
రేణుకకు అశ్రునయనాలతో వీడ్కోలు
దేవరుప్పుల : దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు గుమ్ముడవెల్లి రేణుక అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. బుధవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలో దొడ్డి కొమురయ్య స్మారక స్తూపం వద్ద సందర్శనార్థం రేణుక మృతదేహం ఉంచగా పలువురు ఘన నివాళులర్పించారు. ఉదయం 12. 33 నిమిషాలకు ప్రారంభమైన అంతిమయాత్ర సాయంత్రం 4.44 నిమిషాల వరకు కొనసాగింది. ఆట,పాట, డప్పుళ్లతో కడవెండి వీధులు దద్దరిల్లాయి. ఆదివాసీ ఐక్య వేదిక, అమరుల బంధుమిత్రులు తదితర కమిటీలు ‘ఆపరేషన్ కగార్’ సత్వరమే ఆపేయాలని ప్లెక్సీల ప్రదర్శనతో డిమాండ్ చేశాయి.
ప్రజాసంఘాల ఘన నివాళి..
రేణుక మృతదేహానికి అమరవీరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షురాలు పద్మ కుమారి, పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, నారాయణరావు, వీక్షణం సంపాదకులు ఎన్. వేణుగోపాల్, శాంతక్క, విరసం నాయకుడు పాణి, తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకులు రవి చందర్, బి రమాదేవి, చైతన్య మహిళా సంఘం నాయకురాలు అనురాధ, కళ, మొగిలిచర్ల భారతక్క, గాజర్ల అశోక్ అలియాస్ ఐతు, ఉస్మానియ యూనివర్సిటీ నాయకులు పృథ్వీ, స్టాలిన్, డీటీఎఫ్ నాయకులు సుదర్శన్, ఇప్ప రాంరెడ్డి, మా భూమి సంధ్య, వేముల పుష్ప, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నిర్వాహకురాలు పల్స నిర్మల, ప్రజాకళామండలి నుంచి రాజ నర్సింహ, జర్నలిస్టు నాయకులు ఎంవీ రమణ, స్నేహలత, వనజ, మలుపు బాల్రెడ్డి, గద్దర్ కొడుకు సూర్యం, వరవరరావు కూతుళ్లు అనల, సహజ, పవన, కటకం సతీశ్, సింగరేణి కార్మిక సంఖ్య నాయకుడు హుస్సేన్, తెలంగాణ యూత్ ఫెడరేషన్ నాయకుడు పనికెర మోహన్ రాజు, కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే, తెలంగాణ ఉద్యమకారులు సీఎల్ యాదగిరి, చెరుకు సుధాకర్, రెడ్ఫ్లాగ్ రాష్ట్ర కార్యదర్శి రాజేశ్ కన్నా నివాళులర్పించారు.
బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి,
పల్లాల నిలదీత..
రేణుక మృతదేహానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజారెడ్డి తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా రేణుక సోదరుడు జీవీకె ప్రసాద్ తన చెల్లిని పాలకవర్గాలు అన్యాయంగా పొట్టనబెట్టుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ప్రదర్శనలో కలిసివచ్చే క్రమంలో బూటకపు ఎన్కౌంటర్లు, అణిచివేత మీ పాలనలో అనుభవించామని, ప్రస్తుతం బీజేపీ సర్కారు చేపడుతున్న ‘ఆపరేషన్ కగార్’పై బీఆర్ఎస్ వైఖరి చెప్పాలని పలువురు నిలదీశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు గమనించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తాము వ్యతిరేకమని చెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు.
ఎరుపెక్కిన కడవెండి..
ప్రజాసంఘాలు, పార్టీ నేతల
ఘన నివాళి
కళాకారుల ఆటాపాటలతో
దద్దరిల్లిన వీధులు
నాలుగున్నర గంటలపాటు సాగిన అంతిమయాత్ర
ప్రజా ఉద్యమకారులపై రాజ్యహింస కొనసాగింపు..
దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో కొనసాగుతున్న ప్రజా ఉద్యమకారులపై కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రతిపక్షాలతో కలిసి రాజ్యహింస కొనసాగిస్తుందని పౌరహక్కుల సంఘం, ఎబీఎంసీ, విరసం రాష్ట్ర ప్రతినిధులు గడ్డం లక్ష్మణ్, పద్మకుమారీ, పాణి, మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య అన్నారు. రేణుక హత్యపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘ఆపరేషన్ కగార్’తో పాలకవర్గంచేపట్టే హంతక చర్యలను ప్రతిపక్షాలు నిలువరించే విషయం విస్మరిస్తే ప్రశ్నించే గొంతుకలు కనుమరుగువడమేగాక రాజ్యహింస హెచ్చుమీరుతుందని హెచ్చరించారు.

రేణుకకు అశ్రునయనాలతో వీడ్కోలు

రేణుకకు అశ్రునయనాలతో వీడ్కోలు