
వేరుశనగ క్వింటాల్ రూ.6,739
జడ్చర్ల/ నవాబుపేట: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం వేరుశనగ క్వింటాల్ గరిష్టంగా రూ.6,739, కనిష్టంగా రూ.4,891 ధరలు లభించాయి. అలాగే కందులు గరిష్టంగా రూ.6,895, కనిష్టంగా రూ.5,200, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,289, కనిష్టంగా రూ.1,951, జొన్నలు గరిష్టంగా రూ.4,201, కనిష్టంగా రూ.3,600, ఆముదాలు రూ.6,331, పెబ్బర్లు గరిష్టంగా రూ.5,301, కనిష్టంగా రూ.4,851, ధాన్యం హంస గరిష్టంగా రూ.2,151, కనిష్టంగా రూ.1,869, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,080, కనిష్టంగా రూ.2,041, రాగులు రూ.3,777, చింతగింజలు రూ.3,319 చొప్పున వచ్చాయి.
చింతపండు క్వింటాల్ రూ.12,308
నవాబుపేట మార్కెట్ యార్డుకు బుధవారం 82 క్వింటాళ్ల చింతపండు రాగా గరిష్టంగా రూ.12,308, కనిష్టంగా రూ.6,680 ధర పలికిందని మార్కెట్ కార్యదర్శి రమే్ష్ తెలిపారు. కాగా వేరుశనగ 220 క్వింటాళ్లు రాగా.. క్వింటాల్ సరాసరిగా రూ.6,265 పలికిందని వివరించారు.
వరకట్న వేధింపులపై
కేసు నమోదు
అచ్చంపేట రూరల్: అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త, అత్తామామలపై బుధవారం అచ్చంపేట పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్ఐ రమేష్ కథనం ప్రకారం.. అచ్చంపేటకు చెందిన ఈశ్వరమ్మకు మండలంలోని నడింపల్లికి చెందిన మల్లేష్తో వివాహమైంది. గత కొన్ని రోజులుగా అదనపు కట్నం తీసుకురావాలని ఈశ్వరమ్మను భర్తతోపాటు అత్త, మామ, మరిది వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ విషయమై బాధితురాలు బుధవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.