ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి
హన్మకొండ: బ్రేక్ డౌన్లు, ట్రిప్పింగ్లు జరిగినప్పుడు ప్రతీ చోట ప్రత్యామ్నాయ సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేసుకోవాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. సోమవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి నోడల్ ఆఫీసర్లు, సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేని చోట కొత్త లైన్లు నిర్మించి అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కనిష్ట స్థాయికి బ్రేక్ డౌన్లు, ట్రిప్పింగ్లు తగ్గించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. పొడవాటి లైన్లు, ట్యాప్పింగ్ లైన్లు ఉన్న చోట ఫాల్ట్ ప్యాసెజ్ ఇండికేటర్లు (ఎఫ్పీఐ) బిగించాలన్నారు. తద్వారా అంతరాయాలు తగ్గే అవకాశం ఉంటుందన్నారు. ట్రాన్స్ఫార్మర్లు వైఫల్యం చెందిన వెంటనే మార్చాలన్నారు. అలాగే, రోలింగ్ స్టాక్ పెంచుకోవాలన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి ప్రతి ఒక్కరూ నిబద్దతతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్, వి.మోహన్ రావు, సీజీఎంలు కె.తిరుమల రావు, టి.మధుసూదన్, రాజు చౌహాన్, కె.కిషన్, కెఎన్ గుట్ట, జీఎంలు పాల్గొన్నారు.
ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment