఆర్కెస్ట్రా ఉన్నప్పుడు సాంగ్ స్ట్రక్చర్ ఇలా రాబోతుందని తెలిసేది. ఎందుకంటే సింగర్స్తో సహా లైవ్ ఉండేది. స్ట్రక్చర్ గురించి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్కే తెలియడం లేదు. అక్కడొక ముక్క, ఇక్కడొక ముక్క, పల్లవి ఒకరు చేస్తారు... బీజియమ్ ఒకరు చేస్తారు. ఫైనల్ వచ్చే వరకు కూడా సాంగ్ ఎలా వస్తుంది? అనేది మ్యూజిక్ డైరెక్టర్కి తెలియడం లేదు. మార్పులు, చేర్పులు చేయాలంటే అదొక తతంగం. సో... సాంకేతిక అభివృద్ధి పరంగా మైనస్ ఉంది. కాకపోతే పని గంటలు తగ్గుతాయి. అలాంటి ప్లస్లూ ఉన్నాయి. → సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరితోనూ బాగుంటాను. కోటిగారు, వందేమాతరం శ్రీనివాస్గారు, కీరవాణి అన్నయ్య, మణిశర్మగారు... ఇలా ఎంతోమంది చిన్నప్పటి నుంచి నన్ను చూసి ఉన్నారు కాబట్టి, అందరికీ నేను పెట్. అందరూ నన్ను అభిమానిస్తారు. → నా సినిమాల్లో నాకు సంతృప్తినిచ్చినవి చాలా ఉన్నాయి. ఉదాహరణకు ‘ధర్మచక్రం, తాజ్మహల్, ప్రేమించు, ప్రేయసి రావే, శివయ్య’ వంటివి. మొన్న వచ్చిన ‘హిట్–2’లో ‘ఉరికే ఉరికే’ సాంగ్ బ్లాక్ బస్టర్. నా కెరీర్లో ఎక్కువగా మంచి సినిమాలకు పని చేసే చాన్స్ రావడం నా అదృష్టం. → ఏఐ (కృత్రిమ మేధ) గురించి విన్నాను. ఎంత ఏఐ వాడినా, ఎలా చేసినా తెలిసిపోతుంది. హ్యూమన్ ఎమోషన్ ఏఐ ఇవ్వలేదు. మనిషి కంపోజ్ చేసి ఇచ్చినంత ఏఐ ఇవ్వలేదు. → సినిమా రంగంలో రావడానికి నేను వచ్చిన టైమే కష్టం అనుకుంటే ఇప్పుడు మరింత కష్టం అయింది. ఎంతోమంది డైరెక్టర్స్, సింగర్స్, కంపోజర్స్ వస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బాగా కష్టపడాలి. ఇక మనం ఏ స్థాయికి వెళతామనేది అది మన అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. → నేను సినిమా ఒప్పుకోవడానికి మూడు విషయాల గురించి ఆలోచిస్తాను. మొదటిది కథ. జనరల్గా కథే కదా హీరో. కథ ఎలా ఉంది, ఏ జానర్లో ఉంది, డైరెక్టర్ ఫ్యాషనేట్గా తీయగలరా? ప్రాపర్గా రిలీజ్ చేయగలరా? వీటి గురించి ఆలోచిస్తాను. → మహిళలు, పురుషులు అని కాదు... సినిమా ఫీల్డ్లోకి రావాలంటే ఎవరికైనా అది అంత తేలికైన విషయం కాదు. కమర్షియల్ ఫీల్డ్ కాబట్టి ఇంట్లో అందరినీ ఒప్పించాలి, చాలా టాస్క్లు ఉంటాయి. దేవుడి దయ వల్ల ఆ టాస్క్లన్నీ దాటుకొని ఇప్పటికీ సక్సెస్ఫుల్గా ఉన్నాను.– డి.జి. భవానిమనసుని తాకాలంటేమెలోడీ బెస్ట్– సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్→ ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జూన్ 21న వరల్డ్ వైడ్గా జరుపుకుంటారు. మనకు కూడా ఇక్కడ మ్యూజిక్ డే సెలబ్రేషన్స్ని చేస్తుంటారు. కానీ, నాకైతే ప్రతి రోజూ సంగీత దినోత్సవమే. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకూ సంగీతంతోనే ఉంటాను కాబట్టి. → సంగీతంలో అప్పటికీ, ఇప్పటికీ టెక్నాలజీ వైజ్, వర్కింగ్ వైజ్ చాలా మార్పులొచ్చాయి. మ్యూజిక్ ఎప్పుడూ మెలోడీ వైజ్ మెలోడీనే ఉంటుంది... దాన్ని ఏదీ రీ ప్లేస్ చేయలేదు. గతంలో లైవ్లో అందరం ఒకేసారి రికార్డ్ చేసేవాళ్లం. ఇప్పుడు బిట్ బిట్గా, సిస్టమ్ ద్వారా చేస్తున్నాం. ఒక పదం పదం పరంగా కూడా రికార్డింగ్ చేస్తున్నాం. అలాగే ఏఐ ద్వారా వాయిస్ మాడ్యులేషన్స్లో కూడా మార్పులొస్తున్నాయి. → సాంకేతికంగా ఎప్పటికప్పుడు మార్పులు వస్తుంటాయి. దానికి తగ్గట్టుగానే పని చేయాల్సి ఉంటుంది. అయితే ముందు రోజుల్లో లైవ్ రికార్డింగ్స్ ఉన్నప్పుడు ఒకటేసారి మొత్తం ఆర్కెస్ట్రా, సింగర్స్ అంతా కలిసి ఒక టేక్లో అయిపోయేది. అది ఒక రకంగా సులభంగా ఉండేది. ఎందుకంటే... గతంలో ఫ్లూట్ బిట్, వీణ బిట్, తబలా బిట్ ఇది... అని ఒక ప్రాపర్గా సెట్ చేసుకుని కంపోజ్ చేసేవారు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా ఆప్షన్స్ వచ్చాయి. ఒక్కొక్క ట్యూన్ సెలక్షన్స్కే చాలా రోజులు పట్టేస్తోంది. అంటే ఎక్కువ ట్యూన్స్ ఎంచుకునే అవకాశం ఉండటంతో ఇంకా ఏదో మంచిది దొరుకుతుంది, ఇంకా కొత్త ట్యూన్ దొరుకుతుంది అని. ఈ ప్రాసెస్ కొంచెం కాంప్లికేటెడ్. అయితే ఈ టెక్నాలజీ పరంగా సౌలభ్యం ఏంటంటే టైమింగ్స్. సింగర్ లేదా మ్యుజిషియన్ టైమ్కి అందుబాటులో లేకున్నా, ఇతర దేశంలో ఉన్నా వారు పాడటం లేదా వాయించి పంపితే మేము ఇక్కడ యాడ్ చేస్తాం. ఒక రకంగా ఇది అడ్వాంటేజ్. → ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్కి ఒక్కో శైలి ఉంటుంది. నా పరంగా వచ్చేసరికి నేనెప్పుడూ మెలోడీని ప్రేమిస్తాను. ఏ పాట కంపోజ్ చేసినా కూడా మెలోడీకి తొలి ప్రాధాన్యం ఇస్తాను. ఎందుకంటే మనకు సంగీతం అనగానే మొదట టచ్ అయ్యేది మనసు. మెలోడీయే మనకు ఎక్కువ రోజులు గుర్తుంటుందని బలంగా నమ్ముతాను. నా తొలి ప్రాధాన్యం ఎప్పుడూ మెలోడీయే. కానీ, కథ, సందర్భం, అవసరాన్ని బట్టి అక్కడ మాస్ సాంగ్ లేదా బీట్ సాంగ్ ఇస్తుంటాను. → ఇప్పుడొస్తున్న యువ సంగీత దర్శకులు చాలా బాగా పని చేస్తున్నారు. అయితే ఆరోగ్యకరమైన పోటీ అనేది చాలా అవసరం. ఎందుకంటే.. ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుంది. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వైవిధ్యమైన స్టైల్స్, ఫీల్స్ వినడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా మనం ఏదో చేయాలి? అనే ఉత్సాహం ఉండాలి. అయితే పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి. → నా కెరీర్లో దాదాపు 90 సినిమాలు చేశాను. అయితే ఓ సంతృప్తి అనేది సినిమా విజయం వల్ల ఉంటుంది... కథ వల్ల ఉంటుంది. ఆ స్టోరీ జనాల్లోకి బాగా వెళ్లడం, మన పాటలు బాగా హిట్ అయితే అదో సంతృప్తి ఉంటుంది. నా సినిమాల్లో అలా సంతృప్తి ఇచ్చినవాటిలో ‘ప్రేమకావాలి, మనం, ఇష్క్, గోపాల గోపాల, టెంపర్’ వంటివి చాలా ఉన్నాయి. → ప్రస్తుతం కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న సంగీత దర్శకులు, సింగర్స్లో చాలా మంచి ప్రతిభ ఉంది. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా పరిధి బాగా పెరిగింది. దాని వల్ల స్టార్ వేల్యూ, పాపులారిటీ అన్నది గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా సులభం అయింది. అయితే కొత్తవాళ్లకు అంకితభావం... ప్రధానంగా ఓపిక అనేది ఉండాలి. అప్పుడే మన లక్ష్యం అనేది చేరుకుంటాం. ప్రతి ఒక్కరికి ఒక్కో టైమ్ ఉంటుంది... మన సమయం వచ్చినప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకుంటాం. → ప్రస్తుతం ‘వారాహి’ అనే సినిమా చేస్తున్నాను. అలాగే తేజగారి చిత్రంతో పాటు అర్జున్గారి సినిమా చేస్తున్నాను. మరో ఐదారు సినిమాలు కూడా ఒప్పుకున్నాను.→ నేను చిన్నప్పటి నుంచి ఇళయరాజా సార్, ఏఆర్ రెహమాన్ సార్ పాటలు వింటూ పెరిగాను. వాళ్ల వర్కింగ్ స్టైల్, లైఫ్ స్టైల్.. చె΄్పాలంటే వాళ్లే నాకు స్ఫూర్తి. నాకే కాదు ఇప్పుడు కొత్తగా వచ్చే చాలా మంది సంగీత దర్శకులకు, అలాగే ఇప్పుడు ఉన్న వారికి కూడా. నేను మాత్రం ఆర్డీ బర్మన్గారు, ఇళయరాజా సార్, ఏఆర్ రెహమాన్గారు.. వాళ్ల వద్ద నుంచి చాలా నేర్చుకున్నాను.→ సినిమా ఒప్పుకోవాలంటే నా తొలి ప్రాధాన్యత కథే. అయితే కొన్నిసార్లు బ్యానర్, హీరో, డైరెక్టర్ వేల్యూ కూడా ఉంటాయి. అయితే ఎవరైనా కొత్తవాళ్లు, కొత్త ప్రొడక్షన్ హౌస్ వాళ్లు నన్ను కలిస్తే మాత్రం ముందు కథ విని, నచ్చితే ఒప్పుకుంటాను.– డేరంగుల జగన్ మోహన్లైవ్ రికార్డింగ్లోడెప్త్ ఉంటుంది – సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల→ సంగీత దర్శకుడిగా ప్రతిరోజునీ నా ఫస్ట్ డే మ్యూజిక్ డైరెక్షన్లానే భావిస్తాను. ప్రతిరోజూ ఓ స్ట్రగులే. అందుకే అప్గ్రేడ్ అవుతుంటాను. ప్రజలు ఎలాంటి సంగీతాన్ని ఇష్టపడుతున్నారో తెలుసుకుని, కొత్త తరహా సంగీతాన్నందించాలన్నదే నా తపన. → మనం ఆనందంలో ఉన్నప్పుడు పాట వింటాము. దుఃఖంగా ఉన్నప్పుడూ పాట వింటాము. మన భావాలను పంచుకోవాలనుకున్నప్పుడు మ్యూజిక్తో తెలియజేస్తాం. ఇలా పలు రకాలుగా సంగీతం అనేది మన జీవితంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. → దశాబ్ద కాలానికి పైగా సంగీతరంగంలో రాణిస్తున్నాను. ఈ రంగంలో టెక్నాలజీ అప్డేట్ అవుతూ వస్తోంది. టెక్నాలజీని మనం ఎంత వరకు కరెక్ట్గా వాడాం అన్నది జాగ్రత్తగా గమనించుకుంటుంటే అడ్వాంటేజ్గానే ఉంటుంది. కొన్నిసార్లు డిస్అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఒరిజినాలిటీ అనేది ఎప్పుడూ మిస్ కాకూడదు. మ్యూజిక్ అనేది హ్యూమన్ టచ్తో సంబంధం ఉన్న అంశం. అలాగే సంగీత దర్శకులకు ఏఐ ఉపయోగపడుతుంది. కానీ మనం దాన్ని ఎంతవరకు వినియోగిస్తున్నాం అన్నది చూసుకోవాలి. → ఇండస్ట్రీలో ఉన్న పోటీతత్వాన్ని గమనిస్తుంటాను. ఫస్ట్ నాకు నేను పోటీగా ఉండాలనుకుంటాను. ఎంతమంది ఉన్నా కూడా మనకు మనం పోటీగా ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్లగలం. ఇండస్ట్రీలో సంగీతదర్శకుల మధ్య ఉండే పోటీని చూసి ఉలిక్కిపడను. నేను ఎదగడానికి ఏం చేయాలి అని చూస్తాను తప్ప పక్కన ఇంకెవరో వచ్చారని కంగారు పడను. → డిజిటల్ సాయంతో మ్యూజిక్ చేయడం కొంతవరకు సౌకర్యంగానే ఉంటుంది. కానీ లైవ్ రికార్డింగ్స్ అనేవి మాత్రం డెప్త్ క్రియేట్ చేస్తాయి. ఎంత చెప్పినా లైవ్ లైవే... దాంట్లో తిరుగులేదు. నేను గిటారిస్ట్ని. లైవ్ అంటే ఏంటో నాకు తెలుసు. ఎంత టెక్నాలజీ వాడినా కూడా లైవ్ అన్నది లైవే. డిజిటలైజ్ వల్ల పని సులభం అవ్వొచ్చు. కానీ లైవ్ రికార్డింగ్ అనేది మ్యూజిక్ను నిలబెడుతుంది. → శ్రోతలకు లిరిక్స్ వినిపించేలా మనం సంగీతం ఇవ్వాలి. ఆ పాటకు లిరిక్స్ చాలా ముఖ్యమని, లిరిక్దే ప్రథమ స్థానమని భావిస్తాను. నా సినిమాల్లోని పాటల్లో లిరిక్స్ ఆడియన్స్కు వినిపించాలనే ప్రయత్నిస్తుంటాను. లిరిక్స్ ఆడియన్స్కు అర్థమైతే, అప్పుడు ఆ లిరిక్కు మ్యూజిక్ డైరెక్టర్ ఈ తరహా మ్యూజిక్ ఇచ్చాడని వారికి అర్థమౌతుంది. అదే లిరిక్ అర్థం కాకుండా మనం మ్యూజిక్ ఇస్తే ఎందుకు లిరిక్ అర్థం కావడం లేదనిపిస్తుంది. లిరిక్ అర్థమైనప్పుడే సినిమాలోని సందర్భం మ్యూజిక్తో ఆడియన్స్కు మరింత చేరువ అవుతుంది. → సినిమాలో సౌండ్ అనేది డిజైన్ చేసినప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే మంచిది. ఒక సినిమాకు ఇద్దరు... ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేసే విధానానికి నేను వ్యతిరేకిని. ఇది నా సొంత అభి్రపాయం. అయితే కొన్నిసార్లు ఒక సినిమాకు ఇద్దరు... ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేసినప్పుడు అది వర్కౌట్ అయ్యింది. అలాంటప్పుడు ఒక సినిమాకు ఒకే సంగీత దర్శకుడు పని చేయాలని చెప్పడానికి నేనెవర్ని. కానీ... చేస్తే మొత్తం సినిమా చేయాలని నేను కోరుకుంటాను. ఈ విషయంపై నా స్టాండ్ ఏంటంటే... నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు. కానీ సంగీత దర్శకుల్లో నేను ఒక భాగమే. ఎవరైనా వచ్చి, ఫలానా సినిమాలో ఒకే ఒక్క సాంగ్ చేయమన్నా చేస్తాను. → మ్యూజిక్ రంగంలో స్థిరపడాలనుకునే కొత్త తరం వారికి నేను చెప్పేది ఒక్కటే. ఒక్కసారి డిసైడ్ అయితే వెనక్కి తిరిగి చూడొద్దు. నిత్యం కష్టపడాలి. ఫోకస్గా ఉండాలి. ప్రతిక్షణం మ్యూజిక్ పైనే ఫోకస్ పెట్టి పని చేయాలని చెబుతాను. → వరల్డ్ మ్యూజిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటాను. ఈ సందర్భంగా నా సహచర మ్యూజిషియన్స్ అందరికీ విషెస్ చెబుతున్నాను. అందరికీ అవకాశాలు రావాలని, అందరూ సక్సెస్ కావాలని, అందరూ ఎదగాలని కోరుకుంటాను. ప్రస్తుతం అడివి శేష్గారి ‘గూఢచారి 2, ఆది సాయికుమార్గారి ‘శంబాల’ సినిమాలు చేస్తున్నాను. మరో ఆరు సినిమాలు లైనప్లో ఉన్నాయి.→ నేను సినిమా ఒప్పుకోవాలంటే కథను మాత్రమే చూస్తాను. అలాగే నేను ఉపయోగించే ఇన్స్ట్రూమెంట్స్ సినిమా టు సినిమా మారిపోతుంటాయి. కథ, ఆ సినిమా హీరో, ఆ హీరో బాడి లాంగ్వేజ్ని బట్టి ఎలాంటి స్టైల్ క్రియేట్ చేయవచ్చు. డైరెక్టర్ ఏ విధమైన మ్యూజిక్ ఆశిస్తున్నారు. ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ట్యూన్స్ చేస్తాను. ∙‘మేజర్, నాంది, గూఢచారి, కృష్ణ అండ్ హిజ్ లీలా, డీజే టిల్లు’ వంటి చిత్రాలు ఓ సంగీతదర్శకుడిగా నా కెరీర్లో ఎక్కువ సంతృప్తినిచ్చాయి. – ముసిమి శివాంజనేయులు

Today tips పండంటి కాపురానికి పక్కా లెక్కలు, చిట్కాలు
ఇటీవలి కాలంలో వివాహ బంధం మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోతున్న సంఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. రెండు మనసులు కలిసి కలకలం సంతోషంగా జీవించాల్సిన జంటలు పగలు ప్రతీకారాలతో రగిలిపోతున్నాయి. చివరికి ఒకర్నొకరు అంతం చేసుకుంటున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లంటే నూరేళ్ల పంట అన్నట్టు దంపతులు హాయిగా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఉండాలంటే ఏం చేయాలి? టిప్ ఆఫ్ ది డే లో భాగంగా అన్యోన్యమైన పండంటి కాపురానికి పాటించాల్సిన లెక్కలు, టిప్స్ తెలుసుకుందాం.ఏ బంధానికైనా విశ్వాసం, నమ్మకం బలమైన పునాదిగా ఉంటాయి. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, అనురాగం ఉన్నపుడు భార్యభర్తల బంధం కూడా నూరేళ్లు కొనసాగుతుంది. భార్యభర్తలంటే కలహాలు ఉండవని కాదు, బేధాభిప్రాయాలు ఉండవనీ కాదు. కానీ ఒకరి అభిప్రాయాల్ని ఒకరు గౌరవించుకోవాలి.ఒకరి పొరబాట్లను, తప్పులను అర్థం చేసుకోవాలి. నాదే పంతం, అన్నట్టుగా కాకుండా, సమయానికి తగు.. అన్నట్టు సర్దుకుపోవాలి. ఒక్కోసారి వెనక్కి తగ్గాలి. అవసరమైత రాజీ పడాలి. అదే అందమైన దాంపత్య జీవితానికున్న అర్థం పరమార్థం.చదవండి: నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉండాలంటే కొన్ని చిట్కాలు పెళ్లికి ముందే అన్ని విషయాలు పరస్పరం చర్చించుకోవాలి.ఇద్దరి మధ్య బంధానికి అంగీకారం ఉందా లేదా అనేదాన్ని పరస్పరం గట్టిగా నిర్ధారించుకోవాలి. అందమైన బంధానికి కమిట్మెంట్, కమ్యూనికేషన్ కీలకం.నిజాయితీకి పెద్ద పీట వేయాలి. ఉద్యోగం, ఆస్తులు, సంపాదన ఇలాంటి విషయాలో అబద్ధాలకు తావుండ కూడదు.పెళ్లి తరువాత ఇంటా బయటా పనుల్లో ఒకరికొకరు సహకరించుకోవాలి. బడ్జెట్, ఇంటి ఖర్చులు సహా అన్ని విషయాల్లో పరస్పరం చర్చించుకొని నిర్ణయాలు తీసుకోవాలి. తప్పు ఒప్పులకు సమానంగా బాధ్యత తీసుకోవాలి. ఒకళ్ల గురించి ఒకరు పట్టించుకోవాలి. ఒకరికొకరు అండగా ఉండాలి. ముఖ్యంగా అనారోగ్యం విషయాల్లో ఒకరికొకరు శ్రద్ధపెట్టాలి. ‘నేను ఉన్నాను’ అనే భరోసా ఇచ్చుకోవాలిఎపుడూ సంసార సాగరంలో పడిపోకుండా అడపాదడపా, కనీసం పెళ్లి రోజులు, పుట్టిన రోజుల్లో అయినా ఇద్దరికీ నచ్చేలా కొంత సమయాన్ని గడపండి. ఇది జీవితంలో మరింత రీఛార్జ్ అవ్వడానికి ఉపయోగ పడుతుంది. ఇద్దరి మధ్య బంధం, ప్రేమ బలపడడానికి కూడా దోహదపడుతుంది.చివరికి ఏవైనా చిన్ని చిన్న మనస్పర్థలు వచ్చినా కూర్చుని చర్చించుకుంటే శ్రావణమేఘాల్లా ఇట్టే తొలగిపోతాయి. మనసులో పెట్టుకొంటే మరింత వేధిస్తాయి. నలుగురి ముందూ గొడవపడటం, ముఖ్యంగా పిల్లల ముందు వాగ్వాదానికి దిగడం అస్సలు చేయవద్దు. ఇది మీ జీవితంతోపాటు, పిల్లల జీవితాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. చదవండి: Today Tip : బాల్కనీ మొక్కలు.. అదిరిపోయే చిట్కా!

జీ 7 ప్రముఖులకు పీఎం మోదీ అపురూపమైన బహుమతులు
భువనేశ్వర్: కెనడాలో జరిగిన జీ–7 సమ్మిట్లో పాల్గొనేందుకు హాజరైన ప్రముఖులకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అద్భుతమైన రాష్ట్ర కళాకృతుల్ని బహుమానంగా అందజేశారు.జీ–7 సదస్సులో పాల్గొన్న కెనడా గవర్నర్ జనరల్ మేరీ సైమన్కు ప్రధాన మంత్రి వెండి తీగల అల్లిక క్లచ్ పర్స్ను బహుమతిగా ఇచ్చారు. రాష్ట్రంలో కటక్ అందమైన వెండి తీగల సంప్రదాయ అల్లిక చేతి పనులకు (తారొకొసి) ప్రసిద్ధి. ఈ అపురూప కళ 500 సంవత్సరాలు పైబడిన ప్రాచీనమైనది. ఆనాటి మొఘల్ చక్రవర్తుల ఆదరణతో వెలుగొందిన కళ నేటికి నిలకడగా తళుక్కుమంటోంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జర్మనీ చాన్స్లర్ ఫ్రెడరిక్ మెర్జ్కు ప్రపంచ ప్రఖ్యాత 13వ శతాబ్దపు కోణార్క్ సూర్య దేవాలయం కాల చక్రం కానుకగా సమరి్పంచారు. ఇసుక రాయితో రూపుదిద్దుకోన్న కోణార్కు చక్రం ప్రతిరూపం రాష్ట్ర శిల్ప కళా నైపుణ్యాన్ని జీ 7 దేశాల్లో ప్రధాన మంత్రి ప్రతిబింబింపజేశారు. సూర్య రశ్మి ఆధారంగా సమయం సూచించే రీతిలో ఈ చక్రంలో ఊచల్ని శిల్పులు చెక్కు చెదరకుండా పొందుపరచడం విశేషం. ఇది అంతులేని కాల చక్రాన్ని చూపుతుంది. పూరీ జిల్లా కళా గ్రామం రఘురాజపూర్ ప్రాంతపు పొట్టా చిత్రాన్ని క్రొయేషియా అధ్యక్షుడు జోరాన్ మిలనోవిచ్కు ప్రధాన మంత్రి బహుమతిగా సమర్పించారు. పొట్టా చిత్రం రాష్ట్రానికి చెందిన అందమైన సంప్రదాయ కళారూపం. ఇది వస్త్రంపై వివరణాత్మక, రంగురంగుల చిత్రాలకు ప్రసిద్ధి చెందింది. దీంతో ఈ చిత్రాలు పొట్టా (వస్త్రం), చిత్ర (చిత్రం)గా పేరొందాయి. సాధారణంగా భారతీయ పౌరాణిక గాథల శీర్షికల ఇతివృత్తంగా అర చేతిలో ఇమిడే అతి చిన్న చిత్రాలు మొదలుకొని సువిశాల పటాలు రూపొందించడంరఘురాజపూర్ కళాకారుల ప్రత్యేకతని జీ 7 ప్రతినిధులకు ప్రధాన మంత్రి ప్రతిబింబింపజేయించడం విశేషం.

రాత్రికి రాత్రే మిలియనీర్గా..జాలరి దశ మార్చిన చేపలు
భువనేశ్వర్: అదృష్టవశాత్తూ, దిఘా నదీముఖద్వారంలోకి అడుగుపెట్టిన ఒక మత్స్యకారుడు రాత్రికి రాత్రే 29 అరుదైన ,అత్యంత విలువైన 'తెలియా భోలా' చేపలను పట్టుకుని మిలియనీర్ అయ్యాడు.వేట కోసం విసిరిన వలలో ఔషధీయ విలువలతో నిండిన చేపలు చిక్కడంతో అతడి దశ తిరిగింది. దిఘా నదీ ముఖద్వారం పరిసరాలలో నానీ గోపాల్ ట్రాలరు నుంచి పన్నిన వలలో తెలియా భోలా చేపలు పడ్డాయి. ఒకేసారి 29 అరుదైన, అత్యంత విలువైన తెలియా భోలా చేపలు చిక్కడంతో అదృష్టం కలిసి వచ్చింది. దెబ్బకి లక్షాధికారి అయిపోయాడు.#WATCH | Balasore: Fisherman catches 29 Telia Bhola fish, sells for Rs 33 lakh and becomes a millionaire overnight.#Odisha pic.twitter.com/vr6TQUncrd— Kalinga TV (@Kalingatv) June 19, 2025 ఒక్కో చేప 20 కిలోలు పైబడి బరువు తూగింది. నదీ ముఖద్వారం సమీపంలోని చేపల వేలం కేంద్రంలో రూ.33 లక్షలకు ఈ చేపలు అమ్ముడయ్యాయి. తెలియా భోలా చేపలను ఔషధీయ విలువల కారణంగా తీవ్రమైన వ్యాధులకు మందులు, సౌందర్య సాధనాల ఉత్పత్తిలో వాడతారు. ఇదీ చదవండి: నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!Yoga సంపూర్ణ ఆరోగ్యం కోసం ఖర్చు లేని మందు, కానీ..!
ఫొటోలు
అంతర్జాతీయం

ఉక్రెయిన్ మొత్తం మాదే.. పుతిన్ సంచలన ప్రకటన
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. రష్యన్లు, ఉక్రెయిన్లు ఒక్కటేనని.. ఉక్రెయిన్ మొత్తం రష్యాదే అంటూ వ్యాఖ్యలు చేశారు. దీని ప్రకారం ఉక్రెయిన్ మొత్తం తమదేనని అన్నారు. దీంతో, పుతిన్ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు తెర లేపాయి.రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ..‘ఉక్రెయిన్ను నాశనం చేయాలనే ఉద్దేశం మాకు లేదు. ఇదే విషయం నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ఉక్రెయిన్ తమకు తాముగా సమస్యలను సృష్టించుకుంటోంది. రష్యన్లు, ఉక్రెయిన్లు ఒక్కటే. దీని ప్రకారం ఉక్రెయిన్ మొత్తం మాదే. ఉక్రెయిన్ నగరం సుమీని స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యం మాకు లేదు. ఉక్రెయిన్లో శాంతి సాధించాలనుకుంటే మాతో కలిసి రావాలి. మేము ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని ఎప్పుడూ ప్రశ్నించలేదు. అలాగే, ఉక్రెయిన్ లొంగిపోవాలని కూడా మేము కోరుకోవడం లేదు. రష్యా శాంతికి కట్టుబడే ఉంది. ఉక్రెయిన్ నాటోలో చేరాలనే ఆకాంక్షలను వదులుకోవాలి. ఉక్రెయిన్ ఆక్రమిత ప్రాంతాలపై మాస్కో నియంత్రణను అంగీకరించాలి. ఉక్రెయిన్ స్వతంత్రంగా మారిన 1991 ఒప్పందాలను గుర్తుచేసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.Russians and Ukrainians are one people, and in that sense, the whole of Ukraine is ours — Putin 😳 pic.twitter.com/krghibrx0m— Frontalforce 🇮🇳 (@FrontalForce) June 20, 2025ఖండించిన పుతిన్అయితే, ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని నివాస ప్రాంతాలపై తాము దాడి చేశామన్న వ్యాఖ్యలను పుతిన్ ఖండించారు. తమ సైన్యం అటువంటి లక్ష్యాలను ఢీకొట్టలేదని వెల్లడించారు. తాము నివాస గృహాలపై దాడులు చేయలేదని, సైనిక స్థావరాలపైనే చేశామన్నారు. జెలెన్ స్కీతో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కానీ గతేడాది తన పదవీకాలం ముగియడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తన చట్టబద్ధతను కోల్పోయారని ఆరోపించారు.ఈ సందర్భంగా పుతిన్..‘జెలెన్ స్కీతో సహా ఎవరినైనా కలవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది సమస్య కాదు. ఉక్రెయిన్ ఆయనకు చర్చలు జరిపే బాధ్యత అప్పగిస్తే, జెలెన్ స్కీనే అనుమతించండి. అసలు ప్రశ్న ఏమిటంటే ఫలితంగా వచ్చే పత్రాలపై ఎవరు సంతకం చేస్తారు? సంతకం చట్టబద్ధమైన అధికారుల నుంచి రావాలి. జెలెన్ స్కీ అధ్యక్ష పదవీకాలం గతేడాది అధికారికంగా ముగిసింది. మార్షల్ లా విధించడం వల్ల అతడి వారసుడిని ఎన్నుకోలేదు. ఉక్రెయిన్ రాజ్యాంగం ప్రకారం పదవీ కాలం ముగిస్తే అధ్యక్ష అధికారాలను పార్లమెంటు స్పీకర్కు బదిలీ చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో తాను పదవిలో కొనసాగవచ్చని జెలెన్ స్కీ వాదిస్తున్నారు. అయితే తీవ్రమైన సమస్యలను పరిష్కరించేటప్పుడు మేము చట్టపరమైన అంశాల గురించి శ్రద్ధ వహిస్తాం. సంతకం చట్టబద్ధమైన అధికారుల నుంచి రావాలి. లేకపోతే జెలెన్ స్కీ తర్వాత ఎవరు వచ్చినా దానిని చెత్తబుట్టలో వేస్తారు’ అని వ్యాఖ్యలు చేశారు.

‘యుద్ధం’ ఆపితే నోబెల్ రాదు: ట్రంప్ అదే ‘మధ్యవర్తిత్వ’ వాదనలు
న్యూఢిల్లీ: భారత్- పాకిస్తాన్ మధ్య శాంతి నెల కొల్పోందుకు తాను మధ్యవర్తిత్వం వహించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు వాదనకు దిగారు. గత నెలలో భారత్- పాక్ దేశాల మధ్య భీకరంగా జరగబోయే యుద్ధాన్ని ఆపినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి లభించదని ట్రంప్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల భారత్-పాక్ మధ్య ట్రంప్ మధ్యవర్తిత్వం లేదని, ఇది ప్రత్యక్ష సైనిక చర్చల ఫలితమని స్పష్టం చేసినప్పటికీ, అధ్యక్షుడు ట్రంప్ మరోమారు ఇదేవిధమైన వ్యాఖ్యలు చేశారు.‘భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపినందుకు నాకు నోబెల్ బహుమతి లభించదు. సెర్బియా- కొసావో మధ్య యుద్ధాన్ని ఆపినందుకు నాకు నోబెల్ బహుమతి రాదు. ఈజిప్ట్- ఇథియోపియా మధ్య శాంతిని నెలకొల్పినందుకు కూడా నోబెల్ శాంతి బహుమతి దక్కదు. మధ్యప్రాచ్యంలో అబ్రహం ఒప్పందాలను చేసినందుకు కూడా నాకు నోబెల్ శాంతి బహుమతి లభించదు’ అంటూ అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఒక పోస్టులో పేర్కొన్నారు. అలాగే తాను రష్యా/ఉక్రెయిన్, ఇజ్రాయెల్/ఇరాన్తో సహా ఎక్కడ ఏమి చేసినా తనకు నోబెల్ శాంతి బహుమతి రాదని, ఈ అంశాల్లో ఫలితాలు ఏమైనా కావచ్చు. ప్రజలకు అంతా తెలుసు. తనకు ఇదే ముఖ్యమని ట్రంప్ అన్నారు.డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో- రువాండా మధ్య వాషింగ్టన్లో శాంతి ఒప్పందం కుదిరిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విధమైన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆఫ్రికాకు ఘనమైన దినం. నిజం చెప్పాలంటే, ప్రపంచానికే గొప్ప దినం. దీనికి కూడా తనకు నోబెల్ శాంతి బహుమతి లభించదు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా న్యూఢిల్లీ- ఇస్లామాబాద్ మధ్య ఉద్రిక్తతలను అరికట్టడంలో అమెరికా పాత్రను భారతదేశం తిరస్కరిస్తూ వస్తోంది.ఇది కూడా చదవండి: International Yoga Day: ఉత్సాహంగా జపాన్ ప్రధాని భార్య యోషికో యోగాసనాలు

International Yoga Day: ఉత్సాహంగా జపాన్ ప్రధాని భార్య యోషికో యోగాసనాలు
టోక్యో: ఈరోజు (జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పలు యోగా సంబంధిత కార్యక్రమాలు జరుగుతున్నాయి. జపాన్లోని టోక్యోలోగల భారత రాయబార కార్యాలయంలో11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెండువేల మందికిపైగా ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా భార్య యోషికో ఇషిబా యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోషికో ఇషిబా అందరితో పాటు యోగా ఆసనాలు వేయడంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయా భార్య సతోకో ఇవాయా కూడా యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఐడీవై ఈవెంట్ భారత్- జపాన్ దేశాల సాంస్కృతిక, దౌత్య సంబంధాలకు ప్రతీకగా నిలిచింది. జపాన్లో భారత రాయబారి సీబీ జార్జ్ మాట్లాడుతూ మనకు శారీరక, మానసిక ఆధ్యాత్మిక శ్రేయస్సును పెంపొందించడంలో యోగా ఎంతగానో దోహదపడుతుందన్నారు.Glimpses of the 11th International Day of Yoga 2025 in Tokyo! 🇮🇳🧘♀️🇯🇵Inaugurated by Madam Yoshiko Ishiba, Spouse of Hon’ble PM of Japan.Occasion was graced by Madam Satoko Iwaya, Spouse of the Hon’ble Foreign Minister. Ambassador @AmbSibiGeorge addressed the gathering of… pic.twitter.com/3GZBm6m7DV— India in Japanインド大使館 (@IndianEmbTokyo) June 21, 2025టోక్యోలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో రెండు వేలకు పైగా యోగా ఔత్సాహికులు పాల్గొనగా, రెవరెండ్ మైయోకెన్ హయామా, రెవరెండ్ టోమోహిరో కిమురా, సీనియర్ ప్రభుత్వ అధికారులు, రాయబారులు, దౌత్యవేత్తలు పాల్గొన్నారు. ఈ యోగా దినోత్సవ కార్యక్రమ వివరాలను భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్’లో తెలిపింది.ఇది కూడా చదవండి: ఇరాన్ కీలక డ్రోన్ కమాండర్ హతం: ఇజ్రాయెల్ వెల్లడి

ఇరాన్ కీలక డ్రోన్ కమాండర్ హతం: ఇజ్రాయెల్ వెల్లడి
జెరూసలేం: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. శుక్రవారం ఇరుదేశాలు వైమానిక దాడులకు దిగాయి. ఈ యుద్ధం ఎనిమిదవ రోజుకు చేరింది. మరోవైపు అణు చర్చలను పునరుద్ధరించేందుకు, ఘర్షణలు మరింత తీవ్రతరం కాకుండా నిరోధించేందుకు యూరోపియన్ దౌత్యవేత్తలు జెనీవాలో సమావేశమైన తరుణంలోనూ ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది.ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు పశ్చిమ ఇరాన్లోని క్షిపణి మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. టెహ్రాన్ హైఫా, బీర్షెబా వద్ద భీకరంగా క్షిపణుల దాడి జరిగిందని, దీనిలో ఇరానియన్ కీలక డ్రోన్ కమాండర్ హతమయ్యాడని పేర్కొంది. మరోవైపు ఇరాన్ మానవ హక్కుల కార్యకర్తల వార్తా సంస్థ.. ఇరాన్లో ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ 657 మంది మృతిచెందగా, రెండువేల మందికి పైగా జనం గాయపడ్డారని తెలిపింది. కాగా జెనీవాలో, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఈయూ విదేశాంగ విధాన చీఫ్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ మంత్రులతో చర్చలు జరిపారు.యూరోపియన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ ‘ఇరాన్.. యూరప్తో మాట్లాడటానికి ఇష్టపడటం లేదని, వారు తమతో మాట్లాడాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. యుద్ధ తీవ్రతను తగ్గించడానికి లేదా అమెరికా జోక్యాన్ని అనుమతించేందుకు రెండు వారాల గడువు మాత్రమే ఉందని ట్రంప్.. టెహ్రాన్(ఇరాన్)ను హెచ్చరించారు. ఇదే సమయంలో ఇరాన్ అణు సామర్థ్యాన్ని నిర్వీర్యం చేసేందుకు ఇజ్రాయెల్ సుదీర్ఘ ప్రచారం నిర్వహించనున్నట్లు ప్రకటించింది.ఇది కూడా చదవండి: మహిళలపై నాడు అభ్యంతరకర పోస్టులు.. చిక్కుల్లో ఇరాన్ సుప్రీం
జాతీయం

‘ఇది విలువల లొంగుబాటు’.. కేంద్రంపై సోనియా మండిపాటు
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్ణణల విషయంలో భారత్ మౌనం వహించడం అనేది దౌత్యపరమైన లోపాన్ని ఎత్తిచూపుతున్నదని, ఇది దేశ నైతిక, వ్యూహాత్మక సంప్రదాయాల నిష్క్రమణను సూచిస్తుందని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. ‘ది హిందూ’లో ఆమె జూన్ 13న ఇరాన్ భూభాగంపై జరిగిన ఇజ్రాయెల్ సైనిక దాడిని చట్టవిరుద్ధమైనదిగా, సార్వభౌమాధికార ఉల్లంఘనగా అభివర్ణించారు.రెండు ప్రాంతీయ శక్తుల మధ్య జరుగుతున్న ప్రతీకార డ్రోన్, క్షిపణి, వైమానిక దాడులు మధ్యప్రాచ్యంలో ప్రమాదకరమైన పరిస్థితులను తీసుకువస్తున్నాయి. దీనిపై స్పందించిన భారత జాతీయ కాంగ్రెస్ ఈ బాంబు దాడులను, ఇరాన్ గడ్డపై చోటుచేసుకున్న హత్యలను ఖండించింది. ఇవి ప్రాంతీయంగానూ ప్రపంచస్థాయిలోనూ పొంచివున్న ముప్పు తీవ్రతను సూచిస్తాయని పేర్కొంది. ఇటువంటి చర్యలు అస్థిరతను మరింత తీవ్రతరం చేస్తాయని, మరిన్ని సంఘర్షణకు బీజం వేస్తాయని సోనియా గాంధీ ఆ వ్యాసంలో పేర్కొన్నారు.సోనియా గాంధీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కూడా విమర్శలు గుప్పించారు. ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తూ, అందుకు అనుకూలంగా తన సొంత నిఘా వర్గాలను ఏర్పాటు చేసుకున్నారన్నారు. ట్రంప్ గతంలో పలు యుద్ధాలు, సైనిక-పారిశ్రామిక సముదాయ శక్తుల గురించి హెచ్చరించారని, అయితే ఇప్పుడు ఇరాక్ యుద్ధానికి దారితీసిన తప్పులను పునరావృతం చేస్తున్నట్లు కనిపిస్తోందని సోనియా పేర్కొన్నారు. ఈ వ్యాసంలో సోనియా భారతదేశానికున్న ప్రత్యేకమైన దౌత్య స్థానానికి ప్రాధాన్యతనిచ్చారు.ఇరాన్ భారతదేశానికి దీర్ఘకాల మిత్రదేశమని, జమ్మూ కశ్మీర్తో సహా కీలక సమయాల్లో ఇరాన్ మద్దతు ఉన్నదన్నారు. 1994లో కాశ్మీర్ సమస్యపై యూఎన్ కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్లో భారతదేశాన్ని విమర్శించే తీర్మానాన్ని నిరోధించడంలో ఇరాన్ సహాయపడిందని సోనియా గాంధీ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో తన దౌత్య పాత్రను పునరుద్ఘాటించాలని భారత ప్రభుత్వానికి సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయెల్- ఇరాన్ యుద్దంలో భారత్ కల్పించుకోకపోవడాన్ని ఆమె విలువ లొంగుబాటుగా ఉన్నదని విమర్శించారు. ఈ విషయంలో భారత్ వైఖరి స్పష్టంగా ఉండాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి, అందుబాటులో ఉన్న అన్ని దౌత్య మార్గాలను అనుసరించాలని ఆమె సూచించారు. ఇది కూడా చదవండి: ‘యుద్ధం’ ఆపితే నోబెల్ రాదు: ట్రంప్ అదే ‘మధ్యవర్తిత్వ’ వాదనలు

భార్య ఫోన్ మాట్లాడుతుందని.. భర్త దారుణం..
యశవంతపుర(కర్ణాటక): నిత్యం సెల్ఫోన్లో మాట్లాడుతోందని ఓ వ్యక్తి తన భార్యను హత మార్చాడు. ఈ ఘటన ఉడుపి జిల్లా బ్రహ్మావర తాలూకా హిలియాణ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో గణేశ్, రేఖ దంపతులు నివాసం ఉంటున్నారు. ఇటీవల రేఖకు కొత్త సెల్ఫోన్ కొనిచ్చాడు. దీంతో బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి గంటల కొద్దీ మాట్లాడేది. ఎక్కువ సమయం ఫోన్లో మాట్లాడవద్దని భర్త హెచ్చరిస్తుండటంతో గొడవ జరిగేది. గురువారం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన గణేష్ భార్యతో గొడవకు దిగి కత్తితో కడుపు భాగంలో పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఉడుపి జిల్లా బ్రహ్మావర తాలూకా శంకరనారాయణ పోలీసులు గణ్శ్ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ హరిరామ్ శంకర్ పరిశీలించారు.

రూ.500 లంచం తీసుకున్నందుకు పదేళ్ల తర్వాత జైలు
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): రూ.500 లంచం తీసుకున్న పాపానికి రిటైర్డ్ అయిన 10 సంవత్సరాలకు ఒక విలేజ్ అకౌంటెంట్కు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ సంఘటన బెళగావిలో చోటుచేసుకుంది. నాగేశ్ శివంగేకర్ 30 సంవత్సరాల క్రితం విధుల్లో ఉన్న సమయంలో బెళగావి తాలూకా కడోలి గ్రామానికి చెందిన లక్ష్మణ్ ఓ పని కోసం నాగేశ్ను ఆశ్రయించగా రూ.500 లంచం డిమాండ్ చేశాడు. దీంతో లక్ష్మణ్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశాడు. పథకం ప్రకారం లోకాయుక్త పోలీసులు దాడి చేసి నాగేశ్ను అరెస్టు చేశారు. 2006లో నాగేశ్కు కోర్టు రూ.వెయ్యి జరిమానా, ఏడాది జైలు శిక్ష విధించింది. తర్వాత ధార్వాడ హైకోర్టును ఆశ్రయించగా శిక్షను రద్దు చేసింది. అయితే అప్పటికే నాగేశ్ రిటైర్ య్యారు. అయితే లోకాయుక్త సుప్రీకోర్టుకు అప్పీలుకు వెళ్లింది. నాగేశ్కు పది సంవత్సరాల జైలు శిక్షను కోర్టు ఖరారు చేసింది. ఆయన్ను బెళగావి హిండలగా జైలుకు తరలించారు. కాగా ఫిర్యాదు చేసిన వ్యక్తి మృతి చెంది 5ఏళ్లు కావడం గమనార్హం.

Air India Flight: విమానంలో వైద్యురాలు హల్చల్
కర్ణాటక: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో క్యాబిన్ సిబ్బందితో వాగ్వాదం జరిపి నిందించిన ప్రయాణికురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన కెంపేగౌడ ఎయిర్పోర్టులో చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కెంపేగౌడ ఎయిర్పోర్టు నుంచి సూరత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు బయలుదేరిన ఐఎక్స్ 2749 విమానం బయలుదేరడానికి కొన్ని క్షణాల ముందు ఈ సంఘటన జరిగింది. యలహంక సమీపంలోని శివనహళ్లి నివాసి వైద్యురాలు వ్యాస్ హిరాల్ మోహన్ భాయ్ తనకు కేటాయించిన సీట్ నంబర్– 20లో కూర్చోడానికి ముందు ముందు వరుసలో ఉన్న సీట్లో తన బ్యాగులను ఉంచింది. దీన్ని ప్రశ్నించిన సిబ్బందితో ఆమె తీవ్రంగా వాగ్వాదానికి దిగింది. అందరినీ నిందిస్తూ బాంబు పెట్టి విమానాన్ని పేల్చేస్తానని ఆగ్రహంతో ఊగిపోయింది. పైలట్, విమాన సిబ్బంది ఎంత నచ్చచెప్పినా ఆమె తగ్గలేదు. తోటి ప్రయాణికులతో కూడా గొడవ పడింది. దీంతో విమాన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. #ViralVideo… pic.twitter.com/aQMeuyUyfj— PulseNewsBreaking (@pulsenewsbreak) June 19, 2025
ఎన్ఆర్ఐ

అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్
పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని, ప్రయోజకులైతే కన్న తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అలాగే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని పిల్లలంతా కలలు కంటారు. తమ కల సాకారమైన వేళ వారి సంతోషానికి అవధులే ఉండవు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.అమెరికాలోని వాల్మార్ట్లో పనిచేస్తున్న భారతీయ యువతి తన తల్లిదండ్రులను వాల్మార్ట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ మీటింగ్ రూం, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇలా అన్ని చోట్లకు ఆనందంగా తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇది ఆన్లైన్లో పలువురి హృదయాలను తాకింది. View this post on Instagram A post shared by Devshree Bharatia (@devshree.17) వాల్మార్ట్ యుఎస్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దేవశ్రీ భారతియా తన పేరెంట్స్ను ఆఫీసుకు తీసుకెళ్లింది. లగ్జరీ ఆఫీసులోని అణువణువును వారికి పరిచేసింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తల్లి దండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోయారు ఈ చిన్న క్లిప్ వీడియోకు 10.1 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. 24,000 కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి. ‘‘నా తల్లిదండ్రులు USA లోని నా వాల్మార్ట్ కార్యాలయాన్ని మొదటిసారి సందర్శించారు. ఇంత విలాసవంతమైన ఆఫీసును ఎప్పుడూ చూడలేదు. ఇక్కడి సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలా సంతోషించారు. బిడ్డలు ఆశపడే సంతోషంతో గర్వించే తల్లిదండ్రులు’’ అంటూ దేవ్శ్రీ పోస్ట్ చేసింది.చాలా మంది నెటిజనులు సంతోషంగా స్పందించారు. ‘‘పిల్లలకు తల్లిదండ్రులకు, ఇది చాలా గొప్ప అనుభవం. వారి చిరునవ్వులు ఎప్పటికీ శాశ్వతం. వారి కళ్లలో మెరుపు, సంతోషం వీడియో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. "ప్రతి కొడుకు/కూతురు కల" అని రాశాడు. " సూపర్ ఈ అనుభూతి ఎప్పటికీ దిబెస్ట్ అని మరొకరు వ్యాఖ్యానించారు. "ఇది నన్ను భావోద్వేగానికి గురిచేసింది - ప్రతి తల్లిదండ్రులు ఈ క్షణానికి అర్హులు" చాలా బావుంది!! అభినందనలు!! ప్రతి బిడ్డకు అత్యంత గర్వకారణమైన క్షణం!!" ఇలా నెటిజన్లు కామెంట్ చేశారు. అంతేకాదు తాము కూడా ఒకరోజు ఇలాంటి విజయాన్ని సాధించాలి అంటూ ప్రేరణ పొందడం విశేషం.

వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగంలో నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం స్టేట్ కన్వీనర్లు, కో– కన్వీనర్లను పార్టీ నియమించింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం తెలిపింది. ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాలకు ఈ నియామకాలు చేపట్టింది. ⇒ న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర కన్వీనర్గా ఎల్లా అమర్నాథ్రెడ్డి⇒ కో-కన్వీనర్గా అంకిరెడ్డిపల్లి శివ రంగారెడ్డి⇒ విక్టోరియా రాష్ట్ర కన్వీనర్గా మర్రి కృష్ణదత్త రెడ్డి⇒ కో-కన్వీనర్గా కందుల భరత్⇒ క్వీన్స్ ల్యాండ్ రాష్ట్ర కన్వీనర్గా యెరువూరి బ్రహ్మారెడ్డి⇒ కో-కన్వీనర్గా వీరంరెడ్డి శ్రీధర్ రెడ్డి⇒ సౌత్ ఆస్ట్రేలియా కన్వీనర్గా బొంతు వంశీధర్ రెడ్డి⇒ కో-కన్వీనర్గా ఆలేటి నరసింహాచారి

ఎన్నారై న్యూస్: డల్లాస్లో గోరటి వెంకన్న మాట-పాట జోష్
అమెరికాలో తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగు సాహిత్యంలో కవితా వైభవం.. డా. గోరటి వెంకన్న మాట – పాట సాహితీసభ జరిగింది. ఆటా , డాటా , డి–టాబ్స్, జిటిఎ, నాట్స్ , టాన్ టెక్స్ , టిపాడ్ సంస్థల సహకారంతో.. డాలస్ లో పెద్ద సంఖ్యలో సాహిత్యాభిమానులతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగింది. గోరటి వెంకన్న కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయనకు మనకాలపు మహాకవి అనే బిరుదును ప్రదానం చేశారు. సన్మానపత్రం, కిరీటం, దుశ్శాలువాతో, పుష్పగుచ్చాలతో అందరి హర్షాతిరేకాలమధ్య ఘనంగా సన్మానించారు. అంతకు ముందు.. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అందరి హర్షధ్వానాల మధ్య గోరటి వెంకన్న ను వేదికపైకి ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డా. గోరటి వెంకన్న అనేక పాటలను గానం చేశారు. గల్లీ చిన్నది, గరీబోళ్ల కథ పెద్దది లాంటి ఎన్నో పాటలతో రెండున్నర గంటలపాటు అందరినీ మంత్రముగ్దుల్ని చేశారు.డా. గోరటి వెంకన్న మాట్లాడుతూ.. ప్రసాద్ తోటకూర సభానిర్వహణ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుందని, తాను చిందులెయ్యకుండా నిలబెట్టి రెండున్నర గంటలపాటు పాటలను, దానిలో ఉన్న సాహిత్యాన్ని రాబట్టిన ఘనత ప్రసాద్ దేనని, ఇలాంటి కార్యక్రమం చెయ్యడం ఇదే తొలిసారి అన్నారు. ఎంతో ప్రేమతో అన్ని సంఘాలను ఒకే వేదికమీదకు తీసుకువచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన డా.తోటకూర ప్రసాద్ కు, వివిధ సంఘాల ప్రతినిధులకు, అధిక సంఖ్యలో తరలివచ్చిన సాహిత్యాభిలాషులకు పేరు పేరునా గోరటి వెంకన్న కృతజ్ఞతలు తెలియజేశారు.

