
పోటెత్తిన వినియోగదారులు
దేవరకద్ర: స్థానిక మార్కెట్కు బుధవారం వినియోగదారులు పోటెత్తారు. వివిధ గ్రామాల నుంచి వందలాది మంది వినియోగదారులు ఉల్లిని కొనడానికి పోటీ పడ్డారు. మార్కెట్లో ఎక్కడ నాణ్యంగా ఉన్న ఉల్లి కుప్ప కనిపిస్తే అక్కడ వినియోగదారులు గుమికూడి ఉల్లిని కొనుగోలు చేశారు. ఉగాది తరువాత దిగుబడిగా వచ్చే ఉల్లి నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉండడంతో చాలా మంది వినియోగదారులు ఉల్లిని కొనడానికి రావడంతో మార్కెట్ అంతా సందడిగా కనిపించింది. మార్కెట్కు దాదాపు ఆరు వేల బస్తాల ఉల్లి అమ్మకానికి వచ్చింది. మధ్యాహ్నం వరకు వచ్చిన ఉల్లిలో సగం కుప్పలకు కూడా వేలం జరగలేదు. దీంతో వ్యాపారులే వేలం వేయని మిగతా ఉల్లి కుప్పలకు నేరుగా ధరలు నిర్ణయించి కొనుగోలు చేశారు. కొందరు రైతులు వ్యాపారులను మధ్యవర్తులుగా చేసుకొని ఉల్లి బస్తాలు చేసి అమ్ముకున్నారు. ఇక వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు వేలం ద్వారా ఉల్లిని కొనుగోలు చేయగా చిరు వ్యాపారులు కూడా స్థానిక వ్యాపారుల నుంచి ఉల్లిని కొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్కెట్లో ఉల్లి వ్యాపారమే కొనసాగింది. ఒక పక్క వినియోగదారులు, మరో పక్క వ్యాపారులతో మార్కెట్ కళ కళలాడింది.
ఆర్ఎన్ఆర్ ధర రూ. 2139..
దేవరకద్ర మార్కెట్లో మధ్యాహ్నం జరిగిన ఈ టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర క్వింటాల్కు గరిష్టంగా రూ. 2139, కనిష్టంగా రూ.1869 గా ధరలు లభించాయి. హంస ధాన్యం ధర గరిష్టంగా రూ. 1809, కనిష్టంగా రూ. 1739 గా ధరలు నమోదు అయ్యావి. అముదాల ధర గరిష్టంగా రూ. 6011 గా ఒకే ధర లభించంది. కోయిల్సాగర్ ఆయకట్టు కింద యాసంగిలో వేసిన వరి పంటలు కోతకు రావడంతో రైతులు వరి ధాన్యం అమ్మకానికి తెస్తున్నారు. బుధవారం మార్కెట్కు దాదాపు మూడు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.
దేవరకద్ర మార్కెట్లో జోరుగా
ఉల్లి వ్యాపారం
దాదాపు ఆరు వేల బస్తాల అమ్మకం
నిలకడగా ఉల్లి ధరలు..
దేవరకద్ర మార్కెట్లో బుధవారం జరిగే వేలంలో ఉల్లి ధరలు నిలకడగానే ఉన్నాయి. రెండు వారాలుగా దిగి వచ్చిన ధరలే ఈ వారం వచ్చాయి. ఉదయం 10గంటలకే ఉల్లి వేలం ప్రారంభం కాగా క్వింటాల్ ఉల్లి గరిష్టంగా రూ.1800 వరకు పలికింది. కనిష్టంగా రూ.1200 వరకు ధర వచ్చింది. మార్కెట్ నిబంధనలు సడలించిన తరువాత ఉల్లి బస్తా 50 కేజీలుగా నిర్ణయించారు. బస్తా ధర గరిష్టంగా రూ.900 వరకు విక్రయించగా, కనిష్టంగా రూ.600 వరకు అమ్మకాలు సాగించారు. మధ్యస్త ధరలు పలికిన ఉల్లి బస్తా ధర రూ.700 నుంచి రూ.800 వరకు విక్రయించగా చిన్నసైజు ఉల్లి బస్తా ధర రూ. 500 వరకు పలికింది.