నిధులు వెనక్కి! | - | Sakshi
Sakshi News home page

నిధులు వెనక్కి!

Apr 3 2025 1:20 AM | Updated on Apr 3 2025 1:20 AM

నిధుల

నిధులు వెనక్కి!

గురువారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

8లోu

సాక్షి, మహబూబాబాద్‌: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్‌ కాంపౌండ్‌ పనులకు మంజూరైన నిధులను సకాలంలో వినియోగించలేక పోయారు. గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన నిధులు ఖర్చు చేయక నీరస పడ్డారు. దీంతో గతంలో రాష్ట్రంలో నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్న జిల్లా అమాంతం కిందికి పడిపోయింది. రాష్ట్రంలో అట్టడుగు స్థాయిలోకి వెళ్లింది. ఇందుకు అధికారులే కారణమని చెబుతూ చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ఉన్నతాధికారులు సిద్ధమయినట్లు తెలిసింది.

పడిపోయిన పనిదినాలు..

ప్రతీసారి ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యానికి మించి పనిదినాలు నమోదు చేసే మానుకోట జిల్లా గడిచిన ఆర్థిక సంవత్సరంలో చతికిల పడింది. జిల్లాలో జాబ్‌కార్డులు 2.51 లక్షలు ఉండగా ఇందులో 4.55 లక్షల మంది కూలీల పేర్లు నమోదు చేశారు. అయితే ఇందులో 1.42 లక్షల జాబ్‌ కార్డుల్లోని 2.6 లక్షల మేరకే యాక్టివ్‌ కూలీలు ఉంటారు. దీనిని దృష్టిలో ఉంచుకొని గడిచిన ఏడాది 47 లక్షల పనిదినాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యం నిర్ణయించింది. కానీ మార్చి 31వ తేదీ నాటికి కేవలం 45 లక్షల పనిదినాలు మాత్రమే చేయించగలిగారు.

రూ.18.37కోట్లు వెనక్కి..

పనులు చేయాలి, పల్లెల రూపురేఖలు మార్చాలని అదనపు నిధుల కోసం ప్రయత్నించే జిల్లాలు ఉండగా ప్రభుత్వం నుంచి మంజూరైన నిధులను కూడా సకాలంలో ఖర్చుచేయని దుస్థితిలో మానుకోట జిల్లా ఉంది. ప్రతీ సంవత్సరం మాదిరిగానే.. ఈ ఏడాది ఈజీఎస్‌ పనుల లెక్కల ప్రకారం కూలీలకు చెల్లించిన డబ్బులు (వేజ్‌) 60 శాతం రూ. 85.31 కోట్లు, మెటీరియల్‌ కాంపౌండ్‌ నిధులు 40 శాతం రూ. 56.87 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో రూ. 36.40 కోట్లతో 726 సీసీరోడ్లు పనులు చేయాల్సి ఉండగా గడువు ముగిసే వరకు కేవలం 525 పనులు మాత్రమే చేశారు. అదేవిధంగా మిగిలిన నిధులతో గ్రామ పంచాయతీ భవనాలు, 16 అంగన్‌వాడీ భవనాల నిర్మాణం చేపట్టాలి. కానీ వాటిల్లో సగానికి పైగా పనులు ముందుకు సాగలేదు. వీటితోపాటు మండలాల పరిధిలో చేపట్టే పశువుల పాకలు, కిచెన్‌ షెడ్లు, గొర్రెల పాకలు, చేపల చెరువులు, పౌల్ట్రీ ఫామ్స్‌ మొదలైన పనులు ముందుకు సాగలేదు. దీంతో జిల్లాకు మంజూరైన మెటీరియల్‌ కాంపౌండ్‌ నిధుల మొత్తం రూ. 56.87కోట్లకు గాను రూ. 38.50 కోట్లు ఖర్చు చేయగా మిగిలిన రూ. 18.37కోట్లు వెనక్కి వెళ్లాయి. రాష్ట్రంలో సగటున వేజ్‌ కాంపౌండ్‌ నిధులు 39.46శాతం ఉండగా లక్ష్యానికి మించి 40.69 శాతంతో ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో ఉండగా 31.10 శాతంతో మహబూబాబాద్‌ అట్టడుగు స్థానంలో నిలిచింది.

ఆలస్యంగా పనులు మంజూరు..

సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు పదవిలో లేకపోవడంతో పనులు చేసేందుకు ఎక్కువ మంది ముందుకు రాలేదు. ఆలస్యంగా పనులు మంజూరు కావడంతోపాటు, ఇసుక దొరకక పోవడంతో పనులు వేగంగా చేయలేకపోయాం. దీంతో సకాలంలో నిధులు ఖర్చు కాలేదు.

– విద్యాసాగర్‌, ఈఈ పంచాయతీరాజ్‌

జిల్లాలో జాబ్‌కార్డులు: 2.51 లక్షలు

నమోదైన కూలీలు: 4.55 లక్షలు

యాక్టివ్‌ జాబ్‌కార్డులు: 1.42 లక్షలు

పనిచేస్తున్న కూలీలు: 2.6 లక్షలు

గతఆర్థిక సంవత్సరంలో పనిదినాల లక్ష్యం : 47 లక్షలు

పూర్తి చేసిన పనిదినాలు : 45 లక్షలు

వేజ్‌ కాంపౌండ్‌ నిధులు : రూ. 85.31 కోట్లు

మెటీరియల్‌ కాంపౌండ్‌ నిధులు : రూ. 56.87 కోట్లు

వినియోగించిన మెటీరియల్‌ కాంపౌండ్‌ నిధులు :

రూ. 38.50 కోట్లు

వెనక్కి వెళ్లిన నిధులు : రూ. 18.37 కోట్లు

నిధుల వినియోగంలో రాష్ట్రంలో జిల్లా స్థానం : 31

న్యూస్‌రీల్‌

గడువులోపు పూర్తికాని ఈజీఎస్‌ మెటీరియల్‌ పనులు

గత ఆర్థిక సంవత్సరం

నిధులు రూ.18.37 కోట్లు రిటర్న్‌

పనులు చేయించడంలో

అధికారుల నిర్లక్ష్యం

రాష్ట్రంలోనే అట్టడుగు

స్థానంలో మానుకోట

ముందుకు రాని కాంట్రాక్టర్లు..

పనులు చేసేందుకు పోటీ పడే కాంట్రాక్టర్లు ఈసారి మాత్రం పనులు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ప్రతీసారి ఇలాగే ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు కలుగచేసుకొనే వారు. పనులు చేసే కాంట్రాక్టర్లను పిలిపించి పనులు చేసేలా ఒపించేవారు. త్వరగా బిల్లులు ఇప్పిస్తామని నమ్మకం కుదిరేలా మాట్లాడి పనులు చేయించేవారు. కానీ ఈసారి జిల్లాలోని పంచాయతీ రాజ్‌శాఖ అధికారులు ఆ దిశగా ప్రయత్నించలేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో పనులు చేసేందుకు ముందుకు రాని కాంట్రాక్టర్లతోపాటు పనులు చేసేవారు కూడా వేగంగా పనులు చేయలేదు. ఈ పరిస్థితిలో ఎప్పుడు ముందు వరుసలో ఉండే జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. ఇందుకు కారణమైన అధికారులపై రాష్ట్ర ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసి శాఖాపరమైన చర్యలకు సిద్ధం అవుతున్నట్లు తెలిసింది.

నిధులు వెనక్కి!1
1/2

నిధులు వెనక్కి!

నిధులు వెనక్కి!2
2/2

నిధులు వెనక్కి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement