నిప్పంటుకుని జొన్న పంట దగ్ధం | - | Sakshi

నిప్పంటుకుని జొన్న పంట దగ్ధం

Apr 26 2025 12:07 AM | Updated on Apr 26 2025 12:07 AM

నిప్ప

నిప్పంటుకుని జొన్న పంట దగ్ధం

సారంగపూర్‌: మండలంలోని జామ్‌ గ్రామానికి చెందిన రైతు మర్రిపెద్ద భోజన్నకు చెందిన నూర్పిడికి సిద్ధంగా ఉన్న జొన్న పంటకు ప్రమాదవశాత్తు ని ప్పంటుకుని దగ్ధమైంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. భోజన్న ఎకరం జొన్న పంటను కో యించి పొలంలోనే ఆరబెట్టాడు. ఉదయం 11గంటలకు పొలం వద్దకు వెళ్లి ఎండ ఎక్కువ కావడంతో ఇంటికి వెళ్లాడు. సాయంత్రం మరోసారి పొలానికి వెళ్లి చూడగా అప్పటికే జొన్న పంటకు నిప్పంటుకుంది. గమనించి తోటిరైతుల సహాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశాడు. జిల్లాకేంద్రంలోని ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం అందించాడు. ఫైర్‌ ఇంజన్‌ ఆలస్యంగా చేరడంతో అప్పటికే ఎక రం జొన్న పంట అగ్నికి ఆహూతైంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లముందే కాలిపోగా భోజన్న బోరున విలపించాడు. సుమారు రూ.75 వేల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు.

ముధోల్‌ మండలం ఆష్టలో..

ముధోల్‌: మండలంలోని ఆష్ట గ్రామానికి చెందిన రైతు రవి లింగారెడ్డికి చెందిన నాలుగెకరాల మొక్కజొన్న పంట శుక్రవారం షార్ట్‌షర్క్యూట్‌తో పూర్తిగా దగ్ధమైంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. వారం క్రితం లింగారెడ్డి మొక్కజొన్నను కోసి చేనులోనే ఆరబెట్టాడు. తన పొలం మీదుగా విద్యుత్‌ లైన్‌ ఉండగా మధ్యాహ్నం ఈదురు గాలులు వీచాయి. తీగలు ఒకదానికొకటి రాసుకోగా నిప్పు రవ్వలు ఎగిసిపడి మొక్కజొన్న పంట మీద పడగా కాలిబూడిదైంది. ఈ ప్రమాదంలో నాలుగెకరాల పంట పూర్తిగా దగ్ధమైందని బాధితుడు తెలిపాడు. రెవెన్యూ అధికారులు నారాయణ్‌పటేల్‌, సరస్వతీ పరిశీలించారు. ఉన్నతాధికారులకు నివేదించి పరిహారం అందేలా చూస్తామని తెలిపారు.

నిప్పంటుకుని జొన్న పంట దగ్ధం1
1/1

నిప్పంటుకుని జొన్న పంట దగ్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement