-
నీడ లేదు.. నీరు లేదు
డోర్నకల్: డోర్నకల్లో ఏడు నెలలక్రితం ఫైర్స్టేషన్ ఏర్పాటు చేశారు. అయితే వసతులు కల్పించకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. సొంత భవనం లేకపోవడంతో బైపాస్రోడ్డులోని బీసీ బాలికల వసతి భవనంలో ఫైర్స్టేషన్ ఏర్పాటు చేశారు. అక్కడ సరైన వసతులు లేవు. ఫైరింజన్, టియర్ గ్యాస్ బుల్లెట్ వాహనం కోసం షెడ్డు ఏర్పాటు చేయలేదు. అలాగే ఏదైనా ప్రమాదం జరిగితే స్థానికంగా నీటి వసతి లేకపోవడంతో బయటి నుంచే నీరు నిపుంపుకొని వెళ్తున్నారు. కాగా సొంత భవనం నిర్మాణం చేపడితే సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. అమ్మపాలెం సమీపంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు కోసం సుమారు 10 గుంటల స్థలాన్ని రెవెన్యూశాఖ కేటాయించినా భవన నిర్మాణ పనులు నేటికీ ప్రారంభం కాలేదు. నేటికీ 18 ప్రమాదాలు.. గత సంవత్సరం అక్టోబర్ 6న డోర్నకల్ ఫైర్ స్టేషన్ను అప్పటి రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్చువల్గా, నాటి ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ నేరుగా ప్రారంభించారు. ప్రస్తుతం ఫైర్ స్టేషన్ కొనసాగుతున్న బాలికల వసతి భవనంలో నీటి వసతి లేదు. సిబ్బంది అవసరాల కోసం మాత్రమే మిషన్ భగీరథ పైపునకు కనెక్షన్ ఏర్పాటు చేశారు. కాగా ప్రమాదాలు జరిగినప్పుడు బతకమ్మ పార్కు నుంచి ట్యాంక్లో నీటిని నింపుతున్నారు. ఫైర్స్టేషన్ ఏర్పడి నాటినుంచి ఇప్పటి వరకు 18 అగ్నిప్రమాదాలు జరుగగా.. అక్కడి నుంచే నీటిని తీసుకెళ్లారు. షెడ్డు లేకపోవడంతో.. ఫైరింజన్తో పాటు టియర్ గ్యాస్ బుల్లెట్ వాహనాన్ని నిలిపేందుకు షెడ్డు లేకపోవడంతో ఎండలోనే నిలుపుతున్నారు. ఇక్కడ విధులు నిర్వహించే సిబ్బంది అరకొర వసతులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవనానికి ప్రహరీతో పాటు తలుపులు సక్రమంగా లేకపోవడంతో కోతుల బెడదతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇక్కడ విదులు నిర్వహించాల్సిన స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ట్రై నింగ్లో ఉండటంతో మహబూబాబాద్ ఫైర్ అధికారి ఇన్చా ర్జ్ బాధ్యతలు చేపడుతున్నారు. కాగా అధికారులు వెంటనే స్పందించి ఫైర్ స్టేషన్ భవన నిర్మాణ పనులు ప్రాంరభించాలని స్థానికులు కోరుతున్నారు. డోర్నకల్ ఫైర్స్టేషన్లో వసతుల కొరత బీసీ బాలికల వసతి భవనంలో కొనసాగుతున్న కార్యాలయం ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తున్న ఫైరింజన్ ప్రమాదం జరిగితే బయటి నుంచి నీటి తరలింపు నేటికీ ప్రారంభం కాని సొంత భవన నిర్మాణం -
జనజీవన స్రవంతిలో కలవండి
ములుగు: మావోయిస్టు జీవితాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని ములుగు ఎస్పీ శబరీష్ సూచించారు. ములుగు జిల్లా వాజేడు మండలం ప్రగళ్లపల్లి గ్రామానికి చెందిన పుల్లూరు నాగరాజు అలియాస్ జగత్, సీపీఐ మావోయిస్టు పార్టీ రెండో సీఆర్సీ ఏ సెక్షన్ కమాండర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బూర్గంపాడు గ్రామానికి చెందిన నూప భీమా అలియాస్ సంజు, రెండో సీఆర్సీ పీపీసీఎం/ఏసీఎం భీమా భార్య సోని పోలీసుల ముందు లొంగిపోయారు. కాగా, వారిపై ఉన్న నగదు రివార్డు మొత్తాన్ని ఎస్పీ అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రభుత్వ యంత్రాంగం కల్పిస్తున్న భరోసాతో చాలామంది లొంగిపోతున్నట్లుగా వాగ్మూలం ఇచ్చారన్నారు. -
ఎండుతున్న ‘హరితహారం’
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. మానుకోట నుంచి జమాండ్లపల్లికి వెళ్లే జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలకు నీరందడం లేదు. దీంతో అవి ఎండిపోతున్నాయి. ఇప్పటికై నా మొక్కలకు నీరందించి బతికించాలని వన ప్రేమికులు కోరుతున్నారు. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయాలి ● కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ మహబూబాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్టొప్పో, డేవిడ్తో కలిసి పోస్టల్ బ్యాలెట్లు, పోలింగ్ కేంద్రాలు, తదితర విషయాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలన్నారు. సమీక్షలో ఆర్డీఓలు అలివేలు, నర్సింహారావు, తహసీలార్లు తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రం సందర్శన కురవి: సీరోలు మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీఏఓ అభిమన్యుడు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొచ్చే ముందు శుభ్రం చేయాలని సూచించారు. మట్టి పెళ్లలు, చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ జైశ్రీ, డీపీఎం నళిని, ఏపీఎం సత్యనారాయణ, ఏఓ మంజుఖాన్, సీసీ రామారావు, ఏఈఓ శిరీష, రైతులు పాల్గొన్నారు. స్కానింగ్ సెంటర్లకు షోకాజ్ నోటీసులు నెహ్రూసెంటర్: ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్ల నిర్వహణ, పరిసరాలు, వార్డులు అపరిశుభ్రంగా ఉన్నాయని డీఎంహెచ్ఓ కళావతిబాయి అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లోని ప్రతివార్డును పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఆయుష్ ఆస్పత్రి, ఆరోగ్య ఆస్పత్రిలోని స్కానింగ్ సెంటర్, రికార్డుల నిర్వహణ సక్రమంగా లేనందున షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ప్రోగ్రాం అధికారి బిందుశ్రీ, డీపీహెచ్ఎన్ కావేటి మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న వర్క్షాప్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వర్క్షాప్ రెండోరోజు శుక్రవారం కొనసాగింది. యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ పి వరలక్ష్మి మాట్లాడుతూ.. సరైన పరిశోధన అంశం ఎంపికతోనే పరిశోధనపై జిజ్ఞాస పెరుగుతుందన్నారు. పరిశోధన అంశాలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కామర్స్కళాశాల ప్రిన్సిపాల్ పి.అమరవేణి పాల్గొన్నారు. -
మంత్రులు ఏమన్నారంటే..
మహబూబాబాద్: కాంగ్రెస్పార్టీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ నామినేషన్ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ అధ్యక్షతన నిర్వహించిన జన జాతర బహిరంగ సభలో మంత్రులు మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు నోరు దగ్గర పెట్టుకోవాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలి. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయారు. రెండుసార్లు పీఎంగా రాహుల్గాంధీకి అవకాశం వచ్చినా తీసుకోలేదు. మాజీ సీఎం కేసీఆర్.. సీఎం రేవంత్రెడ్డిని లిల్లిపుట్టు అని సంభోదించారు.. వరంగల్ మిరపకాయ కారం కేసీఆర్కు తెలియదు.. రేవంత్రెడ్డికి తెలుసు.. సమయం వచ్చినప్పుడు ఎక్కడపెట్టాలో అక్కడ పెడుతారన్నారు. కేసీఆర్కు చిప్పకూడు తినే రోజులు దగ్గర పడ్డాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రజల స్వేచ్ఛను హరించింది. దానిలో భాగస్వామ్యం ఉన్న వారందరికీ భవిష్యత్లో శిక్షణ తప్పదు. వంద రోజుల్లోనే రేవంత్ మార్క్ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్రెడ్డి అద్భుత పాలన అందిస్తున్నారు. వంద రోజులలోనే తనదైన మార్కు వేసుకున్నారు. సీఎం పట్టుదల దూర దృష్టి ఉన్న నాయకుడు. గత ప్రభుత్వ చేసిన అప్పులు తీర్చలేరు. లోప భూయిష్టమైన పాలన ఉంది.. సాధ్యం కాదని బీఆర్ఎస్ అనుకున్నారు.. దానిని సీఎం గాడిలో పెట్టారు. 15స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యం. బలరాంనాయక్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. బలరాంనాయక్ భోళా శంకరుడు : మంత్రి ధనసరి సీతక్క గ్యారంటీలకే గ్యారంటీ సీఎం రేవంత్రెడ్డి. అభ్యర్థి బలరాంనాయక్ మోసాలు తెలియని భోళా శంకరుడు. మోదీ ప్రభుత్వం జీఎస్టీల పేరుతో పేదలపై భారం మోపింది. భగవంతుని భక్తుని అనుసంధానమైన అగర్ బత్తిపై కూడా జీ ఎస్టీ విధించింది. దేశం కోసం స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన కుటుంబానికి చెందిన రాహుల్గాంధీని పీఎం చేయాలి. ఉపాధిహామీ, విద్యాహక్కు, ఆహార భద్రత చట్టాలని కాంగ్రెస్ తీసుకొస్తే బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుంది. జన జాతర సభలో ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్, డోర్నకల్, మహబూబాబాద్, భద్రాచలం, పినపాక, ఇల్లెందు, పాలకుర్తి ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్, భూక్య మురళీనాయక్, తెల్లం వెంకట్రాం, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, యశస్వినిరెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు వేం నరేందర్రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి, బెల్లయ్య నాయక్, రియాజ్, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్చందర్రెడ్డి, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, నాయకులు వెన్నం శ్రీకాంత్రెడ్డి, మోహన్లాల్, ఘనపురపు అంజయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథిరెడ్డి, అజయ్సారథిరెడ్డి, డాక్టర్ భూక్య ఉమ, చుక్కల ఉదయ్చందర్ పాల్గొన్నారు. -
సెల్ఫీ పాయింట్
ఓటుహక్కు ప్రాధాన్యం చైతన్యం కల్పించడంలో భాగంగా వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య, అధికారులతో కలిసి సెల్ఫీ దిగి ప్రారంభించారు. పబ్లిక్గార్డెన్, వరంగల్ రైల్వేస్టేషన్, బస్స్టేషన్ల వద్ద సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేసి యువకులను ఆకర్షించి ఓటు నమోదు శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ శ్రీనివాస్, జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీసీఓ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.– కాళోజీ సెంటర్ -
దిగుబడి అంచనాకు పంట కోత ప్రయోగం
మహబూబాబాద్ రూరల్ : దిగుబడి అంచనా వేసేందుకు వరిలో పంట కోత ప్రయోగాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర అర్థ గణాంకశాఖ కార్యాలయ సహాయ గణాంక అధికారి కేశవరావు అన్నారు. మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామంలో శుక్రవారం వరి పంటకోత ప్రయోగం నిర్వహించారు. గ్రామానికి చెందిన సోలం లక్ష్మి సన్న రకాన్ని సాగు చేయగా ఆ పంటను ఎంపిక చేసిన అధికారులు పావుగుంట విస్తీర్ణంలో వరి కోసి ప్రయోగం చేశారు. ఇందులో 8.13 కిలోల ధాన్యం దిగుబడి వచ్చినట్లు గుర్తించారు. పంటకోత ప్రయోగాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తద్వారా యాసంగి 2024కి సంబంధించిన పంట దిగుబడి అంచనా వేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీనివాస్, మండల ప్రణాళిక, గణాంక అధికారి భాగ్యశ్రీ, డివిజ నల్ ఉప గణాంక అధికారి కృష్ణారావు పాల్గొన్నారు. -
భూమాతను రక్షించుకుందాం
మహబూబాబాద్ రూరల్: మానవాళికి నిలువ నీడనిచ్చే భూమాతను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. ఆరోగ్యమిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గ్లోబల్ వార్మింగ్పై చేపట్టనున్న కార్యక్రమాల పోస్టర్లు, కరపత్రాలను శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆవిష్కరించి మాట్లాడారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు మొక్కలను పెంచాలని సూచించారు. ప్రముఖ సామాజిక పర్యావరణవేత్త అశోక్ మాట్లాడుతూ.. రోజురోజుకూ పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ సమస్యపై ప్రతి ఒక్కరు దృష్టి సారించేలా ఏటా ఏప్రిల్ 22న ధరిత్రి దినోత్సవం జరుపుతున్నామన్నారు. ఈ సంవత్సరం ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్ అనే అంశాన్ని ముఖ్యంగా తీసుకున్నారని, ప్రపంచవ్యాప్తంగా పెట్రేగిపోతున్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిరోధించేందుకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలని కోరారు. కార్యక్రమంలో ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు మాలోత్ నెహ్రూనాయక్, నాయకులు అంబటి వీరభద్రం, గునిగంటి కమలాకర్, పెదగాని సోమయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
కూలీలు సతమతం!
హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలిబయ్యారం: హక్కుల సాధనకు పెంకు కార్మికులు ఐక్యంగా పోరాడాలని ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షురాలు జి. అనురాధ పిలుపునిచ్చారు. మండలంలోని పలు పెంకు పరిశ్రమల్లో శుక్రవారం నిర్వహించిన టైల్స్వర్కర్స్ యూనియన్ జనరల్బాడీ సమావేశాల్లో ఆమె మాట్లాడారు. రాంసింగ్ విప్లవకార్మిక సంఘం నాయకుడిగా కొనసాగుతూ యాజమాన్య అనుకూల వైఖరిని అవలంబిస్తూ కార్మిక ప్రయోజనాలకు నష్టం కలిగించారన్నారు. ఈ విషయంపై పలుమార్లు ఇఫ్టూ నాయకత్వం సూచనలు చేసినప్పటికీ రాంసింగ్ తన వైఖరిని మార్చుకోలేదన్నారు. ఇక నుంచి రాంసింగ్కు టైల్స్ వర్కర్స్ యూనియన్తో సంబంధం లేదని టైల్స్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తాము అందుబాటులో ఉండి పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో టైల్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య, నాయకులు రాసుద్దిన్, శ్రీధర్, విశ్వనాథం, నాగేశ్వరరావు, శంకర్, ఆదినారాయణ, కోటయ్య, శ్రీను, పాషా, రాజు, సాంబ, లక్ష్మ య్య, రాంబాబు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
పీహెచ్సీలో షార్ట్సర్క్యూట్
నెల్లికుదురు: మండల కేంద్రంలోని పీహెచ్సీలో శుక్రవారం రాత్రి షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. దీంతో ఆస్తినష్టం వాటిల్లింది. స్థానికుల వివరాలు ప్రకారం.. పీహెచ్సీలో రాత్రి డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బంది డ్రగ్స్ నిల్వ ఉన్న గది వద్ద ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయగా మంటలు వచ్చాయి. చూస్తుండగా పెద్ద ఎత్తున మంటల చెలరేగి పీహెచ్సీ అంతా పొగమయంగా మారింది. ఈక్రమంలో డ్రగ్స్ రూమ్లో విలువైన ఫ్రిజ్లు, ఏసీలు, మందులు కాలిబూడిదయ్యాయి. వైద్య సిబ్బంది అప్రమత్తమై మొదటగా పీహెచ్సీలో విద్యుత్ సరఫరా నిలిపివేసి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఫైరింజన్తో సిబ్బంది పీహెచ్సీకి చేరుకుని మంటలను ఆర్పారు. రాత్రి సమయం కావడంలో ఎంత వరకు నష్టం వాటిల్లిందో సిబ్బంది అంచనా వేయలేకపోయారు. కాలి బూడిదైన మందులు, ఫ్రిజ్లు, ఏసీలు మంటలను ఆర్పిన ఫైర్ సిబ్బంది -
ముగిసిన సుధాకర్ దంపతుల ప్రస్థానం
చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్రావు ప్రస్థానం శుక్రవారం నాటికి ముగిసింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేడ్ జిల్లా మాడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్రావు, అతని భార్య సుమన అలియాస్ రజిత మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు శుక్రవారం తెల్లవారుజామున చల్లగరిగెకు మృతదేహాలను తీసుకొచ్చారు. గ్రామస్తులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు. అనంతరం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర నాలుగు గంటల పాటు సాగింది. అనంతరం ముచినిపర్తి గ్రామ శివారులో మావోయిస్టు దంపతుల మృతదేహాలను పక్కపక్కనే ఖననం చేశారు. ఇదిలా ఉండగా.. అంత్యక్రియల నేపథ్యంలో పోలీస్ బలగాలు గ్రామాన్ని చుట్టుముట్టినట్లు తెలిసింది.కాగా, 25 ఏళ్ల క్రితం అడవిబాట పట్టిన సుధాకర్ మధ్యలో ఏనాడూ ఊరిలోకి రాలేదని, శవమై తిరిగొచ్చాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బూటకపు ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అదివాసులకు అండగా నిలిచిన మావోయిస్టులను అన్యాయంగా కాల్చి చంపుతున్నారని ఇది ముమ్మాటికి బూటకపు ఎన్కౌంటర్ అని పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి అన్నారు. ప్రజా బిడ్డలకు చావు లేదు ఉద్యమంలో చనిపోయిన సుధాకర్– సుమన దంపతులు ప్రజా బిడ్డలేనని వారికి ఎప్పటికీ చావు లేదని.. అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అంజమ్మ అన్నారు. కేంద్ర ప్రభుత్వం హత్యకాండను పోత్సహిస్తుందని ఆరోపించారు. నివాళులర్పించిన వారిలో శాంతక్క, శోభ, శ్రీపతి రాజగోపాల్, గుమ్మడి కొమురయ్య, అంజన్న, మార్వాది సుదర్శన్, హుస్సేన్, విరసం నేతలు, బంధుమిత్రులు ఉన్నారు. ప్రజా బిడ్డలకు చావులేదు: ప్రజాసంఘాల నాయకులు చల్లగరిగెలో అంత్యక్రియలు పూర్తి -
మానుకోట.. కాంగ్రెస్ కంచుకోట
జన జాతర సభలో జోష్ నింపిన సీఎం రేవంత్రెడ్డి ప్రసంగం ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో చూస్తా.. గెలిచే స్థానాల్లో మొదటి రెండు స్థానాలు ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ ఉంటాయి. ఇరు పార్లమెంట్ ఇన్చార్జ్లు పొంగులేటి, తుమ్మల ఇక్కడే ఉన్నారు. ఈ రెండు పార్లమెంట్ స్థానాల్లో ఎవరు ఎక్కువ మెజార్టీ తెస్తారో చూస్తాం. ప్రజలను ఇబ్బందులు పెట్టి.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే నరేంద్ర మోదీ, ఆయనకు మద్దతుగా ఉన్న కేసీఆర్కు బుద్ధి చెప్పాల్సిందే. ఈ రెండు పార్టీలను ఓడించేందుకు మీరు (ప్రజలు) సిద్ధమేనా.. – సీఎం రేవంత్రెడ్డి సాక్షి, మహబూబాబాద్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపును కాంక్షిస్తూ శుక్రవారం మానుకోటలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ ప్రసంగం ఆద్యంతం పార్టీ శ్రేణులు, ప్రజల్లో జోష్ నింపుతూ సాగింది. సీఎం రేవంత్రెడ్డి మధ్యాహ్నం 3.15 గంటలకు మహబూబాబాద్ చేరుకున్నారు. అప్పటికే ఆయన అలసిపోవడంతో బస్సులో విశ్రాంతి తీసుకొని సాయంత్రం 5:16 గంటలలకు సభా వేదికపైకి వచ్చారు. 6:17 గంటల వరకు ప్రసంగం సాగింది. సీఎం వచ్చిన తర్వాత తొర్రూరు, డోర్నకల్ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. అప్పటివరకు కాసేపు పొంగులేటి, తర్వాత తుమ్మలతో సీఎం ముచ్చటించారు. సీఎం వేదికపైకి వచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్ పైకి వచ్చి ప్రజలకు అభివాదం చేశారు. తర్వాత మానుకోట.. ఎప్పటికి కాంగ్రెస్ కంచుకోట.. అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగం ప్రారంభించి మొదటి మాటతోనే కార్యకర్తలు, ప్రజల్లో ఉత్తేజాన్ని నింపారు. బీజేపీ, బీఆర్ఎస్పై విమర్శలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను విమర్శించడమే లక్ష్యంగా సీఎం ప్రసంగం సాగింది. ముందుగా ప్రధాని మోదీ నుంచి మొదలు పెట్టి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి వరకు విమర్శలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ చేసిన పని ఏమీలేదని, బయ్యారం ఉక్క ఫ్యాక్టరీ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గిరిజన యూనివర్సిటీ ఆలస్యం చేయడంతో గిరిజనులు నష్టపోయిన తీరును వివరించారు. పార్లమెంట్లో తెలంగాణను తక్కువ చేసి మాట్లాడిన ప్రధాని మోదీని ఎలా సమర్థిస్తారని కిషన్రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ ఏ మొఖంతో ఓట్లు అడుగుతుందని చెప్పి అవునా.. కాదా.. అని ప్రజలతోనే చెప్పించారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించడం, బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు, కేసీఆర్ బిడ్డ కోసం రాష్ట్రాన్ని బీజేపీ కాళ్లముందు వేశారని విమర్శలు చేశారు. ‘ప్రభుత్వం కూలిపోతుంది.. పార్టీలు మారుతారు అన్న విషయంపై ఆషామాషీగా రాలేదని ఎన్నో ఎత్తుగడలతో వచ్చాం.. బీఆర్ఎస్ను తొక్కి వచ్చాం’ అని చెప్పడంతో.. ప్రజలనుంచి ప్రతిస్పందన వచ్చింది. జోష్ నింపుతూ ప్రసంగం ముఖ్యమంత్రి ప్రసంగం కార్యకర్తలు, ప్రజల్లో జోష్ను నింపుతూ సాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించామని, ఇప్పుడు మోదీని ఓడించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియాగాంధీ చేసిన త్యాగం చెబుతూ.. అప్పటి ఎంపీలు సోనియాగాంధీకి బలిదానాల విషయం చెప్పిన తీరు.. ఆమె స్పందన, తల్లిగా అర్థం చేసుకుందని చెబుతూ.. ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ను కదిలించారు. పదేళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ ఏమీ చేయలేదని చెప్పి.. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు డబుల్ బెడ్రూం ఇళ్లు, రైతు రుణమాఫీ, ఉద్యోగాల నియామకం మొదలైన అంశాలను ప్రస్తావించారు. అదే తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను అమలు చేశామని చెప్పి ప్రజలతో చెప్పించారు. ఆగస్టు 15 నాటికి రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటన చేయడంతో సభ ముందున్న వారందరూ చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. అయితే ముందుగా కుల సంఘాల నాయకులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల ప్రసంగాలు మొదలుకొని సీఎం ప్రసంగం వరకు అభ్యర్థి బలరాంనాయక్ స్టేజీకి అటు చివర నుంచి ఇటు చివరి వరకు నడుస్తూ.. ప్రజలకు అభివాదం చేయడం... తనను గెలిపించాలని చెప్పకనే చెప్పినట్లు సంకేతంగా మారింది. మంత్రులు ఏమన్నారంటే.. బీజేపీ, బీఆర్ఎస్పై విమర్శనాస్త్రాలు కేసీఆర్ను టార్గెట్ చేస్తూ మాట్లాడిన మంత్రులు చేతులు ఊపుతూ.. దండం పెట్టే పనిలో అభ్యర్థి బలరాంనాయక్ కొనసాగుతున్న నామినేషన్ల పర్వం మానుకోటలో రెండో రోజు నాలుగు, వరంగల్లో మూడు నామినేషన్లుసీఎం పర్యటన ఇలా.. 3.12 గంటలకు హెలికాప్టర్ ల్యాండింగ్ 3.15 నుంచి 5.14వరకు సీఎం రేవంత్రెడ్డి విశ్రాంతి 5.16 గంటలకు సభాస్థలికి చేరుకున్న సీఎం 5.51 గంటలకు సీఎం ప్రసంగం ప్రారంభం 6.17 గంటలకు ప్రసంగం ముగిసింది 6.18 గంటలకు మానుకోట ప్రజలకు అభివాదం చేశారు 6.25 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్ వెళ్లారు8లోu -
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
మహబూబాబాద్: మానుకోట పార్లమెంట్ నియోజ కవర్గానికి రెండో రోజు నాలుగు నామినేషన్లు దాఖ లు అయినట్లు అధికారులు వెల్లడించారు. ములు గు నియోజకవర్గం మదనపల్లి గ్రామానికి చెందిన పోరిక బలరాంనాయక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయ న వెంట ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, ఎమ్మెల్యేలు భూక్య మురళీనాయక్, కోరం కనక య్య, పాయం వెంకటేశ్వర్లు, నాయకులు వెన్నం శ్రీకాంత్రెడ్డి, ఘనపురపు అంజయ్య, నూనావత్ రాధ, ఎడ్ల రమేష్ ఉన్నారు. బలరాంనాయక్ నాయక్ రెండు సెట్లు దాఖలు చేశారు. పినపాక నియోజకవర్గం మణుగూరుకు చెందిన పాల్వంచ దుర్గ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ చేశారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం ముదిగొండ గ్రామానికి చెందిన జాటోత్ రఘునాయక్ ఆధార్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నర్సంపేట ని యోజకవర్గం ఇటుకాలపల్లి గ్రామం ఏనుగుల తండాకు చెందిన బోడ అనిల్ నాయక్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. రెండు రోజుల్లో ఐదు నా మినేషన్లు, ఆరు సెట్లు పత్రాలు అందినట్లు అధికా రులు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియలో కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు, సహాయ రిటర్నింగ్ అధికారులు లెనిన్ వత్సల్ టొప్పో, డేవిడ్, ఆర్డీఓలు అలివేలు, నర్సింహరావు, తహసీల్దార్లు భగవాన్రెడ్డి, దామోదర్, శ్వేత, సునీల్రెడ్డి, పర్యవేక్షణ అధికారి పవన్కుమార్ పాల్గొన్నారు. వరంగల్లో ముగ్గురి నామినేషన్ కాళోజీ సెంటర్ : వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి శుక్రవారం రెండో రోజు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీఎస్పీ అభ్యర్థిగా పంజా కల్పన, స్వతంత్ర అభ్యర్థిగా పేరంబుదూరి కృష్ణసాగర్, మన తెలంగాణ రాష్ట్ర సమైక్య పార్టీ అభ్యర్థిగా ఏఆర్ సేనా ప్రేమ్రెడ్డి రిపిక, స్వతంత్ర అభ్యర్థిగా (1) సెట్ మొత్తం 2 సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, వరంగల్ కలెక్టర్ ప్రావీణ్యకు అందజేశారు. ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు అభ్యర్థులు ఏడు నామినేషన్లు పత్రాలు సమర్పించారు. ఇందులో ఏఆర్ సేనా ప్రేమ్రెడ్డి రిపిక రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.● నామినేషన్ దాఖలు చేసిన మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్ -
No Headline
తొర్రూరు: రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. కొద్ది రోజులుగా జిల్లా సగటు ఉష్ణోగ్రతలు 40డిగ్రీల పైనే ఉంటున్నాయి. దీంతో ఉదయం 9తర్వాత ఎండతో వడగాలులు వీస్తున్నాయి. ఈక్రమంలో ఉపాధి హామీ కూలీలు ఎండకు తల్లడిల్లుతున్నారు. మాడు పగిలే ఎండలో పనులు చేస్తూ పలువురు అస్వస్థతకు గురైన ఘటనలు ఉన్నాయి. పని ప్రదేశంలో కనీస వసతులు కల్పించకపోవడతో కూలీలు అల్లాడుతున్నారు. పని ప్రదేశంలో ఉండాల్సినవి.. చట్ట ప్రకారం పని ప్రదేశాల్లో తాగునీరు, నీడకు చలువ పందిళ్లు వేయాలి. అయితే నీడ వసతి లేకపోవడంతో సమీపంలోని చెట్ల కింద సేదతీరుతున్నారు. నీరు ఇళ్ల నుంచి తీసుకెళ్తున్నారు. కొన్నిచోట్ల అస్వస్థతకు గురైతే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచడం లేదని కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమలు కాని ఆదేశాలు.. పనులు చేసే చోట నేల గట్టిగా ఉండి మట్టి తవ్వడం కూలీలకు ఇబ్బందిగా మారింది. గతంలో వెంట తెచ్చుకున్న నీటికి ఒక కూలీకి రూ.2.50, పనిముట్లకు రూ.5 చెల్లించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ అమలు కావడం లేదు. కాగా ఏప్రిల్ 1నుంచి పని ప్రదేశాల్లోనే పచ్చని పరదాలు, నీడ, శుద్ధజలం, మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలని గ్రామీణాభివృద్ధి సంస్థ కమిషనర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇన్ని రోజులు చేసిన పనికి రూ.272 చెల్లి స్తుండగా ప్రస్తుతం రూ.300 చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఊరటనిస్తోంది. పంచాయతీలకే బాధ్యతలు... ఏటా అందించే వేసవి భత్యం రెండేళ్లుగా ఎత్తి వేశారు. ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో 30 శాతం అదనపు భత్యం చెల్లించడమే కాకుండా కొలతల్లోనూ సడలింపు ఉండేది. ప్రస్తుతం జిల్లా ఉన్నతాధికారులు ఉపాధి సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులకు కూలీల సంఖ్య పెంచేందుకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండటంతో ఉదయం 6నుంచి 11 గంటల వరకు పనులకు వెళ్లేలా చూడాలని, నీడ, నీటి, వైద్య సదుపాయం కల్పించాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఉచితంగా అందిస్తున్నారు. కూలీలకు గాయాలైతే తక్షణమే ప్రథమ చికిత్స అందించేందుకు మెడికల్ కిట్లు అందుబాటులో ఉండేలా పంచాయతీలు చూసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఉపాధి హామీ వివరాలు దంచికొడుతున్న ఎండలు అల్లాడుతున్న ఉపాధి కూలీలు పని ప్రదేశాల్లో కనీస వసతులు కరువుమండలాలు: 18 గ్రామాలు: 461 జాబ్ కార్డులు: 2.15 లక్షలు కూలీలు: 4.55 లక్షలు -
విభిన్న తీర్పు
సాక్షిప్రతినిధి, వరంగల్: ఒకప్పుడు కాంగ్రెస్.. ఆ తర్వాత టీడీపీకి కంచుకోటగా ఉన్న వరంగల్ (హనుమకొండ) పార్లమెంట్ నియోజకవర్గంపై తర్వాత గులాబీ పార్టీ జెండా ఎగురవేసింది. తెలంగాణలో ప్రాధాన్యం కలిగిన స్థానాల్లో వరంగల్ ఒకటి. హనుమకొండ ఆ తర్వాత.. 2009 పునర్విభజనతో ఏర్పడిన వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి 1952 నుంచి 2019 వరకు మూడు ఉప ఎన్నికలు కలుపుకుని మొత్తం 20 పర్యాయాలు ఎ న్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏడుసార్లు కాంగ్రెస్, రెండు సార్లు కాంగ్రెస్(ఐ) అభ్యర్థులు విజయం సాధించగా, టీడీపీ ఐదు, బీ(టీ)ఆర్ఎస్ నాలుగు, టీపీఎస్, పీడీఎఫ్ పార్టీలు ఒక్కోసారి గెలుపొందా యి. బీ(టీ)ఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత వచ్చి న 2004ఎన్నికల్లో ధరావత్ రవీంద్రనాయక్ గెలు పొందారు. ఆ తర్వాత 2008 ఉపఎన్నికలో టీడీపీ, 2009లో కాంగ్రెస్ గెలుపొందాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి ఎన్నికల నుంచి బీ(టీ)ఆర్ఎస్ ఈ నియోజకవర్గంపై పట్టు సాధించింది. కాంగ్రెస్, టీడీపీల కంచుకోట.. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్, 1993 తర్వాత టీడీపీలకు కంచుకోటగా ఉంది. 1952 తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రజాకవి కాళోజీ నారాయణ రావు పీడీఎఫ్ అభ్యర్థి పెండ్యాల రాఘవరావుపై 3,613 ఓట్ల తేడాతో ఓటమి చెందగా.. ఆ తర్వాత వరుసగా మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 1957లో ఎస్ఏ ఖాన్, 1962లో బీఏ మీర్జా, 1967లో ఆర్.సురేందర్రెడ్డిలు (కాంగ్రెస్) గెలుపొందారు. 1971లో టీపీఎస్కు చెందిన ఎస్బీ గిరి కాంగ్రెస్ అభ్యర్థి కేఎస్ రెడ్డిపై గెలుపొందగా, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎస్బీ గిరి, 1977లో బీఎల్డీ అభ్యర్థి జంగారెడ్డి మరోసారి విజయం సాధించారు. ఆ తర్వాత 1979ఉపఎన్నికల్లో బీఎం రావు కాంగ్రెస్ (ఐ) నుంచి, 1980లో కమాలోద్దిన్ అహ్మద్ కాంగ్రెస్ (ఐ) నుంచి గెలిచారు. 1984లో టీడీపీ నుంచి పోటీ చేసిన డాక్టర్ టి.కల్పనాదేవి కాంగ్రెస్ అభ్యర్థి కమాలోద్దిన్ అహ్మద్ను ఓడించారు. ఆ తర్వాత 1989, 1991లలో వరుసగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్.సురేందర్ రెడ్డి టీడీపీ అభ్యర్థులు కల్పనాదేవి, ఎస్.యతిరాజారావులపై గెలుపొందగా, 1996 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్.సురేందర్రెడ్డిని టీడీపీ అభ్యర్థిగా అజ్మీరా చందూలాల్ ఓడించారు. 1998లోనూ టీడీపీ నుంచి చందూలాల్ గెలుపొందగా, 1999లో టీడీపీ టికెట్ దక్కించుకున్న బోడకుంటి వెంకటేశ్వర్లు విజయం సాధించారు. 2004లో డీ.రవీందర్ నాయక్ (బీ(టీ)ఆర్ఎస్), 2008 ఉప ఎన్నికలో ఎర్రబెల్లి దయాకర్రావు (టీడీపీ), 2009లో సిరిసిల్ల రాజయ్య (కాంగ్రెస్) ఎంపీలుగా గెలుపొందగా, 2014లో బీ(టీ)ఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కడియం శ్రీహరి 3,92,574 ఓట్లతో గెలుపొందారు. ఆ తర్వాత తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కడియం శ్రీహరి ఎంపీగా రాజీనామా చేయడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో బీ(టీ)ఆర్ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 4,59,403 ఓట్ల మెజార్టీతో గెలుపొంది రికార్డు నెలకొల్పారు. 2019 ఎన్నికల్లో రెండోసారి దయాకర్.. కాంగ్రెస్ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్యపై 3,50,298 ఓట్లతో విజయం సాధించారు. ఒకప్పుడు కాంగ్రెస్, టీడీపీలకు కంచుకోటగా ఉన్న వరంగల్ నుంచి వరుసగా మూడు సార్లు భారీ మెజార్టీతో గెలిచిన బీ(టీ)ఆర్ఎస్ పరిస్థితి ఈసారి భిన్నంగా ఉంది. నిన్నటి వరకు బీ(టీ)ఆర్ఎస్లో ఉన్న కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యలు కాంగ్రెస్లో చేరగా ఆయన కూతురు ఆ పార్టీ అభ్యర్థిగా ఉండగా.. బీజేపీ నుంచి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ పోటీ చేస్తున్నారు. బీ(టీ)ఆర్ఎస్ నుంచి హనుమకొండ జెడ్పీ చైర్మన్ సుధీర్కుమార్ బ రిలో నిలవగా.. ముగ్గురి మధ్య పోటీ రసవత్తరంగా సాగుతోంది. ఈక్రమంలో ఈ ఎన్నికల్లో ఓరుగల్లు కోటపై ఎవరి జెండా ఎగురుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. వరంగల్ ఎంపీ స్థానంలో గతంలో కాంగ్రెస్, టీడీపీ, బీ(టీ)ఆర్ఎస్ హవా.. ప్రస్తుతం గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ప్రచారం ప్రధానపార్టీలకు ప్రతిష్టాత్మకంగా ఓరుగల్లు పార్లమెంట్ స్థానంహనుమకొండలో పీవీ ఓటమి.. హనుమకొండ లోక్సభ నియోజకవర్గానికి రికార్డుల పరంపర ఉంది. ఇక్కడ కాంగ్రెస్ ఒకసారి, కాంగ్రెస్(ఐ) నాలుగుసార్లు, టీడీపీ రెండు సార్లు, బీజేపీ ఒకసారి, బీ(టీ)ఆర్ఎస్ రెండుసార్లు గెలిచాయి. దేశానికి ప్రధానిగా సేవలు అందించిన పీవీ నరసింహారావు ప్రాతినిథ్యం వహించిన హనుమకొండ నియోజకవర్గం 2009 నుంచి రద్దు అయింది. నరసింహారావు రెండుసార్లు ఇక్కడ నుంచి గెలుపొందారు. ఆయన రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ప్రధాన మంత్రిగా పనిచేసి రాష్ట్రానికి వన్నె తెచ్చారు. కాగా, ఇక్కడ మూడుసార్లు గెలిచిన కమాలుద్దీన్ అహ్మద్ వరంగల్లో ఒకసారి గెలుపొందారు. టీడీపీ పక్షాన చాడ సురేష్రెడ్డి రెండుసార్లు గెలిచారు. ఇక్కడ రెండుసార్లు గెలిచిన బీ(టీ)ఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్కుమార్, కరీంనగర్ నుంచి మరోసారి గెలుపొందారు. సీనియర్ బీజేపీ నేత జంగారెడ్డి 1984లో పీవీ నరసింహారావును ఓడించడం అప్పట్లో సంచలనంగా మారింది.హనుమకొండ పార్లమెంట్.. చిన అభ్యర్థి పార్టీ సమీపఅభ్యర్థి పార్టీ మెజార్టీ 1977 పీవీ.నరసింహరావు కాంగ్రెస్ పీ.జనార్దనరెడ్డి బీ.ఎల్డీ 77,683 1980 పీవీ.నరసింహరావు కాంగ్రెస్(ఐ) పీ.జనార్దనరెడ్డి కాంగ్రెస్(యూ) 1,62,949 1984 సి.జంగారెడ్డి బీజేపీ పీవీ.నరసింహరావు కాంగ్రెస్ 54,198 1989 కమాలుద్దీన్ అహ్మద్ కాంగ్రెస్ సి.జంగారెడ్డి బీజేపీ 63,343 1991 కమాలుద్దీన్ అహ్మద్ కాంగ్రెస్ వంగా సుదర్శన్రెడ్డి టీడీపీ 64,463 1996 కమాలుద్దీన్ అహ్మద్ కాంగ్రెస్ ఎ.బస్వారెడ్డి టీడీపీ 75,570 1998 చాడ సురేష్రెడ్డి టీడీపీ కమాలుద్దీన్ అహ్మద్ కాంగ్రెస్ 45,491 1999 చాడ సురేష్రెడ్డి టీడీపీ కమాలుద్దీన్ అహ్మద్ కాంగ్రెస్ 85,781 2004 బీ.వినోద్కుమార్ బీ(టీ)ఆర్ఎస్ చాడ సురేష్రెడ్డి టీడీపీ 2,17,087 2008 (ఉ.ప) బీ.వినోద్కుమార్ బీ(టీ)ఆర్ఎస్ కొండా సురేఖ కాంగ్రెస్ 55,264వరంగల్ పార్లమెంట్.. సంవత్సరం గెలిచిన అభ్యర్థి పార్టీ సమీపఅభ్యర్థి పార్టీ మెజార్టీ 1952 పెండ్యాల రాఘవరావు పీడీఎఫ్ కాళోజీ నారాయణరావు కాంగ్రెస్ 3,613 1957 ఎస్.ఎ ఖాన్ కాంగ్రెస్ పెండ్యాల రాఘవరావు పీడీఎఫ్ 14,955 1962 బీ.ఎ మీర్జా కాంగ్రెస్ ఎస్.రామనాథం సీపీఐ 736 1967 ఆర్.సురేందర్రెడ్డి కాంగ్రెస్ ఎల్.ఎస్ రాజు బీజేఎస్ 69,945 1971 ఎస్.బీ గిరి టి.పి.ఎస్ కే.ఎస్ రెడ్డి కాంగ్రెస్ 93,640 1977 ఎస్.బీ గిరి కాంగ్రెస్ సీ.జంగారెడ్డి బీఎల్డీ 1,22,622 9–1–79(ఉప) బీ.ఎం రావు కాంగ్రెస్(ఐ) క్యు.ఎ.అబీబ్ జనతా 12,258 1980 కమాలుద్దీన్ అహ్మద్ కాంగ్రెస్(ఐ) టీ.పురుషోత్తం కాంగ్రెస్(యూ) 1,22,042 1984 కల్పనాదేవి టీడీపీ కమాలుద్దీన్ అహ్మద్ కాంగ్రెస్ 8,456 1989 ఆర్.సురేందర్రెడ్డి కాంగ్రెస్ టి.కల్పనాదేవి టీడీపీ 54,121 1991 ఆర్.సురేందర్రెడి కాంగ్రెస్ ఎస్.యతిరాజారావు టీడీపీ 51,873 1996 అజ్మీరా చందూలాల్ టీడీపీ టి.సురేంద్రరెడ్డి కాంగ్రెస్ 17,440 1998 అజ్మీరా చందూలాల్ టీడీపీ టి.కల్పనాదేవి కాంగ్రెస్ 24,801 1999 బోడకుంటి వెంకటేశ్వర్లు టీడీపీ టి కల్పనాదేవి కాంగ్రెస్ 13,366 2004 డి.రవీంద్రనాయక్ బీ(టీ)ఆర్ఎస్ బోడకుంటి వెంకటేశ్వర్లు టీడీపీ 19,262 2008(ఉప) ఎర్రబెల్లి దయాకర్రావు టీడీపీ పి.రామేశ్వర్రెడ్డి కాంగ్రెస్ 4,386 2009 సిరిసిల్ల రాజయ్య కాంగ్రెస్ రామగల్ల పరమేశ్వర్ బీ(టీ)ఆర్ఎస్ 1,24,661 2014 కడియం శ్రీహరి బీ(టీ)ఆర్ఎస్ ఎస్.రాజయ్య కాంగ్రెస్ 3,92,574 2015 పసునూరి దయాకర్ బీ(టీ)ఆర్ఎస్ సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ 4,59,403 2019 పసునూరి దయాకర్ బీ(టీ)ఆర్ఎస్ దొమ్మాటి సాంబయ్య కాంగ్రెస్ 3,50,298 -
ఫిర్యాదులకు అధికారులను సంప్రదించొచ్చు
● కలెక్టర్ ప్రావీణ్య కాళోజీ సెంటర్ : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల అంశాలకు సంబంధించి ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల వ్యయ పరిశీలకులకు ఫిర్యాదు, సలహాలు, సూచనలకు సంప్రదించవచ్చని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి, పరకాల, వరంగల్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఫిర్యాదులు ఎన్నికల వ్యయ పరిశీలకులు ఏ.దిలీబర్(సెల్ నం: 8309921306), వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల వ్యయ పరిశీలకులు ధీరజ్సింగా (సెల్ నం: 83099 52057)కు ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై ఫిర్యాదులు చేయవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే, ఈనెల 24వ తేదీ నుంచి నగరంలోని హరిత హోటల్లో సూట్ నం.309లో వ్యయ పరిశీలకులు ఏ.దిలీబర్, సూట్ నం.314లో వ్యయ పరిశీలకులు ధీరజ్ సింగాను సాయంత్రం 4నుంచి 5గంటల మధ్యన నేరుగా కూడా కలువచ్చని తెలిపారు. కరపత్రాల ఆవిష్కరణ కేయూ క్యాంపస్: సమూహ లౌకిక విలువలు –సాహిత్యం అనే అంశంపై రాష్ట్రస్థాయి సదస్సును ఈనెల 28న కాకతీయ యూనివర్సిటీలోని పరిపాలనాభవనం సెనెట్హాల్లో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన కరపత్రాలను ఫోరం బాధ్యులు, కవులు, రచయితలు, ఆహ్వాన సంఘం సభ్యులు లోచన్, అంపశయ్య నవీన్, కాత్యాయనీ విద్మహే, రచయిత విద్యార్థి, గంటా రామిరెడ్డి శుక్రవారం సాయంత్రం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. -
రూ.7.72 లక్షల నగదు స్వాధీనం
ఖిలావరంగల్/ రామన్నపేట : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్ అధ్వర్యంలో శుక్రవారం నగరంలోని అండర్ బ్రిడ్జి, శివనగర్ ప్రాంతాల్లో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన ఆధారాలు లేకుండా డబ్బులు రవాణా చేస్తున్న వరంగల్ చార్బౌలి ప్రాంతానికి చెందిన చిన్నెపల్లి దిలీప్ వద్ద రూ.6.70లక్షలు, శాంతినగర్కు చెందిన చిదిరాల మయూరి వద్ద రూ.1,02,000లను మొత్తం రూ.7.72లక్షల నగదు స్వాధీనం చేసుకొని తదుపరి చర్యల నిమిత్తం ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఇన్చార్జ్కు అప్పగించినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో మట్టెవాడ, మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్లు టి.గోపి, పి.మల్లయ్య, ఎస్సైలు విఠల్, వెంకన్న, గాలిబ్ షరీఫ్, మునీరుల్ల, గోవర్ధన్, సిబ్బంది పాల్గొన్నారు. డీజిల్ కాలనీలో రూ.1.53లక్షలు.. కాజీపేట: కాజీపేట పట్టణంలోని డీజిల్ కాలనీ ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి వాహనాల తనిఖీల్లో రూ.1.53లక్షల నగదును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సెక్టోరియల్ అధికారితో కలిసి పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా వేలేరు మండల కేంద్రానికి చెందిన మాడిశెట్టి శ్రీనివాస్ ద్విచక్ర వాహనంలో డబ్బులు తరలిస్తూ పట్టుబడ్డారు. పంచుల సమక్షంలో డబ్బులను స్వాధీనం చేసుకుని హనుమకొండ జిల్లా గ్రీవెన్స్ కమిటీకి అప్పగించినట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. అక్కడ పోలింగ్.. ఇక్కడ మావోల కట్టడి! కాళేశ్వరం: మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికలకు మొదటి విడత పోలింగ్ను అక్కడి అధికారులు శుక్రవారం కట్టుదిట్టంగా నిర్వహించారు. సరిహద్దుల్లో మావోల కట్టడికి ఇక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఓ వైపు పోలింగ్ సజావుగా సాగేందుకు మహారాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకుంటూనే.. సరిహద్దులతోపాటు అడవులను జల్లెడ పడుతున్నారు. శుక్రవారం బార్డర్ చెక్పోస్టు వద్ద మహదేవపూర్ సీఐ రాజేశ్వర్రావు, ఎస్సై భవానిసేన్లు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లకు వచ్చిపోయే వాహనాలను తనిఖీలు చేశారు. ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేట్ వాహనాలను సోదా చేశారు. అపరిచితులు కనిపిస్తే విచారించి వదిలేశారు. ఎన్కౌంటర్తో.. ఇటీవల ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో చోటే బిటియా పరిధి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన 29 మంది మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. కాగా, జిల్లాకు చెందిన శంకర్రావు అలియాస్ సుధాకర్ అతని భార్య రజిత మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మావోయిస్టులు గోదావరి ప్రాంతాలు దాటి తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉండడంతోపాటు ప్రతికారదాడులకు పాల్పడే అవకాశం ఉండడంతో పోలీసులు సరిహద్దుల్లో పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. అడవుల్లో జల్లెడపడుతున్నారు. భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. -
బీఫాంలు అందుకున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు
హన్మకొండ/మహబూబాబాద్: బీఆర్ఎస్ వరంగ ల్, మాహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులు మారపల్లి సుధీర్కుమార్, మాలోత్ కవిత బీఫాంలు అందుకున్నారు. గురువారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్లమెంట్ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. స మావేశం అనంతరం పార్టీ అధినేత, మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్.. ఎంపీ అభ్యర్థులకు బీ ఫాంలు అందజేశారు. కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీలు బస్వరాజు సార య్య, సిరికొండ మధుసూదనాచారి, సత్యవతి రా థోడ్, తక్కెళ్లపల్లి రవీందర్రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, మాజీ ఎమ్మెల్యేలు శంకర్నాయక్, రెడ్యానాయక్ , హరిప్రియ, తదితరులు పాల్గొన్నారు. -
లక్షే లక్ష్యం..
హన్మకొండ: టీఎస్ ఆర్టీసీ.. ఆదాయం పెంచుకునే దిశలో సరికొత్త చాలెంజ్లతో ముందుకెళ్తోంది. ఆర్టీసీ ఎండీగా వి.సి.సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంస్థ పరిరక్షణ, ఆదాయ పెంపునకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే దసరా, రాఖీ, సంక్రాంతి, ఆల్ డిపోస్ ప్రాఫిట్ చాలెంజ్, 100 రోజుల చాలెంజ్, ఒక గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం, విధుల్లో నైఫుణ్యం ప్రదర్శించాలి వంటి కార్యక్రమాలు చేపట్టింది. తాజాగా ‘లక్షే లక్ష్యం’ అనే పేరుతో మరో చాలెంజ్ తీసుకువచ్చింది. పెరిగిన వ్యయాన్ని పూడ్చుకునేందుకు.. ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం వేతన సవరణ చేసింది. వేతన సవరణ ద్వారా పెరిగిన వ్యయాన్ని పూడ్చుకునేందుకు సరికొత్త వ్యూహాలకు పదును పెట్టింది. ఇందులో భాగంగా ప్రతి డిపోలో ప్రతి రోజు ఆదాయం పెంచుకోవాలని చాలెంజ్ తీసుకువచ్చింది. రోజు అదనంగా రూ.లక్ష ఆదా యం తీసుకురావాలన్నదే ‘లక్షే లక్ష్యం’ చాలెంజ్. ఈ కార్యక్రమాన్ని గురువారం నుంచి ప్రారంభించారు. ఈ చాలెంజ్ ఏడాది పాటు కొనసాగుతుంది. వరంగల్ రీజియన్లో 9 డిపోలున్నాయి. ఈ లెక్కన రీజియన్లో ప్రతి రోజు అదనంగా రూ.9 లక్షల ఆదాయం తీసుకురావాలి. ఆదాయం పెంచుకోవాలంటే ప్రయాణికులను ఆర్టీసీ వైపునకు ఆకర్షించాలి. ప్రస్తుత ప్రయాణికుల సంఖ్యను పెంచుకుంటేనే ఈ చాలెంజ్లో రాణిస్తారు. అదనపు ట్రిప్పులు నడపడం, ప్రయాణికులను పిలిచి బస్సు ఎక్కించుకోవడం ద్వారా ఆదాయం పెంచుకోనున్నారు. డిపోల ఆదాయ సామర్థ్యాన్ని బట్టి లక్ష్యం.. వరంగల్ రీజియన్లోని 9 డిపోలకు ఆయా డిపోల ఆదాయ సామర్థ్యాన్ని బట్టి లక్ష్యం నిర్దేశించుకున్నారు. వరంగల్ రీజియన్లో జీరో టికెట్తో కలిపితే రోజూ సగటున రూ.2.20 కోట్ల ఆదాయం వస్తోంది. జీరో టికెట్ను మినహాయిస్తే నగదు రూపేణ రోజూ సగటున రూ.1.20 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ ఆదాయానికి అదనంగా మరో రూ.9 లక్షలు రాబట్టుకోవడమే ఈ చాలెంజ్ లక్ష్యం. ఆదాయం తక్కువగా వచ్చే డిపోల నుంచి అధిక ఆదాయం వచ్చే డిపోల వారీగా రోజుకు రూ.50 వేల నుంచి రూ.1.80 లక్షల ఆదాయం అదనంగా రాబట్టుకోవాలని నిర్దేశించుకున్నారు. రోజుకు రూ.9 లక్షల లెక్కన నెలకు రూ.2.70 కోట్లు, సంవత్సరానికి రూ.64,80 కోట్ల ఆదాయం సమకూర్చుకోవడమే లక్ష్యంగా వరంగల్ రీజియన్ యాజమాన్యం ముందుకెళ్తోంది. కాగా, వరంగల్ రీజియన్లో ‘లక్షే లక్ష్యం’ చాలెంజ్ను గురువారం హనుమకొండలోని వరంగల్–1 డిపోలో వరంగల్ రీజినల్ మేనేజర్ జాస్తి శ్రీలత ప్రారంభించారు. ప్రయాణికులను ఆర్టీసీ వైపు ఆకర్షించాలని, ప్రతి స్టేజీలో పిలిచి ఎక్కించుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎం వంగల మోహన్ రావు, అసిస్టెంట్ ఇంజనీర్ (మెకానికల్) శ్రీనివాసులు, అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) సంతోష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్టీసీలో మరో చాలెంజ్ ఆదాయం పెంచుకునే దిశగా అడుగులు వరంగల్ రీజియన్లో ప్రారంభం -
గస్తీ షురూ..!
వరంగల్ క్రైం: లోక్సభ ఎన్నికల వేడి మొదలైంది. దీంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం నుంచి తనిఖీలు మొదలయ్యాయి. ఇప్పటికే బెల్ట్ షాపులు నిర్వహించుకుండా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో కఠిన చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్షాపులు నిర్వహించినా.. సమయ పాలన తర్వాత మద్యం విక్రయించిన వారిపై కేసులు నమోదు చేసి తహసీల్దార్ల వద్ద బైండోవర్ చేస్తున్నారు. గతంలో కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసి.. ఎన్నికలకు ఎక్కువ సమయం ఉన్నందున ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఎత్తివేసిన చెక్పోస్టులను పోలీస్ అధికారులు తిరిగి గురువారం నుంచి ప్రారంభించారు. ప్రతి చెక్పోస్టులో పకడ్బందీగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలీస్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నారు. చెక్పోస్టుల దగ్గర భారీగా పోలీస్ సిబ్బందిని మోహరించి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పందంగా కనిపించే వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కమిషనరేట్లో చెక్పోస్టులు ఇవే.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా పోలీస్ అధికారులు 23 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వరంగల్ పార్లమెంట్ నియోజవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజవర్గాల పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఈస్ట్జోన్ పరిధిలో నర్సంపేట నియోజకవర్గంలో అయ్యప్ప గుడి, నల్లబెల్లి మండలం బోల్లోనిపల్లి, ఖానాపూర్ మండలం అశోక్నగర్, వరంగల్ తూర్పు నియోజవర్గం పరిధిలో లేబర్ కాలనీ జాన్పాక పీరీలు, నాయుడు పెట్రోల్ పంపు, వర్ధన్నపేట నియోజవర్గంలో హసన్పర్తిలోని అనంతసాగర్, డీసీతండా, చింత నెక్కొండ, సెంట్రల్ జోన్ పరిధిలో.. వరంగల్ పశ్చిమ నియోజవర్గం పరిధిలో కాజీపేట డిజీల్ కాలనీ, ఐశ్వర్యగార్డెన్ ములుగురోడ్డు, సీఎస్ఆర్ గార్డెన్, పరకాల నియోజవర్గ పరిధిలో కటాక్షపూర్ క్రాస్, గీసుగొండ కొమ్మాల, నడికూడ, హుజూరాబాద్ నియోజవర్గంలో ఎల్కతుర్తి పెంచికలపేట, స్టేషన్ఘన్పూర్ పరి ధిలో లింగాలఘణపురం జీడికల్, జఫర్గడ్ నల్లబండ, సాక్షి కార్యాలయం రాంపూర్, పాలకుర్తి నియోజవర్గంలో దేవరుప్పుల మండల కేంద్రం, రాయపర్తి కిష్టపూర్ క్రాస్, జనగామ నియోజవర్గం పరిధిలో.. జనగామ పెంబర్తి, బచ్చన్నపేట కొన్నె క్రాస్ వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 24 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు.. 23 చెక్ పోస్టులతోపాటు కమిషనట్ పరిధిలో 24 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలుు ఏర్పాటు చేశారు. వీటితోపాటు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) బృందాలను 25 నియమించారు. ఇవి రెండు మండలాలకు ఒక బృందం చొప్పున పనిచేస్తాయి. ఒక్కో చెక్పోస్టులో 8మంది సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు, ఆరుగురు సివిల్ కానిస్టేబుళ్లు, ఇద్దరు రెవెన్యూ సిబ్బంది, ఒక రెవెన్యూ అధికారి.. ప్రతి చెక్పోస్టులో వీడియోగ్రాఫర్ ఉంటారు. సరైన పత్రాలు ఉంటే రూ.49,900వరకు వెంట తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. 7ఫుల్ బాటిల్స్, కాటన్ (12) బీర్ల వరకు అనుమతి ఉంటుంది. రాజకీయ పార్టీల ప్రచార వస్తువులు వెంట ఉంటే వారి దగ్గర రూ.10వేలు నగదు ఉన్న సీజ్ చేస్తారు. చెక్ పోస్టులతోపాటు ఎంసీసీ బృందాలు కూడా అడుగుడుగునా తనిఖీలు చేపడుతాయి. కమిషనరేట్ పరిధిలో 23చెక్ పోస్టులు నిరంతరం ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల తనిఖీలు రూ.49వేల వరకు అనుమతి చెక్పోస్టులను తనిఖీ చేస్తున్న సీపీ -
రూ.7.14 లక్షల నగదు పట్టివేత
రామన్నపేట : లోక్సభ ఎన్నికల్లో భాగంగా పోలీసులు గురువారం పలుచోట్ల వాహన తనిఖీలు చేపట్టారు. ఇందులో ఆధారం లేకుండా తరలిస్తున్న నగదు మొత్తం 7.14 లక్షల నగదు పట్టుకున్నారు. వరంగల్ ఏసీపీ బి.నందిరాం ఆధ్వర్యంలో గురువారం నగరంలోని పోచమ్మమైదాన్ సెంటర్లో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఇందులో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్కు చెందిన బండారి మణికంఠ నుంచి రూ.2.80 లక్షలు, షేక్ జిజ్వాద్ వద్ద రూ.84 వేలు, నద్దునూరి రవి వద్ద రూ.63 వేలు, తుపాకుల శ్రీకాంత్ వద్ద రూ.56వేలు, సార భాస్కర్ వద్ద రూ.54వేలు.. మొత్తం రూ.4.65 లక్షలు స్వాధీనం చేసుకుని ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఇన్చార్జ్కు అప్పగించారు. స్టేషన్ఘన్పూర్లో రూ.లక్ష.. ేస్టషన్ఘన్పూర్: స్టేషన్ఘన్పూర్ రైల్వేస్టేషన్ వద్ద గురువారం నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ. లక్ష నగదు పట్టుకున్నట్లు సీఐ ముస్క రాజు తెలి పా రు. మండలంలోని మాన్సింగ్తండాకు చెందిన భూక్య రవీందర్ బైక్పై ఘన్పూర్ నుంచి మాన్సింగ్ తండాకు వెళ్తుండగా తనిఖీ చేసినట్లు పేర్కొన్నా రు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లేని రూ.లక్ష లభించడంతో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చిల్పూరులో రూ.1.49 లక్షలు.. చిల్పూరు: మండల పరిధి వెంకటాద్రిపేట–తరిగొప్పుల రోడ్డులో గురువారం రూ.1.49 లక్షల నగదును సీజ్ చేసినట్లు ఎస్సై ముత్యం రాజేందర్ తెలిపారు. వెంకటేశ్వరపల్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా చిల్పూరు పంచాయతీ పరిధి వడ్డెగూడేనికి చెందిన కస్తూరి వెంకట్రాజం బైక్పై వెళ్తుండగా అనుమానం వచ్చి తనిఖీ చేసినట్లు చెప్పారు. ఆధారాలు లేని నగదు పట్టుకుని సీజ్ చేసినట్లు వివరించారు. -
కోడిపిల్లను గాబులో వేశాం..
బయ్యారం: ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో కాంగ్రెస్ పార్టీ కాని కోడిపిల్ల(భద్రాచలం ఎమ్మెల్యే) ను గాబులో వేశాం.. ఇక కాంగ్రెస్కు తిరుగేలేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మహబూబాబాద్లో శుక్రవారం నిర్వహించే సీఎం బహిరంగసభకు జనసమీకరణ నిమిత్తం గురువారం బయ్యారంలోని కోదండరామచంద్రస్వామి ఫంక్షన్హాల్లో గార్ల–బయ్యారం మండలాల్లోని పార్టీ ముఖ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న పది ఎమ్మెల్యే స్థానాల్లో గత ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవగా భద్రాచలంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారన్నారు. ఇప్పుడు ఆ అభ్యర్థి (కోడిపిల్లగా మంత్రి సంబోధించారు) కాంగ్రెస్లో చేరడంతో పదికి పది కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నాయని.. ఇక మనం ఏ అభివృద్ధి పని గురించి అడిగినా సీఎం రేవంత్ ప్రాధాన్యం ఇస్తారన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కొందరు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని, లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పుతో మిగతా పార్టీల దుకాణాలు ఖాళీ అవుతాయన్నారు. సీఎం బహిరంగ సభకు పార్లమెంట్స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి లక్ష మందిని తరలించనున్నామన్నా రు. ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్ను గె లిపించే బాధ్యత తీసుకుంటే అభివృద్ధి చేసే బాధ్య త తాము తీసుకుంటామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్, నియోజకవర్గ కోఆర్డినేటర్ వెన్నం శ్రీకాంత్రెడ్డి, గార్ల జెడ్పీటీసీ ఝాన్సీ, ఎంపీపీ నాగరాజు, బయ్యారం, గార్ల మండలాల పార్టీ అధ్యక్షులు ముసలయ్య, రామారావు, సొసైటీ చైర్మన్లు మధుకర్రెడ్డి, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.మాట్లాడుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
కావ్యకు నాకంటే ఎక్కువ మెజార్టీ తీసుకువస్తా
వరంగల్: వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించడమే కాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో తనకు వచ్చిన మెజార్టీ కంటే ఎ క్కువ సాధిస్తామని మంత్రి కొండా సురేఖ అన్నా రు. గురువారం రాత్రి పోచమ్మమైదాన్లోని అబ్నూస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వరంగల్ తూర్పు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు, ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మా ట్లాడుతూ కొండా దంపతులు సన్మానాలకు దూరమన్నారు. సన్మానాలకు అయ్యే ఖర్చుతో అనాథలకు భోజనం అందించాలన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చిందని, ఆరు గ్యారంటీల్లోని ఐదింటిని 100 రోజుల్లో అమలు చేశామన్నారు. అంబేడ్కర్పై మాట్లాడే నైతిక విలువ కేసీఆర్కు లేదని, రాజకీయాల్లోకి అసభ్య పదజాలం తీసుకువచ్చింది కేటీఆర్, కేసీఆర్లే అని గుర్తించాలన్నారు. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ప్రకటించిన క్షణం.. కొండా దంపతులు తన బిడ్డకు నిండు ఆశీర్వాదం అందించారన్నారు. ఎంపీ అభ్యర్థి కావ్య మాట్లాడుతూ రాజకీయాల్లో ఎలా ముందుకు పోవాలో కొండా సురేఖ చెబుతున్నారని, ఈ సమావేశం చూస్తే తన గెలుపు ఖాయం అనిపిస్తోందన్నారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు మాట్లాడుతూ కొండా మురళీధర్ మాట ఇస్తే.. తప్పడన్నారు. కడియం కావ్యకు 50వేల మెజార్టీ ఇస్తామన్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్లో చేరిన పలువురికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్పొరేటర్లు, నాయకులు నవీన్రాజు, ప్రకాశ్, ప్రభాకర్, శ్రీనివా స్, శ్రీనివాస్, రాజేష్, రవీందర్ పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ -
నేడు మావోయిస్టు దంపతుల అంత్యక్రియలు
చిట్యాల: ఛత్తీస్గఢ్లోని కాంకేరు జిల్లా మాడ్ ప్రాంతంలో నాలుగు రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు దంపతులు సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్రావు, అతడి భార్య దాశశ్వర్ సుమన అలియాస్ రజిత మృతదేహాలు శుక్రవారం స్వగ్రామం చల్లగరిగెకు చేరుకోనున్నాయి. ఇదే రోజు కుటుంబీకులు.. సుధాకర్, రజిత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, సుధాకర్ దంపతుల మృతదేహాలను తీసుకురావడానికి కుటుంబీకులతోపాటు గ్రామస్తులు బుధవారం ఛత్తీస్గఢ్ బయలుదేరగా గురువారం చేరుకున్నారు. మార్చురీలో ఉన్న మృతదేహాలను గుర్తించారు. శుక్రవారం ఉదయం చల్లగరిగెకు తీసుకురానున్నారు. కాగా, సుధాకర్ దంపతుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. శుక్రవారం స్వగ్రామానికి చేరుకోనున్న సుధాకర్, రజిత మృతదేహాలు చల్లగరిగెలో విషాదఛాయలు -
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
పాలకుర్తి టౌన్: ఇంటర్మీడియట్ పరీక్షలో మరోసారి ఫెయిల్ అవుతానేమోనని భయంతో ఓ విద్యార్థి మనస్థాపానికి గురై ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో జరిగింది. ఎస్సై సాయి ప్రసన్నకుమార్ కథనం ప్రకారం పాలకుర్తికి చెందిన ఈరంటి వంశీ(19) గత సంవత్సరం సంవత్సరం ఇంటర్మీయట్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. ఇంటి వద్ద ఉంటూనే ఇటీవల సప్లిమెంటరీ పరీక్ష రాశాడు. అయితే ఇందులో కూడా ఫెయిల్ అవుతానేమోననే భయంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్నున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, బుధవారం రాత్రి వరకు స్నేహితులతో కలిసి ఉండి ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసి అర్ధరాత్రి ఉరి వేసుకొని ఆత్మహ్యకు పాల్పడినట్లు సమాచారం. -
ఎన్నికల ఖర్చులు లెక్కించండి
కాళోజీ సెంటర్: పార్లమెంట్ అభ్యర్థుల ఖర్చుల వివరాల్ని ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు నమోదు చేయాలని భారత ఎన్నికల కమిషన్ వ్యయ పరిశీలకులు ఏ.ధిలీబన్, ధీరజ్ సింగా అన్నారు. రిటర్నింగ్ అధికారి, గురువారం వరంగల్ కలెక్టరేట్లో కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్డీఓ శ్రీనివాస్తో కలిసి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల ఎన్నికల వ్యయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎన్నికల్లో వ్యయ లెక్కింపునకు ఏర్పాట్లు చేసిన కమిటీలు, బృందాలు ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న అప్పగించిన నగదు, మధ్యం, తదితర వివరాల్ని ఎస్ఎస్టీఎఫ్ఎస్టీ బృందాలు వ్యయ పరిశీలకులకు వివరించారు. ఈ సందర్బంగా ధిలీబన్ ధీరజ్ సింగా మాట్లాడుతూ.. రాజకీ య పార్టీలు, అభ్యర్థుల ఆమోద, ఆమోద యోగ్యం కాని ప్రతీ ఖర్చును సహాయ వ్యయ పరీశీలకులు, అకౌంటింగ్ టీమ్, వీఎస్టీవీవీటీలు నమోదు చేయాలన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిర్వహించే ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్ షోలన్నింటీని వీడియో సర్వేలెన్స్ టీమ్ సభ్యులు రికార్డ్ చేయాలన్నారు. అభ్యర్థుల వ్యయ వ్య య రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అనుమతి తీసుకున్న వాహనాల కంటే ఎక్కువ ఉపయోగిస్తే అనుమతి రద్దు చే యాలన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేలా ఉచిత కానుకల్ని పంపిణీ చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా నోడల్ అధికారులు, రామిరెడ్డి, సంజీవరెడ్డి, పుష్పలత, ఆయుబ్ అలీ, జిల్లా ఎకై ్సజ్ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.● ఎన్నికల సంఘం వ్యయ పరిశీలకులు ● జిల్లా అధికారులతో సమీక్ష
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
ఎస్బీఎమ్ బ్యాంక్కు రూ.88.70 లక్షలు ఫైన్: ఎందుకంటే?
మొన్నే భర్తను తిట్టింది.. ఇప్పుడేమో పెళ్లి వీడియో.. అంతలోనే..
రింకూ సెలక్ట్ కాకపోవడానికి కారణం అదే: ఆర్పీ సింగ్
ఏపీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..
Telangana Lok Sabha Elections Exit Poll 2024: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ఊహించని ఫలితాలు
నో డౌట్ పక్కా సీఎం జగన్
ఢిల్లీ పీఠం ఎవరిది..? ఎగ్జిట్ పోల్స్ సంచలనం..
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: ఏపీలో మళ్లీ ‘ఫ్యాన్’ ప్రభంజనమే
దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్ దూరం.. రేవంత్కు బహిరంగ లేఖ
సోనియా వల్లే ఆత్మహత్యలు.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
Advertisement