Mahabubabad District Latest News
-
వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
మహబూబాబాద్ రూరల్: విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని గిరిజన అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ జి.దేశీరాంనాయక్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని రెడ్యాల ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆయన శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ, మూత్రశాలలు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా స్టడీ అవర్స్ నిర్వహించాలన్నారు. విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలని సూచించారు. సమయపాలన పాటించని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పదో తరగతి విద్యార్థులు ఎవరైనా పరీక్ష తప్పినట్లయితే ఆ సబ్జెక్టు ఉపాధ్యాయుడిపై తీవ్రమైన చర్యలు ఉంటాయన్నారు. -
కార్డుపై రెండు బస్తాలే..
సొసైటీల వద్ద యూరియా కోసం రైతుల పడిగాపులు ●పైపాటు మందులు కొంటేనే యూరియా బస్తాలు నాకున్న రెండు ఎకరాలకు తోడుగా రెండు ఎకరాలు కౌలుకు తీసుకున్నా.. సొసైటీలో పడిగాపులు కాస్తే రెండు బస్తాలు ఇచ్చిండ్రు. మిగిలిన యూరియా కోసం ఫర్టిలైజర్ షాపుకు వెళ్తే పైపాటు మందులు కొంటేనే యూరియా ఇస్తామని చెబుతున్నారు. అదీ కూడా రూ. 350కు బస్తా ఇస్తున్నారు. – బానోత్ బాలు, రాయికుంట తండా, మహబూబాబాద్ క్యూలో నిలబడినా సరిపడా దొరకడం లేదు మాకు ఉన్న ఏడు ఎకరాల్లో వరి, మొక్కజొన్న సాగు చేశాను. పంటల ఎదుగుదలకు ఇదే సమయం ఇప్పుడు యూరియా వేయకుంటే అదును దాటిపోతుంది. ఇప్పుడు 15 బస్తాలు కావాలి. కానీ రోజంతా పడిగాపులు కాస్తే నాలుగు బస్తాలు ఇచ్చారు. ఎరువుల దుకాణాల్లో యూరియా దొరకడం లేదు. వ్యవసాయ అధికారులు స్పందించి రైతులకు యూరియా అందించి సహకరించాలి. – హుస్సేన్ బీ, వెలికట్ట, తొర్రూరు సాయంత్రం వరకు లైన్లోనే.. మూడు బస్తాల యూరియా కోసం మూడుసార్లు తిరిగా.. నాకు రెండుసార్లు యూరియా దొరకలేదు. మూడోసారి ఉదయం ఐదు గంటలకు వెళ్లి లైన్లో నిలబడితే సాయంత్రం మూడు బస్తాల యూరియా చేతికి వచ్చింది. బయట కొందాం అంటే బస్తాకు రూ. 50 ఎక్కువ అమ్ముతున్నారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలి. – ఈదుల మైపాల్ రెడ్డి, బొడ్లాడ కొరత లేకుండా చూస్తున్నాం.. ఒకేసారి రైతులు యూరియా కోసం పీఏసీఎస్ సెంటర్ల వద్దకు రావడంతో క్యూలైన్లో ఉంచి బస్తాలు ఇచ్చేలా చర్యలు తీసుకున్నాం. జిల్లాకు సరిపడా యూరియా అందుబాటులో ఉంది. రైతులు ఆందోళన చెందవద్దు. అధిక రేట్లకు అమ్మకాలు చేసే వారిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. – విజయనిర్మల, జిల్లా వ్యవసాయశాఖ అధికారిసాక్షి, మహబూబాబాద్: పంటలు ఏపుగా పెరిగేందుకు యూరియా దోహదపడుతుంది. అది కూడా సమయానికి పంటలకు వేస్తేనే ఫలితం ఉంటుంది. అయితే జిల్లాలో పలుచోట్ల రైతులకు యూరియా దొరకడం లేదు. దీంతో రైతన్నలు పడరానిపాట్లు పడుతున్నారు. పనులన్నీ వదులుకుని సొసైటీల వద్ద పడిగాపులు పడుతున్నా.. చివరికి సరిపడా బస్తాలు అందించడం లేదు. ఆధార్ కార్డుపై రెండు బస్తాలే ఇస్తుండడంతో.. ప్రైవేట్ వ్యాపారుల వద్ద బస్తాకు రూ.50పైగా అదనంగా చెల్లించి కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. అదికూడా పైపాటు మందులు కొనుగోలు చేస్తేనే బస్తాలు ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరఫరా సరే... పంపిణీ ఏదీ.. జిల్లాలో యాసంగి సీజన్కు సరిపడా యూరియాను ప్రభుత్వం సరఫరా చేస్తుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. వ్యవసాయశాఖ యాసంగి సాగు ప్రణాళిక మేరకు జిల్లాలో 1,49,353 ఎకరాల్లో వరి, 46,934ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తారని అంచనా వేశారు. దీనికి తోడు 4,8061 ఎకరాల మిర్చికి అవసరమైన యూరియా వాడకం పై ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఇందుకోసం ఫిబ్రవరి నెల కోటాగా 48,277 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అని లెక్కలు చెప్పారు. అయితే సాగు అంచనాలు తగ్గి 1,36,112 ఎకరాల వరి, 45,714 ఎకరాలకే మొక్కజొన్న పరిమితమైంది. కానీ ఫిబ్రవరి నెల 20వతేదీ వరకు 46,6640 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. మిగిలిన 1,637 మెట్రిక్ టన్నులు ఎనిమిది రోజుల్లో రావాలి. జిల్లాకు సరఫరా అయిన యూరియాలో 25,900 టన్నులు ఆగ్రోస్, పీఏసీఎస్, రైతు ఉత్పత్తి సంఘాలు, డీసీఎంఎస్లకు పంపించగా.. మిగిలిన 20,740 మెట్రిక్ టన్నుల యూరియాను 540 ఫర్టిలైజర్ షాపులకు దిగుమతి చేశారు. అంటే ఈనెలలో సగటున రావాల్సిన కోటా వచ్చినట్లే.. కానీ పంపిణీ సక్రమంగా చేయకపోవడంతోనే కొరత ఏర్పడుతుందని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. కొరతా.. కృత్రిమ కొరతా? ప్రభుత్వం ముందుగా వేసిన అంచనా ప్రకారం జిల్లాకు యూరియా సరఫరా అవుతున్నా.. పలుచోట్ల దొరకడం లేదు. దీనిపై చర్చ జరుగుతోంది. అయితే గతంతో పోలిస్తే రైతులు ఎక్కువగా యూరియా వినియోగిస్తున్నారని అందుకోసమే ఎంత సరఫరా చేసినా కొరత వస్తుందని అధికారులు చెబుతున్నారు. మార్క్ఫెడ్ పరిధిలోని పీఏసీఎస్, రైతు ఉత్పత్తి కేంద్రాలు, ఆగ్రోస్ సెంటర్లలో ప్రభుత్వం ప్రకటించిన రేటు బస్తాకు రూ.266.5 ఉండగా.. రూ.270కి అమ్ముతున్నారు. అదే పలు ప్రాంతాల్లోని ప్రైవేట్ ఫర్టిౖలైజర్ షాపుల్లో బస్తాకు రూ.330 నుంచి రూ. 350 వరకు అమ్మకాలు చేస్తున్నారు. అంటే బస్తాపై అదనంగా రూ.50 నుంచి రూ. 70వరకు తీసుకుంటున్నారు. అదీ కూడా పైపాటు మందులు కొనుగోలు చేస్తేనే బస్తాలు ఇస్తున్నారు. ప్రేక్షక పాత్రలో అధికారులు జిల్లాకు దిగుమతి అయిన యూరియాను రైతులకు ప్రభుత్వం నిర్దేశించిన ధరకు అమ్మేలా చూడాల్సిన వ్యవసాయశాఖ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇతర మందులతో ముడిపెట్టి అమ్మేందుకు ప్రైవేట్ వ్యాపారులు యూరియాను బ్లాక్ చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నా.. ఒకటి రెండు చోట్ల తనిఖీలు చేసి చేతులు దులుపుకో వడంలో ఆంతర్యమేమిటని రైతులు అడుగుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మార్క్ఫెడ్ సెంటర్లతోపాటు, ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపుల్లో కూడా ప్రభుత్వం నిర్దేశించిన ధరకే విక్రయించేలా చర్య తీసుకోవాలని, రేటు ఎక్కువ పెంచి అమ్మడం, ఇతర మందులతో ముడిపెట్టి అమ్ముతున్న షాపుల యజమానులు, వారికి సహకరిస్తున్న వ్యవసాయశాఖ అధికారులపై చర్య తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పడరాని పాట్లు.. నెల్లికుదురు: మండలంలోని ఎర్రబెల్లిగూడెం, శ్రీరామగిరి, నెల్లికుదురు సొసైటీల ఆధ్వర్యంలో యూరియా బస్తాలు అందజేస్తున్నారు. శుక్రవారం నెల్లికుదురులో యూరియా బస్తాల లారీ వచ్చిందని తెలుకున్న రైతులు.. సొసైటీ వద్దకు భారీగా చేరుకుని బస్తాలు తీసుకెళ్లారు. అలాగే శ్రీరా మగిరి సొసైటీ పరిధి లో ని రైతులకు ఆధార్ కార్డుపై రెండు యూరియా బస్తాలే ఇవ్వడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిపడా ఇవ్వాలన్నారు. క్యూలో ఉన్నవారికి ఆధార్కార్డుపై రెండు బస్తాల అందజేత ఫర్టిలైజర్ షాపుల్లో పైపాటు మందులు కొంటేనే యూరియా కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్న వ్యాపారులు బస్తాకు రూ.50పైగా అదనంగా వసూలు చేస్తున్న వైనం ప్రేక్షక పాత్రలో వ్యవసాయశాఖ అధికారులు -
నాణ్యమైన భోజనం అందించాలి
కేసముద్రం: విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ ఆదేశించారు. శుక్రవారం కేసముద్రం మండలంలోని మహముద్పట్నంలోని కేజీవీబీ, ఇనుగుర్తి మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాల, పీహెచ్సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు హాస్టళ్లలో నిత్యావసర సరుకులు, వంటగదిలో వండుతున్న అన్నం, కూరలు, పరిసరాలు, టాయిలెట్స్ను పరిశీలించారు. అనంతరం పిల్లలతో ఆయన మాట్లాడి, పలు ప్రశ్నలు అడిగారు. పదో తరగతి విద్యార్థినులు ఉత్తమ మార్కులు సాధించాలని సూచించారు. అనంతరం ఇనుగుర్తి పీహెచ్సీని సందర్శించారు. ల్యాబ్, గదులను పరిశీలించి, రోగులకు మెరుగైన వైద్యసేవలను అందించాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దామోదర్, వైద్యులు, అధికారులు, ప్రిన్సిపాల్, టీచర్లు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి మహబూబాబాద్: జిల్లాలో ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరెట్లోని కాన్ఫరెన్స్ హాల్లో పలు శాఖల అధికా రులతో కలెక్టర్ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి 5నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో 20పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో 9,302 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు 144 సెక్షన్ విధించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి, డీఎస్పీ తిరుపతి రావు, మానుకోట, తొర్రూరు ఆర్డీఓలు కృష్ణవేణి, గణేశ్, డీఐఈఓ మదార్, డీఎంహెచ్ఓ మురళీధర్, డీఈఓ రవీందర్రెడ్డి, మానుకోట మున్సిపల్ కమిషనర్ నోముల రవీందర్ పాల్గొన్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై మండల ప్రత్యేక అధికారులు మూడు రోజల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. వందశాతం ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు సమన్వయంతో వసతి గృహాలను తనిఖీ చేసి నివేదికలు అందజేయాలన్నారు. డైట్ మోనూపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యార్థులు వందశాతం హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ -
ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి
బయ్యారం: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని డీఈఓ రవీందర్రెడ్డి అన్నారు. మండలంలోని మిర్యాలపెంట, కొత్తూరు పాఠశాలలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థుల వర్క్బుక్స్, రికార్డులను పరిశీలించి పలు సూచనలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట సీఎంఏ చంద్రశేఖర్ అజాద్ తదితరులు ఉన్నారు. ఆశ్రమ పాఠశాల తనిఖీ కొత్తగూడ: మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను డీఈఓ రవీందర్రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థుల ప్రతిభను పరిశీలించారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యార్థులకు సూచనలు చేశారు. పరీక్షల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. స్నానాల గదుల తలుపులకు మరమ్మతులు చేయించాలని హెచ్డబ్ల్యూఓ భాగ్యమ్మకు ఆదేశించారు. ఆయన వెంట ఎంఈఓ లక్ష్మీనారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీందర్రెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రశ్నించే గొంతుకను మండలికి పంపించాలితొర్రూరు: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించే గొంతుకను గెలిపించుకోవాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగయ్య తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి నర్సిరెడ్డికి మద్దతుగా టీపీటీఎఫ్, టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం డివిజన్ కేంద్రంలోని టీపీటీఎఫ్ భవనంలో సమావేశం నిర్వహించారు. టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేశ్, యూటీఎఫ్ జిల్లా కోశాధికారి నాగమల్లయ్యతో కలిసి జంగయ్య మాట్లాడారు. నర్సిరెడ్డి పదవీకాలంలో ఎమ్మెల్సీ నిధులు రూ.9కోట్లను ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి వెచ్చించారని, టెట్పై స్పష్టత తెచ్చి ఉపాధ్యాయులకు పదోన్నతులు వచ్చేందుకు కృషి చేశారన్నారు. ఆయన పోరాటంతోనే పారిశుద్ధ్య కార్మికుల నియామకాలు జరిగాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ మండల అధ్యక్షుడు కొండం జనార్దన్, ఇరు సంఘాల నాయకులు రఫీ, శ్రీనివాస్, రాములయ్య, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. మార్చి 8న జాతీయ లోక్ అదాలత్మహబూబాబాద్ రూరల్: జాతీయ లోక్ అదాలత్ మార్చి 8న నిర్వహిస్తామని, కక్షిదారులు రాజీ కుదుర్చుకుని విజయవంతం చేయాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.రవీంద్రశర్మ అన్నారు. జిల్లాలోని పోలీసు ఉన్నతాధికారులు, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో జిల్లా కోర్టు ఆవరణలో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో వేల సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉన్నాయని, అన్ని కేసులను సాధారణ పద్ధతిలో పరిష్కరించడం సాధ్యం కాదన్నారు. అందువల్ల జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని, దీనిని వినియోగించుకుని ప్రశాంత వాతావరణంలో జీవించాలని సూచించారు. రాజీపడగలిగే క్రిమినల్, సివిల్ భూ తగాదా, మోటార్ వాహన ప్రమాదం, వివాహ, కుటుంబ తగాదా కేసులు, బ్యాంకు, చెక్ బౌన్స్, ఎలక్ట్రిసిటీ, చిట్ ఫండ్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్, ఎకై ్సజ్, విద్యుత్ చోరీ (దొంగతనాలు), ట్రాఫిక్, ఈ చలాన్ కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కక్షిదారులు తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టుల్లో తెలియజేసి రాజీ కుదుర్చుకుని కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవితం గడపాలన్నారు. సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ సురేశ్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి, డీఎస్పీలు తిరుపతిరావు, కృష్ణకిషోర్, డీఏఓలు రజిని, బాలకిషన్, సీఐలు, ఎస్సైలు, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
రక్తహీనతపై అవగాహన కల్పించాలి
● డీఎంహెచ్ఓ మురళీధర్ మహబూబాబాద్: రక్తహీనతపై అవగాహన కల్పించడంతో పాటు సమస్య రాకుండా చూడాలని డీఎంహెచ్ఓ మురళీధర్ అన్నారు. ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో అంగన్వాడీ టీచర్లు, సంబంధిత సిబ్బందికి రక్తహీనతపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ.. రక్తహీనత రాకుండా ప్రతీ ఒక్కరు పాటుపడాలన్నారు. అయోడిన్ లోపం వల్ల కలిగే రుగ్మతలను వివరించాలన్నారు. అనంతరం శిక్షణ పొందిర వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ దయాకర్, ఐజీడీ కోఆర్టినేటర్ ప్రభాకర్, కవిత, క్రాంతికుమార్, సునీత, సరస్వతి, మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు. -
‘పీఎం కుసుమ్’ గడువు పెంపు
● మార్చి 2వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణహన్మకొండ : ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం కుసుమ్) పథకంలో భాగంగా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తు గడువును ప్రభుత్వం పెంచిందని రెడ్ కో ఉమ్మడి వరంగల్ జిల్లా మేనేజర్ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన రైతులు, రైతు ఉత్పత్తి సంఘాలు, డెవలపర్స్, సహకార సంఘాలు మార్చి 2వ తేదీ వరకు రెడ్ కో వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 98 సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. జనగామ జిల్లా– 32, భూపాలపల్లి–10, మహబూబాబాద్–20, వరంగల్–23, హనుమకొండ–11, ములుగు జిల్లా నుంచి 2 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రదేశం 33/11 కేవీ సబ్ స్టేషన్కు 5 కిలో మీటర్ల లోపు దూరం మాత్రమే ఉండాలని చెప్పారు. 500 కిలో వాట్ల నుంచి 2 మెగావాట్ల ఉత్పత్తి వరకు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. 25 సంవత్సరాల పాటు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని, ఒక్క మెగావాట్ ప్లాంట్కు రూ.3 కోట్ల వ్యయం కానుందని, ఇందులో బ్యాంకు 70 శాతం రుణం అందిస్తోందని, మిగతా సొమ్ము ప్లాంట్ ఏర్పాటు చేసే వారు భరించాల్సి ఉంటుందన్నారు. రోజుకు దాదాపుగా 4,500 యూనిట్లు విదు ్యత్ ఉత్పత్తి జరుగుతుందని, యూనిట్కు డిస్కంలు రూ.3.13 చొప్పున చెల్లిస్తాయని వివరించారు. -
తాగునీటి సరఫరాకు చర్యలు
డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టినట్లు అడిషనల్ కలెక్టర్, మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చిన ఆయన కార్యాలయ ఆవరణలోని రెండు ఓవర్హెడ్ ట్యాంకులను పరిశీలించి, ట్యాంకుల నీటి సామర్థ్యంతో పాటు వార్డులకు నీటి సరఫరా వివరాలపై ఆరా తీశారు. అనంతరం పట్టణ సమీపంలోని డంపింగ్ యార్డును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. వేసవిలో మున్సిపాలిటీలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. భగీరథ నీటితో పాటు బావులు, బోరుబావులను సిద్ధం చేస్తున్నామని, నీటి సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆక్రమణలపై ఫిర్యాదు.. మెయిన్ రోడ్డులో ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని, దీంతో రోడ్డు మూసుకుపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ నాయకులు కాపరబోయిన సత్యనారాయణ అడిషనల్ కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన అడిషనల్ కలెక్టర్ తాను స్వయంగా మెయిన్ రోడ్డును పరిశీలించనున్నట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్, మేనేజర్ విజయానంద్, సీనియర్ అసిస్టెంట్ నాగరాజు పాల్గొన్నారు. ఏకలవ్య పాఠశాల తనిఖీ బయ్యారం: మండలంలోని నామాలపాడులోని ఏకలవ్య పాఠశాలను శుక్రవారం అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతిగదులు, వంటశాల, డైనింగ్హాల్, స్టడీరూమ్ను ఆయన పరిశీలించారు. పాఠశాలలో అందుతున్న సేవలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్న అనంతరం నిర్వాహకులతో మాట్లాడారు. ఆయన వెంట ఎంపీడీఓ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. మార్కెట్కు సెలవులుమహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్కు ఈ నెల 26నుంచి మార్చి 2వ తేదీ వరకు సెలవులు ప్రకటించామని మార్కెట్ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ శుక్రవారం తెలిపారు. 26న మహాశివరాత్రి పర్వదినం, 27న జాగరణ, 28న శుక్రవారం అమావాస్య, మార్చి ఒకటిన శనివారం, రెండో తేదీన ఆదివారం వారంతపు సెలవుల కారణంగా ఐదు రోజులపాటు వ్యవసాయ మార్కెట్ బంద్ ఉంటుందన్నారు. ఆ రోజుల్లో ఎలాంటి క్రయవిక్రయాలు జరగవని, రైతులు మార్కెట్కు ఎలాంటి సరుకులు తీసుకురావద్దని సూచించారు. మళ్లీ మార్చి 3న క్రయవిక్రయాలు మొదలవుతాయని పేర్కొన్నారు. ● అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో -
ఎమ్మెల్సీ ఎన్నికలపై అలర్ట్!
ఉమ్మడి జిల్లాలో మొత్తం ఎమ్మెల్సీ ఓటర్ల వివరాలిలా..సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్–నల్లగొండ–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నిక పోలింగ్కు మరో ఐదు రోజులే గడువుంది. ఈనేపథ్యంలో.. అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో ఉండగా.. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి ఆరు జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులను అలర్ట్ చేశారు. ఈమేరకు ఆయన శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన సుదర్శన్రెడ్డి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలన్నారు. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో.. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా నిఘా పటిష్టం చేయాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనలను జిల్లాల్లో పకడ్బందీగా అమలు చేయాలని, డబ్బు, మద్యం, ఇతర ఆభరణాలు పరికరాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయకుండా జాగ్రత్త పడాలని, క్షేత్రస్థాయి నుంచి వచ్చే సమాచారంతో ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తూ వీటిని నిరోధించాలని అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లలో అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన మేర సౌకర్యాలు ఉండేలా ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు. పూర్వ వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 24,905 ఓట్లు ఉండగా.. ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో 6,509 పురుషులు, 4,288 సీ్త్రలు కలిపి 10,797 మంది ఓటర్లున్నారు. ఆరు జిల్లాల్లోని 70 మండలాల్లో ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా.. 72 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు సంబంధిత అధికారులు వెళ్లి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ నిరంతరాయంగా పని చేసేలా విద్యుత్ సరఫరా ఏర్పాట్లపై స్థానికులతో మాట్లాడుతున్నారు. అలాగే.. 27న జరిగే పోలింగ్ కోసం ఒక్కరోజు ముందే ఎన్నికల సామగ్రిని తరలించేలా జిల్లా కేంద్రాల్లో డిస్టిబ్య్రూషన్, రిసెప్షన్ కేంద్రాల వద్ద అవసరమైన వసతులపై కూడా కసరత్తు చేస్తున్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యేలా, ప్రతీ రెండు గంటలకు పోలింగ్ వివరాలను ప్రకటించేలా ఎన్నికల అధికారులు, సిబ్బందిని కలెక్టర్లు సంసిద్ధం చేస్తున్నారు. వేడెక్కిన ప్రచారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 23 మంది 50 సెట్లు నామినేషన్లు దాఖలు చేయగా.. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత 19 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బరిలో అలుగుబెల్లి నర్సిరెడ్డి – స్వతంత్ర (యూటీఎఫ్ మద్దతు), గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి – స్వతంత్ర (టీచర్స్ జేఏసీ మద్దతు), పులి సరోత్తంరెడ్డి – బీజేపీ (టీపీయూఎస్ మద్దతు), శ్రీపాల్రెడ్డి పింగిళి – స్వతంత్ర (పీఆర్టీయూ – టీఎస్ మద్దతు), పూల రవీందర్ – స్వతంత్ర (ఎస్టీయూ మద్దతు)తో పాటు స్వతంత్రులుగా సంగంరెడ్డి సుందర్రాజు, కొలిపాక వెంకటస్వామి, అర్వ స్వాతి, కంటె సాయన్న, పన్నాల గోపాల్రెడ్డి ఏలె చంద్రమోహన్, చాలిక చంద్రశేఖర్, జంకిటి కై లాసం, జి.శంకర్, తలకోల పురుషోత్తంరెడ్డి, తాటికొండ వెంకటరాజయ్య, దామెర బాబురావు, బంక రాజు, ప్రజావాణి పార్టీ నుంచి లింగిడి వెంకటేశ్వర్లు పోటీలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఐదు రోజులే గడువుండడంతో అభ్యర్థులు ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. 7072పోలింగ్ కేంద్రాలుమండలాలుపురుషులు6,509మొత్తం సీ్త్రలు10,797 4,288ఏర్పాట్లపై కలెక్టర్లకు సీఈఓ సుదర్శన్రెడ్డి ఆదేశం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఉమ్మడి జిల్లాలో 10,797 మంది ఓటర్లు ఈనెల 27న పోలింగ్.. వచ్చే నెల 3న లెక్కింపు ప్రచారంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులుఎమ్మెల్సీ ఓటర్ల వివరాలిలా..జిల్లా మండలాలు పోలింగ్ పురుషులు సీ్త్రలు మొత్తం కేంద్రాలు హనుమకొండ 11 15 2884 2214 5098 వరంగల్ 13 13 1381 844 2225 జనగామ 12 12 556 365 921 మహబూబాబాద్ 18 16 1083 535 1618 భూపాలపల్లి 07 07 211 112 323 ములుగు 09 09 394 218 612 -
జగదల్పూర్కు ఓరుగల్లు పేరిణి కళాకారులు
హన్మకొండ కల్చరల్: కాకతీయుల కళా సృష్టి పేరిణి నృత్యం.. దీనిని భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. ఛత్తీస్గఢ్ జగదల్పూర్లో శుక్రవారం రాత్రి జరిగిన కాకతీయుల వంశీయుడు కమల్ చంద్రభంజు దేవ్ వివాహ మహోత్సవంలో గజ్జల రంజిత్కుమార్ ఆధ్వర్యంలో పేరిణి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. వరంగల్ నుంచి నృత్యకళాకారులు పల్నాటి శ్రీజ, రామ చరణి, గడ్డం విద్యశ్రీ, జెట్టి రిత్విక, పెడిసోజు సమీక్ష, గుండా చరిష్మా ఆకుల లక్ష్మీ ప్రసన్న, తుమ్మ వైష్ణవిలు బయల్దేరి వెళ్లినట్లు రంజిత్కుమార్ తెలిపారు. -
వైద్యుడు చనిపోయాడనే వెళ్లిపోయారా?
కాజీపేట సిద్దార్ధనగర్లోని షిర్డిసాయినగర్కు చెందిన డాక్టర్ గాదె సుమంత్ రెడ్డి (37) జనరల్ ఫిజీషియన్. గురువారం రాత్రి క్లినిక్ మూసివేసి స్నేహితుడిని కలిసేందుకు భట్టుపల్లి మీదుగా వరంగల్కు బయల్దేరగా.. గుర్తు తెలియని దుండగులు కారును అడ్డగించి.. దాడి చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో చనిపోయి ఉంటాడని భావించి దుండగులు వెళ్లిపోయినట్లు భావిస్తున్నారు. సుమంత్ రెడ్డి తండ్రి ఆరోగ్య సుధాకర్రెడ్డి ఫిర్యాదు మేరకు శుక్రవారం మిల్స్కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీపీ ఆదేశాల మేరకు పోలీసులు మరోసారి ఘటన స్థలానికి చేరుకుని, క్షుణ్ణంగా పరిశీలించారు. దుండుగులు ఎలా వచ్చి ఉంటారూ.. తిరిగి ఎలా వెళ్లిపోయారు.. దాడి చేసింది ఎవరై ఉంటారు.. అనే విషయాలపై చర్చించుకున్నారు. కాగా, సుమంత్రెడ్డి కారును మరో కారులో దుండగులు కాజీపేటనుంచే వెంబడించగా, మరికొందరు ఘటనస్థలి వద్ద కాపుకాసినట్లు తెలిసింది. ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి జరిగినట్లు స్పష్టమవుతోంది. దాడికి వివాహేతర సంబంధమా.. మరే ఇతర కారణమా అనేది తెలియాల్సి ఉంది. -
పరిశోధనలతో జ్ఞాన సముపార్జన
కేయూ క్యాంపస్ : ‘వన్ నేషన్–వన్ సబ్స్క్రిప్షన్’ ద్వారా పరిశోధన వనరులు అందుబాటులో ఉన్నాయి. దీంతో పరిశోధనలకు అవసరమైన జ్ఞాన సముపార్జనకు దోహదం చేస్తోందని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం పేర్కొన్నారు. కేంద్ర గ్రంథాలయం, లైబ్రరీ సైన్స్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం కేయూలోని సెనేట్హాల్లో నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. బెంగళూరు ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్వర్క్ సంచాలకులు ప్రొఫెసర్ దేవిక పి మదాలి కీలకపోన్యాసం చేస్తూ గతంలో చాలా విలువైన జర్నల్స్ కొద్దిమంది పరిశోధకులకు మాత్రమే అందుబాటులో ఉండేవని వివరించారు. ఇప్పుడు వన్ నేషన్–వన్ సబ్స్క్రప్షన్ ద్వారా యాక్సెస్ పెరిగిందన్నారు. దేశంలోని అన్ని వ్యక్తిగత విభాగాలకు చెందిన ప్రముఖ ప్రచురణ కర్తల నుంచి పరిశోధన జర్నల్స్కు ప్రాధాన్యత అందించడం దార్శనికత ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ సదస్సులో వివిధ విభాగాల డీన్లు మాట్లాడారు. విద్యార్థులు, పరిశోధకులు, లైబ్రరీ విభాగం బోధన, బోధనేతర ఉద్యోగులు పాల్గొన్నారు. జాతీయ సదస్సులో కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం -
అట్టహాసంగా ఆలిండియా టోర్నమెంట్స్ షురూ
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లోని మైదానంలో శుక్రవారం అట్టహాసంగా మూడు రోజుల ఆల్ ఇండియా ఇంటర్ ఎన్ఐటీ టోర్నమెంట్స్ ప్రారంభమయ్యాయి. టోర్నమెంట్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు జీఆర్ కిరణ్ పాల్గొని టోర్నమెంట్స్ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. దేశవ్యాప్త ఎన్ఐటీల నుంచి 775 మంది విద్యార్థులు టోర్నమెంట్లలో పాల్గొననున్నట్లు డీన్ శ్రీనివాసాచార్య తెలిపారు. మూడు రోజుల టోర్నమెంట్లలో భాగంగా హ్యాండ్బాల్, వాలీబాల్, యోగా పోటీల్లో విద్యార్థులు పోటీ పడనున్నట్లు స్పోర్ట్స్ యాక్టివిటీస్ హెడ్ పి.రవికుమార్ తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ అజీమ్, దయానిధి, పాల్గొన్నారు. -
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
స్టేషన్ఘన్పూర్ : ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో పడడంతో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మృతుడి భార్య నూర్జహాన్, పోలీసుల కథనం ప్రకారం.. చిల్పూరు మండలం చిన్నపెండ్యాల గ్రామానికి చెందిన ఎండీ.జమాలుద్దీన్ పశు వైద్యశాలలో ఆఫీస్ సబార్డినేట్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున పాంనూర్కు వెళ్తుండగా బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై వినయ్కుమార్, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
లిఫ్ట్లో ఇరుక్కున్న మెకానిక్
● గోడకు రంధ్రం చేసి కాపాడిన పోలీసులు వరంగల్: ఓ హోటల్లో లిఫ్ట్ మరమ్మతుల కోసం వచ్చిన ఓ వ్యక్తి అందులో ఇరుక్కున్నట్లు డయల్–100 నుంచి అందిన ఫిర్యాదు మేరకు అతన్ని రక్షించి అస్పత్రికి తరలించామని ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ షుకుర్ తెలిపారు. వరంగల్ స్టేషన్రోడ్లోని గ్రాండ్ గాయత్రి హోటల్లో లిఫ్టు గ్రౌండ్ చాంబర్లో లోపాలను సరిదిద్దేందుకు శుక్రవారం మెకానిక్ అంజి లోపలికి దిగాడు. అనుకోకుండా లిఫ్ట్ కిందికి రావడంతో ఇరుక్కుపోయాడు. లిఫ్ట్ ఎంతకీ పైకి కదలకపోవడంతో అక్కడే ఉన్న హోటల్ సిబ్బంది 100కు డయల్ చేసినట్లు తెలిసింది. ఫిర్యాదు అందుకున్న ఇంతేజార్గంజ్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్న సహాయ చర్యలు చేపట్టారు. లిఫ్ట్ పైకి లేపేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో సెల్లార్లోని గ్రౌండ్ చాంబర్ గోడకు రంధ్రం చేసి అంజీని బయటకు తీశారు. 108 వాహనంలో వైద్యసేవల కోసం ఎంజీఎంకు తరలించారు. ఈ ఘటనలో మెకానిక్ అంజి కాలు విరిగినట్లు వైద్యులు తెలిపారు. హోటల్లో జరిగిన ఘటనపై ఫిర్యాదులు వస్తే కేసు నమోదు చేసి విచారణ చేపడతామని స్థానిక పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులు తెలిపారు. -
భయం గుప్పిట్లో నగరం.!
వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి ట్రైసీటిలో వరుస సంఘటనలు నగరవాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా వరంగల్ పోలీస్ బాస్ అర్ధరాత్రి వేళ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పోలీసుల్లో ఉత్తేజాన్ని నింపుతున్నా.. కొందరు అధికారుల్లో పేరుకుపోయిన నిద్రమత్తు మాత్రం వదలడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిఘా వ్యవస్థ, ముందస్తు సమాచారం సేకరించడంలో, సంఘటన జరిగి 24 గంటల గడుస్తున్నా.. హత్యాయత్నాలకు తెగబడిన వారిని పట్టుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మారని పోలీసుల తీరు.. వరుసగా దొంగతనాలు.. దోపిడీలు, హత్యలు, హత్యాయత్నాలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ట్రైసిటీతోపాటు చుట్టుపక్కల ఉన్న చాలామంది ఇన్స్పెక్టర్లు ఏసీ గది దాటి బయటకు రావడం లేదనే విమర్శలున్నాయి. వరంగల్ సబ్ డివిజన్లోని ఓ స్టేషన్, హనుమకొండ సబ్ డివిజన్లో ఓ పోలీస్ స్టేషన్ సాయంత్రం అయితే చాలు జాతరను తలపిస్తూ కాసుల వర్షం కురిపిస్తున్నట్లు పోలీస్శాఖలో జోరుగా ప్రచారం ఉంది. పంచాయితీలకే పోలీసులు పరిమితం కావడంతో క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. పోలీస్ స్టేషన్ పరిధి, ఏసీపీ, డీసీపీ, సీపీ పరిధిలో ప్రతినెలా జరుగుతున్న నేర సమీక్షలో అధికారులు ఏం అడుగుతున్నారు. కింది స్థాయి అధికారులు ఏం సమాధానం చెబుతున్నారు.? ఎవరికి అంతుపట్టని రహస్యం. ఏదైనా సంఘటన జరిగినప్పుడే హడావుడి చేసి చేతులు దులుపుకొని యథావిధిగా వారి పంచాయితీలకే ప్రాధాన్యం ఇస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు ఎందుకు చర్య తీసుకోవడం లేదనే? విమర్శలున్నాయి. నగరంలో హత్యలు.. హత్యాయత్నాలు గురువారం ఒక్కరోజే మూడు ఘటనలు బెంబేలెత్తుతున్న నగరవాసులు -
‘సూపర్’.. సేవలు వెరీ పూర్!
ఎంజీఎం : వరంగల్ మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో పాలన, పర్యవేక్షణ అధ్వానంగా మారింది. ఎవరు.. ఎప్పడు విధులకు వస్తారో.. డుమ్మా కొడుతారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. సూపర్ ఆస్పత్రి పాలనపై ఎంజీఎం పరిపాలనాధికారులు పూర్తిస్థాయి దృష్టి సారించకపోవడంతో ఇక్కడి వైద్యులు, సిబ్బంది చుట్టపు చూపుగా విధులు నిర్వర్తిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సూపర్ ఆస్పత్రిలో పోస్టింగ్ కేటాయిస్తే పారామెడికల్, ఔట్సోర్సింగ్ సిబ్బంది ఎగిరి గంతులు వేస్తున్నారు. నాలుగైదు గంటల్లో విధులు ముగియడం, అడిగేవారు ఉండకపోవడే ఇందుకు కారణం. ఆస్పత్రిలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యే అనుచరుల నియామకం.. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో గత ప్రభుత్వ హయాంలో మూడు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా తాజా, మాజీ ప్రజాప్రతినిధుల అనుచరులను ఆయా విభాగాల్లో నియమించారు. ఆస్పత్రి మొత్తంగా పారామెడికల్ సిబ్బంది 110మంది ఉంటారు. కాగా, తాజా, మాజీ ప్రజాప్రతినిధుల హయాంలో ఒక్కో ఏజెన్సీలో 27మందిని తీసుకున్నారు. సదరు పారామెడికల్ సిబ్బంది నియామకం చేపట్టినప్పటినుంచి నినిమిది గంటల విధులకు బదులు నాలుగు గంటలు నిర్వర్తిస్తూ ఇదేమని ప్రశ్నిస్తే అధికారులపై ‘రాజకీయ’ ఒత్తిళ్లు తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవా నికి వారి బయోమెట్రిక్ అటెండెన్స్ను పరిశీలిస్తే వారు ఎన్ని గంటలు విధులు చేస్తున్నారో బయట పడుతుందని కొందరు చెబుతున్నారు. మూడు గంటల వైద్యుల విధులు.. సూపర్ ఆస్పత్రికి వచ్చే వైద్యుల విధులు చుట్టుపు చూపులాగానే ఉన్నాయి. ఓపీ ఉన్న రోజుల్లో 9 నుంచి 12 గంటల వరకు విధులు నిర్వర్తించాలి. ఓపీ కూడా పలు విభాగాలకు వారానికి రెండు రోజులు మాత్రమే ఉంటుంది. ఆ రోజుల్లో సైతం సమయానికి రాకుండా 9.30 గంటల తరువాత హాజరువుతూ 12 దాటక ముందే వారివారి క్లినిక్లకు పరుగులు పెడుతున్నట్లు రోగులు వాపోతున్నారు. ఇదంతా ఆస్పత్రి ఆర్ఎంఓలకు తెలిసినా ‘వైద్యుల్ని ప్రశ్నించేస్థాయి మాది కాదు. సూపరింటెండెంట్, డీఎంఈ స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలి’ అని దాటవేస్తున్నారు. ప్రత్యేక దృష్టి సారిస్తాం..సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ను నియమించాం. పారామెడికల్ సిబ్బంది, వైద్యుల విధులపై విభాగాధిపతులతో చర్చించి చర్యలు తీసుకుంటాం. బయోమెట్రిక్ను పరిశీలిస్తాం. రోగులకు మెరుగైన సేవలందిస్తాం. – డాక్టర్ కిశోర్, ఎంజీఎం సూపరింటెండెంట్● సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో మూడు గంటలే వైద్యుల విధులు పారామెడికల్ సిబ్బంది అయితే 8 గంటలకు బదులు 4 గంటలే.. తాజా, మాజీ ప్రజాప్రతినిధుల అనుచరుల నియామకం ఇదేంటని ప్రశ్నిస్తే.. అధికారులపై ‘రాజకీయ’ ఒత్తిళ్లుపై ఫొటో చూడండి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కార్డియాలజీ విభాగం ఓపీ దగ్గరి పరిస్థితి. శుక్రవారం ఈ విభాగం ఓపీ సేవలను అందిస్తారు. ఉదయం 9 గంటల సమయానికి 100 మంది రోగులు ఓపీ స్లిప్లు తీసుకుని కూర్చున్నారు. 9 గంటలకు రావాల్సిన వైద్యులు 9.25గంటలు దాటినా రాలేదు. 12 గంటలు కొట్టగానే ఠంచనుగా ఓపీ సేవలను మూసివేస్తారు. మూడు గంటలపాటు చూడాల్సిన ఓపీని.. 2 గంటల నుంచి 2.30 గంటల వరకు చూస్తే.. వచ్చిన వందమంది రోగులను ఎలా పరీక్షిస్తారన్నది వైద్యులకే తెలియాలి. -
క్లైమాక్స్కు రాజలింగమూర్తి హత్య కేసు
సాక్షిప్రతినిధి, వరంగల్/భూపాలపల్లి/భూపాలపల్లి అర్బన్: మాజీ కౌన్సిలర్ భర్త, సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగమూర్తి (49) హత్య కేసు క్లైమాక్స్కు చేరింది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం రాజలింగమూర్తి దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. మృతుడి భార్య సరళ ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసిన భూపాలపల్లి పోలీసులు మూడు ప్రత్యేక టీమ్లుగా ఏర్పడి విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఇద్దరు నిందితులను గురువారం ఉదయమే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రాథమిక విచారణలో హత్యకు గల కారణాలపై స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది. మరో ముగ్గురిని కూడా త్వరలోనే పట్టుకోగలమన్న ధీమాను పోలీసులు వ్యక్తం చేయగా.. శుక్రవారం నిందితులను మీడియా ముందు హాజరుపర్చి వాస్తవాలు వెల్లడించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.నాగవెళ్లి సరళ ఫిర్యాదులో ఏముంది..?భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట రాజలింగమూర్తి కుటుంబానికి భూమి ఉందని, ఆ భూమికి సంబంధించి రేణుకుంట్ల కొమురయ్య, రేణుకుంట్ల సంజీవ్ కుటుంబ సభ్యులతో తన భర్తకు గొడవ జరుగుతోందని, బెదిరింపులతో తమ భూమిని కాజేసే ప్రయత్నం చేయగా సివిల్ కోర్టును ఆశయ్రించారని రాజలింగమూర్తి భార్య సరళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. చాలా రోజులుగా ఈ కేసు నడుస్తున్నా.. త్వరలోనే తీర్పు రానుందని గమనించిన వారు తమ భూమిని ఎలాగైనా కాజేయాలనే ఉద్దేశంతో తన భర్త రాజలింగమూర్తిని చంపాలని పథకం వేశారని ఆరోపించింది. ఈ మేరకు రేణుకుంట్ల సంజీవ్, పింగిలి శమంత్ అలియాస్ బబ్లూ, మోరె కుమార్, కొత్తూరి కుమార్ అనే నలుగురు వ్యక్తులు బుధవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో పట్టణంలోని టీబీజీకేఎస్ ఆఫీసు దగ్గరలో రాజలింగమూర్తి వెళ్తుండగా, రెండు వాహనాల మీద వచ్చి ఇనుపరాడ్లతో తలమీద కొట్టి, కడుపు భాగంలో కత్తితో పొడిచి కిరాతకంగా తన భర్త రాజలింగమూర్తిని చంపారని సరళ ఆ ఫిర్యాదులో పేర్కొంది. తన భర్తకు హత్యకు గురయ్యారని తమకు తెలిసినవాళ్లు ఇచ్చిన సమాచారంతో భూపాలపల్లిలోని వంద పడకల ప్రభుత్వ ఆస్పకి వెళ్లేసరికి అప్పటికే తన భర్త చనిపోయి ఉన్నాడని పేర్కొన్నారు. తన భర్తను హత్యచేసిన వారిపై, ఈ హత్యకు వెనుక ఉండి వ్యూహరచన చేసి ప్రోత్సహించిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సరళ ఫిర్యాదులో పోలీసులను కోరారు.గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు..జిల్లా కేంద్రంలో అటవీ, ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై మృతుడు రాజలింగమూర్తి కోర్టుల్లో ప్రైవేట్ కేసులు వేసేవాడు. ఆ భూములను ఆయా శాఖలకు అప్పగించే వరకు పోరాడేది. గతంలో భూపాలపల్లిలో ఓపెన్కాస్ట్ ఏర్పాటుపై గ్రీన్ ట్రిబ్యునల్ను సైతం ఆశ్రయించాడు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, రాష్ట్రస్థాయి అధికారులు, కాంట్రాక్టర్పై జిల్లా కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. సామాజిక కార్యకర్తగా పని చేస్తున్న తనకు కొందరి నుంచి ముప్పు ఉందని, గన్ లైసెన్స్ కావాలని ఆరు నెలల క్రితం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించినట్లు సమాచారం. కలెక్టర్ ఆ లేఖను జిల్లా ఎస్పీకి పంపగా, పోలీసు అధికారులు విచారణ జరిపారు. రాజలింగమూర్తిపై పలు క్రిమినల్ కేసులు ఉన్నందున గన్ లైసెన్స్ ఇవ్వలేమని వెల్లడించినట్లు సమాచారం.బీఆర్ఎస్ నేతలపై ఆరోపణ.. రంగలోకి ఎస్పీతన భర్త రాజలింగమూర్తి హత్య వెనుక బీఆర్ఎస్ నాయకుల కుట్ర ఉందని ఆరోపిస్తూ మృతుడి భార్య సరళ, బంధువులు బుధవారం రాత్రి 2 గంటల వరకు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. సహకరించిన బీఆర్ఎస్ నేతల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం ఉదయం మృతదేహానికి పోస్ట్మార్టం చేసిన అనంతరం జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే తమకు హామీ ఇస్తేనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంటామని సరళ పట్టుబట్టింది. దీంతో ఎస్పీ స్థానిక పోలీస్స్టేషన్కు రాగా మృతుడి కుటుంబ సభ్యులు వెళ్లి మాట్లాడారు. అనంతరం మృతదేహాన్ని తీసుకుని దహన సంస్కారాలు నిర్వహించారు.రాజకీయ పార్టీలకు అంశంగా రాజలింగమూర్తి హత్య..భూపాలపల్లి ఘటనలో రాజలింగమూర్తి హత్య రాజ కీయ పార్టీలకు ఆరోపణలు, ప్రత్యారోపణలకు వేదికగా మారింది. ఈ హత్యపై పూర్తి వివరాలు కోసం హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం ఇంటెలిజె న్స్, స్పెషల్బ్రాంచ్ల ద్వారా ఆరా తీసింది. ఇదే సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ ఘటనపై చేసిన వ్యాఖ్యలు భూపాలపల్లి ప్రాంతంలో చర్చనీయాంశం కాగా.. మరోవైపు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ హత్యపై స్పందించి తగిన విచారణను కోరామన్నారు. బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి స్పందిస్తూ రాజలింగమూర్తి హత్యతో తనకు గానీ, బీఆర్ఎస్ పార్టీకి గాని ఎలాంటి సంబంధమూ లేదని ఖండించారు.ఐదుగురిపై ఎఫ్ఐఆర్.. పోలీసుల అదుపులో ఇద్దరు..రాజలింగమూర్తి హత్య కేసులో ఐదుగురిపై కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఏ–1గా రేణుకుంట్ల సంజీవ్, ఏ–2గా పింగిలి శ్రీమాంత్(శామంత్) (బబ్లూ), ఏ–3గా మోరె కుమార్, ఏ–4 గా కొత్తూరి కుమార్, ఏ–5గా రేణుకుంట్ల కొమురయ్యను ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. హత్యకేసులో పాల్గొన్న వారిపై తమకు అందిన ఫిర్యాదు ప్రకారం పోలీసులు క్రైంనంబర్ 117/2025 ద్వారా బీఎన్ఎస్ చట్టంలోని 191(20; 191(3), 61(2),103(2), రెడ్ విత్ 190 సెక్షన్ల కింద ప్రాథమికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ రాజలింగమూర్తి కోర్టును ఆశ్రయించినప్పటికీ స్థానిక భూ వివాదం కారణంగానే హత్యకు గురయ్యాడన్న చర్చ జరుగుతోంది. భూపాలపల్లి పోలీస్స్టేషన్ ఎదుట గల సర్వే నంబర్ 319లో మొత్తం 2.25 ఎకరాల భూమి ఉంది. అందులో 1.25 ఎకరాల భూమికి సంబంధించి రాజలింగమూర్తికి మరో కొంతమందికి వివాదం నెలకొన్న విషయం తెలిసింది.నిందితులెవరైనా వదలం.. భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావుహత్యకు దారి తీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు చెప్పారు. నిందితులకు రాజలింగమూర్తితో భూ తగాదాలున్నట్లు పేర్కొంటూ, ఇతర కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ మీడియాకు చెప్పారు. హత్య వెనుక ఎవరున్నప్పటికీ వదిలిపెట్టబోమని, అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతోందని స్పష్టం చేశారు. కాగా, రాజలింగమూర్తి హత్య కేసులో తాము ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని తెలిపారు. -
యూత్ ఫెస్టివల్తో నాయకత్వ లక్షణాలు
● ఎస్సార్ యూనివర్సిటీ వీసీ దీపక్ గార్గ్ హసన్పర్తి: యూత్ ఫెస్టివల్తో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని ఎస్సార్ యూనివర్సిటీ వీసీ దీపక్ గార్గ్ అన్నారు. ఎస్సార్ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో గురువారం యూత్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వీసీ దీపక్ గార్గ్ మాట్లాడారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మక శక్తులను వెలికి తీయడానికి ఈ వేదిక ఉపయోగపడుతోందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ అంశాల్లో తమ ప్రదర్శనలు ఇచ్చారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ అర్చనారెడ్డి, డాక్టర్ వి.మహేశ్, డాక్టర్ వి.వి.వి.సుధాకర్, ఎన్ఎస్ఎస్ కోర్డినేటర్ డాక్టర్ కె. రవీందర్ తదితరులు పాల్గొన్నారు. మెరుగైన వైద్యసేవలతోనే గుర్తింపు ఖమ్మంవైద్యవిభాగం: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడంతోనే ఆస్పత్రులకు గుర్తింపు లభిస్తుందని పలువురు వైద్యులు పేర్కొన్నారు. గురువారం ఖమ్మం నెహ్రూనగర్లోని ‘అఖిల’ కంటి ఆస్పత్రి ఏడో వార్షికోత్సవం నిర్వహించగా డాక్టర్ వాసిరెడ్డి రామనాథం ఓపీ చాంబర్ను ప్రారంభించారు. అనంతరం డాక్టర్ అఖిల మాట్లాడుతూ నెలలు నిండకుండా జన్మించిన చిన్నారుల్లో రెటీనా సంబంధిత సమస్యలు ఎదురైతే వైద్యం అందించడం సంతృప్తిగా ఉందని తెలిపారు. ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ మాధవి, మేనేజింగ్ డైరెక్టర్ కుతుంబాక మధు, డాక్టర్ సమత, శ్రీధర్, సతీశ్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల పునర్నియామకం హన్మకొండ: వివిధ కారణాలతో తొలగించిన ఆర్టీసీ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. గురువారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియ న్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నలు గురు డ్రైవర్లు, నలుగురు కండక్టర్లను పునర్నియామకం చేస్తూ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎం విజయభాను మాట్లాడుతూ ఉద్యోగులు అంకితభావం, నిబద్దత, నిజాయితీతో విధులు నిర్వర్తించాలన్నారు. కుటుంబ సభ్యులు విధులకు వచ్చే వారిని మానసిక ప్రశాంతతో పంపించా లన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. గతంలో జరిగిన తప్పులు, పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలన్నారు. డిప్యూటీ ఆర్ఎంలు కేశరాజు భా నుకిరణ్, మాధ వరావు, పర్సనల్ ఆఫీసర్ ఆర్పిత పాల్గొన్నారు. -
కుటుంబ కలహాలతో భార్యపై భర్త దాడి
ఎంజీఎం : కుటుంబ కలహాలతో భార్యపై భర్త కత్తితో దాడికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన అత్తామామలపై కూడా దాడి చేశాడు. ఈ ఘటన వరంగల్ పోచమ్మమైదాన్ సమీపంలోని వాసవీ కాలనీలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వాసవీ కాలనీ చెందిన జన్నుబాబు–అనిత దంపతుల కుమార్తె పల్లవి ఉర్సు ప్రాంతానికి చెందిన కోట చంద్రశేఖర్ను రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. కొన్ని రోజులు పాటు సాఫీగా సాగిన క్రమంలో గతేడాది నుంచి దంపతుల మధ్య వివాదాలు తలెత్తాయి. వీరికి కుమారుడు జన్మించాడు. చంద్రశేఖర్తో వివాదం కారణంగా పల్లవి తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. రెండ్రోజుల క్రితం చంద్రశేఖర్ కొడుకును తీసుకెళ్లడానికి అత్తగారి ఇంటి రాగా భార్య, అత్తామామ నిరాకరించారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం పల్లవి కొడుకుకు పాలు ఇస్తుండగా చంద్రశేఖర్ కత్తితో వచ్చి నేరుగా భార్య తలపై నరికాడు. ఈ ఘటనలో ఆమె అక్కడే రక్తపు మడుగులో పడిపోయింది. ఈ సమయంలో అత్తామామలు అడ్డుపడగా వారిపై కూడా దాడి చేసి వెళ్లిపోయాడు. తీవ్ర గాయాలపాలైన ముగ్గురిని స్థానికులు చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. కాగా, పల్లవి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అత్త అనిత, మామ బాబు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మట్టెవాడ పోలీసులు తెలిపారు.● అడ్డొచ్చిన అత్తామామలపై సైతం.. ● బాధితులకు ఎంజీఎంలో చికిత్స ● వాసవీ కాలనీలో దారుణం -
మాతృభాషకు ఓరుగల్లు మణిహారం..
భాషను విస్మరిస్తే తీవ్ర నష్టం.. మాతృభాష మాట్లాడే యువత సంఖ్య తగ్గిపోతోంది. దీనిని చూసి తల్లిదండ్రులు కూడా సంతోషిస్తున్నారు. కానీ ఒకజాతి సంస్కృతి ధ్వంసమవుతున్నదని వారికి తెలియడం లేదు. ఒక భాష అంతరిస్తే వారి సాహిత్యంతో పాటు, ఆ భాష మాట్లాడే జాతి కూడా అంతరించిపోతుంది. ప్రొఫెసర్ భూక్య బాబురావు, పీఠాధిపతి, జానపద గిరిజన విజ్ఞానపీఠం తెలుగు భాషను గుబాళింపజేసిన ఓరుగల్లు సాహితీవేత్తలు.. కాకతీయులు ఓరుగల్లును రాజధానిగా చేసుకుని యావత్ ఆంధ్రాదేశాన్ని పాలించారు. దీంతో పాటు ఓరుగల్లు నాటి నుంచే సారస్వత రంగంలోనూ ప్రముఖపాత్ర వహించింది. కాకతి గణపతిదేవచక్రవర్తి ఆ స్థానాన్ని సందర్శించిన తర్వాతే తిక్కన సోమయాజీ మహాభారత రచన చేపట్టినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 13వ శతాబ్దంలో పాలకుర్తిలో జన్మించిన సోమనాథుడు బసవపురాణాన్ని, 14వ శతాబ్దంలో పొతానామాత్యులు మహాభాగవతాన్ని రచించారు. ఎందరో కవులు పురాణాలను తెలుగులోకి అనువదించిన వారున్నారు. ఆధునిక కాలంలో రచనలు చేసిన వారిలో మాడపాటి హన్మంతరావు మొదటివారు. హన్మంతరావు 1911లో రాసిన నవనాగరికత మొదటికథగా చెప్పుకోవచ్చు. ఆ తరువాత 1927లో వద్దిరాజు రాఘవ రంగారావు, వద్దిరాజు సీతారామచంద్రరావులు, పెండ్యాల రాఘవరావు, కాళోజీ నారాయణరావు, పి.వి. నరసింహారావు, పొట్లపల్లి రామారావు, దాశరథి రంగాచార్యులు, టి. హైయగ్రీవాచారి, బండారు చంద్రమౌళీశ్వరరావు, అడ్లూరి అయోధ్యరామయ్య, బిరుదురాజు రామరాజు, పెండ్యాల శేషగిరిరావు, దేవులపల్లి రామానుజరావు, వాసుదేవరావు, తదితరులు కథలు రాశారు. ధూపాటివెంకటరమణాచార్యులు పి.వి. నరసింహారావు, కాళోజీ నారాయణరావు, బండారు సదాశివరావు, అంపశయ్య నవీన్ నుంచి ఇప్పటి వరకు రాస్తున్న కొత్త తరం కవిత్వం కథ నవల విమర్శనా రంగాల్లో జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేశారు. తెలుగుభాషను గుబాళింపజేస్తున్నారు. విజయవాడ తర్వాత తెలుగునాటకాన్ని రక్తికట్టించింది కూడా ఈ నేలపైనే. తెలుగులోనే పరిపాలన వ్యవహారాలు జరగాలని, ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే వెలువరించాలని, డిగ్రీలో కూడా తెలుగు ఒక పాఠ్యాంశంగా ఉండాలని, తెలుగు భాషను అభివృద్ధి చేయాలని కోరుతూ తెలుగుభాషోద్యమ సమాఖ్య ద్వారా కృషి చేశారు. ఓటరు వద్దకు వెళ్లి తెలుగులో ఓటు అడగడం తప్పు కానప్పుడు తెలుగులో పాలన వ్యవహరాలు ఎందుకు నిర్వహించరని ప్రశ్నించారు. ఆచార్య పేర్వారం జగన్నాథం, వడుగు గోపాల్రావు, ఆచార్య హైమావతి తదితరులు తెలుగుభాష అభివృద్ధి కృషిచేశారు. 2012 తరువాత తెలుగుభాషోద్యమం కనుమరుగైంది. తెలుగుభాషోద్యమ కేంద్రం ... హనుమకొండలోని శ్రీరాజరాజనరేంద్రాంధ్రభాషా నిలయానికి ఘనచరిత్ర ఉంది. నిజాం వ్యతిరేక స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించింది. నిజాంల కాలంలో మొదట అధికార భాషగా పర్షియన్ ఉండేది. తర్వాత ఉర్దూ అధికార భాషగా స్థానం పొందింది. పాఠశాలలో ఉర్దూ మీడియంలోనే చెప్పేవారు. 90 శాతం ప్రజల మాతృ భాషగా ఉన్న తెలుగులో చదువుకునే అవకాశం లేదు. అలాంటి పరిస్థితులలో నిజాం రాష్ట్రంలో పలుచోట్ల పౌరగ్రంథాలయాల స్థాపన ఉద్యమంగా జరిగింది. వీటిలో మొదటిది సెప్టెంబర్, 1, 1901లో స్థాపించబడిన శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషా నిలయం కాగా, రెండోది 1904 ఫిబ్రవరి 2 తేదీన శ్రీరాజరాజనరేంద్రాంధ్రభాషా నిలయం కావడం విశేషం. ధూపాటి వెంకటరమణచార్యులు సేకరించిన ఎన్నో అమూల్య తాళపత్రగ్రంథాలు, శాసనాల అచ్చులు, పురాతన నాణెలు ఈ గ్రంథాలయంలోనే భద్రపరిచారు. పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ, మహాకవి శ్రీశ్రీ, కవిసామ్రాట్ విశ్వనాథసత్యనారాయణ, గుర్రం జాషువా వంటి ఎందరో విభిన్న సాహితీవేత్తలు ఇక్కడే ఉపన్యాసాలు ఇచ్చారు. మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు, జాతీయాచార్యులు బిరుదురాజు రామరాజు వంటి ఎందరో ప్రముఖులు ఇక్కడే చదువుకున్నారు. తెలంగాణలో తెలుగుభాషా ఉద్యమానికి కృషి చేసిన ప్రముఖ కేంద్రాల్లో భాషానిలయం కూడా ఒకటి కావడం మనకు గర్వకారణం.– హన్మకొండ కల్చరల్ తెలుగు భాషను గుబాళింపజేసిన ఉమ్మడి జిల్లా సాహితీవేత్తలుపుట్టిన ప్రతీ ఒక్కరిది మొదట మాతృభాషనే. వారి తల్లిదండ్రులు, చుట్టూ సమాజం పెంచి పెద్ద చేస్తుంది. తల్లిమీద గౌరవం ఎంత ఉంటుందో మాతృభాషపై కూడా అంతే గౌరవం ఉండాలి. అందుకే ఏ దేశస్తుడికై నా మాతృభాషపై మమకారం ఉండాలన్నది పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు సిద్ధాంతం. పూర్తిగా తెలుగు రానివారి గురించి బాధలేదు. కానీ తెలుగు రాయడం.. చదవడం వచ్చిన వారు కూడా భాష రాదని ఫోజు కొట్టడం చూసి కాళోజీ తీవ్రంగా మందలించేవారు. కాగా, శుక్రవారం(21వ తేదీ) అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఇతర భాషల్లో ప్రావీణ్యం ఉండదు.. అమ్మ ఒడిలో ఉగ్గుపాలతో నేర్చుకున్న మాతృభాషలో విద్యను బోధించడం వల్ల విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. మాతృభాష రానివారికి ఇతరభాషల్లోనూ ప్రావీణ్యం ఉండదు. ప్రతిఒక్కరూ మాతృభాషలో పండితుడు కావాల్సిన అవసరం లేదు. కనీసం అర్థం చేసుకోగలిగితే, మాట్లాడగలిగితే చాలు. –రామారత్నమాల, అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగువిభాగం, పింగిళి కళాశాలఏ భాషరా నీది? యేమి వేషమురా? 1942లో నిజాం రాష్ట్రంలో ప్రజలు తమ మాతృభాష తెలుగుపై నిరాదరణతో ఉండడం చూసి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు స్పందించారు. ఏ భాషరా నీది? యేమి వేషమురా? /ఈ భాష ఈవేష మెవరి కోసమురా?/ ఆంగ్లమందున మాటలాడ గలుగగనే/ ఇంతగా గుల్కెదవు ఎందుకోసమురా?/ అన్యభాషలు నేర్చి ఆంధ్రంబురాదంచు/ సకిలించు ఆంధ్రుడా ! చావవెందుకురా? అంటూ అలాంటి వారిని అపహస్యం చేశారు. -
నేటినుంచి ఎల్ఎల్బీ సెమిస్టర్ల పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి లో ఎల్ఎల్బీ మూడేళ్ల మొదటి సంవత్సరం మొద టి సెమిస్టర్ పరీక్షలు శుక్రవారం నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఆసిం ఇక్బాల్ గురువారం తెలిపారు. ఈనెల 21, 2 4, 28, మార్చి 3, 5వ తేదీల్లో పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతా యని తెలిపారు. ఎల్ఎల్బీ మూడేళ్ల లా కోర్సు ఐదో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 22 నుంచి నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఈనెల 22, 25, మా ర్చి 1,4, 6 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఐదేళ్ల లా కోర్సు 5వ సెమిస్టర్ పరీక్షలు ఐదేళ్ల లా కోర్సు ఐదో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 21 నుంచి నిర్వహించనున్నారు. ఈనెల 21, 24, 28, మార్చి3, 5తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయని పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. ఐదేళ్ల లా కోర్సు తొమ్మిదో సెమిస్టర్ పరీక్షలు ఐదేళ్ల లా కోర్సు తొమ్మిదో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 22 నుంచి నిర్వహించనున్నారు. ఈనెల 22, 25, మార్చి 1, 4, 6వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయని పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. దూరవిద్య పీజీ పరీక్షలు ప్రారంభం కాకతీయ యూనివర్సిటీ పరిధిలో దూరవిద్య పీజీ కోర్సుల ఎంఏ, ఎంకామ్ తదితర పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని రిజిస్ట్రార్ వి. రామచంద్రం, పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, దూరవిద్య కేంద్రం డైరెక్టర్ బి. సురేశ్లాల్ సందర్శంచి పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. వీరి వెంట ఆ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పుల్లారమేశ్ ఉన్నారు. -
రాజలింగమూర్తి కేసును సీబీఐకి అప్పగించాలి
హన్మకొండ: భూపాలపల్లిలో హత్యకు గురైన రాజ లింగమూర్తి కుటుంబానికి న్యాయం జరగాలంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె.ఎ.పాల్ డిమాండ్ చేశారు. గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజలింగమూర్తిని హత్య చేసిన దుండగులను ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలన్నారు. పోలీసులు, అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు భయపడొద్దన్నారు. రాష్ట్రంలో 13 నెలల్లో లెక్కలేనన్ని హత్యలు, లైంగికదాడులు జరుగుతుంటే సీఎం రేవంత్ ఎందుకు స్పందించడం లేదని, రాష్ట్రంలో హోం మంత్రిని ఎందుకు నియమించడం లేదని ప్రశ్నించారు. రాజలింగమూర్తి కుటుంబానికి రూ. కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్.కృష్ణయ్య రాజకీయ పార్టీలకు బానిసయ్యాడని, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో బానిసలుగా ఉన్న బీసీలు బయటకు రావాలని పిలుపునిచ్చారు.. తనను సీఎం చేయాలన్నారు. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె.ఎ.పాల్ -
కొత్త ఇసుక ప్రాజెక్టులు గుర్తించాలి
● మైనింగ్శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్కాళేశ్వరం: టీజీఎండీసీలో కొత్త ఇసుక ప్రాజెక్టులు గుర్తించాలని మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈమేరకు గురువారం జయశంకర్భూపాలపల్లి జి ల్లా మహదేవపూర్ మండలం బొమ్మాపూర్, ఎల్కే శ్వరం, అన్నారం, పలుగుల, పూసుకుపల్లి, మద్దులపల్లిలో ఇసుక రీచ్లను కలెక్టర్ రాహుల్శర్మ, కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్తో కలిసి పరిశీలించారు. ప్రతీ రోజు ఒక్కో క్వారీలో ఎన్ని టన్నుల ఇసుక తీస్తున్నారు?, రవాణా ఎలా చేస్తున్నారు?, తదితర విషయాలను టీజీఎండీసీ, మైనింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24/7 ఇసుక కోసం ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. స్టాక్ పాయింట్, రీచ్లకు వచ్చే మార్గాల్లో సీసీ కెమెరాలు చేసి పటిష్ట పర్యవేక్షణకు ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న క్వారీల్లో రోజుకు 8–10 వేలమెట్రిక్ టన్నులకు పెంచాలని, రోజుకు 40–50వేల మెట్రిక్టన్నుల ఇసుక లోడింగ్ చేసే కొత్త ప్రాజెక్టులను గుర్తించాలని ఆదేశించారు. వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని ఇసుక కొరత రాకుండా స్టాక్ పెంచాలని ఆదేశించారు. కాంట్రాక్టర్కు క్రమం తప్పకుండా కమీషన్ చెల్లింపులు చేస్తామన్నారు. ఇసుక తీయడానికి అదనపు యంత్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో టీజీఎండీసీ ఎండీ సుశీల్ కుమార్, పీఓ రంగారెడ్డి, మైనింగ్ ఏడీ జయరాజు, తహసీల్దార్ ప్రహ్లాద రాథోడ్, డీటీ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి గురుకులాల ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
● హనుమకొండ జిల్లా కోఆర్డినేటర్ దాసరి ఉమామహేశ్వరి మడికొండ: తెలంగాణ రాష్ట్ర గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసిన ట్లు హనుమకొండ జిల్లా కోఆర్డినేటర్, మడికొండ బాలికల పాఠశాల ప్రిన్సి పాల్ దాసరి ఉమామహేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు. హాల్ టికెట్లు సంబంధిత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. హనుమకొండ జిల్లా పరిధిలో మొత్తం 16 సెంటర్లు కేటాయించినట్లు తెలిపారు. 16 సెంటర్లలో 5వ తరగతిలో 2,548, 6లో 895, 7లో 451, 8లో 329, 9వ తరగతిలో 286 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నట్లు చెప్పారు. మొత్తం 4,509 మంది హనుమకొండ జిల్లాలో పరీక్ష రాయనున్నారు. పరీక్ష కేంద్రాన్ని ఒక రోజు ముందు చూసుకోవాలని సూచించారు. పరీక్ష రోజు కేంద్రం వద్దకు ఉదయం 9.30 గంటలకు చేరుకోవాలన్నారు. పరీక్ష ప్యాడ్, బ్లూ, బ్లాక్ పెన్, ఆధార్ కార్డు, హాల్ టికెట్ తప్పకుండా తీసుకుని రావాలన్నారు. -
ఇసుకపై ఫోకస్..
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో ఇసుక దందాపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి కట్టడి చేస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇసుక పాలసీ తీసుకొచ్చి ఇందిరమ్మ ఇళ్లతోపాటు, సామాన్యులకు అందుబాటు ధరకు ఇసుక సరఫరా చేయాలనే ఆలోచన చేసింది. ఈమేరకు రాష్ట్ర అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో జిల్లా ఎస్పీ ప్రత్యేక దృష్టి పెట్టి ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేస్తున్నారు. అయితే ఇంతకాలం మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగిన ఇసుక దందా ఒక్కసారిగా ఆగిపోవడంతో అక్రమార్కులు సతమతమవుతున్నారు. చెక్పోస్టులు.. నూతన ఇసుక పాలసీ అమల్లోకి వచ్చేవరకు ఏర్లు, వాగుల నుంచి తట్టెడు ఇసుక కూడా బయటకు రావొద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, పోలీస్ ఉన్నతాధికారుల నుంచి ఈనెల 12న ఇసుక అక్రమ రవాణా కట్టడి చేయాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. కాగా, ఆ మరుసాటి రోజు నుంచి ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ జిల్లాలోని ఆకేరువాగు, మున్నేరు, పాలేరు వాగు పరీవాహక ప్రాంతాల్లో పర్యటించారు. ప్రధానంగా నెల్లికుదురు, నర్సింహులపేట, చిన్నగూడూరు, డోర్నకల్, మరిపెడ, గూడూరు, గార్ల, బయ్యారం, దంతాలపల్లి, పెద్దవంగర పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. ఐదు చోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేసి, అక్కడ పోలీసులకు ప్రత్యేక డ్యూటీలు వేశారు. రాత్రింబవళ్లు నిఘా పెంచారు. అక్రమార్కుల ఉక్కిరిబిక్కిరి.. దశాబ్దాలుగా కొంతమంది ఇసుక అక్రమ రవా ణాతో కోట్లకు పడగలెత్తారు. ఈక్రమంలో పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు మాముళ్లు తీసుకొని వారికి సహకరించారు. అలాగే పెద్ద నాయకుల నుంచి చోటామోటా నాయకుల వరకు ఇసుక మామూళ్లే ప్రధాన ఆర్థిక వనరుగా మారింది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు.. జిల్లా ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగడంతో ఎవరూ నోరు మెదపని పరిస్థితి నెలకొంది. దీంతో ఇసుక మాఫియాదారులతోపాటు నెలవారీ మామూళ్లు తీసుకునే అధికారులు, పలువురు నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పాలసీ ఎప్పుడు వస్తుందో.. అందులో ఏం ఉంటుందో అనే ఆందోళన కూడా వారిలో మొదలైంది. అక్రమ రవాణాను సహించేది లేదు జిల్లాలోని వాగుల నుంచి అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే సహించేదిలేదు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అన్ని చోట్ల చెక్పోస్టులు పెట్టాం. పలు ట్రాక్టర్లను సీజ్ చేశాం. పలువురిపై కేసులు నమోదు చేశారు. అక్రమ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే పోలీస్ అధికారులను కూడా సస్పెండ్ చేస్తాం. – సుధీర్ రాంనాథ్ కేకన్, ఎస్పీ రవాణాపై పోలీసుల నిఘా ఉన్నతాధికారుల ఆదేశాలతో కట్టుదిట్టం వాగుల పరీవాహకంలో చెక్ పోస్టులు అక్రమ రవాణాదారులపై కేసులుఅక్రమ రవాణాపై ఉక్కుపాదం ఇసుక అక్రమ రవాణా చేయవద్దని పోలీసులు హెచ్చరించినా.. వినకుండా అదే తంతుగా వ్యవహరిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా ట్రాక్టర్ల ఓనర్లు, డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరించారు. 71మందిని బైండోవర్ చేసి కౌన్సెలింగ్ ఇచ్చారు. అదేవిధంగా గత తొమ్మిది రోజుల్లో ఎనిమిది కేసులు నమోదు చేశారు. ఎనిమిది ట్రాక్టర్లు సీజ్ చేశారు. 11మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
గూడ్స్ ట్రైన్ మేనేజర్లకు పదోన్నతులు
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న 40మంది గూడ్స్ ట్రైన్ మేనేజర్లు (గార్డులు) సీనియర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్లుగా పదోన్నతులు పొందినట్లు గురువారం రైల్వే అధికా రులు తెలిపారు. పదోన్నతులు పొందిన వారిలో కొందరిని బెల్లంపల్లి, రామగుండం, డోర్నకల్కు రై ల్వేస్టేషన్లకు బదిలీపై పంపిస్తూ సికింద్రాబాద్ రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన పలువురికి కాజీపేట రైల్వే స్టేషన్లో స్టేషన్ మేనేజర్ రవీందర్ రిలీవ్ లెటర్స్ అందజేశారు. -
నేడు ‘డయల్ యువర్ డీఎం’
తొర్రూరు రూరల్: ఆర్టీసీ తొర్రూరు డిపో ఆధ్వర్యంలో శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మేనేజర్ పద్మావతి గురువారం తెలిపారు. ఉదయం 11నుంచి 12గంటల వరకు 99592 26053 నంబర్కు ఫోన్చేసి సలహాలు, సూచనలు చేయాలన్నా రు. బస్ సర్వీసులు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలియజేయాన్నారు. వీరభద్రస్వామికి హీరో గోపిచంద్ పూజలు కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారిని ప్రముఖ సినీహీరో గోపిచంద్ గురువారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన పేరుతోపాటు కుటుంబసభ్యుల పేర్లపై గోత్రనామర్చనలు చేశారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు వేదాశ్వీరచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ ఈఓ సత్యనారాయణ మహాశివరాత్రి నుంచి జరగబోయే వీరభద్రస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందించారు. కుటుంబసమేతంగా స్వామివారి దర్శనానికి రావాలని కోరారు. ఆయన వెంట సినీనిర్మాత శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్త చిన్నం గణేశ్ ఉన్నారు. వైద్యాధికారుల తనిఖీ నెహ్రూసెంటర్: జిల్లా కేంద్రంలోని నిఖ్మా హెల్త్కేర్ సెంటర్ (శ్రీవెంకటేశ్వర నర్సింగ్ హోం)ను వైద్యారోగ్యశాఖ అధికారులు గురువారం తనిఖీ చేశారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రమీల ఆస్పత్రిలోని రోగుల రికార్డులు, అందుతున్న సేవలు, ల్యాబ్కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్స్ కేవీ రాజు, గీత తదితరులు పాల్గొన్నారు. కొత్త ఉద్యోగులకు పోస్టింగులు నెహ్రూసెంటర్: గ్రూప్–4 ఉద్యోగులకు పోస్టింగులు ఇచ్చారు. ఇటీవల గ్రూప్–4 ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసి పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ మేరకు ఈ నెల 19న ‘సాక్షి దినపత్రిక’లో ‘కొత్త ఉద్యోగుల హైరానా’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై గురువారం అధికారులు స్పందించారు. ఉద్యోగులకు పోస్టింగులు ఇచ్చారు. దీంతో ఉద్యోగులు ‘సాక్షి దినపత్రిక’కు కృతజ్ఞతలు తెలిపారు. రక్తహీనతపై అవగాహన కల్పించాలి మహబూబాబాద్: రక్తహీనత వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కాకతీయ మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ దయాకర్ అన్నారు. ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక లయన్స్ క్లబ్లో అయోడిన్ డెపిసెన్సీ–రక్తహీనత అనే అంశంపై అంగన్వాడీ టీచర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా దయాకర్ మాట్లాడుతూ.. రక్తహీనత వి షయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఐజీడీ కో ఆర్డినేటర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం మహబూబాబాద్ అర్బన్: కేంద్ర ప్రభుత్వ ఇంటర్న్షిప్ పథకం అమలుకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పరిశ్రమల శాఖ డైరెక్టర్ మల్సూర్ గురువారం తెలిపారు. పథకం రెండో దశ నోటిఫికేషన్ వచ్చిందని, 21 నుంచి 24 మధ్య వయస్సు గల విద్యార్థులు మార్చి 11లోపు సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికై న విద్యార్థులకు ఏడాదిపాటు నెలకు రూ.5 వేల చొప్పున, ఒక్కసారి సాయం కింద రూ.6 వేలు అందుతాయన్నారు. 12 నెలల వ్యవధిలో కనీసం 6 నెలలు ఉద్యోగ శిక్షణ ఉంటుందన్నారు. దరఖాస్తుదారుల కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదని, పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లమా, డిగ్రీ పూర్తి చేసి ఉండాలన్నారు. కుటుంబ ఆదాయం ఏడాదికి రూ. 8లక్షలలోపు ఉండాలని, ఇతర వివరాలకు 1800 11 6090 టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించాలన్నారు. -
మాదక ద్రవ్యాలను నియంత్రించాలి
మహబూబాబాద్: జిల్లాలో మాదక ద్రవ్యాలను నియంత్రించాలని, వాటి వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారితో కలిసి సంబంధిత అధికారులతో జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల నివారణకు పోలీస్శాఖ కృషి చేస్తుందని, ఇతర శాఖలు సహకారం అందించాలన్నారు. జిల్లాలో గంజాయి రవాణాను అరికట్టేదిశగా దృష్టి సారించాలన్నారు. కళాజాత బృందాల ప్రదర్శనలు, ర్యాలీలు పలు ఇతర కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రత్యేకించి గంజాయి వివి ధ మార్గాల ద్వారా రవాణా అవుతుందని, ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామన్నారు. మాదక ద్రవ్యాల రవాణా, ఉత్పత్తి చట్ట వ్యతిరేక చర్య అన్నా రు. యువతీ యువకులు మాదక ద్రవ్యాలకు బా నిసై తమ భవిష్యత్ను నాశనం చేసుకోవద్దన్నారు. మెడికల్ విభాగం ఆధ్వర్యంలో డీ– అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మానుకోట, తొర్రూరు ఆర్డీఓలు కృష్ణవేణి, గణేశ్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ వెంకట్, డీఎంహెచ్ఓ మురళీధర్, ప్రభుత్వ ఆస్పత్రి సూపరిటెండెంట్ శ్రీనివాసరావు,అధికారులు తదితరులు పాల్గొన్నారు. చర్యలు తీసుకోవాలి జిల్లాలో వేసవికాలంలో నీటిఎద్దడి ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో నీటి ఎద్దడిపై మిషన్ భగీరథ, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నీటి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి పైప్లైన్ మరమ్మతులు, ఇతర పనులు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీపీఓ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తనిఖీ చేయాలి.. జిల్లాలోని వసతిగృహాలను జిల్లా, ప్రత్యేక అధికారులు తనిఖీ చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో హాస్టళ్ల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. హాస్టళ్లలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమస్యలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ -
మంచంలోనే సజీవదహనం..
కురవి: భార్య చనిపోయిందనే కారణంతో కొంతకాలంగా మనస్తాపం చెందుతున్న ఓ వ్యక్తి.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని మంచంలోనే సజీవదహనమయ్యాడు. ఈ ఘటన కురవిలో జరిగింది. ఎస్సై గండ్రాతి సతీశ్ కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని 747కాలనీకి చెందిన తరాల యాదగిరి(46) భార్య విజయ కొన్నేళ్ల క్రితం చనిపోయింది. అప్పటి నుంచి మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఇంట్లో మంచంలో పడుకున్నాడు. తల్లి నాగమ్మ కొడుకు అన్నం తినకపోవడంతో జొన్న గటక తాగించేందుకు ప్రయత్నించగా వద్దని అలాగే పడుకుని ఉన్నాడు. దీంతో తల్లి పనినిమిత్తం బయటకు వెళ్లింది. అనంతరం ఎవరూ లేని సమయంలో యాదగిరి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంచంలోనే సజీవదహనమయ్యాడు. ఇంటి నుంచి పొగలు వస్తుండగా కాలనీ వాసులు చూసి తలుపును తీసి చూడడంతో మంచంలోనే సజీవదహనమై కనిపించాడు. దీంతో వారు కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో వివిధ పనులకు వెళ్లిన మృతుడి తల్లి, చెల్లె, అన్న, తమ్ముడు వచ్చి యాదగిరి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. కొడుకు అఖిల్కు సమాచారం అందించడంతో తండ్రి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా రోదించాడు. ఈ ఘటనపై కుమారుడు అఖిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై సతీశ్ వివరించారు. కాగా, మృతుడికి కొడుకు అఖిల్, కుమార్తె దివ్య ఉన్నారు. భార్య చనిపోయిందనే మనస్తాపంతో పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్య ‘గటక’ ఎవరికి పోయాలి కొడుకా అంటూ గుండెలవిసేలా రోదించిన తల్లి కురవి మండల కేంద్రంలో విషాదంగటక ఎవరికి పెట్టాలి బిడ్డా.. చనిపోవడానికి ముందు పడుకుని ఉన్న కొడుకు ఆకలితో ఉన్నాడని భావించిన తల్లి నాగమ్మ జొన్న గటక తీసుకుని వచ్చి తాగమని బతిమిలాడింది. అయితే యాదగిరి తనకు ఆకలి కావడం లేదని వద్దనడంతో తల్లి పనినిమిత్తం బయటకు వెళ్లగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు చనిపోయిన విషయం తెలియగానే గటక కలిపిన గిన్నెతో అక్కడికి వచ్చి ఈ గటక ఎవరికి పెట్టాలి కొడుకా అంటూ తల్లి గుండెలవిసేలా రోదించింది. కొడుకు మృతదేహం మీద పడి బోరున విలపించింది. -
మార్కెట్లో వాకీటాకీలతో సమాచారం
కేసముద్రం: ప్రజాభద్రత కోసం పోలీసులు వాకీటాకీలను ఉపయోగించడం సహజంగా చూస్తుంటాం. కానీ రాష్ట్రంలో ఏ మార్కెట్లో లేని విధంగా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో కొత్తగా వాకీటాకీలను అమల్లోకి తీసుకువచ్చారు. ఇటీవల మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి ప్రత్యేక చొరవతో అధికారులు, సిబ్బందికి 10 వాకీటాకీలను అందజేశారు. మార్కెట్ యార్డుల్లో సరుకులను ఖరీదు చేసే సమయంలో, కాంటాలు, తొలకాలు జరిగేటప్పుడు, ఏమైనా సమస్యలు తలెత్తినా వెంటనే సిబ్బంది అప్రమత్తమై తమ వద్దనున్న వాకీటాకీల ద్వారా అధికారులకు సమాచారం అందిస్తున్నారు. మార్కెట్ యార్డుల్లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు మార్కెట్ అధికారులు వాకీటాకీల ద్వారా తెలుసుకుంటూ సిబ్బందికి తగు సూచనలు చేస్తున్నారు. సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం, సమస్యలు తెలుసుకొని, వెంటనే పరిష్కరిస్తున్నామని స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ అమరలింగేశ్వర్రావు తెలిపారు. కేసముద్రం మార్కెట్లో అమలు -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరోత్తంరెడ్డిని గెలిపించాలి
మహబూబాబాద్ అర్బన్: నల్లగొండ–వరంగల్–ఖమ్మం నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులి సరోత్తంరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు అన్నారు. బీజేపీ నాయకులు జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ బలపరిచిన పులి సరోత్తంరెడ్డిని గెలిపిస్తే పీఆర్సీ కోసం పోరాడుతామని, విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో నలంద డిగ్రీ విద్యాసంస్థల కరస్పాండెంట్ డాక్టర్ డోలి సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఒద్దిరాజు రామచంద్రరావు, యాప సీతయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి, నాయకులు మహేశ్, పద్మ, పాపారావు, సంపత్, ప్రేమ్కుమార్, నరేశ్ నాయక్, సుధాకర్, శ్రీకాంత్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
తెగుళ్ల నివారణపై అవగాహన
కేసముద్రం: మండలంలోని అమీనాపురం రైతులకు ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం వరంగల్కు చెందిన విద్యార్థినులు పంటలకు సోకే తెగుళ్లు, నివారణపై గురువారం అవగాహన కల్పించారు. వరి, మొక్కజొన్న పంటలకు సోకే అగ్గితెగులు, కాండం తొలుచు పురుగు, కత్తెర పురుగు వంటి తెగుళ్ల లక్షణాలను వివరించి నివారణ చర్యలను తెలి పారు. రైతులు ఆరిద్రపు శ్రీనివాస్, షేకిడి సారంగపాణి, గడిపెల్లి రవి, ఆరిద్రపు కుమార్, సతీష్, రవి, కస్తూరి వెంకన్న పాల్గొన్నారు. ఒకరికి ఏడాది జైలుశిక్ష డోర్నకల్: మండలంలోని వెన్నారం గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్పై దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి మహబూబాబాద్ కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. డోర్నకల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెన్నారం గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్పై 2019 ఫిబ్రవరి 11న అదే గ్రామానికి చెందిన అనపర్తి వెంకన్న డబ్బుల బాకీ విషయంలో గొడవపడి అసభ్యంగా ప్రవర్తించి దాడి చేయగా.. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ శ్యాంసుందర్ కేసు నమోదు చేయగా ఏఎస్సై సూరయ్య ఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. ఎనిమిది మంది సాక్షులను ప్రస్తుత సీఐ బి.రాజేశ్, కోర్టు కానిస్టేబుల్ నవీన్కుమార్ కోర్టులో హాజరుపర్చారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి.జయలత వాదనలు వినిపించగా అడిషనల్ జేఎఫ్సీఎం మెజిస్ట్రేట్ టి.తిరుపతి వెంకన్నకు ఏడాది జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. -
అధికారుల సూచనలు పాటించాలి
గూడూరు: రైతులు పంటల సాగులో తప్పనిసరిగా వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటించాలని ఏడీఏ శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని తీగలవేణిలో బుధవారం డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వేను పరిశీలించారు. అనంతరం మండలంలోని గాజులగట్టు, తీగలవేణి, గూడూరు, బొద్దుగొండ గ్రామాల్లోని ఎరువుల దుకాణాలలో యూరియా నిల్వను పరిశీలించారు. ఏఓ అబ్దుల్ మాలిక్, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. ఎరువుల గోదాం తనిఖీ కేసముద్రం: మండలంలోని పెనుగొండ గ్రామంలోని ధన్నసరి పీఏసీఎస్ సబ్సెంటర్కు చెందిన ఎరువుల గోదాంను మహబూబాబాద్ ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు పీఓఎస్ మిషన్, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తమ ఆధార్కార్డు, ఈపాస్ మిషన్ ద్వారానే ఎరువులను కొనుగోలు చేయాలన్నారు. రైతులు పంటకు కావాల్సిన మోతాదులోనే యూరియాను ఉపయోగించాలని, లేకుంటే వరి, మొక్కజొన్న పంటల్లో తెగుళ్ల ఉధృతి పెరిగే ప్రమాదం ఉందన్నారు. అనంతరం గ్రామ శివారు యాసంగిలో ఏఈఓలు చేస్తున్న డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వేను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఓ వెంకన్న, డివిజన్ సాంకేతిక వ్యవసాయ అధికారి రాజు తదితరులు పాల్గొన్నారు. -
దాతల సాయం
తొర్రూరు: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెరుగైన ఫలితాల కోసం కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఖాళీ కడుపుతో విద్యార్థులు ఇబ్బంది పడవద్దని మధ్యాహ్న భోజనం కోసం దాతలను సంప్రదించారు. వారు పెద్ద మనసుతో విద్యార్థుల కడుపు నింపేందుకు అంగీకరించారు. జిల్లాలోని తొర్రూరు, కేసముద్రం, మహబూబాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ వార్షిక పరీక్షల వరకు దాతలు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం మూడు కళాశాలల్లో కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఖాళీ కడుపుతో కళాశాలలకు.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటారు. దూర ప్రాంతాల నుంచి కళాశాలలకు వచ్చే వారికి ఇళ్ల నుంచి భోజనం తెచ్చుకోవడం ఇబ్బందిగా మారింది. ఉదయాన్నే తరగతులకు హాజరయ్యే హడావుడిలో ఏమీ తినకుండానే కళాశాలకు హాజరవుతున్నారు. ఆర్టీసీ బస్సుల సౌకర్యం లేని విద్యార్థులు ఆటోల ద్వారా కళాశాలకు వస్తున్నారు. కొందరు టిఫిన్ బాక్సుల్లో తెచ్చుకుంటున్న భోజనాలు తింటుండగా, మరికొందరు తాగునీటితోనే కడుపు నింపుకుంటున్నారు. జిల్లాలోని 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వీరి పరిస్థితిని గమనించిన ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు దాతలను సంప్రదించడంతో మధ్యాహ్న భోజనం అందించేందుకు ముందుకు వచ్చారు. తొర్రూరులో మదర్ వలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు సిరికొండ విక్రమ్కుమార్ను సంప్రదించగా పలువురు దాతలతో మాట్లాడి మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. కేసముద్రం, మహబూబాబాద్ కళాశాలల్లోనూ దాతలు చేయూత అందిస్తున్నారు. ఇంటర్ కళాశాలల్లో మధాహ్న భోజనానికి దాతృత్వం జిల్లాలోని మూడు కళాశాలల్లో అమలు -
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు సిద్ధం
బయ్యారం: నేటి నుంచి నాలుగు రోజుల పాటు వికారాబాద్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా జట్టును సిద్ధం చేశామని కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మద్ది వెంకట్రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని క్రీడామైదానంలో నిర్వహించిన శిక్షణ శిబిరం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో జిల్లా జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా, మండల బాధ్యులు స్వామి, చాంప్ల, అనిల్, సంపత్యాదవ్, లచ్చిరాం, శ్రీనివాస్, విష్ణు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక నిఘా
మహబూబాబాద్ రూరల్: గంజాయి, ఇసుక, పీడీఎస్ బియ్యం సరఫరా, క్రయవిక్రయాలు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. జిల్లాలోని పోలీసు అధికారులతో మహబూబాబాద్ టౌన్ పోలీస్స్టేషన్ సమావేశ మందిరంలో బుధవారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ పోలీసులు తమ విధి నిర్వహణలో పారదర్శకంగా, నిజాయితీగా, జవాబుదారీతనంతో ఉండాలన్నారు. డీఎస్పీలు తప్పకుండా తమ పరిధిలోని పోలీస్స్టేషన్లను సందర్శించి పనితీరు సమీక్షించాలన్నారు. మహిళా సంరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, షీ టీమ్స్ బృందాలను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరచిన పోలీసు సిబ్బందికి ప్రశంసపత్రాలు అందించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు తిరుపతిరావు, కృష్ణకిషోర్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
శివాజీ ఆశయ సాధనకు కృషి
– మరిన్ని ఫొటోలు 9లోuమహబూబాబాద్ అర్బన్: హిందూ సామ్రాజ్య స్థాపనకు పోరాడిన యోధుడు చత్రపతి శివాజీ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సిరికొండ సంపత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేవైఎం ఆధ్వర్యంలో బుధవారం శివాజీ జయంతిని పురస్కరించుకొని వేసి పాత, కొత్త బజారులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిరికొండ సంపత్ మాట్లాడుతూ అన్ని మతాలను సమానంగా ఆదరించి పరిపాలన చేసిన బహుజన వీరుడు చత్రపతి శివాజీ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వాలి
గార్ల: తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు పెన్షన్, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ బుధవారం పోస్ట్కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యమకారులు మాట్లాడుతూ ఎన్నికల ముందు సీఎం రేవంత్రెడ్డి ఉద్యమకారులకు నెలకు రూ.25,000 పెన్షన్, 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తామన్న హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం ఉద్యమకారులు హామీలు నెరవేర్చాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డికి పోస్టు చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు కొమర్రాజు జగదీష్, ఎస్కె జాని, జడ సత్యనారాయణ, జి.సక్రు, శివాజీ, నాగాచారి, రవి, సురేందర్, రుక్మారావు, సునీత, మల్లిబాబు, యాకూబ్పాషా, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యుత్ అందించాలి
కొత్తగూడ/గంగారం: యాసంగి పంటలకు ఇబ్బందు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించాలని ట్రాన్స్కో చీఫ్ ఇంజనీర్ (ఆపరేషన్) వరంగల్ రాజు చౌహన్ తెలిపారు. బుధవారం కొత్తగూడ, గంగారం మండలాల్లోని సబ్ స్టేషన్లను పరిశీలించారు. లో ఓల్టేజీ సమస్యను అధికమించడానికి 600 కేవీఏఆర్ కెపాసిటర్ లైన్ పనులను పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్తగూడ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్లో జరుగుతున్న మరమ్మతు పనులు తనిఖీ చేశారు. అనంతరం రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగాలంటే ఆటోమేటిక్ స్టార్టర్లు తొలగించి కెపాసిటర్లు బిగించుకో వాలని రైతులకు సూచించారు. అలాగే గంగారం మండలంలోని చింతగూడెం గ్రామాన్ని సందర్శించిన చీఫ్ ఇంజనీర్ రాజు చౌహన్ విద్యుత్ సమస్యల ను అడిగి తెలుసుకున్నారు. ఉచిత కరెంట్ కోసం వినియోగదారులు ప్రజాపాలన దరఖాస్తుతో ఎంపీడీఓ కార్యాలయంలో సంప్రదించాలని సూచించా రు. ఆయన వెంట మహబూబాబాద్ ఏడీఈ కవిత, కొత్తగూడ ఏఈ సురేష్, సిబ్బంది ఉన్నారు. రైతులు ఆటోమేటిక్ స్టార్టర్లు తొలగించాలి ట్రాన్స్కో సీఈ రాజు చౌహన్ -
ఆర్థిక ఒడిదుడుకులు
తలసరి ఆదాయంలో భూపాలపల్లే బెటర్.. 2022–23లో రంగారెడ్డి జిల్లా రూ.9,54,949 తలసరి ఆదాయంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవగా.. రూ.2,28,655తో జయశంకర్ భూపాలపల్లి జిల్లా 15వ స్థానంలో నిలిచింది. అయితే 2021–22 ఇది రూ.2,34,132 కాగా ఈసారి రూ.5,477 తగ్గినా.. మిగతా జిల్లాలతో పోలిస్తే ఎక్కువై 15వ స్థానంలో ఉంది. వరంగల్ రూరల్ (వరంగల్) గతంలో రూ.1,94,317తో 16వ స్థానంలో ఉండగా.. ఈసారి రూ.2,20,174కు పెరిగినా 18వ స్థానంలో నిలిచింది. అలాగే, రూ.1,86,278 ఉన్న జనగామ ఈసారి రూ.2,21,424తో 16, రూ.1,79,222తో 20వ స్థానంలో ఉన్న మహబూబాబాద్ రూ.2,00,309తో 25వ స్థానం, రూ.1,77,316తో 21వ స్థానంలో ఉన్న ములుగు రూ.2,15,772తో 19 స్థానాల్లో నిలవగా, రూ.1,56,086తో చివరి స్థానంలో నిలిచిన వరంగల్ అర్బన్ (హనుమకొండ) ఈసారి రూ.1,86,618తో 31వ స్థానంలో ఉంది.సాక్షి ప్రతినిధి, వరంగల్: జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వెనకబాటు కనిపిస్తోంది. జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల అభివృద్ధి వృద్ధి రేటు రాష్ట్రంలోనే వెనుకబడి ఉంది. వరంగల్ అర్బన్ (హనుమకొండ) 14వ స్థానంలో ఉండగా.. వరంగల్ రూరల్ 22, (వరంగల్), మహబూబాబాద్ 23 స్థానాల్లో నిలిచాయి. 2021–22 సంవత్సరానికి ప్రస్తుత ధరల్లో జీడీడీపీ విలువ పెరుగుదల కనిపించినప్పటీకి రాష్ట్రస్థాయిలో మిగతా జిల్లాలతో పోలిస్తే ఆశించిన స్థాయిలో వృద్ధి సాధించలేదు. తలసరి ఆదాయం విషయానికి వస్తే జయశంకర్ భూపాలపల్లి 15వ స్థానంలో నిలిచింది. జాతీయ ధరల సూచీ ప్రకారం దీనిని గణిస్తారు. ఇదే సమయంలో మిగతా ఐదు జిల్లాలు తలసరి ఆదాయంలో తెలంగాణలోని మిగతా జిల్లాలతో వెనుకబడి ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక, గణాంకశాఖ ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ రాష్ట్ర గణాంకాల నివేదిక– అట్లాస్–2024’లో ఈ వివరాలు వెల్లడించారు. పడుతూ లేస్తూ 14, 15 స్థానాల్లోనే.... ఉమ్మడి వరంగల్లో ఆరు జిల్లాలు ఉండగా.. 2022–23 సంవత్సరానికిగాను ఆర్థిక వృద్ధిలో రాష్ట్రంలోని 33 జిల్లాలలో పోటీ పడలేకపోయాయి. జిల్లా స్థూల దేశీయోత్పత్తిలో 14వ స్థానంలో హనుమకొండ, తలసరి ఆదాయంలో 15వ స్థానంలో జేఎస్ భూపాలపల్లి జిల్లాలు నిలిచాయి. మిగతా నాలుగు జిల్లాలు అ తరువాతి స్థానాలకే పరిమితమయ్యాయి. జీడీడీపీలో వరంగల్ 22, మహబూబాబాద్ 23, జనగామ 29, జేఎస్ భూపాలపల్లి 31 స్థానాల్లో నిలవగా.. రూ.7.583 కోట్లతో ములుగు జిల్లా అన్నింటికన్న చివరన నిలిచింది. జిల్లాల ఆర్థికాభివృద్ధికి సూచికగా జీడీడీపీని పరిగణించగా, అభివృద్ధి అంతా రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కేంద్రీకృతం కాగా, నగరాలు, పట్టణ ప్రాంతాల్లో కొద్దిగా మెరుగ్గా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. గ్రేటర్ వరంగల్ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి కారణంగా ఆర్థికవృద్ధిలో టాప్–2లో నిలిచినట్లు చెబుతున్నారు. పట్నవాసం వద్దు, పల్లె నివాసమే బెస్ట్.... ఉమ్మడి వరంగల్లో 38,20,369 జనాభా ఉంది. ఇందులో 28,28,036 మంది పల్లెల్లో, 9,92,333 మంది పట్టణాల్లో జీవనం గడుపుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ప్రజలు నివాసం పట్టణం/నగరాలైన హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి తర్వాత స్థానంలో హనుమమకొండ నిలిచింది. ఉమ్మడి వరంగల్లో హనుమకొండ మినహా ఐదు జిల్లాల్లో జ నం ఊళ్లలోనే ఉంటున్నారు. హనుమకొండ జిల్లాలో మాత్రమే 10,62,247 మంది జనాభాలో 5,63,629 (53.1 శాతం) మంది పట్నంలో ఉంటుండగా, 4,98, 618 (46.9 శాతం) మంది గ్రా మాల్లో ఉంటున్నారు. వరంగల్ జిల్లాలో 7,37,148 మంది 69.2 శాతం మంది పల్లెటూళ్లలో, 30.8 శాతం మంది పట్టణవాసం చేస్తున్నారు. జనగామలో 5,34,991 జనాభాకు 4,63, 634 (86.7 శాతం) మంది గ్రామాల్లో, 71,357 (13.3 శాతం) పట్టణాల్లో, జేఎస్ భూపాలపల్లిలో 4,16,763 మందికి 3,74,376 (89.8 శాతం) గ్రామాల్లో, 42,387 (10.2 శాతం) పట్టణాల్లో ఉంటున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో 7,74,549 మందికి 6,98,173 (90.1 శాతం), పల్లెలు, తండాల్లో, 76,376 (9.9 శాతం) మందే పట్టణాల్లో ఉంటుండగా.. ములుగు జిల్లాలో 2,94,671కి 96.1 శాతం మంది పల్లెటూళ్లలో ఉంటుండగా.. కేవలం 11,493 (3.9 శాతం) మంది పట్నవాసం చేస్తున్నారు.జిల్లాల వారీగా మొత్తం జనాభా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇలా..జిల్లా మొత్తం గ్రామీణం పట్టణ/నగరం జనాభా జనాభా జనాభా హనుమకొండ 10,62,247 4,98,618 5,63,629 వరంగల్ 7,37,148 5,10,057 2,27,091 జనగామ 5,34,991 4,63,634 71,357 జేఎస్.భూపాలపల్లి 4,16,763 3,74,376 42,387 మహబూబాబాద్ 7,74,549 6,98,173 76,376 ములుగు 2,94,671 2,83,178 11,493 మొత్తం 38,20,369 28,28,036 9,92,333జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి జిల్లా వెనకబాటు రూ.7,583 కోట్లతో ఆఖరున ములుగు జేఎస్ భూపాలపల్లిలో తగ్గి.. ఐదు జిల్లాల్లో పెరిగిన ‘తలసరి’ 15వ స్థానంలో జేఎస్ భూపాలపల్లి హనుమకొండ జిల్లాలో అర్బన్ జనాభా.. మిగతా ఐదు జిల్లాల్లో పల్లెవాసమే ‘రాష్ట్ర గణాంకాల నివేదిక– అట్లాస్–2024’లో వెల్లడి -
కమిషనరేట్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఎదుట బుధవారం ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సుబేదారి ఇన్స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి కథనం ప్రకారం.. కాజీపేటకు చెందిన ఓ మహిళ రెండో వివాహం చేసుకుంది. అనంతరం రెండో భర్తపై అత్యాచారం కేసు పెట్టింది. ఆ కేసు విషయంలో సదరు మహిళ అక్కాబావ సాక్షులుగా ఉన్నారు. ఈ క్రమంలో మంగళవారం కోర్టులో సదరు మహిళ అక్కాబావ గొడవ పెట్టుకున్నారు. అనంతరం ఏం విషయంలో.. ఏం జరిగిందో తెలియదు కానీ సదరు మహిళ.. అక్కాబావపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీపీ కార్యాలయంలో ఎదుట కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా భద్రతా సిబ్బంది అడ్డుకుని సుబేదారి పీఎస్కు తరలించారు. ఈ ఘటనలో సదరు మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
మానసిక సంసిద్ధత
సాక్షి, మహబూబాబాద్: సహజంగానే విద్యార్థులకు పరీక్షలు అంటే భయం ఉంటుంది. అందులో పదో తరగతి పరీక్షలంటే మరింత ఎక్కువ భయపడతారు. దీనికి తోడు తరచూ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, జిల్లా అధికారులు, తల్లిదండ్రులు ఉత్తమ మార్కులు తెచ్చుకోవాలని ఒత్తిడి చేస్తా రు. దీంతో విద్యార్థుల్లో భయంతో పాటు సందిగ్ధం నెలకొంటుంది. కాగా పదో తరగతి విద్యార్థులను మానసికంగా సంసిద్ధం చేసేందుకు జిల్లా విద్యాశా ఖ అధికారులు మోటివేషన్ కార్యక్రమ నిర్వహణకు సిద్ధమయ్యారు. భయం వీడండి.. బాగా చదవండి అంటూ విద్యార్థులకు మనోధైర్యం కల్పిస్తున్నారు. ఇటీవల జరిగిన సంఘటనలతో.. విద్యాశాఖ, అధికారుల పనితీరుకు పదో తరగతి ఫలితాలు ప్రామాణికం అనే ప్రచారం జరుగుతోంది.దీంతో విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే వి ద్యార్థులపై ఒత్తిడి పెంచేలా పలువురు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వ్యవహరిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రతీ పాఠశాలలో మోటివేషన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రతీ పాఠశాల నుంచి ఒకరు.. పదో తరగతి విద్యార్థులకే కాకుండా 8, 9, 10 తరగతుల విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే ప్రధానంగా టెన్త్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ కార్యక్ర మానికి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో బో ధించే నలుగురు ఉపాధ్యాయులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి శిక్షణకు పంపించారు. పదిరోజుల పాటు శిక్షణ పొందిన నలుగురు మాస్టర్స్ ట్రైనర్స్ జిల్లాలోని 102 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 15 కేజీబీవీలు, ఎనిమిది మోడల్ స్కూల్స్ మొత్తం 215 పాఠశాలల నుంచి ఒక్కొక్క ఉపాధ్యాయుడిని ఎంపిక చేశారు. వీరికి జిల్లా కేంద్రంలో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు వారు బోధించే పా ఠశాలల్లో పరీక్షలు అంటే భయం పొగొట్టడంతో పాటు ఒత్తిడి లేకుండా చదవడం, పరీక్షలు రాసేందుకు సిద్ధం చేస్తున్నారు. సులభంగా బోధించేందుకు.. ఒక వైపు మోటివేషన్ తరగతులు నిర్వహిస్తూనే.. పరీక్షలు అంటే భయం పోయేవిధంగా సులభంగా బోధించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. పరీక్షలు అంటే భయం వీడేందుకు 25శాతం సిలబస్తో 28 రివిజన్ టెస్ట్లు నిర్వహించి ఆ ఫలితాల ఆధారంగా బోధన చేయడం, గత నాలుగు, ఐదు సంవత్సరాల పరీక్ష పేపర్లు తీసుకొని వాటిలోని ప్రతీ ప్రశ్నకు విద్యార్థి సమాధానం రాసేలా సిద్ధం చేస్తున్నారు. వార్షిక పరీక్షలు ప్రారంభం నాటికి సిలబస్ కవర్ అయ్యేలా ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.టెన్త్ విద్యార్థులకు మోటివేషన్ తరగతులు పరీక్షలపై భయం తొలగేలా కౌన్సెలింగ్ వందశాతం ఫలితాల కోసం ప్రణాళికలు జిల్లాలో 8,192 మంది పదో తరగతి విద్యార్థులుపరీక్షలంటే భయం వీడాలి మరిపెడ: పరీక్షలంటే భయం వీడాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. మరిపెడలోని సోషల్ వెల్ఫేర్, ట్రైబర్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలను బుధవారం రాత్రి కలెక్టర్ సందర్శించారు. స్టడీ అవర్లో విద్యార్థుల వద్దకు వెళ్లి పరీక్షల సంసిద్ధతపై అడిగి తెలుసుకున్నారు. సబ్జెక్టులో ఏమైన సమస్యలు ఉంటే సంబంధిత ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలన్నా రు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షల సమయం కావడంతో మెనూ ప్రకారం నాణ్య మైన భోజనం అందించాలని సూచించారు. వసతి గృహంలోని పరిసరాలను పరిశీలించి నిత్యం శానిటేషన్ చేయాలన్నారు. జిల్లాలో టెన్త్ విద్యార్థుల వివరాలు.. పాఠశాల సంఖ్య విద్యార్థులు జిల్లా పరిషత్ 97 2,932ప్రభుత్వ 02 134కేజీబీవీలు 15 496మోడల్ స్కూల్స్ 08 735ఏజెన్సీ హైస్కూల్స్ 18 764అన్ని రకాల గురుకులాలు 19 1,282ప్రైవేట్ 45 1,849మొత్తం 204 8,192బాలురు : 4,189బాలికలు : 4,003 -
ఆర్టీసీ అభివృద్ధికి ప్రతీ ఉద్యోగి కృషి చేయాలి
హన్మకొండ: ఆర్టీసీ అభివృద్ధికి ప్రతీ ఉద్యోగి కృషి చేయాలని వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయ భాను అన్నారు. బుధవారం హనుమకొండలోని వరంగల్ రీజియన్ కార్యాలయంలో రీజినల్ మేనేజర్ డి.విజయభానుకు ఆర్టీసీ బీసీ సంక్షేమ సంఘం వరంగల్ రీజియన్ నూతన కమిటీని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇ.నిరంజన్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎం విజయభానును సన్మానించారు. ఆర్ఎం మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ఈ క్రమంలో ప్రయాణికుల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ ఆ దాయం పెంచుతూ సంస్థకు మంచి పేరు తీసుకురా వాలన్నారు. ఆర్టీసీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి నిరంజన్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించా లని కోరారు. అనంతరం డిప్యూటీ ఆర్ఎం (ఆపరేషన్స్) కేశరాజు భానుకిరణ్కు బీసీ సంక్షేమ సంఘం వరంగల్ రీజియన్ కమిటీని పరిచయం చేసి సన్మానించారు. కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం వరంగల్ రీజియన్ చీఫ్ అడ్వయిజర్ ఎం. ఎస్.రావు, రీజియన్ అధ్యక్షుడు గొలనకొండ వే ణు, వర్కింగ్ ప్రెసిడెంట్లు వి.అంజనీదేవి, వేము ల రవి, ఉపాధ్యక్షుడు ఎం.మంజుల, కార్యదర్శి మా దారపు సాంబయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ దద్దనాల ఉమాదేవి, కోశాధికారి పి.రాధిక, నాయకులు జి. ఎస్.పాణి, కె.దేవేందర్, కె.ప్రభాకర్ పాల్గొన్నారు.● వరంగల్ ఆర్ఎం విజయభాను -
పెరిగిన విద్యుత్ డిమాండ్..
హన్మకొండ: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది. వేసవిలో పెరగాల్సిన డిమాండ్ ఈసారి ఫిబ్రవరిలోనే పెరిగింది. ఫలితంగా ఈ నెల 10న అత్యధికంగా రాష్ట్రంలో 15,998 మెగావాట్లకు చేరుకుంది. బుధవారం విద్యుత్ డిమాండ్ 16,058 మెగావాట్లకు చేరుకుంది. అదే విధంగా టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ఈ నెల 10న విద్యుత్ సరఫరా డిమాండ్ 5,361 మెగావాట్లు ఉండగా బుధవారం 5,497 మెగావాట్లకు చేరుకుంది. ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతుండడంతో విద్యుత్ ఉపకరణాలు వినియోగం పెరిగింది. ఏసీలు, కూలర్లు వాడుతుండడంతో పాటు పంటల సాగుకు నీటి అవసరాలు పెరుగడంతో భూగర్భ జలాలు తోడేందుకు విద్యుత్ వినియోగం పెరిగింది. దీంతో విద్యుత్ సరఫరా డిమాండ్ పెరిగింది. బుధవారం రాష్ట్రంలో అత్యధికంగా 16,058 మెగావాట్లు టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో 5,497.. -
తాగునీటి సమస్య లేకుండా చూడాలి
● జెడ్పీసీఈఓ పురుషోత్తం కేసముద్రం: వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా పంచాయతీ కార్యదర్శులు ముందస్తు చర్యలు తీసుకోవాలని జెడ్పీసీఈఓ పురుషోత్తం ఆదేశించారు. బుధవారం కేసముద్రం, ఇనుగుర్తి మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో జీపీ కార్యదర్శులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాలు, తండాల్లో ఎక్కడ తాగునీటి సమస్య ఉందనే విషయాన్ని, మిషన్ భగీరథ నీళ్లు రాని ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు క్రాంతి, హరిప్రసాద్, కార్యదర్శులు పాల్గొన్నారు. హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవాలి దంతాలపల్లి: ప్రతిఒక్కరూ హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవాలని రాష్ట్ర ఎయిడ్స్ నిర్ధారణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శాంతకుమార్ తెలిపారు. సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యం వరంగల్ డాప్క్ ములుగు దిశ సమన్వయంతో బుధవారం మండల కేంద్రంలో మొబైల్ వ్యాన్లో హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్పై ప్రజలకు ఉన్న అపోహలను తొలగించడానికే అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కుమారస్వామి, నాగేందర్బాబు, మానిటరింగ్ అధికారి రాయిశెట్టి యాకేందర్, బాలాజీ, సంధ్య, సారయ్య, సలేహా పాల్గొన్నారు. ఉద్యోగుల పోస్టింగులపై ఆరా నెహ్రూసెంటర్: నూతనంగా గ్రూపు–4లో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వలేదు. దీంతో ఈ నెల 19వ తేదీన(బుధవారం) సాక్షిలో ‘కొత్త ఉద్యోగుల హైరానా’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన కలెక్టర్ ఉద్యోగుల కేటాయింపుపై ఆరా తీసి నివేదిక సమర్పించాలని అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారిని ఆదేశించారు. దీంతో బుధవారం అదనపు కలెక్టర్ డీఎంహెచ్ఓ కా ర్యాలయంలో గ్రూప్–4 ఉద్యోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులకు వెంటనే పోస్టింగుల ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. సీఎంఆర్ సకాలంలో పూర్తి చేయాలిమహబూబాబాద్: జిల్లాలోని రైస్ మిల్లుల యజమానులు సీఎంఆర్ను సకాలంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మచారి ఆదేశించారు. బుధవారం పట్టణంలోని శ్రీసాయి, జగదాంబ రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్ధేశించిన లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేయాలన్నారు. సీఎంఆర్ వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిచారు. అదనపు కలెక్టర్ వెంట డీఎస్ఎస్ఓ ప్రేమ్కుమార్, సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణి తదితరులు ఉన్నారు. ఆయిల్పామ్ తోటల పరిశీలన కురవి: మండల కేంద్రంలోని ఆయిల్పామ్, మామిడి తోటలను జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి జినుగు మరియన్న బుధవారం పరిశీలించారు. వేసవిలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. చిన్న మొక్కలకు రోజుకు 150–165 లీటర్ల నీటిని అందించాలని, ఎదిగిన చెట్లకు 250–330 లీటర్ల నీటిని అందించాలని సూచించారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పంటలను కాపాడుకోవాలన్నారు. -
తెలుగు విభాగం అధిపతిగా లింగయ్య
● కేయూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం అధిపతిగా కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మామిడి లింగయ్య నియమితులయ్యారు. బుధవారం రాత్రి రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఆయనకు వీసీ, రిజిస్ట్రార్ ఉత్తర్వులు అందించారు. ఆ విభాగం అధిపతిగా, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రొఫెసర్ ఏటూరు జ్యోతి ఈ ఏడాది జనవరిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ విభాగంలో రెగ్యులర్ ప్రొఫెసర్లు ఎవరూ లేరు. నలుగురు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తుండగా సీనియార్టీ ప్రాతిపదికనే నియమించాల్సి ఉన్నప్పటికీ వెంటనే నియమించకుండా యూనివర్సిటీ అధికారులు జాప్యం చేశారు. గత నెలాఖరులో సీనియార్టీని తేల్చేందుకు కమిటీ వేయగా, చైర్మన్ ప్రొఫెసర్ టి.మనోహర్ రెండు రోజుల క్రితం రిపోర్టు ఇచ్చారు. సీనియర్గా ఉన్న మామిడి లింగయ్యనే నియమించారు. లింగయ్య 2004లో తెలుగు విభాగంలో పార్ట్టైం లెక్చరర్గా ప్రవేశించారు. 2013లో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పదోన్నతి పొందారు. తెలుగు విభాగం అధిపతిగా నియామకంతోపాటు యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్కాలేజీ నుంచి బదిలీ కూడా చేశారు. గురువారం ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. బీఓఎస్ నియామకంలో జాప్యం.. నలుగురు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లలో సీనియార్టీని తేల్చి రిపోర్టును కమిటీ ఇచ్చినప్పటికీ విభాగం అధిపతిని మాత్రమే నియమించారు. బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్గా ఎవరినీ నియమించలేదు. రెండో సీనియార్టీ ప్రకారం డాక్టర్ మంథిని శంకర్ను నియమించాల్సింది. సీనియార్టీలో మూడో స్థానంలో ఉన్న డాక్టర్ చిర్రరాజు తనను బీఓఎస్గా నియమించాలని అధికారులను కోరుతున్నట్లు చర్చగా ఉంది. గతంలో ఒకసారి మంథిని శంకర్ బీఓఎస్గా బాధ్యతలు నిర్వర్తించారని, ఈసారి తనకు అవకాశం కల్పించాలని అడిగినట్లు సమాచా రం. ఆ కమిటీ రిపోర్టు ప్రకారం సీనియార్టీలో రెండో స్థానంలో ఉన్న మంథిని శంకర్ను నియమిస్తారా లేక మూడో స్థానంలోని చిర్ర రా జును నియమిస్తారా అనే అంశం ఒకటిరెండురోజుల్లో తేలిపోనుంది. -
రోడ్డు ప్రమాద నిందితులకు జైలు
● వివరాలు వెల్లడించిన సీఐ క్రాంతికుమార్పరకాల: పరకాల పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతికి కారణ మైన ఇద్దరి నిందితులకు జైలు శిక్షపడింది. పరకాల సీఐ క్రాంతికుమార్ కథ నం ప్రకారం.. 2015లో పరకాలలోని ఎం.ఆర్ రెడ్డి కళాశాల సమీపంలో ద్విచక్రవా హనంపై వెళ్తున్న హసన్పర్తి మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన పుట్ట యుగేంధర్ను మరో ద్విచక్రవాహనంపై వెళ్తున్న నిజాంపల్లి గ్రామానికి చెందిన కుంచాల లింగమూర్తి ఢీకొన్నాడు. దీంతో యుగేంధర్ కిందపడిపోగా..అదే సమయంలో లారీ అతడిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య సంధ్య ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై దీపక్ కేసు నమోదు చేయగా కోర్టు కానిస్టేబుల్ నాగరాజు, సారంగపాణి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. వాదోపవాదాలు విన్న పరకాల అడిషనల్ జ్యూడిషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ శాలినిలింగం.. నిందితులు ఇద్దరు లింగమూర్తికి 2 సంవత్సరాలు, లారీ డ్రైవర్ ఎస్.డి యాసిన్ పాషాకు 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఇద్దరికి రూ.6వేల జరిమానా విధించినట్లు సీఐ క్రాంతికుమార్ బుధవారం తెలిపారు. -
తల్లులూ.. చల్లంగ చూడండి
ఘనంగా తిరుగువారం పండుగఎస్ఎస్ తాడ్వాయి : మేడారం సమ్మక్క, సారలమ్మ మినీజాతర (మండమెలిగె) ఈనెల 15న (శనివా రం) ముగిసింది. ఈ క్రమంలో బుధవారం మేడా రం, కన్నెపల్లి ఆలయాల్లో తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించారు. మేడారం సమ్మక్క గుడిలో పూజారులు అమ్మవారి శక్తి పీఠాన్ని, అమ్మవారి శక్తి పీఠం గద్దెను అలంకరించారు. అనంతరం సమ్మక్క శక్తి పీఠాన్ని ఐదుగురు పూజారుల చేతుల మీదుగా గద్దె పై పెట్టారు. తర్వాత అమ్మవారికి సారా, కల్లు, పాలను ఆరగింపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుగువారం పండుగ సందర్భంగా పూజారులు కుటుంబీకులు, ఆదివాసీలు సమ్మక్క గుడికి వెళ్లి పూజలు నిర్వహించారు. అలాగే, కన్నెపల్లి సారలమ్మ గుడిలో పూజారులు తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించారు. సారలమ్మ గుడి వడేరాల కుండలు, గంటలు, వస్త్రాలు శుద్ధి చేసి పూజలు నిర్వహించిన అనంతరం భద్రపరిచారు. పూజారులు సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు కుటుంబ సమేతంగా సమ్మక్క గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సమ్మక్క పూజారులు సిద్ధబోయిన మునీందర్, నితిన్, మహేశ్, సిద్ధబోయిన భోజారావు, దశరథ, కొక్కెర కృష్ణయ్య, దూపవడ్డె నాగేశ్వరరావు, మల్లెల సత్యం, పూర్ణ, సిద్ధబోయిన నర్సింగరావు, సారలమ్మ పూజారులు కాక సారయ్య, కాక కిరణ్, తదితరులు పాల్గొన్నారు. కాగా, మినీజాతర ముగిసిన నేపథ్యంలో వచ్చే ఏడాది మహాజాతరకు ప్రభుత్వ వర్గాలు సిద్ధమవుతున్నాయి. ఎండోమెంట్ సూపరిండెంటెంట్ క్రాంతికుమార్, జూనియర్ అసిస్టెంట్లు బాలకృష్ణ, జగదీశ్.. భక్తులకు సేవలందించారు. అమ్మవార్లకు భక్తుల తిరుగువారం మొక్కులు.. తిరుగువారం పండుగ సందర్భంగా భక్తులు వేలాదిగా మేడారానికి తరలివచ్చారు. జంపన్నవాగు షవర్ల కింద స్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకుని కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుగువారం పండుగతో మినీ జాతర పూజా కార్యక్రమాలు ముగిశాయి. ఈనెల 23న (ఆదివారం) ఆనవాయితీగా పూజారులు వనభోజనాలు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూనుగొండ్ల గ్రామంలో.. గంగారం : మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలో పగిడిద్దరాజు తిరుగువారం జాతర బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు బిందెలతో నీళ్లు ఆరబోశారు. కార్యక్రమంలో పెనక పురుషోత్తం, పెనక రాజేశ్, పెనక సాంబయ్య, రామస్వామి, వెంకటయ్య, వడ్డె కల్తి జగ్గారావు, పెనక సమ్మయ్య, పెనక రాహుల్ తదితరులు పాల్గొన్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారులు మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో మొక్కుల చెల్లింపులు తరలివచ్చిన వేలాది మంది భక్తులు ముగిసిన మినీ మేడారం జాతరతల్లుల దీవెనలతో జాతర విజయవంతం..సమ్మక్క, సారలమ్మల దీవెనలతో మినీ జాతర విజయవంతమైంది. స్థానిక ఆదివాసీ బిడ్డ, మంత్రి సీతక్క ఈ సారి మినీ జాతరపై ప్రత్యేక దృష్టి సారించి రూ.5 కోట్లు కేటాయించి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించారు. మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర, జిల్లా అధికారుల సమన్వయంతో మినీజాతర విజయవంతమైంది. మళ్లీ మహాజాతర నాటికి ప్రభుత్వం మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలి. – సిద్ధబోయిన జగ్గారావు, పూజారుల సంఘం అధ్యక్షుడు -
బస్టాండ్లో ఒంటరి మహిళలే లక్ష్యంగా..
వరంగల్ క్రైం : రద్దీ సమయాల్లో బస్టాండ్లో ఒంటరి మహిళలే లక్ష్యంగా బంగారు ఆభరణాలు చోరీలకు పా ల్పడుతున్న దంపతులను అరెస్ట్ చేసినట్లు హనుమకొండ ఏసీపీ కొత్త దేవేందర్రెడ్డి తెలిపారు. వీరి నుంచి సుమారు రూ. 7.50 లక్షల విలువైన 80.5 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండల కేంద్రంలోని వడ్డెర కాలనీకి చెందిన బొంత జ్యోతి, కిషన్ దంపతులు రోజు వారి కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే కూలీ ద్వారా వచ్చే ఆదాయం ఇంటి ఖర్చులకు సరిపోకపోవడంతోపాటు కొద్దికాలంగా ఇద్దరికీ ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో పరిచయస్తుల వద్ద అప్పు చేశారు. తిరిగి చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. దీంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పాల్పడాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా బస్టాండ్లో రద్దీ సమయాల్లో ఒంటరి మహిళా ప్రయాణికులే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నారు. మహిళా ప్రయాణికులు బస్సు ఎక్కే సమయంలో నిందితులు బంగారు ఆభరణాలు చోరీ చేసి పరారవుతున్నారు. ఇదే రీతిలో ఈ నెలలో హనుమకొండ బస్టాండ్లో మూడు చోరీలకు పా ల్పడ్డారు. ఈ చోరీలపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకున్న హనుమకొండ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు టీం ఏర్పాటు చేసి నిందితులను గుర్తించారు. చోరీ సొత్తును హనుమకొండలోని ఏదేని బంగారు దుకాణంలో విక్రయించేందుకు బుధవారం ఉదయం చౌరస్తాకు రావడంతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఈ దంపతులపై అనుమానం కలిగింది. దీంతో వారి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా బంగారు ఆభరణాలు లభించాయి. దీంతో అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు నిందితులు అంగీకరించడంతో అరెస్ట్ చేసినట్లు ఏసీపీ దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. చోరీలకు పాల్పడుతున్న దంపతుల అరెస్ట్ ● రూ. 7.50 లక్షల విలువైన 80.5 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన హనుమకొండ ఏసీపీ దేవేందర్రెడ్డి -
ఆర్టీసీ ఉద్యోగులకు ‘పవర్’
శారీరకంగా, మానసికంగా సన్నద్ధం చేయడమే లక్ష్యంగా శిక్షణ.. హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను శారీరకంగా, మానసికంగా సన్నద్ధులను చేసి శక్తివంతులుగా తీర్చిదిద్దడానికి ‘పవర్’ పేరుతో శిక్షణ కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే ఆదాయం పెంపుతోపాటు సంస్థ పరిరక్షణకు ‘ఒక గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం’, ‘ఏప్రిల్–ఆగస్ట్ చాలెంజ్ ఫర్ ట్రైనింగ్’ వంటి శిక్షణ కార్యక్రమాలు చేపట్టింది. ఈ కార్యక్రమాలు సత్ఫలితాలు ఇవ్వడంతో మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఉద్యోగులు, సూపర్వైజర్లకు అవసరమైన నైపుణ్యాలు, మెళకువలు నేర్పి వారిని శారీరకంగా, మానసికంగా శక్తివంతులను చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ‘పవర్’ (పీక్ ఫార్మామెన్స్ త్రూ ఓనర్షిప్ విత్ ఎంపతి రిజాల్వ్) పేరుతో ఉద్యోగులకు శిక్షణ ఇస్తోంది. సంస్థలో ఉద్యోగుల భాగస్వామ్యం, ప్రయాణికులతో సహానుభూతితో అత్యున్నత ఫలితాల సాధనకు ధృఢసంకల్పంతో ముందుకు సాగడం ఈ కార్యక్రమం లక్ష్యం. సంస్థకు ప్రయాణికులే ప్రధాన వనరు. ఈ క్రమంలో వారిపై ఉద్యోగులు మర్యాదగా ప్రవర్తించడం, వారిని ఆర్టీసీ వైపు ఆకర్షించేలా చేయడం, ప్రశాంత మనస్సుతో విధులకు హాజరుకావడానికి తీసుకోవాల్సిన విశ్రాంతి, శారీరకంగా దృఢంగా ఉండడానికి చేపట్టాల్సిన క్రియలు, ఇతర అంశాలు ఈ శిక్షణలో బోధించి ఉద్యోగులను సన్నద్ధం చేస్తారు. ఉద్యోగుల ఆరోగ్యం ముఖ్యం.. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతీ డిపోలో ఒక సేఫ్టీ వార్డెన్, ఇద్దరు హెల్త్ వలంటీర్లను నియమించారు. వీరు ఆ డిపోలోని ప్రతీ ఉద్యోగి ఆరోగ్యాన్ని గమనిస్తుంటారు. ఏదేని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటే వారికి అవసరమైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటారు. ఔషధాలు సమయానుకూలంగా వాడేలా వారిని జాగృతం చేస్తారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి మందులు సరిగా వేసుకునేలా సూచనలు చేస్తారు. తద్వారా ఆ ఉద్యోగి ఆరోగ్యంగా ఉండేలా చూస్తారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడానికి నిర్దేశం చేస్తారు. అదే విధంగా డ్రైవర్లు ప్రమాదాలు చేయకుండా ఉండేందుకు, సురక్షిత డ్రైవింగ్, ఇంధన పొదుపుపై శిక్షణ ఇచ్చేందుకు ప్రతి డిపోలో సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ను నియమించారు. ఆదా యం, కేఎంపీఎల్ అధ్యయనం చేసేందుకు ప్రతీ డిపోకు 20 మంది మెంటార్స్ను నియమించారు. వీరు నిర్దేశించిన లక్ష్యం వైపు నడిచేలా జాగ్రత్తలు వివరిస్తారు. టార్గెట్ మేరకు ఆదాయం వచ్చిందా..? ఇంధన పొదుపు జరుగుతుందా వంటి అంశాలను పరిశీలిస్తూ వారికి కావాల్సిన సూచనలు ఇస్తారు. ఈ నెల 18వ తేదీన ప్రారంభంఉద్యోగులను కార్యోణ్ముకులను చేసేందుకు..ఆర్టీసీలో పని చేస్తున్న ఉద్యోగులను కార్యోణ్ముకులను చేసేందుకు సంస్థ ‘పవర్’ అనే కార్యక్రమం ద్వారా శిక్షణ ఇస్తోంది. ఇందులో ప్రతీ ఉద్యోగికి శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించాం. ప్రతీ రోజు విధులకు ప్రశాంతంగా హాజరయ్యేలా తీర్చిదిద్దుతాం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడానికి తగు జాగ్రత్తలు వివరిస్తాం. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు అవసరమైన సమగ్ర శిక్షణ ఈ ‘పవర్’ కార్యక్రమం ద్వారా ఉద్యోగి పొందుతారు. తద్వారా శక్తివంతులుగా తయారవుతారు. –డి. విజయభాను, వరంగల్ ఆర్ఎం సిబ్బంది ఆరోగ్యంపై సంస్థ ప్రత్యేక శ్రద్ధ పర్యవేక్షణకు సేఫ్టీ వార్డెన్, హెల్త్ వలంటీర్ల నియామకం లక్ష్య సాధన వైపు ప్రోత్సహించేందుకు మెంటార్స్వరంగల్ రీజియన్లోని 9 డిపోల్లో శిక్షణ ప్రారంభం ‘పవర్’ శిక్షణ కార్యక్రమాలు వరంగల్ రీజియన్లోని 9 డిపోల్లో ఈ నెల 18వ తేదీన ప్రారంభమయ్యాయి. డిపోలోని ఉద్యోగులను గ్రూపులుగా ఏర్పాటు చేసి పది రోజుల్లో ఉద్యోగులందరికీ శిక్షణ పూర్తి చేస్తారు. ఈ మేరకు ఇప్పటికే ట్రైనర్లకు హైదరాబాద్లోని బస్ భవన్లో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో డిపో మేనేజర్లు ఫ్యాకల్టీగా వ్యవహరిస్తారు. ఓనర్షిప్, దృఢ సంకల్పం, ఆటలు, పాటలు, ఇతర కార్యకలాపాలు, రోడ్డు భద్రత, ప్రయాణికుల పట్ల మర్యాద, వస్త్రధారణ(యూనిఫాం), కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఆరోగ్యంపై శిక్షణ ఇస్తారు. దేశంలోని ప్రజారవాణా సంస్థల్లో లో తెలంగాణ ఆర్టీసీ సంస్థ బెంచ్మార్క్గా ఉండేలా చూసుకుంటూ నిరంతర అభ్యాసం, శిక్షణ ఇస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులతో పాటు అద్దె బస్సుల డ్రైవర్లకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో పాల్గొనే ఉద్యోగులకు స్పెషల్ ఆఫ్ సెలవు ఇస్తారు. శిక్షణ సమయంలో మధ్యాహ్న భోజనంతో పాటు, రెండుసార్లు టీ, స్నాక్స్ అందిస్తారు. ప్రతి రోజూ ఉద్యోగుల హాజరు వివరాలను ప్రధాన కార్యాలయానికి పంపుతారు. -
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సర్కిళ్ల వారీగా విద్యుత్ డిమాండ్ వివరాలు
జిల్లా ఫిబ్రవరి 14న 15న 16న 17న 18న (సర్కిల్) 2024 2025 2024 2025 2024 2025 2024 2025 2024 2025 హనుమకొండ 313 308 313 505 331 319 314 309 307 315 వరంగల్ 285 304 275 309 276 298 285 302 288 312 జనగామ 283 295 295 308 277 308 289 313 304 312 మహబూబాబాద్ 351 375 330 394 354 386 384 400 370 403 భూపాలపల్లి 357 370 357 369 363 310 354 307 327 328 -
కూరగాయల సాగుతో రైతులకు మేలు
మహబూబాబాద్ రూరల్: రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న కూరగాయల పంటలు, పూల తోటలను సాగుచేసి నికర ఆదాయం పొందాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. కూరగాయల సాగుపై జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మరియన్న మాట్లాడుతూ.. వేసవిలో కూరగాయల సాగు చేపట్టి రైతులు లాభం పొందాలన్నారు. జిల్లాలో రెండు సీజన్లలో కలిపి రైతులు 2,537 ఎకరాల్లో కూరగాయల సాగు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం టమాట, వంగ, గోరు చిక్కుడు, బెండ, దోస, సోర, ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా తదితర కూరగాయల సాగువల్ల లాభం వస్తుందని సూచించారు. ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగుచేసి నాణ్యమైన దిగుబడులు సాధించాలన్నారు. ప్రభుత్వం ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగా కూరగాయలు సాగును ప్రోత్సహించేందుకు ఎకరానికి రూ.2,100 రాయితీ ఇస్తుందన్నారు. కార్యక్రమంలో ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు, ఏఓలు తిరుపతిరెడ్డి, రాజు, రాంబాబు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
అందని హెల్త్ కిట్లు
గూడూరు: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా గత ప్రభుత్వం శానిటరీ హెల్త్ అండ్ హైజెనిక్ కిట్ల పంపిణీ ప్రారంభించింది. 2018–19 సంవత్సరంలో కిట్ల పంపిణీ ప్రారంభించగా.. మూడు నెలలకోసారి సంవత్సరానికి నాలుగుసార్లు కిట్లు అందించారు. ఆ తర్వాత పంపిణీ నిలిచిపోయింది. నాలుగేళ్లుగా కిట్లు అందజేయకపోవడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం విద్యార్థినుల ఆరోగ్యంపై దృష్టిసారించి కిట్లు అందజేయాలని కోరుతున్నారు. 8, 9,10వ తరగతుల నుంచి.. గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే 8, 9, 10వ తరగతి బాలికలతో పాటు ఇంటర్ విద్యార్థినులకు శానిటరీ, న్యాప్కిన్స్, సబ్బులు, కొబ్బరినూనె, షాంపు బాటిల్, టూత్ పేస్ట్, బ్రష్, పౌడర్ వంటి 15 రకాల వస్తువులతో కూడిన హెల్త్కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈమేరకు ఏడాదిన్నర కాలం పాటు సజావుగా కిట్లు అందజేశారు. ఆ సమయంలో కరోనాతో పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. అప్పటి నుంచి నేటికీ పంపిణీని పునరుద్ధరించలేదు. జిల్లాలో ఇలా.. జిల్లాలోని 16 కేజీబీవీల్లో 8వ తరగతి విద్యార్థినులు 641 మంది, 9వ తరగతి విద్యార్థినులు 531 మంది, 10 వ తరగతి విద్యార్థినులు 496 మంది చదువుతున్నారు. అలాగే 251 మంది విద్యార్థినులు ఇంటర్ ఫస్టియర్, 255మంది విద్యార్థినులు సెకండియర్ చదువుతున్నారు. అదే విధంగా 22 టీడబ్ల్యూఏహెచ్ఎస్లు ఉన్నాయి. వాటిల్లో 455మంది విద్యార్థినులు 8వ తరగతి, 479మంది 9వ తరగతి, 467 మంది పదో తరగతి చదువుతున్నారు. జిల్లాలో 87 జెడ్పీహెచ్ఎస్లు ఉండగా.. 8వ తరగతిలో 774మంది, 9వ తరగతిలో 862 మంది, 10వ తరగతిలో 840 మంది విద్యార్థినులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 6,051మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. కాగా ఇప్పటికై నా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి తిరిగి కిట్లు అందించి, బాలికల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో నిలిచిన హైజెనిక్ కిట్ల పంపిణీ బాలికల ఆరోగ్యంపై శ్రద్ధ చూపని ప్రభుత్వం కిట్లు అందజేయాలని తల్లిదండ్రుల వేడుకోలు -
భక్తులకు ఏర్పాట్లు చేయాలి
● ఆర్డీఓ కృష్ణవేణి కురవి: వీరభద్రస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాల మహాజాతరకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలని మహబూబాబాద్ ఆర్డీఓ కృష్ణవేణి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆలయ పరిసరాలలో జరుగుతున్న జాతర పనులు, పెండింగ్ పనులను కురవి తహసీల్దార్ సునీల్రెడ్డి, డీఎస్పీ తిరుపతిరావుతో కలిసి పరిశీలించారు. సంత ఆవరణ, నాగుమయ్య దేవస్థాన ఆవరణలోని కల్యాణమండపం, చెరువు కట్ట, ఎస్సారెస్పీ కాల్వ రోడ్డు, ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ పలు సూచనలు, సలహాలు చేశారు. ముఖ్యంగా ఎస్సారెస్పీ కాల్వ రోడ్డుకు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా పోలీసు అధికారులు డైవర్షన్ను పాటించాలని, ఖమ్మం నుంచి వచ్చే దారిలో ప్రమాదకరంగా మారిన వ్యవసాయ బావి వద్ద రెయిలింగ్ ఏర్పాటు చేయాలని, మహాశివరాత్రి రోజు బావి వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేయాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అనంతరం ఆలయ ఆవరణలో ఈనెల 25నుంచి జరిగే మహాజాతర పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సత్యనారాయణ, సీఐ సర్వయ్య, ఎస్సై సతీష్, విద్యుత్శాఖ ఏఈ శారద, ఆలయ పాలకమండలి సభ్యులు బాలగాని శ్రీనివాస్, చిన్నం గణేష్, జనార్దన్రెడ్డి, వెంపటి శ్రీను, భిక్షపతి, సోమ్లా, ఎంపీఓ గౌసు, కార్యదర్శి విజయలక్ష్మీ, తదితర అధికారులు పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
– 8లోuరెండు నెలలుగా నిరీక్షణ జిల్లాకు 152 గ్రూప్–4 ఉద్యోగాలు కేటాయించగా.. మున్సిపాలిటీ, కార్మికశాఖ, సివిల్ సప్లయీస్, విద్యాశాఖలో డిసెంబర్ 18నుంచి విధుల్లో చేరిన ఉద్యోగులు పైఅధికారులు చెప్పిన పనులు చేస్తున్నారు. రెవెన్యూశాఖకు 72 మందిని కేటాయించగా జిల్లాలో 43 పోస్టులకు మాత్రమే ఆర్థికశాఖ క్లియరెన్స్ ఉండడంతో మిగిలిన పోస్టులను అవసరాల మేరకు అడ్జెస్ట్ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నారు. దీంతో గ్రూప్–4 ఉద్యోగులకు.. కంప్యూటర్ ఆపరేటర్లు, పలు విభాగాల్లో సీనియర్ అసిస్టెంట్ పనులను కూడా అప్పగించి ఎంప్లాయి ఐడీ, ప్రాన్ ఐడీ కేటాయించారు. అయితే దివ్యాంగులశాఖ, జిల్లా వైద్యారోగ్యశాఖకు కేటాయించిన వారిని సీఎం ఆదేశాల మేరకు జాయినింగ్ చేసుకున్నా.. వారికి రెండు నెలలుగా ఆర్డర్స్ ఇవ్వలేదు. దీంతో దివ్యాంగుల శాఖకు కేటాయించిన ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. అదేవిధంగా డీఎంహెచ్ఓకు కేటాయించిన ఆరుగురిలో ఐదుగురు జాయిన్ అయినా.. వారికి ఇప్పటి వరకు ఐడీ, ప్రాన్ ఇవ్వలేదు. ఈ రెండు ఇస్తేనే వేతనాలు చేస్తారు. అయితే కొత్త పోస్టులు క్రియేట్ చేయాలంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ నుంచి పర్మిషన్ కానీ, జిల్లా కలెక్టర్ అప్రూవల్ కానీ ఉండాలని ట్రెజరీ అధికారులు చెబుతున్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన గ్రూప్–4 ఉద్యోగులను ఎక్కడ నియమించాలి అనేది సందిగ్ధంగా ఉంది. ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరలో ఆర్డర్స్ ఇస్తాం. ముందుగా ప్రకటించిన ఖాళీల్లో కారుణ్య నియామకం ద్వారా వచ్చిన వారితో భర్తీ చేయడంతో సమస్య వచ్చింది. ఒకటి రెండు రోజుల్లో సమస్య పరిష్కరించి జాయినింగ్ ఆర్డర్స్ ఇస్తాం. త్వరలో ఆర్డర్స్ ఇస్తాం పోస్టింగ్ ఆర్డర్స్ కోసం నిరీక్షణ ● గ్రూప్–4 ఉద్యోగులకు తప్పని ఎదురుచూపులు ● పోస్టులు చూపించడం లేదని ఐడీ, ప్రాన్ ఇవ్వని అధికారులు ● ఉన్నతాధికారులు స్పందించాలని వేడుకోలు ●సాక్షి, మహబూబాబాద్: కష్టపడి చదివి గ్రూప్–4 ఉద్యోగం సాధించారు. ఎంతో సంతోషంతో ఉద్యోగంలో చేరారు. అయితే ఇలా ఉద్యోగంలో చేరారో లేదో అలా ఇబ్బందులు మొదలయ్యాయి. నోటిఫికేషన్ సమయంలో చూపించిన పోస్టులు.. ఉద్యోగంలో చేరేనాటికి లేకపోవడంతో నూతన ఉద్యోగులు కంగుతింటున్నారు. దీంతో అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న కొందరు అధికారులు పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వలేదు. కాగా ఉద్యోగంలో చేరి రెండు నెలలు గడుస్తున్నా.. పలుశాఖల ఉద్యోగులకు ఇప్పటి వరకు గుర్తింపు నంబర్, ప్రాన్ ఐడీ రాలేదు. దీంతో వారికి నిరీక్షణ తప్పడం లేదు. ఇదిలా ఉండగా పలువురు అధికారులు ఈ విషయంపై స్పష్టత ఇవ్వకుండా చీదరించుకుంటున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. అధికారుల తప్పిదం.. ఉద్యోగులకు శాపం ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్కు ముందు వివిధ శాఖల్లోని ఖాళీల వివరాలను జిల్లా అధికారుల నుంచి తెప్పించుకుంటుంది. ఇందులో భాగంగానే 2022 డిసెంబర్ ఒకటో తేదీన గ్రూప్–4 నోటిఫికేషన్కు ముందు జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల్లో 152 గ్రూప్–4 ఉద్యోగ ఖాళీలు ఉన్న ట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఎన్నికలు రావడంతో పరీక్షల నిర్వహణ ఆలస్యమైంది. ఈ లోపు జిల్లాలో కారుణ్య నియామకాలు చేపట్టారు. ఈక్రమంలో గ్రూప్–4నోటిఫికేషన్లో చూపించిన ఖాళీలను కూడా భర్తీ చేశారు. ఈక్రమంలోనే గ్రూప్–4 ఫలితాలు వచ్చాయి. గత ఏడాది నవంబర్ 23న పెద్దపల్లిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. తర్వాత అఽభ్యర్థులకు శాఖలు కేటాయించారు. అయితే తీరా ఆయా శాఖల్లో చేరేందుకు వచ్చిన ఉద్యోగులకు అక్కడ ఖాళీలు లేవనే విషయం తెలిసింది. మాటలతో వేధింపులు కొత్తగా ఉద్యోగంలో చేరిన తమ సమస్యలపై అధికారులు స్పందించడం లేదని, పైగా సూటిపోటి మాటలతో మనోవేదనకు గురి చేస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాగా చదివి పోటీని తట్టుకొని ఉద్యోగం సాధిస్తే ఇక్కడ ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీంతో ఉద్యో గం సాధించిన సంతోషం లేకుండాపోయిందని చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించే మార్గం చూడాలని కోరుతున్నారు. –మురళీధర్, డీఎంహెచ్ఓన్యూస్రీల్ -
తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలి
నెహ్రూసెంటర్: వేసవికాలంలో తాగు, సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని, అందుకు కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. మంగళవా రం హైదరాబాద్ నుంచి సాగు, తాగునీరు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై జిల్లాల కలెక్టర్లు, అధి కారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మా ట్లాడుతూ.. వేసవికాలం తాగునీటి ఇబ్బందులు లే కుండా చూడాలన్నారు. ప్రజాపాలనలో వచ్చిన ద రఖాస్తుల ఆధారంగా అర్హులందరికీ రేషన్కార్డులు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు గురుకుల పాఠశాలలను సందర్శించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. వీసీ అనంతరం కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ మాట్లాడుతూ... జిల్లాలో తాగు, సాగునీరు అదించాలని, నిర్మాణ రంగానికి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే రేషన్కార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, విద్యుత్శాఖ ఎస్ఈ నరేష్, డీఎస్ఓ ప్రేమ్కుమార్, డీఏఓ విజయనిర్మల, డీపీఓ హరిప్రసాద్, అధికారులు పాల్గొన్నారు. -
వరంగల్ టు మహారాష్ట!
సాక్షిప్రతినిధి, వరంగల్: ● వరంగల్ జిల్లా చెన్నారావుపేట పోలీస్స్టేషన్ పరి ధిలోని పాత మగ్దుంపురం గ్రామంలో సోమవా రం రూ.2.50 లక్షల విలువ చేసే 100 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాత మగ్దుంపురం గ్రామానికి చెందిన ననుమా స కిరణ్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. ● కేయూసీ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ నెల 15న రూ.82,500 విలువ చేసే 33 క్వింటాళ్లు, 16న కా జీపేట పోలీస్స్టేషన్ పరిధిలో రూ.32,500 విలు వైన 13 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నా రు. బత్తుల దుర్గమ్మ, గంట సారయ్య, తూర్పాటి కుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ● హసన్పర్తి పోలీస్స్టేషన్ పరిధిలోని దేవన్నపేట శివారులో ఈ నెల 14న ఓ రైస్మిల్లులో అక్రమంగా నిల్వచేసిన రూ.8.06 లక్షల విలువైన 310 క్వింటాళ్ల రేషన్ బియ్యం, ఓ లారీ, బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైస్మిల్లు లీజుదారుడు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం బోర్నపల్లికి చెందిన కేశబోయిన మొగిలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. .. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వారం రోజుల వ్యవధిలో 1,024 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 560 క్వింటాళ్లకు పైగా పీడీఎస్ రైస్ను స్వాధీనం చేసుకోవడం గమనార్హం. రోజుకు వందల క్వింటాళ్ల రేషన్ బియ్యం వయా హుజూరాబాద్, కాళేశ్వరం ద్వారా మహారాష్ట్రకు అక్రమంగా తరలుతోంది. మామూలు తనిఖీల్లోనే ఇంత పెద్దమొత్తంలో రేషన్ బియ్యం పట్టుబడ్డాయంటే ‘రేషన్’ దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. వరంగల్, హనుమకొండ, పరకాల, జనగామ, నర్సంపేట, ములుగు, భూపాలపల్లి తదితర ప్రాంతాల నుంచి సాగుతున్న రేషన్ బి య్యం దందా ఎల్లలు దాటుతోంది. ఈ దందా వెనుక కొందరు రైస్మిల్లర్లే కీల కం కాగా.. భీమదేవరపల్లి మండలా నికి చెందిన ఒకరు హసన్పర్తికి మకాం మార్చి ‘మేనేజ్’ చేస్తూ ‘కోటి’కి పడగెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. ఇతడికి సంబంధించిన రేషన్ బియ్యం వందల క్వింటాళ్లు పోలీసులకు దొరుకుతు న్నా.. ఎఫ్ఐఆర్ నమోదైనా.. ఆ సమయంలో ‘పరారీ’లోనే ఉంటాడు. పరి స్థితి సద్దుమణిగిన తర్వాత తాపీగా పోలీసులకు చి క్కే ఆ వ్యక్తికి అన్ని వర్గాల మద్దతు ఉందన్న చర్చ ఉంది. కమిషనరేట్ పరిధిలో ప్రధాన కేంద్రాలు.. ● పలు పట్టణ, జిల్లా కేంద్రాలు అడ్డాగా బియ్యం దందా సాగుతోంది. ఇటీవల రేషన్ బియ్యం అ క్రమ రవా ణాకు హసన్పర్తి, హనుమకొండ, పరకాల, నర్సంపేట ప్రధాన కేంద్రాలుగా మారాయి. ● తరచూ పీడీఎస్ బియ్యం పట్టుబడుతున్నా హ నుమకొండ, హసన్పర్తి, ఎల్కతుర్తి, కమలాపూ ర్ మండలాలకు సంబంధించిన బియ్యం పరకాల కేంద్రంగా మార్పిడి, రవాణా ఆగడం లేదు. ఈ బియ్యం దందా వెనుక గతంలో హనుమకొండలో గుట్కా, బెల్లం దందాతో సంబంధం ఉన్న ఒకరు బ్యాచ్తో ‘శివ’మెత్తుతున్నట్లు ఇటీవల నమోదైన కేసుల ద్వారా స్పష్టమవుతోంది. ● గూడూరు, ఖానాపురం, కొత్తగూడ, చెన్నారావుపేట తదితర ప్రాంతాల నుంచి సేకరిస్తున్న రేష న్ బియ్యం నర్సంపేట కేంద్రంగా పాలిష్ చేసి సంచుల మార్పిడి, అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇక్కడి నుంచి తరలిస్తు న్న బియ్యంపై ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో గతంలో కేసులు నమోదు అయ్యాయి. ఆ స మయంలో రేషన్ బియ్యం మాఫియా, ఇతరుల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరగ్గా.. అప్పటి ఓ ప్రతినిధి జోక్యంతో సద్దుమణిగినట్లు తెలిసింది. ● ఈ దందాలో రూ.లక్షలు గడిస్తున్న బియ్యం వ్యాపారులు మాఫియా డాన్లుగా మారుతున్నారు. రేషన్ బియ్యం వ్యాపారులపై పీడీ యాక్టు పెడతామని బెదిరించినా.. 6ఏ కేసులు పెట్టినా ఫలితం ఉండటం లేదు. దీంతో రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యానికి పాలిష్ పెట్టి దారి మళ్లించి రూ.లక్షలు గడిస్తున్నారు. మార్కెట్లో ఆ నాణ్యత ఉన్న బియ్యం ధర రూ.35 నుంచి రూ.45 పైగా ధర ఉండడంతో అక్రమార్కులకు ఉచిత బియ్యం పథకం వరంలా మారింది. ● పీడీఎస్ దందాపై ఎక్కడికక్కడ చెక్పోస్టుల్లో కట్టడి చేస్తున్నామని, ఇటీవల కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తమ బృందాలు తని ఖీలు ఉధృతం చేశాయని పౌరసరఫరాల శాఖకు చెందిన అధికారి ఒకరు చెప్పారు. పీడీఎస్ బి య్యం దందా చేసే వారిపై ఇకపై మరింత తీవ్రంగా వ్యవహరిస్తామని పోలీసులు ప్రకటించారు. హుజూరాబాద్ మీదుగా సరిహద్దులు దాటుతున్న పీడీఎస్ రైస్ ప్రధాన కేంద్రాలు హనుమకొండ, హసన్పర్తి, పరకాల శివార్లు ఈ దందా వెనుక భీమదేవరపల్లి మండల వాసి! పీడీ యాక్టు, 6ఏ కేసులు, అరెస్టులకు వెరవని మాఫియా అక్రమార్కులకు వరంగా మారిన ఉచిత బియ్యం పథకం ఉమ్మడి వరంగల్ జిల్లా సమాచారం ఉమ్మడి జిల్లాలో మొత్తం కార్డులు : 11,05,543 (ఆహార భద్రత+అంత్యోదయ+అన్నపూర్ణ) మొత్తం యూనిట్లు (కుటుంబ సభ్యులు) : 32,55,776 మండలస్థాయి స్టాక్ పాయింట్లు : 18 మొత్తం రేషన్ దుకాణాలు : 2,364 ప్రతినెల రేషన్ బియ్యం పంపిణీ : 33,153.976 మెట్రిక్ టన్నులు -
ఫైన్ వేశారని ‘కరెంట్ కట్’విద్యుత్శాఖ వాహనానికి రవాణాశాఖ జరిమానా
● రవాణాశాఖ కార్యాలయానికి కరెంట్ సరఫరా నిలిపివేత ● కలెక్టర్ మందలించడంతో పునరుద్ధరణ మహబూబాబాద్ అర్బన్: జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్శాఖ అధికారులు కరెంట్ సరఫరా నిలిపివేయడంతో లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు, అధికారులు ఇబ్బందులు పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ నెల 17న జిల్లా రవాణాశాఖ అధికారులు జిల్లా కేంద్రంలోని ఫైర్ స్టేషన్ రోడ్లో వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఎలాంటి పత్రాలు లేకుండా కాంట్రాక్ట్ పద్ధతిలో నడుస్తు విద్యుత్శాఖకు చెందిన బొలెరో వాహనానికి జరిమానా విధించి కేసు నమోదు చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని విద్యుత్శాఖ అధికారులు మంగళవారం ఉదయం 9గంటలకు రవాణాశాఖ కార్యాలయానికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కరెంట్ సరఫరా నిలిపివేశారు. విద్యుత్ శాఖ ఏఈ, డీఈలకు ఫోన్ చేసినా స్పందిచలేదని, బొలెరో వాహనానికి జరిమానా వేసి, కేసు రాయడంతోనే కరెంట్ సరఫరా నిలిపివేశారని రవాణాశాఖ అధికారులు తెలిపారు. ఈక్రమంలో కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్కు రవాణాశాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ విద్యుత్శాఖ ఎస్ఈని ఫోన్లో మందలించడంతో మధ్యాహ్నం 1గంటకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. -
వైద్యాధికారుల తనిఖీ
నెహ్రూసెంటర్: జిల్లా కేంద్రంలోని లక్ష్మీనర్సింగ్హోంలో మంగళవారం జిల్లా వైద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆస్పత్రిలో రికార్డులు, స్కానింగ్ సెంటర్ను పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్ఓ మురళీధర్ మాట్లాడుతూ.. ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవల ధరల పట్టికను ఏర్పాటు చేయాలని, అర్హత కలిగిన సిబ్బంది, వైద్యులకు సంబంధించిన జిరాక్స్ కాపీలను జిల్లా కార్యాలయంలో అందజేయాలన్నారు. స్కానింగ్ సెంటర్లో అనుమతి పొందిన రేడియాలజిస్ట్లు, గైనకాలజిస్టులు మాత్రమే స్కానింగ్ చేయాలని సూచించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డాక్టర్ విజయ్కుమార్, హెల్త్ ఎడ్యుకేటర్ కేవీ రాజు, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 2,377 క్వింటాళ్ల మిర్చి విక్రయంమహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో 2,377 క్వింటాళ్ల మిర్చి విక్రయాలు జరిగినట్లు ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, సెక్రటరీ షంషీర్ మంగళవారం తెలిపారు. రైతులు తీసుకొచ్చిన మిర్చిని వ్యాపారులు ఇ–నామ్ విధానంలో కొనుగోళ్లు జరిపారని పేర్కొన్నారు. తేజ రకం మిర్చి 2,028 క్వింటాళ్లు (5,073 బస్తాలు) వచ్చిందని, క్వింటా గరిష్ట ధర రూ.14,090, కనిష్ట ధర రూ.11,505 పలికిందన్నారు. తాలు రకం మిర్చి 349 క్వింటాళ్లు (872 బస్తాలు) వచ్చిందని, క్వింటా గరిష్ట ధర రూ.7,120, కనిష్ట ధర రూ.6,020 పలికిందని పేర్కొన్నారు. శాసీ్త్రయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలిమహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు శాసీ్త్రయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని డీఈఓ రవీందర్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో రాష్ట్రస్థాయి ఫిజికల్సైన్స్ టాలెంట్ టెస్ట్లో ద్వితీయస్థానం సాధించిన విద్యార్థి ఎన్.విష్ణువర్ధన్ను, గైడ్ టీచర్లను డీఈఓ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానుకోట మండలం మాధావపురం జెడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థి విష్ణువర్ధన్ టాలెంట్ టెస్ట్లో ద్వితీయ స్థానం సాధించడం అభినందనీయమన్నారు. టెస్టులతో విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీయవచ్చన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సంకా బద్రినారాయణ, గైడ్ టీచర్లు బబుల్రెడ్డి, ఎఫ్పీఎస్టీ అధ్యక్షుడు దుడ్డి అనిల్కుమార్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, విద్యాశాఖ అధికారులు ఆజాద్ చంద్రశేఖర్, మందుల శ్రీరాములు, సైన్స్ అధికారి అప్పారావు, టీచర్లు రాజు, సునీత పాల్గొన్నారు. మండలిలో ప్రశ్నించే గొంతుకనవుతా..తొర్రూరు: ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఉపాధ్యాయుల పక్షాన శాసన మండలిలో ప్రశ్నించే గొంతుకనవుతానని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం–నల్లగొండ–వరంగల్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పింగిళి శ్రీపాల్రెడ్డి అన్నారు. డివిజన్ కేంద్రంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులతో మంగళవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మిరియాల సతీష్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో శ్రీపాల్రెడ్డి మాట్లాడారు. పీఆర్సీ అమలు, ఉద్యోగ విరమణ వయస్సు పెంపులో పీఆర్టీయూ కీలకంగా వ్యవహరించిందని గుర్తు చేశారు. సీపీఎస్ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేందకు కృషి చేస్తానని తెలిపారు. ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు హెల్త్ కార్డులు అందించేలా ప్రభుత్వాన్ని ఒప్పిస్తానని తెలిపారు. కార్యక్రమంలో పీఆర్టీయూ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు రాంచందర్రావు, మండల ఽఅధ్యక్షుడు జినుగ విప్లవ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి పుల్లి ముత్తిలింగం, అయా మండలాల ప్రతినిధులు రమేశ్, సురేశ్, నరసింహరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, చంద్రశేఖర్, రఘు, పూర్ణ చంద్రర్, సంజీవ తదితరులు పాల్గొన్నారు. -
పాల ఉత్పత్తిలో భారత్ మొదటిస్థానం
మామునూరు : పాల ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ మొదటి స్థానంలో ఉందని కేవీకే కోఆర్డినేటర్ డాక్టర్ రాజన్న పేర్కొన్నారు. మంగళవారం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో గృహ, విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ అరుణాజ్యోతి, సౌమ్య ఆధ్వర్యంలో విలువ ఆధారిత పాల ఉత్పత్తులపై శిక్షణ నిర్వహించగా రాజన్న ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పాల ఉత్పత్తులను కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసుకుని అధిక లాభాలను పొందవచ్చని సూచించారు. పాల ఉత్పత్తి, ఆదాయ మార్గాలపై డాక్టర్ అరుణాజ్యోతి రైతులకు అవగాహన కల్పించారు. కేవీకేను సందర్శించిన విద్యార్థులు మామునూరు కృషి విజ్ఞాన కేంద్రాన్ని నర్సంపేట, దుగ్గొండి హైస్కూల్కు చెందిన విద్యార్థులు ఎడ్యుకేషనల్ విజిట్ టూర్లో భాగంగా మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కేవీకే అందించే సేవలు, చేపల పెంపకం, వర్మి కంపోస్ట్ తయారీ, ప్లాస్టిక్ మల్చింగ్ పద్ధతిలో కూరగాయల సాగు, అజోల్లా ఉపయోగాలు, సోలార్ వినియోగం, పెరటి కోళ్ల పెంపకం, వ్యవసాయ పనిముట్ల ఉపయోగాలపై శాస్త్రవేత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ రాజన్న, సౌమ్య, రాజు, అరుణాజ్యోతి, గణేశ్, సాయికిరణ్, సాయిచంద్, శుష్రుత్ పాల్గొన్నారు. కేవీకే కోఆర్డినేటర్ రాజన్న -
వైద్యపరీక్షలకు వెళ్లి వచ్చేలోగా..
