Mahabubabad District Latest News
-
కూలీకి వస్తూ కానరానిలోకాలకు..
టేకుమట్ల: కూలీకి వస్తూ ఓ మహిళ కానరానిలోకాలకు వెళ్లింది. హార్వెస్టర్ వెనక్కి వస్తుండగా దాని కింద పడి మృతి చెందింది. ఈ ఘటన సోమవారం సాయంత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం బూర్నపల్లి శివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన కొంత మంది కూలీలు వరి పంటలో బెరుకుల తీసేందుకు ఆటోలో బూర్నపల్లికి వస్తున్నారు. ఈ క్రమంలో ఆటో ముందు హార్వెస్టర్ వెళ్తుండగా.. ఎదురుగా ఆర్టీసీ బస్సు వస్తోంది. దీంతో హార్వెస్టర్ ఆపరేటర్ బస్సుకు దారి ఇచ్చేందుకు వెనక్కి తీస్తున్నాడు. ఈ క్రమంలో హార్వెస్టర్ వెనుక ఉన్న ఆటోను డ్రైవర్ కూడా వెనక్కి తీస్తుండగా అందులో ఉన్న ఇద్దరు మహిళలు భయంతో కిందికి దిగారు. అయితే హార్వెస్టర్ వారిపైకి ఎక్కింది. ఈ ఘటనలో దాసరి కనుకమ్మ(55) అక్కడికక్కడే మృతి చెందగా, మరో కూలీ వసంతకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వసంతను చికిత్స నిమిత్తం వరంగల్ తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై దాసరి సుదాకర్ ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదంపై వివరాలు సేకరించారు. అనంతరం కనుకమ్మ మృతదేహాన్ని చిట్యాల ఆస్పత్రి మార్చురీకి తరలిచారు. కన్నీరుమున్నీరైన కూలీలు.. క్షణం ముందు ప్రాణంతో అందరి మధ్య ప్రయాణించిన కనుకమ్మ రెప్పపాటు క్షణంలో విగతజీవిగా మారడంతోపాటు మరో మహిళ తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతుండగా చలించిన తోటి కూలీలు కన్నీరుమున్నీరయ్యారు. సాయంత్రం కూలీకి రాకున్నా బతికేదేమో అని విలపించారు. ప్రాణాలు తీస్తున్న సాయంత్రం కూలీ.. వేసవిలో ఎండలు తీవ్రంగా ఉండడంతో వ్యవసాయ కూలీలు ఉదయం, సాయంత్రం రెండు పూటల పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల మండలంలోని రామకిష్టాపూర్(టి) గ్రామానికి చెందిన మహిళా కూలీలు సాయంత్రం వేళ పొలంలోని బెరుకులు తీసేందుకు వెళ్లగా లారీ అదుపు తప్పి మీదపడిన ఘటనలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే మొట్లపల్లి నుంచి కూలీలు సాయంత్రం వేళ పొలంలోని బెరుకులు తీసేందుకు వస్తుండగా హార్వెస్టర్ మృత్యుశకటమై కనుకమ్మను కబలించింది. హార్వెస్టర్ కింద పడి మహిళా కూలీ మృతి ఒకరికి తీవ్ర గాయాలు బూర్నపల్లి శివారులో ఘటనబావిలోడి వ్యక్తి.. నెక్కొండ: వ్యవసాయ బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం మండలంలోని వెంకటాపురంలో జరిగింది. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రాళ్లబండి పెద్ద రాజయ్య (56) ఈనెల 13న సాయంత్రం తన పొలం వద్దకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో దారిలో గ్రామానికి చెందిన కొత్తపల్లి వీరారావు వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డాడు. కుటుంబీకులు రాజయ్య కోసం వెతకగా సోమవారం సాయంత్రం బావిలో శవమై తేలి కనిపించాడు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించామని ఎస్సై పేర్కొన్నారు. మృతుడి కుమారుడు శివకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసున్నామని ఎస్సై తెలిపారు. -
రూ.53.28 లక్షల విలువైన గంజాయి పట్టివేత
కురవి: రూ.53.28 లక్షల విలువైన 106 కిలోల 960 గ్రాముల ఎండు గంజాయి పట్టుకుని నలుగురిని అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం కురవి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదివారం మండల కేంద్రంలోని ఓం ఫంక్షన్ హాల్ ఎదుట ఎస్సారెస్పీ కెనాల్ వద్ద ఎస్సై గండ్రాతి సతీశ్ వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన ఓ కారు కనిపించడంతో అనుమానం వచ్చి తనిఖీ చేయగా గంజాయి లభించింది. దీంతో మరిపెడ మండలం తండా ధర్మారంకు చెందిన బానోత్ మహేందర్, ఒడిశాకు చెందిన నర్సింగ్ మడి, రామచంద్ర మడి, మాడ్కమి చంద్రను అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి తరలిస్తున్నట్లు ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలి పారు. ఎండు గంజాయి పట్టుకున్న ఎస్సై సతీశ్, సిబ్బందికి రివార్డులు అందజేశారు. కాగా, నిందితులు ఒడిశాలోని చిత్రకొండ వద్ద ఎండు గంజాయి కొనుగోలు చేసి కారులో ఏపీలోని విశాఖపట్టణం నుంచి ఖమ్మం మీదుగా మరిపెడ వెళ్లేందుకు కురవి వైపునకు వచ్చి పోలీసులకు పట్టుబడ్డారు. నలుగురు అరెస్ట్ వివరాలు వెల్లడించిన మానుకోట డీఎస్పీ -
మోటార్లతో నీటిని తోడేశారు
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్లో ఏ రైతును కదిలించిన కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఆదివా రం కురిసిన భారీ వర్షంతో 20వేల బస్తాలకు పైగా ధాన్యం తడిసి పోగా, వరద వెళ్లే దారిలేక ధాన్యం రాశుల పక్కనే నిలిచి ముంచేసింది. నీటిలో ముని గిన ధాన్యాన్ని బయటకు తీసేందుకు రైతులు మో టార్లు పెట్టి తోడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనగామ మండలం చౌడారం గ్రామానికి చెందిన రైతు దండబోయిన రజిత కుటుంబం ఐదు ఎకరాలు సా గు చేయగా, 200 బస్తాల దిగుబడి వచ్చింది. ప్రభు త్వ మద్దతు ధరకు అమ్ముకునేందుకు మార్కెట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్కు నా లుగు రోజుల క్రితం ధాన్యం తీసుకొచ్చారు. తేమ పేరుతో కొనుగోలు ఆలస్యం కావడంతో అకాల వర్షం 200 బస్తాలను ముంచేసింది. 20 బస్తాలు వరదలో కొట్టుకుపోయాయి. రాత్రి 7.30 గంటల నుంచి సోమవారం ఉదయం 11 గంటలకు వరకు 180 బస్తాల ధాన్యం నీటిలోనే ఉండిపోయింది. దీంతో రైతులు ఇంట్లో వినియోగించే నీటి మోటారును తీసుకొచ్చి కుటుంబమంతా నాలుగు గంటల పాటు కష్టపడి తోడేశారు. ఒక్క అధికారి వచ్చి పలకరించలేదని, టార్పాలిన్ కవర్లు సైతం ఇవ్వలేదని మహిళా రైతు రజిత.. కన్నీరుమున్నీరుగా విలపించారు. 12 గంటలపాటు తడిసిన ధాన్యం మొలకెత్తే పరిస్థితి ఉందని ఆందోళనే వ్యక్తం చేస్తున్నారు. జనగామ మార్కెట్ ఐకేపీ సెంటర్లో రైతుల గోస -
అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు..
●వివాహిత నవ్య బలవన్మరణంపై కేసు నమోదు మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సంపేట బైపాస్ రోడ్లో ఆదివారం రాత్రి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన నవ్య మృతిపై ఆమె తండ్రి ఉత్తరాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ సోమవారం రాత్రి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని బ్రాహ్మణ బజార్కు చెందిన శ్రీపాద ఉత్తరాచారి పెద్ద కుమార్తె నవ్య (21)ను ఇల్లందు మండలం ధర్మారం తండాకు చెందిన తాడూరి భిక్షమాచారి, సత్యవతి దంపతుల కుమారుడు రవిచంద్రాచారికి ఇచ్చి గతేడాది డిసెంబర్ 26వ తేదీన వివాహం జరిపించారు. వివాహం సమయంలో రూ.50 వేలు కట్నం ఇచ్చారు. భర్త రవిచంద్రాచారి, అత్తామామ భిక్షమాచారి, సత్యవతి తరచూ అదనపు కట్నం కోసం నవ్యను వేధింపులకు గురిచేస్తుండేవారు. ఈ క్రమంలో పలుమార్లు పంచాయితీలు జరగగా అదనపు కట్నం డబ్బులు తర్వాత ఇస్తామని ఆపుకుంటూ వచ్చారు. ఆదివారం సాయంత్రం నవ్య తాను ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడుతున్నానని పక్కింటి వారికి చెప్పగా వారు హు టాహుటిన వచ్చి భర్త రవిచంద్రాచారికి చెప్పా రు. అప్పటికే ఆమె ఇంట్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి ఉత్తరాచారి ఫిర్యాదు మేరకు టౌన్ ఎస్సై బి.విజయ్ కుమార్ కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కు టుంబీకులకు అప్పగించారని సీఐ తెలిపారు. మండలంలో రెండు చోట్ల చోరీలు వెంకటాపురం(కె): మండలంలోని ఉప్పేడు గొల్లగూడెం, మండ కేంద్రంలోని సాయిబాబా ఆలయ సమీపంలో ఆదివారం చోరీలు జరిగాయి. బాధితుల కథనం ప్రకారం.. ఉప్పేడు గొల్లగూడెం గ్రామానికి చెందిన నాగేశ్వరావు రాత్రి నిద్రిస్తున్న సమయంలో దొంగలు ఇంటి ఎదుట ఉన్న షెట్టర్ పగుల కొట్టి అందులో ఉన్న రూ. 50 వేల నగదు, ఓ సెల్ఫోన్ అపహరించారు. అలాగే, మండల కేంద్రంలో బీజేపీ నాయకుడు సంకా హేమ సుందర్ ఇంట్లోకి చొరబడి బీరువా తాళాలు పగుల కొట్టి అందులో ఉన్న కిలో వెండి, 18 గ్రాముల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై సోమవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిచారు. -
కులనిర్మూలనకు కృషి చేసిన మహనీయుడు అంబేడ్కర్
హన్మకొండ: సమాజంలో అంటరానితనం, కుల నిర్మూలనకు కృషి చేసిన మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ అని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ కార్యాలయం ఆవరణలోని స్పోర్ట్స్ క్లబ్లో తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. 150 మంది విద్యుత్ ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని సీఎండీ ప్రారంభించారు. అంతకు ముందు అంబేడ్కర్ చిత్రపటానికి ఆయన, డైరెక్టర్లు, అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ రాజ్యాంగం మనుగడలో ఉన్నంతకాలం అంబేడ్కర్ పేరు చిర స్థాయిలో నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు ఎ.ఆనందం, కార్యదర్శి ఎన్.కుమారస్వామి, ఫైనాన్స్ సెక్రటరీ నర్సింహారావు, టీజీ ఎన్పీడీసీఎల్ ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, వి.తిరుపతి రెడ్డి, సీజీఆర్ఎఫ్ నిజామాబాద్ చైర్మన్ ఇ. నారాయణ, హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, డి.ఈలు విజేందర్ రెడ్డి, సామ్యనాయక్, జి.సాంబరెడ్డి, ఎస్.మల్లికార్జున్, భిక్షపతి పాల్గొన్నారు.● టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
నువ్వు ఉండి ఏం ప్రయోజనం లేదు చనిపో..
వర్ధన్నపేట : ప్రస్తుత సమాజంలో రక్తసంబంధాలు మంటగలుస్తున్నాయని చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఆస్తి కోసం కన్న తండ్రి అని చూడకుండా కుమారుడు, కోడలు నిత్యం వేధింపులకు గురిచేసి అతడు బలవన్మరణానికి పాల్పడేలా కారణమయ్యారు. పొలం, ఇంటి స్థలాలు, ఇల్లు తమపేర చేయాలని కొద్ది రోజులుగా ఒత్తిడి చేస్తుండగా దీనికి ఆ వృద్ధుడు ససేమిరా అంటున్నాడు. దీంతో మానసికంగా హింసిస్తున్నారు. నువ్వు ఉండి ఏం ప్రయోజనం లేదు మందు తాగి చనిపో అని కోడలు వేధింపులకు గురిచేయడంతో మనస్తాపం చెందిన ఆ వృద్ధుడు గడ్డిమందుతాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని కడారిగూడెంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నాంపల్లి మల్లేశం(93)కు నలుగురు సంతానం. చిన్న కుమారుడు కోటేశ్వర్, అతడి భార్య ఎలేంద్ర.. గత కొద్ది రోజులుగా ఆస్తి కోసం నిత్యం వేధిస్తున్నారు. మల్లేశం పేర ఉన్న పొలం, ఇంటి స్థలాలు, ఇల్లు తమపేర చేయాలని మానసిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఎలేంద్ర ‘నువ్వు ఉండి ఏం ప్రయోజనం లేదు.. మందు తాగి చనిపో’ అని మామ మల్లేశంను వేధించింది. దీంతో మల్లేశం ఇంటి వద్ద గడ్డిమందు తాగాడు. గమనించిన రెండో కుమారుడు చంద్రమౌళి వెంటనే 108లో ఎంజీఎం తరలించారు. చికిత్స పొందుతున్న క్రమంలో ఆదివారం రాత్రి 8.20 గంటలకు మల్లేశం చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి కూతురు అమరావతి విజయ ఫిర్యాదు మేరకు చిన్నకుమారుడు కోటేశ్వర్, అతడి భార్య ఎలేంద్రపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చందర్ సోమవారం తెలిపారు. ఆస్తి కోసం తండ్రికి కొడుకు, కోడలు మానసిక వేధింపులు ● మనస్తాపంతో గడ్డి మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య ● కడారిగూడెం గ్రామంలో ఘటన ● పోలీసులకు మృతుడి కూతురు ఫిర్యాదు.. కేసు నమోదు -
ఎంజీఎంలో ఎక్స్రే కష్టాలు..
ఎంజీఎం : ఉత్తర తెలంగాణ పేద రోగుల పెద్దది క్కు ఎంజీఎం ఆస్పత్రిలో నిత్యం ఏదో ఒక్క సమస్య తలెత్తుతూనే ఉంది. ఒక రోజు మందులు ఉండవు.. మరో రోజు వైద్యులు రారు. అన్ని బాగున్నాయి.. అనుకున్న క్షణమే పరికరాల్లో సాంకేతిక లోపమంటూ సేవలు అందవు.. ఇలా ఆస్పత్రిలో ఏ విభాగంలో చూసినా ఏదో సమస్య కనిపిస్తూనే ఉంటుంది. ఫలితంగా ఎంజీఎంకు వస్తే పూర్తి స్థాయి వైద్య చికిత్సలు అందుతాయా అనే నమ్మకం రోజురోజుకూ సన్నగిల్లుతోంది. ఈక్రమంలో మూడు రోజుల నుంచి ఆస్పత్రిలో అత్యంత కీలక విభాగమైనా క్యాజు వాలిటీలో ఎమర్జెన్సీ ఎక్స్రే సేవలు నిలిచాయి. ఈ సేవలను వెంటనే పునరుద్ధరణ చేయాల్సిన అవసరమన్నా రోజులు తరబడిగా పట్టించుకోవడం లేదు. ఫలితంగా క్షతగాత్రులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఒక పక్క ప్రమాదంలో విరిగిన కాళ్లు, చేతులతో ఆస్పత్రిలోని క్యాజువాలిటీ విభాగానికి వస్తే చికిత్స కోసం ఎక్స్రే పనిచేయకపోవడంతో ఇక్కడి నుంచి నుంచి ఓపీ బ్లాక్లో ఉన్న ఎక్స్రే గదికి క్షతగాత్రులను తరలించే సమయంలో వినబడుతున్న ఆర్తనాదాలు అందరినీ కంటతడిపెట్టిస్తున్నాయి. చికిత్స కోసం తిప్పలు పడాల్సిందే.. ఎమర్జెన్సీ ఎక్స్రే పరికరం పనిచేయకపోవడంతో ఈ సేవల కోసం క్షతగాత్రుల బంధువులు తిప్పలు పడాల్సి వస్తోంది. క్షతగాత్రుడిని క్యాజువాలిటీ నుంచి ఓపీ బ్లాక్లోని 92 గదికి తరలించేందుకు వీల్ చైర్స్, స్ట్రెచర్స్ దొరకబట్టడానికి కుస్తీ పట్టాల్సిందే. ఆస్పత్రిలోని 92 గది ఎక్కడ అని తెలుసుకునేందుకు మరో ప్రయత్నం చేయాలి. చివరకు అక్కడికి వెళ్లాక ఒకే ఒక్క ఎక్స్రే పరికరం పనిచేస్తుండడంతో సేవల కోసం ఎదురుచూడాలి.. ఆ సమయంలో క్షతగాత్రుల రోదనలు చూడలేక సిబ్బందితో వా గ్వాదానికి దిగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా ఎంజీఎంలో అత్యవసర సేవల కోసం వచ్చిన క్షతగా త్రుల బాధలు నిత్యం పెరిగిపోతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోతున్నారు. ఉన్న ఒకే ఒక్క ఆర్ఎంఓ అన్ని పనులు చక్కబెట్టలేక చేతులేతేస్తున్న దుస్థితి. ఇప్పటికై నా ప్రభుత్వం, జిల్లా మంత్రులు స్పందించి ఎంజీఎంపై ప్రత్యేక దృష్టి సారించాలని రోగులు వేడుకుంటున్నారు. ఆస్పత్రిలో నిలిచిన ఎమర్జెన్సీ ఎక్స్రే సేవలు మూడు రోజులుగా ఆ గదికి తాళం గాయాలతో క్షత్రగాత్రుల నరకయాతన, ఆర్తనాదాలు పట్టించుకోని ఆస్పత్రి ఉన్నతాధికారులుమరమ్మతులు చేస్తాం..ఎమర్జెన్సీ పరికరంలో సాంకేతిక లోపం ఏర్పడింది. ఎక్స్రే సేవలను 92 గదిలోని డిజిటల్ ఎక్స్రే ద్వారా అందిస్తున్నాం. ఎమర్జెన్సీ విభాగంలో ఎక్స్రే పరికరానికి మరమ్మతులు చేపడుతాం. –కిశోర్, సూపరింటెండెంట్ -
ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిన అంబేడ్కర్
ఖిలావరంగల్: దేశ ఔన్నత్యం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రపంచానికి చాటుతూ.. రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత రూప శిల్పి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం వరంగల్ 35వ డివిజన్ శివనగర్లో అంబేడ్కర్ విగ్రహాన్ని మేయర్ గుండు సుధారాణి, స్థానిక కార్పొరేటర్ సొమిశెట్టి ప్రవీణ్తో కలిసి మంత్రి సురేఖ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆలోచనలు, ఉద్యమాలు ఇప్పటికీ మార్గదర్శకం అన్నారు. పౌరుడి నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి అని చాటిన మహామేధావి అని కొనియాడారు. కార్యక్రమంలో విగ్రహ ఫౌండేషన్ దాత మెరుగు అశోక్, విగ్రహ దాత రేణుకుంట్ల రవీందర్, అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పొలేపాక నరేందర్, విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ అధ్యక్షుడు రేణుకుంట్ల శివ, నాయకులు దిడ్డి కుమారస్వామి, మీసాల ప్రకాశ్, కొత్తపెల్లి శ్రీనివాస్, శామంతుల శ్రీనివాస్, గడ్డం రవి, శ్రీరాం రాజేశ్, పగడాల సతీశ్ పాల్గొన్నారు. సమసమాజ స్వాప్నికుడు.. వరంగల్: సమసమాజ స్వాప్నికుడు బీఆర్ అంబేడ్కర్ అని మంత్రి కొండా సురేఖ అన్నారు. అంబేడ్కర్ జయంతి వేడుకలను వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. వరంగల్ కాశిబుగ్గ జంక్షన్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి కొండా సురేఖ, బల్దియా మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడతూ.. అంబేడ్కర్ ఆలోచనలు, ఉద్యమాలు ఇప్పటికీ మార్గదర్శకమేనన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు -
‘మండే’ ఎండలు
మంగళవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025నాలుగు నెలలు..– 8లోuసాక్షి, మహబూబాబాద్: జీవితం నీటి బుడగ లాంటిది. ప్రతీ మనిషికి మరణం తప్పదు. అయితే అది సహజ మరణమైతే.. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు బాధతో కుమిలిపోతారు. అదే హత్య అయితే ఆ ప్రాంత ప్రజలంతా భయాందోళన చెందుతారు. కాగా జిల్లాలో నాలు గు నెలల్లో వరుసగా ఏడు హత్యలు జరిగా యి. ఇందులో అత్యధికంగా తమకు అన్యాయం చేశారనే నెపంతో హత్యలు చేసిన సంఘటనలు ఉండగా.. అయిన వారే సుఫారీ మాట్లాడి చంపించిన ఘటనలు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కాగా వరుస హత్యల నేపథ్యంలో సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని పోలీసులు చెబుతున్నారు. హత్యలు ఇలా.. ● అనుమానంతో భర్త భార్యను కత్తితో పొడిచి, కట్టెలతో కొట్టి తీవ్ర గాయపరిచి హత్య చేసిన సంఘటన జనవరి 25న కేసముద్రం మండలంలో జరిగింది. మండలంలోని వెంకటగిరి గ్రామానికి చెందిన వాంకుడోత్ సుగుణ( 30)ను తన భర్త వాంకుడోత్ రఘు కత్తితో పొడిచి, కట్టెలతో కొట్టి గాయపరిచాడు. తీవ్ర గాయాలైన సుగుణను చికిత్స నిమిత్తం ముందుగా మహబూబాబాద్ ఆస్పత్రికి, తర్వాత ఎంజీఎంకు తరలించారు. అయితే జనవరి 28న సుగుణ మృతిచెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసముద్రం పోలీసులు కేసు నమోదు చేశారు. ● మహబూబాబాద్ పట్టణంలోని సిగ్నల్ కాలనీలో నివాసం ఉంటున్న నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాములకు చెందిన దంపతులు కాటి రాములు–లక్ష్మి, కుమారుడు గోపి, కుమార్తె, అల్లుడు కలిసి కోడలు నాగలక్ష్మిని జనవరి 14న ఇంట్లో చంపారు. ఇంటి ముందు గుంత తవ్వి పూడ్చేశారు. అక్కడే వంట చేసుకొని తిన్నారు. అయితే ఈ కేసును పోలీసులు ఛేదించి నిందితులను అరెస్టు చేశారు. ● భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రానికి చెందిన పార్థసారథి మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలోని జ్యోతిబాపూలే గురుకులంలో హెల్త్ సూపర్ వైజర్గా పనిచేస్తున్నాడు. కాగా తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త పార్థసారథిని చంపేందుకు భార్య స్వప్న, ప్రియుడు వెంకట విద్యాసాగర్తో కలిసి రూ.5లక్షల సుఫారీ మాట్లాడింది. ముగ్గురితో భర్తను హత్య చేయించగా.. పోలీసులు కేసును ఛేదించారు. ● సీరోలు మండలం బూర్గుచెట్టు జీపీ పరిధి మాంజా తండాకు చెందిన మాలోత్ కళావతి(38)ని తన భర్త బాలు మటన్ కూర వండలేదని హత్య చేశాడు. దీనిపై సీరోలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ● పాత గొడవల కారణంగా ఇనుగుర్తి మండలం మీఠ్యాతండాకు చెందిన గుగులోత్ రమేశ్(36)ను అదే తండాకు చెందిన గుగులోత్ శంకర్ నమ్మబలికి తనతో ఒంగోలు తీసుకెళ్తానని చెప్పి హత్య చేసిన సంఘటనపై నెల్లికుదురు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ● మార్చి 15న డోర్నకల్ మండలంలోని హూన్యతండాకు చెందిన భూక్య భుజ్జిని కుటుంబ కలహాల నేపథ్యంలో తన భర్త హత్య చేసినట్లు ఆమె బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ● ఫిబ్రవరి 3న డోర్నకల్ మండలంలో జోగ్యతండాలో పిల్లలకు టానిక్లో హెర్బిసైడ్ అనే పురుగుల మందును కలిపి తాగించారు. ఈ సంఘటనలో ఐదు సంవత్సరాల నిత్యశ్రీ మృతి చెందిన సంఘటనపై బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం వరుస సంఘటనలు జరగడంపై శాఖాపరమైన సమీక్షలు నిర్వహిస్తున్నాం. అయితే ప్రధానంగా క్షణికావేశం, ఇతర గొడవలతోపాటు మానవ సంబంధాలు, భార్య, భర్తలు ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడంతోనే ఎక్కువ హత్యలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, కళాజాత ద్వారా మానవ సంబంధాలు పెంచేందుకు ప్రదర్శనలు ఇప్పించే పనిలో ఉన్నాం. –తిరుపతిరావు, డీఎస్పీ, మహబూబాబాద్న్యూస్రీల్ క్షణికావేశంతో పాటు తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఘాతుకాలు సంబంధికుల చేతిలో హతమవుతున్న వైనం వరుస ఘటనలతో జిల్లా ప్రజల ఆందోళన అవగాహన సదస్సులు పెంచుతామంటున్న పోలీసులు -
అంబేడ్కర్ అడుగు జాడల్లో నడవాలి
మహబూబాబాద్ అర్బన్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అడుగుజాడల్లో నడిచి, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని ప్రభుత్వ విప్ జాటోతు రాంచంద్రునాయక్ అన్నా రు. సోమవారం జిల్లా కేంద్రంలోని కోర్టుసెంటర్లో అంబేడ్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, అడిషనల్ కలెక్టర్ వీరబ్రహ్మచారి, ఎస్సీ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికారి నర్సింహరావు, కార్పొరేషన్ జిల్లా అధికారి శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్చందర్రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. అనంతరం రాంచంద్రునాయక్ మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహోన్నతమైన వ్యక్తి అని, ప్రపంచ దేశాల రాజ్యాంగాలను చదివి భారత రాజ్యాంగాన్ని రంచించి స్వేచ్ఛ, హక్కులను కల్పించారన్నారు. రిజర్వేషన్లు కల్పించడంతో నేడు దళిత, గిరిజనులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. సమాజంలో ఇప్పటికీ చాలా మంది చదువుకు దూరంగా ఉన్నారన్నారు. ఇంకా దేశంలో అసమానతలు, దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. దళిత, గిరిజనులు చైతన్యవంతులై ప్రశ్ని ంచేతత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. ఎమ్మె ల్యే మురళీనాయక్, కలెక్టర్ అద్వైత్కుమార్ మాట్లాడా రు. అనంతరం భారత రాజ్యాంగంపై ఎమ్మెల్యేలు, నాయకులు ప్రతిజ్ఞ చేశారు. కాంగ్రెస్, వివిధ ప్రజా, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. అంబేడ్కర్ ప్రపంచ మేధావి మహబూబాబాద్: బీఆర్ అంబేడ్కర్ ప్రపంచ మేధావి అని ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ కొనియాడారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో అంబేడ్కర్ 134 జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ రాంచంద్రు నాయక్, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ జ్యోతి ప్రజ్వలన చేసి అంబేడ్కర్ చి త్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆదర్శప్రాయుడని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరు పాటుపడాలన్నారు. దేశంలో మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు జరుగుతున్నాయని, వాటిని తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే మురళీనాయక్ మాట్లాడుతూ.. వెనుకబడిన కులాలు ఐక్యంగా ఉండాలని సూచించారు. బీసీలకు న్యాయం చేయడం కోసం బీసీ కుల గణన చేపట్టినట్లు పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అనంతరం కులాంతర వివాహం చేసుకున్న నలుగురు దంపతులకు చెక్కులు అందజేశారు. ఏఎంసీ చైర్మన్సుధాకర్, బీసీ సంక్షేమశాఖ జిల్లా అఽధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నర్సింహస్వామి, కుల సంఘాల నాయకులు కిషన్నాయక్, పీరయ్య, కామ సంజీవరావు, కోండ్ర ఎల్లయ్య, బీమానాయక్, లక్ష్మణ్ ఉపేందర్ ఉన్నారు. ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ జిల్లా కేంద్రంలో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు హాజరైన ఎమ్మెల్యే మురళీనాయక్, కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్, అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి -
భూభారతితో రైతులందరికీ మేలు
మహబూబాబాద్ రూరల్ : సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి పోర్టల్ ద్వారా రైతులందరికీ మేలు జరుగుతుందని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నా రు. సోమవారం రాత్రి భూభారతి పోర్టల్ ప్రారంభం సందర్భంగా హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని మానుకోట రైతు వేదికలో ఎల్ఈడీ ప్రొజెక్టర్ ద్వారా ఎమ్మెల్యే మురళీనాయక్, వ్యవసాయ అధికారులు, రైతులు వీక్షించారు. అన ంతరం ఎమ్మెల్యే మురళీనాయక్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ద్వారా రైతులు, సాధారణ ప్రజలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిని రద్దుచేసి భూభారతి పోర్టల్ తీసుకొచ్చిందని తెలిపారు. ఏడీఏ అజ్మీర శ్రీనివాసరావు, ఏఓ నారెడ్డి తిరుపతిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ దేశెట్టి మల్లయ్య, కాంగ్రెస్ నేతలు దేవరం ప్రకాశ్రెడ్డి, రాంరెడ్డి, ఎడ్ల రమే శ్, ఖలీల్, అజ్మీరా సురేశ్, కోడి శ్రీను, బుజ్జి వెంకన్న, పూజారి వెంకన్న, రైతులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ మానుకోట రైతు వేదికలో సీఎం ప్రసంగం వీక్షణం -
అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
మహబూబాబాద్: అగ్ని ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్ జాటో త్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. అగ్ని మాపకశాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 14నుంచి 20వ తేదీ వరకు వారోత్సవాల్లో భాగంగా నిర్వహించే అవగాహన కార్యక్రమాలను ప్రజలు వీక్షించాలన్నారు. ప్రమాదాలపై ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనాథ్ మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజ లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సిబ్బంది కృష్ణ, రవీందర్, వెంకన్న, చందర్, గోపి, విశ్వనాథ్, జీవన్, రవి ఉన్నారు. రావి ఆకుపై అంబేడ్కర్ చిత్రం కేసముద్రం: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఇనుగుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని కె.అమూల్య అంబేడ్కర్ చిత్రాన్ని రావి ఆకుపై చిత్రీకరించింది. అలాగే సుద్దముక్కపై అంబేడ్కర్ అని ఆంగ్ల అక్షరాలను చెక్కింది. ఈ మేరకు సూక్ష్మకళను ప్రదర్శించిన విద్యార్థినిని ఉపాధ్యాయ బృందం సోమవారం అభినందించింది. అదే విధంగా ‘అందరివాడు అంబేడ్కర్’అనే అంశంపై ఈనెల 8న నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో అమూల్య ప్రథమ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపాల్ జయశ్రీ తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేలు భూక్య మురళీనాయక్, రాంచంద్రునాయక్ చేతుల మీదుగా అమూల్య ప్రశంసపత్రం అందుకున్నట్లు తెలిపారు. సభను విజయవంతం చేయాలి గంగారం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో ఈనెల 17న ఎస్టీ తెగల వర్గీకరణ కోసం నిర్వహించనున్న సభను విజయవంతం చేయాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు సువర్ణపాక వెంకటరత్నం అన్నారు. సోమవారం మండలంలోని మడగూడెం గ్రామంలో చలో ఇల్లెందు వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. కత్తి రమేశ్, యాప లక్ష్మణ్రావు, ఈసం నర్సింహారావు, మోకాల సత్యం, యాప సందయ్య, యాప వీరలక్ష్మి, ఈసం గౌరయ్య పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఓ సస్పెన్షన్ మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖ జిల్లా కార్యాలయంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న డి.నాగేశ్వర్రావును సస్పెండ్ చేస్తూ సోమవారం రీజినల్ ఫైర్ ఆఫీసర్ ఉత్తర్వులు జారీ చేశారు. నాగేశ్వర్రావు అధికార దుర్వినియోగం చేశారని, మరిపెడ మండలంలో ఓ పరిశ్రమకు ఫేక్ ఎన్ఓసీ ఇచ్చారని, ఇలా పలు కారణాలతో ఈ నెల 11న సస్పెండ్ చేసినట్లు సిబ్బంది తెలిపారు. ఆయన ఇచ్చిన ఎన్ఓసీలపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. ఆర్చరీ అసోసియేషన్ సభ్యుడిగా శంకరయ్య మహబూబాబాద్ అర్బన్: దేశంలో ఆర్చరీ క్రీడాభివృద్ధికి కోసం ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈమేరకు మానుకోట జిల్లా వాసి పుట్ట శంకరయ్య కమిటీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా కమిటీ సభ్యులు దేశవ్యాప్తంగా పర్యటనలు చేసి ఆర్చరీ అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటారు. పుట్ట శంకరయ్య ఏఏఐ సభ్యుడిగా ఎన్నిక కావడంపై ఉమ్మడి జిల్లా ఆర్చరీ సంఘం అధ్యక్షుడు సాదుల సారంగపాణి, ఖమ్మం జిల్లా యువజన క్రీడల అధికారి సునీల్ రెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి కృష్ణాపర్బాబు హర్షం వ్యక్తం చేశారు. -
వనాలపై పట్టింపేది?
మహబూబాబాద్: ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదాన్ని దృష్టిలో పెట్టుకొని పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీల్లో ముఖ్యంగా గ్రీన్ల్యాండ్స్ పరిరక్షణలో భాగంగా వాటిని ఏర్పాటు చేశారు. నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మొక్కలు ఎండిపోతున్నాయి. 51 పట్టణ ప్రకృతి వనాలు.. మానుకోట మున్సిపాలిటీ పరిధిలో 68,889 మంది జనాభా, 57,828 మంది ఓటర్లు, 25,000లకు పైగా గృహాలు ఉన్నాయి. ఉద్యోగ, విద్య, వ్యాపార రీత్యా మానుకోటలో నివాసం ఉండే వారితో కలిపితే జనాభా లక్ష దాటుతుంది. 2020 నుంచి 2023 వరకు 51పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. వాటిల్లో 1,46,626 మొక్కలు నాటారు. 10 ప్రకృతి వనాలకు ప్రహరీల నిర్మాణం చేపట్టగా, మిగిలిన 41 వనాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. విస్తీర్ణం ఆధారంగా పలు చోట్ల సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు. కొన్ని వనాల్లో వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేశారు. అలాగే చెట్లకు నీరు అందించేందకు నాలుగు ట్యాంకర్లు కూడా కొనుగోలు చేశారు. 20మందితో గ్రీన్ టీం.. పట్టణ ప్రకృతి వనాల నిర్వహణ కోసం 20మందితో గ్రీన్ టీం ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరికి నెలకు రూ.12,000 వేతనం ఇస్తున్నారు. అయితే సరిపడా సిబ్బంది లేకపోవడంతో నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది. గ్రీన్ బడ్జెట్ సక్రమంగా విడుదల కాకపోవడంతో జనరల్ ఫండ్ నుంచి 10శాతం కేటాయించి సిబ్బందికి వేతనాలు ఇస్తున్నారు. అయితే వారికి రెండు నెలల వేతనాలు పెండింగ్లో ఉండటం, పలు కారణాల వల్ల వనాల నిర్వహణ అధ్వానంగా మారింది. అలాగే జిల్లా కేంద్రంలోని డివైడర్ల మధ్యలోని చెట్లకు నీటి సరఫరా బాధ్యత కూడా వారిపైనే ఉంది. దీంతో వారిపై పని భారం పెరిగి సరిగా నిర్వహణ బాధ్యతలు చేపట్టలేకపోతున్నారు. ఎండిపోతున్న మొక్కలు.. ప్రస్తుత వేసవిలో నీటిసరఫరాలో జాప్యం జరుగుతోంది. సరిపడా నీరు లేకపోవడంతో మొక్కలు ఎండిపోతున్నాయి. వాకింగ్ ట్రాక్లు ఉన్నచోట వాకర్లు నిర్వహణపై దృష్టి పెడుతున్నారు.. అలాగే అధికారులకు తెలియజేస్తున్నారు. డివైడర్ల మధ్యలో నాటిన అలంకరణ మొక్కలకు మాత్రమే నీరు అందిస్తున్నారు. కాగా ట్యాంకర్ల ద్వారా ప్రకృతి వనా లకు నీటి సరఫరా చేయాలని, నిర్వహణపై అధి కారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, కూలిపోయిన ప్రహరీల స్థానంలో కొత్తగా నిర్మాణాలు చేపట్టాల ని, పాడైన బెంచీలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రత్యేక దృష్టి పెట్టాం పట్టణ ప్రకృతి వనాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాం. గ్రీన్ టీం సభ్యులు ప్రతీరోజు పనులు చేస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. నిధులను బట్టి పనులు జరుగుతున్నాయి. – గుజ్జు క్రాంతి, పర్యావరణ అధికారి బడ్జెట్ కేటాయించాం జనరల్ బడ్జెట్నుంచే 10శాతం నిధులు కేటాయించి గ్రీన్ టీం సభ్యులకు వేతనాలు ఇస్తున్నాం. పట్టణ ప్రకృతి వనాల నిర్వహణ కోసం ఖర్చు చేస్తున్నాం. రెండు నెలల వేతనాలు కూడా త్వరలో వారి ఖాతాల్లో జమ చేస్తాం. వనాలకు నీరు అందించేందుకే నాలుగు ట్యాంకర్లు కొనుగోలు చేశాం. –నోముల రవీందర్, మున్సిపల్ కమిషనర్ నిర్వహణ లేక అధ్వానంగా పట్టణ ప్రకృతి వనాలు నీటి సరఫరా లేక ఎండిపోతున్న మొక్కలు మానుకోట మున్సిపాలిటీ పరిధిలో 51 వనాలు -
సరస్వతి పుష్కరాల పనుల పరిశీలన
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరుగనున్న సరస్వతినది పుష్కరాల పనులను రాష్ట్ర దేవాదాయశాఖ ధార్మిక సలహాదారు గోవిందహరి పరిశీలించారు. ఆదివారం ఆయన ముందుగా శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. ఆయనను ఈఓ మహేశ్ శాలువాతో సన్మానించగా, అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం వీఐపీ (సరస్వతి) ఘాటు వద్ద నిర్మిస్తున్న పుష్కరఘాటు, సరస్వతి మాత విగ్రహం ఏర్పాటు పనులను ఆయన పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఆయన వెంట సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఉపప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ తదితరులు ఉన్నారు. -
నేడు అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు
మహబూబాబాద్ అర్బన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 134వ జయంతి ఉత్సవాలు సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఎం. నర్సింహరావు ఆదివారం తెలిపారు. ఉదయం 9 గంటలకు అంబేడ్కర్ విగ్రహానికి ముఖ్య అతిథులు మంత్రి సీతక్క, ఎంపీ పోరిక బలరాంనాయక్, ప్రభుత్వ విప్ జాటోత్ రాంచందర్నాయక్, మానుకోట ఎమ్మెల్యే మురళీనాయక్, కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు లెనిన్వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారని పేర్కొన్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో సమావేశం ఉంటుందని, అంబేడ్కర్ జయంతి ఉత్సవాలకు అన్ని కుల, ప్రజా సంఘాల నాయకులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. గంజాయి పట్టివేత మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ పట్టణ శివారులోని బాబునాయక్ తండా సమీపంలో ఇద్దరు యువకులు గంజాయి తాగేందుకు ప్రయత్నిస్తుండగా తమకు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నామని టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ ఆదివారం తెలిపారు. బాబునాయక్ తండా ప్రాంతంలో కొందరు యువకులు గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. ఈ క్రమంలో టౌన్ ఎస్సై బి.విజయ్ కుమార్ అక్కడకు చేరుకుని తనిఖీలు చేయగా ఇద్దరు యువకులు సిగరెట్లలో గంజాయి పొడి పోసుకుని తాగేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారన్నారు. వారిని అదుపులోకి తీసుకుని 28.50 గ్రాముల గంజాయి, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారని తెలిపారు. ఎస్సై విజయ్ కుమార్ ఫిర్యాదు చేయగా మరో టౌన్ ఎస్సై కె.శివ కేసు నమోదు చేశారని తెలిపారు. పోరాటాలతోనే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం తొర్రూరు: పోరాటాలతోనే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం సాధ్యమని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ అన్నారు. టీఎస్ యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఆదివారం డివిజన్ కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో నిర్వహించారు. సంఘ సీనియర్ నాయకురాలు కొండబత్తుల రాధాదేవి సంఘ జెండాను ఆవిష్కరించారు. మురళీకృష్ణ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల హక్కుల సాధన, విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి నాగమల్లయ్య, నాయకులు చైతన్య, రాయలు, వనజ, సుల్తానా బేగం, మౌనిక, మమత, స్రవంతి, పల్లవి పాల్గొన్నారు. సేంద్రియ ఆహారం తీసుకోవాలి హన్మకొండ చౌరస్తా: సేంద్రియ పద్ధతిలో పండించిన వాటిని తినాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్లోని నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో గ్రామ భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి గ్రామీణ ఉత్పత్తుల సంతను ఆదివారం బండా ప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత జంక్ఫుడ్కు అలవాటు పడి అనేక వ్యాధులు కొని తెచ్చుకుంటోందన్నారు. జంక్ఫుడ్, రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. తెలంగాణ గ్రామ భారతి అధ్యక్షురాలు సూర్యకళ మాట్లాడుతూ ప్రజల్లో మార్పు తీసుకురావాలన్న సదుద్దేశంతో ప్రతీ నెల ప్రకృతి సంత నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్, సంస్థ వరంగల్ జిల్లా బాధ్యుడు అజిత్రెడ్డి, తోట ఆనందం, అనిత, బయ్య సారయ్య తదితరులు పాల్గొన్నారు. -
మందులు బంద్!
సోమవారం శ్రీ 14 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 8లోuమహబూబాబాద్: మూగజీవాలకు అత్యవసర సేవలు అందించేందుకు ప్రభుత్వం 1962 సంచార వైద్యశాలలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే కొన్ని నెలలుగా మందులు సరఫరా కావ డం లేదు. దీంతో మూగజీవాలకు మెరుగైన సేవలు అందడం లేదు. దీనికి తోడు సిబ్బంది వేతనాలు కూడా పెండింగ్లో ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 45 పశు వైద్యశాలలు.. జిల్లాలో 3 ఏరియా వెటర్నరీ వైద్యశాలలు(ఏవీహెచ్), 23 ప్రైమరీ వెటర్నరీ వైద్యశాలలు (పీవీహెచ్), 19 సబ్ సెంటర్లు ఉన్నాయి. వీటితో పాటు నియోజకవర్గానికి ఒక సంచార వైద్యశాల వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లాలో పూర్తిస్థాయిలో మానుకోట, డోర్నకల్ నియోజకవర్గాలు ఉండగా.. ఇల్లెందు నియోజకవర్గంలోని రెండు మండలాలు, ములుగు నియోజకవర్గం రెండు మండలాలు, పాలకుర్తి నియోజకవర్గంలో రెండు మండలాలు ఉన్నాయి. ఈమేరకు మానుకోట, డోర్నకల్ నియోజకవర్గాల్లో రెండు సంచార వాహనాలు ఉన్నాయి. అలాగే ములుగు నియోజకవర్గ పరిధిలోని గంగారం, కొత్తగూడ మండలాలకు ఒక వాహనాన్ని కేటాయించారు. దీంతో జిల్లాలో 3 సంచార పశువైద్యశాల వాహనాలు ఉన్నాయి. అయితే వాటిలో పనిచేసే సిబ్బంది కోసం రూం కానీ, ఇతర ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. వాహనానికి నలుగురు.. ప్రతీ వాహనంలో డాక్టర్, కాంపౌండర్, డ్రైవర్, హెల్పర్ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంది. 1962కు కాల్ చేయగానే వారు నమోదు చేసుకుంటారు. ఆ కాల్స్ ఆధారంగా వాహనాల డాక్టర్లకు షెడ్యూల్ ఇస్తారు. దాని ప్రకారం ఆయా గ్రామాలకు వెళ్లి మూగ జీవాలకు చికిత్స చేస్తారు. కాగా ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ రీసెర్స్ ఇన్స్టిట్యూట్ (ఐఎంఆర్ఐ), జీవీకే, గ్రీన్హెల్త్ సర్జిల్ సంస్థలకు ప్రభుత్వం నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సంస్థల ఆధ్వర్యంలో అవుట్సోర్సింగ్లో సిబ్బంది నియామకం, మందులు అందజేస్తారు. మందుల సరఫరా బంద్.. నాలుగైదు నెలల నుంచి మందులు రావడం లేదని సిబ్బంది తెలిపారు. కనీసం సిరంజీలు కూడా లేక వెటర్నరీ వైద్యశాలలో అడిగి తీసుకెళ్తున్నామని వారు వాపోతున్నారు. మందులు లేవని.. బయట తెచ్చుకొమ్మని చెబుతున్నారని రైతులు అంటున్నారు. మందులు లేక పశువులకు పూర్తిస్థాయిలో చికిత్స అందడం లేదు. పశువైద్యశాలలకు కూడా సంవత్సరానికి మూడుసార్లు సరఫరా చేస్తున్నారని, అవి కూడా సరిపోవడం లేదని వెటర్నరీ వైద్యులు అంటున్నారు. మందుల కొరతతో అరకొర చికిత్స చేయాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యూస్రీల్ మూగ జీవాల అత్యవసస వైద్యంపై నిర్లక్ష్యం నియోజకవర్గానికి ఒక్క సంచార పశువైద్యశాల పెండింగ్లో 1962–సిబ్బంది వేతనాలు ఇబ్బందులు పడుతున్న సిబ్బంది వేతనాలు పెండింగ్లోనే .. ఐదు నెలల వేతనాలు రాలేదని కొంత మంది సిబ్బంది చెబుతుండగా.. మరికొంత మంది మూడు రోజుల క్రితం మూడు నెలల వేతనాలు విడుదల చేశారని అంటున్నారు. వారు చెప్పిన ప్రకారం రెండు నెలల వేతనాలు పెండింగ్లోనే ఉన్నాయి. వేతనాలు రాక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. సంచార వైద్యశాలల్లో మందుల కొరత, వారి వేతనాల విషయంలో పశువైద్య, సంవర్థక శాఖ అధికారులను వివరణ కోరగా వాటితో తమకు సంబంధం లేదని బదులిచ్చారు. కాగా, సంచార వైద్యశాలల విషయంలో సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి మందుల కొరత, వేతనాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మూగ జీవాలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని రైతులు కోరుతున్నారు. -
అభివృద్ధికి నిధులు కేటాయించాలి
తొర్రూరు: పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డిని స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పూర్తికి, తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.50 కోట్ల నిధులు అవసరమని కోరగా దానికి సీఎం సమ్మతి తెలిపారు. సన్న బియ్యం పంపిణీతో పేద ప్రజలు ఆనందంగా ఉన్నారని, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. సీఎంను కలిసిన వారిలో వరంగల్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ లకావత్ ధన్వంతి, టీపీసీసీ సభ్యుడు డాక్టర్ లక్ష్మీనారాయణ, వేమిరెడ్డి మహేంద్రనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటాలకు సిద్ధం
మరిపెడ రూరల్: రాజ్యాధికారంమే లక్ష్యంగా యాదవులు పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఊడుగుల ఐలేష్ యాదవ్ అన్నారు. ఆదివారం మరిపెడ మండలంలో యా దవ కులస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దొడ్డి కొమురమ్మ ఉద్యమ స్ఫూర్తితో పోరా టం చేసి రాజ్యాధికారం సాధించాలన్నారు. రాబో యే ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించడంతో పాటు జనరల్ స్థానాల్లో అవకాశం కల్పించా లన్నారు. 50 ఏళ్లు నిండిన గొర్రెలకాపరులకు రూ.3 వేలు పింఛన్ అందించాలని డియాండ్ చేశారు. జిల్లా కమిటీ ఎన్నిక.. అనంతరం సంఘం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా కలంచర్ల తిరుపయ్య, గౌరవ అధ్యక్షుడిగా బోర గంగయ్య, ప్రధాన కార్యదర్శిగా కొంపెల్లి శ్రీనివాస్, కార్యదర్శిగా దొడ్డ ఉపేందర్ జిల్లా కోశాధికారిగా ఏర్పుల లింగయ్య, ఉపాధ్యక్షుడిగా కే.వెంకన్న, సభ్యులుగా శ్రీనివాస్, భిక్షం ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు తెలిపారు. -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
నర్సింహులపేట: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రైతు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. మండలంలోని ముంగిమడుగు, వంతడపల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీ బలరాంనాయక్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలతో పాటు, సన్నవడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని అన్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలోనే రైతులు, పేదలు సంతోషంగా ఉంటున్నారని అన్నారు. ధాన్యం దళా రులకు అమ్మి మోసపోవద్దని రైతులను కోరారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ మెరుగు సత్యనారాయణ, జినుకుల రమేశ్, చిర్ర సతీష్గౌడ్, రామకృష్ణ, శ్రీకాంత్, యాదగిరి, శ్రీనువాస్, యాకయ్య, సొమిరెడ్డి, సురేశ్, మహబూబుఖాన్, మధుకర్రెడ్డి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
తల్లులకు తనివితీరా మొక్కులు
● మేడారానికి భారీగా తరలివచ్చిన భక్తులు ఎస్ఎస్ తాడ్వాయి: వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం మేడారానికి పోటెత్తారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చారు. జంపన్నవాగు వద్ద భక్తుల పుట్టువెంట్రుకలు సమర్పించి స్నానాలు ఆచరించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తుబంగారం, ఒడిబియ్యం, గాజులు, పూలు, పండ్లు, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు. సుమారు 10వేల మంది భక్తులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఎండోమెంట్ జూనియర్ అసిస్టెంట్ జగదీశ్వర్, బాలకృష్ణ భక్తులకు సేవలందించారు. కిక్కిరిసిన తల్లుల గద్దెలు అమ్మవార్ల దర్శనానికి ఉదయం 8గంటల నుంచే భక్తుల తాకిడి పెరిగింది. భక్తుల రద్దీతో సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. మొక్కులు చెల్లించుకునేందుకు గద్దెల వద్ద పోటీ పడ్డారు. దొంగలు చేతివాటం ప్రదర్శించకుండా పోలీసులు గద్దెల వద్ద చర్యలు తీసుకున్నారు. ఎండోమెంట్ అధికారులు మైక్ అనౌన్స్మెంట్ ద్వారా భక్తులకు ఎప్పటికప్పుడు సూచనలు చేశారు. భక్తుల రద్దీతో మేడారం సందడిగా కనిపించింది. దర్శనాల అనంతరం భక్తులు మేడారం పరిసరాల్లోని చెట్ల కింద వంటావార్పు చేసుకొని సహపంక్తి భోజనాలు చేశారు. కాగా, సాయంత్రం 4గంటల ప్రాంతంలో ఉరుములు మెరుపులతో మేడారంలో భారీ వర్షం కురియడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. -
శ్రీపాదరావు ఆశయ సాధనకు కృషి
కాటారం: మంథని నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల అభివృద్ధికి నిరంతరం పరితపించిన దివంగత మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు ఆశయ సాధనకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్ర మల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని చింతకాని క్రాస్ వద్ద గల ఆయన విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీఎల్ఎం గార్డెన్స్లో పుష్పగిరి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంథని నియోజకవర్గంలో వైద్య, విద్య, రవాణాలాంటి మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకురావడానికి శ్రీపాదరావు కృషి చేశారన్నారు. తన తండ్రి శ్రీపాదరావు స్ఫూర్తితో పేదల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యంజయం, ‘సూడా’ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అద్యక్షుడు చీమల సందీప్, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, దండ్రు రమేశ్, బాన్సోడ రాణిబాయి పాల్గొన్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు -
ఇల్లందలో గుడిసె దగ్ధం
వర్ధన్నపేట: ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని గుడిసె దగ్ధమైన సంఘటన ఆదివారం మండలంలోని ఇల్లంద గ్రామంలో జరిగింది. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కడెం రాజు, ఆయన తండ్రి మల్లయ్య గుడిసె వేసుకుని పాత ఇనుప సామాను కొనుగోలు, అమ్మకంతోపాటు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగి స్తున్నారు. ఆదివారం రాజు భార్య దేవుడికి దీపం వెలిగించి తాగునీరు తీసుకురావడానికి బయటకు వెళ్లింది. ఇంతలో దీంపం మంటలు అంటుకుని చెలరేగి గుడిసె లోపల ఉన్న బట్టలు, బియ్యం, దాచుకున్న డబ్బులు రూ.15 వేలు కాలిపోయాయి. గ్రామస్తులు బిందెలతో నీళ్లు పోసి మంటలను ఆర్పివేశారు. రాజు కుటుంబానికి ప్రభుత్వం సహా యం అందించాలని స్థానికులు కోరారు. దమ్మన్నపేటలో విద్యుదాఘాతంతోఇల్లు.. రేగొండ: విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధమైన ఘటన మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..బండి అశోక్తో పాటు కుటుంబ సభ్యులు ఉదయం పొ లం పనులకు వెళ్లారు. ఇంటి నుంచి పొగ, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు పరకాల అగ్ని మాపక సిబ్బందికి సమాచారం చేరవేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.అప్పటికే నష్టం జరిగిపోయింది. ప్రమాదంలో సుమారు రూ. 3లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలువాజేడు: మండల పరిధిలోని పావిరాల వాగు సమీపంలో జాతీయ రహదారిపై ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. బాధితుల కథనం ప్రకారం.. వెంకటాపురం(కె) మండల పరిధిలోని వీరభద్రారం గ్రామానికి చెందిన రామ్చరణ్, సంజయ్ వాజేడు వైపు నుంచి జాతర వైపునకు వెళ్తున్నారు. అదే సమయంలో కదేకల్ గ్రామానికి చెందిన మనోజ్ జాతర వైపు నుంచి కడేకల్కు వస్తున్నాడు. ఈ క్రమంలో ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురికి గాయాలు కాగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించి చికిత్స నిమిత్తం ముగ్గురిని వైద్యశాలకు తరలించారు. -
విద్యార్థిని బలవన్మరణం
మహబూబాబాద్ రూరల్ : మరో రెండు రోజుల్లో డిగ్రీ వార్షిక పరీక్షలు ప్రారంభం కానుండగా ఓ విద్యార్థి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల ప్రకారం.. వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రానికి చెందిన పర్వతపు ఈశ్వరాచారి, ధనలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు తరంగిణి (20), మౌనికశ్రీ ఉన్నారు. ధనలక్ష్మి 15 సంవత్సరాల క్రితం మృతి చెందింది. దీంతో ఆ ఇద్దరు అమ్మాయిలు చిన్నప్పటి నుంచి మహబూబాబాద్లోని ఆర్టీసీ కాలనీలో తమ పెద్దమ్మ,పెద్దనాన్న వంగాల పరమేశ్వరాచారి, జయప్రద ఇంటి వద్ద ఉండి చదువుకుంటున్నారు. వరంగల్లోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో తరంగిణి బీఎస్సీ ఫస్టియర్ చదువుతోంది. ఈనెల 15వ తేదీ నుంచి డిగ్రీ పరీక్షలు ప్రారంభం కానుండగా ఆదివారం తన తండ్రి ఈశ్వరాచారికి ఫోన్ చేసి మానుకోటకు ఎప్పుడు వస్తున్నావని అడిగింది. ఈ క్రమంలో పరమేశ్వరాచారి ఉదయం తమ బంధువుల ఇంట్లో వివాహం ఉండగా అక్కడికి వెళ్లారు. దీంతో ఎవరూలేని సమయంలో తరంగిణి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సాయంత్రం చుట్టుపక్కల వాళ్లు ఇంటికి వెళ్లి తలుపులు కొట్టగా స్పందించలేదు. దీంతో ఇంట్లోకి వెళ్లి చూడగా తరంగిణి ఉరేసుకుని కనిపించింది. వెంటనే బంధువులకు సమాచారం ఇవ్వగా వారు పోలీసులకు తెలియజేయడంతో టౌన్ ఎస్సై కె. శివ, హెడ్ కానిస్టేబుల్ దామోదర్ ఘటనా స్థలికి చేరుకుని తరంగిణి మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఈశ్వరాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని టౌన్ సీఐ దేవేందర్ పేర్కొన్నారు. కాగా, శనివారం రాత్రి తరంగిణి ఎవరితోనో ఫోన్లో ఘర్షణ పడినట్లు కుటుంబ సభ్యులు గుర్తించినట్లు సమాచారం. జిల్లా కేంద్రంలోనే వివాహిత..మహబూబాబాద్ రూరల్ : ఉరేసుకుని ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన శ్రీపాద రవిచంద్ర, నవ్య దంపతులు కొద్ది నెలల క్రితం మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చి స్థిరపడ్డారు. నర్సంపేట బైపాస్ రోడ్లో రెడీమేడ్ షాప్ నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం వివాహ వేడుకకు హాజరై సాయంత్రం వచ్చారు. రవిచంద్ర షాపులో ఉండగా నవ్య ఇంట్లోకి వెళ్లింది. ఈ క్రమంలో రవిచంద్ర ఇంట్లోకి వెళ్లి చూడగా నవ్య ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడి కనిపించింది. విషయం తెలుసుకున్న టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్, ఎస్సై బి.విజయ్ కుమార్ ఘటనా స్థలికి చేరుకుని నవ్య మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాగా, నవ్య ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదని, ఈ ఘటనపై ఇంకా ఫిర్యాదు అందలేదని సీఐ దేవేందర్ పేర్కొన్నారు. మానుకోటలో ఘటన మరో రెండు రోజుల్లో డిగ్రీ పరీక్షలు అంతలోనే అనంతలోకాలకు.. -
మామిడి రైతన్నా.. జాగ్రత్త
మహబూబాబాద్ రూరల్ : అకాల వర్షాల సమయంలో మామిడి తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహబూబాబాద్ మండలంలోని మల్యాల గ్రామంలో గల జెన్నారెడ్డి వెంకటరెడ్డి ఉద్యాన పరి శోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త కత్తుల నాగరాజు వివరించారు. ప్రస్తుతం మామిడి పండ్లు అభివృద్ధి దశలో ఉన్నాయని, అకాల వర్షాలు కురిసినప్పుడు, కురిసిన తర్వాత రైతులు మామిడి తోటల్లో యాజమాన్య పద్ధతులు పాటించాలని తెలియజేశారు. ● వర్షం వచ్చిపోయాక 24 గంటలలోపు నీటిని బయటకు పంపాలి. నీరు నిల్వకుండా ఎత్తయిన కట్టలతో సరైన పారుదల సౌకర్యాన్ని అందించాలి. ● గాలికి దెబ్బతిన్న కొమ్మలను కత్తిరించి కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా బోర్డో పేస్ట్ పూయాలి. ● తెగుళ్ల వ్యాప్తికి అనుకూలంగా ఉండే పడిపోయిన పండ్లను సేకరించి దూరంగా నాశనం చేయాలి. ● వర్షం కారణంగా పక్షి కన్ను తెగులుతోపాటుగా బాక్టీరియా వ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి. వాటిని 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా, అవసరాన్ని బట్టి స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్, టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ కాంబినేషన్ 6 గ్రాముల మందు 60 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా నియంత్రించొచ్చు. ● అధిక వర్షపాతం వల్ల అన్ని రకాల రసం పీల్చే (పిండినల్లి, తేనెమంచు పురుగులు) తెగుళ్ల బారినపడే అవకాశం ఉంది. వర్షం ఆగిపోయిన తర్వాత ఇమిడా క్లోప్రిడ్ 1 మిల్లీ లీటరు లేదా అసిఫేట్ 1.5 గ్రాములు లేదా 2 మిల్లీ లీటర్లు క్లోరోపైరిఫాస్ లీటర్ నీటికి కలిపి పురుగు మందులను పిచికారీ చేయాలి. ● మామిడిలో తామరపురుగులు వర్షాలకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఫిప్రోనిల్ 2 మిల్లీ లీటర్లను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● తడి, తేమ కారణంగా, పండ్ల ఈగలు గుడ్లు పెట్టే అవకాశాలు ఉన్నాయి. తోటల్లో పండ్ల ఈగ (ఎర) ఉచ్చులను ఏర్పాటు చేయడం ద్వారా దీనిని పర్యవేక్షించొచ్చు. (ఎకరానికి 10 నుంచి 20 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి). ● తక్కువ రాత్రి ఉష్ణోగ్రతలు, అధిక పగటి ఉష్ణోగ్రతలు ఉద్యాన పంటలపై బూజు తెగులుకి కారణం అవుతాయి. లీటర్ నీటికి హెక్సాకోనజోల్ మిల్లీ లీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే ఉపశమనం ఉంటుంది. ● వడగండ్ల వాన నుంచి పండ్ల నష్టాన్ని నివారించడానికి పండ్లను పండ్ల సంచులతో కప్పాలి. ● వడగండ్ల వాన ప్రభావిత ప్రాంతంలో వర్షాల అనంతరం పొటాషియం నైట్రేట్ 10 గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.వాతావరణంలో మార్పులుఈదురుగాలులు, వడగండ్ల వానలువాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రోజంతా ఎండ కొట్టి.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతోపాటు ఈదురుగాలులు, వడగండ్ల వానలు కురుస్తున్నాయి. దీంతో రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మామిడి రైతుల పరిస్థితి మరీ దారుణం. ప్రస్తుతం వీస్తున్న ఈదురుగాలులతో మామిడి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో వర్షం కురిసినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలను మల్యాల జేవీఆర్ హెచ్ఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త కత్తుల నాగరాజు రైతులకు వివరిస్తున్నారు. -
అర్ధశతాబ్దపు ‘అపూర్వ’ కలయిక
హన్మకొండ చౌరస్తా : ఐదు దశాబ్దాల క్రితం వారందరూ విద్యార్థులు. నేడు పిల్లలు, మనుమలు, మ నుమరాళ్లతో జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ మరిచిపోయి ఆదివారం మళ్లీ విద్యార్థులుగా మారి రోజంతా సంతోషంగా జరుపుకున్నారు. అందుకు లష్కర్బజార్లోని ఎల్బీహెచ్ఎస్ వేదికగా నిలిచింది. 1974–75లో ఎల్బీహెచ్ఎస్లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల అపూర్వ కలయిక రిటైర్డ్ ఎస్సై జి.నర్సయ్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ రోజంతా ఉత్సాహంగా గడిపారు. నాటి గురువుల పాండురంగాచారి, ఐలయ్య, పాఠశాల ప్రస్తుత హెచ్ఎంలు జగన్, వెంకటేశంను స న్మానించారు. కాగా, సమ్మేళనంలో నెల్లూరు, కాకినా డ, హైరాబాద్, మంచిర్యాల, కరీంనగర్, ఏటూరునాగారం, ములుగు ప్రాంతాల్లో స్థిరపడిన వారంద రూ కలుసుకున్నారు. పరిటాల సుబ్బారావు, సత్యసుబ్రహ్మణ్యం, రమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
డ్యూటీలు వేస్తున్న నాయకుడు!
వరంగల్: ఏనుమాములలోని వరంగల్ వ్యవసాయ మార్కెట్ పాలన అస్తవ్యస్తంగా మారింది. యార్డుల్లోకి విక్రయానికి వస్తున్న మిర్చిని దడువాయిలు పీఓఎస్ మిషన్లలో నమోదు చేసి లాట్ ఐడీలను రై తులకు అందిస్తారు. యార్డుల్లో దడువాయిలు ఎక్క డ విధులు నిర్వర్తించాలో అన్ని గుర్తించి వారికి పీఓ ఎస్ మిషన్లను మార్కెట్ సూపర్వైజర్లు అందజేస్తా రు. పీఓఎస్ మిషన్ల నిర్వహణ మొత్తం ఓ సూపర్వైజర్ పర్యవేక్షిస్తుంటారు. సూపర్వైజర్లు, దడువాయి యూనియన్ నాయకుడు మిలాఖత్ కావడంతో డ్యూటీల బాధ్యతలు అతడికే అప్పగించినట్లు తెలి సింది. దీంతో సదరు నాయకుడు తనకు నమ్మకం, ఇష్టమైన వారికి ఆదాయం ఉన్న ప్రాంతాల్లో డ్యూటీలు వేయడంతో సంఘంలోని నేతల మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్నట్లు తెలిసింది. ముఖ్యంగా మార్కెట్లో జీరో దందా జరుగుతున్న ప్రాంతాల ను తన అనుయాయులకు అప్పగించడంతోనే తేడాలు వచ్చినట్లు తెలిసింది. ఆదాయం ఉన్న ప్రాంతా లు రోజూ తన వారికే కేటాయించడంతో మిగిలిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే ప్యానల్ నుంచి గెలిచినప్పటికీ ప్రతిపక్ష ప్యానల్కు చెందిన వారికి మంచి ప్రాంతాల్లో డ్యూటీలు వేయడం సంఘంలోని మరో నాయకుడికి మింగుడు పడడం లే దు. ఈ వ్యవహారం ముదరడంతో దడువాయిల సంఘం ప్రధాన కార్యదర్శి సోల రవి నాలుగు రో జుల క్రితం తన పదవికి రాజీనామా చేసినా పట్టించుకోకపోవడంపై మిగతా వారి నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. రాజీనామాపై రవిని వివరణ కోరగా ఒకే ప్యానల్ నుంచి గెలిచినా పోటీ నాయకుడితో కమ్మక్కు కావడం, తనకు అడ్డుతగలడంతో మ నస్తాపానికి గురై పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. దీనికి తోడు దడువాయిలు ఆదివా రం విహార యాత్రకు వెళ్లి నట్లు తెలిసింది. ప్రతి ఏ డాది ఒక రోజు విహారయాత్రకు వెళ్లడం ఆనవాయితీగా వస్తుందని కొందరు తెలిపారు. ఇంటికి పీఓ మిషన్లు.. మార్కెట్లోని యార్డులకు వచ్చిన సరుకులను ద డువాయిలు నమోదు చేస్తారు. మార్కెట్ పరిధిలో మొత్తం 125 మంది దడుయిలు ఉన్నారు. వీరు ప్రతీరోజు యార్డులకు వచ్చిన సరుకులను మిషన్లలో నమోదు చేసి లాట్ ఐడీలను రైతులకు అందించేందుకు పీఓఎస్ మిషన్లను అందుబాటలోకి తీసుకొచ్చారు. పాత పీఓఎస్ మిషన్లు 50 ఉండగా కొత్త మూడు విడుతల్లో 40 మిషన్లు తెప్పించారు. నిబంధనల ప్రకారం దడువాయిలు ఉపయోగిస్తున్న పీఓ ఎస్ మిషన్లు విధులు ముగిసిన వెంటనే కార్యాలయంలో అప్పగించాల్సి ఉంటుంది. పీఓఎస్ మిష న్లు చార్జింగ్ పెట్టడం, నిర్వహణ, డ్యూటీలు వేసేందుకు ప్రత్యేకంగా ఓ సూపర్వైజర్కు అప్పగించిన ట్లు సమాచారం. దడువాయి నాయకుడు, యార్డుల్లోని సూపర్వైజర్లు ఒక్కటి కావడంతో డ్యూటీలను నాయకుడు వేయడంపై ఆరోపణలు తలెత్తుతున్నాయి. డ్యూటీలు వేస్తున్న సమయంలో మార్కెట్ యార్డు గది తలుపులు వేయడంపై దడువాయిలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీలు వేసే విష యం తెలియకుండా ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. డ్యూటీలు ముగిసినా దడువాయిలు పీఓఎ స్ మిషన్లు ఇంటికి తీసుకెళ్లానా పట్టించుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని చెప్పొ చ్చు. ఇలా మిషన్లు ఇంటికి తీసుకుపోతే లాట్ ఐడీలను అదనంగా జారీ చేసే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యార్డుల్లో డ్యూటీలను అధికారులే వేసేలా చర్యలు చేపట్టాలని దడువాయిలు డిమాండ్ చేస్తున్నారు. దడువాయిల ఇంటికి పీఓఎస్ మిషన్లు ప్రేక్షక పాత్రలో మార్కెట్ అధికారులు భేదాభిప్రాయాలతో సంఘం కార్యదర్శి రాజీనామా -
వడగళ్లతో పంట పాడైందని మనస్తాపం..
మంగపేట: వడగళ్ల వానకు 15 ఎకరాల వరి పంట చేతిరాకుండాపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతున్న గిరిజన రైతు యాలం నర్సింహారావు(45) ఆదివారం మృతి చెందాడు. మండలంలో ఈనెల 7న వడగళ్ల వానకు మల్లూరు, నర్సింహాసాగర్ తదితర గ్రామాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. పంట నష్ట పరిశీలనకు వచ్చిన కలెక్టర్, అదనపు కలెక్టర్కు మల్లూరు జీపీ పరిధిలోని మొట్లగూడెం గ్రామానికి చెందిన నర్సింహారావు తనకు జరిగిన నష్టాన్ని వివరించి న్యాయం చేయాలని వేడుకున్న విషయం విధితమే. ప్రభుత్వం ద్వారా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చినా 15 ఎకరాల్లో జరిగిన నష్టాన్ని తలుచుకుని నర్సింహారావు మనస్తాపంతో ఈనెల 10న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మూడు రోజుల నుంచి హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, కూతురు కవిత, కుమారుడు కల్యాణ్ ఉన్నారు. కాగా, నర్సింహారావు మృతి చెందాడనే విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో తాను పరామర్శించిన రైతు రెండు రోజులు గడవక ముందే మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఆస్పత్రి బిల్లును మంత్రి స్వయంగా క్లియరెన్స్ చేయించారు. మృతదేహాన్ని బాధిత కుటుంబానికి అందజేసేందుకు ప్రత్యేక చొరవ చూపారు. హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి ములుగు జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్టు మార్టం త్వరితగతిన పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయించారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. రైతు ఆత్మహత్యాయత్నం చికిత్స పొందుతూ మృతి -
27న రాష్ట్ర స్థాయి పారా తైక్వాండో పోటీలు
వరంగల్ స్పోర్ట్స్ : హైదరాబాద్లోని జేఎన్టీయూలో ఈ నెల 27వ తేదీన తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్స్ మెన్, ఉమెన్ పారా తైక్వాండో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ పారా తైక్వాండో అసో సియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎన్ఎస్ దిలీప్ కుమార్ తెలిపారు. హనుమకొండ భీమారం సమీ పంలో విహరీ హోటల్లో ఆదివారం అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు చైన్నెలో మే నెలలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా కన్వీనర్ వెంకటేశ్, వరంగల్ జిల్లా కన్వీనర్లు గణేశ్యాదవ్, దిలీప్, గౌతమ్, జనగామ భాస్కర్, ఖమ్మం వెంకటేశ్, ఆదిలాబాద్ అతుల్కుమార్, నిజామాబాద్ మనోజ్, మహబూబ్నగర్ కన్వీనర్ అజారుద్దీన్ పాల్గొన్నారు. -
వృద్ధురాలి దారుణ హత్య
● గొడ్డలితో నరికి చంపిన దుండగులు ● ఆదివారంపేటలో ఘటన కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఆదివారంపేటలో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఒడేటి మల్లక్క(65) కిరాణం దుకాణం నడుపుకుంటూ ఒంటరిగా జీవిస్తోంది. రోజు మాదిరిగానే శనివారం రాత్రి దుకాణం మూసివేసి నిద్రకు ఉపక్రమించింది. ఆదివారం ఉదయం కిరాణంలో పాల ప్యాకెట్లు వేయడానికి వచ్చిన వ్యక్తి మల్లక్కను పిలవగా స్పందించ లేదు. దీంతో అనుమానం వచ్చిన సదరు వ్యక్తి తలుపు తెరిచి చూడడంతో మంచంపై హత్యకు గురై ఉంది. గ్రామస్తులు, బంధువులకు తెలపడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దుండగులు ఇంట్లోకి ప్రవేశించి గొడ్డలితో మల్లక్కను నరికి హత్యకు పాల్ప డిన ఆనవాళ్లు ఉన్నాయి. కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్రెడ్డి, సీఐ నాగార్జునరావు, ఎస్సై శ్రీనివాస్ ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్స్క్వాడ్తో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మల్లక్క భర్త, కుమారుడు కొంత కాలం క్రితం చనిపోగా వివాహామైన కూతురు ఉంది.విద్యుదాఘాతంతో మహిళ మృతి ● రాయపల్లిలో ఘటన రేగొండ: విద్యుదాఘాతంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం మండలంలోని రాయపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నీటూరి నీలమ్మ (59) ఉదయం స్నానానికి వాటర్ హీటర్ పెట్టుకుంది. అనంతరం పక్కన ఉన్న బ్రష్ను తీస్తుండగా విద్యుత్ తీగ తగిలింది. ఆ వైరు తెగి ఉండడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్కుమార్ తెలిపారు. మృతురాలికి కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మహిళా రైతుపై దాడి ● నమిలిగొండలో ఘటన స్టేషన్ఘన్పూర్: ఓ మహిళా రైతుపై దాడి జరి గింది. ఈ ఘటన మండలంలోని నమిలిగొండలో చోటు చేసుకుంది. బాధిత మహిళా రైతు చి క్కుడు యాదమ్మ, ఆమె భర్త పెద్దులు కథనం ప్ర కారం.. నమిలిగొండ శివారులో సర్వే నంబర్ 70/ఏలో యాదమ్మ, పెద్దులు దంపతులకు మూడెకరాల ఒక గుంట వ్యవసాయ భూమి ఉంది. ఇందులో మామిడి తోట ఉంది. ఇటీవల కొందరు గుర్తుతెలియని వ్యక్తులు సదురు భూ మిని ఆక్రమించే ప్రయత్నం చేస్తూ దంపతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం వ్యవసాయభూమిలోకి వెళ్తుండగా అ క్కడ ఉన్న గుర్తు తెలియని మహిళా కూలీలు యాదమ్మపై దాడికి పాల్పడ్డారు. యాదమ్మ, పెద్దులు దంపతులు భూమిలోకి రాకుండా ఐదురుగు మహిళలు, ఐదుగురు పురుషులు అడ్డుకున్నారు. దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కడియం రాజీనామా చేసే వరకు వదలం
● భూ చెర పడుతున్న ఆంధ్రా అల్లుడు, బినామీలు ● గురువులకు పంగనామాలు పెట్టడంలో సిద్ధహస్తుడు ● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిహన్మకొండ: బీఆర్ఎస్ శ్రేణులు శ్రమించి గెలిపించిన కడియం శ్రీహరి రాజీనామా చేసే వరకు వదిలిపెట్టమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గులాబీ జెండామీద, బీఆర్ఎస్ కార్యకర్తల కష్టం మీద గెలిచిన కడియం శ్రీహరికి సిగ్గూ శరం, చీము నెత్తురుంటే వెంటనే రాజీనామా చేసి ఉప ఎన్నికలో గెలిచి మాట్లాడాలని హితవు పలికారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, నాయకులు కేటీఆర్, హరీశ్రావు, తాటికొండ రాజయ్య, తనపై ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడారని, దీనిని కడియం విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ఆంధ్రా అల్లుడు, బినామీలు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో భూములు చెరబట్టారని ధ్వజమెత్తారు. దేవునూర్లో 25 ఎకరాలు బినామీ పేరుతో కొనుగోలు చేసి వ్యవసాయం చేయించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నీతివంతునివైతే హైదరాబాద్లో మూడు భవనాలు, అమెరికాలో మూడు భవనాలు ఎక్కడి నుంచి వచ్చాయని, హనుమకొండలో అంత పెద్ద ఇల్లు ఎలా నిర్మించావని తూర్పారబట్టారు. కడియం కంటే తాను ఒక్క రోజు తన సొంత నియోజకవర్గంలో లేకున్నా రాజీనామా చేస్తానన్నారు. కడియం తన మొదటి గురువు ఎన్టీఆర్, రెండో గురువు చంద్రబాబు, మూడో గురువు కేసీఆర్కు పంగనామాలు పెట్టాడని, కొత్త గురువు రేవంత్ రెడ్డికి కూడా పంగనామాలు పెడతారని పల్లా దుయ్యబట్టారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నాయకులపై కడియం శ్రీహరి నోరు పారేసుకోవడాన్ని ఖండించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, నన్నపునేని నరేందర్ మాట్లాడారు. సమావేశంలో నాయకులు ఇండ్ల నాగేశ్వర్రావు, గున్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, పులి రజనీకాంత్, జోరిక రమేశ్, చింతల యాదగిరి, తదితరులు పాల్గొన్నారు. -
గురుకులాల ద్వారా ఉచితంగా న్యాయవిద్య
కాజీపేటలోని బీసీ గురుకుల ఉమెన్ ‘లా’ కాలేజీ భవనం.. విద్యారణ్యపురి: తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్ల క్రితం వరకు యూనివర్సిటీ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీల్లోనే ‘లా’ చదువుకోవాల్సి వచ్చేది. దీనికి వేలాది రూపాయల ఫీజులు చెల్లించాల్సిందే. ముఖ్యంగా యూనివర్సిటీల కాలేజీల్లో సీట్లకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ప్రైవేట్ లాకాలేజీల్లోనూ అధిక ఫీజులు చెల్లించి చదువుతున్నారు. మేనేజ్మెంట్ కోటాలో సంవత్సరానికి రూ.లక్ష ఫీజు తీసుకునే కాలేజీలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో న్యాయవాద వృత్తిలో స్థిరపడాలనుకునే పేద విద్యార్థినీ, విద్యార్థులకు రాష్ట్రంలోని బీసీ గురుకులాల్లో ఉచితంగా న్యాయ విద్యనందించేందుకు ప్రభుత్వం రెండేళ్ల క్రితమే చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా మహాత్మాజ్యోతిబాపూలే బలహీనవర్గాల విద్యాలయాల సంస్థ ద్వారా ఐదేళ్ల ‘లా’ కోర్సు ఉచితం అందజేస్తోంది. కాగా, కొన్నేళ్ల క్రితమే రాష్ట్రంలో హైదరాబాద్లోని చైతన్యపురిలో సాంఘిక సంక్షేమ గురుకులం బాలికల ‘లా’ కళాశాలగా ఉంది. అలాగే, సంగారెడ్డిలో గిరిజన సంక్షేమ గురుకులం బాలుర ‘లా’ కళాశాలగా ఉంది. బీసీ గురుకులాల ద్వారా.. తెలంగాణ ప్రభుత్వం బీసీ గురుకులాల ద్వారా న్యాయ విద్యనందిస్తుంది. ఇందులో భాగంగా 2023–2024 విద్యాసంవత్సరంలో కాజీపేట సోమిడి రోడ్డులో గురుకుల ‘లా’ ఉమెన్ కళాశాల ఏర్పాటు చేసింది. అలాగే, హైదరాబాద్ మహేశ్వరంలో గురుకుల ‘లా’ మెన్ కాలేజీ నిర్వహిస్తోంది. వీటిల్లో ప్రవేశాలకు టీజీ లాసెట్ ద్వారానే అడ్మిషన్లు కల్పిస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ వర్గాల్లో తక్కువ ఆదాయం కలిగిన పేద కుటుంబాలకు చెందిన ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ ‘లా’ గురుకులాల్లో అడ్మిషన్లు పొందొచ్చు. అనేక సదుపాయాలు.. ఈ గురుకుల ‘లా’ కళాశాలలో విద్యార్థుల అడ్మిషన్ల గరిష్ట వయోపరిమితి 20 ఏళ్లు ఉంది. వివాహితులకు ప్రవేశం లేదు. విద్యార్థినులు అడ్మిషన్లు పొందాక తప్పనిసరిగా హాస్టల్ వసతి పొందాల్సింటుంది. ఉచితంగా హాస్టల్వసతితోపాటు మెస్సదుపాయం ఉంటుంది. ఉచితంగా యూనిఫామ్స్, బుక్స్, నోట్బుక్స్ కూడా అందజేస్తారు. కాజీపేట గురుకుల కళాశాలలో 60 సీట్లు.. ప్రస్తుతం హనుమకొండ జిల్లా కాజీపేట సోమిడిలో ఉన్న గురుకుల ‘లా’ కళాశాలలో విద్యార్థినులకు ఈ విద్యాసంవత్సరం 2025–2026లో మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు 60 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆ కళాశాలలో ఫస్టియర్లో 24 మంది, సెకండియర్లో 30 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ప్రతీ విద్యాసంవత్సరంలో 60 సీట్లు ఉన్నా పూర్తిస్థాయిలో భర్తీకావడం లేదు. న్యాయవిద్యలో స్థిరపడాలనుకునేవారు ఈ గురుకులంలో అడ్మిషన్లు పొందాలని అధికారులు కోరుతున్నారు. హైదరాబాద్లోని మహేశ్వరంలో గురుకుల ‘లా’ మెన్ కళాశాలలో కూడా 60 సీట్లు ఉన్నాయి. ఇప్పటికే టీజీ లాసెట్ నోటిఫికేషన్ తెలంగాణలో వివిధ యూనివర్సిటీల పరిఽధిలోని ‘లా’ కళాశాలల్లో 2025–2026 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకుగాను ఉస్మానియా యూనివర్సిటీ ఇ ప్పటికే టీజీలాసెట్ నోటిఫికేషన్ జారీచేసింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అపరా ధ రుసుములేకుండా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు ఈనెల 15 వతేదీ వరకు గడువు ఉంది. రూ. 5 వందల అపరాధ రుసుముతో ఈనెల 25వరకు, రూ. వెయ్యితో మే 5 వరకు, రూ. 2వేలతో మే 15వరకు, రూ 4వేల అపరాధ రుసుముతోమే 25వతేదీవరకు దరఖాస్తులు చేసుకునేందుకు గడువు ఉంది. కాగా, లాసెట్ జూన్ 6న జరగబోతుంది.ఎవరికెన్ని సీట్లు.. బీసీ గురుకుల ‘లా’ కాలేజీలో ఉన్న 60 సీట్లలో బీసీఏ– 13, బీసీ– బీ 15, బీసీ–సీ 2, బీసీ –డీ 11, బీసీ –ఈ 6, ఈబీసీ 1, ఎస్సీ–9, ఎస్టీ –3 సీట్లు కేటాయిస్తారు. ఈ బీసీ గురుకులంలో మొదటి, రెండో సంవత్సరం కలిపి ప్రస్తుతం 54 మంది విద్యార్థినులు చదువుతున్నారు.లాసెట్ ద్వారానే ఈ విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు ఇవ్వనున్నారు. ఐదేళ్ల ‘లా’ కోర్సు.. టీజీ లాసెట్ ద్వారానే సీట్ల భర్తీ రెండేళ్ల క్రితం కాజీపేటలో ఉమెన్, హైదరాబాద్ మహేశ్వరంలో మెన్ కళాశాలలు ఏర్పాటు.. హాస్టల్ వసతి, మెస్ ఇతర సదుపాయాలునామమాత్రపు ఫీజు ఐదేళ్ల ‘లా’ కోర్సులో ప్రవేశానికి నామమాత్రపు ఫీజు కేవలం రూ. 4వేలు మాత్రమే ఉంది. రూ. 4వేలు కాషన్ డిపాజిట్గా అడ్మిషన్ల సమయంలో చెల్లించాల్సింటుంది. కోర్సు పూర్తిచేశాక విద్యార్థులకు తిరిగి చెల్లిస్తారు.నాణ్యమైన న్యాయ విద్య గురుకుల ‘లా’ ఉమెన్స్ కాలేజీలో నాణ్యమైన న్యాయ విద్యనందిస్తున్నాం. నిరంతర పర్యవేక్షణతోపాటు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యాబోధన చేయిస్తున్నాం. న్యాయవాద వృత్తిలో స్థిరపడాలనే విద్యార్థినులు గురుకుల ‘లా’ కళాశాలలో టీజీసెట్ద్వారా అడ్మిషన్లు పొందాలి. – ఎన్ రవి, ప్రిన్సిపాల్, ఎంజేపీటీబీసీడబ్ల్యూ గురుకుల ‘లా’ ఉమెన్ కాలేజీ, కాజీపేట -
మేడారం, ఏటూరునాగారం మధ్య పులి జాడలు
ఏటూరునాగారం : ములుగు జిల్లా తాడ్వాయి, ఏటూరునాగారం అడవుల మధ్య పులి సంచరిస్తున్నట్లు సమాచారం ఉందని అటవీశాఖ డివిజనల్ అధికారి రమేశ్ శనివారం తెలిపారు. ఏటూరునాగారం నుంచి తాడ్వాయి మండలంలోని మేడారం, బయ్యక్కపేట అడవుల్లో సిబ్బందితో కలిసి పులి జాడ కోసం వెతుకుతున్నామన్నారు. మహాదేవ్పూర్ ప్రాంతం బూడిదపెంట గొత్తికోయగూడెంలో ఓ ఆవును చంపి ఇటువైపు వచ్చినట్లు అక్కడి అటవీశాఖ అధికారుల సమాచారం ఉందన్నారు. ఈ మేరకు అడవులకు దగ్గరలోని ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. ఎవరూ అడవులకు వెళ్లొద్దని సూచించారు. పులి ఆనవాళ్లు, జాడలు కనిపిస్తే వెంటనే అటవీశాఖకు తెలపాలన్నారు. కార్యక్రమంలో అటవీశాఖ రేంజ్ అధికారులు అబ్దుల్ రెహమాన్, అఫ్సరున్నిసా తోపాటు సెక్షన్, బీట్ అధికారులు పాల్గొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎఫ్డీఓ రమేశ్ -
ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్తతో బాలుడి బలి..
● ట్రాలీ మీద పడి దుర్మరణం ● గిర్నితండాలో ఘటన కొడకండ్ల : ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్తతో ఓ బాలుడు బలి అయ్యాడు. ట్రాక్టర్ ట్రాలీ మీద పడి దుర్మరణం చెందాడు. ఈ విషాదకర ఘటన శనివారం తెల్లవారుజామున మండలంలోని గిర్నితండా శివారులోని పెట్రోల్ బంక్ ఎదుట ఉన్న ఇటుకబట్టీల వద్ద చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్సై చింత రాజు కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా వేరుపాలెం మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన పెనుగొండ కృష్ణ కొడకండ్ల మండలం గిర్నితండా పరిధిలోని పెట్రోల్ బంక్ ఎదుట ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నాడు. ఇటుక బట్టీలకు మట్టి సరఫరా చేసే క్రమంలో ట్రాక్టర్ల లెక్కింపు చేపట్టేందుకు మొండ్రాయి గ్రామానికి చెందిన బాలుడు తండా విఘ్నేశ్(17)ను పనికి కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో బోడోనికుంటకు చెందిన భూక్య రవి.. మట్టి ట్రాక్టర్ను అజాగ్రత్తగా నడపడంతో ట్రాలీ పల్టీకొట్టి పక్కన ట్రిప్పుల లెక్క రాస్తున్న విఘ్నేశ్పై పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విగ్నేశ్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. డ్రైవర్గా జీవనం సాగిస్తున్న తండా భాస్కర్కు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు విఘ్నేశ్ ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాశాడు. ట్రాక్టర్ నిర్లక్ష్యంగా నడిపి తన కుమారుడి మృతికి కారణమైన డ్రైవర్తో పాటు మైనర్ అని తెలిసినా పనికి కుదుర్చుకున్న ఇటుక బట్టీ యాజమానిపై చర్యలు తీసుకోవాలనే మృతుడి తండ్రి భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రసాద్ ఆలోచన విధానం ఆదర్శనీయం● కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నవీన్ విద్యారణ్యపురి: న్యాయవాది కేఎస్ఆర్ జి.ప్రసా ద్ ఆలోచన విధానం ఆదర్శనీయమని ప్రముఖ నవలాకారుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవా ర్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ అన్నారు. శనివారం హనుమకొండలోని నవీన్ నివాసంలో మిత్రమండలి, రుద్రమ సాహిత్య సామాజిక అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ‘కేఎస్ఆర్ జి.ప్రసాద్ జీవితం, కృషి, వర్తమానం’ అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హా జరైన ఆయన మాట్లాడుతూ.. ప్రసాద్ విలువలతో కూడిన జీవితాన్ని గడిపారన్నారు. కార్యక్రమంలో రచయిత, విమర్శకుడు మెట్టు రవీందర్, రుద్రమ సాహిత్య సామాజిక అధ్యయన వేదిక అధ్యక్షురాలు అనిశెట్టి రజిత, న్యాయవాది దివంగత కేఎస్ఆర్ జి.ప్రసాద్ కుమారుడు డా క్టర్ సతీశ్చంద్ర, మిత్ర మండలి కన్వీనర్ వీఆర్ విద్యార్థి, తెరసం అధ్యక్షుడు పొట్లపెల్లి శ్రీనివాస్ రావు, రుద్రమ సాహిత్య సామాజిక వేదిక బాధ్యురాలు కొమర్రాజు రామలక్ష్మీప్రసాద్ జీవితాన్ని పరిచయం చేశారు. సాహితీవేత్తలు నాగిళ్ల రామశాస్త్రి, పి.చందు, బిల్ల మహేందర్, చందనాల సుమిత్రాదేవి, డి.శశికిరణ్, తదితరులు పాల్గొన్నారు. -
భూమి ఆక్రమించినట్లు నిరూపిస్తే రాజీనామా
జనగామ రూరల్: దేవునూర్ అటవీ భూమిలో గుంట స్థలం ఆక్రమించినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం జనగామ జిల్లా కేంద్రంలోని ఎన్ఎంఆర్ గార్డెన్లో విలేకరులతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపణలు, విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అంటూ పదేపదే పదవికి రాజీనామా చేయాలనడం సరికాదన్నారు. ప్రస్తుతం ఈ విషయం సుప్రీం కోర్టులో ఉందని, తీర్పునకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 36మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి బీఆర్ఎస్లో చేరిన విషయం రాజేశ్వర్రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టింది నిజం కదా అంటూ.. పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్యకు బీ ఫామ్ ఇచ్చి ఎన్నికల ఖర్చుకు నిధులు ఇచ్చామనడం సరికాదిని, ఇది నిరూపిస్తే తమ పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. నిరూపించకపోతే పల్లా రాజీనామా చేయాలన్నారు. అటవీ శాఖ నోటిఫికేషన్లో లేని 23 మంది రైతులకు చెందిన 43 ఎకరాల పట్టా భూములను రైతులకు చెందాలని అనడం భూమి కబ్జా చేసినట్టా అని ప్రశ్నించారు. దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడాలని హితవు పలికారు. అనంతరం స్టేషన్ఘన్ఫూర్ నియోజకవర్గ లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అదజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, గుడి వంశీధర్రెడ్డి, ప్రవీణ్, కోళ్ల రవి, తదితరులు పాల్గొన్నారు. పట్టా భూములను రైతులకు చెందాలనడం కబ్జా చేసినట్టా? స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
జానకమ్మ సహకారం గొప్పది..
పర్యావరణ పరిరక్షణలో రామయ్య రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు చేశారు. రామయ్యతో పాటు ఆయన సతీమణి జానకమ్మ కూడా ప్రతీ కార్యక్రమానికి హాజరయ్యేవారు. రామయ్య కృషిలో పాలుపంచుకునేవారు. ఆమె సహకారం గొప్పది.. తన పిల్లలతో పాటు మొక్కలను ప్రాణంగా పెంచుకున్నారు. ఎక్కడైనా ఖాళీస్థలం కనిపిస్తే విత్తనాలు చల్లుతూ, మొక్కలు నాటేవారు. రామయ్య మృతి తీరనిలోటు. నిట్లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో మాట్లాడా. ఆ దంపతులను సన్మానించా. – వల్లంపట్ల నాగేశ్వరరావు, వనప్రేమి అవార్డు గ్రహీత, కవి, రచయిత, కళాకారుడు, హనుమకొండ -
నిరుపేదలందరికీ నూతన రేషన్ కార్డులు
● రాష్ట్ర మంత్రి సీతక్క ఎస్ఎస్తాడ్వాయి: రానున్న రోజుల్లో రేషన్ కార్డు లేని నిరుపేదలందరికీ నూతన కార్డులు పంపిణీ చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం మండలంలోని మండలతోగు గూడెంలోని పాఠశాలలో గొత్తికోయలు, విద్యార్థులతో కలిసి మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ టీఎస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవీందర్ సన్నబియ్యంతో భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుపేదలు కడుపునిండా అన్నం తినాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి సన్నం బియ్యం పంపిణీ చేస్తున్నారన్నారు. జిల్లాలో ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున రెండు లక్షల 57 వేల మందికి సన్న బియ్యం అందజేస్తున్నామని వివరించారు. ఆదివాసీ గూడేలు, ఏజెన్సీ గ్రామాల్లో ప్రభుత్వ పథకాలన్నీ అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ తహసీల్దార్ సురేశ్బాబు, ఎంపీడీఓ సుమనవాణి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల ఆశోక్, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్ పాల్గొన్నారు. -
ప్రజలకు ఏం చేశారని రజతోత్సవ సభ
● ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హన్మకొండ చౌరస్తా: పదేళ్లు అధికారంలో ఉండి ప్ర జలను మోసం చేసినందుకా..? ఏం చేశారని రజతో త్సవ సభ పెట్టుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులకు మూడెకరాల భూమి, దళితుడిని సీఎం చేస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని.. ఇలాంటి అనేక హామీలు ఇచ్చి పదేళ్లు ప్రజలను మోసం చేసి, పీడించినందుకా సంబురాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. ఇంతకీ 25 సంవత్సరాల ఉత్సవాలు టీఆర్ఎస్ పార్టీకా, తెలంగాణ పదాన్ని తీసేసిన బీఆర్ఎస్ పార్టీకా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేయడమే బీఆర్ఎస్ ఎజెండా తప్పితే మరో అంశం లేదన్నారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, పీసీసీ సభ్యుడు బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కార్పొరేటర్లు జక్కుల రవీందర్, వేముల శ్రీనివాస్, మామిండ్ల రాజు, మాజీ కార్పొరేటర్ తాడిశెట్టి విద్యాసాగర్, నాయకులు డాక్టర్లు పెరుమాండ్ల రామకృష్ణ, పులి అనిల్, బంక సరళ, బంక సంపత్, నాయిని లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
● ‘జిల్లాలోని ఓ మారుమూల మండలంలో పోస్టింగ్ వచ్చిన ఎంఎల్హెచ్పీ వరంగల్ నుంచి అప్ అండ్ డౌన్ చేసేందుకు అనువైన ప్రదేశం కోసం గతంలో వైద్యారోగ్యశాఖలో పనిచేసిన కొందరు ఉద్యోగులకు రూ.2లక్షల మేరకు ముట్టచెప్పి.. అనుకూల ప్రదేశంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఒకేసారి డిప్యుటేషన్లు రద్దు చేయడంతో సదరు ఎంఎల్హెచ్పీకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. డబ్బులు పాయే...డిప్యూటేషన్ పాయే.. అని సహచర మిత్రుల ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.’ ● ‘మూడో ఏఎన్ఎంగా సొంత ఊరుకు దూరంగా పోస్టింగ్ వచ్చింది. ఇంటికి వెళ్లి రావడం ఇబ్బందిగా మారడంతో సదరు మహిళ వద్ద రూ.50వేలు తీసుకొని అనుకూలమైన పోస్టింగ్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇప్పుడు డిప్యుటేషన్ రద్దు కావడంతో సదరు ఏఎన్ఎంకు ఏం చేయాలో అర్థం కావడం లేదు.’ సాక్షి, మహబూబాబాద్: నూతన జిల్లా ఏర్పాటుతోపాటు, వైద్యారోగ్యశాఖలో చోటు చేసుకున్న పరిణామాలతో పల్లె దవాఖానాలు, హెల్త్ సెంటర్లు వెలిశాయి. ఇందుకు అనుగుణంగా వందలసంఖ్యలో ఎంఎల్హెచ్పీలు, మూడో ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్ల నియామకం జరిగింది. దీనికి తోడు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు. కొన్ని చోట్ల కొత్తగా డాక్టర్లను నియమించారు. అయితే ఆయా నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ కూడా అయింది. అక్రమాలకు పాల్పడిన వైద్యారోగ్యశాఖ అధికారులు, ఉద్యోగులు అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చి అర్హులను విస్మరించినట్లు గత కలెక్టర్ శశాంక గుర్తించారు. దీంతో గతంలో నోటిఫికేషన్ వచ్చిన స్టాఫ్ నర్సుల నియామకం ఇప్పటికీ ముందుకు సాగలేదు. ఇందులో భాగంగానే కొందరు ఉద్యోగులు తమకు అనుకూలమైన ప్రదేశాల్లో పోస్టింగ్లు వేసుకునేందుకు లక్షల రూపాయలు ముడుపులు ఇచ్చినట్లు ప్రచారం. ఇందుకు గతంలో పనిచేసిన కొందరు జిల్లా వైద్యాధికారులు, యూనియన్ లీడర్లు, డీఎంహెచ్ఓకు సన్నిహితంగా ఉండే ఉద్యోగితోపాటు ఇక్కడ పనిచేసి ఇతర జిల్లాలకు బదిలీ అయిన మరికొందరు ఉద్యోగులు డిప్యుటేషన్ల కోసం లక్షల రూపాయలు ముడుపులు తీసుకున్నట్లు ప్రచారం. ఇలా జిల్లా వ్యాప్తంగా 150కి పైగా ఉద్యోగులు డిప్యుటేషన్పై వెళ్లినట్లు ప్రచారం. ఇక్కడ పనిచేసినంత కాలం మిమ్మల్ని కదిలించే వారే ఉండరని హామీ కూడా ఇచ్చినట్లు ఉద్యోగులు తమ సన్నిహితులతో చెబుతున్నారు. గత డీఎంహెచ్ఓ ఉన్నంత వరకు అంతా సవ్యంగా సాగగా.. కొ త్త డీఎంహెచ్ఓ రాగానే కొత్త చిక్కు వచ్చింది. వచ్చీ రాగానే డిప్యూటేషన్ల రద్దు చేయడం, ఈ విషయం కలెక్టర్ వరకు వెళ్లిన సదరు అధికారి కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో... ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. డబ్బులు పాయె. డిప్యుటేషన్ పాయె.. అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యూస్రీల్పైరవీలకోసం పరుగులు.. గత రెండు, మూడు సంవత్సరాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా సాగిన వైద్యారోగ్యశాఖలోని ఉద్యోగుల డిప్యుటేషన్పై ఒక్కసారిగా అధికారులు కొరడా ఝులిపించారు. దీంతో డిప్యుటేషన్పై వెళ్లిన వారిలో కొందరు మధర్ పోస్టింగ్కు వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. అక్కడికి వెళ్తే తమ ప్రైవేట్ ప్రాక్టీస్కు ఇబ్బంది అవుతుందని కొందరు, సొంత ఇంటికి దూరమవుతామని మరికొందరు, అప్ అండ్ డౌన్ చేసేందుకు ఇబ్బంది అవుతుందని ఇంకొందరు సతమతం అవుతున్నారు. తమ డిప్యుటేషన్లు కొనసాగించాలని తమకున్న పరిచయాలతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్లోని అధికారుల ద్వారా, సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, మంత్రి సీతక్క, ఆరోగ్య మంత్రి దామోదర రాజన ర్సింహ, ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ వద్దకు వెళ్లి తమ ఇబ్బందులు చెబుతూ.. డిప్యుటేషన్ కొనసాగించాలని కోరుతున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితిలో సదరు అధికారులు, ప్రజాప్రతినిధులు తమ అనుచరుల కోసం డిప్యుటేషన్ల కొనసాగింపుపై జిల్లా అధికారులపై ఒత్తిడి తెస్తారా.. ఒత్తిడి వస్తే కలెక్టర్, కొత్తగా వచ్చిన డీఎంహెచ్ఓ ఎలా స్పందిస్తారో..అనేది జిల్లాలో చర్చగా మారింది. డిప్యుటేషన్ల రద్దుతో ఉద్యోగుల ఆగమాగం గతంలో చేతులు మారిన లక్షలపై చర్చ కొనసాగింపుపై రాజకీయ ఒత్తిళ్లు ససేమిరా అంటున్న ఉన్నతాధికారులు జిల్లాలో 150 మంది డిప్యుటేషన్ ఉద్యోగులు -
హేమాచలక్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హే మాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివా రం భక్తుల సందడి నెలకొంది. వివిధ సుదూర ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకునేందు కు భక్తులు వందల సంఖ్యలో తరలిరావడంతో ఆల య ప్రాంగణం కిటకిటలాడింది. ఉదయాన్నే భక్తులు ఆలయానికి చేరుకుని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి గుట్టపై స్వ యంభుగా వెలిసిన హేమాచలున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి తిలతైలాభిషేకం పూజలో పాల్గొని నాభిచందన ప్రసాదాన్ని స్వీకరించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయంలోని నిత్యన్నదానంలో పాల్గొని కుటుంబ సభ్యులతో కలిసి భోజనాలు చేశారు. -
గార్ల రైల్వేగేట్ మూసివేత
గార్ల: గార్ల, డోర్నకల్ మధ్య గల రైల్వేగేట్ ఈనెల 18వ తేదీ వరకు మూసి వేస్తున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైల్వేగేట్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కానందున ఈ నెల 18 వరకు మూసివేతను పొడగించామన్నారు. ఈ రహదారి గుండా వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ రహదారిగుండా ప్రయాణిస్తూ రైల్వే సిబ్బందికి సహకరించాలని పేర్కొన్నారు. మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలిమహబూబాబాద్ అర్బన్: నేటి యువత, విద్యార్థులు మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ జగదీశ్వర్ అన్నారు. బహుజన వాకర్స్ అసోసియషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో మహనీయుల జయంతులు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్ఎంఓ జగదీశ్వర్ హాజరై అంబేడ్కర్, సామ్రాట్ అశోక చక్రవరి, జ్యోతిబాపూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో బహుజన మహపురుషుల జయంతులు ఉన్నాయని, వారి మార్గమే బహుజనులకు శిరోధార్యమన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్సీ రాష్ట్ర నాయకుడు దార్ల శివరాజ్, వాకర్స్ మల్లికార్జున్, చందర్, శ్రీనివాస్, నాగరాజు, పవన్, రామకృష్ణ, సుని ల్, కిరణ్ తదితరలు పాల్గొన్నారు. ‘భూములను కాజేసేందుకే వక్ఫ్ చట్టం’మహబూబాబాద్ అర్బన్: వక్ఫ్ చట్టంతో భూ ములను కాజేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని తెలంగాణ ముస్లిం సంఘాల జేఏసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అహ్మద్ఖాన్ అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం ఏ ర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర నాయకులు ముస్లిం వక్ఫ్ బిల్లుతో న్యాయం జరుగుతుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మానుకోటలో ముస్లింలు, హిందువులకు గొడవలు సృష్టించడానికే ఇలాంటి మా ట్లాడారన్నారు. ఈ సమావేశంలో ఎండీ. అ లీం, ఫీరోజ్ఖాన్, యాకూబ్, అన్సార్, జీయాఉద్దీన్,జహీర్ తదితరులు పాల్గొన్నారు. సవాళ్లను అధిగమించాలి.. ● సౌత్ ఆఫ్రికా దర్బన్ వర్సిటీ ప్రొఫెసర్ రవీందర్రేనా కేయూ క్యాంపస్: ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపార నిర్వహణ విద్య అనేక సమస్యల్ని, సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కొంటోందని వాటిని నైపుణ్యాలతో అధిగమించాలని సౌత్ ఆఫ్రికా దర్బన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవీందర్ రేనా అన్నారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలో డైరెక్టర్, పాలక మండలి సభ్యులు బి.సురేశ్లాల్ అధ్యక్షతన నిర్వహించిన విద్యార్థుల స మావేశంలో ఆయన వ్యాపార నిర్వహణ విద్య పై విస్తృతోపన్యాసం చేశారు. మేనేజ్మెంట్ వి ద్యతో బాధ్యతాయుతమైన నాయకులను తయారు చేయడం లక్ష్యమన్నారు. సాంకేతికల ఏకీకరణ, సాఫ్ట్స్కిల్స్పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. సంప్రదాయ మార్కెటింగ్, ఫైనాన్స్ మానవ వనరులకు మించిన క్రియాత్మక రంగాలపై విస్తృత అవగాహన అవసరముందన్నారు.సమావేశంలో అధ్యాపకులు డా క్టర్ వీణ, సుమలత తదితరులు పాల్గొన్నారు. హరితకు కూచిపూడిలో గిన్నిస్ రికార్డ్ హనుమకొండ కల్చ రల్: కూచిపూడి నృత్య ప్రదర్శనలో హనుమకొండ గౌతమ్నగర్ కాలనీకి చెందిన డాక్టర్ గుంటోజు హరిత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో చోటు సాధించారు. భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ప్రపంచ కూచిపూడి నతృ ప్రదర్శనలో ఆమె ప్రతిభ కనబర్చారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 4,218 మంది నృత్య కళాకారులు పాల్గొనగా.. హరిత ప్రదర్శించిన నృత్యానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దక్కింది. హనుమకొండలో హరితా కృష్ణ కూచిపూడి నృత్య కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేసి ఆమె ఎందరో కళాకారులను తీర్చిదిద్దారు. ఈమేరకు శనివారం సాయంత్రం నృత్య శిక్షణ కళాశాలలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన డాక్టర్ హరితకు శిక్షణ పొందిన విద్యార్థులు పుష్పగుచ్ఛాలు అందించి శా లువాతో ఘనంగా సత్కరించారు. -
నకిలీ వైద్యుడిపై కేసు
ఎంజీఎం: వరంగల్ కాశిబుగ్గలోని సుహానా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో వైద్యం చేస్తున్న నకిలీ వైద్యుడు జి.సదానందంపై కేసు నమోదు చేసినట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు శనివారం తెలిపారు. అశాసీ్త్రయ పద్ధతిలో హై డోస్ యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇంజక్షన్లు ఇవ్వడంతో పాటు ఫార్మసీ లైసెన్స్ లేకుండా పెద్ద మొత్తంలో నిల్వ ఉంచినట్లు సభ్యులు గుర్తించారు. ఇంతేజార్ గంజ్ పోలీస్స్టేషన్లో రిజిస్టర్డ్ డాక్టర్ డి.లలయ్యకుమార్, చైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్ఎంసీ చట్టం సెక్షన్ 34, 54, టీఎస్ఎంపీఆర్ చట్టం సెక్షన్ 22 ప్రకారం.. ఈకేసు నమోదు చేశారు. చట్ట ప్రకారం నకిలీ వైద్యుడికి జైలు శిక్ష రూ.5 లక్షలు జరిమానా విధించే అవకాశం ఉందని కౌన్సిల్ సభ్యులు నరేశ్ పేర్కొన్నారు. -
అవసరమైతే బ్లాక్ లిస్టులోకి..
హన్మకొండ: అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణనీటి సరఫరా, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పంచాయతీరాజ్ శాఖ, మిషన్ భగీరథ శాఖలపై శనివారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీతక్క మాట్లాడుతూ పనులు దక్కించుకోవడంలో చూపుతున్న శ్రద్ధ సకాలంలో పూర్తిచేయడంపై కాంట్రాక్టర్లు చూపడం లేదన్నారు. ఇప్పటికీ మొదలుపెట్టని పనులకు తిరిగి టెండర్లు పిలవాలని సూచించారు. ఏళ్లుగా పనులు మొదలుపెట్టని, పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్లిస్టులో పెట్టాలన్నారు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా పనులు పూర్తి పూర్తిచేయించే బాధ్యత ఎస్ఈలదే అని, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి వారికి సూచనలు చేయాలన్నారు. టెండర్లకు సిద్ధంగా ఉన్న రోడ్లకు వారంలోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి సకాలంలో పనులు పూర్తి చేయించాలని చెప్పారు. నిధుల కొరత లేదని, పీఎంజీఎస్వై నిఽధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్లు ఇచ్చిందని వివరించారు. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలని, గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం.. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలని, తాను ప్రతిపాదనలు పంపిన రోడ్లను మంజూరు చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఒక్కరే ఉన్నారని, అప్పుడు మీకు ప్రభుత్వం ఎంతగానో సహకరించిందని, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఒక్కడినే ఉన్నానని, నిష్పక్షపాతంగా నియోజకవర్గ అభివృద్ధికి సహకరించి నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఎంపీ బలరాంనాయక్ కలుగజేసుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేస్తే తాము చెల్లిస్తున్నామన్నారు. దీంతో పల్లా రాజేశ్వర్రెడ్డి ఇక్కడ రాజకీయాలు చేయడం మంచిది కాద ని, రాజకీయాలు బయట చూసుకుందామన్నారు. సమావేశంలో ఎంపీలు కడియం కావ్య, పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి,ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృపాకర్రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.బాల్యవివాహాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలిహన్మకొండ: బాల్య వివాహాల నిర్మూలనకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో మహిళా, శిశు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, కమిషనర్ కాంతి వెస్లీతో కలిసి ఉమ్మడి జిల్లాలోని జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, సీడీపీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాలోని మారుమూల గ్రామమైన రాయినిగూడెంలో పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఇష్టంగా తినే ఆహారంపై దృష్టి పెట్టాలన్నారు. బాల్య వివాహాలు జరుగకుండా చూడడమే అందరి లక్ష్యం కావాలన్నారు. అమ్మమాట – అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని వచ్చే ఏడాది కూడా నిర్వహిస్తామన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క పంచాయతీరాజ్ శాఖ, మిషన్ భగీరథపై హనుమకొండ కలెక్టరేట్లో సమీక్ష అభివృద్ధి పనుల తీరుపై ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల అసంతృప్తి ఏళ్లుగా పెండింగ్లోనే ఉంటున్నాయని అధికారులపై అసహనంకాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడం లేదు.. అభివృద్ధి పనులు జరుగుతున్న తీరుపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినవి ఇప్పటికీ పూర్తి చేయలేదని, తన పదవి కాలంలోపైనా పూర్తి చేస్తారా అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులను ప్రశ్నించారు. తమ నియోజకవర్గాల్లో రోడ్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయని ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరి, రాంచంద్రునాయ క్.. మంత్రి, ఈఎన్సీ కనకరత్నం దృష్టికి తీసుకెళ్లారు. పనులు పూర్తి చేయించడంలో అధికారులు వ్యవహరిస్తున్న వైఖరిపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కురవి: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. శనివారం సీరోలు మండలం రేకులతండా, సీరోలు, కాంపల్లి తదితర గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సీరోలులో జై బాపు..జైభీమ్..జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. రైతులు పండించిన వరిధాన్యానికి గిట్టుబాటు ధర చెల్లించామని, సన్నధాన్యానికి బోనస్ కూడా అందిస్తున్నామన్నారు.పేదల కడుపు నింపేందుకు సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా రు. ఈ కార్యక్రమంలో సీరోలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొండపల్లి కరుణాకర్రెడ్డి, ఎంపీఓ గౌస్, మానుకోట మార్కెట్ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, నాయకులు వి.హర్షవర్థన్రెడ్డి, కాలం రవీందర్రెడ్డి, కొప్పుల వెంకటరెడ్డి, రమేశ్, జెరిపోతుల మహేష్గౌడ్, సత్యం తదితరులు పాల్గొన్నారు. తరుగు పేరుతో గత ప్రభుత్వం దగా మరిపెడ రూరల్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తాలు, తరుగు పేరుతో రైతాంగాన్ని దగా చేసిందని, క్వింటాకు 10కిలోల తరుగు చొప్పున కట్ చేసి లక్షల రూపాయలు దోచుకున్నారని ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ ఆరోపించారు. మండలంలోని వీరారం, తాళ్లఊకల్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు వంటికొమ్ము యుగేందర్రెడ్డి, దిగజర్ల పట్టాబి, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ రాంచంద్రునాయక్ -
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
నెహ్రూసెంటర్: కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, లేబర్కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మే 20న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కులను కాలరాయడమంటే కార్మికులను బానిసలుగా చేయడమేనన్నారు. కార్మిక, ఉద్యోగ, ప్రజాసంఘాలు సమ్మెలో భాగస్వాములు కావాలని కోరారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు అవిశ్రాంత పోరాటాలు కొనసాగించాలన్నారు. కార్మికుల దినోత్సవం మే డే ఉత్సవాలకు కార్మికవర్గం సిద్ధం కావాలన్నారు. ఈ సమావేశంలో కుమ్మరికుంట్ల నాగన్న, కోటేశ్వర్రావు, స్నేహబిందు, ఆండాలు, వెంకన్న, రవి, బాలు, జనార్దన్, హేమా, లక్ష్మణ్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు -
ధాన్యం కొనుగోళ్లు షురూ..
మహబూబాబాద్: జిల్లాలో యాసంగి వరి కోతలు మొదలయ్యాయి. ఈమేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో గంగారం మినహా అన్ని మండలాల్లో 174 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. పలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. జిల్లాలో 2.90లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా వేశారు. రైతుల అవసరాలు పోను 1.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సేకరించనున్నారు. 1,50,000 ఎకరాలలో వరి సాగు.. జిల్లాలో 18 మండలాలు ఉండగా గంగారం మండలంలో వరి సాగు చేయలేదు. మిగిలిన 17 మండలాల్లో 1,50,000 ఎకరాల్లో వరి సాగు చేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. 2.90లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో 1.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తామని డీసీఎస్ఓ అధికారులు అంచనా వేసి దాని ప్రకారం ఏర్పాట్లు చేస్తున్నారు. 174 కేంద్రాలు .. ఐకేపీ ఆధ్వర్యంలో 47, పీఏసీఎస్ 114, జీసీసీ, మెప్మా 13.. మొత్తంగా 174 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా గ్రేడ్ ఏ రకం ధాన్యం క్వింటాకు మద్దతు ధర రూ.2320, కామన్ రకం క్వింటాకు ధర రూ.2300 చెల్లిస్తారు. సన్న ధాన్యం క్వింటాకు అదనంగా రూ.500 బోనస్ ఇస్తున్నారు. ఏఈఓలు టోకెన్ ఇచ్చిన తర్వాతనే.. ఏఈఓలు తేమ శాతాన్ని పరిశీలించిన తర్వాత టోకెన్లు ఇస్తారు. ఆ తర్వాతనే ధాన్యం కొనుగోలు చేస్తారు. రైతులు ఆధార్, పట్టాదారు పాస్పుస్తకం, బ్యాంక్ పాస్పుస్తకం జిరాక్స్ ప్రతులను కేంద్రాల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఆతర్వాత నిర్వాహకులు వివరాలను ట్యాబ్లలో నమోదు చేస్తారు. 5లక్షల గన్నీ బ్యాగులు, 10,000 టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. సాక్షి కథనంపై స్పందన.. ఇటీవల గాలివాన బీభత్సం, వడగండ్ల వర్షం కురిసింది. ఈమేరకు రైతులు వరి పచ్చిగా ఉండగానే ముందస్తు కోతలు చేపట్టారు. కాగా ఈ నెల 9న సాక్షి దినపత్రికలో ‘ముందస్తు కోతలు’.. ‘ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పలు మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈనెల 9న తొర్రూరు మండలం వెలికట్ట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ప్రారంభించగా.. 11న మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో కేంద్రాన్ని ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ ప్రారంభించారు. కాగా కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని సంబంధిత మిల్లులకు తరలిస్తున్నారు. గంగారం మినహా అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు సాక్షి కథనంతో కొనుగోళ్లు ప్రారంభించిన అధికారులు జిల్లాలో 1.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం సన్నధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ -
భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తాం
రామన్నపేట : నగరంలోని వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రూ.28 కోట్ల నిధులతో నిర్మించనున్న నూతన భవన నిర్మాణానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నా యిని రాజేందర్రెడ్డి శుక్రవారం భూమి పూజ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. 70 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 2014 సంవత్సరం తెలంగాణ ఆవిర్భావం నాటికి అత్యంత శిథిలావస్థకు చేరుకుందని, ఈ విషయాన్ని నాటి విద్యార్థి నాయకులు, విద్యార్థులు సాంకేతిక విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఇటీవల పూర్వ విద్యార్థులు, కళాశాల ప్రిన్సిపాల్.. విషయం తెలియజేయడంతో నూతన భవన నిర్మాణానికి నిధుల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయగా సీఎం రేవంత్రెడ్డి స్పందించి రూ.28 కోట్లు విడుదల చేసి అభివృద్ధి పనులు ప్రారంభించాలని సూచించినట్లు తెలిపారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన ప్రభుత్వ ఇంజనీరింగ్ విద్య అందించడమే కాకుండా ప్రభుత్వ జాబ్ క్యాలెండర్, స్వయం ఉపాధి పథకాల ద్వారా వారికి ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగరాజు, ‘కుడా’ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్, రామ్ప్రసాద్, కళాశాల పూర్వ విద్యార్థి సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ.వి శ్రీనివాస్రావు, మేకల అక్షయ్కుమార్, శ్రీవిద్య, కుమ్మరి వేణు, బానోత్ వెంకన్న, రవితేజ, కుమార్, దయాకర్, శ్రీ లేఖ, కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ రామనారాయణ, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణానికి భూమి పూజ -
మండుటెండలో.. మత్తడి
కురవి: ఒక వైపు ఎండలతో జనం అల్లాడిపోతున్నారు.. మరో వైపు కొన్నిచోట్ల నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈక్రమంలో మండలంలోని రాజోలు సమీపంలోని స్టేషన్గుండ్రాతిమడుగు గ్రామ శివారులో మున్నేరువాగుపై ఉన్న చెక్డ్యామ్ మత్తడిపోస్తూ కనువిందు చేస్తోంది. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా వచ్చిన నీటితో మున్నేరువాగు చెక్డ్యామ్ అలుగుపోస్తున్నట్లు పలువురు రైతులు తెలిపా రు. చెక్డ్యామ్ మత్తడిపోస్తుండడంతో అన్నదా తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలుగుపోస్తున్న మున్నేరు వాగు చెక్డ్యామ్ -
మిర్చి కాంటాల్లో జాప్యం
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో మిర్చి కాంటాల్లో జాప్యం జరుగుతుందని ఆరోపిస్తూ ఏఎంసీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు చంద్రయ్య, నరేశ్, భద్రు మాట్లాడుతూ.. మార్కెట్కు గురువారం ఉదయం మిర్చి విక్రయించేందుకు తీసుకువచ్చామని తెలిపా రు. శుక్రవారం ఉదయం మిర్చిని కొనుగోలు చేసిన వ్యాపారులు కాంటాలు పెట్టించడంలో జాప్యం చేశారని ఆరోపించారు. తమకంటే వెనకాల వచ్చి న రైతుల మిర్చి కొనుగోలు జరిపి కాంటాలు పెడుతున్నారని, తమను మాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, కార్యదర్శి షంషీర్ రైతులతో మాట్లాడారు. వెంటనే కాంటాలు పెట్టించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. -
సన్న బియ్యం పథకం దేశానికే ఆదర్శం
కొత్తగూడ: సన్న బియ్యం పంపిణీ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పరిధి గుంజేడులో సన్న బియ్యం పథకాన్ని శుక్రవారం ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. నిరుపేదల కడుపు నింపాలనే లక్ష్యంతో సీఎం రేవంత్రెడ్డి సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యంతో వండిన ఆహారాన్ని చిన్నారులతో కలసి భుజించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన స్టాల్ను సందర్శించారు. చిన్న పాపకు ప్రభుత్వం సరఫరా చేసిన పౌష్టికాహర ఉగ్గును స్వయంగా తినిపించారు. గర్భిణులకు పౌష్టికాహర కిట్లు అందజేశారు. అనంతరం కలెక్టర్ అద్వైత్ కుమార్సింగ్, డీఎఫ్ఓ విశాల్తో కలిసి ముసలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గూర్చి అధికారులతో చర్చించారు. గుంజేడు ముసలమ్మ జాతరను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి సీతక్క హమీ ఇచ్చారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ..కొత్తగూడ, గంగారం మండలాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. 30 పడకల ఆస్పత్రి భవణ నిర్మాణం స్థల కేటాయింపులో జాప్యంపై సమీక్షించిన మంత్రి.. సమస్యలుంటే పరిష్కరించి ఆస్పత్రి నిర్మాణం జరిగేలా చూడాలని కలెక్టర్, డీఎఫ్ఓలకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణవేణి, డీడబ్ల్యూఓ ధనమ్మ, డీఆర్డీఓ మధుసూదన్రాజు, డీఎస్ఓ ప్రేమ్కుమార్, సీడీపీఓ షబానా అజ్మీ, తహసీల్దార్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్, సీ్త్రశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గుంజేడులో సన్న బియ్యం పథకం ప్రారంభం -
వేరుశనగ సాగుపై రైతులకు శిక్షణ
మామునూరు: ఖిలా వరంగల్ మండలం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అధిపతి కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత మిషన్ నేతృత్వంలో శుక్రవారం వేరుశనగ సాగుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కేవీకే సీనియర్ శాస్త్రవేత్త, కోఆర్డినేటర్ డాక్టర్ రాజన్న హాజరై వేరుశనగ సాగుపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి, మాట్లాడారు. రైతులకు టీసీజీఎస్–1694(విశిష్ట) వేరుశనగ సాగు వివరాలను రైతులకు వివరించారు. అనంతరం రైతులకు టీ సీజీఎస్ 1694 రకం వేరు శనగ విత్తనాలు అందజేశారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ సౌమ్య, రాజు, రైతు కోఆర్డినేటర్ రాజిరెడ్డి, హర్షరెడ్డి, సాయిచంద్, రైతులు పాల్గొన్నారు -
సరస్వతీ పుష్కర ఔషధ సేకరణపై సమీక్ష
ఎంజీఎం : కాళేశ్వరంలో మే 12వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 12 రోజుల పాటు జరిగే సరస్వతీ పుష్కరాల వైద్యశిబిరాలకు అవసరమైన ఔషధాల కోసం శుక్రవారం హనుమకొండ సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్లో భూపాలపల్లి డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్ సమీక్ష నిర్వహించారు. ఈ పుష్కరాలకు సుమారు 10లక్షల నుంచి 12 లక్షల వరకు భక్తులు రానున్నట్లు అంచనా వేశారు. కాళేశ్వరంతో తాత్కాలికంగా 30 పడకల ఆస్పత్రితోపాటు మహదేవపూర్లో 30 పడకల సీహెచ్సీ సేవలను వినియోగించుకోనున్నట్లు పేర్కొన్నారు. ఇవేకాకుండా 10 ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. గైనకాలజీ, సర్జరీ, అనస్తీషియా, పిడియాట్రిక్, అర్థోపెడిక్, జనరల్ మెడిసిన్ వంటి ప్రత్యేక వైద్యసేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. అవసరమైన మందులను సమకూర్చేందుకు డీహెచ్ రవీంద్రనాయక్, టీఎస్ఎంఎస్డీసీ రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లి పూర్తిస్థాయి ఔషధాలు అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. సమావేశంలో సీఎంఎస్ ఈఈ ప్రసాద్, ఫార్మసిస్టులు ఉప్పు భాస్కర్, నళిని, సదయ్య పాల్గొన్నారు. -
సైక్లింగ్ రోడ్ పోటీలకు కేయూ జట్టు
కేయూ క్యాంపస్: బికనీర్లోని మహారా గంగాసింగ్ యూనివర్సిటీలో ఈనెల 10 నుంచి నిర్వహించే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ సైక్లింగ్ రోడ్(పురుషుల) పోటీలకు కేయూ జట్టును ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య శుక్రవారం తెలిపారు. జట్టులో ఎన్.రాకేష్(శ్రీఅరుణోదయం డిగ్రీ కాలేజీ హనుమకొండ), ఎండీ.రియాజ్(మాస్టర్జీ డిగ్రీ కాలేటీ హనుమకొండ), జె.సంజీవ్, జి.లోకేష్(వరంగల్ కిట్స్), ఎన్.మహేందర్యాదవ్(యూసీపీఈ కేయూ), కె.బాలమురుగన్ (ఎల్బీ కాలేజీ వరంగల్) ఉన్నారు. వీరికి హనుమకొండలోని జాగృతి డిగ్రీ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ ఎ.రాజేష్ మేనేజర్గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య పేర్కొన్నారు. సెలవు రోజుల్లో ప్రత్యేక టూర్ ప్యాకేజీ హన్మకొండ: పర్యాటక ప్రాంతాల సందర్శనకు సెలవు రోజుల్లో ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చినట్లు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ డిప్యూటీ మేనేజర్(మార్కెటింగ్) టి.శ్రీనివాస్ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండో శనివారం, ఆదివారం, అంబేడ్కర్ జయంతి రోజు సోమవారం వరంగల్, రామప్ప, లక్నవరం ప్రాంతాల పర్యటనకు ప్రత్యేక టూర్ ప్యాకేజీ అమలు చేస్తున్నట్లు వివరించారు. ఉదయం 8 నుంచి రాత్రి 7.30 వరకు పర్యాటక ప్రాంతాల సందర్శన ఉంటుందని పేర్కొన్నారు. ఏసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. చార్జీలు పెద్దలకు రూ.980, పిల్లలకు రూ.790గా నిర్ణయించినట్లు వివరించారు. భోజన చార్జీలు రూ.150, బోటింగ్ చార్జీలు రూ.50 అదనం అని తెలిపారు. పర్యాటకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అందుబాటులోకి టీజీ ఎన్పీడీసీఎల్ యాప్ హన్మకొండ: ఐఫోన్ వినియోగదారులకు టీజీ ఎన్పీడీసీఎల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, వరంగల్ సర్కిల్ ఎస్ఈ కె.గౌతం రెడ్డి తెలిపారు. మరిన్ని సాంకేతిక అంశాలు జోడించి టీజీ ఎన్పీడీసీఎల్ యాప్ను ఆధునీకరించినట్లు వారు వేర్వేరు ప్రకటనలో వెల్లడించారు. ఐఫోన్ యాప్ స్టోర్ నుంచి టీజీ ఎన్పీడీసీఎల్ యాప్ను డౌన్లోడు చేసుకోవచ్చన్నారు. ఈ యాప్లో 20 ఫీచర్లు ఉన్నాయని వివరించారు. రిపోర్ట్ ఆన్ ఇన్సిడెంట్, కనూ్స్య్మర్ గ్రీవెన్సెస్, న్యూ కంప్లైంట్, కంప్లైంట్ స్టేటస్, రీఓపెన్, సెల్ఫ్ రీడింగ్, పే బిల్స్, బిల్ హిస్టరీ, ఆన్ లైన్ పేమెంట్ హిస్టరీ, కొత్త సర్వీస్ స్థితి, లింక్ ఆధార్ – మొబైల్, డొమెస్టిక్ బిల్ క్యాలిక్కులెటర్, కొత్త కనెక్షన్ ఎ లా తీసుకోవాలి, పేరు– లోడ్ మార్పు, పవర్ క ంజమ్సన్ గైడ్లైన్స్, టారిఫ్ డీటెయిల్స్, ఎనర్జీ సేవింగ్ టిప్స్, సేఫ్టీ టిప్స్, ఫీడ్ బ్యాక్, మై అ కౌంట్, వినియోగదారుల బిల్లు సమాచారం, వినియోగదారుల పరిధిలోని అధికారి వివరా లు, కాంటాక్ట్ ఆజ్.. అనే ఫీచర్లు ఈ యాప్లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. వ్యక్తిపై కేసు నమోదు బయ్యారం: వితంతు మహిళపై లైంగికదాడికి యత్నించిన వ్యక్తిపై శుక్రవారం బయ్యారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని పీహెచ్సీ సమీపంలో నివసించే కె.కార్తీక్ గురువారం రాత్రి ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి వెళ్లాడు. ఈ క్రమంలో లైంగికదాడికి యత్నించటంతో మహిళ కేకలు వేయగా కార్తీక్ పరారయ్యాడు. ఈ మేరకు బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మహిళ ఆత్మహత్య బచ్చన్నపేట: మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కట్కూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎనుగుల లక్ష్మి(59)కి ఇటీవల అనారోగ్య సమస్యలతోపాటు మానసికంగా కూడా సరిగా ఉండడంలేదు. ఈక్రమంలో శుక్రవారం కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని వచ్చేలోగా లక్ష్మి ఉరివేసుకుని కన్పించింది. మృతురాలికి భర్త ఎల్లయ్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని ఎస్సై ఎస్కే హమీద్ పరిశీలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
డిమాండ్కు తగ్గట్టుగా ప్రణాళికలు
తొర్రూరు: వేసవిలో డిమాండ్కు తగ్గట్టుగా విద్యుత్ సరఫరాకు ప్రణాళికలు రూపొందించామని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ నరేశ్ తెలిపారు. వేసవి ప్రణాళికలో భాగంగా విద్యుత్శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం డివిజన్ కేంద్రంలోని డీఈ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. డీఈ మధుసూదన్తో కలిసి ఎస్ఈ నరేశ్మాట్లాడుతూ.. ప్రమాదాలకు చెక్ పెట్టే ందుకు ఎల్సీ యాప్ను అందుబాటులోకి తెచ్చామని, దీంతో విద్యుత్ శాఖలోని క్షేత్రస్థాయి సిబ్బంది జాగ్రత్తతో వ్యవహరిస్తారన్నారు. వేసవిలో గృహ, వాణిజ్య, వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. వడ్డేకొత్తపల్లి, డోర్నకల్, పెద్దనాగారం సబ్ స్టేషన్లలో పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు, అయ్యంగారిపల్లి సబ్ స్టేషన్ నుంచి డోర్నకల్, నెల్లికుదురు సబ్ స్టేషన్లకు డబుల్ సర్క్యూట్ లైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. దీంతోపాటు పెద్దనాగారం సబ్ స్టేషన్లో అదనపు వీసీబీ ఏర్పాటు చేస్తామన్నారు. ఏడీఈ చలపతిరావు, అధికారులు పెద్ది రాజం, రాజ్యలక్ష్మి, జయప్రకాశ్, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్ ఎస్ఈ నరేశ్ -
ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
దామెర: ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన హనుకొండ జిల్లా దామెర మండలంలోని తక్కళ్లపహాడ్లో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై అశోక్ తెలిపిక కథనం ప్రకారం.. నగరంలోని 3వ డివిజన్ ఆరెపల్లికి చెందిన సుంకరి వీరేందర్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా శుక్రవారం పనినిమిత్తం తన అత్తగారి ఊరైన ఆగ్రంపహాడ్కు వెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో దామెర మండలంలోని తక్కళ్లపహాడ్ పాఠశాల సమీపానికి రాగానే జాన్డీర్ ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో వాహనంపై ఉన్న వీరేందర్ ఎగిరిపడ్డాడు. అనంతరం ట్రాక్టర్ అతనిపై నుంచి వెళ్లింది. దీంతో తీవ్రగాయాలతో వీరేందర్ అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనా స్థలాన్ని ట్రైయినీ ఎస్పీ మనన్ భట్, ఎస్సై అశోక్ పరిశీలించి, వివరాలు సేకరించారు. వీరేందర్ భార్య సుంకరి అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు. -
పూలేను యువత స్ఫూర్తిగా తీసుకోవాలి
మహబూబాబాద్: బలహీన వర్గాల హక్కుల కోసం, మహిళా విద్యకోసం పోరాడిన మహాత్మా జ్యోతిబా పూలేను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా జ్యోతిబాపూలే జయంతి వేడుకలను అధికారంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంఘసంస్కర్త, సామాజిక తత్వవేత్త, మహిళా అభ్యుదయవాది పూలే నిరంతరం మహిళల విద్యాభివృద్ధికి కృషి చేశారన్నారు. సమాజంలో కుల వివక్ష, అంటరానితనంపై పోరాటం చేసి బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప సంఘసంస్కర్త అని కొనియాడారు. ఆయనను స్మరించుకోవడం ప్రతీ భారతీయుడి బాధ్యత అన్నారు. ఆయన జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి నర్సింహస్వామి, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీఏఓ విజయ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఘనపురపు అంజయ్య, కుల సంఘాల నాయకులు కామ సంజీవ రావు, కిషన్నాయక్, బోడ లక్ష్మణ్, యుగేంధర్, సోమన్న, సాయికుమార్, రాందాస్, శశి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ -
మంటగలిసిన మానవత్వం
వడదెబ్బకు గురైన కన్నతల్లికి అంత్యక్రియలు చేయని కొడుకు..చిట్యాల: కన్న తల్లికి అంత్యక్రియలు నిర్వహించకుండా ఇంటికి తాళం వేసి పారిపోయాడు ఆ కొడు కు.. కుల పెద్దలు దహన సంస్కారాలు నిర్వహించగా.. పెద్ద కూతురు నిప్పు పెట్టిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైన్పాక గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గోనెల మల్లయ్య–రాధమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు స్వరూప, వసంత, కుమారుడు ఓదెలు ఉన్నారు. ముగ్గురికి వివాహం అయింది. కాగా పదే ళ్ల క్రితమే మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందా డు. ఈ క్రమంలో కొడుకు ఒదెలు తల్లి రాధమ్మతో నిత్యం గొడవ పెట్టుకుని ఆమెను బయటకు గెంటేశాడు. దీంతో ఆ మాతృమూర్తి గ్రామంలోనే ఓ అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నది. గురువారం ఉదయం గ్రామస్తులతో కలిసి ఉపాధి హామీ పనికి వెళ్లిన రాధమ్మ అక్కడే అస్వస్థతకు గురైంది. విషయం తెలిసినా ఉపాధి హామీ పని చేస్తున్న కుమారుడు ఓదెలు పట్టించుకోకుండా ఇంటికి వెళ్లిపోయాడు. గ్రామస్తులు చిన్న కుమార్తెకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకుని తల్లిని తీసుకుని భూపాలపల్లి ఆస్పత్రికి వెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి పంపించారు. ఈక్రమంలో శుక్రవారం తెల్లవారుజామున రాధమ్మ మృతి చెందడంతో చిన్న కూతురు ఇంటికి తీసుకువెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న కుమారుడు ఓదెలు అతని భార్య, కుమార్తెను గ్రామంలో వదిలేసి అతని కుమారుడితో కలిసి వెళ్లిపోయాడు. గ్రామస్తులు అతడి ఆచూకి వెతికినా లభించకపోవడంతో స్థానిక ఎస్సై శ్రావణ్కుమార్కు సమాచారం ఇచ్చారు. ఆయన అక్కడికి చేరుకుని మృతిరాలి కుమార్తెలతో మాట్లాడి అంత్యక్రియలకు ఒప్పించారు. అంత్యక్రియలను కులస్తుల సహకారంతో నిర్వహించగా.. పెద్ద కూతురు స్వరూప తల్లికి తలకొరివి పెట్టింది. దహన సంస్కారాలు చేసిన కులస్తులు తలకొరివి పెట్టిన పెద్ద కూతురు -
వడదెబ్బపై అవగాహన కల్పించాలి
దంతాలపల్లి: వేసవికాలంలో ప్రజలకు వడదెబ్బపై అవగాహన కల్పించాలని మలేరియా పీడీ(డిప్యూటీ డీఎంహెచ్ఓ) సుధీర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో మాట్లాడుతూ.. ప్రస్తుత వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉందని, ప్రజలకు సబ్ సెంటర్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు నిల్వ ఉంచాలన్నారు. వడదెబ్బ తలిగిన వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని, ఆస్పత్రిలో తగిన చికిత్స చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం ఆస్పత్రిలోని గదులను, వసతులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో రిజిస్టర్లను పరిశీలించి సిబ్బందికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. వైద్యులు చైతన్య, కవిత, సిబ్బంది పద్మ, చలపతిరావు తదితరులు ఉన్నారు. -
ధ్యానంతో మానసిక ఒత్తిడి దూరం
మామునూరు: ధ్యాన యోగాతో ప్రతిఒక్కరికీ మానసిక ప్రశాంతత లభిస్తుందని పీటీసీ ప్రిన్సిపాల్ ఇంజారపు పూజ అన్నారు. మామునూరు పోలీస్ శిక్షణ కళాశాలలోని ఆడిటోరియంలో ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బందికి శుక్రవారం మానసిక ప్రశాంతతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ప్రిన్సిపాల్ పూజ హాజరై మాట్లాడారు. పోలీస్ ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలని, ఎలాంటి మానసిక వత్తిడి గురికావొ ద్దని సూచించారు. ఉదయాన్నే వాకింగ్, ధ్యానయోగా చేస్తే ఆరోగ్యంతోపాటు మనసుకు ప్రశాంత త, రోజంతా సంతోషం లభిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, భిక్షపతి, ఏఓ కల్పనరెడ్డి, డాక్టర్ సుధీర్, ఆర్ఐలు చంద్రశేఖర్, నవీన్కుమార్, కాశీరామ్, మహేష్, సీఎల్ఐ అశోక్, సుధాకర్, ఏఎల్ఐ దేవేందర్రెడ్డి, దీపక్, సమ్మిరెడ్డి ఆర్ఎస్ఐ రాజేష్, సుధాకర్, దశరథం, అరుణ, అనిల్, సీసీ రామాంజన్రెడ్డి, పీఆర్ ఓ రామాచారి, తహేర్ అలీ, సిబ్బంది పాల్గొన్నారు. పీటీసీ ప్రిన్సిపాల్ ఇంజారపు పూజ -
‘ప్రాజెక్టు వాణి’తో కృత్రిమ మేధస్సు మెరుగు
మహబూబాబాద్ అర్బన్: ప్రాజెక్టు వాణితో కృత్రిమ మేధస్సు మెరుగుపడుతుందని అదనపు డీఆర్డీఏ జయశ్రీ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో శుక్రవారం ప్రాజెక్ట్ వాణిపై గ్రామీణ ఉద్యోగులకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా జయశ్రీ మాట్లాడుతూ.. ప్రాజెక్టు వాణి అనేది ఒక ఆడియో కలెక్షన్ రప్రాజెక్టు అని, దీని నిర్వహణ ఐఏఎస్ఈ బెంగళూరు వారు చేస్తున్నారని, దీనికి గూగుల్ సహకారం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సెక్రటరీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎమర్జింగ్ శాఖ అధికారులు కిరణ్, ఆనంద్, డీసీఎం జిల్లా మేనేజర్ ప్రశాంత్, కోఆర్డినేటర్ గణేశ్ తదితరులు పాల్గొన్నారు. పెంచిన రేట్లు అమలు చేయాలి మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో పనిచేస్తున్న దడవాయిలకు పెంచిన రేట్లను అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ మార్కెట్ కమిటీ దడవాయిల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు సరసాలు సురేందర్ రెడ్డి, అధ్యక్షుడు చింతల ఉప్పలయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ షంషీర్కు శుక్రవారం వారు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. జిల్లా అదనపు కలెక్టర్ సమక్షంలో నిర్ణయం తీసుకున్న మేరకు వ్యవసాయ మార్కెట్లో తమకు కాంటాలు పెట్టే సమయంలో బస్తాకు రూ.6 చొప్పున చెల్లిస్తుండగా కోల్డ్ స్టోరేజీల వద్ద మాత్రం బస్తా కాంటా పెట్టిన సమయంలో రూ.4.50 మాత్రమే చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. పెంచిన ధరలు చెల్లించాలని కోల్డ్ స్టోరేజీ నిర్వాహకులను అడుగుతున్నప్పటికీ వాళ్లు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఈ విషయమై వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, సెక్రటరీ ప్రత్యేక చొరవ చూపి దడవాయిలను ఆదుకోవాలని కోరారు. లేనిపక్షంలో తమకు జరుగుతున్న అన్యాయంపై ఈ నెల 15వ తేదీ అనంతరం నిరసన కార్యక్రమాలు చేపడుతామని వారు పేర్కొన్నారు. పీఆర్టీయూ రాష్ట్ర ఎన్నికల క్రమశిక్షణ చైర్మన్గా బద్రినారాయణ మహబూబాబాద్ అర్బన్: పీఆర్టీయూ రాష్ట్ర ఎన్నికల క్రమశిక్షణ చైర్మన్గా సంకా బద్రినారాయణను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా సంకా బద్రినారాయణ మాట్లాడుతూ.. తనకు రాష్ట్ర ఎన్నికల క్రమశిక్షణ చైర్మన్గా అవకాశం కల్పించిన సంఘం నేత, ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. బద్రినారాయణ నియామకంపై సంఘం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి భూక్య రామోజీనాయక్, కాపరబోయిన సుజాత హర్షం వ్యక్తం చేశారు. నేడు గోదావరి హారతి కాళేశ్వరం: పౌర్ణమి సందర్భంగా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమ గోదావరికి శనివారం(నేడు) సాయంత్రం 5.30గంటలకు హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈఓ మహేష్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భక్తులు హారతి కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన కోరారు. సక్రమంగా పనులు పూర్తి చేయండి కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్లో కొనసాగుతున్న అమృత్ భారత్ అభివృద్ధి పనులు సక్రమంగా పూర్తి చేయాలని సికింద్రాబాద్ డివిజన్ డీఈఎన్ సెంట్రల్ అధికారి ప్రంజల్ కేసర్ వాణి అన్నారు. శుక్రవారం స్థానిక అధికారులతో కలిసి జంక్షన్లో కలియ తిరిగి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పనుల్లో లోపాలు గుర్తించి సక్రమంగా చేయాలని, ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా పనులు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించా రు. అనంతరం జనరల్ వెయింటింగ్ హాల్, బేబీ ఫీడింగ్ గది, టాయిలెట్స్ పనులు పరిశీలించి సలహాలిచ్చారు. అనంతరం రైల్వే స్టేషన్ బ యట అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఈతనిఖీలో కాజీపేట రైల్వే ఏడీఈఎన్ రామకృష్ణంరాజు, ఐఓడబ్ల్యూ విజ య్కుమార్, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ కార్నర్స్
● డీఎంహెచ్ఓ రవి నెహ్రూసెంటర్: వేసవికాలం దృష్ట్యా ప్రతి ఆరోగ్య సెంటర్, పీహెచ్సీల్లో ఓఆర్ఎస్ కార్నర్స్ ఏర్పాటు చేయాలని, అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని డీఎంహెచ్ఓ రవి అన్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, హెల్త్ సూపర్వైజర్స్, డిప్యూటీ డీఎంహెచ్ఓ, సిబ్బందితో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. మెటర్నికల్ చైల్డ్ హెల్త్, అసంక్రమిత వ్యాధులు, వ్యాధి నిరోధక టీకాల పంపిణీ, లెప్రసీ, హెచ్ఐవీ, జాతీయ కార్యక్రమాల నిర్వహణలో ముందుంజలో ఉండాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రమీల, ప్రోగ్రాం అధికారులు నాగేశ్వర్రావు, లక్ష్మీనారాయణ, సారంగం, డీపీఎం నీలోహన, హెల్త్ ఎడ్యుకేటర్స్ కేవీ రాజు, గీత, డీడీఎం సౌమిత్, రాజ్కుమార్, డీపీహెచ్ఎన్ఓ మంగమ్మ, ఎస్యూఓ రామకృష్ణ, బడ్డెబోయిన శ్రీనివాస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
రజతోత్సవ సభను జయప్రదం చేయాలి
నెల్లికుదురు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్నాయక్తో కలిసి కవిత రజతోత్సవ మహాసభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి మహాసభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పరుపాటి వెంకట్రెడ్డి, మాజీ ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, నాయకులు వెంకటేశ్వర్లు, బిక్కు నాయక్, కుమార్, అనిల్, ఆదిరెడ్డి, శ్రీనివాస్, విజయ్ యాదవ్, శ్రీనివాసరెడ్డి, నవీన్రావు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత -
అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే కృషి
హన్మకొండ: అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త జ్యోతిబా పూలే అని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో జ్యోతిబా పూలే జయంతిని నిర్వహించారు. ఈసందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎండీ మాట్లాడుతూ.. కులం పేరుతో తరతరాలుగా అణిచివేతకు గురైన ప్రజలకు ధైర్యం కల్పించిన వ్యక్తి పూలే అని కొనియాడారు. సీ్త్రలు అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుందని, సీ్త్ర విద్య కోసం పోరాడిన గొప్పసంస్కర్త జ్యోతిబా పూలే అన్నారు. 1873 సెప్టెంబర్ 24న సత్యశోధన సమాజాన్ని స్థాపించారని, పూలే కేవలం కులవ్యవస్థ రూపు మాపడమే కాకుండా సామ్రాజ్యవాద వ్యతిరేక, కార్మికవర్గ, రైతాంగ పక్షంగా పోరాడారని వివరించారు. పూలే జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో ఇంచార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సీఈలు కె.తిరుమల్రావు, రాజుచౌహాన్, రవీంద్రనాథ్, బికంసింగ్, వెంకటరమణ, జాయింట్ సెక్రటరి కె.రమేష్, జీఎంలు అన్నపూర్ణ, వేణుబాబు, వాసుదేవ్, నాగ ప్రసాద్, శ్రీనివాస్, మల్లికార్జున్, దేవేందర్, కృష్ణ మోహన్, గిరిధర్, సత్యనారాయణ, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం పాల్గొన్నారు. గొప్పసామాజిక సంఘ సంస్కర్త కేయూ క్యాంపస్: మహాత్మాజ్యోతిబా పూలే గొప్ప సామాజిక సంఘసంస్కర్త అని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రతాప్రెడ్డి అన్నారు. శుక్రవారం పూలే జయంతిని యూనివర్సిటీలోని సెనెట్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్య ద్వారానే అసమానతలు తొలగిపోతాయని విద్యా ప్రాధాన్యతను పూలే ఆనాడే చాటిచెప్పారన్నారు. పూలేను స్ఫూర్తి, ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కాన్సిటిట్యూషన్ రెలవెన్స్ సోషియో ఎకనామిక్ పొలిటికల్ అండ్ ఎడ్యూకేషనల్ ఇంప్లికేషన్ ఆన్ బీసీస్ ఇన్ తెలంగాణ అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సీహెచ్ శ్రీనివాస్ కీలకోపన్యాసం చేశారు. తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు సిరికొండ సంజీవరావు, కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, బీసీ సెల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడారు. పాలకమండలి సభ్యులు ఆచార్య సురేష్లాల్, డాక్టర్ అనితారెడ్డి, మల్లం నవీన్, సుకుమారి, చిర్ర రాజు, పుల్లూరు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. తొలుత కేయూ దూరవిద్యా కేంద్రంలోని పూలే దంపతుల విగ్రహాలకు వీసీ, రిజిస్ట్రార్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బోధన, బోధనేతర సిబ్బంది, పలువురు పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
నకిలీ వైద్యుడిపై కేసు నమోదు
ఎంజీఎం : నగరంలోని జేపీఎన్ రోడ్డులోని డెక్కన్ ఆప్టికల్స్ యజమాని ఎం.జనార్ధన్ కంటి వైద్యుడిగా చలామణి అవుతూ ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు గుర్తించినట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ప్రజాసంబంధాల కమిటీ చైర్మన్ నరేశ్కుమార్ తెలిపారు. ఈ మేరకు నకిలీ వైద్యుడు ఎం.జనార్ధన్పై కౌన్సిల్ రిజిస్ట్రార్ డి.లాలయ్యకుమార్, చైర్మన్ కె.మహేశ్కుమార్ ఫిర్యాదు మేరకు మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసినట్లు నరేశ్ తెలిపారు. ఆప్టోమెట్రిస్టులు, సహాయకులు రెఫ్రాక్షన్ సేవలు (కంటి డిగ్రీలు కొలవడం) మాత్రమే చేయాలన్నారు. కానీ వైద్య సలహాలు ఇవ్వడం, కంటి వ్యాధులకు మందులు సూచించడం లేదా శస్త్ర చికిత్సల పేరుతో మోసం చే యడం చట్టవిరుద్ధమని వివరించారు. ఇలా ఎలాంటి అర్హత లేకుండా వైద్య వృత్తి ప్రాక్టీస్ చేస్తున్న వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ వైద్యుల బా రిన పడితే పోలీసులు లేదా మెడికల్ కౌన్సిల్కుantiquackerytmc@onlinetsnc.in మెయిల్ ద్వారా లేదా 91543 82727 నంబర్కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు. వడదెబ్బతో వ్యక్తి మృతిదామెర: వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా దామెర మండలకేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండలోని పోచమ్మకుంట సగరవీధికి చెందిన వేముల మల్లేశం(46) తాపీ మేసీ్త్ర పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం మండలకేంద్రంలో ఇంటి నిర్మాణ పనుల నిమిత్తం కూలీ పనికి వచ్చాడు. మధ్యాహ్న సమయంలో పనులు చేసుకుంటూ కళ్లు తిరుగుతున్నాయని పక్కకు వెళ్లి కూర్చొని కుప్పకూలాడు. దీంతో స్థానికులు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వెంటనే వచ్చి పరిశీలించగా అప్పటికే మృతి చెందాడని పేర్కొన్నారు. ఈ ఘటనపై మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. వాగులో పడి వృద్ధుడు..శాయంపేట: మండలంలోని తహరాపూర్ గ్రామానికి చెందిన సముద్రాల రాజమొగిలి(85) గురువారం వాగులో పడి మృతి చెందాడు. రాజమొగిలి మతిస్థిమితం కోల్పోయి ఇంటి వద్దే ఉంటున్నాడు. రాజమొగిలికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె. గతంలో అతడి భార్య మృతి చెందగా.. రాజమొగిలి కొడుకుల వద్దే ఉంటున్నాడు. గురువారం ఉదయం ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. ఆయన కుమారులు వెతకగా.. మండలంలోని గట్లకానిపర్తి శివారులోని వాగులో పడి మృతి చెంది ఉన్నాడు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు సముద్రాల గణపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై జక్కుల పరమేశ్ తెలిపారు. -
పశుదాణాకు ప్రత్యామ్నాయం..
మహబూబాబాద్ రూరల్ : అజొల్లా.. ఆకుపచ్చ రంగులో ఉండే ఫెర్న్ జాతికి చెందిన మొక్క. దీనిలో మాంసకృత్తులు, లవణాలు, కెరోటిన్, విటమిన్ బీ2 ఎక్కువ ఉంటాయి. ఇది తక్కువ శాతం లిగ్నిన్ కలిగి సులభంగా జీర్ణమవుతుంది. అజొల్లా వాడకం వల్ల పశుదాణా ఖర్చుల్లో 20 నుంచి 25 శాతం తగ్గించొచ్చు. ● వెన్నశాతం, ఎస్ఎన్ఎఫ్ విలువలు పాలలో పెరుగుతాయి. దీంతో లీటర్ పాలకు రూ.60 పైసల నుంచి రూ. 1.50 వరకు అధిక ఆదాయం పొందొచ్చు. ● అజొల్లాను పాడి పశువులకే కాక గొర్రెలు, కోళ్ల మేతలో కూడా దాణాకు ప్రత్యామ్నాయంగా (బదులు) వాడొచ్చు. ● లూజ్ అజొల్లాను 1:1 నిష్పత్తిలో పశువుల దాణాతో కలిపి వాడొచ్చు. అజొల్లాను ఏ ఇతర పదార్థాలతో కలపకుండా కూడా దాణాగా వాడొచ్చు. అజొల్లా తయారీ విధానం.. ● రోజుకు 4 కిలోల అజొల్లా ఉత్పత్తి చేయడానికి 2.25 x 1.5 మీటర్ల కొలతలతో తొట్టి తయారు చేసుకోవాలి. (2.25 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పు), 9 అంగుళాల లోతు. ● 150 జీసీఎం మందం, 2.5 x 1.8 మీటర్ల సైజ్ గల సిల్ఫాలిన్ (షీట్) తొట్టిలో పరచాలి. ● 10 నుంచి 15 కిలోల సారవంతమైన మట్టిని సమానంగా పాలిథీన్ షీట్పై పరచాలి. తర్వాత 2 నుంచి 5 కిలోల, రెండు రోజుల ఆరిన పేడ 40 గ్రాములు, సూపర్ పాస్పెట్ 10 లీటర్ల నీటిలో కలిపి ఆ మిశ్రమాన్ని గుంతలో పోసి బాగా కలిపి పెట్టాలి. ● తొట్టిలో 7 నుంచి 10 సెంటీ మీటర్ల ఎత్తు వరకు నీరు ఉండేలా చూసుకోవాలి. ●0.5 కిలోల నుంచి 1 కిలో అజొల్లా మదర్ కల్చ ర్ను గుంత అంతా సమానంగా చేయాలి. వేసిన వారం రోజులకు అజొల్లా గుంత అంతా అభివృద్ధి చెందుతుంది. ● కిలో అజొల్లా మదర్ కల్చర్ నుంచి వారం రోజుల్లో 8 నుంచి 10 కిలోల దిగుబడి వస్తుంది. ఏడో రోజు నుంచి అజొల్లాను ప్రతీరోజు వాడుకోవచ్చు. ● వారానికి ఒకసారి కిలో పేడను, 20 గ్రాముల లవ మిశ్రమాన్ని 5 లీటర్ల నీటితో గుజ్జుగా కలిపి తొట్టిలో వేయాలి. ● అజొల్లా పెంచడానికి ప్రత్యేకంగా స్థలం లేనివారు పండ్ల తోటలు, వాటిలో తొట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా షెడ్నెట్ల కింద నిర్మించుకోవచ్చు. ● ఉష్ణోగ్రత 20 నుంచి 28 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉండాలి. సూర్యరశ్మి నేరుగా పడకుండా ఆకులు చెత్త గుంతలో పడకుండా షెడ్నెట్ ఏర్పాటు చేసుకోవాలి. ● తొట్టిలో తేలియాడుతున్న అజొల్లాను ప్లాస్టిక్ జల్లెడతో బయటకు తీయాలి. తొలుత వారం రోజులకు తర్వాత ప్రతీరోజు అజొల్లా సేకరించొచ్చు. తొట్టి నుంచి తీసిన అజొల్లాను మంచి నీటితో కడిగితే పేడ వాసన రాదు. అజొల్లాలో ఉండే పోషకాలు.. అజోల్లా డ్రై వెయిట్ బేసిస్ ప్రకారం 25 నుంచి 30 శాతం మాంసకృత్తులు, 10 నుంచి 15 శాతం మినరల్స్, 7 నుంచి 10 శాతం అమైనా ఆసిడ్స్, బయోమాక్టిల్ పదార్థాలు ఉంటాయి. ఎక్కువ మాంసకృత్తులు, తక్కువ లిగ్నిన్ ఉండడం వల్ల వేగంగా, తేలికగా, తక్కువ ఖర్చుతో పెరుగుతుంది. దీని వల్ల దీనిలోని పోషకాలను పశువులు, కోల్లు, గొర్రెలు తేలికగా జీర్ణం చేసుకుంటాయి. అజొల్లా గురించి మరింత సమాచారం కోసం మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఎన్. కిశోర్కుమార్ సెల్ నంబర్ 99594 66904ను సంప్రదించొచ్చు. వేసవిలో పాడి పశువులకు దాణాగా వాడొచ్చు ఈ మొక్కలో మాంసకృత్తులు, లవణాలు, కెరోటిన్ అధికం -
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి
నెహ్రూసెంటర్: రాష్ట్ర విభజన హామీలను అమలు చేసి బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర నాయకులు జి.నాగయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపుతుందని విమర్శించారు. బయ్యారంలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకు పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ సంస్థలకు కాకుండా, ప్రభుత్వమే పరిశ్రమ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని, రాష్ట్ర విభజనలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, గునిగంటి రాజన్న, ఆకుల రాజు, అల్వాల వీరయ్య, రాజమౌలి, బానోత్ సీతారాంనాయక్, దుడ్డెల రాంమూర్తి, సత్యవతి, గాడిపెల్లి ప్రమీళ, గునిగంటి మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
‘సీతారామ’ రీడిజైన్ అవినీతిపై విచారణ చేపట్టాలి
గార్ల: ఇల్లెందు నియోజకవర్గంలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు రీడిజైన్ అవినీతిపై విచారణ జరిపించాలని కోరుతూ గురువారం గార్లలో ఎమ్మె ల్యే కోరం కనకయ్యకు అఖిలపక్షం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఇల్లెందు, మహబూబా బాద్, డోర్నకల్, పాలేరు నియోజకవర్గాల ప్రజలకు సాగు, తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రాజెక్టు చేపట్టారన్నారు. అయితే ఇల్లెందు, మహబూబాబా ద్, డోర్నకల్ నియోజకవర్గాలను విస్మరించి నాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రాజెక్టు రీడిజైన్ చేశారని అఖిలపక్ష నాయకులు ఎమ్మెల్యేకు వివరించారు. సమస్యను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రాజెక్టు నీళ్లు ఇల్లెందు నియోజకవర్గానికి వచ్చేలా చూడాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో అఖిలపక్ష నాయకులు గంగావత్ లక్ష్మ ణ్నాయక్, జంపాల విశ్వ, సక్రు, కట్టెబోయిన శ్రీనివాస్, పెద్దవెంకటేశ్వర్లు, మురళి తదితరులు పాల్గొన్నారు. -
బిడ్డ ఇంటికి వెళ్తూ మృత్యుఒడికి..
ఖిలా వరంగల్ : కొత్త వాహనానికి రిజిస్ట్రేషన్ పూర్తయింది. అదే వాహనంపై బిడ్డ ఇంటికి వెళ్తూ ఓ వృద్ధుడు మృత్యుఒడికి చేరాడు. రోడ్డు ప్రమాదంలో దర్మరణం చెందాడు. ఈ ఘటన వరంగల్ హంటర్ రోడ్డు ప్లైఓవర్ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సాయిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన పావులూరి వెంకటేశ్వర్లు (60) పర్వతగిరి మండల కేంద్రంలో నివాసముంటూ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల కొత్త బైక్ను కొనుగోలు చేశాడు. గురువారం ఉదయం వాహన రిజిస్ట్రేషన్ కోసం వరంగల్ ఆర్టీఏ కార్యాలయానికి చేరుకున్నాడు. రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే మధ్యాహ్నం హనుమకొండలోని కుమార్తె ఇంటికి బయలుదేరాడు. ఈక్రమంలో వరంగల్ హంటర్ రోడ్డులోని ప్లైఓవర్ వద్ద టిప్పర్ ఎదురుగా బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ విషయం తెలిసిన వెంటనే మిల్స్కాలనీ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని టిప్పర్ను డ్రైవర్ను అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడు వెంకటేశ్వర్లుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా, వెంకటేశ్వర్లు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలియడంతో స్వగ్రామం సాయిరెడ్డిపల్లి, ప్రస్తుతం ఉంటున్న పర్వతగిరి మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుమార్తె బొర్ర కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ వెంకటరత్నం తెలిపారు. బైక్ను ఢీకొన్న టిప్పర్.. వృద్ధుడి దుర్మరణం వరంగల్ హంటర్ రోడ్డు ప్లైఓవర్ వద్ద ఘటన నెక్కొండ మండలం సాయిరెడ్డి పల్లిలో విషాదం -
రేవంత్రెడ్డి పాలనపై ప్రజల్లో అసంతృప్తి
గూడూరు: అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్రెడ్డి ఏడాదిన్నర పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, తిరిగి కేసీఆర్ పాలన కోసం ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చెరువులన్నీ చేపలతో నిండుకొని, పంటలన్నీ పచ్చగా ఉండగా, నేటి కాంగ్రెస్ పాలనలో చెరువులు, బావులు, బోర్లలో నీరు అడుగంటి పంటలు ఎండిపోతున్నాయన్నాని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ రైతులకు కష్టాలు మొదలయ్యాయని వాపోయారు. ఈనెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మండలం నుంచి 10వేల మందిని తరలించేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. అనంతరం సభకు సంబంధించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేం వెంకటక్రిష్ణారెడ్డి, ఎండి ఖాసీం, మోతీలాల్, నూకల సురేందర్, కిషన్నాయక్, కఠార్సింగ్, నర్సింహనాయక్, సంపత్రావు, వెంకన్న, రవి తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ -
దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలి
● మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తొర్రూరు రూరల్: అకాల వర్షాలు, గాలివాన బీభత్సానికి పాడైన, సాగునీరు అందక ఎండిపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని అరిపిరాల గ్రామంలో గాలివాన బీభత్సానికి దెబ్బ తిన్న వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ సర్కారు.. రైతుల సంక్షేమం, అభివృద్ధిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పరిహారం, బోనస్, రైతు బంధు, రుణమాఫీ చేసి ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తూర్పాటి అంజ య్య, మాజీ జెడ్పీటీసీ మంగళపెల్లి శ్రీనివాస్, నాయకులు కుర్ర శ్రీనివాస్గౌడ్, ఎస్కే అంకూస్, కొండ వెంకన్న, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. బస్సు సౌకర్యం కల్పించాలి నెహ్రూసెంటర్: మహబూబాబాద్ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో గురువారం ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు డిపో మేనేజర్ ఎం.శివప్రసాద్ తెలిపారు. మహబూబాబాద్ నుంచి ఇర్సులాపురం మీదుగా ఇల్లెందుకు బస్సు సౌకర్యం కల్పించాలని, మహబూబాబాద్ నుంచి సూర్యాపేటకు వయా కందికొండ, మరిపెడ మీదుగా బస్సు నడపాలని ప్రజలు, ప్రయాణికులు కోరినట్లు ఆయన పేర్కొన్నారు. మానుకోట నుంచి మణుగూరుకు వయా కొత్తగూడెం, పాల్వంచ మీదుగా బస్సులు నడిపించాలని ఫోన్ల ద్వారా కోరినట్లు డీఎం తెలిపారు. ప్రయాణికులు, ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఆర్టీసీ బస్సులు, అదనపు ట్రిప్పుల కోసం ప్రయాణికులు డయల్ యువర్ కార్యక్రమంలో వినతి చేసినట్లు తెలిపారు. తాలు రాకుండా వరి పంట కోయాలి● ఏడీఏ శ్రీనివాసరావు మహబూబాబాద్ రూరల్: వరికొత మిషన్ల యజమానులు వరి పంటలను తాలు రాకుండా కోయాలని వ్యవసాయ సహాయ సంచాలకులు అజ్మీరా శ్రీనివాస్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని వేమునూరు గ్రామంలో యాసంగిలో పండిన వరి పంటను ఏడీఏ శ్రీనివాసరావు గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించి పంట కోతలను పర్యవేక్షించారు. వరి కొత్త మిషన్లతో వరి పంటకోతలు జరుగుతున్న తీరును గమనించి.. రైతులు గింజ గట్టిపడిన తర్వాత వరి పంట కోస్తే తాలు రాకుండా ఉండి లాభం జరుగుతుందని తెలిపారు. ఇందిరానగర్ కాలనీ గ్రామంలో పర్యటించి ఇటీవల కురిసిన వడగండ్ల వాన, గాలి, దుమ్ము వల్ల జరిగిన వరి పంట నష్టాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నారెడ్డి తిరుపతిరెడ్డి, రైతులు పాల్గొన్నారు. ఉపాధి కూలీలకు సౌకర్యాలు కల్పించాలితొర్రూరు రూరల్: గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఉపాధి కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని డీఆర్డీఓ మధుసూదన్రాజ్ సూచించారు. గురువారం మండలంలోని మడిపెల్లి గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ మాట్లాడుతూ.. ప్రతి కూలీకి కనీస వేతనం రూ.307 చెల్లించే విధంగా పనులు చేయించాలన్నారు. ఉదయం 6నుంచి 11గంటల వరకే పనులు చేయించాలని, పని ప్రదేశాల్లో తాగునీరు, టెంట్, మెడికల్ కిట్ వంటి వసతులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఈజీఎస్ అధికారులు మధు, కృష్ణ, సుధాకర్, సతీష్ పాల్గొన్నారు. -
డిప్యుటేషన్ల లొల్లి
సాక్షి, మహబూబాబాద్: ఎంత మంది అధికారులు వచ్చినా.. ఎవరు మారినా.. జిల్లా వైద్యారోగ్యశాఖలోని అధికారులు, ఉద్యోగుల్లో మాత్రం మార్పురావడం లేదు. ఉద్యోగ నియామకాలు, బదిలీలు, పదోన్నతులతో వెళ్లిన చోట పనిచేయకుండా కొందరు ఉద్యోగులు పైరవీలతో డిప్యుటేషన్లపై వేరేచో టుకు వెళ్లడం పరిపాటిగా మారింది. అయితే ప్రస్తు తం ఎక్కడి వారు అక్కడే పనిచేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఉత్తర్వులు జారీ చేయడంతో తమకు అనుకూలమైన ప్రాంతాలకు వెళ్లిన వారు.. తప్పని పరిస్థితుల్లో మదర్ పోస్టింగ్ స్థానానికి వెళ్లాల్సి వస్తోంది. కాగా ఇన్నిరోజులు ఉన్నతాధికారులకు తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా డిప్యుటేషన్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అంతా గందరగోళం కొత్తగా వచ్చిన డీఎంహెచ్ఓ రవి జిల్లా వైద్యారోగ్యశాఖలోని ఉద్యోగులు ఎవరెవరూ ఎక్కడ పనిచేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయగా.. అంతా గందరగోళంగా ఉన్నట్లు స్పష్టమైంది. మదర్ పో స్టింగ్ ఎక్కడ అనే విషయంపై డిప్యుటేషన్లపై వచ్చి న వారు నోరు మెదపలేదని తెలిసింది. అయితే జి ల్లాలోని 21ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఒక బస్తీ దవాఖాన, అర్బన్ పీహెచ్సీల్లో ఎవరెవరూ పనిచేస్తున్నారనే వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఇందుకోసం డాక్టర్ల నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వర కు వారివారి మదర్ పీహెచ్సీల్లో చేరాలని, అలా అయితేనే వచ్చే నెల వేతనాలు చేస్తామని హెచ్చరించినట్లు తెలిసింది. ఇందుకోసం వారం రోజుల గడు వు ఇచ్చి ఈలోపు అంతా పూర్తి కావాలని చెప్పినట్లు సమాచారం. దీంతో ఇప్పటి వరకు వెళ్లిందే ఉద్యో గం చేసిందే పని అన్నట్లుగా ఉన్న కొందరు అధికా రులు, సిబ్బంది మారుమూల ప్రాంతాల్లోని తమ మదర్ పోస్టింగ్కు వెళ్ల్లాల్సి వస్తోంది. మరికొందరు డిప్యుటేషన్ కొనసాగించాలని అధికారులు, ప్రజా ప్రతినిధులతో పైరవీలు కూడా చేస్తున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితిలో కొత్తగా వచ్చిన డీఎంహెచ్ఓ డిప్యుటేషన్లు రద్దు చేస్తారా.. లేదా ఒత్తిడికి తలొగ్గి కొనసాగిస్తారా.. అలా చేస్తే జిల్లా ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారనేది జిల్లాలో చర్చగా మారింది.ఆరోగ్యశాఖలో డిప్యుటేషన్లపై కలెక్టర్ ఆగ్రహం కొత్తగా ఎవరిని కదిలించొద్దని ఆదేశం పాత డిప్యుటేషన్లు రద్దు చేయాలని సూచన నూతన డీఎంహెచ్ఓకు తలనొప్పిగా మారిన వ్యవహారం ఇష్టారాజ్యంగా.. గతంలో పనిచేసిన అధి కారులు, కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి కీలక పాత్ర పోషించి డిప్యుటేషన్లు వేసినట్లు విమర్శలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, సూపర్వైజర్లు, ఎంఎల్హెచ్పీలు, మూడు రకాల ఏఎన్ఎంలు, హెల్త్ ఎడ్యుకేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, హెల్త్ సూపర్వైజర్లు మొత్తం 150మందికి పైగా ఉన్నట్లు సమాచారం. డిప్యుటేషన్ వేసినందుకు ఆశాఖలోని అధికారులకు ముడుపులు అప్పగించినట్లు జిల్లాలో చర్చ జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న జిల్లా అధికారి డిప్యుటేషన్లు రద్దు చేయాలని అదేశించారు. కాగా జిల్లా అధికారి ముందు తల ఊపిని వైద్యారోగ్యశాఖ అధికారులు కొందరి డిప్యుటేషన్లు రద్దు చేసి.. వారికి అనుకూలంగా ఉన్న వారిని అలాగే ఉంచినట్లు సమాచారం. తర్వాత మరికొందరు డిప్యుటేషన్లపై అనుకూల ప్రదేశాలకు వెళ్లేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారిని సంప్రదించినట్లు తెలిసింది. అయితే గతంలో డిప్యుటేషన్ రద్దు చేసిన వారితో పాటు, కొత్తవారితో కూడిన జాబితాను తయారు చేసి.. అప్రూవల్ కోసం కలెక్టర్కు పంపినట్లు తెలిసింది. ఈ విషయం ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ కొత్త వారికి డిప్యుటేషన్లు ఇవ్వకపోగా.. ఇప్పటి వరకు డిప్యుటేషన్లపై పని చేస్తున్న వారి ఆర్డర్లు కూడా రద్దు చేయాలని ఆదేశించారు. డిప్యుటేషన్లు రద్దు చేస్తాం .. జిల్లా వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల డిప్యుటేషన్ అంతా గందరగోళంగా ఉంది. దీనిని సరి చేసేందుకు ముందుగా పీహెచ్సీల్లో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, సూపర్వైజర్లు, ఇతర ఉద్యోగులు ఎంత మంది ఉన్నారో తెలవడం లేదు. ఇందుకోసం ఉద్యోగుల వారీగా సమావేశాలు పెట్టి డిప్యుటేషన్లపై వెళ్లినవారు వారి సొంత పోస్టింగ్కు వెళ్లాలని చెప్పాం. వారం రోజుల్లో ప్రక్రియ పూర్తి అవుతుంది. అప్పుడు ఉద్యోగులపై ఒక అంచనా వస్తుంది. – రవి, డీఎంహెచ్ఓ, మహబూబాబాద్ -
డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు జరిగేనా?
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీ వోకేషనల్ తదితర కోర్సుల 2,4,6 సెమిస్టర్ల పరీక్షలు ఈనెల 21 నుంచి నిర్వహించాలని పరీక్షల విభాగం అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే ఆయా పరీక్షలు నిర్వహణకు ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు సిద్ధంగా లేవు. మూడేళ్లు నుంచి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడం లేదని, అందుకే తాము ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆ యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలు నిర్వహించబోమని కొద్దిరోజుల క్రితమే సంఘం బాధ్యులు యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పరీక్షల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఫలితంగా వేలాది మంది విద్యార్థులు పరీక్షలు జరుగుతాయా లేదా అనే అంశంపై ఆందోళన చెందుతున్నారు. 5న ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ సమావేశం ఈనెల 5న ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు సమావేశం నిర్వహించుకున్నాయి. ఇందులో పలు తీర్మానాలు చేసుకున్నాయని సమాచారం. విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజులు వసూలు చేసి అలాగే ఉంచుకోవాలని, యూనివర్సిటీకి ఎప్పుడు చెల్లించాలని నిర్ణయిస్తే అప్పుడు వెంటనే చెల్లించాలని, ఫీజు చెల్లించిన విద్యార్థుల వివరాలను నామినల్ రోల్స్(ఎన్ఆర్)లో ఎంటర్ చేయాలని నిర్ణయించాయి. 1, 3, 5వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లించేందుకు.. కేయూ పరిధిలో గతేడాది డిసెంబర్లో నిర్వహించిన డిగ్రీ కోర్సుల మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ల పరీక్షల ఫలితాలు గత నెల 4న విడుదలైన విషయం విధితమే. అప్పట్లో యూనివర్సిటీ అకడమిక్ డీన్ విభాగానికి చెల్లించాల్సిన వివిధ రకాల ఫీజులు చెల్లించని కాలేజీల ఫలితాలు నిలిపిన విషయం విధితమే. ఆ తర్వాత ఎక్కువ శాతం కళాశాలలు చెల్లించినా ఆయా ఫీజులు 40కిపైగా కాలేజీలు చెల్లించలేదు. అయినా అన్ని కళాశాలల విద్యార్థుల ఫలితాలను చివరికి అధికారులు విడుదల చేశారు. నాలుగైదు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు ఫీజులు చెల్లించకపోయినా పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేశారు. అయితే ఆ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తక్కువ ఉండడంతో మళ్లీ ఆయా పరీక్షలు నిర్వహించేందుకు, బ్యాక్లాగ్ సబ్జెక్టులు రాసుకునేందుకు అవకాశం ఇచ్చారు. పరీక్షల ఫీజు చెల్లించేందుకు గడువు ఇచ్చారు. అపరాధ రసుములేకుండా ఈనెల 11తో ముగియబోతుంది. ఆ పరీక్ష ఫీజులు కూడా విద్యార్థుల నుంచి ప్రైవేట్ యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. ఈ ఫీజులు కూడా యూనివర్సిటీ పరీక్షల విభాగానికి చెల్లిస్తే డిగ్రీ 2,4,6 సెమిస్టర్లతోపాటే 1,3,5 సెమిస్టర్ల పరీక్షలు కూడా నిర్వహించాలనే యోచనలో పరీక్షల విభాగం అధికారులున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తేనే పరీక్షలు నిర్వహిస్తాం ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యాల స్పష్టీకరణ పరీక్షలకు ఫీజు రీయింబర్స్మెంట్ ముడిపెట్టొద్దు : రిజిస్ట్రార్ విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు వసులు చేసినా యూనివర్సిటీకి చెల్లించని ప్రైవేట్ యాజమాన్యాలు పరీక్షల ఫీజు చెల్లించాలి కేయూ పరిధిలో డిగ్రీ కోర్సుల 2,4,6 సెమిస్టర్ల పరీక్షలు నిర్వహించేందుకు ఆ విభాగం సిద్ధంగా ఉంది. ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులు యూనివర్సిటీ పరీక్షల విభాగానికి చెల్లించాల్సింటుంది. ఇంకా చెల్లించడం లేదు. ఫీజులు చెల్లించిన కాలేజీల విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తాం. ఎందుకంటే ఫైనలియర్ విద్యార్థులకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి. పరీక్ష నిర్వహణ ఫీజురీయింబర్స్మెంట్కు ముడిపెట్టొద్దు. –ఆచార్య రామచంద్రం, రిజిస్ట్రార్, కేయూ 73 కళాశాలల వరకే పరీక్ష ఫీజులు చెల్లింపులు.. కేయూ పరిధిలో 292 వరకు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, గురుకులాలు, అటానమస్ డిగ్రీ కళాశాలలున్నాయి. ఈ నేపథ్యంలో డిగ్రీ కోర్సుల 2,4,6 సెమిస్టర్ల పరీక్షల ఫీజులు చెల్లించేందుకు అధికారులు ఇప్పటికే రెండు సార్లు గడువు పొడిగించారు. అపరాధ రుసుము లేకుండా ఈనెల 9వతేదీతో గడువు ముగిసింది. అయితే ఇప్పటి వరకు అన్ని యాజమాన్యాలు కలిపి కేవలం 73 కళాశాలల వరకే యూనివర్సిటీలోని పరీక్షల విభాగానికి ఫీజులు చెల్లించాయని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఎక్కువ శాతం ప్రైవేట్ డిగ్రీ కళాశాలల విద్యార్థుల నుంచి పరీక్షల ఫీజులు వసూలు చేశారు. కానీ ఆ యాజమాన్యాలు గురువారం వరకు యూనివర్సిటీకి చెల్లించలేదు. తమకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసే వరకూ ఈ విద్యార్థుల పరీక్షల ఫీజు లు యూనివర్సిటీకి చెల్లించొద్దని, పరీక్షలను కూడా నిర్వహించబోమని నిర్ణయంచుకున్నా యి. దీంతో వేలాది మంది విద్యార్థులు రాసే పరీక్షల నిర్వహణపై ప్రతిష్టంభన ఏర్పడింది. -
తెలంగాణ వ్యతిరేకి సీఎం రేవంత్రెడ్డి
ఎల్కతుర్తి: తెలంగాణ వ్యతిరేకి సీఎం రేవంత్రెడ్డి.. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నడూ కొట్లాడిందిలేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి సమీపాన ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభాస్థలిని ఆయన గురువారం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వినయ్భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, వొడితెల సతీష్కుమార్, ఎమ్మెల్సీ ఎల్.రమణ తో కలిసి పరిశీలించారు. అనంతరం ఎర్రబెల్లి మా ట్లాడుతూ సుమారు 1,200 ఎకరాల స్థలంలో సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు నాలుగు వైపులా రూట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సంవత్సరంన్నర కాంగ్రెస్ పరిపాలన అట్టర్ప్లాప్ అయిందని, ఆ పార్టీని గెలిపించి మోసపోయామని ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు. నీళ్లు లేవు.. పెట్టుబడిలేదు.. కరెంటు లేదు.. కల్యాణలక్ష్మి లేదు.. కేసీఆర్ కిట్టు లేదు.. తండాలకు రో డ్లు లేవన్న విషయాన్ని ప్రజలు రివ్యూ చేసుకుంటున్నారని తెలిపారు. నీళ్లు లేక పలు ప్రాంతాల్లో పంటలు ఎండిపోతుండడంతో రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. యావత్ తెలంగాణ ప్రజలు కేసీఆర్ను చూడాలే.. ఆయనకు ధైర్యం చెప్పాలన్న కుతుహలంతో ఎదురుచూస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో పా ర్టీ శ్రేణులు నాగుర్ల వెంకన్న, సదానందం, పిట్టల మహేందర్, మాజీ ఎంపీటీసీ కడారి రాజు, తంగెడ మహేందర్, జూపాక జడ్సన్ పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎల్కతుర్తిలో రజతోత్సవ సభాస్థలి పరిశీలిన -
‘రాజ్యాంగం’ ఆడియో సీడీ ఆవిష్కరణ
విద్యారణ్యపురి: కవి, ప్రజా కళాకారుడు, జాతీయ ఉపాధ్యాయ ఉత్తమ అవార్డు గ్రహీత డాక్టర్ వల్లంపట్ల నాగేశ్వర్రావు రచించి స్వరపరిచిన ‘మన భారత రాజ్యాంగం’ ఆడియో సీడీని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య ఆవిష్కరించారు. గురువారం హనుమకొండలోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్యనవీన్, డాక్టర్ వల్లంపట్ల నాగేశ్వర్రావు, వీఆర్విద్యార్థి, పి.కృష్ణమాచారి, ప్రొఫెసర్ రతన్సింగ్ఠాకూర్, డోలి రాజలింగం, బండా కాళిదాస్, మండల పరశురాములు, సామాజిక కార్యకర్త నల్లమూరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం
కురవి: రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. గురువారం సీరోలు మండలం ఉప్పరిగూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. పేదలందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. రైతులు అధైర్యపడొ ద్దని, రైతు భరోసా ఇచ్చామని, రుణమాఫీ పూర్తిగా చేస్తామన్నారు. ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాపాడుకుంటుందన్నారు. అలాగే కురవి మండలం మొగిలిచర్లలో పల్లె దవాఖానను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ రవిరాథోడ్, మానుకోట మార్కెట్ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొండపల్లి కరుణాకర్రెడ్డి, తహసీల్దార్ శారద, ఏఓ చాయారాజ్, కాలం రవీందర్రెడ్డి, రమేశ్, శంకర్నాయక్, ఎం.సురేష్, నూకల వేణుగోపాల్రెడ్డి పాల్గొన్నారు. మహిళాభివృద్ధికి పెద్దపీట.. డోర్నకల్: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళాభివృద్ధికి పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ తెలిపారు. మండలంలోని మన్నెగూడెం, వెన్నారం గ్రామాల్లో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఉయ్యాలవాడ గ్రామంలోని పలు వీధుల్లో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. డోర్నకల్లో శాంతినగర్, బైపాస్ రోడ్డు, చర్చికాంపౌండ్లో నూతనంగా నిర్మించిన సబ్సెంటర్ భవనాలను ప్రారంభించారు.అనంతరం బిషప్ అజరయ్య ఫంక్షన్హాల్లో జరిగిన కార్యక్రమంలో 36 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, రూ.1.26 కోట్ల వడ్డీలేని రుణాలకు సంబంధించిన చెక్కును మహిళా సంఘాలకు పంపణీ చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ రవిరాథోడ్, తహసీల్దార్ కృష్ణవేణి, ఎంపీడీఓ శ్రీ నివాసనాయక్, మున్సిపల్ చైర్మన్ ఉదయ్కుమార్, ఐకేపీ ఏపీఎం శంకర్నాయక్, సీఈఓ సతీష్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సుధాకర్నాయక్, మండల వైద్యాధికారి సాధ్విజ పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం -
సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులు..కాజీపేట: ఆర్థిక ఇబ్బందులతో ఓ సింగరేణి ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం రాత్రి కాజీపేట 63వ డివిజన్ బాపూజీనగర్ కాలనీలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కాజీపేట భవానీనగర్కు చెందిన ఊరడి సంజయ్ కుమార్(26) సింగరేణి ఉద్యోగిగా విధులు నిర్వర్తిన్నాడు. ఈ క్రమంలో ఇటీవల రూ. 76 లక్షలతో ఇదే కాలనీలో నూతన ఇంటిని కొనుగోలు చేశాడు. ఇంటి రిజిస్ట్రేషన్ తదితర ఖర్చులు అధికం కావడంతో అప్పులు పెరిగాయి. అప్పులు, వడ్డీలు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురైన సంజయ్కుమార్..బాపూజీనగర్లోని అమ్మమ్మ ఇంటికి వచ్చి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై మృతుడి తల్లి సుభద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్కుమార్ తెలిపారు. వడ్డేపల్లి చెరువులో పడి నిట్ విద్యార్థి.. కాజీపేట: కాజీపేట 61వ డివిజన్ వడ్డేపల్లి చెరువులో నిట్ వరంగల్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ సుధాకర్ రెడ్డి కథనం ప్రకారం.. హైదరాబాద్కు చెందిన రుత్విక్ సాయి(23) నిట్ వరంగల్లో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం సాయంత్రం ఆ యువకుడి మృతదేహం చెరువులో తేలియాడుతున్నట్లు స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీసి ఎంజీఎం మార్చురీకి తరలించారు. కాగా, రిత్విక్సాయి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని సీఐ తెలిపారు. -
రైతు ఇంట్లో కలెక్టర్ భోజనం
మహబూబాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. ఈమేరకు గురువారం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో మహబూబాబాద్ మండలంలోని జరుపులతండా గ్రామ పంచాయతీ పరిధి చీకటిచింతల తండాలో రైతు బానోతు గోవింద్ ఇంట్లో సన్నబియ్యంతో వండిన భోజనం తిన్నారు. గోవింద్ కుటుంబ సభ్యులను బియ్యం పంపిణీ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. వారివెంట జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి ప్రేమ్ కుమార్, తహసీల్దార్ భగవాన్ రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు సన్నబియ్యం.. నెల్లికుదురు: లబ్ధిదారులందరికీ సన్నబియ్యం అందించాలని, దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే డీలర్పై చర్యలు తప్పవని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో రేషన్ షాపును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే ఎంపీడీఓ కార్యాలయంలో జరుగుతున్న రాజీవ్ యువవికాసం దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను పరిశీలించారు. పీహెచ్సీని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. నెల్లికుదురు, మునిగలవీడు గ్రామాల పరిధిలో ఐకేపీ, సొసైటీల ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో అధికారులు ప్రేమ్కుమార్, కె.రాజు, ఎంపీడీఓ బాలరాజుల, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
పిడుగు పాటుకు పశువుల మృత్యువాత
బచ్చన్నపేట : పిడుగుపాటుకు మూడు పశువులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన మండలంలోని కట్కూర్లో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మర్రికింది ఎల్లయ్య బుధవారం రాత్రి తన వ్యవసాయ బావి వద్ద రెండు ఎడ్లు, ఓ పాడి గేదెను కట్టేసి ఇంటికి వచ్చాడు. గురువారం ఉదయం ఈదురుగాలులతో పాటు పిడుగులు పడ్డాయి. దీంతో వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూడగా మూడు పశువులు మృత్యువాత పడి కనిపించగా బోరున విలపించాడు. ఈ ఘటనలో దాదాపు రూ. 2 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. కాగా, బాధిత రైతు ఎల్లయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. -
కేయూ బంద్ విజయవంతం
కేయూ క్యాంపస్: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లోని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్చేసి 21జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నత విద్యామండలి ముట్టడికి పిలుపునివ్వగా కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విధితమే. దీనికి నిరసనగా గురువారం కేయూలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేపట్టిన బంద్ విజయవంతమైంది. క్యాంపస్లోని ప్రిన్సిపాల్ కార్యాలయం, పరీక్షల విభాగం, ఆడిట్, యూజీసీ తదితర కీలక విభాగాలన్నింటినీ బంద్ చేయించారు. అలాగే, యూనివర్సిటీ పరిధిలోని పలు కాలేజీలను కూడా బంద్ చేయించారు. అనంతరం క్యాంపస్లోని పరిపాలనాభనం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల కోఆర్డినేషన్ కమిటీ బాధ్యులు పి. కరుణాకార్రావు, సాధురాజేశ్, శ్రీధర్కుమార్లోథ్, బి.సతీశ్, మాదాసి కనకయ్య మాట్లాడుతూ కొన్నేళ్లుగా కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నవారిని రెగ్యులరైజ్చేయాలన్నారు. తమకు ఉద్యోగభద్రత కల్పించాకే కొత్తగా అధ్యాపక పోస్టులను భర్తీచేయాలని డిమాండ్ చేశారు. కాగా, రిజిస్ట్రార్ రామచంద్రం మాట్లాడుతూ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆశీర్వాదం, సంకినేని వెంకట్, భిక్షపతి, రవీందర్, గడ్డం కృష్ణ, జూలసత్య, నాగయ్య, సూర్యనారాయణ, కవిత, శ్రీదేవి, స్వప్న, వీణ, సునీత, ఆర్డీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ అరెస్ట్లను నిరసిస్తూ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల ధర్నా -
స్లాట్ బుకింగ్ ఉంటేనే రిజిస్ట్రేషన్ !
మహబూబాబాద్: రాష్ట్ర ప్రభుత్వం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో కీలక సంస్కరణలు చేస్తోంది. దీనిలో భాగంగా స్లాట్ బుకింగ్ ద్వారానే రిజిస్ట్రేషన్లు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈమేరకు పైలట్ ప్రాజెక్ట్ కింద గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభించింది. త్వరలోనే అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అమలు చేయనున్నారు. ప్రస్తుతం కూడా స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఉన్నప్పటికీ చాలా మంది మాన్యువల్గా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. కాగా గత ఆర్థిక సంవత్సం మార్చి నెలలో మానుకోట రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్లతో పాటు మార్టిగేజ్ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగాయని కార్యాలయ సిబ్బంది తెలిపారు. జిల్లాలో 27,610 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు.. జిల్లాలోని మానుకోట, తొర్రూరు, డోర్నకల్, మరి పెడ మున్సిపాలిటీల్లో మొత్త 27,610 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు రాగా..వాటిలో 18,467 ఆమోదించా రు. ఇందులో 4,749 దరఖాస్తులకు మాత్రమే ఫీజు చెల్లించారు. 2022 ఆగస్టు 26లోపు లేఅవుట్ లేని ప్లాట్లు కొనుగోలు చేసిన వారి కోసం ఎల్ఆర్ఎస్ను ప్రవేశపెట్టారు. కాగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించడానికి మార్చి 31వరకు ఇచ్చిన గడువును ఈ నెల 30 వరకు పొడిగించారు. ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులు గత నెల 12నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. కాస్త ఊరట.. ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన నాటి నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సందడి నెలకొంది. రియల్ ఎస్టేట్ రంగంలో కొంత ఊపువచ్చి మార్టిగేజ్ రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. గత నెల సుమారు 15 రోజుల్లోనే 150 ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్లు అయినట్లు సిబ్బంది పేర్కొన్నారు. స్లాట్ బుకింగ్తోనే.. ప్రస్తుతం స్లాట్ బుకింగ్తో సంబంధం లేకుండా మాన్యువల్ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయి. స్లాట్ బుకింగ్ చేసుకుని వచ్చే వారి సంఖ్య చాలా తక్కువ. కాగా ప్రభుత్వం ప్రతీ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ ఉంటేనే రిజిస్ట్రేషన్లు చేసేలా ప్లాన్ చేస్తోంది. త్వరలో మానుకోట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా ఆ విధానం అమలు కానుంది. కాగా స్లాట్ బుకింగ్ వల్ల సమస్యలు ఉన్నాయని, ఆవిధానం వల్ల రిజిస్ట్రేషన్లు తగ్గుతాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటున్నారు.త్వరలో మరో కార్యాలయం.. జిల్లాలోని మరిపెడ, తొర్రూరులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తొర్రూరులో ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిసింది. అలాగే డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మరిపెడలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా రెండు మంజూరు చేస్తారా.. లేదా ఒకటే అయితే ఎక్కడ ఏర్పాటు చేస్తారనే దానిపై స్పష్టత లేదు. దాదాపు ఈనెలలోనే ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతోంది. త్వరలో సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో అమలు ప్రస్తుతం మాన్యువల్తో పాటు స్లాట్బుకింగ్ రిజిస్ట్రేషన్లు ఎల్ఆర్ఎస్ ప్రక్రియతో ఆఫీస్లో సందడి పెరిగిన మార్టిగేజ్ రిజిస్ట్రేషన్లు జిల్లాలో మరో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం -
ఇంటి నుంచి వెళ్లి.. బావిలో శవమై కనిపించి
నెల్లికుదురు: ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిన ఓ వ్యాపారి అనుమానాస్పదస్థితిలో వ్యవసాయ బావిలో శవమై కనిపించాడు. ఈ ఘటన గురువారం ఇనుగుర్తి మండలం చిన్నముప్పారంలో చోటు చేసుకుంది. ఎస్సై చిర్ర రమేశ్ బాబు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓబిలిశెట్టి కిశోర్ (40) కిరాణ వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. దీంతో కుటుంబ సభ్యులు కిశోర్కు ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కట్ల ఐలయ్య వ్యవసాయ బావివద్ద కిశోర్ వాహనం కనిపించింది. దీంతో వ్యవసాయ బావిలో చూడగా మృతి చెంది శవమై కనిపించాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా, కిశోర్ మృతికి కుటుంబ కలహాల లేదా.. మరే ఇతర కారణమా అనే విషయం తెలియాల్సి ఉందని ఎస్సై తెలిపారు. అనుమానాస్పదస్థితిలో వ్యాపారి మృతి చిన్నముప్పారంలో ఘటన -
కవి.. కష్టజీవి పక్షానే ఉండాలి
విద్యారణ్యపురి: కవి ఎప్పుడూ కష్టజీవి పక్షానే ఉండాలని, ప్రజలను చైతన్యవంతం చేసేలా రచనలు ఉండాలని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ అన్నారు. బుధవారం రాత్రి అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం (అరసం )90వ ఆవిర్భావ దినోత్సవం హనుమకొండలోని ఆదర్శ ‘లా’ కాలేజీలో నిర్వహించారు. ఈ సభకు అరసం రాష్ట్ర అధ్యక్షుడు పల్లేరు వీరస్వామి అధ్యక్షత వహించారు. అంపశయ్య నవీన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో బ్రిటిష్ వలసవాదం, దోపిడీ, అణిచివేతలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు లక్నోలో 1936 ఏప్రిల్ 9,10తేదీల్లో అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటు అయిందన్నారు. అరసం జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణ మాట్లాడుతూ దేశంలో నాడు ఏ పరిస్థితులున్నాయో ఇప్పటికీ అవే పరిస్థితులు ఉన్నాయన్నారు. అణిచివేత కొనసాగుతోందన్నారు. అనంతరం పల్లేరు వీరస్వామి రచించిన ‘వీక్షణాలు’, కేవీఎల్ రచించిన ‘లింగమ్మ’ పుస్తకాన్ని అంపశయ్యనవీన్ , ప్రముఖ కవి బన్న అయిలయ్య ఆవిష్కరించారు. అరసం ఉపాధ్యక్షురాలు చందనాలసుమిత్ర పుస్తక సమీక్ష చేశారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అనిశెట్టి రజిత, బాధ్యులు మార్కశంకర్నారాయణ, నిధి, బూర భిక్షపతి, బూర విద్యాసాగర్, పాంచల్రాయ్ మాట్లాడారు. న్యాయవాది ఏరుకొండ జయశంకర్, హనుమకొండ భారత్బచావో చైర్మన్రామబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ -
అమ్మమ్మ కర్మకు వస్తూ.. అనంతలోకాలకు
బయ్యారం: అమ్మమ్మ కర్మకు వస్తూ మనవడు అనంతలోకాలకు చేరాడు. కారు.. బైక్ను ఢీకొన్న ఘటనలో మనవడు మృతి చెందగా అతడి భార్య, కొడుకుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం మండలంలోని నామాలపాడు సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గూడూరు మండలం వాయిల్బంధం గ్రామానికి చెందిన సొక్కం నాగేశ్వరరావు(43) భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం సారపాక బీపీఎల్లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. నాగేశ్వరరావు తన మేనమామ కుమార్తె సునీతను వివాహం చేసుకోగా వారికి ప్రజ్వల్ సంతానం. ఈ క్రమంలో వాయిల్బంధంలో నివసించే అమ్మమ్మ ఆది సత్యమ్మ ఇటీవల మృతి చెందగా పెద్దకర్మకు హాజరయ్యేందుకు భార్య, కుమారుడితో కలిసి నాగేశ్వరరావు బైక్పై బయలుదేరాడు. మండలంలోని నామాలపాడు సమీపంలోకి రాగానే ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయపల్లికి చెందిన గుగ్గిల రామయ్య మహబూబాబాద్ నుంచి కారులో అతివేగంగా ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావు, సునీత, ప్రజ్వల్ను 108లో మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నాగేశ్వరరావు మృతి చెందాడు. భార్య పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించగా కుమారుడు మహబూబాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అలాగే, కారు నడుపుతున్న గుగ్గిళ్ల రామయ్యకు సైతం గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు మృతుడి బంధువు చిన్నరామయ్య ఫిర్యాదు మేరకు కారు నడుపుతున్న గుగ్గిళ్ల రామయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి పేర్కొన్నారు. ఛాగల్లులో వ్యక్తి.. స్టేషన్ఘన్పూర్: కారు.. బైక్ను వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని ఛాగల్లులో జరిగింది. ఎస్సై వినయ్కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని మీదికొండకు చెందిన చంద్రయ్య(60) వ్యక్తిగత పనుల నిమిత్తం తన బైక్పై స్టేషన్ఘన్పూర్కు వస్తున్నాడు. ఈ క్రమంలో ఛాగల్లు సమీపంలో జాతీయ రహదారిపై వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో చంద్రయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.వాయిల్ బంధంలో విషాదఛాయలు గూడూరు: సొక్కం నాగేశ్వరరావు మృతితో మండలంలోని అయోధ్యపురం శివారు వాయిల్బంధం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మానుకోటలో పోస్టుమార్టం అనంతరం నాగేశ్వరరావు మృతదేహాన్ని స్వగ్రామం వాయిల్బంధం తీసుకొచ్చారు. దీంతో అమ్మమ్మ దశదిన కర్మ.. నీ చావుకు వచ్చిందా బిడ్డా అంటూ కుటుంబ, బంధుమిత్రులు బోరున విలపించారు. గురువారం అంత్యక్రియలు చేస్తామని మృతుడి బంధువులు తెలిపారు. బైక్ను ఢీకొన్న కారు మనవడు మృతి.. అతడి భార్య, కొడుకుకు తీవ్ర గాయాలు -
కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల ముందస్తు అరెస్ట్లు
కేయూ క్యాంపస్: తెలంగాణలోని 12 యూనివర్సి టీల్లోని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్తో హైదరాబాద్లోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ముట్టడికి కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవా రం ఉదయం వరకు కాకతీయ యూనివర్సిటీలోని వివిధ కళాశాలలు, విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను ముందస్తు అరెస్ట్లు చేసి వివిధ పోలీస్టేషన్లకు తరలించారు. ఇందులో మహిళా ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. ప్రధానంగా కేయూ, హనుమకొండ, సుబేదారి తదితర పోలీస్ స్టేషన్లలో ఉంచారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో సుమారు 50 నుంచి 60మంది వరకు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారని సమాచారం. యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, కేయూ బీసీసెల్ డైరెక్టర్ శ్రీనివాస్, కేయూపాలకమండలి సభ్యుడు చిర్రరాజు, కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం బాధ్యులు సదాశివ, గడ్డం కృష్ణ తదితరులు ఉన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ముట్టడికి కూడా కొందరు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు వెళ్లారు. అందులో కేయూ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు శ్రీధర్కుమార్లోథ్, పలువురు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను మిగతా యూనివర్సిటీల కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను అక్కడ పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలి రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న 1,270మంది కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజేషన్ చేశాక మిగతా పోస్టుల్లో నియామకాలు చేపట్టాలని, ఇటీవల తీసుకొచ్చిన జీఓ 21ని రద్దుచేయాలని డిమాండ్తో ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను అరెస్ట్ చేశారని, వారిని విడుదల చేయాలని కేయూ కోఆర్డినేషన్ కమిటీ బాధ్యులు సాధురాజేశ్, బి. సతీశ్, మాదాసి కనకయ్య డిమాండ్ చేశారు. అరెస్ట్లను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాగా, గురువారం బంద్ పాటించనున్నట్లు కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర కమిటీ తెలిపింది.ఇదేనా ప్రజాపాలన.. తెలంగాణ ఏర్పాటుకు కారణమైన యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను అరెస్ట్ చేయటం సిగ్గుచేటని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఇండ్ల నాగేశ్వర్రావు ఒక ప్రకటనలో విమర్శించారు. ఇదేనా ప్రజాపాలనా అని ప్రశ్నించారు. కాంట్రాక్టు అధ్యాపకుల సమస్య పరిష్కారం చూపాకే నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొందరు ఇక్కడే.. మరికొందరు హైదరాబాద్లో.. -
అదుపు తప్పిన బైక్..
చిట్యాల: బైక్ అదుపు తప్పి ఓ కారోబార్ మృతి చెందాడు. ఈ ఘటనలో మంగళవారం రాత్రి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని నవాబుపేటకు చెందిన జిల్లెల కుమార్(40) కై లాపూర్ కారోబార్గా పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా శాంతినగర్లో ఉపాధిహామీ పనులు జరుగుతున్న క్రమంలో అక్కడికి వెళ్లి కూలీల వివరాలు తీసుకుని ఎంపీడీఓ కార్యాలయంలో అందజేశాడు. అనంతరం నవాబుపేటకు వెళ్తున్న క్రమంలో మండల కేంద్రంలోని సివిల్ సప్లై గోదాం మలుపు సమీపంలో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. దీంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం తెల్లవారుజామున అటువైపు వెళ్తున్న స్థానికుడు బుర్ర రఘు గౌడ్ చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై శ్రవణ్కుమార్ ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య కృప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, కై లాపూర్ పంచాయితీ కార్యదర్శి అజీరాబేగం.. మృతుడి భార్యకు అంత్యక్రియల నిమిత్తం రూ. 10వేల ఆర్థిక సాయం అందించారు. ● కారోబార్ మృతి ● చిట్యాలలో ఘటన -
మిడ్కో కథలు చిరస్మరణీయం
దేవరుప్పుల : దేశంలో ప్రకృతి సంపదను కొల్లగొట్టే దోపిడీ వ్యవస్థ నిర్మూలన ఉద్యమవ్యాప్తిలో మిడ్కో కథలు ఆచరణాత్మకంగా చిరస్మరణీయమని పౌరహక్కుల సంఘం, ఏఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్, విమలక్క, వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్ పేర్కొన్నారు. ఇటీవల ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు, విప్లవ సాహితి సంపాదకులు గుమ్ముడవెల్లి రేణుక సంస్మరణ సభ బుధవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలో అమరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షురాలు బి.పద్మకుమారి అధ్యక్షతన జరిగింది. తొ లుత తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య స్మారక స్థూపం వద్ద ఏర్పాటు చేసిన రేణుక చిత్రపటానికి పలువురు విప్లవ జోహర్లు అర్పించారు. అనంతరం ‘అందరసొంటి సావు కాదు’ శీర్షికన రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ వామపక్ష పార్టీల సిద్ధాంతాలు నిర్వీర్యమయ్యే క్రమంలో ఆవిర్భవించిన నక్సల్స్ ఉద్యమాల వల్లే తెలుగు రాష్ట్రాల్లో భూస్వామ్య, పెట్టుబడిదారి వ్యవస్థ ని ర్మూలించే క్రమంలో గిట్టని పాలకవర్గాలు పోలీ సుల ఉక్కుపాదం మోపుతూ ప్రజాఉద్యమాలను అణిచివేశారని అన్నారు. ఈ క్రమంలోనే ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కుల సాధనకు రేణుక నమ్మిన సిద్ధాంతం, మహిళలను చైతన్యవంతుల్ని చేసే క్రమంలో బీజేపీ సర్కార్ ఆపరేషన్ కగార్లో అసువులు బాసిందని పేర్కొన్నారు. రేణు క రచనలు భావితరాల ఉద్యమాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. ఆపరేషన్ కగార్ను నిలిపివేసి వాస్తవికతపై అధ్యయనం చేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రేణుక తల్లిదండ్రులు జయమ్మ, సోమయ్య మా ట్లాడుతూ తన కూతురుకు మరణంలేదు.. అక్షర ఉ ద్యమం ఉన్నంత వరకూ జీవిస్తుందంటూ కంటతడి పెట్టారు. అనంతరం విమలక్క, పల్స నిర్మల, సురేష్ సాంస్కృతిక కళాప్రదర్శనలతో అమరులను స్మరించుకున్నారు. కార్యక్రమంలో రేణుక సోదరులు జీవీకే.ప్రసాద్, రాజశేఖర్, పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య, విరసం నాయకుడు అరుసువల్లి కృష్ణ, మాభూమి సంధ్య, బల్ల సావిత్రి, గాజర్ల అశోక్ అలియాస్ ఐతు, అమర్, ఏపీటీఎఫ్, టీవీవీ వేదిక, డీటీఎఫ్ రాష్ట్ర నాయకులు ఎర్రంరెడ్డి నర్సింహారెడ్డి, గురజాల రవీందర్, బి.గంగాధర్, ఓయూ జేఏసీ నాయకుడు ఇప్ప పృథ్వీరెడ్డి, సీపీఐ, ఎమ్మార్పీఎస్ నాయకులు బిల్లా తిరుపతిరెడ్డి, జీడి ఎల్లయ్య, పడమటింటి నర్సింహ తదితరులు పాల్గొన్నారు. పౌరహక్కుల సంఘం, ఏఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్, విమలక్క, వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్ కడవెండిలో మావోయిస్టు నేత గుమ్ముడవెల్లి రేణుక సంస్మరణ సభ -
పొలంలో వరి దులుపుతుండగా..
భూపాలపల్లి రూరల్: పొలంలో ఆడ, మగ విత్తన వరి పంటను దులుపుతున్న క్రమంలో కాలుకు విద్యుత్ తీగ చుట్టుకోవడంతో షాక్కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం భూపాలపల్లి మండలం పంబపూర్లో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని పంబాపూర్కు చెందిన పిట్టల అభిషేక్(25) అదే గ్రామానికి చెందిన పులి సలమాను అనే రైతుకు చెందిన ఆడ, మగ వరి పంటను దులపడానికి కూలీకి వెళ్లాడు. మంగళవారం సామంత్రం వీచిన గాలి దుమారానికి పొలంలో11 కేవీ విద్యుత్ తీగ తెగిపడింది. ఈ క్రమంలో అభిషేక్ పొలంలో వరి దులుపుతుండగా అతడి కాలుకు తీగ చుట్టుకుంది. దీంతో షాక్ తగిలి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సహ కూలీలు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు వెంటనే ప్రైవేట్ వాహనంలో భూపాలపల్లి ప్రభుత్వ వంద పడకల ఆస్పత్రికి తరలించారు. అయితే అభిషేక్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అభిషేక్కు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు, భార్య సుకన్య ఉంది. కాగా, విద్యుత్ అధికారులు, పులిసలమాను నిర్లక్ష్యం కారణంగానే తన భర్త మృతి చెందాడని వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, వృద్ధాప్యంలో తమను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కొడుకు మృతిచెందడంతో అభిషేక్ తల్లిదండ్రులు అనంతయ్య, కరుణమ్మ గుండెలవిసేలా రోదించారు. కాలుకు చుట్టుకున్న విద్యుత్ తీగ షాక్కు గురై యువకుడి మృతి గాలి దుమారానికి తెగి పొలంలో పడిన విద్యుత్ తీగ.. -
హెచ్సీయూ భూములను పరిరక్షించాలి
కేయూ క్యాంపస్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ అన్నారు. వర్సిటీల భూముల పరిరక్షణపై డెమొక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన బుధవారం కాకతీయ యూనివర్సిటీ దూరవిద్యాకేంద్రం సెమినార్హాల్లో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములపై ప్రైవేట్ పెట్టుబడీదారుల కన్నుపడిందని, నాటి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఐఎంజీ భారత్ అనే కంపెనీకి 400ల ఎకరాల భూమి కేటాయించగా.. తర్వాత పరిణామ క్రమంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో ఆ కేటాయింపును రద్దు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఉన్నత న్యాయ స్థానం 2024లో ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు ఇచ్చినట్లు వివరించారు. ఆ 400 ఎకరాల భూమిని విద్యారంగాభివృద్ధికి వినియోగించాలన్న ఆయన.. బాధ్యత కలిగిన ప్రభుత్వం మళ్లీ ప్రైవేటు కంపెనీలకు అప్పగించడానికి పూనుకోవటం సరికాదన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకట్దాస్ మాట్లాడుతూ హెచ్సీయూ విద్యార్థులు భూమి పరిరక్షణకు ఉద్యమిస్తే వారిపై అణిచివేత చర్యలు తగదన్నారు. సమావేశంలో డెమొక్రటిక్ స్టూడెంట్స్ రాష్ట్ర కన్వీనర్ శ్రవణ్, కోకన్వీనర్ గణేష్, ప్రజాసంఘాల బాధ్యులు లింగారెడ్డి, లక్ష్మయ్య, మొయీనుద్దీన్, ఓంబ్రహ్మం, వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు బి.నర్సింహారావు, వడ్డెపెల్లి మధు, సంతోష్, రాజేష్, నాగరాజు, స్టాలిన్, వెంకటేష్, శివ పాల్గొన్నారు. ఉమ్మడి ఏపీ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ -
భర్త వేధింపులతో వివాహిత బలవన్మరణం
● మద్దులపల్లిలో ఘటనకాటారం: భర్త వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని మద్దులపల్లికి చెందిన పిట్టల శంకర్కు, మహాముత్తారం మండలం మహబూబ్పల్లికి చెందిన పిట్టల రజిత(25)కు ఏడున్నరేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వివాహం జరిగినప్పటి నుంచి శంకర్.. తల్లి లింగమ్మ, అన్న కిష్టస్వామి, అక్క లక్ష్మి చెప్పినట్లు వింటూ భార్య రజితపై అనుమానం పెంచుకున్నాడు. వివాహేతర సంబంధాలు అంటగడుతూ నిత్యం మద్యం తాగొచ్చి రజితను కొడుతున్నాడు. దీనిపై రజిత కుటుంబీకులు పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు నిర్వహించినా శంకర్లో మార్పు రాలేదు. రజిత తండ్రి మారయ్య ఆరోగ్యం బాగోలేదని ఇటీవల తమ్ముడు రఘుపతిని పంపించినప్పటికీ ఆమెను పుట్టింటికి పంపించకపోగా రజిత, ఆమె తమ్ముడిపై శంకర్ దాడి చేశాడు. ఈ క్రమంలో భర్త అనుమానం, వేధింపులతో మనస్తాపానికి గురైన రజిత బుధవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై–2 శ్రీనివాస్ తెలిపారు. ట్రేడింగ్ కంపెనీలో చోరీ.. ● రూ.9.60లక్షల అపహరణ కేసముద్రం: ఓ ట్రేడింగ్ కంపెనీలో చోరీ జరిగింది. రూ.9.60 లక్షలు అపహరణకు గురయ్యాయి. ఈ ఘటన మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై మురళీధర్రాజు కథనం ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ రోడ్లో గల మహాలక్ష్మి ట్రేడింగ్ కంపెనీ వ్యాపారి గార్లపాటి ప్రమోద్ మంగళవారం రాత్రి ఎప్పటిలాగే తన క్యాష్ కౌంటర్కు తాళం వేశాడు. అనంతరం వెనుక ఉన్న షెట్టర్ మూసి తాళం వేయకుండా భవనంపైనున్న తన ఇంట్లోకి వెళ్లాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఓ దుండగుడు షెట్టర్ను పైకి లేపి దుకాణంలోకి ప్రవేశించి కౌంటర్లోని రూ.9.60ల క్షలు తీసుకుని పరారయ్యాడు. ఉదయం షాపుకు వచ్చిన యజమాని చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై మురళీధర్రాజు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. చోరీకి పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదుకాగా, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. -
తమ్ముడే కాలయముడయ్యాడు..
వాజేడు : సొంత తమ్ముడే కాల యముడయ్యాడు. మద్యం కోసం డబ్బు ఇవ్వలేదనే కారణంతో అన్నను హత్య చేశాడు. అనంతరం తనకేమీ తెలియదన్నట్లు మృతదేహం వద్ద తిరిగాడు. ఈ ఘటన ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని కొత్త టేకులగూడెంలో జరిగింది. వెంకటాపురం(కె) సీఐ బండారి కుమార్, పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వాసం అచ్చయ్య, లక్ష్మి దంపతులకు ముగ్గురు కొడుకులు విజయ్బాబు(30), బుల్లెబ్బాయి (ఆకాశ్), రాజేంద్రప్రసాద్ ఉన్నారు. ఇద్దరు తమ్ముళ్లకు పెళ్లిళ్లు కాగా పెద్ద కొడుకు విజయ్బాబు వివాహం చేసుకోలేదు. అతడు తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. రెండో కొడు కు బుల్లెబ్బాయి(ఆకాశ్) తన భార్య కాన్పు నిమిత్తం తన అత్తగారింటికి వెళ్లగా ఇతను కూడా తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. ఈ క్రమంలో విజయ్ బాబు పనికి వెళ్లాడు. మంగళవారం రాత్రి ఇంటికి వచ్చి భోజనం చేసిన అనంతరం నిద్రించాడు. అ ప్పటికే మద్యం మత్తులో ఉన్న బుల్లెబ్బాయి.. అన్న విజయ్బాబును మద్యానికి డబ్బు ఇవ్వాలని అడగా అతడు తన వద్ద లేవని చెప్పి నిద్రించాడు. దీంతో కోపోద్రెకుడైన బుల్లెబ్బాయి.. విజయ్బాబుతో గొడవ పడి పదునైన ఆయుధంతో ముఖంపై కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన విజయ్బా బు మృతి చెందాడు. దీనిపై సమాచారం అందుకు న్న పోలీసులు బుధవారం ఉదయం ఘటనా స్థలికి చేరకుని పరిశీలించారు. వివరాలను సేకరించే సమయంలో బుల్లెబ్బాయి అక్కడే ఉండి తనకు ఏమీ తెలియదనట్లు నటించాడు. ఈ ఘటనపై చిన్న తమ్ముడు రాజేంద్రప్రసాద్ ఫిర్యాదు మేరకు బుల్లెబ్బాయిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ, ఎస్సై తెలిపారు. కాగా, బుల్లెబ్బాయి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మద్యం కోసం డబ్బు ఇవ్వలేదని అన్నను చంపిన తమ్ముడు టేకులగూడెంలో ఘటన -
మరోసారి మెరిసిన మరియపురం!
గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీ మరియపురం మరో సారి మెరిసింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో 2022–23 నాటికి గ్రామం రాష్ట్రంలోని టాప్ టెన్ పంచాయతీల్లో ఒకటిగా నిలిచింది. కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ రెండు రోజుల క్రితం విడుదల చేసిన ‘పంచాయతీ పురోగతి సూచిక‘లో గ్రామ మాజీ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి కృషి ఫలితంగా జిల్లాతో పాటు రాష్ట్రంలోనూ ప్రశంసనీయమైన సూచీ సాధిండం విశేషం. దేశంలో పురోగతి సూచిక కోసం 2.55 లక్షల పంచాయతీలు దరఖాస్తు చేసుకోగా అందులో మరియపురం టాప్ టెన్లో నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో 270 గ్రామాలు ‘ఫ్రంట్ రన్నర్’గా(75–90 శాతం) నిలువగా అందులో మరియపురం టాప్ టెన్లో 8వ స్థానంలో నిలిచింది. తెలంగాణలో టాప్ 25 గ్రామాల్లో జిల్లా నుంచి మరియపురం నిలవడం గొప్ప విజయంగా చెబుతున్నారు. మాజీ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి దూర దృష్టితో ఇప్పటికే గ్రామం సుమారు 25 మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు 25 దక్కించుకోవడం గమనార్హం.9 అంశాల్లో రాష్ట్రంలో టాప్ టెన్లో గ్రామం 80.71 ఇండెక్స్తో రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు జిల్లాలో అరుదైన రికార్డు సొంతం మాజీ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి కృషికి దక్కిన ఫలితంజిల్లా, రాష్ట్ర స్థాయిలో సాధించిన పంచాయతీ ఇండెక్స్(పీఏఐ) అంశం జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి సూచీ సూచీజీవనోపాధుల పెంపు 89.03 93.98 ఆరోగ్యం 96.88 99.91 చిన్నారులకు అనుకూలమైన సౌకర్యం 82.81 84.09 తాగునీరు 79.38 86.08 పారిశుద్ధ్యం, పచ్చదనం 83.74 85.86 మౌలిక వసతుల్లో స్వావలంబన 69.71 73.15 సామాజిక భద్రత 81.84 85.34 సుపరిపాలన 81.44 81.68 మహిళలకు అనుకూలమైన విధానం 85.74 89.88 -
జాతీయ ఎస్టీ కమిషన్ ఎదుట మహబూబాబాద్ కలెక్టర్
● కునాయికుంట కబ్జాపై విచారణకు ఢిల్లీలో హాజరు సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రత్తిరాంతండాలోని కునాయికుంట కబ్జా విషయంలో ఓ మాజీ ప్రజాప్రతినిధి జాతీయ ఎస్టీ కమిషన్ను ఆశ్రయించాడు. కమిషన్ ఆదేశాల మేరకు కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ బుధవారం ఢిల్లీలో కమిషన్ ఎదుట హాజరయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి.. రత్తిరాంతండా పరిధిలోని కునాయికుంటను గత ప్రభుత్వం హయాంలో కొంతమంది అక్రమంగా కబ్జా చేసి.. రెవెన్యూ అధికారుల మద్దతుతో పట్టాదారు పాస్బక్ పొందారు. ఈ విషయం అప్పటి కలెక్టర్, అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదు. 70 ఏళ్లు గిరిజన రైతులకు సాగునీరుకు ఉపయోగపడే కుంటను ఆక్రమించి పట్టాపొందారనే విషయాన్ని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ దృష్టికి మాజీ ఎంపీటీసీ మదన్ తీసుకెళ్లారు. ఫిర్యాదుపై స్పందించిన జాతీయ ఎస్టీ కమిషన్ ఢిల్లీలోని కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని కలెక్టర్ను ఆదేశించింది. ఈమేరకు ఆయన హాజరై కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు తెలిసింది. -
అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
స్టేషన్ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ఘపూర్ స్థానిక బస్టాండ్ సమీపాన నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఆర్యూ కంగన్హాల్, గార్మెంట్స్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. కంగన్హాల్ను ప్రారంభించి షాపు యజమాని కుటుంబ సభ్యులతో ఫొటోలు దిగుతుండగా షాపు ఎదుట బాణాసంచా కాల్చారు. నిప్పురవ్వలు అక్కడ ఏర్పాటు చేసిన టెంట్పై పడటంతో అంటుకుని ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు, పోలీసు సిబ్బంది టెంట్ను కిందికి లాగడంతో పాటు నీళ్లు పోసి మంటలు ఆర్పారు. అయితే.. షాపులోకి మంటలు వ్యాపించకుండా ముందు షెట్టర్ను మూసివేసి కొద్దిసమయం తర్వాత తెరిచారు. అప్పటి వరకూ ఎమ్మెల్యే షాపు లోపలే ఉన్నారు. ఆయన క్షేమంగా వెళ్లిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో టెంట్, షాపు ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, షాపు బోర్డు పాక్షికంగా కాలిపోయాయి. కార్యక్రమంలో షాపు యజమాని, కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ నాయకుడు నీల వీరస్వామి, ఏఎంసీ డైరెక్టర్ నీల వెంకటేశ్వర్లు, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు నీల గట్టయ్య, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
వ్యాపారులు కొనమంటే బయట అమ్ముకున్నా..
ఒక తాలురకం మిర్చి బస్తాను మార్కెట్కు తీసుకొచ్చాను. రెండు రోజులుగా మార్కెట్లో ఉంటే బుధవారం ఉదయం చీటీ ఇచ్చారే తప్ప మిర్చి కొనుగోలు చేయలేదు. మార్కెట్లో తాలురకం మిర్చి క్వింటా ధర రూ.5,500ఉంటే.. బయట ప్రైవేట్ వ్యక్తులకు రూ.3,900 చొప్పున కొనుగోలు చేశారు. దీంతో సుమారు రూ.1,600 వరకు నష్టపోవాల్సి వచ్చింది. నాలాగే చాలామంది ఒక బస్తా, రెండుబస్తాలు తీసుకొచ్చిన వాళ్లు ఉండగా ఎవరూ పట్టించుకోలేదు. – మాలోతు హరిలాల్, లింగ్యాతండా, బలపాల ● -
సన్న, చిన్నకారు రైతులపై చిన్నచూపు
మహబూబాబాద్ రూరల్: సన్న, చిన్నకారు రైతులను వ్యాపారులు చిన్నచూపు చూస్తున్నారు. వారు తెచ్చిన ఒకటి, రెండు మిర్చి బస్తాలను కొనుగోలు చేయడం లేదు. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని వివిధ మండలాల నుంచి పలువురు రైతులు సోమ, మంగళవారాల్లో ఒకటి, రెండు బస్తాల మిర్చిని విక్రయించేందుకు మానుకోట మార్కెట్కు తీసుకొచ్చారు. కాగా బుధవారం అధికంగా బస్తాలు తీసుకొచ్చిన రైతుల మిర్చి మాత్రమే కొనుగోలు చేసి.. తక్కువ బస్తాలు తీసుకొచ్చిన మిర్చిని కొనుగోలు చేయలేదు. సాయంత్రం వరకు కూడా వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో వ్యవసాయ మార్కెట్ నుంచి తమ బస్తాలను తీసుకెళ్లి ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుని ఇంటికి వెళ్లామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటి, రెండు బస్తాలు తీసుకొచ్చిన వారికి నిరాశ మిర్చి కొనుగోలు చేయలేదని ఆవేదన మానుకోట వ్యవసాయ మార్కెట్లో ఘటన -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
● అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో గార్ల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. మండలంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికై న బీఆర్ఎన్తండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆయన బుధ వారం పరిశీలించారు. ఇళ్ల బేస్మెంట్ పనులు పూర్తి కాగానే తొలిబిల్లు రూ.లక్ష లబ్ధిదారుడి అకౌంట్లో జమ చేస్తామన్నారు. విడతల వారీగా రూ.5 లక్షలు లబ్ధిదారుడి ఖాతాలో జమ చేస్తామని వెల్లడించారు. అనంతరం గార్ల ఎంపీడీఓ కార్యాలయంలో రాజీవ్ యువ వికాస పథకం కింద ఇప్పటి వరకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారని ఎంపీడీఓ మంగమ్మను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను స్వయంగా పరిశీలించారు. అర్హులు ఈనెల 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పైరవీలకు తావులేకుండా చర్యలు తీసుకుంటామని పే ర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులు అజ్మీరా కిషన్, మహేశ్ తదితరులు ఉన్నారు. రైతులు అధైర్యపడొద్దు● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ నెల్లికుదురు: అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే భూక్య మురళీనా యక్ అన్నారు. మండలంలోని రాజులకొత్తపల్లితో పాటు పలు గ్రామాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షంతో దెబ్బతిన్న మామిడి, వరి, మొక్కజొన్న పంటలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. ప్రకృతి వైపరిత్యం వల్ల పంటలు దెబ్బతిన్నాయన్నారు. వెంటనే నష్టపోయిన పంటలపై సమగ్ర సర్వే చేసి అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ మంత్రితో మాట్లాడి నష్టపోయిన రైతుల ను ఆదుకునేందుకు కృషి చేస్తానని హామీ ఇ చ్చారు. కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్, యాదవరెడ్డి, సత్యపాల్రెడ్డి, బాలాజీ నాయక్, లక్ష్మారెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సబ్ సెంటర్లతో మెరుగైన వైద్య సేవలుడోర్నకల్: అందుబాటులోకి రానున్న సబ్ సెంటర్లతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని జిల్లా వైద్యాధికారి రవిరాథోడ్ పేర్కొన్నారు. డోర్నకల్లోని శాంతినగర్, బైపాస్రోడ్డు, చర్చి కాంపౌండ్లో ప్రారంభానికి సిద్ధమైన సబ్ సెంటర్ భవనాలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. డోర్నకల్లోని మూడు ప్రాంతాల్లో సబ్ సెంటర్ భవనాలు పూర్తిస్థా యి వసతులతో సిద్ధమయ్యాయని, గురువా రం ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రమీలారావు, ఎన్సీడీ పీఓ నాగేశ్వర్రావు, మండల వైద్యాధికారి సాధ్విజ తదితరులు పాల్గొన్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి నెహ్రూసెంటర్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని డీఎంహెచ్ఓ రవి అన్నారు. బుధవారం ఎంఎల్హెచ్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భిణులను 12 వారాల్లో నమోదు చేయాలని, పీహెచ్సీ వైద్యాధికారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ ఆస్పత్రికి పంపించాలన్నారు. ఎన్హెచ్ఎం కార్యక్రమాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల లోపువారికి టీకాల పంపిణీ వందశాతం పూర్తి చేయాలని సూచించారు. ముప్పైఏళ్లు పైబడిన వారు బీపీ, షుగర్, కేన్సర్ పరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరికి ఆబా కార్డు క్రియేట్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రమీల, ప్రోగ్రాం అధికారులు సుధీర్రెడ్డి, నాగేశ్వర్రావు, లక్ష్మీనారాయణ, సారంగం, డీపీఎం నీలోహాన, హెచ్ఈ కేవీ రాజు, గీత, డీడీఎం సౌమిత్, రాజ్కుమార్, ఎంఎల్హెచ్పీలు పాల్గొన్నారు. -
ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత
కురవి: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని మాజీఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఓం ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు మండల కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆత్మహత్యకు పాల్పడిన గుగులోత్ కిషన్నాయక్ ఆత్మ శాంతించాలని బీఆర్ఎస్ నాయకులు సంతాపం తెలిపి మౌనం పాటించారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. ఆరుగ్యారంటీ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. హా మీలు అమలు చేయకుండా అవినీతిలో కూరుకుపోయిందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడే పరిస్థితి ఉందన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు డోర్నకల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి 10వేల మంది తరలిరావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యాయనాయక్ మాట్లాడుతూ..కార్యకర్తలు ఐక్యంగా ఉండి విజయం సాధించాలన్నారు. బోడ బాజీ అనే వృద్ధురాలు బీఆర్ఎస్సభ కోసం తన పింఛన్ డబ్బుల నుంచి రూ.1000 మాజీ ఎంపీ కవితకు అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నూతక్కి సాంబశివరావు, నాయకులు బజ్జూరి పిచ్చిరెడ్డి, గుగులోత్ రవినాయక్, గుడిబోయిన రాంచంద్రయ్య, గుగులోత్ నెహ్రూనాయక్, నామ సైదులు, బోడ శ్రీను, రాంలాల్, కొణతం విజయ్, కిన్నెర మల్లయ్య, చల్ల గుండ్ల గణేష్, బానోత్ గణేష్, బానోత్ రాము, సంజీవ నాయక్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత -
‘పురోగతి’లో ముందు వరుస..
కేసముద్రం: సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా 2022–23నాటికి దేశంలోని గ్రామపంచాయతీలు సాధించిన పరోగతి ఆధారంగా కేంద్ర పంచాయతీరాజ్శాఖ విడుదల చేసిన పురోగతి సూ చికలో మండలంలోని కల్వల గ్రామం ఆరో స్థానంలో నిలిచింది. పేదరిక నిర్మూలన, పంచాయతీలో జీవనోపాధి పెంపు,ఆరోగ్యం,చిన్నారులకు సౌకర్యా ల కల్పన, తాగునీరు,పారిశుద్ధ్యం, పచ్చదనం, మౌ లిక వసతుల్లో స్వావలంబన, సామాజిక భద్రత, సుపరిపాలన,మహిళలకు అనుకూలమైన విధానా లు అనే తొమ్మిది అంశాలను కొలమానంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందంతో సర్వే నిర్వహించింది. ఈ మేరకు తాజాగా విడుదల చేసి న పంచాయతీ పురోగతి సూచికలో కల్వల జీపీ 80.82 మార్కులు సాధించి రాష్ట్రంలో ఆరో స్థానంలో నిలిచింది.క్లీన్అండ్గ్రీన్లో భాగంగా,ప్రతీ ఇంటి కి ఆరు మొక్కలను పంపిణీ చేసి, అవి బతికే విధంగా చూడడం, తడిచెత్త నుంచి ఎరువుల తయారీ వంటి కార్యక్రమాలను అప్పటి సర్పంచ్ గంట సంజీవరెడ్డి, కార్యదర్శి అరుణ్జ్యోతి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ మేరకు కల్వల జీపీ ఆరో స్థానంలో నిలవడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరి సహకారంతో అభివృద్ధి తాజామాజీ గ్రామ సర్పంచ్ గంట సంజీవరెడ్డి, వార్డుసభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశాలు, ఎఎన్ఎంలు, సీఏలు, గ్రామస్తుల సహకారంతో ప్రభుత్వం నిర్వహించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. ఇందులో భాగంగా క్లీన్అండ్గ్రీన్ను విజయవంతంగా నిర్వహించాం. నాటిన ప్రతీ మొక్కను బతికించాం. పురోగతి సూచికలో రాష్ట్రంలోనే కల్వల గ్రామం ఆరో స్థానంలో నిలవడం సంతోషంగా ఉంది. –అరుణ్జ్యోతి, పంచాయతీ కార్యదర్శి, కల్వల పురోగతి సూచికలో రాష్ట్రంలో కల్వల జీపీకి ఆరో స్థానం క్లీన్అండ్గ్రీన్ అంశంలో ఎంపిక -
దళారుల చేతిలో రైతులు మోసపోవద్దు
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తొర్రూరు రూరల్: వరి, మక్కలు, మిర్చి తదితర పంట ఉత్పత్తుల విక్రయాల్లో రైతులు దళారుల చేతిలో మోసపోవద్దని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. మండలంలోని వెలికట్ట గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని దళారులు, ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించి నష్టపోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లోనే గన్నీ సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంటాయన్నారు. తేమశాతం తక్కువ ఉన్న ధాన్యాన్ని వెంటనే కాంటాలు పెట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్రావు, డైరెక్టర్లు కందాడి అచ్చిరెడ్డి, పాపిరెడ్డి, టీకునాయక్, వెంకన్న, కాంగ్రెస్ నాయకులు సుంచు సంతోష్, సోమరాజశేఖర్, మాలోతు సునీత, కేతిరెడ్డి నిరంజన్రెడ్డి, కిశోర్రెడ్డి, విజయపాల్రెడ్డి, పెదగాని సోమయ్య, బాపురెడ్డి, మల్లేశంగౌడ్, శ్రీనివాస్గౌడ్, జలకం శ్రీను, సధాకర్, సురేందర్రెడ్డి, సోమన్న, శ్రావణ్కుమార్, యాకూబ్రెడ్డి, గౌతంరెడ్డి పాల్గొన్నారు. -
ఆర్ట్స్ కళాశాల సందర్శన
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను బుధవారం ఎన్సీసీ గ్రూప్ కమాండర్ నింబాల్కర్ సందర్శించారు. ఈసందర్భంగా కళాశాలలో నిర్వహిస్తున్న ఎన్సీసీ కార్యక్రమాల గురించి ఆకళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి వివరించారు. రాబోయే రోజుల్లో ఎన్సీసీ విభాగాన్ని మరింత పటిష్ట పరుస్తామన్నారు. ఎన్సీసీ కార్యక్రమాలకు తమ వంతుగా సహకారమందిస్తామని నింబాల్కర్ తెలిపారు. ఈసందర్భంగా నింబాల్కర్ను ప్రిన్సిపాల్ ఆచార్య జ్యోతి సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ఎన్సీసీ ఆఫీసర్ డాక్టర్ స్వామిచాడ అధికారులు పాల్గొన్నారు. -
వాగులు లూటీ..
గురువారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 8లోuచేతులెత్తేసిన అధికారులు ఇష్టారాజ్యంగా ఇసుక రవాణా చేయడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ తీసుకొస్తామని చెప్పింది. కాగా అప్పటి వరకు ఇసుక రవాణా చేయకుండా ఆపాలని రాష్ట్ర ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఆదేశించారు. దీంతో అప్రమత్తమైన జిల్లాలోని రెవెన్యూ, పోలీస్, మైనింగ్, ఇరిగేషన్ అధికారులు వాగులను తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఆకేరు, మున్నేరు, పాలేరు వాగుల వద్ద నిఘా పెంచారు. ఇసుక రవాణాచేసే వారితో సమావేశం పెట్టారు. 71 మందిని బైండోవర్ చేశారు. 11 మందిపై కేసులు పెట్టారు. పోలీసులు ఔట్పోస్టులు పెట్టి ఇసుక రవాణాను అడ్డుకున్నారు. అయితే పదిరోజుల క్రితం పోలీసు ఔట్ పోస్టులను ఎత్తివేశారు. తనిఖీలు బంద్ చేశారు. దీంతో యథేచ్ఛగా ఇసుక రవాణా సాగుతోంది. సాక్షి, మహబూబాబాద్: ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామని చెప్పిన అధికారులు.. అనతికాలంలోనే చేతులెత్తేశారు. రెండు నెలలు కట్టుదిట్టంగా ఇసుక రవాణాను అడ్డుకున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో కాని పదిరోజులుగా ఆకేరు వారు నుంచి ఇసుక అక్రమంగా తరలుతోంది. ప్రతీరోజు వందలాది ట్రాక్టర్లు.. వేలాది ట్రిప్పుల ఇసుకన తోడుతూ.. వాగును ఖాళీ చేస్తున్నారు. మైనార్టీ తీరని, మ ద్యం మత్తులో డ్రైవర్లు ట్రాక్టర్లను వేగంగా నడిపి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ట్రాక్టర్ల శబ్దాలకు కంటిమీద కునుకు ఉండడం లేదని ప్రజలు చెబుతున్నారు. వందల ట్రాక్టర్లు.. వేల ట్రిప్పులు రెండు నెలల పాటు కట్టుదిట్టమైన బందోబస్తు పెట్టి ఇసుక రవాణాను అడ్డుకొని ఒక్కసారిగా చేతులెత్తేయడంతో ప్రతీరోజు వందల ట్రాక్టర్లు, వేల ట్రిప్పులు తోలుతూ వాగుల వద్ద జాతరను తలపిస్తున్నారు. ప్రధానంగా నర్సింహులపేట మండలంలోని కౌసల్యదేవిపల్లి, జయపురం, కొమ్ములవంచ, రామన్నగూడెం, ముంగిమడుగు, చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి, నెల్లికుదురు మండల పరిధిలో రాత్రి, పగలూ తేడా లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే స్థానికుల అవసరాలను పక్కన పెట్టి ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ పట్టణాలకు సరఫరా చేస్తున్నారు. ఎంత తోలుకుంటే అంత కావడంతో మైనర్, తప్పతాగిన పలువురు డ్రైవర్లు మితిమీరిన వేగంతో ట్రాక్టర్లు నడపడంతో వాగుల చుట్టూ ఉన్న గ్రామాలతోపాటు, ప్రధాన రహదారి వెంట ఉన్న గ్రామాల ప్రజలు తమకు రాత్రిపూట నిద్రపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యూస్రీల్జిల్లాలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేతులెత్తేసిన అధికారులు రాత్రింబవళ్లు తవ్వకాలు వందల ట్రాక్టర్లు.. వేల ట్రిప్పులు స్థానిక అవసరాలకు లేకుండా ఖాళీ -
యాంటీ బయాటిక్స్తో పశువులకు ముప్పు
మామునూరు: అధిక పాల దిగుబడి కోసం విచక్షణారహితంగా యాంటీ బయాటిక్స్ వినియోగిస్తే పశువులు, ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిళ్లుతుందని మామునూరు కేవీకే సీనియర్ శాస్త్రవేత్త, కోఆర్డి నేటర్ రాజన్న అన్నారు. ఖిలా వరంగల్ మండలం మామునూరు పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వ విద్యాలయంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కేవీకే, సద్గురు మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ‘యాంటీ మెక్రోబియల్ నిరోధకత– పరిష్కారాలు’ అనే అంశంపై పాడి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం డాక్టర్ వంశీకృష్ణ యాంటీ బయాటిక్స్ వినియోగం, వాటి మోతాదు, ఎక్కువ వాడితే కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. అంతకు ముందు పశువుల పాకల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, షెడ్డు నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన విషయాలపై డాక్టర్ అమృత్కుమార్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వరప్రసాద్, కై లాశ్, సాయికిరణ్, శాస్త్రవేత్తలు, పాడి రైతులు పాల్గొన్నారు కేవీకే శాస్త్రవేత్త రాజన్న -
అంకితభావంతో ఆర్టీసీ డ్రైవర్ల విధులు
హన్మకొండ: ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తూ ఆర్టీసీ డ్రైవర్లు అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్నారని వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను కొనియాడారు. మంగళవారం హనుమకొండలోని వరంగల్–1 డిపోలో జరిగిన కార్యక్రమంలో రీజియన్లో 2024 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో వృత్తిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రగతి చక్ర అవార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం విజయ భాను ముఖ్య అతిథిగా పాల్గొని రీజియన్లోని 9 డిపోలలో ఎంపిక చేసిన ఉత్తమ ఉద్యోగులకు జ్ఞాపిక, ప్రశంస పత్రం అందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ రద్దీలోనూ ఆర్టీసీ ఉద్యోగులు సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ఉత్తమ ఉద్యోగులను స్ఫూర్తిగా తీసుకుని మిగతా వారు పోటీ పడాలన్నారు. ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లాలని సూచించారు. మరింత ఆదాయం తీసుకురావాలన్నారు. ప్రయాణికుల పట్ల మర్యాదగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎంలు కేశరాజు భాను కిరణ్, మహేశ్, డిపో మేనేజర్లు, సూపర్ వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం విజయభాను -
ఉద్విగ్న క్షణాలు..
యువ వైద్యులు సేవాభావంతో ముందుకు సాగాలిఎంజీఎం : ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని వైద్య వృత్తిలోకి ప్రవేశిస్తున్న యువ వైద్యులు వృత్తిని సేవాభావంతో కొనసాగిస్తూ పేదలకు బాసటగా నిలవాలని కాళోజీ హెల్త్ వర్సిటీ వైస్ చాన్స్లర్ నందకుమార్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి కాకతీయ మెడికల్ కళాశాల 61 గ్రాడ్యుయేషన్ డే కనుల పండువగా నిర్వహించారు. విద్యార్థుల పట్టాల ప్రదానోత్సవానికి తల్లిదండ్రులతోపాటుబంధుమిత్రులు పెద్ద ఎత్తున రావడంతో కళాశాల ప్రాంగణమంతా పండుగ వాతావ రణం నెలకొంది. వైద్యవిద్యలో ఓ ఘట్టం పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ బంధుమిత్రులతో సెల్పీలు దిగుతూ సందడి చేశారు. 2019లో ఎంబీబీఎస్ అడ్మిషన్ పొందిన 230 మంది విద్యార్థులు ఈ సందర్భంగా పట్టాలు పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పరుగులు పెట్టాలి.. వైద్యవిద్యలో ఎంబీబీఎస్ మొదటి ఘట్టం మాత్రమేనని, వైద్యులు నిరంతర విద్యార్థులని వీసీ పేర్కొన్నారు. ఎంబీబీఎస్ అనంతరం తమ లక్ష్యాల మేరకు పోస్టు గ్రాడ్యుయేషన్ సాధించి ఉన్నత వైద్యులుగా ఎదగాలని ఆశించారు. ప్రస్తుతం వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పరుగులు పెడుతూ వైద్యవిద్యనభ్యసించాలని వర్సిటీ రిజిస్ట్రార్ సంధ్యాఅనిల్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కేఎంసీ ప్రిన్సిపాల్ రాంకుమార్రెడ్డి, రాజేశ్వరి, విజయలక్ష్మి, మధుసూదన్, మురళి, తదితరులు పాల్గొన్నారు. కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీ నందకుమార్రెడ్డి కేఎంసీలో విద్యార్థులకు పట్టాల ప్రదానోత్సవం -
ఇండోర్ సబ్స్టేషన్ల నిర్మాణానికి ప్రణాళికలు
హన్మకొండ : పట్టణ ప్రాంతాల్లో సబ్ స్టేషన్ల ఏర్పాటుకు సరిపడా స్థలాలు లేవని, ఇండోర్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి పేర్కొన్నారు. హనుమకొండ, వరంగల్, కరీంనగర్లో ఇండోర్ సబ్ స్టేషన్ల నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరముందని ఆయన తెలిపారు. మంగళవారం నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో హనుమకొండ సర్కిల్(జిల్లా) అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డివిజన్, సెక్షన్ల వారీగా ప్రగతిని సమీక్షించారు. దేవునూరు, క్యాతంపల్లి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న 11 కేవీ లైన్ల వివరాలు అడిగి తెలుసుకుని, పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతీ పనిలో సాంకేతికను వినియోగించాలని సూచించారు. డ్రోన్ ద్వారా పోల్ టు పోల్ సర్వే చేయించి గుర్తించిన సమస్యను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. భవిష్యత్లో ఎక్కడైనా విద్యుత్ లైన్ వేసేందుకు అనుకూలం లేని ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ కేబుల్ వేస్తామని వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాలతో అంతరాయాలు ఏర్పడినప్పడు ఒక సబ్ స్టేషన్ నుంచి మరో సబ్ స్టేషన్కు విధిగా ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందించేలా చర్యలు తీసుకోవాలని వివరించారు. ట్రాన్స్ఫార్మర్ల ఫెయిల్యూర్లు కాకుండా విధిగా టాంగ్ టెస్టర్ రీడింగ్ తీసుకోవాలని, 60శాతం కంటే లోడ్ పెరిగే అవకాశం ఉన్న ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచాలన్నారు. జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యంగా డీఈలను (టెక్నికల్) సెఫ్టీ అధికారులుగా నియమించామన్నారు. సమావేశంలో ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్లాల్, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సీఈలు రాజు చౌహాన్, తిరుమల్ రావు, హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, ఎస్ఈలు, డీఈలు,ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు. ఉద్యోగుల భద్రతకు ప్రాధ్యాన్యం విద్యుత్ ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళా క్షేత్రంలో హనుమకొండ జిల్లాలోని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగులు, ఆర్టిజన్ సిబ్బందితో నేరుగా ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ఉద్యోగుల భద్రతకు పెద్దపీట వేసి సర్కిల్ కార్యాలయం టెక్నికల్ డీఈలను సేఫ్టీ అధికారులుగా నియమించినట్లు తెలిపారు. అదే విధంగా రూ.కోటి బీమా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. డ్రోన్ ద్వారా పోల్ సర్వే చేయాలి టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
‘యూత్ పార్లమెంట్’లో కేయూ విద్యార్థిని ప్రతిభ
కేయూ క్యాంపస్ : ఢిల్లీలోని పార్లమెంట్లో ఈనెల 1నుంచి 3వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ యూత్ పార్లమెంట్ వన్ నేషన్, వన్ ఎలక్షన్పై కేయూ బయోటెక్నాలజీ ఫైనలియర్ విద్యార్థిని శ్రీజాజాదవ్ పాల్గొని అనర్గలంగా ప్రసంగించారు. ‘ట్రాన్సిషనల్ మోడల్స్ ఇంప్లిమెంటేషన్ మార్గాలు’ అనే అంశంపై ప్రసంగించి ప్రతిభ చాటారు. మంగళవారం శ్రీజాజాదవ్ కాకతీయ యూనివర్సిటీకి రాగా ఆమెకు విద్యార్థులు, కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రాధిక, పలువురు అధ్యాపకులు మొదటిగేట్వద్ద స్వాగతం పలికి బయోటెక్నాలజీ విభాగం వరకు ర్యాలీ నిర్వహించారు. గజమాలతో సన్మానించారు. అనంతరం వీసీ కె. ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం.. శ్రీజాజాదవ్ను పరిపాలనాభవనంలో అభినందించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్, వైస్ ప్రిన్సిపాల్ కె. మమత, బయోటెక్నాలజీ విభాగం అధ్యాపకులు టి.శాసి్త్ర, శ్రీనివాస్, కేయూఅభివృద్ధి అధికారి వాసుదేవరెడ్డి, ఆర్ట్స్కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ, తదితరులు పాల్గొన్నారు. అభినందించిన వీసీ, రిజిస్ట్రార్ -
మంట వేడికి కోళ్లు మృత్యువాత
శాయంపేట : మండలంలోని ఆరెపల్లి శివారులో మొక్కజొన్న సొప్ప కాలుతూ పౌల్ట్రీ ఫామ్ పక్కకు అంటుకోగా ఆ మంట వేడికి లక్షలాది రూపాయల విలువైన కోళ్లు మృత్యువాత పడ్డాయి. పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన పరకాల రాజేందర్ ఆరెపల్లి గ్రామ శివారులో పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ ఫామ్ పక్కన గంగుల పులమ్మ వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిని శాయంపేటకు చెందిన దుంపల రాజిరెడ్డి కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేశాడు. పంట కోసిన తర్వాత ఎండిన సొప్పను మంగళవారం తగులబెట్టగా కాలుతూ పౌల్ట్రీ ఫామ్ పక్కకు అంటుకుంది. మంట వేడికి సుమారు 1,500 కోళ్లు మృత్యువాత పడ్డాయి. వీటి విలువ రూ.4లక్షల 50వేలు ఉంటుంది. ఈ ఘటనపై రాజేందర్.. రాజిరెడ్డిని పెద్దమనుషుల ద్వారా అడిగించగా.. ‘నా భూమిలో సొప్ప కాల్చుకున్నా.. మంట మీ దగ్గరకు వస్తే మీరే ఆర్పుకోవాలి.. నాకు సంబంధం లేదు’ అని సమాధానం ఇచ్చాడు. ఈ విషయంపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జక్కుల పరమేశ్ తెలిపారు. కాగా, రాజిరెడ్డికి తన చేనులోకి వెళ్లడానికి దారి లేదని, తాము కొన్నిసార్లు తమ పౌల్ట్రీ ఫామ్ నుంచి వెళ్లొద్దని చెప్పామని, దీంతో మనస్సులో పెట్టుకుని కావాలనే మక్క సొప్పను తగులబెట్టి కోళ్లు మృత్యువాత పడేలా చేశాడని రాజేందర్ ఆరోపించాడు. రూ. 4. 50 లక్షల నష్టం ఆరెపల్లి శివారులోని పౌల్ట్రీ ఫామ్లో ఘటన -
కబ్జా నిరూపిస్తే రాజీనామా చేస్తా
హన్మకొండ చౌరస్తా: తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడైనా ఒక్క గుంట భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండలోని జి ల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చి మ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డితో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేవునూరు గుట్టల అటవీభూమిలో తాను రెండు వేల ఎకరాలని ఓసారి, 50 ఎకరాలు కబ్జా చేశానని మరో సారి పల్లా రాజేశ్వర్రెడ్డి, తాటికొండ రాజయ్యలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాను కబ్జా చేసినట్లు సాక్ష్యాలు, ఆధారాలతో ప్రజల ముందుంచితే వారి ఇద్దరి ఇళ్లలో గులాం చేయడానికి సిద్ధమని, లేదంటే వారిద్దరు నా ఇంట్లో గులాంగా పని చేయాలని సవాల్ విసిరారు. ఆరోపణలు చేసిన నా యకులు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే న్యాయపరంగా చర్యలు వెనుకాడేది లేదని హెచ్చరించారు. వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాసరావు, ఈవీ శ్రీనివాసరావు, బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా అధ్యక్షుడు పెరుమాండ్ల రామకృష్ణ, బీసీ సెల్ జిల్లా చైర్మన్ బొమ్మతి విక్రమ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అజీజ్ఖాన్, పల్ల కొండ సతీశ్, నాయకులు పాల్గొన్నారు. పల్లా, తాటికొండలు క్షమాపణ చెప్పాలి ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
బీఆర్ఎస్ రజతోత్సవ సభాస్థలి పరిశీలన
ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రం శివారు, చింతలపల్లి గ్రామ సమీపంలోని సుమారు 1200 ఎకరాల్లో ఈనెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, జిల్లా కార్యదర్శి దాస్యం వినయ్భాస్కర్, ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు వేర్వేరుగా సభా స్థలాన్ని పరిశీలించారు. సభా స్థలి ప్రాంగణంలో అక్కడడక్కడ కొంత వరిపంట కోతదశలో ఉన్నందున ఆ పాంత్రాన్ని బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. మిగతా స్థల ప్రాంగణం పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. మరో వారం రోజుల్లో సభా స్థలం పనులు పూర్తి కానున్నాయని అంచనా వేశారు. నాయకులు పిట్టల మహేందర్, కడారి రాజు, తంగెడ నగేశ్, డుకిరె రాజేశ్వర్రావు తదితరులు ఉన్నారు. దూరవిద్య ఎమ్మెస్సీ సైకాలజీ పరీక్షలు వాయిదా కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరి ధిలోని దూరవిద్య కేంద్రం ఎమ్మెస్సీ సైకాలజీ ఫైనలియర్ విద్యార్థులు, ఎక్స్ అభ్యర్థులకు థియరీ, ప్రాక్టికల్స్, డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్ పరీక్షలు ఈనెల 24 నుంచి నిర్వహించాల్సిండగా ఆయా పరీక్షలు వాయిదావేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మళ్లీ ఆయా పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తర్వాత వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. కూర మాడిపోతుందన్న ఆతృతలో.. ● రేకులపై ఉన్న మసిగుడ్డ తీసే క్రమంలో విద్యుదాఘాతం ● అక్కడికక్కడే వివాహిత మృతి ● రాంచంద్రుతండాలో ఘటనచిన్నగూడూరు: కూర మాడిపోతుందన్న ఆతృతలో రేకులపై ఉన్న మసిగుడ్డ తీసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మండల కేంద్రం శివారు రాంచంద్రుతండాలో జరిగింది. బాధిత కుటుంబీకులు, స్థానికుల కథనం ప్రకారం..తండాకు చెందిన బాదావత్ అఖిల(25) సోమవారం రాత్రి తన ఇంటిలో వంట చేస్తోంది. ఈ క్రమంలో పొయ్యి మీద కూర మాడిపోతుందన్న ఆతృతలో ఇంటి ఎదుట రేకులపై ఉన్న మసిగుడ్డను తీసే సమయంలో రేకులకు విద్యుత్ సరఫరా అయ్యి షాక్ తగలడంతో కిందపడింది. గమనించిన స్థానికులు రేకులకు విద్యుత్ సరఫరా అవుతున్న వైర్ తొలగించారు. కుటుంబీకులు చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించే క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. ఎస్సై ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు (రిత్విక్ రెండు సంవత్సరాలు, రిద్వాన్ నాలుగు సంవత్సరాలు), భర్త నరేశ్ ఉన్నారు. తల్లి మృతితో గుక్కిపెట్టి ఏడుస్తున్న చిన్నారులను చూసి తండావాసులు కంటతడి పెట్టుకున్నారు. ఈ ఘటనతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
అదుపు తప్పి ఆటో బోల్తా..
● ముగ్గురు విద్యార్థులు, రౖడైవర్కు తీవ్ర గాయాలు ● కాచికల్ శివారులో ఘటన నెల్లికుదురు: విద్యార్థులను తీసుకెళ్తున్న ఓ ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కాచికల్ శివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని ఎర్రబెల్లిగూడెం గ్రామానికి చెందిన 14 మంది విద్యార్థులు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో చదువుకుంటున్నారు. గతంలో తొర్రూరు నుంచి నెక్కొండ వరకు వయా కాచికల్, ఎర్రబెల్లిగూడెం, మేచరాజుపల్లి, బూర్గుమళ్ల, కల్లెడ, పర్వతగిరి మీదుగా నడిచిన ఆర్టీసీ బస్సులు ప్రస్తుతం రద్దు అయ్యాయి. దీంతో ఆర్టీసీ బస్సులు లేని కారణంగా తల్లిదండ్రులు ప్రైవేట్ వాహనాల్లో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పాఠశాలకు ఆటోలో వెళ్లిన విద్యార్థులు మధ్యాహ్నం తిరిగి అదే ఆటోలో ఇంటికి వెళ్తున్నారు. ఆటో కాచికల్ శివారులోని ప్రధాన రహదారిపై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు ముద్రాల అక్షిత్, యాటగాని హర్షిత్, సాయి చరణ్తో పాటు ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఆర్టీసీ బస్సులు పునరుద్ధరించి ఇలాంటి ప్రమాదాలను నివారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
రూ.10 లక్షల విలువైన గంజాయి పట్టివేత
నల్లబెల్లి: మహారాష్ట్రలోని ముంబాయికి తరలిస్తున్న సుమారు రూ.10 లక్షల విలువైన 21 కిలోల ఎండు గంజాయి పట్టుకుని ఇద్దరి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించనట్లు నర్సంపేట రూరల్ సీఐ సాయిరమణ, నల్లబెల్లి ఎస్సై గోవర్ధన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం నల్లబెల్లి పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని ముంబాయికి చెందిన ప్రవీ ణ్ శివబాదర్గే, వర్ష శంబాజీ కటే..రైలులో ఒడిశాలో ని బరంపూర్ వెళ్లి సుమారు రూ.10లక్షల విలువైన 21.73 కిలోల ఎండు గంజాయి కొనుగోలు చే శారు. అనంతరం రైలులో బరంపూర్ నుంచి మహబూబాబాద్ మీదుగా ముంబాయి బయలుదేరారు. మహబూబాబాద్లో రైల్వే పోలీసులు తనిఖీలు ని ర్వహిస్తున్నారని తెలుసుకుని రైలు దిగి ఓ వాహనంలో నల్లబెల్లి మీదుగా వరంగల్ బయలుదేరారు. ఈ క్రమంలో మండలంలోని నారక్కపేటలో జాతీయ రహదారిపై ఎస్సై గోవర్ధన్ ఆధ్వర్యంలో సోమవా రం వాహనాలు తనిఖీ చేస్తున్నారు. గమనించిన నిందితులు పరారయ్యేందుకు యత్నించగా పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 21.73 కిలోల గంజా యి, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు రూరల్ సీఐ, ఎస్సై పేర్కొన్నారు. సిబ్బంది పాల్గొన్నారు. ఇద్దరు అరెస్ట్, రిమాండ్ వివరాలు వెల్లడించిన పోలీసులు -
మిర్చి కొనుగోళ్లు ఆలస్యం
మహబూబాబాద్ రూరల్: మానుకోట వ్యవసాయ మార్కెట్లో సకాలంలో మిర్చితో పాటు ఇతర పంటల ఉత్పత్తులు కొనుగోలు చేయడంలేదని ఆరోపిస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు మంగళవారం ఆందోళన చేశారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గునిగంటి రాజన్న, జిల్లా ఉపాధ్యక్షుడు నల్లపు సుధాకర్ మాట్లాడుతూ.. వ్యాపారులు మార్కెట్కు వచ్చి తడిసిన మిర్చితో పాటు అన్ని బస్తాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం మిర్చి కొనుగోళ్లలో ఆలస్యం కావడం వల్లే అకాల వర్షానికి తడిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో పదిమంది మిర్చి వ్యాపారులు ఉండగా ఒకరిద్దరు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, మిగతా వ్యాపారులు రావడంలేదన్నారు. సుమారు 4 వేల మిర్చి బస్తాలు, 4వేల మొక్కజొన్న బస్తాలు, 450 పత్తి బస్తాలు ఉన్నాయని తెలిపారు. స్పందించిన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, కార్యదర్శి షంషీర్ వ్యాపారులకు ఫోన్ చేసి పిలిపించి వేలం పాటలు ప్రారంభించి, త్వరగా మిర్చి బస్తాలు గోదాంకు తరలిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రైతులు రమేశ్, బాలునాయక్, శ్రీను, సర్వన్, వెంకన్న, మంగీలాల్ పాల్గొన్నారు. రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన -
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
● మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ నెహ్రూసెంటర్: గ్రామాల అభివృద్ధికి పాటుపడిన తాజా మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ కోరారు. కురవి మండలం కాకులబోడుతండా తాజా మాజీ సర్పంచ్ భర్త కిషన్నాయక్ అప్పులపాలై ఆత్మహత్య చేసుకోగా మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ.. బిల్లులు రాక అప్పుల పాలై చనిపోవడం బాధాకరమన్నారు. మరెవరూ అప్పులబాధతో మృతిచెందకుండా బిల్లులు విడుదల చేయాలని, ప్రభుత్వం కిషన్నాయక్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చి కన్నీటి పర్యంతమయ్యారు. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. -
ఆర్టీసీ బలోపేతానికి కృషి చేయాలి
నెహ్రూసెంటర్: ఆర్టీసీ బలోపేతానికి ఉద్యోగులు, సిబ్బంది కృషి చేయాలని ఆర్టీసీ వరంగల్ రీజనల్ మేనేజర్ విజయభాను అన్నారు. ప్రగతిచక్ర త్రైమాసిక అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం డిపో ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కోసం ఉద్యోగులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. డిపోకు చెందిన ఆర్. శ్రవణ్కు ఉత్తమ వెల్డర్ అవార్డును ప్రదానం చేశారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ ఎం.శివప్రసాద్, శ్రీనివాస్, పాపిరెడ్డి, వెంకన్న, నరసయ్య, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలిమహబూబాబాద్: గ్రామ పంచాయతీ కార్మి కుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూ నియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.రవి డిమాండ్ చేశా రు. యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం డీపీఓ హరిప్రసాద్కు సమ్మె నోటీస్ అందజేశారు. ఈసందర్భంగా రవి మాట్లాడుతూ.. ప్ర భుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈనెల 17న రాష్ట్ర వ్యాప్తంగా టోకెన్ సమ్మె చేపడుతున్నామన్నారు. మృతిచెందిన ప్రతీ జీపీ కార్మికుడి కుటుంబా నికి రూ.10లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. జీఓ నంబర్ 51ని సవరించి పాత పద్ధతిలో విధులు నిర్వర్తించేలా చర్యలు చేపట్టాలన్నారు. సూర్యం, బీకు, యాకయ్య, రంగయ్య పాల్గొన్నారు. జిల్లా కమిటీ ఎన్నికమహబూబా బాద్ అర్బన్: వ్యాయామ విద్య ఉ పాధ్యాయుల (పీడీ) సంఘం జిల్లా కమిటీని ఏ కగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి ఓలేటి జ్యోతి మంగళవారం తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా కొప్పుల శంకర్, ప్రధాన కార్యదర్శిగా చెడుపల్లి ఐలయ్య, కోశాధికారిగా డి.సునీల్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ అధ్యక్షుడు సత్యనారాయణ, పీడీలు తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంమహబూబాబాద్ అర్బన్: పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం 2024–25 విద్యా సంవత్సరానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారి నర్సింహస్వామి మంగళవారం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఈబీసీ విద్యార్థులు పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం మే 31వ తేదీ వరకు ఆన్లైన్లో సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థి దశలోనే లక్ష్యం ఎంచుకోవాలి● అర్జున అవార్డు గ్రహీత దీప్తి జీవాంజి మహబూబాబాద్ అర్బన్: విద్యార్థి దశలోనే లక్ష్యం ఎంచుకొని ముందుకెళ్తే విజయం సాధించవచ్చని అర్జున అవార్డు గ్రహీత దీప్తి జీవాంజి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలో మంగళవారం జరిగిన కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని.. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మధు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రైవేట్గా ఐటీఐ చేసే అవకాశంమహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న కార్మికులు ప్రైవేట్గా ఐటీఐ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని మానుకోట ప్రభుత్వ ఐటీఐ కళా శాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ ఎన్. బాబు మంగళవారం తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో మూడేళ్లకుపైగా సర్వీస్పూర్తి చేసిన అభ్యర్థులు వృత్తి నైపుణ్యతను పెంపొందించుకోవడం కో సం తగిన శిక్షణ ఇప్పించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఆసక్తిగలవారు నేటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు దరఖాస్తులు అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు మానుకోట జిల్లా ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సంప్రదించాలన్నారు. -
పాడి పరిశ్రమకు ప్రభుత్వం చేయూత
తొర్రూరు రూరల్: పాడి పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తుందని డీసీఓ ఎన్. వెంకటేశ్వర్లు తెలిపారు. తొర్రూరు విజయ పాల శీతలీకరణ కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం మండల శివారులోని ఆర్డబ్ల్యూఎస్ భవనంలో అంతర్జాతీయ సహకార సంవత్సర కార్యక్రమం చేపట్టారు. పాడి రైతులకు అధికారులు పలు అంశాలపై అవగాహన కల్పించారు. విజయ డెయిరీ ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ కె.శ్రావణ్కుమార్, పాలకేంద్రం చైర్మన్ రాసాల సమ్మయ్యతో కలిసి డీసీఓ మాట్లాడారు. పాడి రైతుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం, విజయ డెయిరీ సహకరిస్తుందన్నారు. విజయ డెయిరీ డీడీ శ్రావణ్కుమార్ మాట్లాడుతూ.. ఉమ్మడి వ రంగల్ జిల్లాలో మిల్క్పార్లర్లు, బల్క్ మిల్క్ చిల్లింగ్ కేంద్రాల ఏర్పాటుతో పాటు పాడి పశువులకు నాణ్యమైన దాణా ఉత్పత్తికి పటిష్టమైన కార్యాచరణ చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో పాలకేంద్రం మేనేజర్ బారి వెంకటనారాయణ, సొసైటీల అధ్యక్షులు శ్రీనివాస్, ప్రభాకర్రెడ్డి, మధు, సుధాకర్రెడ్డి, సుజాత, పాడి రైతులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ అందరివాడు..
మహబూబాబాద్ అర్బన్: అంబేడ్కర్ అందరివా డని, విద్యార్థులు మహనీయుల జీవిత చరిత్ర ను తెలుసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధి కారి బి.నర్సింహస్వామి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, భారతరత్నగా ప్రపంచంలోనే గొప్ప మేధావిగా గుర్తింపు పొందిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. వ్యాసరచన పోటీల విజేతలకు అంబేడ్కర్ జయంతిరోజు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామన్నారు. చైల్డ్వెల్ఫేర్ కమిటీ సభ్యు డు అశోక్, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, పాఠశాల హెచ్ఎం సిరినాయక్ పాల్గొన్నారు. -
రైతన్నకు తీరని నష్టం
మహబూబాబాద్ రూరల్ /బయ్యారం: అకాల వర్షం రైతన్నలకు శాపంగా మారింది. సోమవారం రాత్రి కురిసిన వడగండ్ల వానతో మామిడికాయలు నేలరాలగా.. మొక్కజొన్న, వరి పంటలు దెబ్బతి న్నాయి. కల్లాల్లో ఆరబోసిన మిర్చి వర్షం ధాటికి తడిసిపోవడమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడిపోవడంతో రైతన్నలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. గాలిదుమారం, వర్షం కా రణంగా పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు రోడ్లపై విరిగిపడి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. భారీ ఈదురుగాలులకు పెద్దపెద్ద చెట్లు విరిగి రోడ్లకు అడ్డుగా పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వివరాల సేకరణ.. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారులు ఉదయం నుంచి నేలరాలిన మామిడికాయల వివరాలు సేకరించే పని మొదలుపెట్టారు. జిల్లావ్యాప్తంగా 443 ఎకరాల్లో మామిడి, బొప్పాయి తోటలకు నష్టం వాటిల్లినట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారి జినుగు మరియన్న పేర్కొన్నారు. ఐదు ఎకరాల్లో బొప్పాయి తోటలు దెబ్బతినగా, 128 మంది రైతులకు చెందిన 438 ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా తయారు చేసి ప్రభుత్వానికి నివేదించామని ఆయన తెలిపా రు. అలాగే జిల్లాలో 2,686 ఎకరాల్లో వరి, 130 ఎకరాల్లో మొక్కజొన్న, 4 ఎకరాల్లో సపోట తోటల దెబ్బతిన్నాయని డీఏఓ విజయనిర్మల తెలిపారు. ప్రాథమిక నష్టం అంచనా నివేదిక ప్రభుత్వానికి అందజేశామని పేర్కొన్నారు. ఈదురుగాలులతో చాలా గ్రామాల్లో ఇళ్ల పైకప్పు రేకులు లేచిపోయా యి. పలువురు ఇళ్లలో టీవీలు,ఫ్యాన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు రోడ్లకు అడ్డుగా పడిన చెట్లను తొలగించడంతోపాటు విద్యుత్ స్తంభాలను సరిచేశారు. 167 విద్యుత్ స్తంభాలు నేలమట్టంనెహ్రూసెంటర్: జిల్లాలో సోమవారం రాత్రి వచ్చిన ఈదురుగాలులు, వర్షానికి జిల్లాలో 167 విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయని, విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించామని ఎస్ఈ జనగాం నరేశ్ మంగళవారం తెలిపారు. ధ్వంసమైన పోల్స్ స్థానాల్లో కొత్తవి వేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో 36వ వార్డులో పోల్స్ విరిగిపోగా పరిశీలించిన సీపీఐ మున్సిపల్ మాజీ ఫ్లోర్లీడర్ అజయ్సారథిరెడ్డి విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పనులు చేయించారు. అకాల వర్షంతో నేలరాలిన మామిడికాయలు దెబ్బతిన్న వరి, మొక్కజొన్న పంటలు రోడ్లపై విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు పలు చోట్ల నిలిచిన విద్యుత్ సరఫరా -
ఎర్త్ సైన్సెస్ వర్సిటీగా కొత్తగూడెం ఇంజినీరింగ్ కాలేజీ
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కొత్తగూడెం మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీని ఎర్త్సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఉత్తర్వులు జారీ చేశారు. సహజవనరులు పుష్కలంగా ఉన్న ఈ ప్రాంతంలో వర్సిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా వర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీనిని అమలులోకి తీసుకొస్తూ ఎర్త్సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ పేరుతో జీఓ జారీ అయ్యింది. ఇందుకు అనుగుణంగా తెలంగాణ యూనివర్సిటీల చట్టం 1991కు సవరణ చేసింది.దీంతో కొత్తగూడెం ప్రాంతవాసులు, విద్యార్థులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేయూ నుంచి బోధన, బోధనేతర, ఆస్తుల బదలాయింపు! కొత్తగూడెంలో 1978లో స్కూల్ఆఫ్మైన్స్ ఓయూ పరిధిలోని పీజీ సెంటర్గా ఏర్పాటు అయింది. కాకతీయ యూనివర్సిటీ ఏర్పాటైన అనంతరం 1996 నుంచి కొత్తగూడెం స్కూల్ ఆఫ్మైన్స్ కేయూ పరిధిలోకి కొత్తగూడెం మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీగా ఆవిర్భవించింది. అప్గ్రేడ్ నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో బోధన, బోధనేతర పోస్టులతో సహా ప్రస్తుతం ఉన్న ఆ కాలేజీ ఆస్తులు కూడా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి బదలాయింపు జరగబోతుంది. ఇంజనీరింగ్కాలేజీలో 41అధ్యాపకుల పోస్టులకుగాను ప్రస్తుతం 16మంది పనిచేస్తున్నారు. పలువురు కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు.అధ్యాపకుల కొరత ఉంది. 106 నాన్టీచింగ్పోస్టులు ఉంటే 60 మంది వరకు పనిచేస్తున్నారు. వర్సిటీగా అప్గ్రేడ్తో పోస్టులు పెరిగే అవకాశాలున్నాయి. అప్గ్రేడ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కేయూ నుంచి విడిపోనున్న కళాశాల బోధన, బోధనేతర పోస్టులు, ఆస్తుల బదలాయింపు కూడా.. ఆ నలుగురి అధ్యాపకుల డిప్యుటేషన్లు రద్దయ్యే అవకాశం?ఆ నలుగురి డిప్యుటేషన్లు రద్దువుతాయా? కాకతీయ యూనిర్సిటీ పరిధిలోని కొత్తగూడెం మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీలో గతంలో నియామకమై అక్కడ కొంత కాలం పనిచేసి కేయూలోని ఇంజనీరింగ్ కళాశాలలకు డిప్యుటేషన్పై వచ్చిన వారిలో ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు భిక్షాలు, వెంకటరమణ, ఇద్దరు అ సిస్టెంట్ ప్రొఫెసర్లు రాధిక, సుమలత ఉన్నా రు. ఇప్పుడు కొత్తగూడెం మైనింగ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ అయిన నేపథ్యంలో వీరి డిప్యుటేషన్లు రద్దవుతాయా అనే అంశం చర్చగా మారింది. ఎందుకంటే వారి పోస్టులు అక్కడే. అందుకే ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి బదలాయింపు జరగనున్న నేపథ్యంలో వీరు అక్కడికి వెళ్లాల్సింటుందనే అంశం యూనివర్సిటీలో చర్చగా ఉంది. లేదా వారికి ఏమైనా ఆప్షన్ ఇస్తారా లేదా వేచి చూడాల్సిందే. -
బదిలీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
హన్మకొండ అర్బన్: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేయాలని చూడడం సరికాదని, వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని టీఎన్జీఓస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన టీఎన్జీఓస్ నాయకులు, పంచాయతీ కార్యదర్శులతో కలిసి హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్యను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. 8 నెలల క్రితమే సాధారణ బదిలీల్లో భాగంగా పెద్ద సంఖ్యలో పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేశారని, తిరిగి ఇప్పుడు మళ్లీ బదిలీలు చేయడం వల్ల కార్యదర్శులు అనేక ఇబ్బందులకు గురవుతారని పేర్కొన్నారు. గ్రామాల్లో పాలకవర్గం ముగిసి ఏడాది గడిచినా పంచాయతీ ఎన్నికలు కాకపోవడంతో చాలాచోట్ల గ్రామాల అభివృద్ధి పనులకు ఆయా గ్రామాల కార్యదర్శులే పెద్ద మొత్తంలో సొంత డబ్బులు ఖర్చు చేశారని, ఇప్పుడు వేరే ప్రాంతానికి వెళ్తే వారు ఖర్చు పెట్టిన సొమ్ము వారికి అందడం కష్టమవుతుందన్నారు. వారు ఖర్చు చేసిన డబ్బులను వెంటనే ప్రభుత్వం నుంచి ఇప్పించేలా చూడాలని కలెక్టర్ను కోరారు. పంచాయతీ కార్యదర్శుల బదిలీలను టీఎన్జీఓస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీఓస్ జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, అసోసియేట్ అధ్యక్షుడు పుల్లూరు వేణుగోపాల్, కోశాధికారి పనికెల రాజేశ్, గౌరవ అధ్యక్షుడు శ్యాంసుందర్, పంచాయతీ కార్యదర్శుల ఫోరం కార్యదర్శి ఇంజపల్లి నరేశ్, నాయకులు ఎండీ రఫీ, వెంకన్న, సురేశ్, కృష్ణంరాజు, సౌజన్య, అంజలి, వెంకటేశం, ప్రవళిక, లావణ్య, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ -
నేలబొగ్గును మింగిన బాలుడు మృతి
గీసుకొండ: ఇంధనం(నేల) బొగ్గును మింగి ఓ బాలుడు మృతి చెందాడు. బాలుడి బంధువులు, గీసుకొండ సీఐ మహేందర్ కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం విశ్వనాథపురం గ్రామంలో కొర్ర రాజు–శ్రీలత దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కూతుళ్లు జన్మించిన తర్వాత మూడవ సంతానంగా కొర్ర అయాన్(9) జన్మించాడు. రాజు కొమ్మాల స్టేజీ వద్ద బిర్యానీ సెంటర్ నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగానే ఈ నెల 5న బాలుడి తల్లి తన కుమారుడు అయాన్ను తీసుకుని బిర్యానీ సెంటర్కు వెళ్లింది. కుమారుడు అయాన్ ఆడుకుంటూ వెళ్లి పొయ్యి దగ్గరలోని వంట చెరుకుకు ప్రత్యామ్నాయంగా వాడే నేల బొగ్గు(వ్యవహారికంగా రైల్వే బొగ్గు అంటారు)ను మింగాడు. కొద్ది సేపటికి గమనించిన తల్లి బాలుడి నోటిలో బొగ్గును తొలగించి కడిగింది. ఆ తరువాత బాలుడికి శ్వాస రాక ఏడుస్తుండడంతో తల్లిదండ్రులు నర్సంపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎక్స్రే తీసి పరిస్థితి విషమంగా ఉందని వెంటనే హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి తరలించాలని సూచించగా, బాలుడిని నీలోఫర్లో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఇద్దరు కుమార్తెల తర్వాత పుట్టిన బాబు కావడంతో గారాబంగా పెంచుకుంటున్న సమయంలో అనుకోని రీతిలో మృతి చెందడంంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. బొగ్గు ఎందుకు ప్రమాదకరం..! బొగ్గు తినడం చాలా ప్రమాదకరం అని వైద్యులు చెబుతున్నారు. బొగ్గులో పాదరసం, సల్ఫర్ డయాకై ్సడ్, నైట్రోజన్ ఆకై ్సడ్ లాంటి హానికరమైన రసాయనాలు ఉంటాయని, అందుకే బొగ్గును తిన్న బాలుడు శ్వాస ఆడక మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. విద్యార్థిని ఆత్మహత్య ● హైదరాబాద్లో ఘటన మరిపెడ: మరిపెడకు చెందిన ఓ విద్యార్థిని హైదరాబాద్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మండల కేంద్రం సీతారాంపురం కాలనీకి చెందిన కొమ్ము పరశురాములు పెద్ద కూతురు స్పందన (18) కొంత కాలంగా తల్లితో కలిసి హైదరాబాద్లో ఉంటుంది. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్పందన ఇటీవల ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసింది. కాగా, విద్యార్థిని ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సకాలంలో మిర్చి కొనుగోళ్లు చేపట్టాలి
మహబూబాబాద్ రూరల్ : రైతుల అవసరాలు, ఇబ్బందులు గుర్తించి సకాలంలో మిర్చి కొనుగోళ్లు చేపట్టాలని మార్కెటింగ్ శాఖ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ (ఆర్డీడీఎం) పద్మావతి అన్నారు. ఈమేరకు సో మవారం మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ను సందర్శించారు. ఈ సందర్భంగా క్రయవిక్రయాల తీరును పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రైతులు, వ్యాపారుల అవసరాల మేరకు మార్కెట్ యార్డు ప్రాంగణంలో వసతుల కల్పనపై దృష్టి సారిస్తామన్నారు. మిర్చి, మక్కలు, ధాన్యం, పత్తి, అపరాలు కొనుగోళ్ల సందర్భంలో రైతులకు వ్యాపారులు సహకరించాలని కో రారు. అనంతరం ఈ ఏడాది సీజన్లో జరిగిన మి ర్చి క్రయవిక్రయాలు, మార్కెట్ ఆదాయంపై రికా ర్డులు తనిఖీ చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్, వైస్ చైర్మన్ మదన్ గోపాల్ లోయ, సెక్రటరీ షంషీర్, సూపర్వైజర్ రమేశ్, అసిస్టెంట్ సూపర్వైజర్ అరుణ్ కుమార్ పాల్గొన్నారు. మార్కెటింగ్ శాఖ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి -
రక్తనిధి.. హతవిధీ!
ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రికి నిత్యం ప్రాణాపాయ స్థితిలో వచ్చేవారు అనేకం. రోగులకు వైద్య సేవలందించడంలో రక్తనిధి పాత్ర కీలకం. అలాంటి బ్లడ్ బ్యాంక్ నిర్వహణను నిర్వాహకులు, ఎంజీఎం పరిపాలనాధికారులు గాలికి వదిలేశారు. పేదలకు రక్తం అందించేందుకు వచ్చిన దాతలకు కనీస సౌకర్యాలు అందడం లేదు. రక్త నిధి కేంద్రాన్ని పర్యవేక్షించే అధికారులు వివిధ పనులంటూ ఎప్పుడు.. ఎక్కడికి వెళ్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. రక్త నిధి కేంద్రంలో ఎన్ని నిల్వలున్నాయి? రిజర్వ్ చేసిన బ్లడ్ ఎంత? సమాచారం తెలుసుకునేందుకు బ్లడ్ బ్యాంక్ నంబర్ సైతం కొన్నేళ్ల నుంచి పనిచేయడం లేదు. ఈక్రమంలో ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఏకంగా 55సార్లు రక్తదానం చేసిన వ్యక్తి ఎంజీఎం రక్త నిధి కేంద్రానికి సౌకర్యాలు కల్పించాలంటూ సోమవారం గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన రక్త నిధికేంద్ర నిర్వహణ పనితీరుకు నిదర్శనంగా చెప్పొచ్చు. పని చేయని ఫోన్ నంబర్ ఎంజీఎం ఆస్పత్రిలో రక్త నిల్వల కోసం ప్రభుత్వం ఎంజీఎం సూపరిండెంట్ కోసం అధికారికంగా ఎలాగైతే నంబర్ కేటాయించారో.. సేవల్లో కీలకంగా ఉండే రక్త నిధి కేంద్రానికి సైతం 94906 1947 అనే నంబర్ను కేటాయించారు. ఈనంబర్ను ఉపయోగిస్తే విధులను కచ్చితంగా నిర్వర్తించాల్సి వస్తుందని తెలిసి కొన్నేళ్లుగా ఈ నంబర్ను వాడకుండా వదిలివేసినట్లు తెలుస్తోంది.కలెక్టర్కు ఫిర్యాదు చేశాం.. నేను ఇప్పటి వరకు 55 సార్లు రక్తదానం చేశా. 2017లో అప్పటి ఆర్ఎంఓకు బెడ్స్ గురించి తెలుపగా నామమాత్రంగా మరమ్మతులు చేశారు. ప్రస్తుతం రక్త నిధి కేంద్రానికి దాతలను తీసుకొస్తే చిరిగిపోయిన బెడ్స్ ఉన్నాయని, నిర్వహణ సరిగ్గా లేదని రక్తం ఇచ్చేందుకు వెనుకడుడు వేస్తున్నారు. ఎంజీఎం అఽధికారులకు తెలిపినా స్పందన లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజావాణిలో కలెక్టర్ ఫిర్యాదు చేశాం. – అయిత ఉషాభాస్కర్రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చేవారికి అండగా నిలవాలి. కానీ వారికి కనీస అవసరాలను కూడా అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కనీనం రక్తం సేకరించే క్రమంలో దాతలు పడుకునే బెడ్స్ను సైతం సమకూర్చలేని దుస్థితి ఎంజీఎంలో నెలకొంది. కాగా.. సమస్యలపై ఆస్పత్రి నిర్వాహకులు, అధికారులను ప్రశ్నిస్తే అన్నింటికీ వారు ఒకే సమాధానం చెబుతున్నారు. ‘వ్యవస్థను ఒక్క రోజులో గాడిన పెట్టలేం’ అంటూ దాటవేస్తున్నారు. జేబులు నింపుకునే ఫైళ్లపై చూపిస్తున్న ఆసక్తి సేవల మెరుగుదలకు చూపించడం లేదని కొన్ని నెలలుగా తీవ్రస్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్నాయి.చిరిగిన బెడ్నిండుకుంటున్న నిల్వలు.. ఎంజీఎం ఆస్పత్రికి ప్రతీరోజు ప్రాణాపాయ స్థితిలో 10 నుంచి 20 మంది క్షతగాత్రులు వస్తుంటారు. వీరికి అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎక్కిస్తూ చికిత్సలు అందించాల్సి ఉంటుంది. ఇలాంటి రక్త నిధి కేంద్రంలో రోగులు ఎప్పుడు రక్తం కావాలని అడిగినా నిల్వలు నిండుకున్నాయని చెప్పడం పరిపాటిగా మారింది. అసలు ఎంజీఎం ఆస్పత్రిలో రక్తనిధి కేంద్ర సిబ్బంది పనితీరుపై దృష్టి సారించకపోవడంతోనే ఈ కేంద్రం అధ్వానంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఎంజీఎం రక్తనిధి కేంద్రంలో నిండుకున్న నిల్వలు చిరిగిన బెడ్స్.. కనీస వసతులు కరువు కీలక విభాగాన్ని పట్టించుకోని అధికారులు పనిచేయని బ్లడ్బ్యాంక్ ఫోన్ నంబర్ సేవలు మెరుగుపర్చాలని గ్రీవెన్స్లో కలెక్టర్కు ఫిర్యాదు -
గోదావరి పరీవాహక ప్రాంత అధికారులు అప్రమత్తంగా ఉండాలి
● టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి హన్మకొండ: వాతావరణ శాఖ ఈదురు గాలులు, భారీ వర్షాలు ఉన్నాయని హెచ్చరించిన నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతాల విద్యుత్ అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి సూచించారు. సోమవారం హనుమకొండలోని టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్రెడ్డి మాట్లాడుతూ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం పరిధిలో ఎప్పటికప్పుడు విద్యుత్ సరఫరా మానిటర్ చేస్తూ ఏదైనా అంతరాయం జరిగితే వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. చెట్లు విరిగి విద్యుత్ లైన్లపై పడితే, ట్రిప్పింగ్స్, బ్రేడౌన్లు సంభవిస్తే త్వరితగతిన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సూచించారు. పంటల కోతలు జరుగుతున్నందున పెండింగ్లో ఉన్న వ్యవసాయ సర్వీస్ల మంజూరు వేగవంతం చేయాలన్నారు. అత్యవసర సమయంలో కావాల్సిన మెటీరియల్ను సమకూర్చుతామన్నారు. వ్యవసాయానికి అవసరమైన చోట 63 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతీ సర్కిల్లో ఎల్సీ యాప్పై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్ టి.సదర్లాల్, జీఎంలు, ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు. సిక్కిం గవర్నర్ను కలిసిన మౌంటైనర్ యశ్వంత్ మరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యతండా గ్రామ పంచాయతీకి చెందిన మౌంటైనర్ భూక్య యశ్వంత్ సోమవారం సిక్కిం గవర్నర్ ఓమ్ ప్రకాశ్ మాథూర్ని ఆ రాష్ట్ర రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన వంతు సహకారం, ఆశీస్సులు ఉంటాయని, విజయం వైపు దూసుకెళ్లాలని యశ్వంత్కు గవర్నర్ సూచించారు. పట్టుదలతో ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతాలను అధిరోహించి భారత దేశ ఖ్యాతి విశ్వవ్యాప్తం చేయాలని యశ్వంత్ను గవర్నర్ దీవించారు. -
స్వరూపకు న్యాయం జరిగేదెప్పుడో..?
సాక్షి, వరంగల్: అడవుల్లో తుపాకీ పట్టి ఆ తరువాత జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టు.. తనకు లొంగుబాటు సమయంలో ప్రకటించిన పునరావాస ఫలాల కోసం అధికారుల చుట్టూ 13 ఏళ్లుగా ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుత సిద్దిపేట జిల్లా చేర్యాల (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా) మండలం కొమురవెల్లి గ్రామానికి చెందిన పాశం స్వరూప అడవిలో దాదాపు తొమ్మిదేళ్లు కరీంనగర్, నిజామాబాద్, ఆది లాబాద్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో చివరగా సి రొంచ కమాండర్గా పనిచేస్తూ 2012లో పోలీసుల కు లొంగిపోయింది. ఆ సమయంలో పునరావాసం కింద 500 గజాల ఇంటిస్థలం, ఐదెకరాల వ్యవసా య భూమి ఇస్తామని పోలీసు అధికారులు ప్రకటించారు. రెవెన్యూ భూమి కేటాయించి నివేదిక సైతం ఇచ్చారు. కానీ అలాట్మెంట్ చేయలేదు. ఆమె కు టుంబపోషణ కోసం కొమురవెల్లి దేవస్థానం ప్రాంగణంలో కట్టెలు, పూలు అమ్ముకుంటూనే, జనజీవ న స్రవంతిలో తనకు ప్రభుత్వం పునరావాసం కింద ఇస్తానన్న భూమి కోసం ఇంకా పోరాటం సాగి స్తూనే ఉంది. ఈ క్రమంలో వరంగల్ కలెక్టరేట్లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ సెల్కు వచ్చి మరోసారి కలెక్టర్ సత్యశారదకు తన బాధను ఏకరువు పెట్టుకున్నారు. అప్పటి ఉమ్మడి వరంగల్ కలెక్టరేట్ అధికారులు 2012 జూన్ తొమ్మిదిన ఇచ్చిన ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకొని న్యాయం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆమెను ‘సాక్షి’పలకరించగా తన సమస్యను చెప్పుకుంది. ‘అప్పటి చేర్యాల తహసీల్దార్ వెంకటేశ్వర్లు కొమురవెల్లి గ్రామంలో సర్వే నంబర్లు 199, 223లో ప్రభుత్వ భూమి ఉందని 500 గజాల స్థలం కేటాయించారు. ఐదెకరాల వ్యవసాయ భూమి విషయంలోనూ నివేదికిచ్చారు. 2012 నుంచి 2016 వరకు అధికారుల చుట్టూ తిరిగా. మధ్యలో కాలి బుల్లెట్ గాయం తిరగదోడడంతో కొన్ని నెలలు విశ్రాంతి తీసుకున్నా. ఇప్పటికే సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లా. అక్కడా పోలీసులను కలిశా. వారు వరంగల్కు వెళ్లాలని చెబితే మూడు నెలల నుంచి ఇక్కడి ఐదుసార్లు వచ్చా. మూడుమార్లు పోలీసులను కలిశా. రెండుసార్లు వరంగల్ కలెక్టర్ను కలిశా. ఇప్పటికై నా సంబంధిత పత్రాలు నాకు ఇచ్చి భూమి కేటాయించి నా కుటుంబానికి భరోసాను ఇవ్వాలి’అని స్వరూప కన్నీటి పర్యంతమయ్యారు. 13 ఏళ్లుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు తొమ్మిదేళ్లు సీపీఐఎంఎల్ మావోయిస్టుగా కార్యకలాపాలు 2012లోనే లొంగుబాటు, పునరావాసం కింద అందని సహాయం -
లోకోపైలెట్ల సమస్యలు పరిష్కరించాలి
కాజీపేట రూరల్ : రైల్వే లోకోపైలెట్ల సమస్యలు పరిష్కరించాలని రైల్వేమజ్దూర్ యూనియన్ లోకో రన్నింగ్ బ్రాంచ్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మే రకు సోమవారం కాజీపేట రైల్వే క్రూ లాబీ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే రన్నింగ్ స్టాప్ సమస్యలపై రైల్వే బోర్డుతో చర్చలు జరిగాయన్నారు. ఇందుకు రైల్వే బోర్డు మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేసిందని తెలిపారు. అయితే ఆ కమిటీ ఈ నెల 4వ తేదీ న బోర్డుకు సమర్పించిన నివేదిక రన్నింగ్స్టాప్కు వ్యతిరేకంగా ఉందన్నారు. ఆ రిపోర్టును అమలు చేయొద్దని డిమాండ్తో దేశ వ్యాప్తంగా అన్ని క్రూ లాబీల వద్ద చేస్తున్న నిరసనలో భాగంగా కాజీపేట లాబీ వద్ద కూడా నిరసన చేపట్టామని తెలిపారు. బ్రాంచ్ చైర్మన్ సంగ రమేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ సాయికుమార్, రమేశ్, ఎన్.కుమారస్వామి, ఎ.కుమారస్వామి, ఎం. ప్రవీణ్, ధనరాజ్, వలీఅహ్మద్, ఎన్.శ్రీనివాస్, వి.ప్రసాద్, భరత్లోకోశ్, రమణాచారి, ఆంజనేయులు, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు. రైల్వే మజ్దూర్ యూనియన్ నేతల డిమాండ్ -
హనుమకొండ కలెక్టరేట్ పార్కుకు ఉత్తమ అవార్డు
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లోని పార్కుకు రాష్ట్ర ఉద్యానశాఖ ద్వారా నిర్వహించిన 8వ గార్డెన్ ఫెస్టివల్లో ఉత్తమ గార్డెన్గా అవార్డు ల భించినట్లు జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధి కారి వెంకటేశం తెలిపారు. సంబంధిత గోల్డెన్ ట్రో ఫీ, సర్టిఫికెట్ను కలెక్టర్ ప్రావీణ్య అధికారుల సమక్షంలో ప్రదర్శించారు. సుమారు 114 రకాల పూలు, నీడనిచ్చే మొక్కలను నాటి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడమేకాకుండా వాటి రక్షణ చర్యలు చేపడుతూ రాష్ట్రస్థాయి అవార్డు పొందడంపై అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్ ఓ వై.వి గణేష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కరపత్రాల ఆవిష్కరణ.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన వేసవిలో జాగ్రత్తలు (ఎండ వేడి తీవ్రత నుంచి ఉపశమనం, ఉపాయాలు), కృత్రిమ రసాయన శీతల పానీయాలు నివారించాలనే కరపత్రాలను సోమవారం కలెక్టర్ ప్రావీణ్య ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆచార్య లక్ష్మారెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కాజీపేట పురుషోత్తం, ఉపాధ్యక్షులు రాములు, ఉమామహేశ్వర్ రావు, కోశాధికారి పరికిపండ్ల వేణు, కార్యవర్గ సభ్యులు వకుళాభరణం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు నేను వ్యతిరేకం కాదు
ధర్మసాగర్: హనుమకొండ జిల్లాలో ఉన్న ఏకై క అటవీ సంపద దేవునూరు భూములను కా పాడడమే తనలక్ష్యమని, రైతులకు తాను వ్యతిరేకం కాదని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ అధికా రులు రైతులకు సంబంధించిన భూములను ఇనుపరాతి గుట్టలు (దేవనూరు) అడవి సరిహద్దు దాటిన తరువాత చూపించాలని, ఇష్టానుసారంగా అడవి మధ్యలో చూపెట్టడం సరికాదని పేర్కొన్నారు. రై తుల పేరుతో ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు అన్యాయంగా అడవిలోకి చొరబడి అటవీ సంపదను నా శనం చేస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదని, ఈ విషయాన్ని ప్రతీ రైతు గమనించాలని కోరారు. సర్వే పూర్తయింది కానీ, దాని ఫైనల్ రిపోర్ట్ రాలేదని అటవీశాఖ అధికారులు చెప్పారని వెల్లడించారు. ట్రెంచ్(కందకం)దాటి లోపలికి వచ్చి చదు ను చేయడంపై పరిశీలించడానికి వచ్చామని తెలిపా రు. కలెక్టర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనే విషయం తెలుస్తోందని, ఇప్పటికై నా సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం చేస్తూ అటవీ సంపదను కాపాడాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య -
మహేందర్బాబుకు ప్రొఫెషనల్ ఎక్స్లెన్స్ అవార్డు
మహబూబాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని గుమ్మడూరుకు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి సూర్ణపు ముత్తయ్య, సుగుణ దంపతుల కుమారుడు మహేందర్ బాబుకు రైసింగ్ ఇండియా ప్రొఫెషనల్ ఎక్స్లెన్స్ అవార్డు–2025 అందజేశారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్లో సీనియర్ నాన్ కమిషనర్ ఆఫీసర్ హోదాలో దేశానికి చేస్తున్న సేవలను గుర్తించి అతడిని అవార్డుతో సత్కరించారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్ స్పీకర్ హాల్లో ఆదివారం రాత్రి జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో లోక్ సభ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రాజేష్ శర్మ, రక్షణశాఖ అధికారి కమాండర్ జ్ఞానేంద్ర శర్మ వీఎస్ఎం రైసింగ్ ఇండియా ప్రొఫెషనల్ ఎక్స్లెన్స్ అవార్డును మహేందర్ బాబుకు ప్రదానం చేశారు. -
రైతులపై విత్తన భారం
మహబూబాబాద్ రూరల్: కేంద్ర ప్రభుత్వం పత్తి విత్తనాల ధరలు పెంచడంతో రైతులపై భారం పడనుంది. కేంద్ర వ్యవసాయ శాఖ 475 గ్రాముల పత్తి విత్తన ప్యాకెట్ ధరను రూ.901గా నిర్ణయిస్తూ ప్రకటన విడుదల చేసింది. సాగులో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న తాము పెరిగిన విత్తనాల ధరతో మరింత నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది వానాకాలంలో 79,689 మంది రైతులు 83,358 ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా.. ఈ ఏడాది అంతకుమించి సాగు చేస్తారని అంచనా. రైతులపైనే భారం.. కేంద్ర ప్రభుత్వం ఒక్కో పత్తి విత్తన ప్యాకెట్పై రూ.37పెంచింది. గతేడాది పత్తి విత్తన ప్యాకెట్ ధర రూ.864 ఉండగా.. ప్రస్తుతం రూ.901కు చేరింది. ఈమేరకు రైతులపై లక్షలాది రూపాయల భారం పడనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సబ్సిడీ లేకపోవడంతో ప్రైవేటు డీలర్ల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఏకంగా రూ.37 పెంచడంతో కేంద్ర నిర్ణయంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విత్తన ధరల పెంపుతో చిన్న రైతులు కష్టాల్లో పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి విత్తనాలకు సబ్సిడీ ఇచ్చి తాము నష్టపోకుండా చూడాలని, భారం పడకుండా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తక్షణమే ధరలను తగ్గించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులపై ఆర్థిక భారం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో రైతులు నష్టపోవాల్సి వస్తున్నది. ఇప్పటికే పెరిగిన పెట్టుబడులు, ఎరువుల ధరలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు పత్తి విత్తన ప్యాకెట్పై రూ.37పెంచడం అన్యాయం. రైతులపై ఆర్థికభారం పడుతుంది. – బానోత్ బాలోజీ, రైతు, సిరిరాజ్య తండా ఏటేటా పెరుగుతున్న పత్తి విత్తనాల ధరలు 475 గ్రాముల ప్యాకెట్ ధర రూ.901 గతేడాదితో పోలిస్తే రూ.37అదనంపత్తి విత్తనాల ధరల పెరుగుదల ఇలా సంవత్సరం ధర (రూ.లో) 2021 767 2022 810 2023 853 2024 864 2025 901 -
తీరుమారకుంటే ఉద్వాసన తప్పదు
నెహ్రూసెంటర్: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సమయపాలన పాటించని, విధులకు హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వైద్యులు, సిబ్బందికి ఉద్వాసన తప్పదని మానుకోట ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ హెచ్చరించారు. సోమవారం ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... వైద్యులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొంతమంది వరంగల్, ఖమ్మం, ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూ సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని, ఇక్కడ పనిచేయడం ఇష్టంలేని వారు లెటర్ రాసి వెళ్లిపోవచ్చన్నారు. డోర్నకల్, గార్ల, గూడూరు, బయ్యారం, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న రోగులకు వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందడంలేదన్నారు. ఆస్పత్రి వార్డుల్లో సందర్శించి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరాతీశారు. అనంతరం వైద్యులు, సిబ్బంది బయోమెట్రిక్ వివరాలను పరిశీలించి, ఉదయం 24 మంది మాత్రమే విధులకు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా వైద్యులు, సిబ్బంది తమ విధులు సక్రమంగా నిర్వర్తించాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఆర్ఎంఓ జగదీశ్వర్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. జీజీహెచ్ వైద్యుల తీరుపై ఎమ్మెల్యే మురళీనాయక్ ఆగ్రహం -
రాజ్యాంగంపై అవగాహన కల్పించాలి
డోర్నకల్: భారత రాజ్యాంగంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ అన్నారు. మండలంలోని ముల్కలపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహిచారు. ఈ సందర్భంగా రాంచంద్రునాయక్ మాట్లాడుతూ.. రాజ్యాంగం బీఆర్ అంబేడ్కర్, గాంధీ, పూలే లాంటి గొప్పవాళ్ల ఆలోచనలతో కూడిన పవిత్ర గ్రంథమన్నారు. ప్రభుత్వంపై బీఆర్ఎస్ విష ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకులు తిప్పి కొట్టాలని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తేవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్యాదవ్, మండల అధ్యక్షుడు డీఎస్ జగదీష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాసం శేఖర్, మూడు మండలాల ఇన్చార్జ్ కాలం రవీందర్రెడ్డి, నాయకులు ఆంగోత్ వెంకన్ననాయక్, తాళ్లూరి హనుమంతరావు, లాలూనా యక్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. పేదరాలి ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యేదంతాలపల్లి: మండల కేంద్రంలో సోమవారం ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ సన్న బియ్యం సంబురాలు నిర్వహించారు. మండల కేంద్రంలోని బేడబుడిగ కాలనీలో సమ్మక్క ఇంట్లో ప్రభుత్వం పంపిణీ చేసిన సన్న బియ్యంతో వండిన భోజనాన్ని ఆయన అధికారులు, నాయకులతో కలిసి తిన్నారు. -
గవర్నర్ చేతుల మీదుగా జ్ఞాపిక ప్రదానం
చిన్నగూడూరు: మండలంలోని జయ్యారం గ్రామానికి చెందిన వెల్లె శ్రీనివాస్ తయారు చేసిన ‘కిసాన్ రిమోట్’ పరికరానికి గాను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా జ్ఞాపికను అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్లో ‘ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్’, ‘పల్లె సృజన’ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సమ్మేళనంలో తాను తయారు చేసిన ఇన్నోవేషన్(కిసాన్ రిమోట్)ను ప్రదర్శించినందుకు గవర్నర్ శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేసినట్లు శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యంగా విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు ‘కిసాన్ రిమోట్’ పరికరం ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. -
రేపు ఉమ్మడి జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని డీఎస్ఏ బాక్సింగ్ హాల్లో ఈ నెల 8వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి 7వ యూత్ అండర్–19 మెన్ అండ్ ఉమెన్ బాక్సింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ నిర్వహణ కార్యదర్శి పి.రాజేందర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 01, 2007 నుంచి డిసెంబర్ 31, 2008 మధ్యలో జన్మించిన వారు పోటీలకు అర్హులని పేర్కొన్నారు. అర్హత గల క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డు, స్టడీ బోనోఫైడ్ సర్టిఫికెట్, 2 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, రూ.300 ప్రవేశ రుసుం తీసుకుని రావాలని చెప్పారు. క్రీడాకారులు 8న ఉదయం 7గంటలకు హనుమకొండ ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని డీఎస్ఏ బాక్సింగ్ హాల్ వద్ద హాజరైతే వెయింగ్ తీసుకుంటామన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈనెల 11, 12వ తేదీల్లో సికింద్రాబాద్ లాలాపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు 9959711609 నంబర్లో సంప్రదించాలని రాజేందర్ పేర్కొన్నారు. ముగిసిన చదరంగం పోటీలు వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థాన కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి అండర్–19 చదరంగ పోటీలు సాయంత్రం ముగిశాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల హాజరైన 40మంది క్రీడాకారుల మధ్య పోటీలు రసవత్తరంగా కొనసాగాయి. ముగింపు వేడుకలకు టీటీడీ మండప మేనేజర్ రఘువీర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. బాలుర విభాగంలో రిత్విక్ గండు ప్రథమ స్థానం, సాయిజోషిత్ బొల్లం ద్వితీయ స్థానం, అక్షయ్కుమార్ తృతీయ స్థానం, చకిలం చరణ్రాజ్ నాలుగో స్థానంలో నిలిచారు. బాలికల విభాగంలో తోట జాన్వీ, దీపిక బొమ్మిడిని, వర్శిత పటూరి, కై రంకొండ సహస్ర, కోమలి వరుస స్థానాల్లో విజేతలుగా నిలిచినట్లు టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి పి. కన్నా తెలిపారు. విజేతలు సెప్టెంబర్ 20, 21 తేదీల్లో మంచిర్యాలలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో వరంగల్ జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహిస్తారని తెలి పారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆర్బిటర్లు శ్రీని వాస్, ప్రేమ్సాగర్ తదితరులు పాల్గొన్నారు. రైలు పట్టాలపై వ్యక్తి మృతదేహం లభ్యం ఖిలా వరంగల్ : వరంగల్ – కాజీపేట మధ్య శాయంపేట రైల్వే గేట్ సమీపాన రైలు నుంచి జారి పడి గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహం లభ్యమైనట్లు వరంగల్ జీఆర్పీ హెడ్కానిస్టేబు ల్ రాజు ఆదివారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. వరంగల్ హంటర్ రోడ్డులోని శాయంపేట గేట్ సమీపాన గుర్తు తెలియని 35 నుంచి 40 ఏళ్ల వయసు గల వ్యక్తి రైలు నుంచి జారి పడి మృతి చెందాడు. మృతుడు బ్లాక్ కలర్ ప్యాంట్, బ్లాక్ అండ్ వైట్ చెక్స్ పుల్ షర్ట్ఽ, పారగాన్ చప్పల్ ధరించి ఉన్నాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని ఆదివారం ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు తెలిపారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే 9441557232,8712658585 నంబర్లకు కాల్ చేసి సమాచారం అందజేయాలని రాజు కోరారు. -
రాములోరి కల్యాణంలో ఫ్లెక్సీల రగడ
కాశిబుగ్గ ఆలయం వద్ద మంత్రి ఫొటో లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వరంగల్: శ్రీరామనవమిని పురస్కరించుకుని భక్తులకు ఆహ్వానం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై పలువురు ఆరోపణలు చేస్తున్నారు. కాశిబుగ్గలోని సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో కల్యాణోత్సవానికి రూ.8.90 లక్షల నిధులను ప్రభుత్వం నుంచి మంత్రి కొండా సురేఖ మంజూరు చేయించారు. ఆదివారం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో మంత్రి సురేఖ, స్థానిక కార్పొరేటర్తో పాటు అధికార పార్టీకి చెందిన నాయకుల ఫొటోలు పెట్టకపోవడం సరికాదని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. ఆలయంలో జరిగే కార్యక్రమాల్లో సైతం నా యకుల వర్గపోరు బయటపడింది. ప్రభుత్వ నుంచి నిధులు మంజూరైనప్పటికీ దాతల డబ్బులతోనే కల్యాణ ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ బుకీ అరెస్ట్ వరంగల్ క్రైం: ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ బుకీని అరెస్ట్ చేసినట్లు హనుమకొండ ఏసీపీ కొత్త దేవేందర్రెడ్డి తెలిపారు. హనుమకొండ పీఎస్ పరిధిలో ఇటీవల పట్టుకున్న క్రికెట్ బెట్టింగ్ ఏజెంట్లు హైదరాబాద్కు చెందిన చింతపండు కృష్ణ, మెడిశెట్టి నరేశ్తో పాటు ఆటగాళ్లు పులి ఓంకార్, పల్లపు సుకేశ్ను అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 1.58 లక్షలు రికవరీ చేసినట్లు తెలి పారు. వారు క్రికెట్ బుకీ వివరాలు తెలపడంతో కా కినాడకు చెందిన గడ్డం వీరమణి కుమార్ను ఆదివా రం అరెస్ట్ చేసి నిందితుడి నుంచి రూ. 1.50 లక్షల నగదు, 2 సెల్ఫోన్లు, స్వాధీనం చేసుకున్నట్లు ఆయ న పేర్కొన్నారు. హనుమకొండకు చెందిన మరో ఆ టగాడు కితిరి రంజిత్, హైదరాబాద్కు చెందిన బుకీ యోగేశ్ గుప్తా పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. -
డిప్లొమాతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు
పదో తరగతి పూర్తయిన విద్యార్థులు పాలిటెక్నిక్లో సీటు సాధించాలంటే ప్రత్యేక శిక్షణ అవసరం లేదు. పది సిలబస్తోనే ప్రశ్నలు ఉంటాయి. కష్టపడి చదివితే సీటు వస్తుంది. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు త్వరగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు సాధించొచ్చు. ప్రస్తుతం పాలిటెక్నిక్ కోర్సులకు చాలా డిమాండ్ ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలను పాలిటెక్నిక్ కోర్సులో చేర్పించి చదివిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. – బైరి ప్రభాకర్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వరంగల్ -
రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్తపల్లి రవి
నెహ్రూసెంటర్: తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ అనుబంధ) రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్తపల్లి రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల నారాయణపేట జిల్లాలో జరిగిన సంఘం రాష్ట్ర మహాసభల్లో ఎన్నికై నట్లు రవి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన ఎన్నికకు కృషి చేసిన సంఘం జాతీయ, రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ముగిసిన వసంత నవరాత్రోత్సవాలు హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో జరుగుతున్న వసంత నవరాత్ర ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఇందులో భాగంగా లిల్లీపూలతో అమ్మవారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు అమ్మవారికి పూర్ణాభిషేకం, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం వేదపండితులు, వేదపాఠశాల విద్యార్థులు లిల్లీపూలకు సంప్రోక్షణ నిర్వహించి వాటితో అమ్మవారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. పుష్పార్చన కార్యక్రమానికి ఓదెల సంపత్ ఉభయదాతలుగా వ్యవహరించారు. రాత్రి 8గంటలకు సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈఓ శేషుభారతి, దేవాలయ సిబ్బంది పర్యవేక్షించారు. -
గెట్టు పైనుంచి నడుస్తూ..
నర్సింహులపేట: గెట్టు పైనుంచి నడిచి వెళ్తున్న క్రమంలో పొలంలో జారి పడి ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం వెలుగు చూసింది. మండలంలోని పడమటిగూడెం శివారు బస్తారాం తండాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన గుగులోత్ సిరి(40) మూడు రోజుల క్రితం వివాహ వేడుకకు హాజరయ్యాడు. అనంతరం మద్యం తాగి పొలం వద్దకు వెళ్లాడు. ఇక్కడ గెట్టు ఒరం జారి పొలంలో పడి మృతి చెందాడు. ఇంతకు ముందు పలుమార్లు మద్యం తాగి 2,3 రోజుల అనంతరం ఇంటికి వచ్చేవాడు. ఇదే మాదిరి ఏదో ప్రాంతానికి వెళ్లాడని కుటుంబసభ్యులు భావించారు. ఈక్రమంలో ఆదివారం సాయింత్రం చుట్టుపక్కల రైతులకు దుర్వాసన రావడంతో చూశారు. సిరి మృతి చెంది కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇన్చార్జ్ ఎస్సై రాజు, నర్సింహులపేట ఏఎస్సై కె.వెంకన్న ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి భార్య విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.● పొలంలో పడి రైతు మృతి ● బస్తారాం తండాలో ఆలస్యంగా వెలుగులోకి ఘటన.. -
పండగ వేళ విషాదం..
హసన్పర్తి: పండగ వేళ విషాదం చోటుచేసుకుంది. స్నేహితురాలితో కలిసి బైక్పై దైవదర్శనానికి వెళ్తుండగా టాటా ఏస్ ఢీకొనడంతో ఓ విద్యార్థి దుర్మరణం చెందాడు. బైక్ వెనుక కూర్చున్న విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారి హసన్పర్తి నల్లగట్టుగుట్ట సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావుపేటకు చెందిన రామటెంకి శ్రవణ్ కుమారుడు ఉదయ్(18) ఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాలలో బి.టెక్ చదువుతున్నారు. ప్రస్తుతం అన్నాసాగరంలో అద్దెకుంటున్నాడు. స్నేహితురాలితో కలిసి దైవదర్శనానికి.. శ్రీరామ నవమి పండగ సందర్భంగా ఆదివారం భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి అదే కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న రజితతో కలిసి బైక్పై అన్నాసాగరం నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలో హసన్పర్తి మండల కేంద్రంలోని నల్లగట్టు గుట్ట సమీపంలో చేరగానే హనుమకొండ నుంచి ఎల్కతుర్తి వైపునకు వస్తున్న ఓ టాటా ఏస్.. బస్సును అనుసరిస్తూ ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో ఉదయ్, రజిత తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎౖస్సై దేవేందర్ ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను 108లో ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ ఉదయ్ మృతి చెందాడు. మృతుడి తండ్రి శ్రవణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దేవేందర్ తెలిపారు. ఇల్లందలో కారు ఢీకొని వ్యక్తి.. వర్ధన్నపేట: కారు ఢీకొనడంతో సైకిల్పై వెళ్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని ఇల్లందలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఇల్లంద గ్రామానికి చెందిన సాతుపెల్లి ఎల్లయ్య(52) పాత ఇనుప సామాను కొనుగోలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం వర్ధన్నపేటలో సామాను కొనుగోలు చేసిన అనంతరం అక్కడే విక్రయించి సైకిల్పై తిరి గి తన ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఇల్లంద స మీపంలో వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై వెనుక నుంచి వరంగల్ వైపునకు వెళ్తున్న కారు అదుపు తప్పి సైకిల్ను ఢీకొంది. దీంతో ఎల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సైకిల్.. కారు ముందు భాగంలోని బంపర్లో ఇరుక్కుపోయింది. అయినా డ్రైవర్ అదే వేగంతో ఆపకుండా వెళ్లగా కుమ్మరిగూడెం క్రాస్ వద్ద బంపర్ నుంచి సైకిల్ కిందపడింది. గ్రామస్తులు ఈ సమాచారం తమ సన్నిహితులకు అందించగా రంగశాయిపేట వాటర్ ట్యాంక్ సమీపంలో కారు ఆపగా డ్రైవర్ దిగి పరారైనట్లు స్థానికులు తెలిపారు. మృతుడి చిన్న కుమారుడు దినేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.దైవదర్శనానికి వెళ్తూ విద్యార్థి దుర్మరణం బైక్ను ఢీకొన్న టాటా ఏస్ నల్లగట్టుగుట్ట సమీపంలో ఘటన -
తెలంగాణలో బీజేపీదే అధికారం
మహబూబాబాబాద్ అర్బన్: తెలంగాణలో 2029 ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు వల్ల భు వెంకటేశ్వర్లు ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం బీజేపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా వల్లభు వెంకటేశ్వర్లు హాజరై పండిత్ దీన్ దయాళ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. 1980 ఏప్రిల్ 6న భారతీయ జనాతా పార్టీ ఆవిర్భవించిందని, నేడు ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు కలిగిన పార్టీ బీజేపీ అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఒద్దిరాజు రామచందర్రావు, యాప సీతయ్య, కౌన్సిల్ సభ్యుడు శ్యామ్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి చీకటి మహేశ్గౌడ్, పార్లమెంట్ కో కన్వీనర్ సతీష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు గడ్డం అశోక్, పొదిళ్ల నర్సింహరెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెన్నమల్ల అజయ్, జిల్లా అధికార ప్రతినిధి ఇందూభారతి, జిల్లా నాయకులు పద్మ, సంపత్, హుస్సేన్, బాలునాయక్, పల్లె సందీప్, నరేశ్నాయక్, గోవర్ధన్, కోటినాయక్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు -
పాఠశాలల స్థలాలు కబ్జా
● ప్రహరీలు లేకపోవడంతో ఆక్రమణకు గురవుతున్న జాగాలు ● పాఠశాల ఆవరణ నుంచే వాహనాల రాకపోకలు ● ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, సిబ్బందిమహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు మండలాలు, గ్రామాల్లో పాఠశాలల స్థలాల ను ఆక్రమిస్తున్నారు. ప్రహరీలు లేకపోవడంతో పా ఠశాలల చుట్టూ నివాసం ఉంటున్న వారు కబ్జాచేసి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని కంకరబోడ్ జెడ్పీహెచ్ఎస్ స్థలాన్ని చుట్టుపక్కల వారు ఆక్రమించారని పాఠశాల ఉపాధ్యాయులు వాపోతున్నారు. ప్రహరీలు లేక.. జిల్లాలో 121 ప్రాథమిక పాఠశాలలు, 678 ప్రాథమికోన్నత, 102 ఉన్నత పాఠశాలల ఉన్నాయి. ఇందులో 441 పాఠశాలలకు ప్రహరీలు లేక నిత్యం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా మానుకోట మున్సిపల్ పరిధిలోని ఈదులపూసపల్లి జెడ్పీహెచ్ఎస్, శనిగపురం పాఠశాలలకు ప్రహరీలు లేవు. దీంతో పాఠశాలల ఆవరణల్లో పశువులు, పందులు, కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. అదేవిధంగా పలు వాహనాల రాకపోకలు సాగిస్తున్నారు. ఈమేరకు కంకరబోడ్ హైస్కూ ల్లో వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా.. రహదారి బంద్ చేశామని బోర్డులు, అడ్డుగా పైపులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ వాహనాల రాకపోలు ఆగకపోవడంతో విద్యార్థులు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా పాఠశాలలకు ప్రహరీలు లేకపోవడంతో ఆవరణలోకి విష సర్పాలు వస్తుండడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. అలాగే పాఠశాలలు అసాంఘిక కార్యకలాపాలను అడ్డాగా మారుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. జిల్లా కేంద్రం నడిబొడ్డున.. జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న కంకరబోడ్ స్కూల్ స్థలం కబ్జాకు గురవుతుందని ఆ పాఠశాల హెచ్ఎం, విద్యార్థి సంఘాలు గతంలో ఆందోళనకు దిగి డీఈఓ, కలెక్టర్కు వినతి పత్రాలు కూడా అందజేశా రు. 4ఎకరాల 3 గుంటల స్థలం ఉండాలి. ప్రస్తుతం 2ఎకరాల 13 గుంటలు మాత్రమే ఉంది. అందులో కూడా పాఠశాల అనుమతి లేకుండానే మిషన్ భగీరథ వాటర్ ట్యాక్ నిర్మించారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పాఠశాలలకు ప్రహరీలు మంజూరు అయ్యేలా కృషి చేయాలని పలువురు విద్యావంతులు కోరుతున్నారు. -
విద్యావేత్త కాసం అంజయ్య మృతి
జనగామ: ప్రముఖ విద్యావేత్త, పూర్వ లయన్ జిల్లా గవర్నర్ కాసం అంజయ్య(80) ఆదివారం మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్ది రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయనకు ముగ్గురు సోదరులు, ఒక కుమారుడు ఉన్నారు. అంజయ్య మరణ వార్తతో విశ్వ విద్యాలయాలు, కళాశాలల ఫ్రొఫెసర్లు, అధ్యాపకులు, లయన్ ప్రముఖులు అంతిమ వీడ్కోలుకు తరలివచ్చారు. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన కాసం అంజయ్య ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి వాణిజ్య శాస్త్రంలో పట్టభద్రులయ్యారు. 1966లో వరంగల్ సీకేఎం కళాశాలలో అసిస్టెంట్ లెక్చరర్గా అధ్యాపక వృత్తి ప్రారంభించి.. కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేశారు. 1976లో లయన్స్ అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థను జనగామలో స్థాపించి వ్యవస్థపాక కార్యదర్శిగా పని చేశారు. 1989లో జిల్లా గవర్నర్ పదవి చేపట్టారు. ఆయన మార్గదర్శనంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో లయన్స్ క్లబ్లు విస్తరించాయి. ప్రిన్సిపాల్గా పని చేస్తున్న 1975 సమయంలో జనగామలో ఏర్పాటు చేసిన ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వ్యవస్థాపక ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టారు. రెండు దశాబ్దాలకు పైగా పని చేసిన ఆయన 2001లో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా పదవీ విరమణ పొందారు. ఆవోపా సంస్థ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి అనతి కాలంలోనే రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కేయూ మాజీ వీసీ, ప్రముఖుల నివాళిఅంతిమ వీడ్కోలుకు ప్రముఖులు అంజయ్య అంతిమ వీడ్కోలుకు అనేక ప్రాంతాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వీసీ ప్రొఫెసర్ వి.గోపాల్రెడ్డి, పూర్వ ఆచార్యులు టి.సుధాకర్ రెడ్ది, రమణయ్య, శంకరయ్య, పూర్వ ఇంటర్నేషనల్ డైరెక్టర్ రుమాల్ల సునీల్కుమార్, మల్టీపుల్ కౌన్సిల్ మాజీ చైర్మన్లు ఎం.విద్యాసాగర్రెడ్డి, తీగల మోహన్రావు, లయన్ పూర్వ జిల్లా గవర్నర్ కన్న పరశురాములు, కుందూరు వెంకట్రెడ్డి, చంద్ర శేఖర్ ఆర్య, ఎన్.సుధాకర్రెడ్ది, పి.హరికిషన్రెడ్డి, కె.గోవింద్రాజ్, వెంకటేశ్వరరావు, కె.సి.జాన్ బన్నీ, ముచ్చ రాజిరెడ్ది, టి.లక్ష్మీనరసింహరావు, రాజేందర్రెడ్డి, సత్యనారాయణ, ప్రతాప్ రెడ్డి, అల్లాడి ఈశ్వర్రావు, ప్రభాకర్రావు, కుర్రెముల యాదగిరి, నాగబండి రవీందర్, డాక్టర్ రాజమౌళి తదితరులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. -
ఏఆర్లకు డిప్యూటీ రిజిస్ట్రార్లుగా పదోన్నతి కల్పనేది?
కాకతీయ యూనివర్సిటీలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్లలో అర్హులకు డిప్యూటీ రిజిస్ట్రార్లుగా పదోన్నతి కల్పించాల్సింది. అయితే ఆరేళ్లుగా పదోన్నతి కల్పించడం లేదు.దీంతో డిప్యూటీ రిజిస్ట్రార్ల పోస్టులు వెకేన్సీలుగా మిగిలిపోయాయి. కేయూలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు 16 మంజూరు ఉన్నాయి. రెండు వెకేన్సీలుగా ఉండగా అందులో 14మంది పనిచేస్తున్నారు. ఇందులో ఒకరు ఏసీబీకి పట్టుబడి సస్పెన్షన్లో ఉన్నారు. మరొ అసిస్టెంట్ రిజిస్ట్రార్ తన ఇల్లు యూనివర్సిటీ భూమిలో ఉండడంతో ఆయన కూడా సస్పెన్షన్లో ఉన్నారు. ఇంకొ మహిళా ఏఆర్ స్వచ్ఛంద విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఇక 11మంది అసిస్టెంట్ రిజిస్ట్రార్లు పనిచేస్తున్నారు. -
నేటి నుంచి ‘పది’ మూల్యాంకనం
విద్యారణ్యపురి : పదోతరగతి వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం నేటినుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా హనుమకొండలోని కాజీపేట ఫాతిమా హైస్కూల్లో జవాబుపత్రాల మూల్యాంకనం చేసేందుకు జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక్కడికి తీసుకొచ్చిన పదోతరగతి జవాబు పత్రాల కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియ ఆదివారం సాయంత్రం పూర్తయింది. ఉమ్మడి జిల్లా నుంచి జవాబు పత్రాల రాక ఉమ్మడి వరంగల్లోని హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల టెన్త్ స్పాట్ కేంద్రాన్ని హనుమకొండలో ఏర్పాటు చేశారు. టెన్త్ సబ్జెక్టు పరీక్షల జవాబు పత్రాలన్నీ కలిపి 2,27,864 ఈ కేంద్రానికి తీసుకొచ్చారు. ఈ స్పాట్ కేంద్రానికి క్యాంప్ ఆఫీసర్గా హనుమకొండ జిల్లా డీఈఓ డి.వాసంతి వ్యవహరిస్తున్నారు. సీఈలు, ఏఈలు 741, స్పెషల్ అసిస్టెంట్లు 216 మంది.. పదో తరగతి మూల్యాంకనానికి ఆరు జిల్లాలోని ఆయా సబ్జెక్టుల స్కూల్ అసిస్టెంట్లకు, సీఈలుగా, ఏఈలు గాను టీచర్లకు సీనియారిటీ ప్రకారం నియామక ఉత్తర్వులు పంపారు. జవాబు పత్రాలు వాల్యుయేషన్ చేసే టీచర్లు కనీసం మూడేళ్లు ఆయా సబ్జెక్టులో విద్యాబోధన చేసి ఉండాల్సిందే. రోజుకు చీఫ్ ఎగ్జామినర్లుగా (సీఈ)లుగా 108 మంది, అసిస్టెంట్ ఎగ్జామినర్లుగా (ఏఈ)లుగా 633 మంది మొత్తం 741 మంది స్కూల్ అసిస్టెంట్లను నియమించారు. స్పెషల్ అసిస్టెంట్లుగా సెకండరీ గ్రేడ్ టీచర్లను (ఎస్జీటీ) 216 మందిని నియమించారు. మొత్తం 957మంది టీచర్లు స్పాట్ విధులు నిర్వహించనున్నారు. నేడు ఉదయం రిపోర్టు చేయాలి.. కాజీపేటలోని టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి ఆయా టీచ ర్లు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. రోజుకు ఒక్కొ టీ చర్ 40 జవాబు పత్రాలు వాల్యుయేషన్ చేయాలి. రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6గంటల వ రకు విధుల్లో ఉంటారు. స్పాట్ విధుల ఉత్తర్వులు అందుకున్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా విధుల్లో పాల్గొనాలని, గైర్హాజర్ టీచర్లపై చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఫాతిమా హైస్కూల్లో స్పాట్ కేంద్రం 2,27,864 జవాబు పత్రాల రాక స్పాట్ విధులకు 957 మంది టీచర్లు సీనియారిటీ ప్రకారం 6 జిల్లాల వారికి విధులు గతేడాది రెమ్యునరేషన్ విడుదలగతేడాది రెమ్యునరేషన్ విడుదల! గతేడాది ఏప్రిల్లో టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ విధులు నిర్వర్తించిన టీచర్లకు ఇతర సిబ్బందికి రెమ్యునరేషన్ రూ.59 లక్షలకు పైగా ఇటీవలే జిల్లా విద్యాశాఖకు విడుదల అయ్యాయి. అయితే గతేడాది టెన్త్ స్పాట్ విధుల్లో పాల్గొన్న టీచర్లు, ఇతర సిబ్బంది మొత్తం 1.072 మందికి కూడా మూడ్రోజుల క్రితం వారి అకౌంట్లలోనికి రెమ్యూనరేషన్ను విడుదల చేశారని సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. -
వల్మిడి ఆలయంలో భక్తులకు గాయాలు
● గాలి దుమారంతో కూలిన టెంటుపాలకుర్తి టౌన్: మండలంలోని వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో అప్రశుతి చోటు చేసుకుంది. ఒక్కసారిగా సుడి గాలి దుమారం రావడంతో భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదానం వద్ద టెంట్లు కూలాయి. దీంతో భక్తులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. అక్కడే ఉన్న వల్మిడికి చెందిన వృద్ధురాలు వాసూరి మారమ్మ, చెన్నూరుకు చెందిన బాలిక మారేపల్లి మనుశ్రీ, గంట్లకుంటకు చెందిన సంధ్యారాణి గాయపడ్డారు. వారికి ఆలయంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో ప్రథమ చికిత్స చేశారు. మానుకోటలో సూర్యాపేట పోలీసుల విచారణమహబూబాబాద్ రూరల్: సూర్యాపేట జిల్లాలో జరిగిన ఓ హత్య కేసు విషయంలో అక్కడి పోలీసులు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆ దివారం రాత్రి విచారణ చేపట్టారు. నిందితులు సూర్యాపేటలో హత్య చేసి, వారు వాడిన ద్విచక్రవాహనాలు, సెల్ఫోన్లను మహబూబాబాద్లో ఉంచి వెళ్లినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మూడు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ ఫోన్లను కొత్త కూరగాయల మార్కెట్ ఆవరణలో ఉంచి వెళ్లగా సూర్యాపేట పోలీసులు స్వాధీనం చేసుకుని తమవెంట తీసుకెళ్లారు. హత్య కేసులో మహబూబాబాద్లోని ఓ మెడికల్ షాపు నిర్వాహకుడి బంధువు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. -
పెండింగ్ డీఏలు విడుదల చేయాలి
మహబూబాబాద్ అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో ఆదివారం జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవీ విరమణ పొందిన ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షన్ బెనిఫిట్స్ విడుదల కావడం లేదన్నారు. మొదటి పీఆర్సీ గడువు జూలై 2023లో ముగిసినప్పటికీ నేటికి పీఆర్సీ నివేదికను తెప్పించుకొని వేతనాలను సవరించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు చాప దొరబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, జిల్లా నాయకులు భాస్కర్, దేవేందర్రాజు, లక్ష్మయ్య, సునీత, తిరుమలేశ్, మాధవ్, శ్రీనివాస్ , భీముడు, రాజు, నిర్మల, ఉపేందర్, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. లింగారెడ్డి -
ఎదురుచూపులు ఎన్నాళ్లు?
సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వం పేదలకు సరఫరా చేసే బియ్యం ఇప్పుడు సన్న బియ్యం కావడంతో రేషన్ తీసుకునే వారి సంఖ్య పెరిగింది. ఇంతకు ముందు ఇచ్చే దొడ్డు బియ్యం సగానికి పైగా లబ్ధిదా రులు తినకపోవడం.. తీసుకున్న బియ్యం టిఫిన్ల కోసం వినియోగించేవారు. తినడానికి పనికి రాని బియ్యంకోసం ఏం ఆశపడుతామని మౌనంగా ఉన్న కార్డులేని వారు.. సన్న బియ్యం ఇవ్వడంతో తమకు కార్డు ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తున్నారు. నాయకులు, అధికారుల చుట్టూ తిరుగుతూ.. తమ కు కార్డు ఇప్పించాలని కోరుతున్నారు. జిల్లాలో 2.40 లక్షల కార్డులు రేషన్ బియ్యం, పేదరికానికి రుజువుగా కార్యాలయాలు, ఆస్పత్రుల్లో చూపించేవి తెల్ల రేషన్ కార్డులు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న కార్డులు జిల్లాలో ఇప్పటి వరకు అంత్యోదయ కార్డులు 16,792, ఫుడ్ సెక్యూరిటీ కార్డులు 2,23,749, ఏఏపీ కార్డులు మొత్తం 2,40,543 ఉన్నాయి. ఈ కార్డుల్లోని సభ్యులు మొత్తం 7,20,427 మంది ఉండగా అంత్యోదయ కార్డుకు 35 కేజీలు, ఇతర కార్డుల్లోని సభ్యులకు నెలకు ఒక్కొక్కరికి ఆరు కేజీల చొప్పున బియ్యం ఇస్తారు. అయితే రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఒకసారి కార్డులు ఇచ్చిన ప్రభుత్వం తర్వాత ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తుల్లో గ్రామానికి ఒకటి రెండు చొప్పున జిల్లాలో వెయ్యి కార్డులు మొక్కుబడిగా ఇచ్చారు. అయితే మిగిలిన దరఖాస్తుదారులు కొత్త కార్డులకోసం ఎదురుచూస్తున్నారు. ప్రజాపాలనలో 1.20 లక్షల దరఖాస్తులు సంక్షేమ పథకాల అమలుకోసం ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డులు, పాత కార్డుల్లో చేర్పులు, మార్పుల కోసం 1.20 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇందులో అనర్హులు, ఇంతకుముందు కార్డులు ఉన్నవారు, ఇతర కార్డుల్లో పేర్లు ఉన్నవారు ఇలా మొత్తం 87 వేల దరఖాస్తులను ఏరివేశారు. మిగతా 33వేల దరఖాస్తులపై విచారణ చేసి కొత్త కార్డులు మంజూరు చేయాల్సి ఉంది. అదే విధంగా పేర్లు చేర్పులకోసం వచ్చిన దరఖాస్తుల్లో 28,274 రాగా పరిశీలించిన అధికారులు కొత్తగా 41,946 మందిని చేర్చే అవకాశం ఉందని లెక్కించారు. కానీ ఇంకా చేర్చలేదు. దీంతో ఇంట్లో ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ఉంటే ఇద్దరికి మాత్రమే రేషన్ వస్తుంది. అర్హులుగా పేర్కొన్న దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా తహసీల్దార్ ఫోల్డర్కు కొట్టి రెవెన్యూశాఖ ద్వారా క్షేత్ర స్థాయిలో విచారణ చేయించి కొత్త కార్డులు మంజూరు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ త్వరగా చేపట్టి అర్హులైన వారికి కొత్త కార్డుల మంజూరుతోపాటు, పిల్లల పేర్లు కార్డుల్లో చేర్చాలని నిరుపేదలు కోరుతున్నారు. జిల్లాలో మొత్తం తెల్లరేషన్ కార్డులు : 2,40,543యూనిట్లు (సభ్యులు) : 7,20,427నెలవారీగా సరఫరా చేసే బియ్యం : 46,021 మెట్రిక్ టన్నులు ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డులకోసం వచ్చిన దరఖాస్తులు : 1.20 లక్షలు అనర్హులుగా తేల్చినవి : 37 వేలు కొత్త కార్డుల కోసం అర్హులు : 33 వేలు రేషన్కార్డు లేక.. సన్నబియ్యం రాక.. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తుండటంతో కొత్త కార్డు కోసం పెరిగిన డిమాండ్ త్వరలో కొత్త రేషన్కార్డులు ఇస్తామంటున్న అధికారులు -
నేడు రాములోరి కల్యాణం
మహబూబాబాద్ రూరల్: సర్వజగత్ రక్షకుడైన శ్రీమన్నారాయణుడు లోక కల్యాణార్థం శ్రీరాము డి అవతారమెత్తి, భక్తుల కోరిక మేరకు కర్తవ్య నిర్వహణ చేసి, ధర్మ పరిపాలన అందించి ప్రజల మన్ననలు పొందారు. మర్యాదపురుషోత్తముడు అయిన శ్రీరామచంద్రమూర్తి పుట్టిన రోజున ప్రతీ ఏడాది శ్రీరామ నవమి పేరుతో సీతారాముల కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. శ్రీరామ నవమిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని గాంధీపార్కు ఎదు ట శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని నేడు (ఆదివారం) వైభవంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ బాధ్యులు చౌడవరపు మోహన్రావు, ఓంనారాయణలోయ, డాక్టర్ వై.ఇంద్రసేనారెడ్డి, పల్ల పోతుల లక్ష్మినా రాయణ, పద్మం ప్రవీణ్ కుమార్ శనివారం తెలి పారు. బ్రహ్మశ్రీ గుడి రాధాకృష్ణమూర్తి, ఆలయ ప్రధాన అర్చకులు ఎంవీ. కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో రాములోరి కల్యాణం జరుగుతుందన్నారు. అదేవిధంగా శ్రీవేణుగోపాలస్వామి వారి దేవాల యం, హన్మంతునిగడ్డ హనుమాన్ దేవాలయ ప్రాంగణం, రామచంద్రాపురం కాలనీలోని శ్రీరా మమందిరం, పట్టణ శివారులోని సాలార్తండా, ముడుపుగల్ గ్రామంలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం (గోవింద క్షేత్రం), శనిగపురం గ్రామంలోని శ్రీరామాలయంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాలు జరుగుతాయని ఆయా ఉత్సవ కమిటీల బాధ్యులు తెలిపారు. -
రావి ఆకుపై సీతారాముల చిత్రాలు
కేసముద్రం: శ్రీరామ నవమి సందర్భంగా ఇనుగుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలకు చెందిన కె.అమూల్య(9వ తరగతి) అనే విద్యార్థిని రావి ఆకులపై సీతారాముల చిత్రాలను శనివారం మలిచింది. అదేవిధంగా సుద్దముక్కపై జై శ్రీరాం అని ఇంగ్లిష్ అక్షరాలను చెక్కి తన సూక్ష్మ కళతో దైవ భక్తిని చాటుకుంది. ఆమె ప్రతిభను చూసి పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు..● ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ ● మార్కెట్లో తడిసిన మిర్చి బస్తాల పరిశీలన మహబూబాబాద్ రూరల్: రైతులు తీసుకువచ్చిన పంట ఉత్పతుల క్రయవిక్రయాల విషయంలో వ్యాపారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ను వారు శనివారం సందర్శించారు. గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిచిన మిర్చి బస్తాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు తీసుకువచ్చిన ఉత్పత్తులు వెంటనే ఖరీదు చేసి కాంటాలు అయ్యేలా చూడాలని, వ్యాపారులు నిర్లక్షం వహించొద్దని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ యార్డు స్థలం రైతుల అవసరాల మేరకు సరిపోవటంలేదని, కొత్తగా మరో కవర్ షెడ్డు నిర్మాణానికి సహకరించాలని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ నాయక్ వారి దృష్టికి తీసుకువెళ్లారు. మరమ్మతు పనులు షురూమహబూబాబాద్: పార్క్లు, ఓపెన్ జిమ్లో పాడైన వస్తువులు, ఆట వస్తువులను మరమ్మతు చేయిస్తామని కమిషనర్ నోముల రవీందర్ అన్నారు. మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని పార్కులు, ఓపెన్ జిమ్లో నిర్వాహణ లేక చెత్తాచెదారంతో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. దీంతో ఈనెల 5న సాక్షిలో ‘ఆహ్లాదం..అంతంతే’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం విధితమే. దీంతో కమిషనర్ రవీందర్ స్పందించారు. వెంటనే పార్క్లు, ఓపెన్ జిమ్లను శుభ్రం చేయడంతో పాటు మరమ్మతు పనులు చేపట్టాలని సానిటరీ ఇన్స్పెక్టర్ కరుణాకర్ను ఆదేశించారు. కాగా వెంటనే కరుణాకర్ పారిశుద్ధ్య కార్మికులతో ఇందిరా గ్రౌండ్లోని త్రివర్ణ పార్క్లో శుభ్రం చేయడం, జిమ్కు సంబంధించిన మ్యాట్లను సరిచేయడం, తదితర పనులు చేయించారు. ఎన్జీఓఎస్కాలనీలోని పార్క్లో, జిమ్లో సిబ్బంది పిచ్చిమొక్కలు తొలగించడంతో పాటు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ జనరల్ ఫండ్ నుంచి నిధులు కేటాయించి పూర్తిస్థాయిలో మరమ్మతు పనులు చేయిస్తామన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని మొక్కలు ఎండిపోకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు. కాగా సాక్షి కథనంతోనే అధికారులు, కార్మికులు స్పందించి పనులు చేపట్టారని, సాక్షికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.అమూల్య -
మహోన్నత వ్యక్తి జగ్జీవన్రామ్
మహబూబాబాద్ అర్బన్: మహోన్నత వ్యక్తి బాబు జగ్జీవన్రామ్ అని, ఆయనను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో బాబు జగ్జీవన్రామ్ 118 జయంతి పురస్కరించుకొని శనివారం జగ్జీవన్రామ్ విగ్రహానికి ఎమ్మెల్యేలు డాక్టర్ జాటోతు రామచంద్రునాయక్,డాక్టర్ భూక్య మురళీనాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, పలు ప్రజా, కుల సంఘాల, పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామచంద్రునాయక్ మాట్లాడుతూ.. దళిత వర్గాల పెన్నిది, సమతావాది డాక్టర్ బాబు జగ్జీవన్రావు ఆఽశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవన నిర్మాణానికి ఇద్దరు ఎమ్మెల్యేలు సహకరిస్తామన్నారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, మాట్లాడుతూ బ డుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జగ్జీవన్రామ్ అని కొనియాడారు. మహానీయుల బాటలో విద్యార్థులు నడుచుకుని కష్టపడి చదుకోవాలని ఎమ్మెల్సీ రవీందర్రావు అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అడిషనల్ కలెక్టర్ లెలిన్ వత్సల్ టొప్పొ, షెడ్యూల్ కులాల అధికారి బి.నరసింహస్వామి, వివిధ కుల, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో.. మహబూబాబాద్: కలెక్టర్ కార్యాలయంలోని ప్రధా న సమావేశ మందిరంలో శనివారం మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ 118వ జయంతిని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్ మాట్లాడుతూ జగ్జీవన్రామ్ ఆశయ సాధనకు పాటుపడాలన్నారు. అసమానతలను రూపుమాపేందుకు ప్రతిఒక్కరూ బాధ్యత తీసుకో వాలని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ అ న్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు,అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొ ప్పో, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి నర్సింహస్వామి, డీపీఓ హరిప్రసాద్, జిల్లా అధికారులు, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ జిల్లాలో ఘనంగా 118వ జయంతి నివాళులర్పించిన కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కుల సంఘాల నాయకులు -
సరస్వతీ పుష్కరాల్లో ‘జ్ఞానతీర్థం’ శోభ
కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మే 15 నుంచి 26 వరకు జరగనున్న సరస్వతీ పుష్కరాల్లో జ్ఞానతీర్థం (ఆహ్వాన విగ్రహం) ఏర్పాటు చేయనున్నారు. పుష్కరాల అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25కోట్ల నిధులు మంజూరు చేసి విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారమాయ్యర్ పలుమార్లు సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలతో పనులు ఊపందుకున్నాయి. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక దృష్టి సారించడంతో పనుల్లో వేగం పెరిగింది. సరస్వతీ పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం రూ.20లక్షలతో ‘జ్ఞానతీర్థం’ ఎఫ్ఆర్పీ ఫైబర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తాళపత్ర గ్రంథాలతో రెండు చేతుల్లో దీపం వెలిగి ప్రకాశించేలా ఫైబర్ విగ్రహం నిర్మాణం చేయనున్నారు. దీని నమూనా చిత్రాలను అర్కిటెక్ట్లు, ఇంజనీర్లు తయారు చేశారు. ఈ విగ్రహం ఉద్దేశం ఏమిటంటే..పూర్వం కాకి నదిలో స్నానం చేసి హంసలాగా మారి జ్ఞానం పొందింది. అలా ఇక్కడి నదిలో స్నానం చేసిన భక్తులు జ్ఞానాన్ని పొందుతారని సారంశంగా, భక్తులను ఆహ్వానించేలా ఉండే విధంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయవర్గాలు తెలిపారు. అదేవిధంగా జ్ఞానతీర్థం (వీఐపీ) ఘాటు రెయిలింగ్ను కాకి, హంస, మకరం చిత్రాలను రాతిపై చెక్కి అమర్చనున్నారు. పుష్కర ఘాటుకు కాకి, హంస, మకర చిత్రాలతో కూడిన రాయి రెయిలింగ్ -
ఆదివారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
● ‘కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని అమీనాపురం గ్రామానికి చెందిన బట్టు రవితే జ, నీల దంపతులకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతులకు కుమార్తె ఉంది. రేషన్ కార్డు కోసం దంపతులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ నేటి వరకు కార్డు రాలేదు. దీంతో గత ప్రభుత్వ హయాంలో బీసీ లోన్, ప్రస్తుతం రాజీవ్ యువ వికాసం పథకానికి, ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు చేసుకోకుండా అయింది. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి అందాల్సిన అనేక పథకాలు దూరం కావాల్సి వచ్చింది.’ న్యూస్రీల్