అమెరికాలో తెలుగు యువకుడి విషాదం
చిలుకూరు: ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామ యువకుడు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువులు తెలిపిన వివరాలివి. బేతవోలు గ్రామానికి చెందిన జల్లా నాగేశ్వరరావు చిన్న కుమారుడు జల్లా నరేందర్ (25) అలియాస్ నవీన్ బీటెక్ పూర్తిచేసి నాలుగేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ మిస్సోరీ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరీలో ఎంఎస్ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు.ఈ నెల 1వ తేదీన (భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు) తన రూమ్ ఫ్రెండ్స్తో కలిసి కారులో వెళ్తుండగా.. కాన్సాస్ సిటీ వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు వెనక సీటులో కూర్చున్న నరేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి నరేందర్ మృతదేహం చేరగానే, సోమవారం బేతవోలులో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన తమ కుమారుడు విగతజీవిగా వస్తుండడంతో నరేందర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: అమెరికా ఎయిర్పోర్ట్లో భారత విద్యార్థిపై దాష్టీకం
క్రైమ్

మాదాపూర్లో మరో భారీ మోసం
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్లో మరో భారీ మోసం బయటపడింది. బై బ్యాక్ పేరుతో ఏవీ ఇన్ఫ్రా రూ.500 కోట్లు వసూలు చేసింది. పెట్టుబడి పెట్టిన వారికి డబుల్ అమౌంట్ ఇస్తామంటూ మోసానికి పాల్పడింది. నారాయణ ఖేడ్, యాదగిరిగుట్ట ప్రాంతాల్లో వెంచర్లు అంటూ మోసానికి తెరలేపింది. అమౌంట్ ఇవ్వకపోతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామంటూ హామీ ఇచ్చింది.సుమారు 500 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 18 నెలలకు డబుల్ అమౌంట్ ఇస్తానని భారీగా వసూలు చేశారు. నెలలు గడుస్తున్నా.. డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు ప్రశ్నించడంతో మరో చోట ప్రాజెక్టు అంటూ మోసం చేశారు. దీంతో బాధితులు సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం, మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

డబ్బులు ఇస్తావా.. నేను అడిగింది చేస్తావా..
సనత్నగర్(హైదరాబాద్): కోరిక తీర్చాలంటూ మహిళను వేధిస్తున్న వ్యక్తిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేట శ్యాంలాల్ బిల్డింగ్స్ ప్రాంతానికి చెందిన మహిళ (26) బంజారాహిల్స్లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేసి 2023లో మానేసింది. ఆ సమయంలో ఆమెకు ప్రైవేట్ సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్న పనీశ్ (52) పరిచయమయ్యాడు. ఆమెను తన కూతురిలా భావిస్తున్నానని చెప్పేవాడు. అవసరాలకు డబ్బు ఇచ్చేవాడు. 2024లో మహిళ హైటెక్ సిటీలోని మరో బ్యాంకులో పనిలో చేరింది. కాగా ఏప్రిల్ 2024 నుంచి మనీష్ ప్రవర్తనలో మార్పును బాధితురాలు గుర్తించింది. తరచూ ఆమెకు వాట్సప్లో తాను ఇచ్చిన డబ్బు ఇవ్వాలని, లేకుంటే తన కోరిక తీర్చాలని వేధించడం మొదలుపెట్టాడు. అసభ్యకరంగా దూషిస్తూ వాట్సప్ సందేశాలు పంపేవాడు. ఆమె పనిచేస్తున్న బ్యాంక్కు వెళ్లి అక్కడి సిబ్బందికి బాధితురాలి గురించి చెడుగా ప్రచారం చేయగా వారు ఆమెను పనిలోకి రావద్దని చెప్పారు. దీంతో బాధితురాలు శనివారం బేగంపేట పీఎస్లో ఫిర్యాదు చేయగా పనీ‹Ùపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భార్య ఫోన్ మాట్లాడుతుందని.. భర్త దారుణం..
యశవంతపుర(కర్ణాటక): నిత్యం సెల్ఫోన్లో మాట్లాడుతోందని ఓ వ్యక్తి తన భార్యను హత మార్చాడు. ఈ ఘటన ఉడుపి జిల్లా బ్రహ్మావర తాలూకా హిలియాణ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో గణేశ్, రేఖ దంపతులు నివాసం ఉంటున్నారు. ఇటీవల రేఖకు కొత్త సెల్ఫోన్ కొనిచ్చాడు. దీంతో బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి గంటల కొద్దీ మాట్లాడేది. ఎక్కువ సమయం ఫోన్లో మాట్లాడవద్దని భర్త హెచ్చరిస్తుండటంతో గొడవ జరిగేది. గురువారం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన గణేష్ భార్యతో గొడవకు దిగి కత్తితో కడుపు భాగంలో పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఉడుపి జిల్లా బ్రహ్మావర తాలూకా శంకరనారాయణ పోలీసులు గణ్శ్ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ హరిరామ్ శంకర్ పరిశీలించారు.

ఎయిరిండియా అంటేనే వణికిపోతోంటే....పేల్చేస్తా అంటూ మహిళ వీరంగం!
ఎయిరిండియా విమానం కూలిన దుర్ఘటన తాలూకు విషాదం మన మనసుల్లోకి తొలగి పోక ముందే ఒక మహిళా ప్రయాణికురాలు అనుచితం ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అసలు ‘విమానం- క్రాష్’ అన్న పదాలు వింటేనే ఉలిక్కి పడుతున్న ప్రస్తుత తరుణంలో స్వల్ప వివాదానికే విమానాన్ని కూలిపోతుంది అంటూ అంటూ నానా గలాటా సృష్టించింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం బయలుదేరడానికి కొన్ని నిమిషాల ముందు జరిగిన ఈ సంఘటన నెట్టింట చర్చకు దారి తీసింది.ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA) నుండి సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరడానికి కొన్ని నిమిషాల ముందు ఈ సంఘటన జరిగింది. బెంగళూరుకు చెందిన మహిళా ప్రయాణీకురాలు, వైద్యురాలు వ్యాస్ హిరాల్ మోహన్భాయ్ (36) బ్యాగ్ స్థలం కోసం విమాన సిబ్బందితో గొడవకు దిగింది. విమానంలోని తన సీటు 20Fలో కూర్చునే ముందు మొదటి వరుసలో తన బ్యాగ్ వదిలి వెళ్ళిపోయింది. దీంతో దీన్ని ఆమె సీటు దగ్గర ఉన్న ఓవర్ హెడ్ కంపార్ట్మెంట్లో ఉంచమని సిబ్బంది కోరారు. అంతే ఆవేశంతో ఊగిపోతూ , "విమానం కూలిపోతుంది" అంటూ గొడవకు దిగింది. క్యాబిన్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించింది. ఇది తప్పు అన్న తోటి ప్రయాణీకులపై కూడా అరిచిందిట. దీంతో పైలట్ , సిబ్బంది భద్రతా సిబ్బంది మరియు CISF సిబ్బందికి సమాచారం అందించారు, వారు ఆమెను విమానం నుండి కిందికి దింపేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విమానాన్ని కూల్చివేస్తామని బెదిరించిందన్న ఆరోపణలపై ఆ మహిళా వైద్యుడిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.