మహబూబాబాద్ రూరల్ : వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లి వచ్చేలోగా ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటనలో 10.50 తులా ల బంగారు, 30 తులాల వెండి ఆభరణాలు, రూ.88 వేల నగదు అపహరణకు గురైంది. మహబూబాబాద్లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్ కా లనీలో నివాసముండే మహబూబ్ అలీకి ఆరోగ్యం బాగాలేకపోవడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ వెళ్లారు. తిరిగి కుటుంబ స భ్యులు ఈ నెల 17వ తేదీన సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తలుపు తా ళం పగులగొట్టి ఉంది. దీంతో అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బీ రువా తలుపులు తొలగించి ఉన్నా యి. అందులోని 10.50 తులాల బంగారు, 30 తులాల వెండి ఆభరణా లు, రూ.88 వేల నగదు కనిపించలే దు. దీంతో చోరీ జరిగిందని భావించిన మహబూ బ్ అలీ, అలీ మాబీ దంపతులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. టౌన్ ఎస్సై శివ ఘటనా స్థలిని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ 10.50 తులాల బంగారు, 30 తులాల వెండి ఆభరణాలు, రూ.88 వేల నగదు అపహరణ మహబూబాబాద్లో ఘటన -
తల్లి చెంతకు ఆడశిశువు..
చెన్నారావుపేట: విక్రయానికి గురైన ఆడ శిశువు తల్లి చెంతకు చేరింది. చెన్నారావుపేట మండలం బాపునగర్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఆడశిశువు జన్మించిన కొద్దిరోజులకు విక్రయించింది. ఈ ఘటనపై ఈ నెల 16వ తేదీన ‘ఆడ శిశువు అమ్మకం’ అనే శీర్షికతో ‘సాక్షి’ కథనం ప్రచురించింది. ఈ కథనంపై స్పందించిన చైల్డ్ వెల్ఫేర్ జిల్లా కమిటీ చైర్పర్సన్ వసుధ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. అనంతరం గ్రామ పెద్దల సమక్షంలో తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించగా తన అనారోగ్య కారణంగా శిశువును బంధువుల ఇంటి వద్ద ఉంచినట్లు తల్లి తెలిపింది. అధికారులు వెంటనే బంధువులకు సమాచారం ఇచ్చారు. దీంతో మంగళవారం వారు శిశువును తీసుకుని రాగా అధికారులు శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు. మరోసారి శిశువును విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు మధు, సుజాత, రామలీల, షాహేద, మేగ్య, తదితరులు ఉన్నారు.● అప్పగించిన అధికారులు -
చిందుబాగోతం.. ప్రాచీన జానపద కళారూపం
పాలకుర్తి టౌన్ : తెలుగు జానపద కళారూపాల్లో చిందు బాగోతం ప్రముఖమైందని చిందు యక్షగాన కళాకారుడు పద్మశ్రీ గడ్డం సమ్మయ్య అన్నారు. ఇండస్ బుక్ ట్రస్ట్ నిర్వాహకుడు అరూరి సుధాకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌ జన్యంతో మంగళవారం మండల కేంద్రంలోని సు ధా టెక్నో స్కూల్ ఆవరణలో యక్షగాన నాటక ఉ త్సవాలు కనుల పండువగా నిర్వహించారు. చిందు యక్షగాన పౌరాణిక కథలతోపాటు పలు సామాజిక అంశాలపై చిందు కళాకారులు పద్మశ్రీ గడ్డం సమ్మ య్య, గడ్డం శ్రీనివాస్, గడ్డం సంజీవ, గడ్డం రఘుపతి, సోమరాజు బృందాలు ప్రదర్శనలిచ్చాయి. అనంతరం పద్మశ్రీ గడ్డం సమ్మయ్యతో కలిసి డాక్టర్ సుధాకర్ కళాకారులను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిందు యక్షగానం పురాణ గాథలను ప్రజలకు చేరవేసే వినోదాత్మక నాటకమన్నారు. శతాబ్దాలుగా చిందు కళాకారులు ఈ కళకు జీవం పోస్తున్నారని తెలిపారు. పద్మశ్రీ గడ్డం సమ్మయ్య -
ఆకు కూరలతో అధిక ఆదాయం..
మహబూబాబాద్ రూరల్: వేసవిలో ఆకుకూరల సాగుతో అధిక ఆదాయం పొందొచ్చు. తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అర్జించొచ్చు. ఈ క్రమంలో వేసవిలో ఆకు కూరల్లో ఏ రకం సాగు చేపట్టాలి? ఏ నేలలు అనుకూలం? ఎలా పండించాలనే విషయాలను మహబూబాబాద్ మండలం మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ రాంబాబు.. రైతులకు వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ● ఆకు కూరల్లో పాలకూర, తోటకూర, పుదీన, మెంతికూర, గోంగూర, కొత్తిమీర, కరివేపాకు ప్రధానమైనవి. ● ఆకు కూరల్లో లవణాలు, విటమిన్లు, మాంసకృతు లు, పీచు పదార్థం ఎక్కువ ఉండడంతో వేసవిలో ఆకు కూరలకు డిమాండ్ ఉంటుంది. ● తక్కువ కాలం, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చే పంట కావడంతో ఆకు కూరల సాగు బహుప్రయోజనకరంగా ఉంటుంది. ఆకు కూరలసాగుకు నేల తయారీ ముఖ్యం.. ● ఆకు కూరలు సాగుచేసే భూమిని నాలుగు, ఐదుసార్లు దున్ని, మట్టిపెల్లలు లేకుండా చూసుకోవాలి. ● ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు, 300 కిలోల వేప పిండి, 100 కిలోల సూపర్ పాస్పేట్, 10 కిలోల జింకు సల్ఫేట్, 100 కిలోల ట్రైకోడెర్మా, 20 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్లు వేసి ఆకు, విత్తనాలను విత్తుకోవాలి. ముఖ్య విషయాలు.. ● ఆయా ప్రాంతాలకు అనువైన సాధారణ రకాలు, హైబ్రిడ్ రకాలను వేసుకోవచ్చు. ● తోట కూర విత్తనాలు చిన్నగా ఉంటాయి. అందుకే ఇసుకతో కలిపి చల్లుకోవాలి. ఎకరానికి 800 గ్రాముల విత్తనం సరిపోతుంది. ● పాల కూర విత్తన బంతిలో 2 నుంచి 3 రకాల విత్తనాలు ఉంటాయి. విత్తనాలను మూడు నుంచి నాలుగు సెంటిమీటర్ల లోతులో విత్తుకోవాలి. లోతు ఎక్కువైతే మొలక సరిగా రాదు. ● ధనియాలను (కొత్తిమీర పంట) విత్తే సమయంలో రెండు సాల్లుగా చేయాలి. లేదంటే గింజలు ఆలస్యంగా మొలకెత్తి, మొలక శాతం బాగా తగ్గిపోతుంది. ఇందుకు గింజలను నేలపై పోసి చెప్పులు వేసుకుని కాళ్లతో సున్నితంగా రుద్దాలి. ఎకరానికి నాలుగు నుంచి ఐదు కిలోల విత్తనం సరిపోతుంది. ● కరివేపాకు విత్తనాలను చెట్టుకు ఉండే పండు నుంచి వేరు చేసిన వెంటనే విత్తుకోవాలి. ఆరితే మొలక శాతం తగ్గుతుంది. ● విత్తన శుద్ధికి జీవ శీలింధ్రనాశిని ట్రైకోడెర్మా 8 గ్రాములను కిలో విత్తనానికి పట్టించి విత్తితే వేరుకుళ్లు ఆశించవు. ● విత్తనం విత్తిన 48 గంటల లోపు భూమిలో తేమను చూసి లీటర్ నీటికి 4 మిల్లీ లీటర్ల పెండి మిథాలిన్ కలుపు మందును పిచికారీ చేయొచ్చు. ● పైపాటుగా పంట ఎదుగుదలకు లీటర్ నీటికి 5 గ్రాముల 19:19:19 పాలిఫీడ్ను కలిపి పిచికారీ చేయాలి. ● పంటకు అవసరం మేరకు నీరు అందించాలి. నీ రు ఎక్కువ అయితే వేరు కుళ్లు, కాండం కుళ్లు వచ్చే అవకాశం ఉంది. స్ప్రింక్లర్ల ద్వారా నీరు అందించడం మంచిది. దీని వల్ల ఆకులపై ఉండే పురుగులు, నల్లులు, దుమ్ము, ధూళి రాలిపోతాయి. సస్యరక్షణ.. ● పేనుబంక, ఆకు ముడత, ఆకులను తినే గొంగళి పురుగులు ముఖ్యంగా ఆశిస్తాయి. వాటి నివారణకు రసాయన మందులను వాడకుండా వేప సంబంధిత మందులు వాడడం మంచిది. రసాయన మందులు వాడితే కనీసం వారం రోజుల తరువాత పంట కోయాలి. ● కత్తిరించే ఆకు కూర పంటలకు, కోత తర్వాత ఎకరాకు 10 కిలోల యూరియా వేస్తే మళ్లీ పంటకు వస్తుంది. ● ఆకులను మార్కెట్కు తరలించే సమయంలో గోనె సంచులకు బదులు కట్టలుగా కట్టి గాలి ప్రసరించే ట్రేలలో రవాణా చేయడం మంచిది. వేసవిలో తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి, లాభాలు మల్యాల కేవీకే ఉద్యాన శాస్త్రవేత్త రాంబాబు రైతులకు సలహాలు, సూచనలు -
చిందుబాగోతం.. ప్రాచీన జానపద కళారూపం
పాలకుర్తి టౌన్ : తెలుగు జానపద కళారూపాల్లో చిందు బాగోతం ప్రముఖమైందని చిందు యక్షగాన కళాకారుడు పద్మశ్రీ గడ్డం సమ్మయ్య అన్నారు. ఇండస్ బుక్ ట్రస్ట్ నిర్వాహకుడు అరూరి సుధాకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌ జన్యంతో మంగళవారం మండల కేంద్రంలోని సు ధా టెక్నో స్కూల్ ఆవరణలో యక్షగాన నాటక ఉ త్సవాలు కనుల పండువగా నిర్వహించారు. చిందు యక్షగాన పౌరాణిక కథలతోపాటు పలు సామాజిక అంశాలపై చిందు కళాకారులు పద్మశ్రీ గడ్డం సమ్మ య్య, గడ్డం శ్రీనివాస్, గడ్డం సంజీవ, గడ్డం రఘుపతి, సోమరాజు బృందాలు ప్రదర్శనలిచ్చాయి. అనంతరం పద్మశ్రీ గడ్డం సమ్మయ్యతో కలిసి డాక్టర్ సుధాకర్ కళాకారులను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిందు యక్షగానం పురాణ గాథలను ప్రజలకు చేరవేసే వినోదాత్మక నాటకమన్నారు. శతాబ్దాలుగా చిందు కళాకారులు ఈ కళకు జీవం పోస్తున్నారని తెలిపారు. పద్మశ్రీ గడ్డం సమ్మయ్య -
ప్రశ్నించే నాయకుడిని ఎన్నుకోవాలి
మహబూబాబాద్ అర్బన్/మరిపెడ/గూడూరు: చట్టసభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకుడిని ఎన్నుకోవాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మానుకోటలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి పులి సరోత్తంరెడికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులను కోరారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. 14 నెలల పాలనలో హామీ లు అమలు చేయక ప్రజలు, ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేసిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ 317 జీఓ ద్వారా వేలాది మంది టీచర్ల జీవి తాలను ఛిన్నాభిన్నం చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు, 317 జీఓ రద్దు ,6 నెలల్లో కొత్త పీఆర్సీ, డీఏ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి మరిచిపోయిందని మండిపడ్డా రు. కాగా, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీటీసీ సో మ్లా నాయక్, కాంగ్రెస్ నుంచి పల్స రవీందర్ను బీజేపీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ అజ్మీరా సీతా రాంనాయక్, నాయకులు యాప సీతయ్య, భూక్య సంగీత, బాలరాజు, భాస్కర్రెడ్డి, రా మచందర్రావు, సుధీర్రెడ్డి, శ్యాంసుందర్శర్మ, గో వర్ధన్రెడ్డి, సతీశ్, వెంకన్న, మురళి, సురేందర్, మహేశ్, మోతీలాల్, నర్సింహరెడ్డి, అశోక్, సంపత్, సందీప్, అజయ్ పాల్గొన్నారు. అనంతరం మరిపె డ హైస్కూల్, గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని కస్తూర్బా విద్యాలయంలో స రోత్తంరెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు. మొ దటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులను అభ్యర్థించారు. ఆయాపాఠశాల్లో నిర్వహించిన ప్రచారంలో నాయకులు మహేశ్గౌడ్, జనార్దన్, రమేశ్, సురేందర్, పార్టీ గూడూరు అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ -
అనుమానాస్పదంగా యువకుడి మృతి
● కరీమాబాద్లో ఘటన ● ఆలస్యంగా వెలుగులోకి..ఖిలా వరంగల్ : అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. కరీమాబాద్లోని లక్ష్మీనగర్కు చెందిన బొల్లు రాకేశ్ (25) హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. స్నేహితుడి పెళ్లి నిమిత్తం శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి ఇంటికి చేరుకున్నాడు. సాయంత్రం పెళ్లికి వెళ్లిన రాకేశ్ ఆదివారం ఉదయం విగతజీవిగా కనిపించాడని తల్లి రజిత మిల్స్కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాకేశ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని, మెడపై గాయాలు ఉన్నాయని స్థానికులు పోలీసులకు సమాచారం అందజేసినట్లు తెలిసింది. పోస్టుమార్టం అనంతరం తల్లి రజితకు సోమవారం సాయంత్రం మృతదేహాన్ని అప్పగించారు. వైద్యుల నివేదిక ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుందని, ప్రస్తుతం అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
స్వయం ప్రతిపత్తి హోదా
సుమతిరెడ్డి మహిళా కళాశాలకు ● ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డిహన్మకొండ చౌరస్తా: హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్లోని సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ), జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి స్వయం ప్రతిపత్తి హోదా లభించిందని ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి తెలిపారు. హనుమకొండ కాకాజీకాలనీలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని ముఖ్య నగరాల్లోని కళాశాలలకు దీటుగా సుమతిరెడ్డి కళాశాలలో విద్యార్థినులను అన్ని రంగాల్లో నైపుణ్యం సాధించేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. తమ ఇంజనీరింగ్ కళాశాలలో చదువు పూర్తి చేసిన విద్యార్థినులు దేశ, విదేశాల్లోని ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. అటానమస్ హోదాతో తమ కళాశాల కీర్తి మరింత పెరుగుతుందన్నారు. సుమతిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజశ్రీరెడ్డి మాట్లాడుతూ స్వయంప్రతిపత్తి హోదాతో కళాశాలకు అకడమిక్ మెరుగుదల, సాంకేతిక అభివృద్ధి, కళాశాల అభ్యున్నతి జరుగుతుందన్నారు. విద్యార్థినుల వ్యక్తిగత అభివృద్ధి, సృజనాత్మకతను వెలికితీసి వారిని ప్రపంచ స్థాయిలో ఉద్యోగ, వ్యాపారవేత్తలుగా నిలపడానికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కళాశాల వివిధ విభాగాధిపతులు డాక్టర్ ఇ. సుదర్శన్, డాక్టర్ కె. మహేందర్, డాక్టర్ ఎన్. శ్రీవాణి, ఏఓ వేణుగోపాలస్వామి, అధ్యాపక బృందం, విద్యార్థినుల తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. అటానమస్ హోదాకు అంకితభావంతో పనిచేసిన ఎస్ఆర్ విద్యా సంస్థల కార్యదర్శి ఎ. మధుకర్రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజశ్రీరెడ్డిని వరదారెడ్డి అభినందించారు. -
తల్లి చెంతకు ఆడశిశువు..
చెన్నారావుపేట: విక్రయానికి గురైన ఆడ శిశువు తల్లి చెంతకు చేరింది. చెన్నారావుపేట మండలం బాపునగర్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఆడశిశువు జన్మించిన కొద్దిరోజులకు విక్రయించింది. ఈ ఘటనపై ఈ నెల 16వ తేదీన ‘ఆడ శిశువు అమ్మకం’ అనే శీర్షికతో ‘సాక్షి’ కథనం ప్రచురించింది. ఈ కథనంపై స్పందించిన చైల్డ్ వెల్ఫేర్ జిల్లా కమిటీ చైర్పర్సన్ వసుధ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. అనంతరం గ్రామ పెద్దల సమక్షంలో తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించగా తన అనారోగ్య కారణంగా శిశువును బంధువుల ఇంటి వద్ద ఉంచినట్లు తల్లి తెలిపింది. అధికారులు వెంటనే బంధువులకు సమాచారం ఇచ్చారు. దీంతో మంగళవారం వారు శిశువును తీసుకుని రాగా అధికారులు శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు. మరోసారి శిశువును విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు మధు, సుజాత, రామలీల, షాహేద, మేగ్య, తదితరులు ఉన్నారు.● అప్పగించిన అధికారులు -
భవిష్యత్లో మానవ రహిత వ్యవసాయం
హన్మకొండ : భవిష్యత్లో మానవ రహిత వ్యవసాయ సాగు పద్ధతులు రావొచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ అల్దాస్ జానయ్య పేర్కొన్నారు. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో అగ్రి హబ్ను నాబార్డు సీజీఎం ఉదయ్భాస్కర్, అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జానయ్య మాట్లాడుతూ.. ఇప్పటికే డ్రోన్ల ద్వారా ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు చల్లడం వంటివి చేస్తున్నామని వివరించారు. రాబోయే రోజుల్లో రోబోల సాయం పొందే అవకాశాలున్నాయని తెలిపారు. రోబోలు వస్తే మానవ ప్రమేయం లేకుండా వ్యవసాయ పనులు చేసుకోవచ్చన్నారు. వ్యవసాయం ఎప్పుడూ సంక్షోభంలో చిక్కుకోలేదని, చిక్కుకుంది రైతులు మాత్రమే అని ఉద్ఘాటించారు. వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుంటే కాలగర్భంలో కలిసి పోవాల్సిందేనని వెల్లడించారు. విద్య, వైద్యం ప్రైవేట్ రంగంలోకి రావడంతో రైతులకు ఖర్చులు పెరిగాయని, వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం మినహా రైతుకు ఇతర ఆదాయం ఉండదని చెప్పారు. చైనాలో వ్యవసాయ పారిశ్రామికీకరణ, గ్రామీణ పారిశ్రామికీకరణ జరిగి దేశం అభివృద్ధి చెందిందని వివరించారు. దేశంలో గ్రామీణ ప్రాంత నూతన ఆవిష్కర్తలను ప్రోత్సహించేందుకు అగ్రి హబ్ ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ క్రమంలోనే వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో నాబార్డు సాయంతో అగ్రి హబ్ ఏర్పాటు చేశామని అన్నారు. నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్భాస్కర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ఆవిష్కర్తలకు అందుబాటులో ఉండేలా వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో అగ్రిహబ్ ఏర్పాటు చేశామన్నారు. వ్యవసాయ రంగానికి పనికి వచ్చే పనిముట్లు తీసుకు రావాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు ఈ దిశగా ఔత్సాహికులను గుర్తించి ప్రోత్సహించాలన్నారు. దేశంలో ఏడు ఇంక్యుబేషన్ సెంటర్లు ఉంటే తెలంగాణలో రెండు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలతో పరస్పర అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పరిశోధన సంచాలకుడు డాక్టర్ బలరాం, అగ్రి హబ్ ఎండీ డాక్టర్ ఆర్.కల్పనా శాస్త్రి, సీఈఓ విజయ్, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమారెడ్డి, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వెంకటరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారులు అనురాధ, రవీందర్ సింగ్, శాస్త్రవేత్తలు, సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.● ప్రకృతి వనరులను కాపాడుకోవాలి నూతన ఆవిష్కర్తలకు అగ్రి హబ్ దోహదం జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్ జానయ్య -
పాఠశాల విద్యాశాఖ ఫోరం రాష్ట్ర కార్యవర్గంలో ఉమ్మడి జిల్లా నేతలు
విద్యారణ్యపురి: టీఎన్జీఓఎస్ పాఠశాల విద్యాశాఖ ఫోరం రాష్ట్రస్థాయి కార్యవర్గం ఎన్నికలు ఈనెల 17 వ తేదీన హైదరాబాద్లో నిర్వహించారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలకు పలు పదవులు ద క్కాయి. హనుమకొండ జిల్లా విద్యాశాఖలో సీని యర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్న ఫకృద్దీన్ అహ్మద్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అ సోసియేట్ ప్రెసిడెంట్గా భరత్, కోశాధికారిగా జనగామ నుంచి పవన్బాబు, కార్యవర్గ సభ్యుడిగా వ రంగల్ జిల్లా నుంచి ఎస్బీ శ్రీనివాస్, భూపాలపల్లి విద్యాశాఖలో పని చేస్తున్న దిలీప్కుమార్ పబ్లిసిటీ సెక్రటరీగా, ప్రశాంత్కుమార్ సభ్యుడిగా ఎన్నికయ్యారని బాధ్యులు మంగళవారం తెలిపారు. సాఫ్ట్వేర్ లోపాలతో పత్తి కొనుగోళ్లలో అంతరాయం ● సీసీఐ సీజీఎం పాణిగ్రహి వరంగల్: రాష్ట్ర మార్కెటింగ్ శాఖకు చెందిన తక్పట్టీ సాఫ్ట్వేర్లో నెలకొన్న లోపాల కారణంగా ఫిబ్రవరి 9వ తేదీ నుంచి పత్తి కొనుగోళ్లలో అంతరాయం కలుగుతోందని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సీసీఐ) సీజీఎం(మార్కెటింగ్)ఎస్కే.పాణిగ్రహి మంగళవా రం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నియమించిన థర్డ్ఫార్టీ డేటా సెంటర్లో తీవ్ర నెట్వర్క్ అంతరాయంతో ఈ పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. నెట్వర్క్ వ్యవస్థ పునరుద్ధరించిన వెంటనే సీసీఐ కేంద్రాల్లో పత్తిని కొనుగోలు చేస్తామని, రాష్ట్రంలో చివరివరకు వచ్చే పత్తిని ఎంఎస్పీతో కొనుగోలు చేస్తుందని రైతులకు హామీ ఇస్తున్నట్లు తెలిపారు. రైతులు ఎలాంటి అందోళన చెందవద్దన్నారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి ● కాపాడబోయిన మహిళకు తప్పిన ప్రాణాపాయం దేవరుప్పుల : దండెంపై దుస్తులు ఆరేస్తుండగా విద్యుత్షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందగా, అతడిని కాపాడబోయే క్రమంలో ఓ మహిళకు ప్రాణా పాయం తప్పింది. ఈ ఘటన మంగళవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై సృజన్కుమార్ కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ ప్రాంతంలో ఉంటున్న నర్ర సోమయ్య(47) ఉదయం స్నానం చేసి దుస్తులు దండెంపై ఆరేస్తున్నాడు. ఈక్రమంలో అతుకులు ఏర్పడిన విద్యుత్ వైరు దండేనికి తగిలింది. దీనిని గమనించని నర్సయ్య దండెన్ని పట్టుకోగా షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్షాక్తో విలవిలాడుతున్న సోమయ్యను కాపాడేందుకు వచ్చిన స్థానికురాలు రాధిక.. మీటర్ ఆఫ్ చేసినా విద్యుత్ సరఫరా బంద్ కాలేదు. ఈ క్రమంలో మీటర్ బంద్ చేశానుకున్న ఆ మహిళ.. దండెంపై వైరు తీసే క్రమంలో విద్యుత్షాక్ తగలగా అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇంతలో స్థానికుడు కందుల భిక్షపతి వచ్చి విద్యుత్ మీటర్ ఫ్యూజ్లు తీయడంతో రాధికకు ప్రాణాపాయం తప్పింది. ఈ విషయమై సమాచారం అందుకున్న విద్యుత్ అధికారులు ఘటనా స్థలిని పరిశీలించారు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
వైద్యపరీక్షలకు వెళ్లి వచ్చేలోగా..
మహబూబాబాద్ రూరల్ : వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లి వచ్చేలోగా ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటనలో 10.50 తులా ల బంగారు, 30 తులాల వెండి ఆభరణాలు, రూ.88 వేల నగదు అపహరణకు గురైంది. మహబూబాబాద్లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్ కా లనీలో నివాసముండే మహబూబ్ అలీకి ఆరోగ్యం బాగాలేకపోవడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ వెళ్లారు. తిరిగి కుటుంబ స భ్యులు ఈ నెల 17వ తేదీన సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తలుపు తా ళం పగులగొట్టి ఉంది. దీంతో అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బీ రువా తలుపులు తొలగించి ఉన్నా యి. అందులోని 10.50 తులాల బంగారు, 30 తులాల వెండి ఆభరణా లు, రూ.88 వేల నగదు కనిపించలే దు. దీంతో చోరీ జరిగిందని భావించిన మహబూ బ్ అలీ, అలీ మాబీ దంపతులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. టౌన్ ఎస్సై శివ ఘటనా స్థలిని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ 10.50 తులాల బంగారు, 30 తులాల వెండి ఆభరణాలు, రూ.88 వేల నగదు అపహరణ మహబూబాబాద్లో ఘటన -
స్వచ్ఛమైన పెట్రోల్ అందిస్తాం
ఖిలా వరంగల్: జైళ్ల శాఖ ద్వారా స్వచ్ఛమైన పెట్రోల్, డీజిల్ అందిస్తామని, దీనిని వాహనదారులు వినియోగించుకోవాలని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ (డైరెక్టర్ జనరల్) డాక్టర్ సౌమ్య మిశ్రా అన్నారు. మంగళవారం మామునూరు సెంట్రల్ జైలు ప్రాంగణంలోని తిమ్మాపురం రోడ్డుపై వరంగల్ సెంట్రల్ జైలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ను జైళ్ల శాఖ వరంగల్ రేంజ్ డీఐజీ ఎం. సంపత్, కలెక్టర్ సత్యశారద, జైలు సూపరింటెండెంట్ కళాసాగర్, జైలర్ పూర్ణచందర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ వాహనదారులకు నాణ్యతతో కూడిన పెట్రోల్, డీజిల్ అందించాలనే లక్ష్యంతో జైళ్ల శాఖ ద్వారా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకు ముందు జైలు సిబ్బంది.. డీజీ సౌమ్య మిశ్రాకు గౌరవ వందనం చేశారు. అనంతరం జైలు ప్రాంగణంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఖైదీలను కలిశారు. ఈ సందర్భంగా 14 ఏళ్ల శిక్ష పూర్తయిన వారికి క్షమాభిక్ష ప్రసాదించాలని పలువురు ఖైదీలు డీజీని కోరారు. వాహనదారులు వినియోగించుకోవాలి రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభం -
మార్చి చివరి వరకు సాగునీరు విడుదల!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : యాసంగి సీజన్ పంటల సాగుకు నీటి విడుదలపై ఆ శాఖ మరోసారి స్పష్టత ఇచ్చింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల ఆయకట్టుకు సాగునీరు అందడం లేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సాగునీటి విడుదల, ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే 2024, డిసెంబర్లోనే యాసంగి పంటలకు సాగునీరు విడుదల షెడ్యూల్ ప్రకటించిన అధికారులు, మంగళవారం ఆన్అండ్ఆఫ్ పద్ధతిన నీరు విడుదల చేయనున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) స్టేజ్–1లో 7,99,470 ఎకరాల ఆయకట్టుకు యాసంగిలో నీరందించడం లక్ష్యం కాగా.. పాత ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల ఆయకట్టుకు ఈ నీరందనుంది. ఎస్సారెస్పీ స్టేజ్–2లో వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో స్థిరీకరించిన 3,36,630 ఎకరాలకు సాగునీరు విడుదల అవుతోంది. జె.చొక్కారావు గోదావరి ఎత్తిపోతల (దేవాదుల) పథకం ద్వారా 1,73,153 ఎకరాల ఆయకట్టుకు నీటి సరఫరా చేయడం ఇరిగేషన్ లక్ష్యం కాగా.. పాకాల, రామప్ప, లక్నవరం సరస్సులు, మల్లూరు ప్రాజెక్టుల కింద మరో 24 ఎకరాల ఆయకట్టు ఉంది. మొత్తం ప్రాజెక్టుల ద్వారా ఉమ్మడి వరంగల్లోని వరంగల్ పశ్చిమ, తూర్పు, పరకాల, నర్సంపేట, స్టేషన్ఘన్పూర్, జనగామ, వర్ధన్నపేట, పాలకుర్తి, డోర్నకల్, మహబూబాబాద్ నియోజక వర్గాలకు చెందిన సుమారు 3.31 లక్షల ఎకరాల్లో సాగుచేసిన ఈ యాసంగి పంటలకు నీరందుతుందని అధికారులు ప్రకటించారు. నీటి విడుదల మార్చి చివరి వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘శివం’ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు యాసంగి పంటలకు ఆన్అండ్ఆఫ్ పద్ధతిలో నీరందించడం జరుగుతుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఇరిగేషన్ ఈఎన్సీ జి.అనిల్కుమార్ పేర్కొన్నారు. అలాగే జంగిల్ క్లియరెన్స్, మెయిన్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీలు, తనిఖీల కోసం సేకరించిన కాల్వ వెడల్పులను సక్రమంగా నిర్వహించాలని, నీటి నియంత్రణ, విడుదల చేయడానికి ముందు అన్ని కీలకమైన ఆపరేషన్, మెంటనెన్స్ పనులకు హాజరు కావాలని ఆయన అధికారులను ఆదేశించారు. అన్ని కెనాల్ బ్యాంకింగ్ రీచ్లను నిశితంగా పరిశీలించాలని ఈఎన్సీలు, సీఈలకు సూచించారు. సీఎం ఆదేశాల మేరకు నీటి విడుదల జరుగుతుందని, కీలక సమయంలో సరిగ్గా నీటి వినియోగం జరగడానికి ఈఈలు రాత్రివేళ పెట్రోలింగ్ నిర్వహించాలని ఈఎన్సీ అనిల్ ఆదేశించారు. మరోసారి షెడ్యూల్ ప్రకటించిన ‘ఇరిగేషన్’ వరంగల్ అధికారులకు తాజా ఉత్తర్వులు ఎస్సారెస్పీ, దేవాదుల ఆయకట్టుపై ప్రకటన -
కొలువులకు కోత!
23 నెలల క్రితం నోటిఫికేషన్ టీజీ ఎన్పీడీసీఎల్లో 932 పోస్టులు ఖాళీగా ఉండగా 23నెలల క్రితం100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి ఇటీవల 93 పోస్టులు భర్తీ చేశారు. మిగతా 839 పోస్టులు భర్తీ చేయలేదు. వాటిలో 200 పోస్టులకు కోత పెట్టి ఉన్నతస్థాయి పోస్టులుగా సృష్టించి ప్ర భుత్వ ఆమోదానికి పంపినట్లు సమాచారం. విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల్లో సిబ్బంది లేక.. ఉన్న ఉద్యోగులపై పని భారం పడుతున్నా జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తుండడంతో నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారు. 339 కొత్త పోస్టుల స్థిరీకరణ కొన్నేళ్లుగా వృథాగా ఉన్న 215 అన్యూజ్డు పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ల పోస్టుల్లో 200 కలిపి మొత్తం 415 పోస్టుల స్థానంలో కొత్తగా 339 పోస్టులు స్థిరీకరించారు. అందులో చీఫ్ ఇంజనీర్, సీజీఎం(అకౌంట్స్), జాయింట్ సెక్రటరీ(పీఅండ్జీ), జనరల్ మేనేజర్ (పీఅండ్జీ), అకౌంట్స్ ఆఫీసర్ ఒక్కో పోస్టు చొప్పున, ఎస్ఈ, డీఈ, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, పర్సనల్ ఆఫీసర్, వాచ్మెన్ పోస్టులు నాలుగు చొప్పున, రెండు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ఆరు అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, సబ్ ఇంజనీర్ పోస్టులు 16 చొప్పున, జూనియల్ అకౌంట్స్ ఆఫీసర్ 20, సీనియర్ అసిస్టెంట్ 88, సీనియర్లైన్ ఇన్స్పెక్టర్ 32, అసిస్టెంట్ లైన్మెన్ 48, ఆఫీస్ సబార్డినేట్ 88, స్వీపర్ పోస్టులు ఆరు మార్చినట్లు సమాచారం. హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతుండగా.. మరో వైపు ప్రభుత్వ రంగ సంస్థ టీజీ ఎన్పీ డీసీఎల్ ఇంజనీర్ల పదోన్నతుల కోసం వర్క్మెన్ పోస్టులకు కోత పెట్టి నిరుద్యోగుల అవకాశాలు కొల్లగొడుతున్నదనే అపవాదును మూ టగట్టుకుంటోంది. వర్క్మెన్ పోస్టులను తగ్గించి వాటిని ఇంజనీర్లకు పదోన్నతులు కల్పించేందుకు ఉన్నత స్థాయి పోస్టులు సృష్టించడంపై క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొత్త సబ్స్టేషన్లు నిర్మించినా ఆ మేరకు ఆపరేటర్లను నియమించకపోవడంతో అందుబాటులో ఉన్న ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ ఉద్యోగులపై భారం పడుతోందనే వాదన వినిపిస్తోంది. కొన్ని సబ్స్టేషన్లలో రిటైర్డ్ ఉద్యోగులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తూ నిర్వహణను నెట్టుకొస్తున్నారే తప్ప సబ్స్టేషన్ ఆపరేటర్ల నియామకంపై యాజమాన్యం దృష్టి సారించడం లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. వృథాగా 215 పోస్టులు ఎన్పీడీసీఎల్ సంస్థలో గన్మ్యాన్, టెలిఫోన్ బాయి, కార్పెంటర్, సివిల్ మేసీ్త్ర, స్టోర్ కీపర్, టెలిఫోన్ ఇన్స్పెక్టర్, టెలిఫోన్ ఆపరేటర్, టూల్ కీపర్ వంటి 215 పోస్టులు ఎన్నో ఏళ్లుగా వృథాగా ఉంటున్నాయి. వీటిని క్షేత్ర స్థాయి వర్క్మెన్ పోస్టులుగా మార్చాలని విద్యుత్ ఉద్యోగ సంఘాలు మూడేళ్లుగా డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఇదే అదనుగా పదోన్నతుల కోసం ఇంజనీర్లు ఇందులో ప్రవేశించి తమకు కొన్ని పోస్టులు ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే.. ఈ పోస్టులకు చెల్లించే జీతాల మొత్తం ప్రతిపాదిత పోస్టుల మొత్తానికయ్యే జీతాలకు సరిపోక యాజమాన్యం దృష్టి.. భర్తీ కాకుండా ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ల పోస్టులపై పడింది. వంతుల వారీగా విధులు.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి 33/11 కేవీ సబ్స్టేషన్లు 994 ఉండగా ప్రస్తుతం 1,511కు పెరిగింది. విద్యుత్ సర్వీసులు 48,17,575 ఉండగా 68,51,012కు పెరిగాయి. ఈ లెక్కన 517 సబ్స్టేషన్లు, 20,33,437 సర్సీసులు పెరిగాయి. అయితే.. విద్యుత్ వినియోగదారులకు సేవలందించేందుకు అవసరమైన సిబ్బంది, ఉద్యోగుల నియామకంపై దృష్టి సారించలేదు. ప్రతీ సబ్ స్టేషన్కు కనీసం నలుగురు ఆపరేటర్లు అవసరం. ఈ లెక్కన కొత్తగా నిర్మించిన 517 సబ్స్టేషన్లకు 2,068 మంది అవసరం. అన్ యూజ్డు పోస్టుల స్థానంలో సృష్టించిన కొత్త పోస్టుల్లోనూ సబ్స్టేషన్ ఆపరేటర్లను మరిచారు. దీనికి తోడు గతంలో పని చేసిన ఆపరేటర్లు రిటైర్ అవుతుండడంతో ప్రతి నెలా ఖాళీలు ఏర్పడుతున్నాయి. దీంతో జేఎల్ఎంలు, ఏఎల్ఎంలు, లైన్ ఇన్స్పెక్టర్లు, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్లు వంతుల వారీగా ఆపరేటర్ విధులు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు జూనియర్ లైన్మెన్ పోస్టులు ఖాళీ ఉండడంతో ఫ్యూజ్ ఆఫ్ కాల్స్ అటెండ్ చేసే వారు కరువయ్యారు. గ్రామాల్లో జూనియర్ లైన్మెన్లు లేక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా వినియోగదారులకు నేరుగా సేవలందించే వారి పోస్టుల భర్తీపై దృష్టి సారించాలని పలువురు కోరారు.ప్రమోషన్ల కోసం పోస్టుల కుదింపు టీజీ ఎన్పీడీసీఎల్ తీరుతో నిరుద్యోగుల అవకాశాలకు గండి సబ్స్టేషన్లలో ఆపరేటర్లు కరువు గ్రామాల్లో జూనియర్ లైన్మెన్ల కొరత క్షేత్ర స్థాయిలో వినియోగదారులకు ఇబ్బందులు పని భారంతో ఏఅండ్ఎం ఉద్యోగుల అవస్థలుపదోన్నతుల కోసం కాదు.. అన్ యూజ్డు పోస్టులను ఇతర పోస్టులుగా మార్చడం పదోన్నతుల కోసం కాదు. ఎన్పీడీసీఎల్ పరిధి రిమోట్ ఏరియాలో కొత్తగా సెక్షన్లు పెంచాల్సిన అవసరం ఉంది. ములుగు సర్కిల్ ఏర్పాటు చేస్తున్నాం. మరికొన్ని డివిజన్లు, సబ్ డివిజన్లు కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యాలయాల్లో పోస్టుల భర్తీకి, వినియోగంలో లేని పోస్టులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు రూపొందించాం. వినియోగదారులకు సేవలు అందించేందుకు, అడ్మినిస్ట్రేషన్ అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. త్వరలో జేఎల్ఎం పోస్టులు భర్తీ చేయనున్నం. ఈ నియామకాలతో సబ్స్టేషన్ ఆపరేటర్ల కొరత తీరుతుంది. – కర్నాటి వరుణ్ రెడ్డి, సీఎండీ ఎన్పీడీసీఎల్ -
మరిపెడ పీఎస్ తనిఖీ
మరిపెడ: మరిపెడ పోలీస్స్టేషన్(పీఎస్)ను ఎస్పీ సుధీర్ రాంనాఽథ్కేకన్ తనిఖీ చేశారు. పోలీస్స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పోలీస్స్టేషన్కు వచ్చే బాధితుల వినతులు క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం జరిగేలా చూడాలని, పెండింగ్లో ఉన్న కేసులు సత్వరమే పరిష్కారం అయ్యేలా కృషి చేయాలన్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మరిపెడ సీఐ రాజ్కుమార్గౌడ్, డీసీఆర్సీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్సైలు సతీష్, సంతోష్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆన్లైన్..ఆగమాగం!
రైల్వేశాఖలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల కనీస హక్కులను ఆన్లైన్ చేయడంతో రైల్వే కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.● బాతుల జలకాలాట..వాతావరణం జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు ఉక్కపోతగా ఉంటుంది. రాత్రివేళ కాస్త చలి తీవ్రత ఉంటుంది.– 8లోuగార్ల సమీపంలోని పాకాల ఏటిలో బాతులు జలకాలాడుతూ సందడి చేశాయి. ఆంధ్రప్రదేశ్లోని జగ్గయ్యపేటకు చెందిన సంచార జాతికి చెందిన వారు బాతులను మేత కోసం ఇక్కడికి తీసుకొచ్చారు. సోమవారం బాతులను తాగునీటి కోసం పాకాల ఏటిలోకి వదిలారు. దీంతో అవి కాసేపు నీటిలో ఈదుతూ సందడి చేశాయి. – గార్ల -
మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
– 8లోu‘ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు మహబూబాబాద్ మండలం దామ్యతండా జీపీ పరిధి భోజ్యతండాకు చెందిన తేజావత్ వీరన్న. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇరవై గుంటల్లో టమాట సాగు చేశాడు. మార్కెట్లో ధరలు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నాడు. అసలే మిర్చిపంటకు ధర తగ్గి నష్టపోతుండగా టమాట ధరలు తగ్గి పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు.’మహబూబాబాద్ రూరల్: జిల్లాలో సీజన్ వారీగా రైతులు వరి, పత్తి, మి రప, మొక్కజొన్న, అపరాల పంటలు సాగు చేస్తున్నారు. వీటికి తోడు కూరగా యల పంటలు పండిస్తున్నారు. అయితే కూరగాయలను మార్కెట్లో విక్రయానికి తీసుకెళ్తే కనీస ధర పలకడం లేదు. బయట డిమాండ్ ఉన్నప్పటికీ వ్యాపారులు సిండికేట్గా మారి రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి.. అధిక రేట్లకు అమ్ముకొని లాభాలు గడిస్తున్నారు. పంట పండించిన రైతులకు మాత్రం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. అధికంగా టమాట సాగు.. జిల్లా వ్యాప్తంగా రైతులు 1,180 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయల పంటలను సాగు చేశారు. దీనిలో అధిక మొత్తంలో 250 ఎకరాల్లో టమాట పంట వేశారు. అసలే కోతులు, పక్షుల బారినుంచి టమాట పంటను కాపాడుకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పండిన పంటను మార్కెట్కు తీసుకెళ్తే గిట్టుబాటు కావడం లేదు. దీంతో టమాట రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. అలాగే ఆకు కూరలను 235 ఎకరాల్లో సాగు చేశారు. ఆకుకూరలకు తెగుళ్లు, మచ్చలు, పురుగులుసోకి దిగుబడి తగ్గింది. మిగిలిన ఆకుకూరలు అమ్ముకుందామంటే మార్కెట్లో ధరలు లేవు. తమ కష్టానికి తగిన ఫలితం రావడంలేదని రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని చెబుతుండగా వరి, పత్తి, మిరప, మొక్కజొన్న, అపరాల పంటలు సాగుచేసిన తర్వాత కూరగాయల సాగు చేస్తున్నారు. ఆశించినంత మేరకు దిగుబడి, ధరలు లేక నష్టపోతున్నామని, మరోసారి కూరగాయలను సాగు చేయాలంటేనే భయపడాల్సి వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. న్యూస్రీల్జిల్లాలో కూరగాలయ సాగు వివరాలు(ఎకరాల్లో) వంకాయ 75బెండ 125 కాకర 25 దోస 150 చిక్కుడు 55 మునగ 15 సోర 100 పచ్చిమిర్చి 100 బీర 50 టమాట 250 ఆకు కూరలు 235పండించిన రైతులకు దక్కని ఫలితం మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పటికీ కనీస ధర కరువు పెరుగుతున్న పెట్టుబడులు.. తగ్గుతున్న రాబడి ఆర్థికంగా నష్టపోతున్న రైతన్న -
భోజనాల తయారీలో జాగ్రత్తలు తీసుకోవాలి
గూడూరు: ఆశ్రమ, గురుకుల, వసతి గృహాల్లో భోజనాల తయారీలో జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అన్నారు. మండలంలోని దామరవంచ గిరిజన గురుకుల బాలుర పాఠశాల, గూడూరులోని మహాత్మా జ్యోతిరావుపూలే బాలికల ఆశ్రమ పాఠశాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా దామరవంచ గురుకులంలో విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కిచెన్ షెడ్, స్టోర్ రూం, డైనింగ్ హాల్, స్టడీ రూం, టాయిలెట్స్, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం భోజన తయారీదారులతో మాట్లాడారు. మెనూ ప్రకారం పక్కాగా నాణ్యమైన అహార పదార్థాలను వండి వడ్డించాలన్నారు. ప్రత్యేకంగా ఉపాధ్యాయ బృందం పరిసర ప్రాంత పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన చేయాలని సూచించారు. అలాగే గూడూరులోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. సూచనలు, సలహాలు ఇచ్చారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో త హసీల్దార్ శ్వేత,ఎంపీడీఓ వీరస్వామి పాల్గొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించాలి బయ్యారం: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ప్రభుత్వ వసతిగృహాలు, పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాల కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. మండలంలోని ఇర్సులాపురం ఆశ్రమపాఠశాలను సోమవారం రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతిగృహంలోని కిచెన్షెడ్, స్టోర్రూం, టాయిలెట్స్, తరగతిగదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులను సబ్జెక్టువారీగా పలు అంశాలపై కలెక్టర్ ప్రశ్నలు అడిగారు.. అయితే వారి నుంచి సరైన సమాధానాలు రాకపోవడతో అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత సబ్జెక్టుల టీచర్లతో మాట్లాడిన కలెక్టర్ విద్యార్థులందరూ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా ఇప్పటి నుంచి బోధన చేయాలన్నారు. కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ -
విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించాలి
నెహ్రూసెంటర్: పాఠశాలల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన శస్త్రచికిత్సలు చేసి అద్దాలు అందిస్తామని డీఎంహెచ్ఓ మురళీధర్, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్లోని డైక్ సెంటర్లో సోమవారం విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కంటి సమస్యలున్న 970 మంది విద్యార్థులను గుర్తించామని, వారిని మరోసారి పరీక్షించామని చెప్పారు. కంటిచూపు సమస్య ఉన్న వారికి శస్త్రచికిత్సలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య, ఆశకార్యకర్తలు, వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ వెంకట్రాములు, మెడికల్ కళాశాల ప్రిన్సి పాల్ వెంకట్,డాక్టర్ కుమార్,డాక్టర్ శ్రీధర్, డా క్టర్ రాణాప్రతాప్, డాక్టర్ హర్షవర్ధన్, ఆఫ్తాలమిక్ ఆఫీసర్స్ సుబ్బలక్ష్మి, బాలాజీ, కృష్ణ, ఎస్ యూఓ రామకృష్ణ, జోత్స్న, రాజ్కుమార్, డైక్ మేనేజర్ యజ్ఞేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. రైల్వే గేటు మూసివేతమహబూబాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని పోలీసు క్వార్టర్స్ వద్దగల రైల్వే గేటును మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు మూసివేస్తారని సంబంధిత అధికారులు సోమవారం తెలిపారు. రైల్వే మూడో లైన్ నిర్మాణ పనుల్లో భాగంగా ఎల్సీ 80 (ఏ క్యాబిన్) రైల్వే గేటును మూసివేస్తారని, మంగళవారం అర్ధరాత్రి 2గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 5 గంటల వరకు పనులు జరుగుతాయని పేర్కొన్నారు. ఆ సమయంలో ప్రజలు, వాహనదారులు పోలీసు క్వార్టర్స్ వద్దగల రైల్వే గేటు మీదుగా కాకుండా ఇతర మార్గాల నుంచి రాకపోకలు కొనసాగించాలని సూచించారు. వందశాతం ఫలితాలు రావాలితొర్రూరు: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత పొందాలని డీఈఓ రవీందర్రెడ్డి కోరారు. సోమవారం డివిజన్ కేంద్రంలోని కస్తూర్బా స్కూల్ను డీఈఓతోపాటు మండల విద్యాశాఖ అధికారులు సందర్శించి, రోజు అందిస్తున్న భోజనం తీరు, విద్యార్థులకు అందిస్తున్న బోధనపై ఆరా తీశారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యారంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, అన్నిరకాల వసతులను కల్పిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య, స్కూల్ ఎస్ఓ శైలాజ, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవంకురవి: మండలంలోని మొగిలిచర్ల గ్రామంలో సోమవారం సీతారామచంద్రస్వామి నూతన ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా జరిగింది. వేద పండితుడు కండ్లకుంట వేంకట నృసింహచార్యస్వామి మంత్రోచ్ఛరణల నడు మ నిత్య హోమాలు, మహాపూర్ణాహుతి యంత్ర స్థాపన, శిఖర, విమాన, గోపుర కలశ, బింబ(విగ్రహ) ప్రతిష్ఠలు వైభవంగా జరిగాయి. వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ నూకల వేణుగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్రెడ్డి, మాలోత్ నెహ్రూనాయక్, మార్కెట్ చైర్మన్ సుధాకర్, పార్టీల నాయకులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. 108 వాహనంలో ట్యాబ్ చోరీకొత్తగూడ: మండలంలో 108వాహనంలో ఉన్న ట్యాబ్(సెల్ ఫోన్)ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఎస్సై కుశకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం 108 వాహనం నర్సంపేట ఆస్పత్రికి వెళ్లి తిరిగి వస్తుంది. ఈ క్రమంలో గాదె వాగు సమీపంలో వాహనం ఆపి సిబ్బంది బహిర్భూమికి వెళ్లారు. ఇది గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు వాహనంలోని ట్యాబ్ను చోరీ చేశారు. సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.